breaking news
Automobile
-
కొత్త బీఎండబ్ల్యూ కారు లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియన్ మార్కెట్లో ఎక్స్3 30 xDrive ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. రూ. 74.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 & వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.BMW X3 30 xDrive M స్పోర్ట్ ప్రో కారు.. బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, ఆల్పైన్ వైట్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ & బ్లాక్ సఫైర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్తో లభిస్తుంది. ఇది 258 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్ ఇందులో ఉంటుంది.ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ముందు భాగంలో బ్లాక్ కిడ్నీ గ్రిల్, కార్నరింగ్ లైట్లు, షాడోలైన్ డిటెయిలింగ్తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్, రెడ్ కలర్ స్పోర్ట్స్ బ్రేక్స్ పొందుతుంది. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ షేప్ ఎల్ఈడీ ల్యాంప్లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & రూఫ్ స్పాయిలర్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్, 14.9-అంగుళాల కంట్రోల్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి కాకుండా.. పనోరమిక్ సన్రూఫ్, రియర్ సన్బ్లైండ్లు, హర్మాన్ కార్డాన్ ఆడియో & ట్రావెల్ & కంఫర్ట్ సిస్టమ్ ద్వారా సీమ్లెస్ కనెక్టివిటీ, ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. -
భారీగా పెరిగిన ఎగుమతులు.. జాబితాలో మారుతి టాప్!
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్పోర్ట్స్కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు.ఇప్పటివరకు ప్రధానంగా యూరప్లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు. -
పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!
టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీటాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్పోర్ట్స్ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. -
స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్! -
ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!
హోండా మోటార్సైకిల్ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్తో లభిస్తుంది.సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!
చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది. -
భారత్లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్!
జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్హెచ్ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్హెచ్ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్తో సహా వివరాలతో అప్లోడ్ చేయాలి.సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్కు రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.Report & Get Rewarded!To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026 -
మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్న్యూస్!
టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.ఇప్పటివరకు.. ఎక్స్ప్రెస్వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్ప్రెస్వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్! -
రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే..
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?ప్రస్తుతం రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.రాజ్పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి. -
మహీంద్రా ఈ–ఆటో ‘ఉడో’.. ధర ఎంతంటే..
మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తాజాగా ‘ఉడో’ పేరిట ఎలక్ట్రిక్ ఆటోను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దీని ఎక్స్షోరూం ధర రూ. 3,84,299 కాగా పరిమిత కాలం పాటు రూ. 3,58,999కి అందించనున్నట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. రిటైల్ విక్రయాలు ప్రారంభించామని, ఈ వారంలో డెలివరీలు మొదలవుతాయని చెప్పారు.తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ఉడో ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. రేంజి ఇస్తుందని, గరిష్టంగా గంటకు 55 కి.మీ. వేగం ఉంటుందని పేర్కొ న్నారు. 1.5 లక్షల కి.మీ. లేదా 6 ఏళ్ల వారంటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగానే విక్రయా లపై దృష్టి పెడుతున్నామని, అవకాశాలను బట్టి ఎగుమతి కూడా చేస్తామని మిశ్రా తెలిపారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
బీఎండబ్ల్యూ రీకాల్.. లక్షల కార్లపై ఎఫెక్ట్!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఎంజీ మెజెస్టర్ (MG Majestor) వచ్చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ ఎస్యూవీ.. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త మెజెస్టర్ కోసం ఎంజీ మోటార్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ.41 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2026 మే నెలలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏప్రిల్లో టెస్ట్ డ్రైవ్లు మొదలవుతాయి. కాగా కంపెనీ త్వరలోనే ఈ కారు ధరలను వెల్లడించనుంది.ఎంజీ మోటార్.. తన కొత్త మెజెస్టర్ ఎస్యూవీని మూడు వేరియంట్లలో లాంచ్ చేయనుంది. అవి ఎంట్రీ లెవల్ షార్ప్ 4x2, మిడ్ స్పెక్ సావీ 4x2 & టాప్ స్పెక్ సావీ 4x4. ఇవి 6 సీటర్, 7 సీటర్ రూపంలో మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంది. మెజెస్టర్ను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల రోడ్సైడ్ అసిస్ట్, 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.ఎంజీ మెజెస్టర్ కేవలం 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది 215 హార్స్ పవర్ & 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ రెగ్యులర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. పనితీరు దాదాపు గ్లోస్టర్ మాదిరిగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!మంచి డిజైన్ కలిగిన మెజెస్టర్.. ట్విన్ పేన్ పనోరమిక్ సన్రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 12 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ & 64 కలర్ యాంబియంట్ లైట్స్ వంటి వాటితో పాటు.. లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ కూడా పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ & హిల్-డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజ్లు, సరౌండ్ వ్యూ కెమెరాలు & ఆరు ఎయిర్బ్యాగ్లు కూడా ఉన్నాయి. -
రూ .10 లక్షలలోపు కార్లు.. మైలేజీలో తోపులు
కారు కొనడం చాలా మందికి ఒక పెద్ద నిర్ణయం. బడ్జెట్కు సరిపోవాలి.. మైలేజీ బాగుండాలి.. అలాగే నమ్మకమైన బ్రాండ్ కావాలి.. ఇవన్నీ కలిసొస్తేనే సరైన ఎంపిక అవుతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు ఇంధన వ్యయం తక్కువగా ఉండే కార్లకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల్లో కనిపించే మైలేజీ గణాంకాలు సాధారణంగా ARAI సర్టిఫైడ్ ఫిగర్స్ కాగా, వాస్తవ పరిస్థితుల్లో అవి కొంత తేడా ఉండవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షలలోపు అత్యుత్తమ మైలేజీ ఇచ్చే 10 కార్ల జాబితాను చూద్దాం.. -
దేశీ తయారీ మరింత పెరగాలి
దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ తదుపరి దశ వృద్ధి ప్రస్థానంలో ముందుకెళ్లాలంటే స్థానికంగా తయారీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ, అంతర్జాతీయ విస్తరణపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. ‘భారత్లో గెలవాలంటే, తప్పనిసరిగా భారత్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పుణె తయారీ ప్లాంటుకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థపై రూ. 4,500 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశామన్నారు.ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. కీలక లోహాలు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండబోదని గర్గ్ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, సెన్సార్లు మొదలైన వాటిని సమగ్రపర్చుకోకపోతే పెను సవాళ్లు తప్పవని, మనల్ని దాటి పరిశ్రమ ముందుకెళ్లిపోతుందని ఆయన హెచ్చరించారు. భారతీయ ఇంజినీర్లు, డిజైనర్ల పరిజ్ఞానం ప్రశంసనీయమన్నారు. అయితే, పరిజ్ఞానానికి, సంసిద్ధతకి మధ్య గణనీయంగా అంతరం ఉంటోందని, దీన్ని సత్వరం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గర్గ్ వివరించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ
న్యూఢిల్లీ: దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా స్థిరమైన విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ఆటో విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో తదుపరి తరం సరఫరా వ్యవస్థలో ఆటో విడిభాగాల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ‘‘ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, తేలిక రకం మెటీరియల్స్ అన్నవి అంతర్జాతీయ పోటీతత్వానికి కీలకం. స్థిరమైన విధానపర వాతావరణం ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. టెక్నాలజీ స్వీకరణను ప్రోత్సహించడం, ఎగుమతుల విస్తరణ, నాణ్యత పెంపు దిశగా పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని మంత్రి తెలిపారు. భారత ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ నుంచి కారిడార్ల ఏర్పాటు వరకు ప్రభుత్వం ఆటో పరిశ్రమకు ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
జోరుగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.‘‘ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్యూవీ/కాంపాక్ట్ ఎస్యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీ ఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్లుక్ రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.జీఎస్టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాల విభాగాల్లో డిమాండ్ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది. -
లీటర్ పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణం!
భారతీయులకు కారు లగ్జరీ కంటే కూడా అది ఇచ్చే మైలేజీనే ముఖ్యమని చెప్పడానికి ఓ ఆటోమొబైల్ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొత్త కారు కొనాలనుకునే వారు నేటికీ మైలేజీకే పెద్ద పీట వేస్తున్నారు. వివిధ కంపెనీలు అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజీనిచ్చే టాప్-5 కార్లు కింద చూద్దాం.టాప్ 5: మారుతీ సుజుకీ స్విఫ్ట్ (కొత్త మోడల్)కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ తన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని పెట్రోల్ మాన్యువల్ మోడల్ లీటర్కు 24.8 కి.మీ., ఆటో గేర్ వెర్షన్ 25.75 కి.మీ మైలేజీ అందిస్తుంది. పాత మోడల్తో పోలిస్తే ఇది 3 కిలోమీటర్ల మైలేజీని అదనంగా ఇస్తుంది. అయితే మైలేజీ కోసం ఇంజన్ పవర్లో స్వల్పంగా 8 బీహెచ్పీ శక్తిని తగ్గించడం గమనార్హం.టాప్ 4: మారుతీ సుజుకీ సెలెరియోఅధిక ఇంధన సామర్థ్యం కలిగిన నాన్-హైబ్రిడ్ పెట్రోల్ కారుగా సెలెరియో గుర్తింపు పొందింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం మాన్యువల్ వెర్షన్ 25.24 కి.మీ, ఆటో గేర్ వెర్షన్ ఏకంగా 26.68 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది.టాప్ 3: హోండా సిటీ (హైబ్రిడ్)సెడాన్ కార్ల విభాగంలో మైలేజీకి రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 100 బీహెచ్పీ శక్తిని, 131 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.టాప్ 2: టయోటా హైరైడర్ / మారుతి గ్రాండ్ విటారామిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఈ రెండు కార్లు మైలేజీ విషయంలో రాణిస్తున్నాయి. కంపెనీల లెక్కల ప్రకారం ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. వాస్తవానికి హైవేలపై అద్భుతమైన మైలేజీ ఇచ్చినప్పటికీ, సిటీ డ్రైవింగ్లో మాత్రం సుమారు 20 కి.మీ మైలేజీ వస్తోందని వినియోగదారులు చెబుతుంటారు.టాప్ 1: మారుతీ సుజుకీ విక్టోరిస్ (హైబ్రిడ్)అత్యధిక మైలేజీనిచ్చే ప్రీమియం ఎంపీవీ/ఎస్యూవీగా మారుతీ సుజుకీ విక్టోరిస్ నిలుస్తోంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది భారీ సైజు ఉన్నప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్కు మంచి డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఈవీ లవర్స్కి గుడ్న్యూస్.. వచ్చేస్తోంది విడా ఉబెక్స్!
హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్షిప్లు, విడా అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నారు. -
ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?
సూపర్ కార్లను లాంచ్ చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫెరారీ కంపెనీ.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు ఫెరారీ లూసే (Ferrari Luce) అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 9, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది.ఫెరారీ లూసే క్యాబిన్ డిజైన్ను మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ అభివృద్ధి చేశారు. దీంతో ఇది రెట్రో డిజైన్ పొందింది. ఈ కారులో టచ్స్క్రీన్లు మాత్రమే కాకుండా.. నాబ్లు & స్విచ్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని ఎప్పటిలాగే అందించడానికి ఇలా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. రేంజ్, టూర్ & పెర్ఫార్మెన్స్ వంటి డ్రైవింగ్ మోడ్ల కోసం రోటరీ స్విచ్లు ఉంటాయి. కుడి వైపున ఉన్న ఎరుపు మానెట్టినో డయల్ డ్రైవర్లు.. ఐస్, వెట్, డ్రై, స్పోర్ట్ & ఈఎస్సీ ఆఫ్ వంటి ఛాసిస్ సెట్టింగ్లను టోగుల్ చేయడానికి అనుమతిస్తుంది.12.5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. బ్యాటరీ స్థితి, పవర్ రీజెనరేషన్, టైర్ ప్రెజర్ & జీ ఫోర్స్ డేటాను ఇందులో చూడవచ్చు. ఫెరారీ లూస్ ప్రత్యేకమైన కంట్రోల్ సిస్టమ్ పొందనుంది. సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్లు, బూట్ & లాక్ ఫంక్షన్ల కోసం భౌతిక బటన్లు, నాలుగు విండోల కోసం స్విచ్లు ఉంటాయి. వెనుక ప్రయాణీకులు స్పీడ్, ల్యాప్ టైమ్స్ తెలుసుకోవడానికి టచ్స్క్రీన్ను పొందుతారు. -
సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ
ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ ‘పంచ్ ఈవీ’లో సరికొత్త 2026 ఎడిషన్ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్తో రూపొందిన ఈ మోడల్ ఈ నెల 20వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.కొత్తదనంతో..కొత్త పంచ్ ఈవీ ఔటర్ బాడీలో టాటా మోటార్స్ కీలక మార్పులు చేసింది. మునుపటి మోడల్లో హెడ్ ల్యాంప్లను కలుపుతూ ఉండే బ్లాక్ స్ట్రిప్ను ఈ కొత్త మోడల్లో తొలగించారు. ఇది కారుకు మరింత క్లీన్, ప్రీమియం లుక్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సన్ లిట్ యెల్లో షేడ్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి తోడు కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పింది.హైటెక్ ఫీచర్లుకారు లోపలి భాగంలో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.బ్యాటరీ రేంజ్ వివరాలుఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 25 కిలోవాట్హవర్ (స్టాండర్డ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 35 కిలోవాట్హవర్ (లాంగ్ రేంజ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది.ధర ఎంతంటే..ఈ సరికొత్త మోడల్ ధర మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్ను అనుసరించి సుమారుగా రూ.9,99,000 నుంచి రూ.14,44,000 వరకు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో ఇంకా విభిన్న కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోల్చుకొని, ఆటోమొబైల్ నిపుణుల సలహా తీసుకొని వాహనదారులు కార్ల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గమనించాలి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట!
భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం లగ్జరీ కార్ల ప్రియులకు తీపి కబురు అందించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు మాత్రం నిరాశే ఎదురైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ లగ్జరీ కార్లపై భారత్ దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించడం గమనార్హం. దీనివల్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు భారత మార్కెట్లో తక్కువ ధరకు కార్లను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది.ఒప్పందంలోని ముఖ్యాంశాలు3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న సాంప్రదాయ పెట్రోల్ కార్లపై సుంకాలు 10 ఏళ్ల కాలపరిమితిలో క్రమంగా 30 శాతానికి తగ్గుతాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రస్తావించిన హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్లపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగించనుంది. 800-1,600 సీసీ సామర్థ్యం గల బైక్లకు ఈ ప్రయోజనం కలుగుతుంది.భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. ప్రతిఫలంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.మార్చి 2026లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.భారత్లో టెస్లా పరిస్థితి ఏమిటి?భారతదేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఈవీలను ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెస్లా కోసం ప్రత్యేకంగా తక్కువ సుంకం మార్గాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం భారత్లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. జనవరి 15, 2026 నాటికి నెల మొదటి పదిహేను రోజుల్లో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ బీవైడీ 83 వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ 351 యూనిట్లు, బెంజ్ 70 యూనిట్లను విక్రయించాయి.ప్రభుత్వ పథకం..భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఎస్పీఎంఈపీసీఐ (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) అనే పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం కనీసం 500 మిలియన్ డాలర్లను స్థానికంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే దిగుమతి సుంకాల్లో రాయితీ లభిస్తుంది. అయితే, టెస్లా ఇప్పటివరకు ఈ పథకంలో చేరకపోవడం వల్ల ఆ కంపెనీకి దిగుమతి సుంకాల భారం తప్పడం లేదు. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు కట్టుబడితే తప్పా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్లో ఉంచకూడదు. -
మొన్న హ్యుందాయ్.. నేడు టాటా: పెరగనున్న కార్ల ధరలు
మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది. -
రూ.15 వేలకోట్ల పెట్టుబడి.. మహీంద్రా కీలక ప్రకటన
తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా.. మహీంద్రా & మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఆటోమొబైల్స్ & ట్రాక్టర్ల కోసం తన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని ప్రకటించింది. దీనిని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. విదర్భలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి అనుబంధంగా శంభాజీనగర్లో 150 ఎకరాల సప్లయర్ పార్క్ కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కర్మాగారం ఏడాదికి ఐదు లక్షల వాహనాలు & లక్ష ట్రాక్టర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాగ్పూర్లో జరిగిన అడ్వాంటేజ్ విదర్భ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం & మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. -
జీరో ట్యాక్స్.. భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైకుల ధరలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ డీల్లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్ల విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కస్టమ్స్ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్ డీల్ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 2500 సీసీ ఇంజిన్ కలిగిన డిజిల్ కార్లపై సుంకాలను భారత్ తగ్గించింది. -
50 లక్షల మంది.. రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.అగ్రస్థానంలో చండీగఢ్రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్వర్క్లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్సీఆర్లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్సీఆర్) & జిన్ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్ను ఉపయోగిస్తున్నాయి.1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ను అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! -
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో భారత్లో కొత్త స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు.ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్ట్ కింద శుక్రవారమిక్కడ ఆడి హైదరాబాద్ సెంట్రల్ షోరూమ్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్లో ఇది తమకు రెండో షోరూమ్ అని, జాతీయ సగటుకన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8–10% స్థాయిలో మార్కెట్ వాటా ఉంటోందని బల్బీర్ సింగ్ తెలిపారు.నగరంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సరీ్వసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు డీలర్ ప్రిన్సిపల్ వికాస్ చౌదరి, వీవీసీ గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్ర ప్రసాద్ చౌదరి తెలిపారు. -
లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్!
టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
నష్టాల రోడ్పై టాటా మోటార్స్ పీవీ
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 3,843 కోట్ల నికర నష్టం ప్రకటించింది.లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్పై సైబర్ దాడి ప్రధానంగా ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 5,485 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 94,472 కోట్ల నుంచి రూ. 70,108 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 89,698 కోట్ల నుంచి రూ. 74,880 కోట్లకు తగ్గాయి. జేఎల్ఆర్ ఎఫెక్ట్ జేఎల్ఆర్ సైబర్ దాడి కారణంగా రూ. 800 కోట్లతోపాటు.. కొత్త కార్మిక చట్టాల అమలుతో రూ. 400 కోట్లు, స్టాంప్ డ్యూటీకి రూ. 400 కోట్లు చొప్పున మొత్తం రూ. 1,600 కోట్లమేర అనుకోని నష్టాలు నమోదు చేసినట్లు టీఎంపీవీఎల్ వెల్లడించింది. ఈ కాలంలో జేఎల్ఆర్ 29.8 కోట్ల పౌండ్ల నష్టం ప్రకటించింది. ఆదాయం సైతం 39 శాతం బలహీనపడి 4.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది.సైబర్ దాడి, యూఎస్ టారిఫ్లతో హోల్సేల్ అమ్మకాలు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు ప్రణాళికలకు అనుగుణంగా జేఎల్ఆర్ ఉత్పత్తిని సైతం కొద్ది రోజులు నిలిపివేసినట్లు సీఈవో పీబీ బాలాజీ వెల్లడించారు. కాగా.. టాటా ప్యాసింజర్ వాహనాల ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 15,300 కోట్లను తాకింది. పీవీ, ఈవీల టోకు అమ్మకాల పరిమాణం 22 శాతం ఎగసి 1.71 లక్షల యూనిట్లకు చేరాయి.ఒక త్రైమాసికంలో ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. జీఎస్టీ రేట్ల తగ్గింపు, విభిన్న ప్రొడక్టుల విడుదల ఇందుకు సహకరించాయి. ఈ బాటలో తొలిసారి రిటైల్ అమ్మకాలు 2 లక్షల మార్క్ను దాటినట్లు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 374 వద్ద ముగిసింది. -
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్వ్యాగన్ టైరోన్: ఫోక్స్వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. -
వెనుకబడ్డ టెస్లా.. అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకబడింది. రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టెస్లా జనవరి 2026 నుంచి మోడల్ వై కార్లను కేవలం 62 మాత్రమే విక్రయించింది. ఇది మొత్తం కొత్త కార్ల అమ్మకాలలో 2.8 శాతం మాత్రమే.టెస్లా ఈ ఏడాది మొత్తం 83 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ. ఇప్పుడు అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్ అగ్రస్థానంలో ఉంది. టెస్లా కంటే ఐదు రేటు ఎక్కువ అమ్మకాలు సాధించింది.టెస్లా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. నార్వేలోని ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల టెస్లా అమ్మకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో నార్వేలో జరిగిన అన్ని కొత్త వాహనాల అమ్మకాలలో 94 శాతం ఈవీలు ఉన్నాయి. డీజిల్ కార్లు 98 కాగా, పెట్రోల్ కార్ల అమ్మకాలు కేవలం 7 మాత్రమే.మోడల్ ఎక్స్, ఎస్ నిలిపివేత!అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు. -
హోండా టూవీలర్ స్పెషల్ ఎడిషన్లు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా తన పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్ 125 లిమిటెడ్’, ‘డియో 125 ఎక్స్–ఎడిషన్’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్ బ్రాండ్ ‘షైన్’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. మారుతున్న ట్రెండ్స్ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా హోండా షైన్ ‘125 లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. మినిమలిస్ట్ థీమ్తో పెర్ల్ సైరెన్ బ్లూ కలరులో అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, పైరైట్ బ్రౌన్ ఆలాయ్ వీల్స్తో వస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్ ఎలాంటి మార్పులు చేయలేదు. ధర ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.86,211గా ఉంది. హోండా డియో 125 ఎక్స్–ఎడిషన్యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఆధునిక స్కూటర్. ప్యానెల్లపై ప్రత్యేక గ్రాఫిక్స్తో ఈ ఎడిషన్ సైబర్ డ్రిఫ్ట్ థీమ్ ప్రేరణతో తీర్చిదిద్దారు. నగర ప్రయాణాలకు సరైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్లో ‘ఇండ్లింగ్ స్టాప్ సిస్టమ్’ ఉండటం వల్ల ట్రాఫిక్లో నిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ధర విషయానికొస్తే..., ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.87,733గా ఉంది. ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్ బుకింగ్లు మొదలయ్యాయి. కస్టమర్లు ఈ మోడళ్లను కంపెనీ ఆన్లైన్లో కంపెనీ వెబ్సైట్ ద్వారా, ఆఫ్లైన్లో దగ్గర్లోని డీలర్షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.43 లక్షల బైక్ల ఎగుమతిభారత్లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.ఆకట్టుకుంటున్న మోడల్స్ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్ఫీల్డ్కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్ఫీల్డ్కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్ఫీల్డ్కు 152 డీలర్షిప్లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా?? -
బ్లేడ్ బ్యాటరీతో కొత్త బస్సులు
అధునాతన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్కి సర్టిఫికేషన్ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్ బాబు చెప్పారు.మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్ బాబు తెలిపారు.ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్ బుక్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
యమహా ఈసీ06
చెన్నై: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా మోటర్స్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవే శించింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ–06ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,67,600గా (ఢిల్లీ ఎక్స్షోరూం రేటు) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 169 కి.మీ. వరకు రేంజినిస్తుంది. ముందుగా ఎంపిక చేసిన నగరా ల్లో కంపెనీ కి చెందిన బ్లూ స్క్వేర్ షోరూంల ద్వారా ఈ స్కూటర్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణహితమైన అర్బన్ మొబిలిటీ దిశగా తమ సంస్థ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని యమహా మోటర్ ఇండియా గ్రూప్ చైర్మన్ హజిమె యోటా తెలిపారు. -
మారుతి కారు.. అమ్మకాలు జోరు!
మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి. -
త్వరలో కార్ల ధరల పెంపు..?
ఆటో మొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. వాహన ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత మార్కెట్లో నెలకొన్న బలమైన డిమాండ్, పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల దృష్ట్యా ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.‘కమోడిటీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల (ప్రెషస్ మెటల్స్) ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వాహనాల ధరల పెంపుపై సమీక్ష చేయనున్నాం’ అన్నారు. ధరల పెంపుపై తర్వలో నిర్ణయంమార్కెట్ లీడర్గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు కస్టమర్ల మీద భారం పడకుండా ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం’’అని బెనర్జీ అన్నారు. ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ‘‘ఫోర్ వీలర్ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారిని అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు’’ అని బెనర్జీ చెప్పుకొచ్చారు.పెండింగ్లో 1.75 లక్షల ఆర్డర్లుజనవరిలో 2.78 లక్షల బుకింగ్లు వచ్చాయి. అయితే పరిమితమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా కంపెనీకి ప్రస్తుతం 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోందన్నారు. గతేడాది జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఎంట్రీ లెవల్ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్ 2025లో ఎస్–ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో కే10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్ ఆర్ ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
టాప్గేర్లో ఆటో సేల్స్
జీఎస్టీ సంస్కరణలతో బలపడిన వృద్ధి ధోరణిని ఆసరాగా చేసుకొని ప్రముఖ ఆటో సంస్థలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, హ్యుందాయ్ మోటార్లు జనవరిలోనూ గణనీయమైన వాహన అమ్మకాలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ జనవరిలో 1,74,529 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే ఏడాది అమ్ముడైన 1,73,599 వాహనాలతో పోలిస్తే 0.50% అధికంగా ఉన్నాయి. విదేశాలకు చేసిన ఎగుమతులు(51,020), ఇతర సంస్థలకు అమ్మకాలు(7,643) కలిపి మొత్తం విక్రయాలు 2,36,963 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘మునుపెన్నడూ లేనంతంగా నెలవారీ ప్రాతిపదికన మొత్తం 2,36,963 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000 నుంచి 10,000 బుకింగ్స్ నమోదవుతూ.., మొత్తం 2.78 లక్షలకు మించి బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి వార్షిక ప్రతిపాదికన ఇవి 25% అధికం. కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఎస్యూవీ విక్టోరిస్ అయిదు నెలల్లో 50వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. ఉత్పత్తి కొరతపై స్పందిస్తూ..., కొత్త ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీకి కొరత కష్టాలు తప్పవన్నారు.టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ జనవరిలో మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 46% వృద్ధి నమోదైంది.మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే అక్టోబర్ అమ్మకాలు 50,659 యూనిట్లతో పోలిస్తే ఇవి 25% అధికంగా ఉన్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 59,107 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే జనవరిలో అమ్మిన 54,003 యూనిట్లతో పోలిస్తే ఇవి 9% అధికం.టయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాల వృద్ధి 17% పెరిగి 26,178 నుంచి 30,630 యూనిట్లకు చేరింది.రెనో ఇండియా డీలర్ల పంపిణీ 34% పెరిగి 3,715 యూనిట్లకు చేరింది. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 2,780 యూనిట్లుగా ఉన్నాయి.కియా ఇండియా వార్షిక అమ్మకాల వృద్ధి 10% పెరిగి 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘కొత్త ఏడాది (2026) ప్రోత్సాహకర ప్రారంభం కియా బ్రాండ్పై కస్టమర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. కొత్త తరం సెల్టోస్కు లభిస్తున్న సానుకూల స్పందన, సోనెట్కు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్, అలాగే కారెన్స్ క్లావిస్, క్లావిస్ ఈవీ మోడళ్లకు పెరుగుతున్న ఆదరణ పరిశీలిస్తే కియా ఉత్పత్తుల పోర్ట్ఫోలియో బలం, సమతుల్యతకు అద్దం పడుతుంది’’ అని కియా ఇండియా సీనియర్ వైస్–ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు.ఇదీ చదవండి: మార్కెట్లు జోరందుకుంటాయా? -
యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..
యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘ఈసీ-06’ (EC-06)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రారంభ దశలో యమహా డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ను బ్లూయిష్ వైట్ అనే సింగిల్ కలర్ ఆప్షన్లో అందిస్తున్నారు.డిజైన్యమహా EC-06 చూడటానికి రివర్ ఇండీ లాగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేకమైన డిజైన్ డీటైల్స్ ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ సెటప్, రేక్డ్, మస్కులర్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సైడ్ ప్రొఫైల్లో వంపులు తిరిగిన బాడీ ప్యానెల్స్తో ఆధునిక లుక్ను కలిగి ఉంది. రివర్ ఇండీతో పోలిస్తే, EC-06లో కాస్త తక్కువ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు.బ్యాటరీ, రేంజ్ఈ స్కూటర్లో 4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనికి 8.9 bhp పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. EC-06 గరిష్ట వేగం గంటకు 79 కి.మీ., ఒకసారి పూర్తి ఛార్జ్తో 169 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వారెంటీ ఇస్తోంది.ఛార్జింగ్ & రైడింగ్ మోడ్స్సాధారణ గృహ విద్యుత్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్ను ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఛార్జ్కు సుమారు 8 గంటలు పడుతుంది. EC-06లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.ఫీచర్లుఈ స్కూటర్లో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్లు, కనెక్టివిటీ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.సస్పెన్షన్ & బ్రేకులుసస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. ముందు, వెనుక 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీని ప్రత్యేకతగా కంపెనీ పేర్కొంది. -
NHAI కొత్త రూల్.. ఫాస్ట్ట్యాగ్ యూజర్లకు గుడ్న్యూస్!
ఫాస్ట్ట్యాగ్ విధానంలో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది.ఇంతకు ముందు.. వాహన యజమానులు అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్ట్యాగ్ పొందిన తరువాత కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. దీని వల్ల యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.కొత్త విధానంతో.. ఫాస్ట్ట్యాగ్ జారీ తరువాత ప్రత్యేకంగా కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులే మొదటిసారి వాహన పత్రాలను సరిగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షలాది మంది వాహన వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.కేవైసీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్ట్యాగ్లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసినవాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైసీ తప్పనిసరి కాదు. అయితే.. ఫాస్ట్ట్యాగ్ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైసీ చేసుకోవాల్సిన ఉంటుంది. -
మారిన బీఎండబ్ల్యూ లోగో
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్డేట్ చేసింది. ఈ కొత్త లుక్ను సెప్టెంబర్ 2025లో మొదట iX3లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కంపెనీ ఫిబ్రవరి నుంచి అన్ని ఇతర కార్లకు దీనిని ఉపయోగించనుంది.బీఎండబ్ల్యూ కొత్త లోగోలో చెప్పుకోదగ్గ అప్డేట్ కనిపించదు, కానీ సూక్ష్మమైన మార్పులు గమనించవచ్చు. ఇది వరకు ఉన్న బ్రాండ్ లోగోలో బ్లూ, వైట్ ప్రాంతాలను విభజించిన క్రోమ్ ఉండేది. కొత్త లోగోలో ఇది కనిపించదు. BMW అక్షరాలు కూడా స్లిమ్ చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ కూడా మ్యాట్ ఫినిషింగ్ పొందుతుంది.వారసత్వాన్ని నిలుపుకుంటూనే.. లోగోకు మరింత ఖచ్చితత్వాన్ని తీసుకురావాలనున్నామని, ఈ కారణంగా చిన్న చిన్న అప్డేట్స్ చేసినట్లు BMW బ్లాగ్స్ బ్రాండ్ డిజైన్ బాస్ ఆలివర్ హీల్మెర్ వెల్లడించారు. అప్డేట్ లోగోతో కూడిన వాహనాలు యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. -
ఉత్పత్తిలో కైలాక్ రికార్డ్: అమ్మకాల్లో..
స్కోడా ఇండియా డిసెంబర్ 2024లో కైలాక్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా తన 50,000వ కారును చకన్ ప్లాంట్లో విడుదల చేశారు. ఇది ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని సూచిస్తుంది.స్కోడా కంపెనీ అమ్మకాలు పెరగడానికి కైలాక్ దోహదపడింది. ఈ కారుకు డిమాండ్ పెరగడంతో కంపెనీ చకన్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచింది. దీనికి కేవలం ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాగా ఇది భారతదేశంలో 2025 డిసెంబర్ ప్రారంభం నుంచి 40వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.స్కోడా కైలాక్ ధర రూ. 7.89 లక్షలతో (ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.ఆరు ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు, హెడ్రెస్ట్లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది. -
టెస్లా కార్ల నిలిపివేత!.. మస్క్ కీలక ప్రకటన
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు.టెస్లా కంపెనీ మోడల్ ఎస్, ఎక్స్ కార్లను నిలిపివేయడానికి ప్రధాన కారణం.. అమ్మకాలు బాగా తగ్గడమే. ఈ సమయంలో బీవైడీ వంటి కంపెనీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం చివరి మూడు నెలలకు టెస్లా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసినప్పుడు కూడా కంపెనీ లాభాలు తగ్గినట్లు స్పష్టంగా వెల్లడయ్యాయి. ఈ ఏడాది కూడా లాభాలు కనిపించలేదు. 2024 ఆదాయంతో పోలిస్తే 3% తగ్గినట్లు సంస్థ నివేదికలు చెబుతున్నాయి. -
కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు!
సాధారణంగా వాహనదారులు టైర్లలో గాలి ఉందా? త్రెడ్ (గ్రిప్) కనిపిస్తోందా? అని మాత్రమే చూస్తుంటారు. కానీ, టైరు బయటకు కొత్తగా కనిపిస్తున్నా, దాని లోపల రబ్బరు నాణ్యత కోల్పోయి, పేలవంగా ఉండవచ్చని మీకు తెలుసా? వాహన భద్రతలో టైర్ తయారీ తేదీ (Manufacturing Date) అత్యంత కీలకమైన అంశమని అంతర్జాతీయ రవాణా భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.ఎప్పుడు తయారైందో తెలుసుకోవడం ముఖ్యమా?టైర్లు కేవలం రబ్బరుతో తయారు చేసిన వస్తువులు మాత్రమే కాదు; అవి రసాయనాలు, ఆయిల్స్, కొన్ని రకాల పాలిమర్ల మిశ్రమం. కాలక్రమేణా టైరు వాడినా వాడకపోయినా గాలిలోని ఆక్సిజన్, వేడి కారణంగా ఆ రబ్బరు గట్టిపడి ‘ఆక్సిడైజేషన్’ ప్రక్రియకు లోనవుతుంది. దీనివల్ల టైరు తన పట్టును (Grip) కోల్పోవడమే కాకుండా ప్రయాణంలో ఒక్కసారిగా పేలిపోయే (Blowout) ప్రమాదం ఉంది.నిపుణుల హెచ్చరికటైర్ త్రెడ్ బాగున్నా సరే తయారీ తేదీ నుంచి 6 ఏళ్లు దాటితే ఆ టైరును మార్చడం సురక్షితం. ఒకవేళ టైరును అసలు వాడకుండా స్పేర్ వీల్గా ఉంచితే 10 ఏళ్ల తర్వాత దాన్ని కచ్చితంగా తొలగించాలి.ఎప్పుడు తయారైందో ఎలా తెలుసుకోవాలి?ప్రతి టైరు సైడ్వాల్పై DOT (Department of Transportation) కోడ్ ఉంటుంది. ఇది టైరు తయారీ అంశాలను తెలియజేస్తుంది. ఈ కోడ్ చివర ఉండే నాలుగు అంకెలు అత్యంత ముఖ్యం. అందులో మొదటి రెండు అంకెలు తయారీ వారం (01 నుంచి 52 వరకు)ను తెలియజేస్తాయి. చివరి రెండు అంకెలు తయారీ సంవత్సరం తెలుపుతాయి.ఉదాహరణకు:మీ టైరుపై డాట్ కోడ్లో చివరి అంకెలు ‘2419’ అని ఉంటే, అది 2019వ సంవత్సరం 24వ వారంలో తయారైందని అర్థం. ప్రస్తుతం 2026 నడుస్తోంది కాబట్టి, ఈ టైరుకు ఇప్పటికే 6 ఏళ్లు దాటిపోయాయి. దీన్ని వాడటం రిస్క్తో కూడుకుంది.పాత టైర్లలో సహజంగా కనిపించేవి..సైడ్వాల్పై చిన్న పగుళ్లు రావడం.నల్లగా ఉండాల్సిన టైరు బూడిద రంగులోకి మారడం.టైరు అక్కడక్కడ ఉబ్బినట్లు కనిపించడం.రబ్బరు పీచులుగా ఊడిపోవడం.టైర్ లైఫ్టైమ్ పెరగాలంటే..కనీసం నెలకోసారి తయారీదారు సూచించిన పీఎస్ఐ (Pounds per Square Inch) ప్రకారం గాలిని తనిఖీ చేయండి.ప్రతి 5,000 - 8,000 కి.మీలకు ఒకసారి టైర్ల స్థానాలను మార్చండి (Rotation).వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే టైర్లు ఒకవైపు మాత్రమే అరిగిపోయి త్వరగా పాడవుతాయి.ఎండలో ఎక్కువసేపు వాహనాన్ని ఉంచడం వల్ల రబ్బరు త్వరగా దెబ్బతింటుంది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు -
కేంద్ర బడ్జెట్పై ఈవీ తయారీదారుల ఆశలు
దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్ (ప్రధాని ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్ఇండియా ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.పరిశ్రమ డిమాండ్లు ఇవే..అహ్మదాబాద్కు చెందిన ‘మ్యాటర్’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్సైకిల్ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్లను భారత్లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
రెనో డస్టర్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగంలోని ఎస్యూవీ విభాగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘రెనో డస్టర్’ మళ్లీ గ్రాండ్గా రీఎంట్రీ ఇచి్చంది. వేగంగా విస్తరిస్తున్న మిడ్–సైజ్ ఎస్యూవీ విభాగం దేశీయ కస్టమర్ల ఆసక్తిని తెలియజేస్తోంది. అలాంటి అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి డస్టర్తో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా రెనో తన పోటీ సంస్థలకు గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. పెట్రోల్ ఇంజిన్తో వచి్చన 2026 డస్టర్ ఎస్యూవీ మోడల్, ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కస్టమర్లు రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఏడేళ్ల లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టాస్ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. లాంచింగ్ సందర్భంగా రెనో గ్రూప్ సీఈవో ఫాబ్రిస్ కాంబోలివ్ మాట్లాడుతూ ... ‘‘2022లో ఉత్పత్తి నిలిపివేసిన డస్టర్ను తిరిగి భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. తద్వారా వృద్ధిపరంగా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నాము. యూరప్ వెలుపల రెనోకు భారత్ కీలక మార్కెట్. చెన్నై తయారీ ప్లాంట్ను పూర్తిగా సొంతం చేసుకోవడం రెనోకు వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది’’ అన్నారు. -
ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు.. స్పందించిన NHAI
ఇటీవల సోషల్ మీడియాలో 2026 జనవరి 1 నుంచి 3 రో కార్లు (6 లేదా 7 సీట్లున్న కార్లు) కోసం ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు చేశారని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో చాలామంది వాహనదారుల్లో ఒకింత అయోమయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా స్పందించింది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా తప్పుడు సమాచారం అని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. యాక్టివ్ ఫాస్ట్ట్యాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర కార్లు / జీపులు / వ్యాన్లు యాన్యువల్ పాస్కు అర్హత కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.#FactCheck: NHAI would like to clarify that all non-commercial Car/Jeep/Van with active FASTag, are eligible for the Annual Pass. Kindly refrain from spreading fake news. @MORTHIndia @PIBMoRTH @PIBFactCheck #NHAI #FASTagAnnualPass pic.twitter.com/KmTbuXLH0n— NHAI (@NHAI_Official) January 25, 2026ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్భారతదేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ట్యాగ్ విధానం తీసుకొచ్చింది. దీనిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ను పరిచయం చేసింది. ఈ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా వాహనదారుడు గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్స్ చేయవచ్చు. ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న NHAI టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ తేదీ నుంచి ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుతుంది. -
కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!
భారతదేశంలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటమే. అయితే ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదరబోయే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ప్రీమియం కార్లు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరటను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే.. దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం యూరప్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే కార్లపై సుమారు 110 శాతం వరకు దిగుమతి సుంకం ఉంది. దీనివల్ల అక్కడ తక్కువ ధరకు లభించే కార్లు కూడా భారత్లో చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని నేరుగా 40 శాతానికి తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే.. ప్రీమియం కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువ గల అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ తక్కువ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.దిగుమతి సుంకాలను తగ్గిస్తే.. ఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది. -
మహీంద్రా ‘రిపబ్లిక్ డే’ ట్రాక్టర్లు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ సంస్థ తమ యువో టెక్ప్లస్ 585 డీఐ 4డబ్ల్యూడీ శ్రేణి ట్రాక్టర్లలో లిమిటెడ్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. త్రివర్ణ పతాక స్ఫూర్తితో మూడు రంగుల్లో (మెటాలిక్ ఆరెంజ్, ఎవరెస్ట్ వైట్, మెటాలిక్ గ్రీన్), పరిమిత సంఖ్యలో ఈ ట్రాక్రట్లు లభిస్తాయని సంస్థ తెలిపింది.జెరీక్యాన్, మహీంద్రా ఫ్లాగ్లాంటి యాక్సెసరీలు వీటిలో ఉంటాయని వివరించింది. జనవరి 26 నుంచి ఇవి తమ డీలర్షిప్లలో లభిస్తాయని పేర్కొంది. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్తగా తీర్చిదిద్దిన బొలెరో క్యాంపర్, బొలెరో పికప్ శ్రేణిని కూడా ఆవిష్కరించింది.క్యాంపర్లో ఐమ్యాక్స్ టెలీమ్యాటిక్స్ సొల్యూషన్, పికప్లో ఎయిర్ కండీషనింగ్, హీటింగ్ ఫీచర్లు ఉంటాయని వివరించింది. క్యాంపర్ ధర రూ. 9.85 లక్షల నుంచి, పికప్ ధర రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
టాప్-5 బెస్ట్ బైకులు: ధర రూ. లక్ష కంటే తక్కువే!
బైక్ కొనుగోలుదారుల్లో చాలామంది మైలేజ్ ఎక్కువ ఇచ్చేవాటినే సెలక్ట్ చేసుకుంటారు. అందులోనూ కొంత తక్కువ ధరలో లభిస్తే.. అంతకంటే సంతోషం ఉంటుందా?, కాబట్టి ఈ కథనంలో మన దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే 5 బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.హీరో HF డీలక్స్హీరో HF డీలక్స్ ప్రారంభ ధర రూ. 56,742 (ఎక్స్-షోరూమ్). ఇది దాదాపు 70 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 97.2 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 7.91 hp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లైట్ క్లచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.హీరో స్ప్లెండర్ ప్లస్హీరో స్ప్లెండర్ ప్లస్ను రూ. 74,152 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. హీరో మోటోకార్ప్ ఈ కమ్యూటర్ బైక్ లీటరుకు దాదాపు 80 కి.మీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. ఇది 7.91 హెచ్పి పవర్ అందించే.. 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.హోండా షైన్హోండా షైన్ 100 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్లలో ఒకటి. ఇది 98.98cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 7.28 hp పవర్, 8.05 Nm టార్క్ అందిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 71,959. ఇది డ్యూయెల్ టోన్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇది 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ స్పోర్ట్ దాని విభాగంలో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో ఒకటిగా ఉంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 55,500 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్ ఇండికేటర్, 5 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్, లాంగ్ సీట్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్లు పొందుతుంది.బజాజ్ ప్లాటినాబజాజ్ ప్లాటినా 100 అధిక మైలేజ్ అందించే కమ్యూటర్ బైకులలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 59,049 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 99.59 సీసీ ఇంజిన్ 8.08 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది లీటరుకు 72 కిమీ మైలేజ్ అందిస్తుంది. ప్లాటినాలో పొడవైన సీటు, సరైన రియర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ & కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటివి ఉన్నాయి.గమనిక: పైన చెప్పుకున్న బైక్స్ ధరలు కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. మీరు ఎంచుకునే మోడల్ లేదా వేరియంట్, కలర్ ఆప్షన్స్ మొదలైనవి ధరల మీద ప్రభావం చూపుతాయి. అంటే ధరలు మారే అవకాశం ఉందన్నమాట. మైలేజ్ విషయంలో కూడా తప్పకుండా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. -
రూ.3.17 లక్షల కవాసకి కొత్త బైక్
కవాసకి కంపెనీ 2026 నింజా 300 లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్ మెకానికల్స్ కలిగి ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ కలర్ (లైమ్ గ్రీన్ & క్యాండీ లైమ్ గ్రీన్/ఎబోనీ) ఆప్షన్స్ పొందుతుంది.కొత్త కవాసకి నింజా 300 కూడా 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి.. అదే 296 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్తో కొనసాగుతుంది. ఈ మోటార్ 11,000 rpm వద్ద 39 hp శక్తిని & 10,000 rpm వద్ద 26.1 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొంత వరకు గ్రాఫిక్ డిజైన్ పొందుతుంది.2026 మోడల్ అయినప్పటికీ.. కవాసకి నింజా 300 బైక్లో పెద్దగా మార్పులు లేవు. ప్రొజెక్టర్లతో కూడిన సవరించిన హెడ్ల్యాంప్ సెటప్, పెద్ద విండ్షీల్డ్తో సహా కొన్ని చిన్న అప్డేట్లు కనిపిస్తాయి. ఫీచర్ల విషయానికొస్తే, నింజా 300 చాలా సరళమైన మోటార్సైకిల్.. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. -
మొన్న బజాజ్.. ఇప్పుడు హీరో మోటోకార్ప్
భారతదేశంలోని అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్ సైకిల్ ధరలు పెంచింది. వేరియంట్ను బట్టి ధరలు రూ. 250 నుంచి రూ. 750 వరకు పెరిగాయి. ఇందులో హీరో HF 100 , హీరో HF డీలక్స్ & హీరో ప్యాషన్ ప్లస్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో కూడా తన బైక్ ధరలను పెంచింది.ముడి సరుకుల ధరలు, ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల బైక్ ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత హీరో HF100 రేటు రూ. 58,739 నుంచి 59,489 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరింది. హీరో HF డీలక్స్ ధరలు 56,742 రూపాయల నుంచి రూ. 69,235 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్.. భారతదేశంలో హీరో HF 100, హీరో HF డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ మొదలైన మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిస్తో ఉండటంతో పాటు.. మంచి మైలేజ్ కూడా అందిస్తున్నాయి. ఈ కారణంగానే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి.. -
3 లక్షల యమహా స్కూటర్లు రీకాల్..
యమహా మోటార్ ఇండియా కంపెనీ 3 లక్షలకు పైగా స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోడళ్లకు చెందిన స్కూటర్లు ఉన్నాయి.2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య తయారైన 125 సీసీ స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారాన్ని కంపెనీ ప్రారంభించింది.కొన్ని ప్రత్యేక ఆపరేటింగ్ పరిస్థితుల్లో, ఎంపిక చేసిన యూనిట్లలో ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ పనితీరు పరిమితంగా ఉండే అవకాశం ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ చేపట్టినట్లు యమహా వెల్లడించింది. ఈ రీకాల్ పూర్తిగా స్వచ్ఛందంగా చేపట్టినదని యమహా స్పష్టం చేసింది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ రీకాల్ పరిధిలోకి వచ్చే అన్ని వాహనాలకు సంబంధిత భాగాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా మార్చి ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రీకాల్ పరిధిలోకి వచ్చే స్కూటర్ల యజమానులను యమహా డీలర్లు నేరుగా సంప్రదిస్తారు. అలాగే వాహన యజమానులు తమ సమీపంలోని అధికారిక యమహా సర్వీస్ సెంటర్ను సంప్రదించి, తమ వాహనం రీకాల్కు అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చు. -
విన్ఫాస్ట్: మొన్న కార్లు.. ఇప్పుడు స్కూటర్
వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇప్పటికే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.విన్ఫాస్ట్ 2026 ద్వితీయార్థంలో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వీటిని కూడా కంపెనీ తమిళనాడులోని ప్లాంట్ నుంచి మార్కెట్కు సరఫరా చేయనుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ అంచెలంచెలుగా విస్తరిస్తున్న తరుణంలో.. ఆ విభాగంలో సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సంస్థ సంకల్పించింది.విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లువిన్ఫాస్ట్ VF6: విన్ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది స్ప్లిట్ హెడ్లైట్, టెయిల్లైట్ సెటప్లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.విన్ఫాస్ట్ VF7: టేపింగ్ రూఫ్లైన్, యాంగ్యులర్ రియర్ విండ్షీల్డ్తో స్ట్రీమ్లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది. -
పెరిగిన థార్ ధరలు.. ఒకేసారి రూ. 20వేలు!
మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో తన థార్ ధరలను సవరించింది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను రూ. 20వేలు పెంచింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి.మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అయిన AX 2WD ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద అలాగే కొనసాగుతుంది. 2WD & 4WD కాన్ఫిగరేషన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్లతో లభించే.. LX ట్రిమ్లతో సహా అన్ని ఇతర వెర్షన్లు ఇప్పుడు రూ. 20,000 పెరిగాయి.ధరల పెరుగుదల తరువాత.. మహీంద్రా థార్ టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 17.19 లక్షలకు చేరింది. ఈ ఆఫ్ రోడర్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో.. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్లలో ఒకటిగా నిలిచింది.ఇదీ చదవండి: మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా? -
మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?
కియా ఇండియా.. తన సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ 'సోనెట్'ను లాంచ్ చేసినప్పటినుంచి 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 35 శాతం. మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ.. వరుసగా రెండో సంవత్సరం లక్ష యూనిట్ల వార్షిక సేల్స్ సాధించింది.ప్రీమియం ఫీచర్లు & కనెక్టెడ్ మొబిలిటీ ఎంపికల కారణంగా ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగిందని కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.కియా సోనెట్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో మధ్యప్రాచ్యం & ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా - పసిఫిక్ ప్రాంతాలు ఉన్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష కంటే యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మల్టిపుల్ పవర్ట్రెయిన్ & ట్రాన్స్మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. -
అర్బన్ క్రూజర్ ఎబెల్లా
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటర్స్ భారత్లో తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడల్ (బీఈవీ) అర్బన్ క్రూజర్ ఎబెల్లాను ఆవిష్కరించింది. దీనికి బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ డిఫ్యూటీ ఎండీ తడాషీ అసజుమా తెలిపా రు. సుజుకీ, టయోటాకి అంతర్జాతీయంగా భాగస్వామ్య ఒప్పందం ఉన్నందున సుజుకీ మోటర్ గుజరాత్ ఈ వాహనాన్ని సరఫరా చేస్తుందని చెప్పారు.ది 49 కిలోవాట్హవర్, 61 కిలోవాట్హవర్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. ఒక్కసారి చార్జి చేస్తే 543 కి.మీ. వరకు రేంజి ఉంటుంది. ఎబెల్లాను యూరప్కి కూడా ఎగు మతి చేయనున్నట్లు తడాషీ వివరించారు. చార్జింగ్ నెట్వర్క్ను విస్తరించేందుకు జియో–బీపీలతో చేతులు కలిపినట్లు, క్రమంగా ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. టయోటా ప్రస్తుతం భారత్లో హైబ్రిడ్, డీజిల్, పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది. -
టయోటా తొలి ఎలక్ట్రిక్ కారు.. 543 కిమీ రేంజ్!
టయోటా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను అధికారికంగా ఆవిష్కరించింది. దీనిని ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఈవిటారా ఆధారంగా రూపొందించారు. కాబట్టి డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటివన్నీ కూడా.. దాదాపు విటారాలో ఉన్నట్లుగానే ఉన్నాయి.టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా బాడీ షెల్ ఈవిటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో సొగసైన హెడ్ల్యాంప్లు, విభిన్నమైన ఫ్రంట్ బంపర్ను కలిగి ఉంది. ఇది ఈవిటారా లాగా లైట్ బార్ ద్వారా కనెక్టెడ్ ఎల్ షేప్ టెయిల్లైట్లను పొందుతుంది.లోపల భాగంలో అర్బన్ క్రూయిజర్ ఈవీ.. ఈవిటారాలో మాదిరిగానే అదే డాష్బోర్డ్ను పొందుతుంది. ఇది డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్ను కలిగి ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్రూఫ్, జేబీఎల్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.భారతదేశంలో, అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఎంపికలతో (49 kWh & 61 kWh) లభిస్తుంది. 49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 142 bhp & 189 Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారును.. 61 కిలోవాట్ బ్యాటరీ 172 bhp & 189 Nm టార్క్ అందించే మరింత శక్తివంతమైన మోటారుతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 5 మోనోటోన్ (కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్) కలర్స్, 4 డ్యూయల్-టోన్ కలర్ (కేఫ్ వైట్/బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్/బ్లాక్ రూఫ్, స్పోర్టిన్ రెడ్/బ్లాక్ రూఫ్ & ఎంటైసింగ్ సిల్వర్/బ్లాక్ రూఫ్) ఎంపికలలో లభిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. -
హీరో స్ప్లెండర్ కొత్త ధరలు
మూడు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ఇతర కంపెనీల బాటలోనే హీరోమోటోకార్ప్ అడుగులు వేస్తూ.. ధరలను కేవలం రూ. 250 మాత్రమే పెంచింది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇతరత్రా కారణాల వల్ల ధరను పెంచడం జరిగిందని సంస్థ పేర్కొంది.హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కమ్యూటర్ మోటార్సైకిల్గా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులోని 100 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.09 bhp & 8.05 Nm టార్క్ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్బాక్స్తో లభిస్తుంది.కంపెనీ ఈ బైక్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ముందు భాగంలో అదే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా సియెర్రా కారు కొన్న మంత్రిధరల పెరుగుదల తరువాత హీరో స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 73,902 నుంచి రూ. 74,152 వద్దకు చేరింది. ఐ3ఎస్ వేరియంట్ రూ. 75,055 నుంచి రూ. 75,305 వద్దకు, ఎక్స్టెక్ ధర రూ. 77,428 నుంచి రూ. 77,678 వద్దకు, ఎక్స్టెక్ 2.0 (డ్రమ్) వేరియంట్ ధర రూ. 79,964 నుంచి రూ. 80,214 వద్దకు, ఎక్స్టెక్ 2.0 (డిస్క్) వేరియంట్ ధర రూ. 80,471 నుంచి రూ. 80,721 వద్దకు చేరింది. -
టాటా సియెర్రా కారు కొన్న మంత్రి
టాటా సియెర్రా ఎస్యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్షిప్లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 158 బీహెచ్పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్బాక్సతో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ 105 బీహెచ్పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్ 116 బీహెచ్పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది. View this post on Instagram A post shared by Sree Gokulam Motors & Services (@gokulammotors) -
బెంజ్ సెలబ్రేషన్ ఎడిషన్: ధర ఎంతంటే?
మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో EQS SUV సెలబ్రేషన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV 450, 580 అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ.1.34 కోట్లు & రూ.1.48 కోట్లు (ఎక్స్-షోరూమ్).మెర్సిడెస్ బెంజ్ EQS సెలబ్రేషన్ ఎడిషన్ AMG లైన్ ట్రిమ్ ఆధారంగా తయారైంది. ఇందులో గ్లాస్ బ్లాక్ రంగులో కనిపించే బ్లాంకెడ్ ఆఫ్ ఫ్రంట్ ఫాసియా, మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు & 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్లో EQS మూడు స్క్రీన్లు, వెంటిలేషన్తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, MBUX టాబ్లెట్ను కలిగి ఉన్న రియర్ సీటు పొందుతుంది. క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!EQS సెలబ్రేషన్ ఎడిషన్ 122 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది, ఇది ఒక జత ఎలక్ట్రిక్ మోటార్లకు శక్తినిస్తుంది. 450 వేరియంట్ 355 bhp మరియు 800 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6.2 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇది ఒక ఛార్జితో 775 కిమీ పరిధిని అందిస్తుందని సంస్థ వెల్లడించింది. 580 వేరియంట్ 536 bhp మరియు 858 Nm టార్క్ అందిస్తూ.. 809 కిమీ ప్రయాణించగలదు. -
రూ. 35వేల కోట్ల పెట్టుబడి: 10 లక్షల వెహికల్స్!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్లోని ఖోరాజ్లో కొత్త ప్లాంట్ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.Glad to witness the Investment Letter Handover by Maruti Suzuki India Limited to the Government of Gujarat for setting up a mega car manufacturing facility at Khoraj, with an investment of ₹35,000 crore.Guided by the visionary leadership of Hon’ble Prime Minister Shri… pic.twitter.com/Kso6hLmDUL— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2026 -
అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!
చాలారోజుల నిరీక్షణ తరువాత.. అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లా భారతదేశంలో 'మోడల్ వై' లాంచ్ చేసింది. అయితే ప్రారంభం నుంచి దీని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో కార్లన్నీ.. షోరూంలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ.. వీటి అమ్మకాలను మెరుగుపరచడానికి భారీ ఆఫర్ ప్రకటించింది.టెస్లా ఇండియా.. ప్రస్తుతం ఉన్న స్టాక్ అమ్ముకోవడానికి మోడల్ Y కొనుగోలుపైై రూ. 2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ స్టీల్త్ గ్రేలో పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్తో కూడిన స్టాండర్డ్ రేంజ్ వేరియంట్కు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కంపెనీ 300 మోడల్ వైలను దిగుమతి చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా 100 యూనిట్లను కూడా అమ్మలేకపోయింది.టెస్లా అమ్మకాలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో తగ్గుముఖం పట్టాయి. 2025లో కూడా వరుసగా రెండవ సంవత్సరం సేల్స్ తగ్గినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో చైనా బ్రాండ్ బీవైడీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న పోటీ & కొన్ని కార్ మార్కెట్లలో సబ్సిడీలు తగ్గడం వల్ల అమెరికా, యూరప్, చైనా అంతటా టెస్లా వాటా తగ్గిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా.. -
పెరిగిన బజాజ్ పల్సర్ ధరలు: కొత్త రేట్లు ఇలా..
బజాజ్ ఆటో.. ఎంపిక చేసిన పల్సర్ మోడళ్ల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. పెరిగిన ధరల కారణంగా.. చాలా బైకుల రేట్లు మారిపోయాయి. ఎంట్రీ లెవల్ పల్సర్ 125 సిరీస్లో, నియాన్ సింగిల్ సీట్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.79,048 నుంచి రూ.79,939కి పెరిగింది. కార్బన్ ఫైబర్ సింగిల్ సీట్ ధర రూ.85,633 నుంచి రూ.86,411కి పెరిగింది, కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ ధర రూ.87,527 నుంచి రూ.88,547కి పెరిగింది.పల్సర్ N125 బైక్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే NS125 బేస్ వేరియంట్ ధర రూ. 91,182 నుంచి రూ. 92,642కు చేరింది. LED BT రూ. 93,792 నుంచి రూ. 94,253లకు, LED BT ABS రూ. 98,400 నుంచి రూ. 98,955లకు చేరింది. పల్సర్ 150 సింగిల్-డిస్క్ & ట్విన్-డిస్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.1,11,669 & రూ.1,15,481 వద్ద (వీటి ధరల్లో ఎటువంటి మార్పు లేదు) అలాగే ఉన్నాయి.పల్సర్ NS160, NS200, RS200 ధరలు రూ.702 చొప్పున పెరిగి, ఇప్పుడు రూ.1,20,873, రూ.1,32,726 & రూ.1,71,873 వద్ద ఉన్నాయి. డిసెంబర్ 2025లో 2026 అప్డేట్ తర్వాత పల్సర్ 220F రూ.1,28,490 నుంచి రూ.1,29,186లకు చేరింది. 250cc విభాగంలో, పల్సర్ N250 ధర రూ.1,34,166 కాగా, టాప్-ఎండ్ పల్సర్ NS400Z ధర రూ.1,93,830 వద్ద ఉంది. -
భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?
మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.విక్టోరిస్ కారు గురించిమారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!మైల్డ్-హైబ్రిడ్ టెక్తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి. -
సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!
భారతదేశంలో టోల్ విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి 2014లో ఫాస్ట్ట్యాగ్ విధానం అమలులోకి వచ్చింది. ఇప్పుడు రద్దీని తగ్గించడానికి.. ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ తీసుకురావడానికి సిద్ధమైంది.కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేదించనుంది. ప్రయాణికులు టోల్లు చెల్లించడానికి ఫాస్ట్ట్యాగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. త్వరలోనే ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం.గడువు సమీపిస్తున్నందున, ప్రయాణికులు డిజిటల్ మార్పుకు సిద్ధం కావాలని మరియు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇది అమలులోకి వచ్చిన తరువాత వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపులు అన్ని లావాదేవీల పారదర్శకంగా ఉంటాయి.ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి -
నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 2026 జనవరి 14న.. నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని కార్ల తయారీదారు తెలిపారు.కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్లు లాంచ్కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ ధృవీకరించింది.ఇక మహీంద్రా XEV 9S విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఇది 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుంది.ఇదీ చదవండి: నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు కూడా మంచి బుకింగ్స్ పొందింది. మొదటి రోజే ఏకంగా 70000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును మహీంద్రా కార్లు అధిగమించాయి. బుకింగ్లలో ఎప్పటికప్పుడు మహీంద్రా కంపెనీ కొత్త మార్క్ చేరుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి కార్లు కూడా గతంలో గొప్ప అమ్మకాలను సొంతం చేసుకున్నాయి. -
కియా కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్
కియా కారెన్స్ క్లావిస్ లైనప్నకు కొత్త వేరియంట్ను జోడించింది. సరికొత్త కొత్త హెచ్టీఈ HTE (EX) వేరియంట్ను విడుదల చేసింది. వీటిలో G1.5 పెట్రోల్ వేరియంట్ ధర రూ.12,54,900 (ఎక్స్-షోరూమ్), G1.5 టర్బో-పెట్రోల్ వేరియంట్ ధర రూ. 13,41,900, D1.5 డీజిల్ వేరియంట్ ధర రూ.14,52,900గా కంపెనీ నిర్ణయించింది.హెచ్టీఈ (ఈఎక్స్) వేరియంట్ మూడు ఐసీఈ పవర్ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అలాగే ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లో మాత్రమే వస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న హెచ్టీఈ (O) వేరియంట్ కంటే కాస్త అడ్వాన్స్డ్గా ఉంటుంది. మరిన్ని మెరుగైన ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం దీన్ని తీసుకొచ్చారు.తొలిసారి సన్రూఫ్హెచ్టీఈ (ఈఎక్స్) వేరియంట్లో కీలక అప్డేట్ కారెన్స్ క్లావిస్ G1.5 పెట్రోల్ వెర్షన్లో స్కై లైట్ ఎలక్ట్రిక్ సన్రూఫ్. ఈ పవర్ట్రెయిన్తో సన్రూఫ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.మెరుగైన ఫీచర్లు, మరింత సౌకర్యంహెచ్టీఈ (ఈఎక్స్) వేరియంట్లో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ను జోడించడం ద్వారా క్యాబిన్ సౌకర్యాన్ని మరింత పెంచారు. వెలుపల భాగంలో ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), ఎల్ఈడీ పొజిషన్ లైట్లు ఇచ్చారు.అంతర్గతంగా, మెరుగైన వెలుతురు కోసం ఎల్ఈడీ క్యాబిన్ లైట్లు, అలాగే డ్రైవర్ వైపు పవర్ విండోకు ఆటో అప్ / డౌన్ ఫంక్షన్ అందించడం ద్వారా సౌకర్యంతో పాటు భద్రతను కూడా మెరుగుపరిచారు. -
హై స్పీడ్లో కార్ల మార్కెట్
వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్యూవీ) సరఫరాలు గతేడాది(2025)లో 5% పెరిగి 44,89,717కు చేరాయని ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్ మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ సంస్కరణల వల్ల ధరలు తగ్గడంతో, పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగా జరిగాయి. తద్వారా వాహన సరఫరాలు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. అంతకు ముందు 2024లో ఈ సరఫరా 42,74,793 యూనిట్లుగా ఉన్నాయి.విభాగాల వారీగా ఇలా...యుటిలిటీ వాహనాలు డిస్పాచ్లు 27,49,932 నుంచి 7% వృద్ధి చెంది 29,54,279కు చేరాయి.ప్రయాణికుల టోకు విక్రయాలు స్వల్పంగా 1% పెరిగి 13,79,884 యూనిట్లకు చేరాయి.త్రీ వీలర్స్ డిస్పాచ్లు 8% ఎగసి 7,28,670 నుంచి 7,88,429 యూనిట్లకు చేరాయివాణిజ్య వాహన విక్రయాలు 8% వృద్ధి సాధించి 10,27,877 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, 2024లో విక్రయాలు 1,95,43,093గా ఉన్నాయి.ద్వి చక్రవాహన అమ్మకాలు 5% వృద్ధితో 2,05,00,639 యూనిట్లకు చేరాయి.‘‘భారత ఆటోమొబైల్ పరిశ్రమకు 2025 ఏడాది కీలక మైలురాయిగా నిలిచింది. ప్రథమార్ధమంతా సప్లై, మందగమనం సవాళ్లు ఎదుర్కొంది. తదుపరి ఆదాయపు పన్ను రాయితీ, ఆర్బీఐ వరుస రెపో రేట్ల కోత, జీఎస్టీ 2.0 అమలు సెంటిమెంట్ మెరుగుపడింది’’ సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వాహన ధరలు మరింత చౌకగా మారి, పరిశ్రమను పరుగులు పెట్టించాయి. ప్యాసింజర్, కమర్షియల్, సీవీ, త్రీ వీలర్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి విక్రయాలు 2025లో జరిగాయన్నారు. 2024తో 2025లో ఎగుమతులు సైతం రెండంకెల వృద్ధి సాధించాయన్నారు. ఈ ఏడాది(2026) అవుట్లుక్పై శైలేష్ చంద్ర వివరణ ఇస్తూ .., స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, అందుబాటు ధరల్లో వాహన లభ్యత, ప్రభుత్వ విధానాల కొనసాగింపు అంశాలతో ఈ ఏడాదిలో డిమాండ్ తగ్గట్లు సరఫరా ఉండొచ్చని అంచనా వేశారు. సప్లై చైన్ స్థిరత్వం, ఎగుమతుల వ్యాల్యూమ్స్(పరిమాణం) ప్రభావితంకాకుండా భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. డిసెంబర్లో వాహన టోకు విక్రయాలు: గతేడాది డిసెంబర్ వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు 26,33,506 యూనిట్ల ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్యూవీ) సరఫరా అయ్యాయి.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే.. -
నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!
భారతదేశంలో టయోటా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. దీంతో.. అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద SUVలలో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్ రేటు గరిష్టంగా రూ. 74వేలు వరకు పెరిగింది.ధరల పెరుగుదల.. వేరియంట్లను బట్టి రూ. 51వేలు నుంచి రూ. 74వేలు మధ్య ఉంది. కాగా కంపెనీ లిమిటెడ్-రన్, డీలర్-లెవల్ లీడర్ వేరియంట్లను నిలిపివేసింది. ఫార్చ్యూనర్ & లెజెండర్ వరుసగా ₹ 74,000 మరియు ₹ 71,000 వరకు ధర పెరిగాయి. ఎంట్రీ-లెవల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 51వేలు పెరిగింది. దీంతో ఈ SUV ధర ఇప్పుడు రూ. 33.65 లక్షల నుంచి రూ. 34.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.ఇన్నోవా క్రిస్టా ధరలుభారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి. -
కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. లేటెస్ట్ లాంచింగ్లు
నూతన సంవత్సరంలో పలు కొత్త కార్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ) విభాగపు కార్ల హడావిడి అధికంగా ఉండనుంది. ఇప్పటికే కొన్ని కార్లను ప్రవేశపెట్టగా మరికొన్నింటిపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా, రెనో, నిస్సాన్ మొదలైనవి తమ ఎస్యూవీ మోడళ్లకు అప్డేటెడ్, ఫేస్లిఫ్ట్ వెర్షన్లతో పాటు గతంలో ప్రజాదరణ పొందిన కార్లను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎకానమీ నుంచి లగ్జరీ సెగ్మెంట్ వరకూ అన్ని ధరల రేంజ్లో లభించనున్నాయి. మొత్తంగా ఈ ఏడాది భారతీయ ఎస్యూవీ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఎస్యూవీల దూకుడుఎస్యూవీ కార్లకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు, మల్టీ–పర్పస్ వెహికల్స్ (ఎమ్పీవీలు)ను అధిగమించి ఆటో మార్కెట్పై ఎస్యూవీ విభాగం ఆధిపత్యం చూపుతోంది. విస్తృతమైన ఇంటీరియర్స్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, రోజువారీ వినియోగానికి పనికివచ్చే సౌకర్యాల కారణంగా ‘ఎస్యూవీ’లు కస్టమర్లకు తొలి ఎంపికగా మారుతోంది. ఆటో కంపెనీలు ఈ డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం ధరల శ్రేణిలో కొత్త మోడళ్లు, ప్రధాన ఫేస్లిఫ్ట్లను అందుబాటులోకి తెస్తున్నాయి.మారుతీ సుజుకి ఈ–విటారామారుతీ సుజుకి ఈ–విటారా కూడా జనవరిలోనే లాంచ్ అవుతోంది. మారుతీ ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ కారుగా రానుంది. 49కేడబ్ల్యూహెచ్, 61కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి. 543 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. డ్యూయల్ స్క్రీన్ సెటప్, 360–డిగ్రీ కెమెరా లెవల్ 2 ఏడీఎస్ వంటి ఫీచర్లు ఈ–విటారాను మరింత మోడ్రన్ ఈవీగా ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.టాటా సఫారీ, హ్యారియర్టాటా మోటార్స్ ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ తన ప్రసిద్ధ సఫారీ, హారియర్ ఎస్యూవీలకు పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లను పరిచయం చేసింది. 1.5 లీటర్ సామర్థ్యంతో కొత్త టర్బో–పెట్రోల్ ఇంజిన్ను టాటా మోటార్స్ ఈ రెండు ఎస్యూవీలకు అందిస్తోంది. కొత్త టర్బో–పెట్రోల్ ఇంజిన్ స్మార్ట్ ట్రిమ్ నుంచి ప్రారంభమై సఫారీ, హారియర్లలో వరుసగా అకంప్లి‹Ù్డ అల్ట్రా, ఫియర్లెస్ అల్ట్రా వేరియంట్ల వరకు అందుబాటులో ఉంది. హ్యారియర్ పెట్రోల్ ధర రూ. 12.80 లక్షల నుంచి సఫారీ రేటు రూ. 13.29 లక్షల నుంచి (ఢిల్లీ ఎక్స్షోరూం) ప్రారంభమవుతుంది.న్యూ–జెన్ సెల్టోస్కియా ఇండియా సెల్టోస్ కొత్త వెర్షన్గా ‘న్యూ–జెన్ సెల్టోస్’ పేరుతో అధికారంగా లాంచ్ అయ్యింది. హెచ్టీఈ నుంచి జీఎస్ఎక్స్(ఏ), ఎక్స్–లైన్ వరకు వివిధ వేరియంట్లలో ఇది లభిస్తుంది. అప్గ్రేడ్ చేసిన ఫీచర్లతో, పూర్తిగా రీడిజైన్ చేసిన ఇంటీరియర్స్ ఇందులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ జనవరి మధ్యలో లాంచ్ కానుంది. ఈ అప్డేట్లో ఫ్రంట్ గ్రిల్, బంపర్లు ఎల్ఈడీ టెయిల్లైట్లను మరింత షార్ప్గా చేస్తున్నారు. పనోరమిక్ సన్రూఫ్, 360–డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్లు క్యాబిన్ని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓమహీంద్రా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ‘ఎక్స్యూవీ700’ని పూర్తిగా రీబ్రాండ్ చేసి ఫేస్లిఫ్ట్ వెర్షన్ ‘ఎక్స్యూవీ 7ఎక్స్ఓ’గా లాంచ్ చేసింది. డ్యాష్బోర్డ్పై మూడు స్క్రీన్లు, టూ–స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పానోరమిక్ సన్రూఫ్, అంబియంట్ లైటింగ్, బాస్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.రెనో డస్టర్సబ్–కాంపాక్ట్ ఎస్యూవీ అయిన రెనో డస్టర్, భారత మార్కెట్లోకి రీ–ఎంట్రీ ఇస్తోంది. ఇది ఈ నెలలో (జనవరి) కొత్త మోడల్తో లాంచ్ అవుతోంది. కొత్త జనరేషన్ డస్టర్ సీఎంఎఫ్–బీ ప్లాట్ఫామ్పై తయారయ్యే డస్టర్ .. లుక్ మరింత ప్రొఫెషనల్గా ఉంటుంది. లోపలి భాగంలో 10.1–అంగుళాల టచ్్రస్కీన్, ప్రీమియం ఇంటీరియర్ ఫుల్ అడాస్ ప్యాకేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. -
అందరికీ ఇష్టమైన కారు.. అమాంతం పెరిగిన ధరలు
జనవరి ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగానే.. టయోటా కంపెనీ తన ఇన్నోవా క్రిస్టా ధరలను సవరించింది. ధరల పెరుగుదల రూ.21,000 నుంచి రూ.33,000 మధ్య ఉంది.భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.ధరల పెరుగుదల తరువాత.. టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్లైన GX సెవెన్ & ఎనిమిది సీటర్ వేరియంట్ల ధర ఇప్పుడు రూ. 18.66 లక్షల నుంచి రూ. 18.99 లక్షలకు(ఎక్స్-షోరూమ్) చేరింది. GX+ సెవెన్ & ఎనిమిది సీటర్ మోడళ్ల ధర వరుసగా రూ. 20.47 లక్షలు & రూ. 20.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా వస్తుంది.ఏడు, ఎనిమిది సీట్ల VX మోడళ్ల ధరలు వరుసగా రూ. 23.95 లక్షలు & రూ. 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-ఎండ్ ZX ఏడు సీట్ల మోడల్ ధర ఇప్పుడు రూ. 25.27 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 25.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!
కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది. -
సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?
సుజుకి మోటార్సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేయనుంది.బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. -
బీఎండబ్ల్యూ కార్లు.. రికార్డు స్థాయిలో విక్రయాలు
జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ, మనదేశంలో గతేడాది రికార్డు స్థాయిలో కార్లు విక్రయించినట్లు తెలిపింది. 2025లో మొత్తం 18,001 కార్లను విక్రయించామని, ఇందులో 730 యూనిట్లు మినీ బ్రాండ్కు చెందినవని ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది(2024)15,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 14% అధికం.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, సులభతర ఫైనాన్సింగ్ అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. దేశీయ లగ్జరీ ఎలక్ట్రిక్ విభాగంలో అత్యధిక వాటా కలిగిన ఈ సంస్థ గతేడాదిలో 3,573 ఈవీ కార్లను విక్రయించింది. గ్రూప్ మొత్తంగా 2025లో 23,842 వాహనాలను విక్రయించామని.. ఇందులో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్లు 18,001 ఉండగా, బీఎండబ్ల్యూ మోటరాడ్ బైక్లు 5,841 ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్, బీఎండబ్ల్యూ మోటరాడ్ మూడు బ్రాండ్లలో కలిపి మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ‘‘మునుపెన్నడూ లేనంతగా 2025లో 18,001 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాము. వార్షిక ప్రాతిదికన అమ్మకాలు 14% వృద్ధి నమోదు కావడం లగ్జరీ కార్లపై కస్టమర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్మదీప్ సింగ్ బర్ తెలిపారు. -
ఇది కదా రికార్డ్ అంటే!.. ఏకంగా కోటి..
సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. తన గురుగ్రామ్ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల (కోటి) ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసి.. ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ దేశంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయాన్ని వెల్లడించింది.కంపెనీ మొదటి 5 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడానికి.. 14 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఆరేళ్లలో మరో 5 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే.. క్రమంగా కంపెనీ వాహనాలను డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీ తన ఉత్పత్తిని కూడా పెంచాల్సి వచ్చింది.సుజుకి మోటార్సైకిల్ ఇండియా అమ్మకాలు పెరగడానికి యాక్సెస్ 125 వెన్నెముకగా నిలిచింది. ఆ తరువాత జాబితాలో బర్గ్మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి ఇతర స్కూటర్లు, అలాగే జిక్సర్ 150/250 సిరీస్, అడ్వెంచర్ ఓరియెంటెడ్ V-స్ట్రోమ్ SX కూడా సంస్థ పురోగతికి చాలా ఉపయోగపడ్డాయి.సుజుకి మోటార్సైకిల్ ప్రస్తుతం 1,200 కంటే ఎక్కువ అమ్మకాలు & సేవా టచ్పాయింట్లను కలిగి ఉన్నారు. అంతే కాకుండా 60 కంటే ఎక్కువ దేశాలకు.. భారతదేశంలో నిర్మించిన మోడళ్లను ఎగుమతి చేస్తోంది. భవిష్యత్ డిమాండ్కు సిద్ధం కావడానికి, కంపెనీ హర్యానాలోని ఖార్ఖోడాలో రెండవ ప్లాంట్ను అభివృద్ధి చేస్తోంది. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని సమాచారం. -
బీఎండబ్ల్యూ ఇల్లు.. బెంజ్ విల్లా
ఇప్పటివరకూ భారత్లో విలాసవంత కార్ల విక్రయాలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన గ్లోబల్ ఆటో దిగ్గజాలు తాజాగా దేశీ రియల్టీ రంగంపై కన్నేశాయి. ప్రధాన ప్రాంతాలలో రియల్టీ ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దేశీయంగా సరికొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయనున్నాయి. ఇందుకు 2026 కేలండర్ ఏడాదిలో తెరతీయనున్నాయి. ముంబై, చెన్నై సహా ప్రధాన నగరాలు, గుర్గావ్, హైదరాబాద్ తదితర అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు వివిధ రియల్టీ డెవలపర్స్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లగ్జరీ కార్ల దిగ్గజం లాంబోర్గిని ప్రమోటర్ కుటుంబం దేశీ రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుర్గావ్లో విలాసవంత బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మెర్సిడిస్ బెంజ్ రియల్టీ డెవలపర్స్తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఎండబ్ల్యూ సైతం దేశీ రియల్టీ గ్రూప్లతో చర్చలు నిర్వహిస్తోంది. అయితే బ్రాండెడ్ ప్రాజెక్ట్ చేపడుతుందా లేక .. రియల్టీలో కార్యకలాపాలు కలిగిన క్రియేటివ్ డిజైన్ కన్సల్టెన్సీ అనుబంధ సంస్థ డిజైన్వర్క్స్పై ముందుకెళుతుందా అనే విషయంపై సందిగ్ధత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ముంబై, చెన్నైలలో హైపెర్ఫార్మెన్స్ కార్లు, ఎస్యూవీలు రూపొందించే లాంబోర్గిని ప్రమోటర్ టోనినో ఇప్పటికే ముంబై, చెన్నైలలో ప్రాజెక్టులపై కసరత్తు చేస్తున్నారు. ఇందుకు లాంబోర్గిని టోనినో ఎస్పీఏ ద్వారా చర్చలకు తెరతీశారు. కార్ల దిగ్గజం లాంబోర్గినీ వ్యవస్థాపకుడు ఫెరూసియో లాంబోర్గిని కుమారుడితడు. కాగా.. ఇప్పటికే దుబాయ్, మియామీ(ఫ్లోరిడా)లలో ప్రాజెక్టులు చేపట్టిన గ్లోబల్ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ దేశీ ప్రణాళికలు వెల్లడికావలసి ఉంది. ఈ బాటలో ఆటోమొబైల్ దిగ్గజాలేకాకుండా దేశీయంగా రియల్టీ రంగ కార్యకలాపాలపట్ల ప్రీమియం వెల్నెస్ బ్రాండ్లు, ఫ్యాషనబుల్ క్లాతింగ్ సంస్థలు, యూరోపియన్ డిజైన్ స్టూడియోలు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన నగరాలలో బ్రాండెడ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు పలు రంగాల గ్లోబల్ దిగ్గజాలు ఇప్పటికే డెవలపర్స్తో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. సరికొత్త బ్రాండ్లతో సరికొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంతోపాటు.. నాణ్యతా ప్రమాణాలకు హామీనిచ్చేందుకు వీలుండటంతో దేశీయంగా రియల్టీ డెవలపర్లు సైతం గ్లోబల్ దిగ్గజాలవైపు చూస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో సంప్రదాయ బ్రాండెడ్ రెసిడెన్షియల్ మార్కెట్లయిన యూఎస్, యూఏఈ, థాయ్లాండ్, వియత్నాం తదితరాల జాబితాలో భారత్ సైతం చేరనున్నట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బ్రాండెడ్ రెసిడెన్స్ సరఫరాలు 55 శాతం జంప్చేసినట్లు శావిల్స్ బ్రాండెడ్ రెసిడెన్స్ 2025–26 నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధానంగా వియత్నాం, థాయ్లాండ్తోపాటు.. భారత్లో వృద్ధి సహకరించినట్లు తెలియజేసింది. ఈ ప్రభావంతో టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(తాజ్ హోటళ్లు) సైతం చెన్నైలో బ్రాండెడ్ రెసిడెన్సీవైపు దృష్టి పెట్టడం గమనార్హం! కారణాలున్నాయ్.. ప్రస్తుతం లైవ్ బ్రాండెడ్ రెసిడెన్స్ ప్రాజెక్టుల విషయంలో భారత్ ప్రపంచంలో ఆరో ర్యాంకును ఆక్రమిస్తోంది. గ్లోబల్ సరఫరాల్లో నాలుగో స్థానంలో నిలుస్తోంది. చేపట్టనున్న ప్రపంచ ప్రాజెక్టులలో పదో ర్యాంకును అందుకుంది. దేశీ రియల్టీ రంగంలో ఇప్పటికే కార్యకలాపాలు విస్తరించిన గ్లోబల్ బ్రాండ్లలో ఫోర్ సీజన్స్, రిట్జ్ కార్ల్టన్, మారియట్, అర్మాణీ కాసా, వెర్సేస్ హోమ్, ట్రంప్ ఫ్యామిలీ, హయత్, పుల్మ్యాన్, ఐటీసీ, హిల్టన్ తదితరాలున్నాయి. ఈ బాటలో తాజాగా లగ్జరీ బ్రాండ్ల ఆటో దిగ్గజాలు క్యూ కట్టడం గమనించదగ్గ అంశం!ఆకర్షణీయ మార్కెట్గా ఒకప్పుడు దిగ్గజాల లక్ష్యంగా నిలిచిన దుబాయ్, మియామీ, లండన్ బాటలో ఇప్పుడు భారత్ భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్రాండెడ్ రెసిడెన్స్లకు దేశీయంగా అత్యంత సంపన్నవర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. నోయిసిస్ క్యాపిటల్ అడ్వయిజర్స్ విశ్లేషణ ప్రకారం టైర్–1 మార్కెట్లు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల బాటలో టైర్–2 పట్టణాలు సైతం దిగ్గజాలను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో భువనేశ్వర్, చండీగఢ్, అహ్మదాబాద్, గోవా, సూరత్ తదితరాలున్నాయి. గత మూడేళ్లుగా లగ్జరీ ప్రాజెక్టులు జోరందుకోవడం ఇందుకు తోడ్పాటునిస్తోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఏథర్ లేటెస్ట్ అప్డేట్.. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్
ఏథర్ ఎనర్జీ తన కొత్త ఇన్ఫినిట్ క్రూయిజ్ సిస్టమ్ను 450X ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ మొదట 2025 ఆగస్టులో ఏథర్ 450 అపెక్స్లో మొదలైంది. ఇప్పుడు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్ల ద్వారా 450X మోడళ్లకు అమలు చేశారు.ఇన్ఫినిట్ క్రూయిజ్ను క్రూయిజ్ కంట్రోల్ అప్డేటెడ్ వెర్షన్గా అందించనున్నారు. కంపెనీ చెబుతోంది. ఇది హైవే వినియోగం కంటే పట్టణ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది భారతీయ నగర వాతావరణాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇండియాలో స్కూటర్లు.. నగరాల్లో 30 కిమీ కంటే తక్కువ వేగంతో వెళ్తాయి. ఇలాంటి వాటికి ఈ లేటెస్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది.రైడర్ బ్రేక్ లేదా యాక్సలరేషన్ వాడినా.. ఈ ఫీచర్ కారణంగా జారి రానట్లుగా పనిచేస్తుంది. అంటే ఈ ఫీచర్ వేగానికి ఆటోమేటిగ్గా బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ట్రాఫిక్లో వేగం మారినప్పుడల్లా స్కూటర్ వేగాన్ని సరిపోయేలా ఆపి/పొడిగిస్తుంది. కొండపై లేదా దారి పైకి/కిందికి వెళ్లేటప్పుడు వేగాన్ని స్థిరంగా ఉంచుతుంది. చాలా నెమ్మదిగా, అసమానమైన రోడ్లపై కూడా స్మూత్గా ముందుకు వెళ్తుంది. మొత్తం మీద ఇది ఇండియన్ రోడ్లకు అనుకూలంగా ఉంటుంది.2025 జనవరి 1 తర్వాత స్కూటర్లను కొనుగోలు చేసిన దాదాపు 44,000 మంది ఏథర్ 450X యజమానులకు ఇన్ఫినిట్ క్రూయిజ్ అప్డేట్ అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇది అన్ని స్కూటర్లలో అందుబాటులో ఉంటుంది. -
కార్లు, బైక్లు.. బాగానే కొన్నారు..
దేశీయంగా ఆటో మొబైల్ రిటైల్ అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. అంతకుముందు ఏడాది(2024)తో పోలిస్తే 2025లో 8 శాతం మేర విక్రయాలు పెరిగాయి. ప్రథమార్ధమంతా మందగమనాన్ని ఎదుర్కొన్నప్పటికీ..., జీఎస్టీ 2.0 అమలు తర్వాత వాహన విక్రయాలు పరుగులు పెట్టాయని ఆటో మొబైల్ సమాఖ్య(ఫాడా) పేర్కొంది. ఇందుకు సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్లో 2,61,45,445 యూనిట్లు అమ్ముడవ్వగా.., 2025లో 2,81,61,228 యూనిట్లు మేర అమ్ముడయ్యాయని ఫాడా తెలిపింది.2025లో విక్రయాలు ఇలా...,∙2024లో 40,79,532 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవగా.., 2025లో 10% వృద్ధితో 44,75,309 యూనిట్లు అమ్ముడయ్యాయి.∙టూవీలర్ అమ్మకాల్లో 7.24 శాతం వృద్ధి నమోదైంది. 2024లో 1,89,24,815 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025లో 2,02,95,650 యూనిట్లు విక్రయమయ్యాయి.∙త్రిచక్ర వాహన అమ్మకాలు 2024లో 12,21,886 యూనిట్లు కాగా.. 2025లో 7.21 శాతం వృద్ధితో 13,09,953 యూనిట్లు అమ్ముడయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు 6.71% పెరిగి 10,09,654 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024లో ఇవి 9,46,190 యూనిట్లుగా ఉన్నాయి.‘‘2025 ఏడాది దేశీయ ఆటో పరిశ్రమ ప్రయాణాన్ని రెండు దశలుగా అభివర్ణించవచ్చు. జనవరి నుంచి ఆగస్టు వరకు.... కేంద్ర బడ్జెట్లో ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు వంటి సానుకూలతలున్నప్పట్టకీ.., అమ్మకాలు స్తబ్దుగా సాగాయి. ఈ దశలో కస్టమర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తత వహించారు. అయితే సెప్టెంబర్ నుంచి పరిస్థితి మారింది. జీఎస్టీ 2.0 సవరణలో భాగంగా 350 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైకులు, స్కూటర్లపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. అలాగే పెట్రోల్ కార్లలో 1200 సీసీ కన్నా, డీజిల్ కార్లలో 1500 సీసీ కన్నా తక్కువ వాటిపై జీఎస్టీని 28% నుంచి 18 శాతానికి తగ్గించారు. ప్రభావంతో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో వాహన విక్రయాలు గణనీయంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.వాహన పరిశ్రమ విద్యుదీకరణ(ఎలక్ట్రిఫికేషన్)వైపు అడుగులను 2025 ఏడాది స్వాగతించిందన్నారు. టూ వీలర్స్, పీవీ, సీవీ, త్రీ వీలర్స్ ఇలా అన్ని విభాగాల్లో ఈవీ వాటా గణనీయంగా పెరిగిందన్నారు. మొత్తంగా.. 2025 క్యాలెండర్ సంవత్సరం ఉత్సాహభరితంగా ముగిసిందన్నారు. ఈ ఏడాది(2026) అవుట్లుపై ఫాడా వివరణ ఇస్తూ .., ‘‘తొలి మూడు నెలల్లో రిటైల్ విక్రయాలకు ఢోకా లేదు. తాము నిర్వహించిన సర్వే ప్రకారం, 74.91% డీలర్లు వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నారు. జీఎస్టీ 2.0తో కొనుగోళ్ల సామర్థ్యం పెరగడం, పండుగలు, వివాహాల సీజన్, ఆర్థిక సంవత్సరం ముగింపులో కనిపించే కొనుగోళ్ల ప్రభావం డిమాండ్కు మద్దతునిస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ(ఐఎండీ) ముందస్తు అంచనాల ప్రకారం ఏడాది వర్షపాతం తగిన మోతాదులో ఉండొచ్చు. కావున గ్రామీణ ప్రాంతాల డిమాండ్ ఎలాగూ ఉంటుంది. స్థూల ఆర్థిక గణాంకాల దృష్ట్యా పరిశీలిస్తే... ఆర్బీఐ రెపో రేటు 5.25% వద్ద ఉండటం రుణ వ్యయాల విషయంలో అదనపు ఊరట లభిస్తోంది. అలాగే, వినియోగానికి పెద్దపీట వేసే విధంగా పన్ను రాయితీలకు ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్ రావొచ్చంటూ చర్చలు జరుగుతున్నాయి. అలాంటి బడ్జెట్ అమలులోకి వస్తే, డ్రిస్కేషనరీ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. సరఫరా సరైన సమయానికి సరఫరా, ఫైనాన్స్ ప్రక్రియల వేగవంతం, డీలర్ నెట్వర్క్లో క్రమబద్ధమైన నిల్వ నిర్వహణ జరిగితే..., 2026లోనూ ఆటో అమ్మకాలు టాప్గేర్ దూసుకెళ్లే వీలుందని ఫాడా అంచనా వేసింది. -
ఆర్ 15 సిరీస్ యమహా బైక్ ధరలపై డిస్కౌంట్
యమహా మోటార్ 70వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా యమహా మోటార్ సంస్థ తన ఫ్లాగ్ప్ స్పోర్ట్స్ మోటార్సైకిల్ ఆర్15 సిరీస్ బైక్లపై రూ.5,000 డిస్కౌంట్ ప్రకటించింది. ప్రత్యేక తగ్గింపు ధరలు జనవరి 5 నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది. తగ్గింపు తర్వాత యమహా ఆర్15 సిరీస్లోని యమహా ఆర్15ఎస్ మోడల్ బైక్ ప్రారంభం ధర రూ.1,50,700గా ఉంది.రేసింగ్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్, ఆధునిక సాంకేతికత, రోజువారీ వినియోగానికి అనువైన రైడింగ్ లక్షణాల కారణంగా యువతలో ఈ బైక్లకు విశేషణ ఆదరణ లభించింది. భారత్లో ఇప్పటివరకు 10 లక్షలకుపైగా యూనిట్ల ఉత్పత్తి జరగడం ఆర్15 సిరీస్ బ్రాండ్ డిమాండ్ ప్రతిబింబిస్తుంది.ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్షిఫ్టర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఆరు స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంది. తగ్గించిన ధరలను పరిగణలోకి తీసుకుంటే ఇదే సిరీస్లోని ఆర్15 వీ4 బైక్ ధర రూ.1,66,200, ఆర్15 ఎం బైక్ ధర రూ.1,81,100గా ఉన్నాయి. -
మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్వో
జైసల్మేర్: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో ఈవీని (ఎలక్ట్రికల్) ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐసీఈ వెర్షన్ని 2024 ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వెర్షన్ 285 కి.మీ. రేంజినిస్తుంది. మరోవైపు, సెవెన్ సీటర్ ఎక్స్యూవీ 7ఎక్స్వోని కూడా ఆవిష్కరించింది. దీని ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు (ఎక్స్షోరూం) ఉంటుంది.ఇది ఎక్స్యూవీ 700కి కొత్త వెర్షన్. ఎక్స్యూవీ 700 అమ్మకాలు ప్రతి నెలా సుమారు 7,000 యూనిట్లుగా ఉండగా, 7ఎక్స్వో రాకతో విక్రయాలు దాదాపు 30 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజూరికర్ తెలిపారు. కొత్త ఉత్పత్తులు, వేరియంట్లతో ఈ ఏడాది అమ్మకాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది బొలెరో, బొలెరో నియో కొత్త వెర్షన్లను ప్రవేశపెట్టగా, ఈసారి ఎక్స్యూవీ 7ఎక్స్వో, ఎలక్ట్రిక్ ఎక్స్ఈవీ 9ఎస్ దన్నుతో విక్రయాలు మరింత పెరుగుతాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ప్రభావం కార్లతో పాటు చిన్న కమర్షియల్ వాహనాలపైనా సానుకూల ప్రభావం చూపినట్లు రాజేశ్ తెలిపారు. పరిశీలనలో రేట్ల పెంపు కమోడిటీల రేట్లు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం తదితర పరిణామాల నేపథ్యంలో వాహనాల రేట్ల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాజేశ్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే కొద్ది వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇప్పటికే హుందాయ్, బీవైడీ, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్స్ మొదలైనవి జనవరి నుంచి రేట్ల పెంపు ప్రకటించాయి. అటు మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎండబ్ల్యూ ఇండియా తదితర దిగ్గజాలు కూడా రేట్ల పెంపును పరిశీలిస్తున్నాయి. -
ఏడాదిలో 46వేల మంది కొన్న ఈవీ: ఈ కారు గురించి తెలుసా?
2025లో భారతీయ విఫణిలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా ఎంజీ విండ్సర్ రికార్డ్ సృష్టించిందని.. జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది.గత ఏడాది ఎంజీ విండ్సర్ కారు మొత్తం 46735 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి.. ఫోర్ వీలర్ ఈవీ విభాగంలో కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది. ఇది కొనుగోలుదారులలో దీనికి పెరుగుతున్న ప్రజాదరణను హైలైట్ చేసింది. కొత్త డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా వాహన ప్రేమికులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి.ఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్, బ్యాటరీ ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటాయి.విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 136 పీఎస్ పవర్ 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 37.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
అలా లాంచ్ అయింది.. ఇలా అన్నీ కొనేశారు!
కవాసకి నవంబర్ 2025లో రూ. 12.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసిన.. Z1100 బైకు మంచి ఆదరణ పొందింది. 2026 సంవత్సరానికి కేటాయించిన 20 యూనిట్లు లేదా 20 బైకులు బుక్ అయిపోయాయి. దీంతో కంపెనీ కూడా ఈ బైక్ కోసం బుకింగ్స్ నిలిపివేసింది. తరువాత బ్యాచ్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.కవాసకి Z1100 బైక్ 1,099cc, ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి 134 bhp & 113 Nm టార్క్ అందిస్తుంది. ఈ మోటార్సైకిల్ రెండు చివర్లలో అడ్జస్టబుల్ సస్పెన్షన్.. ప్రీమియం బ్రేకింగ్ హార్డ్వేర్ పొందుతుంది. ఇది డుకాటి స్ట్రీట్ఫైటర్ V2, బీఎండబ్ల్యూ ఎస్ 1000 R, హోండా సీబీ1000ఆర్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
70వేల మంది కొన్న కారు ఇది..
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి సుజుకి.. తన విక్టోరిస్ కారు కోసం 70,000 బుకింగ్స్ అందుకుంది. కాగా అందులో 35వేలు కంటే ఎక్కువ డెలివరీలు పూర్తి చేసింది.గత ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరిస్.. అరీనా డీలర్షిప్ నెట్వర్క్కు ఫ్లాగ్షిప్ మోడల్గా ఉంది. దీని ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి విక్టోరిస్ చూడటానికి కొంత.. గ్రాండ్ విటారా మాదిరిగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే రకమైన ఛాసిస్ & ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. కాబట్టి విక్టోరిస్ 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ &1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలలో అమ్మకానికి ఉంది.ఇదీ చదవండి: ఇన్నోవా క్రిస్టాకు కౌంట్డౌన్!.. నిలిపివేతా?విక్టోరిస్ కారులో.. గ్రాండ్ విటారాలో అందుబాటులో లేని అనేక ఫీచర్స్ ఉన్నాయి. అందులో లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్తో కూడిన 10.1 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ టెయిల్గేట్, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు.. హ్యాండ్స్-ఫ్రీ జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్గేట్, 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి. -
ఇన్నోవా క్రిస్టాకు కౌంట్డౌన్!.. నిలిపివేతా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా క్రిస్టా కారును టయోటా కంపెనీ నిలిపివేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ దీనిని 2027 నాటికి దశలవారీగా తొలగించనున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.టయోటా కంపెనీ 2025లో మొదటిసారిగా.. తన ఇన్నోవా క్రిస్టా కారును దశలవారీగా తొలగించాలని ప్రణాళిక వేసింది, కానీ హైక్రాస్ ప్రవేశపెట్టిన తర్వాత.. కూడా క్రిస్టా ఉత్పత్తిని విస్తరించాలని నిర్ణయించుకుంది. అయితే కఠినమైన ఉద్గార నిబంధనలు కారణంగా.. దీనిని నిలిపివేసేందుకు ఇప్పుడు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కఠినమైన CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ) నిబంధనల ప్రకారం.. కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే.. చాలాకాలంగా ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా కొనసాగించిన కారు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త క్రిస్టా కారును కొనుగోలు చేయలేమని తెలుస్తోంది.ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్తో మాత్రమే విక్రయిస్తోంది. ఇది 148 BHP & 343 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ కార్ల విక్రయాలను తగ్గిస్తున్నాయి. ఇది కూడా టయోటా కంపెనీ తన క్రిస్టా కారును నిలిపివేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది. -
కియా సెల్టోస్ కొత్త వెర్షన్: ధర ఎంతంటే?
నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా కొత్త తరం సెల్టోస్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. హెచ్టీఈ, హెచ్టీఈ(ఓ), హెచ్టీకే, హెచ్టీకే (ఓ), హెచ్టీఎక్స్, హెచ్టీఎక్స్(ఏ), జీసీఎక్స్, జీఎస్ఎక్స్(ఏ), ఎక్స్–లైన్ వేరియంట్లలో లభిస్తుంది.ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, మూడు శక్తివంతమైన మోటార్లతో మార్కెట్లో ప్రవేశిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113బీహెచ్పీ పవర్ని అందిస్తుంది. మరో 1.5 లీటర్ టర్బో–పెట్రోల్ ఇంజిన్ 158బీహెచ్పీ పవర్తో డ్రైవింగ్ అనుభవాన్ని పంచుతుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 118బీహెచ్పీ పవర్ ఇస్తుంది.ఈ ఇంజిన్లకు మ్యాన్యువల్, ఓఎంటీ, సీవీటీ, 7–స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 6 ఎయిర్బ్యాగులు, లెవల్–2 ఏడీఏఎస్, ఈఎస్సీ, టీపీఎంఎస్(టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్, 360–డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లలున్నాయి. 1,830 మి.మీ. వెడల్పు, 1,635 మి.మీ. ఎత్తు, 2,690 మి.మీ. వీల్బేస్తో వస్తోంది.కారు లోపల 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల హెచ్డీ టచ్ర్స్కీన్ సింగిల్ ప్యానెల్ విజువల్ కమాండ్ సెంటర్ ఉన్నాయి. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 64 కలర్ యాంబియెంట్ మూడ్ లైటింగ్, డీ కట్ డ్యూయల్ టోన్ లెదర్ స్టీరింగ్ వీల్ను ఇచ్చారు. ఎనిమిది స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్ సౌకర్యాలు కలిగి ఉంది. జనవరి రెండో వారం తర్వాత వీటి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. రూ.25వేల టోకెన్ అమౌంట్తో డిసెంబర్ 11 నుంచి బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
చెప్పినట్లే చేసిన చైనా దిగ్గజం: రూ. 50వేలు పెరిగిన కారు రేటు!
2026 జనవరి 1నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు చెప్పిన చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ SUV ధర సవరణను ప్రకటించింది. ఈ నెల ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ధరల ప్రకారం.. సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ రేటు రూ. 50,000 పెరిగింది. అయితే పెర్ఫార్మెంట్ వేరియంట్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ప్రకటించింది.జనవరి 1న జరిగిన ధరల సర్దుబాటు తర్వాత.. 82.56 kWh బ్యాటరీని కలిగిన BYD సీలియన్ 7 ప్రీమియం మోడల్ ధర రూ. 48,90,000 నుంచి రూ. 49,40,000లకు పెరిగింది. సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ మోడల్ ధర రూ. 54,90,000వద్ద కొనసాగుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి కంపెనీ 2,300 యూనిట్ల సీలియన్ కార్లను విక్రయించింది.ఇదీ చదవండి: హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?కంపెనీ ఈ కారులో సెల్-టు-బాడీ డిజైన్ & బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ వంటి వాటిని అందించింది. ఇది సేఫ్టీలో కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రీమియం వెర్షన్ 308 hp & 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 567 కి.మీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారు.. 15.6 ఇంచెస్ టచ్స్క్రీన్, నప్పా లెదర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సన్షేడ్తో కూడిన పనోరమిక్ గ్లాస్ రూఫ్ & 12-స్పీకర్ డైనాడియో ఆడియో సిస్టమ్ పొందుతుంది. వీటితోపాటు.. ఇందులో 11 ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సేఫ్టీ లభిస్తుంది. -
హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఇండియా.. ఇటీవల ప్రవేశపెట్టిన వెన్యూ లైనప్ను విస్తరిస్తూ.. కొత్త HX5+ ట్రిమ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ వెన్యూ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది.వెన్యూ HX5+ కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. స్టాండర్డ్ HX5 వేరియంట్తో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, రూఫ్ రెయిల్స్, రియర్ విండో సన్షేడ్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, స్టోరేజ్తో డ్రైవర్ ఆర్మ్రెస్ట్, రియర్ వైపర్ & వాషర్ పొందుతుంది.వెన్యూ HX5+ కారు సాండ్, మడ్, స్నో మోడ్స్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ కూడా ఉంది.ఇదీ చదవండి: ఒక్క కంపెనీ.. 22.55 లక్షల కార్లు! -
ఒక్క కంపెనీ.. 22.55 లక్షల కార్లు!
మారుతి సుజుకి కార్లకు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2025లో ఏకంగా 22.55 లక్షలకు వాహనాలను ఉత్పత్తి చేసింది.దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి.. 2021లో 16.29 లక్షల యూనిట్లను, 2022లో 19.16 లక్షల యూనిట్లను, 2023లో 19.34 లక్షల యూనిట్లను, 2024లో 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు కంపెనీ గత ఏడాది 22.55 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో మారుతి సుజుకి ఉత్పత్తి 20 లక్షల యూనిట్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండవ సంవత్సరం.గత ఏడాది కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లను.. మన దేశంలో విక్రయించడానికి మాత్రమే కాకుండా. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఇందులో ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా మొదలైన మోడల్స్ ఉన్నాయి. కాగా మారుతి సుజుకి ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్, ఖార్ఖోడాలలో తయారీ సౌకర్యాలను నిర్వహిస్తోంది.భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా పెరుగుతున్న దేశీయ డిమాండ్ను తీర్చడానికి, ఎగుమతి చేయడానికి కంపెనీ దేశంలోనే తన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 40 లక్షల యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. ఇదే జరిగితే కార్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
రెండు లక్షలమంది కొన్న కారు ఇది
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. 2025వ సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ముగించింది. కంపెనీకి చెందిన క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో దాని విభాగంలో.. అత్యంత పోటీ ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను సాధించగలిగింది.2025లో హ్యుందాయ్ రోజుకు 550 క్రెటా కార్లను విక్రయించింది. అంటే.. మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. మిడ్-సైజ్ SUV విభాగంలో 34 శాతానికి పైగా కమాండింగ్ మార్కెట్ వాటాతో, దాని పోటీదారుల కంటే అమ్మకాల్లో చాలా ముందుంది.క్రెటా రెండు లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను పొందిన సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు. -
గురువాయూరప్పన్కు ఖరీదైన బైక్
కొంతమంది భక్తులు.. తాము నమ్మిన దేవునికి ధనం సమర్పించుకుంటారు. ఇంకొందరు వాహనాలు సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరైనా.. ఎవరి నమ్మకం వారిది. ఇటీవల 'గురువాయూరప్పన్'కు (దేవాలయానికి) టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS Apache RTX 300) బైక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.గురువాయూరప్పన్ దేవాలయానికి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ TVS Apache RTX 300 బైకును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ.. దేవస్వం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్వం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300ను.. కంపెనీ రూ.1.99 లక్షల ప్రారంభ ధరలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఇది బేస్, టాప్, బీటీఓ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: 2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలుఅపాచీ ఆర్టిఎక్స్ 300 బైక్.. 299 సీసీ ఇంజిన్తో 9,000rpm వద్ద 36hp పవర్ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది Apache RR 310 తర్వాత తయారీదారు యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన బైక్గా నిలిచింది. ఇది ఆఫ్ రోడర్గా మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ టూరర్గా కూడా ఉపయోగపడుతుంది. -
హుందాయ్ ప్రైమ్ ట్యాక్సీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ తాజాగా కమర్షియల్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ’ప్రైమ్ ట్యాక్సీ’ శ్రేణి కార్లను ఆవిష్కరించింది. ఫ్లీట్ ఆపరేటర్లు, ట్యాక్సీ ఎంట్రప్రెన్యూర్లకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. ఇందులో ప్రైమ్ హెచ్బీ (హ్యాచ్బ్యాక్), ప్రైమ్ ఎస్డీ (సెడాన్) కార్లు ఉన్నాయి. ఇవి అందుబాటు ధరలో లభించే, సౌకర్యవంతమైన, అధిక ఆదాయార్జన అవకాశాలు కల్పించే వాహనాలుగా కంపెనీ పేర్కొంది. వీటి ధరలు వరుసగా రూ. 5,99,900, రూ. 6,89,900 నుంచి (ఎక్స్ షోరూం) ప్రారంభమవుతాయని హుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) నూతన ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్ గర్గ్ తెలిపారు. 72 నెలల వరకు చెల్లింపు కాలవ్యవధితో సరళతర రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు
2026 జనవరిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కియా, మారుతి సుజుకి, మహీంద్రా, రెనాల్ట్, స్కోడా కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కియా సెల్టోస్సెకండ్ జనరేషన్ సెల్టోస్ కారును.. కియా కంపెనీ జనవరి 2న లాంచ్ చేయనుంది. అంటే.. ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ కారు ధరలను ఆరోజు అధికారికంగా వెల్లడిస్తారన్నమాట. ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.మారుతి సుజుకి ఈ విటారామారుతి సుజుకి ఈ విటారాతో.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇది 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్డేట్లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే యాంత్రికంగా, పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.ఇదీ చదవండి: కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారురెనాల్ట్ డస్టర్న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్.. జనవరిలో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో ఒకటి. CMF-B ప్లాట్ఫామ్ ఆధారంగా, కొత్త డిజైన్ పొందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని సమాచారం.స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్లు, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. -
కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారు
సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. జూలై 2025లో తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ 'కారెన్స్ క్లావిస్' ఆవిష్కరించింది. దీనిని కియా సీనియర్ అధికారులు.. ఇటీవల కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో చూపించారు. అంతకుముందు ఈ కారును కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామికి పరిచయం చేశారు.కారెన్స్ క్లావిస్ EV భారతదేశంలో తయారైన.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల మధ్య ఉంటుంది. డిజైన్ పరంగా, ఇది కారెన్స్ క్లావిస్ మాదిరిగా కనిపిస్తుంది. క్లావిస్ EVలో బ్లాంక్ ఆఫ్ గ్రిల్ కనిపిస్తుంది. త్రిభుజాకార LED హెడ్లైట్లు, కోణీయ LED DRLలు ఉన్నాయి. మౌంటెడ్ ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్, ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్లతో కూడా వస్తుంది. సైడ్ ప్రొఫైల్లో.. కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 17 అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో-ఎఫిషియన్సీ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక కనెక్టింగ్ లైట్ బార్తో LED టెయిల్లైట్లను పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్కియా కారెన్స్ క్లావిస్ ఈవీ.. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను పొందుతుంది. అవి 42 kWh బ్యాటరీ (404 కి.మీ రేంజ్) & 51.4 kWh బ్యాటరీ (490 కిమీ రేంజ్) ఉన్నాయి. ఇందులోని మోటారు 255 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది HTK+, HTX, HTX ER, HTX + ER అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. -
పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు గ్రీన్ సెస్?: ధరలు పెరిగే ఛాన్స్
డీజిల్ కార్లపై ప్రస్తుతం విధించే గ్రీన్ సెస్ను.. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్, CNG వాహనాలపై విధించే అవకాశం ఉంది. దీనివల్ల కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదాలో భాగమైన ఈ ప్రతిపాదన ప్రకారం సెస్ అమలు చేయనున్నారు. మార్చి నాటికి ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రభుత్వం.. ఈవీలను ప్రోత్సహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. డీజిల్, పెట్రోల్, CNG వాహనాల కొనుగోలును తగ్గించాలి. దీనికోసం ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు.. రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.సెంట్రల్ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నెలా జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు 12-14% వాటా కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన సుమారు 8,00,000 వాహనాలలో, దాదాపు 1,11,000 ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ సంఖ్యను మరింత పెంచే యోజనలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. -
రెనో కారు.. ఇక మరింత రేటు
రెనో ఇండియా తన వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. జనవరి నుంచి కార్ల ధరలను 2% మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ‘‘పెరిగిపోతున్న ముడి సరుకు వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచక తప్పలేదు. ధరలు పెంచినప్పట్టకీ.., కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులు, అత్యున్నత సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటాము’’ అని వివరణ ఇచ్చింది. ఇప్పటికే యూరో మారకంలో రూపాయి క్షీణత కారణంగా మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి సంస్థలు సైతం వచ్చే నెల నుంచి వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ ధరల పెంపు వల్ల ఎంట్రీ-లెవల్ కార్ల నుంచి ఎస్యూవీల వరకు స్వల్పంగా అయినా భారం పెరగనుంది. ముఖ్యంగా క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ధరల ప్రభావం ఉంటుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ధరలు పెరగనున్న నేపథ్యంలో, డిసెంబర్ నెలలో వాహన కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉందని డీలర్లు భావిస్తున్నారు. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.మరోవైపు ఆటోమొబైల్ రంగం మొత్తం వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముడి సరుకుల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇందుకు కారణంగా మారుతున్నాయి. దీంతో ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా దశలవారీగా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు ధరలతో పాటు కొత్త ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సర్వీస్ ప్యాకేజీలపై దృష్టి పెడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ధరల పెంపు ఉన్నప్పటికీ విలువైన ఆఫర్లు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
రూ.14.42 లక్షల కవాసకి బైక్: దీని గురించి తెలుసా?
2026 కవాసకి నింజా 1100SX.. భారతదేశంలో రూ.14.42 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లాంచ్ అయింది. ధర స్టాండర్డ్ మోడల్కు సమానంగా ఉన్నప్పటికీ.. ఇది మెటాలిక్ బ్రిలియంట్ గోల్డెన్ బ్లాక్/మెటాలిక్ కార్బన్ గ్రే అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది.కొత్త నింజా 1100ఎస్ఎక్స్ బైక్ కలర్ స్కీమ్.. 2025 మోడల్లో అందుబాటులో ఉన్న మెటాలిక్ కార్బన్ గ్రే/మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్ స్కీమ్తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇది 1099 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ ఫోర్ ఇంజిన్ 134.14 bhp & 113 Nm ఉత్పత్తి చేస్తుంది.ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగాలంటే..నింజా 1100ఎస్ఎక్స్ బైకులోని ఇంజిన్ ఈ20కి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
కారు మైలేజ్ పెరగాలంటే..
ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే క్రమంగా కొన్ని రోజులకు మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా.. మైలేజ్ పెరగాలంటే వాహనదారులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.సరైన డ్రైవింగ్కారు మైలేజ్పై ఎక్కువ ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. ఆకాశమత్తుగా వేగం పెంచడం, సడన్ బ్రేక్స్ వేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి స్మూత్గా.. ఒక నిర్దిష్టమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సాధారణంగా గంటకు 60 కిమీ నుంచి 80 కిమీ వేగం ఉత్తమ మైలేజ్కు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా.. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకుండా, సరైన గేర్ను ఉపయోగించాలి.వాహనాన్ని సక్రమంగా నిర్వహించడంవాహనాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా.. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తుండాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తప్పకుండా తగ్గుతుంది. టైర్ ప్రెషర్ సరిగా లేకపోతే ఇంజిన్పై ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ వంటి వాటిని సమయానికి మారుస్తుండాలి.అనవసర బరువు వేయొద్దుకారులో లోపల లేదా కారు డిక్కీలో అవసరం లేని లగేజ్ ఉంచకూడదు. బరువు పెరిగితే.. ఇంజిన్ పనితీరు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్ కొంత పెంచుకోవచ్చు.ఏసీ, ఎలక్ట్రిక్ పరికరాల వినియోయాగంకారులో అవసరం లేనప్పుడు ఏసీ ఆపేయాలి. ఏసీ వినియోగం కూడా ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా నగరంలో తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు AC వాడకం మైలేజ్ను తగ్గిస్తుంది. అంతే కాకుండా లైట్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచాలి.రూట్ ప్లానింగ్మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. భారీ ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్లో ఉండటం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి ముందుగానే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, కారు ఇంజిన్ ఆప్ చేసుకోవడం ఉత్తమం. -
లక్ష మంది కొన్న టాటా ఎలక్ట్రిక్ కారు.. ఇదే!
టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నెక్సాన్ EV దేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.2020లో తన మొట్టమొదటి నెక్సాన్ ఈవీని లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రారంభంలో నెలకు 300 నెక్సాన్ కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఆ తరువాత నెలకు 3000 యూనిట్లను విక్రయించగలిగింది. ఇప్పుడు భారతీయ రోడ్లపై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలుటాటా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ రానున్న రోజుల్లో.. సియెర్రా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ అవుతాయి. -
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్సైకిళ్ల గురించి తెలుసుకుందాం.హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్బాక్స్తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ & స్లిప్పర్ క్లచ్తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్లో అపాచీ ఆర్టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్ఫామ్పై నిర్మించిన ఈ మోటార్సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్పిఎమ్ వద్ద 46.4 హెచ్పి & 5,650 ఆర్పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్ఎ గోల్డ్స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్పి & 43.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. -
2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?
కవాసకి ఇండియా ఇటీవలే 2026 వెర్షన్ నింజా 650ను లాంచ్ చేసింది. ఇప్పుడు బ్రాండ్ తన 'వెర్సిస్ 650' అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లో రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు ప్రవేశపెట్టింది. ధర మునుపటి మోడల్ కంటే రూ. 15,000 ఎక్కువ.కంపెనీ లాంచ్ చేసిన.. లేటెస్ట్ వెర్సిస్ 650 బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. ఎటువంటి యాంత్రిక మార్పులు పొందలేదు. కాబట్టి అదే 649 సిసి లిక్విడ్-కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ 8,500 ఆర్పిఎమ్ వద్ద 67 హెచ్పి పవర్.. 7,000 ఆర్పిఎమ్ వద్ద 61 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి, ఉత్తమ పనితీరును అందిస్తుంది.కవాసకి వెర్సిస్ 650 కొత్త పెయింట్ స్కీమ్ను పొందుతుంది. ఇది మెటాలిక్ స్పార్క్ బ్లాక్తో కూడిన మెటాలిక్ గ్రాఫైట్ గ్రే, డార్క్ షేడ్. ఈ వెర్షన్ ప్రస్తుతం 2025 వెర్షన్తో పాటు అమ్మకానికి ఉంది. ఈ లేటెస్ట్ బైక్.. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 4.3 అంగుళాల TFT కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది. కవాసకి ట్రాక్షన్ కంట్రోల్, ఎకనామిక్ రైడింగ్ ఇండికేటర్, ఫోర్ వే అడ్జస్టబుల్ విండ్స్క్రీన్, ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
బజాజ్ పల్సర్ 150 బైక్.. ‘కొత్త’గా వచ్చేసింది!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ 150 బైక్ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్, ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్తో వస్తోంది. కాగా బైక్లో ఇప్పుడున్న వేరియంట్లు అలాగే ఉంటాయి.బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్డేటెడ్ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).ఏం మారాయి..? సమకాలీన మోడల్ బైక్లతో పోటీపడేలా బజాజ్ పల్సర్ 150లో అప్ డేటెడ్ గ్రాఫిక్స్ తో డీటైల్స్ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్కే మోడ్రన్ టచ్ ఇస్తుంది.పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్పీఎం వద్ద 13.8 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది.ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి. -
వెహికల్ ఇన్సూరెన్స్.. ఐదు ముఖ్యాంశాలు!
కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడంవెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.సరైన ఐడీవీ ఎంచుకోకపోవడంవాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.ఎన్సీబీ ఉపయోగించుకోకపోవడంపాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.పాలసీలను పోల్చి చూడకపోవడంఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోకపోవడంఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. -
ధర ఎక్కువైనా.. 24 గంటల్లో కొనేశారు!
బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.ఇదీ చదవండి: అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్లైట్స్ కనిపిస్తాయి. -
అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్ క్రాసింగ్లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.సాధారణంగా ప్రతి టోల్కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్తో ఇది చాలా తగ్గుతుంది.యాన్యువల్ పాస్కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం. -
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎమ్డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తమ బైక్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.భారత్లో తయారు చేసే జీ 310 ఆర్ఆర్, సీఈ 02 బైక్లతో పాటు ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది. -
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
బజాజ్ ఆటో లిమిటెడ్ ‘2026 పల్సర్ 220ఎఫ్’ మోటార్సైకిల్ను కొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్–ఛానల్ ఏబీఎస్ నుంచి డ్యూయల్–ఛానల్ ఏబీఎస్కి అప్గ్రేడ్ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్ లుక్తో ఎల్ఈడీ టర్న్–సిగ్నల్స్(ఇండికేటర్స్) అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఈ మోడల్లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బీయి, బ్లాక్ కాపర్ బేజ్ గ్రీన్ లైట్ కాపర్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్ స్పార్క్ డీటీఎస్–ఐ ఇంజిన్ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో, ఆయిల్–కూల్డ్ సింగిల్ సిలిండర్ సెటప్లో వస్తుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 20.9 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్ 160’ కొత్త వేరియంట్ప్రీమియం బైక్ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్’లో మరింత అధునాతన వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్–షోరూం). అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్–3 కేటీఎం 390 డ్యూక్ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్ తన అభిరుచికి తగ్గట్లు డిస్ప్లే థీమ్ను మార్చుకోవచ్చు. రైడర్ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్ ఫంక్షన్లను నియంత్రించేందుకు 4–వే స్విచ్ క్యూబ్ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్ను కేటీఎం మై రైడ్ యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. -
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలుకొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.ఫ్యూయెల్ ఆదా కోసంరైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్గా యాక్సిలరేట్ చేయాలి.ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్లో బండి నడపాలి.ఎక్కువ సేపు స్టాప్లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా.. -
మరింత పెరగనున్న రేటు: జనవరి 1నుంచే..
2026 రాబోతోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను 2026 జనవరి నుంచి పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలోకి బీఎండబ్ల్యు మోటోరాడ్ కంపెనీ కూడా చేరింది. వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే.. తన మోటార్ సైకిళ్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అన్ని బైకులకు వర్తిస్తుందని వెల్లడించింది.అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా.. మోటార్ సైకిళ్ల ధరలను పెంచడం జరిగిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం స్థానికంగా ఉత్పత్తి చేసిన, దిగుమతి చేసుకున్న మోడల్లు రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!మేడ్ ఇన్ ఇండియా మోడళ్ల జాబితాలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, బీఎండబ్ల్యు సీఈ 02 ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల జాబితాలో.. అడ్వెంచర్, రోడ్స్టర్, టూరింగ్, పెర్ఫార్మెన్స్, క్రూయిజర్ మోడల్లు ఉన్నాయి. BMW C 400 GT వంటి ప్రీమియం స్కూటర్లు, BMW CE 04 వంటి ఎలక్ట్రిక్ మోడళ్స్ కూడా జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి ధరలు వచ్చే ఏడాది నుంచే పెరగనున్నాయి. -
2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా హారియార్ ఈవీ2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా కారెన్స్ క్లావిస్ ఈవీకియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.విన్ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6వియత్నామీస్ EV బ్రాండ్ విన్ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.వోల్వో ఈఎక్స్30వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
చైనా కంపెనీ సరికొత్త రికార్డ్: 1.5 కోట్ల కారు విడుదల
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.భారతదేశంలో బీవైడీ కార్లుఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. -
పదకొండేళ్ల బైక్కి కేటీఎం బై బై..
ప్రముఖ ప్రీమియం ద్విచక్రవాహన సంస్థ కేటీఎం తమ పాపులర్ కేటీఎం ఆర్సీ390 బైక్కు వీడ్కోలు పలకనుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిన కారణంగా ఆర్సీ390 బైక్ మోడల్ను నిలిపిపేయాలని నిర్ణయించుకుంది. ఎంసీఎన్ నివేదిక ప్రకారం.. సింగిల్-సిలిండర్ బైక్కు మార్కెట్లో తగినంత డిమాండ్ లేదు. దీంతో పాటు యూరో5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 373 సీసీ ఇంజిన్ను నవీకరించాలంటే అయ్యే ఖర్చుతో దాని ధర భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఉత్పత్తిని ఇక ఆపేయడం మంచిదనే నిర్ణయానికి ఆస్ట్రియా బైక్ కంపెనీ వచ్చేసినట్లు తెలుస్తోంది.దశాబ్దంపైనే..కేటీఎం ఆర్సీ390 మొట్టమొదటిసారిగా 2014 లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి, ఈ సంవత్సరం తాజా అప్డేట్లో కలిసి రెండుసార్లు అప్డేట్ అయింది. మార్కెట్లో సుమారు 11 సంవత్సరాలపాటు తన ఉనికిని కాపాడుకున్న మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ మంచి అమ్మకాలనే నమోదు చేస్తూ ప్రత్యర్థి కంపెనీ మోడళ్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తప్పుకోకతప్పడం లేదు.భారత్లో మాత్రం ఇంకొన్నాళ్లుఅంతర్జాతీయంగా ఆర్సీ390 బైక్ను నిలిపేస్తున్న కేటీఎం.. యూరోపియన్ మార్కెట్, యూకే డీలర్ షిప్ లలో ప్రస్తుతం ఉన్న స్టాక్ను 2026 వరకు విక్రయించనుంది. అయితే భారత మార్కెట్లో కేటీఎం ఆర్సీ390 బైక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. సరిపడినంత డిమాండ్ ఇక్కడ ఇంకా ఉండటమే ఇందుకు కారణం. కేటీఎం మాతృ సంస్థ అయిన బజాజ్ ఆటో గొడుగు కింద ఈ బైక్ భారత మార్కెట్లో తయారవుతుండటం దీనికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది.కేటీఎం ఆర్సీ390 బైక్ ధర భారతదేశంలో ధర రూ .3.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా ప్రస్తుతం, బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుండి ఈ మోటార్ సైకిల్ ధరను కంపెనీ తొలగించింది. ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో, ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్తోనడుస్తుంది. 43 బీహెచ్పీ శక్తిని, 37 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలుఅంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలుకాలుష్యంఎక్కువచాలా తక్కువNOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువPM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppmడీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరిరియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుందినిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువవాహన ధరతక్కువకొంచెం ఎక్కువనగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతిపర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలంBS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం! -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.లక్షల వాహనాలపై ప్రభావం!ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరిఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
తొలిరోజే 70వేల బుకింగ్స్: ఈ కారుకు ఫుల్ డిమాండ్!
సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్ ఎస్యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండివాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.కంపెనీ ప్రకటించిన రోడ్మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్ ఛైర్పర్సన్ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్ ఉంటుందన్నారు. ఆటోమొబైల్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ కంపెనీకు ప్రధాన మార్కెట్ అని చెప్పారు.నిస్సాన్ ఇండియా మోటార్ ఎండీ సౌరభ్వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్గా ఈ మోడల్ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన మాగ్నైట్, త్వరలో లాంచ్ కానున్న టెక్టాన్, గ్రావైట్ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్లో నిస్సాన్ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.డిజైన్, ఫీచర్లునిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్గేట్పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’ -
మారుతీ వ్యాగన్ఆర్లో తిరిగే సీటు!
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వాహనంలోకి సులువుగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా తమ వ్యాగన్ఆర్ కారులో స్వివల్ సీట్ ఆప్షన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది.రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. వ్యాగన్ఆర్ స్వివల్ సీటు .. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. అసమానతలను తొలగించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పర్యావరణహిత అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ఇది ముందడుగని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 11 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 200కు పైగా మారుతీ సుజుకి అరేనా డీలర్షిప్లలో ఈ స్వివల్ సీటు ఏర్పాటు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త వ్యాగన్ఆర్ కార్లకు అలాగే ఇప్పటికే ఉన్న కార్లకు కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి ఏఆర్ఏఐ సర్టిఫికేషన్, 3 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మారుతీ సుజుకి, ఎన్ఎస్ఆర్సీఈఎల్- ఐఐఎం బెంగళూరు స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ కింద బెంగళూరుకు చెందిన ట్రూఅసిస్ట్ టెక్నాలజీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులు వ్యాగన్ఆర్ స్వివెల్ సీట్ను రెట్రోఫిట్ కిట్గా అరేనా డీలర్షిప్లలో ఆర్డర్ చేయవచ్చు. వాహనం నిర్మాణం లేదా ప్రాథమిక పనితీరులో ఎటువంటి మార్పులు చేయకుండా ఈ సీటును అమర్చుతారు.టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్ఆర్.. విశాలమైన హెడ్రూమ్, లెగ్రూమ్తో ఈ ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్కు అత్యంత అనుకూలంగా నిలుస్తుంది. భారత్లో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతి సుజుకీ మోడళ్లలో వ్యాగన్ఆర్ ఒకటి. -
ఈవీ విడిభాగాల తయారీ ఇక ఇక్కడే: మారుతి సుజుకీ
మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల దిశగా బలమైన ప్రణాళికలతో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల కోసం కీలకమైన విడిభాగాలను రానున్న సంవత్సరాల్లో ఇక్కడే తయారు చేసే ప్రణాళికతో ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, విక్రయాలు) పార్థో బెనర్జీ తెలిపారు. భారత్లో ఈవీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.ప్రస్తుతం బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండగా, వీటిని సైతం ఇక్కడే తయారు చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇ–విటారాను విడుదల చేయనున్న మారుతి సుజుకీ.. కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా స్థానికంగానే ఈవీ తయారీ ఎకోసిస్టమ్పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇంటి కోసం ప్రాథమిక వాహనంగా ఎలక్ట్రిక్ కారును వినియోగదారులు నమ్మకంగా కొనుగోలు చేసినప్పుడే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ వేగాన్ని అందుకుంటుందన్న అభిప్రాయాన్ని బెనర్జీ వ్యక్తం చేశారు.‘‘ఈవీల విషయంలో కస్టమర్లు నమ్మకంగా లేరు. ఆరంభంలో వచ్చిన ఉత్పత్తులకు సంబంధించిన అనుభవంతో, ప్రయాణ దూరం పరంగా వారి మనసుల్లో ప్రతికూల ధోరణి ఏర్పడింది. తగిన ప్రజా మౌలిక సదుపాయాలు లేవు. విక్రయానంతర సేవలు, రీసేల్ (తిరిగి విక్రయించే) విలువ ఈవీల వినియోగానికి ఉన్న పెద్ద సవాళ్లు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన వారు, వాటిని సెకండరీ వాహనంగానే వినియోగిస్తున్నారు’’అని వివరించారు. కనుక వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం కల్పించకపోతే వారు కొనుగోళ్లకు ముందుకురారని అభిప్రాయపడ్డారు. ఐదు మోడళ్లు: 2030 మార్చి నాటికి ఐదు ఈవీ మోడళ్లను కలిగి ఉండాలన్నది మారుతి సుజుకీ ప్రణాళికగా బెనర్జీ పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్ కార్ల పరిమాణం 55–60 లక్షలుగా ఉండొచ్చని, ఈవీ విస్తరణ 13–15 శాతానికి చేరుకోవచ్చని చెప్పారు. మారుతి సుజుకీకి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లోని 1,500 వర్క్షాపులు ఎలక్ట్రిక్ వాహన సర్వీసులకు అనుకూలంగా ఉన్నట్టు, ఇప్పటికే 2,000 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
హైదరాబాద్ షోరూమ్లో కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్: ధర ఎంతంటే?
హైదరాబాద్లోని బోవెన్పల్లిలోని ఆటోమోటివ్ ఎంజీ షోరూమ్లో సరికొత్త ఎంజీ హెక్టర్ను లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్ కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్ కలిగి.. కొత్త గ్రిల్ డిజైన్ పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది సెలాడాన్ బ్లూ అండ్ పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.5-సీటర్ ట్రిమ్లో డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్ ఇంటీరియర్.. 6, 7-సీటర్ ట్రిమ్ల కోసం డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ ఇంటీరియర్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్ సందర్భంగా.. ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద 14 అంగుళాల పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ & అడ్వాన్స్డ్ i-SWIPE టచ్ నియంత్రణలతో కూడిన కొత్త హెక్టర్ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇది కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అన్నారు. -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి
కొత్త కారు కొనడానికి కావలసినంత డబ్బు లేనప్పుడు, చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొంటుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.డాక్యుమెంట్లు చెక్ చేయాలిమీరు కొంటున్న కారుకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా?.. అని చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతోందా?, క్లెయిమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తనిఖీ చేయాలి. ఒకవేల లోన్ ఉంటే.. బ్యాంక్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.మీరు కొంటున్న కారు సెకండ్ హ్యాండ్ కారా? లేక ఎంతమంది చేతులు మారిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక ఓనర్ మాత్రమే కారును ఉపయోగించి ఉంటే.. అది మంచి కండిషన్లో ఉంటుంది. ఎక్కువమంది చేతులు మారి ఉంటే.. కారులో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.కారు కండీషన్మీరు కొంటున్న కారు ఎలాంటి స్థితిలో ఉందనే విషయం గమనించాలి. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా?, పెయింట్ ఒకేలా ఉందా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. టైర్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయనేది చూడాలి. ప్రమాదాలకు గురైన కార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసి.. మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తప్పకుండా గమనించాలి.ఇంజిన్ స్థితికారుకు గుండె వంటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఇంజిన్ శబ్దం స్మూత్గా ఉందా?, స్టార్ట్ చేయగానే ఎక్కువ శబ్దం లేదా పొగ వస్తుందా?, గేర్ షిఫ్టింగ్ సరిగ్గా ఉందా? అని పరిశీలించాలి. మీకు ఈ విషయాలను చెక్ చేయడంలో అనుభవం లేకపోతే.. నమ్మకమైన మెకానిక్తో చెక్ చేయించడం మంచిది.టెస్ట్ డ్రైవ్ & ఓడోమీటర్ రీడింగ్కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో.. బ్రేకులు బాగా పని చేస్తున్నాయా?, స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా?, సస్పెన్షన్ శబ్దం ఉందా? అనేవి గమనించాలి. పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఓడోమీటర్ చెక్ చేసుకోవాలి. తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపిస్తుంటే.. తప్పకుండా అనుమానించాల్సిందే. అలాంటప్పుడు సర్వీస్ రికార్డ్స్తో పోల్చుకోవాలి.ధర & ట్రాన్స్ఫర్ ప్రక్రియసెకండ్ హ్యాండ్ కారు ధర మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేల చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. కారణం కనుక్కోవాల్సిందే. ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పకుండా మీ పేరు మీదకు చేయించుకోవాలి. ఫారమ్ 29, 30 సరిగ్గా సబ్మిట్ చేయాలి.ఛలాన్స్మీరు కొంటున్న కారుపై ఏమైనా పెండింగ్ ఛలాన్స్ ఉన్నాయా?, దొంగతనం కేసులు వంటివి ఉన్నాయా? కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే.. ఆ భారం మీ మీద పడుతుంది. అనుకోని సమస్యలను ఎదుర్కోవాలి ఉంటుంది.డీలర్ vs డైరెక్ట్ ఓనర్కొత్త కారును డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. అయితే యూస్డ్ కారును నేరుగా ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం మంచిది. మధ్యవర్తులను ఆశ్రయించకపోవడం మంచిది. ఒకవేల డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే.. నమ్మకమైన డీలర్ నుంచి కొనుగోలోను చేయడం మంచిది. -
శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శీతాకాలంలో పొగమంచు సర్వసాధారణం. ఇది చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఒకింత జాగ్రత్త వహించాలి. లేకుంటే అనుకోని ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో శీతాకాలం పొగమంచులో డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పొగమంచులో డ్రైవింగ్ టిప్స్నెమ్మదిగా డ్రైవ్ చేయండి: పొగమంచు ఉన్నప్పుడు మీ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం మానుకోవాలి. ముందున్న వాహనాలను జాగ్రత్తగా గమనించాలి.ఫాగ్ లైట్స్ ఉపయోగించండి: ప్రయాణించేటప్పుడు.. తప్పకుండా ఫాగ్ లైట్స్ ఉపయోగించాలి. లో బీమ్ హెడ్లైట్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. హైబీమ్ లైట్ ఆన్ చేస్తే.. ఎక్కువ లైటింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కొంత ఇబ్బందికి గురవుతాయి.సేఫ్ డిస్టెన్స్ పాటించండి: మీకు ప్రయాణించే సమయంలో తప్పకుండా.. ముందు వెళ్తున్న వాహనానికి డిస్టెన్స్ పాటించండి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా.. మీరు ప్రమాదంలో చిక్కుకుండా ఉంటారు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.లేన్ డిసిప్లిన్ పాటించండి: వాహనదారులు తప్పకుండా.. రోడ్డు మధ్య లైన్ లేదా ఎడ్జ్ మార్కింగ్ని గమనిస్తూ డ్రైవ్ చేయాలి. ఒకవేళా లేన్ మార్చాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు హారన్ మోగించడం మర్చిపోవద్దు. అనవసరంగా హారన్ మోగించవద్దు.తీసుకోవాల్సిన జాగ్రత్తలువాహనం ముందే చెక్ చేయండి: ప్రయాణించే వాహనం కండిషన్ ఎలా ఉందనే విషయాన్ని.. ముందుగానే గమనించాలి. లైట్స్, బ్రేక్స్, వైపర్స్ సరిగ్గా ఉన్నాయా.. పనిచేస్తున్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. విండ్షీల్డ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి: ఫాగ్ లైట్ కాంతి ఎక్కువ అనిపిస్తే.. హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఈ లైట్స్ వెనుక వచ్చే వాహనాలకు.. ముందు ఒక వాహనం వెళ్తోందని చూపిస్తాయి.ఇదీ చదవండి: కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!మొబైల్ వాడకండి: పొగమంచుతో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండాలి. వాహనం డ్రైవింగ్ మీదనే మీ పూర్తి దృష్టి పెట్టాలి. మొబైల్ వాడాలంటే.. వాహనం ఆపి ఉపయోగించుకోవడం మంచిది.ఉదయం, రాత్రి వేళల్లో జాగ్రత్త: ప్రత్యేకింగ్ పొగమంచు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే.. తప్పా ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళా ప్రయాణం తప్పనిసరి అయితే.. కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. -
పవర్ఫుల్ ఆదా... సెకండ్ హ్యాండ్ ఈవీకి ఓకే!
ఐదేళ్ల కిందట దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్దగా లేనేలేవు. మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా నిండా ఒక శాతం కూడా లేదు. మరి ఇప్పుడో..? దాదాపుగా మూడున్నర శాతానికి చేరుకుంది. ఇదేమీ మామూలు పెరుగుదల కాదు. మరెలా సాధ్యమైంది? ఎలాగంటే అప్పట్లో ఛార్జింగ్ సదుపాయాలు తక్కువ. ధరలు ఎక్కువ. పైపెచ్చు మోడళ్లూ తక్కువే. దాంతో కొనేవారు వెనకడుగు వేసేవారు. ఇపుడు ఛార్జింగ్ సదుపాయాలు పెరిగాయి. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలోనూ వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఈ రంగంలోకి వచ్చి రకరకాల మోడళ్లు తెస్తున్నాయి. వీటికి తోడు ధరలూ తగ్గాయి. అందుకే ఇపుడు జనం ఆలోచనలు మారుతున్నాయి. సరే! ఇదంతా ఒకెత్తయితే... ఆర్థికంగా మనకు ఏదైతే లాభం? ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం వెతుకుతూనే ఉన్నారు. వారికోసమే ఈ కథనం...పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచెం ఎక్కువ. కానీ నిర్వహణ వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ కారు నిర్వహణ వ్యయమే తక్కువ. మరి మొత్తంగా చూసినపుడు ఏది బెటర్? ఇలా చూసినపుడు స్మార్ట్గా సేవ్ చేసుకోవటానికి సెకండ్ హ్యాండ్ (ప్రీఓన్డ్/ అప్పటికే మరొకరు వినియోగించిన) ఎలక్ట్రిక్ కారు కొనటం మంచిదంటున్నారు నిపుణులు. కొత్త పెట్రోల్ కారు కొనే బదులు ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తెచ్చుకోవటమనేది స్మార్ట్ మార్గమని సలహా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కారే చౌక.. అదెలా?కొత్త వాటి ధరలు అధికంగా ఉంటుండడంతో.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఉన్న ఆదా సూత్రం చాలా మందికి నచ్చుతోంది. ఎందుకంటే పెట్రోల్ కార్లతో పోల్చినపుడు ఎలక్ట్రిక్ కార్ల విలువ వేగంగా తగ్గిపోతోంది. 2020లో రూ.12 లక్షలు పలికిన ఈవీ ధర.. ఇప్పుడు రూ.5.5 నుంచి 6.5 లక్షలకే దొరుకుతోంది. అందుబాటు ధరలకే.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొత్త కొత్త ఫీచర్లు తరచూ యాడ్ అవుతూనే ఉన్నాయి. పైపెచ్చు కంపెనీలు అత్యాధునిక సదుపాయాలతో మోడళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో అప్గ్రేడెడ్ వెర్షన్ను కొనుక్కోవటానికి సంపన్నులు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా 3– 4 ఏళ్లు తిరక్కుండానే తమ పాత వాహనాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయానికి పెడుతున్నారు. ఈ ధోరణే ఇప్పుడు మధ్య తరగతి వాసులకు కలిసి వస్తోంది. సెకండ్ హ్యాండ్లో పెట్రోలు కారు కొని అధిక నిర్వహణ వ్యయాన్ని భరించే బదులు... తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొని తక్కువ నిర్వహణ వ్యయంతో ముందుకెళుతున్నారు. నిర్వహణ వ్యయం కలిసొచ్చేదిలా... → పెట్రోలు కారు లీటర్కు 15 కిలోమీటర్లు మైలేజీ ఇస్తోందనుకుందాం. దాన్లో నెలకు 1,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపుగా రూ.6,500 నుంచి రూ.7000 ఖర్చవుతుంది. → నెలకు ఇంతే దూరం కోసం ఎలక్ట్రిక్ కారులో గనక తిరిగితే.. ఒక కిలోమీటర్కు రూ.1.5 చొప్పున ఎలక్ట్రిక్ చార్జింగ్ కోసం రూ.1,500–2,000 వెచి్చస్తే సరిపోతుంది. → ఈ ఉదాహరణలో ఎలక్ట్రిక్ కారును వినియోగించడం వల్ల నెలవారీ రూ.5,000 వరకు ఆదా అవుతుంది. → ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. క్లచ్/గేర్ బాక్స్లు ఉండవు. కనుక ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్ కోసం ఏడాదిలో రూ.2,000–5,000 సరిపోతుంది. → పెట్రోల్ కారులో ఇంజన్ ఆయిల్, సర్వీసింగ్ కోసం ఏటా రూ.12,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ‘బ్యాటరీ’పై ఆందోళన ఎందుకు? ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీయే హృదయం. కొంత కాలానికి బ్యాటరీ పనితీరు పడిపోతుందని, అగ్ని ప్రమాదాల రిస్క్ ఉంటుందని కొందరు భయపడుతుంటారు. కానీ, ఇపుడు కంపెనీలు ఏమాత్రం రాజీ పడకుండా మెరుగైన టెక్నాలజీతో మంచి బ్యాటరీలు తెస్తున్నాయి. పైపెచ్చు కార్ల కంపెనీలు బ్యాటరీలపై ఎనిమిదేళ్ల వారంటీని లేదంటే 1,60,000 కిలోమీటర్ల వినియోగానికి వారంటీని ఆఫర్ చేస్తున్నాయి. పైగా నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పనితీరు అందరూ అనుకునేట్టు 40–50 శాతం పడిపోవడం అన్నది నిజం కాదు. 8–12 శాతమే తగ్గుతున్నట్టు యూజర్ డేటా ఆధారంగా తెలుస్తోంది.దీన్నిబట్టి చూసినపుడు మూడేళ్లు వాడిన కారును కొనుక్కున్నా మరో మూడు నాలుగేళ్లు అదే బ్యాటరీని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ మార్చాల్సి వస్తే.. అది కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటోంది. ఐదేళ్లలో మిగిలేది బ్యాటరీకి పెట్టొచ్చు... ప్రీఓన్డ్ ఈవీ వర్సెస్ పెట్రోల్ కారు → నెలవారీ వినియోగం 1,000 కిలోమీటర్లు → పెట్రోల్ కారుకు నెలకు ఇంధనం కోసం రూ.7,000 చొప్పున ఐదేళ్లలో రూ.4.2 లక్షలు అవుతుంది. → అదే ఎలక్ట్రిక్ కారుకు నెలకు రూ.2,000 చొప్పున రూ.లక్ష చాలు. → పెట్రోల్ కారుకు ఏటా రూ.12వేల చొప్పున ఐదేళ్లలో రూ.60వేలు మెయింటెనెన్స్ అవుతుంది. → ఎలక్ట్రిక్ కారుకు రూ.2–5 వేల చొప్పున రూ.10–25వేలు సరిపోతుంది. → ఈ రకంగా చూస్తే ఎలక్ట్రిక్ కారుపై ఐదేళ్లలో రూ.3 – 4 లక్షలు మిగులుతుంది. → బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చేసరికి బ్యాటరీ ఖర్చు కన్నా మనకు మిగిలేదే ఎక్కువనేది నిపుణుల మాట. ఎవరికి ఏది అనుకూలం? ప్రీఓన్డ్ ఈవీ: → పట్టణాల్లో రోజువారీ కార్యాలయానికి వెళ్లి వచ్చేందుకు అయితే ఈవీ అనుకూలం. → ఒక రోజులో 80 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారు దీనికి మొగ్గు చూపొచ్చు. నెలలో కనీసం 700 కిలోమీటర్లు, అంతకుమించి ప్రయాణించే వారికే ఈవీ లాభసాటి. → రూ.5– 8 లక్షలే పెట్టుబడి పెట్టగలిగే వారు, ఇంట్లో చార్జింగ్ వసతులు కలిగిన వారు ఇటు వైపు మొగ్గు చూపించొచ్చు. పెట్రోల్ కారు: → హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు లేదా గ్రామీణ/మారుమూల ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకునే వారికి ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారు అనుకూలం. ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి చార్జింగ్ చేశాక... మైలేజ్ పరంగా పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. → ఇంట్లో చార్జింగ్ సదుపాయం లేని వారికి సైతం పెట్రోల్ కారుతోనే సౌలభ్యమని చెప్పాలి. → నెలలో 500 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయని వారికి పెట్రోల్పై, కారు నిర్వహణపై పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఏర్పడదు. వినియోగం తక్కువే కనుక ఏటా విలువ గణనీయంగా తగ్గిపోయే ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారే వీరికి అనుకూలం. -
కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!
కొత్త కారు కొనుగోలు చేయాలని అందరికి ఉంటుంది. అయితే ఇది కొందరికి సాధ్యమవుతుంది. మరికొందరికి కొంత కష్టమే. ఒకవేళా ఎవరైనా కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే.. తప్పకుండా కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఆ విషయాలు, వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.బడ్జెట్కారు కొనడానికి ముందు.. ఆలోచించాల్సిందే బడ్జెట్. ఎంత డబ్బు వెచ్చించి కారు కొనాలి. తక్కువ బడ్జెట్లో కావాలా?, ఎక్కువ బడ్జెట్ పెట్టాలా? అనే విషయంపై స్పష్టత ఉండాలి. ఇక్కడ కారు ధర మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎంత ఉంటాయనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.అవసరాలుకారును ఏ అవసరం కోసం కొంటున్నారనే విషయంపై స్పష్టత ఉండాలి. నగరంలో ప్రయాణించడానికా?, లేక లాంగ్ డ్రైవ్ చేయడానికా? అనే విషయంతో పాటు.. ఫ్యామిలీ కోసమా?, వ్యక్తిగత వినియోగం కోసమా? అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. పెట్రోల్ / డీజిల్ / ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ ఏది కావాలో ముందుగానే ఆలోచించండి.సేఫ్టీ ఫీచర్స్కారు బడ్జెట్, అవసరాలు వంటి విషయాలతో పాటు.. ఆ కారులో ఉన్న ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ ఏమిటనేది తెలుసుకోవాలి. మల్టిపుల్ ఎయిర్బ్యాగ్స్, ఈబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్లు / కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, సేఫ్టీ రేటింగ్ వంటివన్నీ మీరు కొనే కారులో ఉండేలా చూసుకోవాలి.మైలేజ్ & పర్ఫామెన్స్దాదాపు అందరూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆలోచిస్తారు. కాబట్టి మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏది? దాని పర్ఫామెన్స్ ఎలా ఉందనే విషయాలను ముందుగానే గమనించాలి. ఈ విషయాలను తెలుసుకోవడానికి రియల్-వరల్డ్ మైలేజ్ రివ్యూలు చూడటం మంచిది. ఇంజిన్ పవర్, డ్రైవింగ్ స్మూత్నెస్ కూడా పరిశీలించాలి.మెయింటెనెన్స్ & సర్వీస్కారు కొనేస్తారు. కానీ దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తుండాలి. కాబట్టి మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా?, లేదా? గమనించాలి. అవసరమైన పార్ట్స్ లభిస్తాయి. సర్వీస్ ఖర్చులు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే బేరీజు వేసుకోవాలి.పైన చెప్పినవి మాత్రమే కాకుండా.. వారంటీ (స్టాండర్డ్ + ఎక్స్టెండెడ్ వారంటీ) & ఆఫర్లు (ఫెస్టివ్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్), టెస్ట్ డ్రైవ్, రీసేల్ వాల్యూ, ఇన్సూరెన్స్, డెలివరీకి ముందు తనిఖీ వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్, అవసరమైన అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండేలా చూసుకోవడం మంచిది. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి
ముంబై: పండగ సీజన్ తర్వాత కూడా ప్యాసింజర్ వాహనాలకు (కార్లు, ఎస్యూవీలు, వ్యాన్లు) డిమాండ్ కొనసాగింది. ఈ నవంబర్లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. ∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్సైకిల్ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్ సిగ్మెంట్లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘పండుగ డిమాండ్ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్ సెంటిమెంట్తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
కొనసాగిన పండగ సీజన్ జోష్..
న్యూఢిల్లీ: పండుగలు అయిపోయినప్పటికీ వాహనాలకు సంబంధించి నవంబర్లోనూ ఆ జోష్ కొనసాగింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకు భారీగా డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు కూడా తోడు కావడంతో హోల్సేల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ గణాంకాల ప్రకారం హోల్సేల్ డేటాకి తగ్గట్లే ప్యాసింజర్ వాహనాలు, త్రీ–వీలర్ల అమ్మకాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్లో ఏర్పడే డిమాండ్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు.. డీలర్íÙప్ల దగ్గర స్టాక్స్ గణనీయంగా పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ద్విచక్ర వాహనాల రిజి్రస్టేషన్లు మాత్రం వార్షికంగా 3 శాతం మేర నెమ్మదించాయి. 2024 నవంబర్లో 26,27,617 యూనిట్లు రిజిస్టర్ కాగా ఈసారి నవంబర్లో 25,46,184 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. పండగల నెల కావడంతో అక్టోబర్లోనే భారీగా టూ –వీలర్ల కొనుగోళ్లు జరగడం, పంట సంబంధ చెల్లింపుల్లో జాప్యం, కస్టమర్లకు నచి్చన మోడల్స్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణమని ఎఫ్ఏడీఏ పేర్కొంది. బులిష్ గా పరిశ్రమ.. పంటల దిగుబడులు పటిష్టంగా ఉండటం, పెళ్లిళ్ల సీజన్లాంటి అంశాల దన్నుతో టూ–వీలర్లతో పాటు మిగతా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున పాలసీపరమైన సంస్కరణలు, మార్కెట్ సెంటిమెంట్లు మెరుగుపడటం లాంటి అంశాల మద్దతుతో వచ్చే ఏడాది కూడా ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని పరిశ్రమ ఆశిస్తున్నట్లు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలపరంగా ఈసారి నవంబర్ తమకు అత్యుత్తమ నెలగా గడిచిందని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తెలిపింది. ‘‘గత 40 ఏళ్లలో (కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి) నవంబర్ నెలకు సంబంధించి ఈ ఏడాది అత్యుత్తమంగా గడిచింది. గత నెలలో అత్యధికంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి’’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. తమ రిటైల్ అమ్మకాలు 31% పెరిగినట్లు వివరించారు. అలాగే ఎనిమిది మోడల్స్ విషయంలో ఫ్యాక్టరీ స్థాయిలో కూడా నిల్వలు లేకుండా పూర్తిగా అమ్ముడైపోయినట్లు పేర్కొన్నారు. ఇక చిన్న కార్ల (4 మీటర్ల లోపు పొడవు, 18 శాతం ట్యాక్స్ రేటు వర్తించేవి) సంగతి తీసుకుంటే అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 38 శాతం పెరిగాయని బెనర్జీ చెప్పారు. అలాగే పెద్ద కార్ల (40 శాతం పన్ను రేటు వర్తించేవి) విక్రయాలు 17 శాతం పెరిగాయని వివరించారు. పెండింగ్లో లక్షన్నర బుకింగ్స్ .. మారుతీ సుజుకీ దగ్గర 1,50,000 వాహనాలకు బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల దగ్గర మరో 1,20,000 యూనిట్లు ఉన్నాయి. వెయిటింగ్ పీరియడ్లను తగ్గించేందుకు, సకాలంలో వాహనాలను డెలివరీ చేసేందుకు సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పని చేస్తున్నట్లు బెనర్జీ వివరించారు. డిసెంబర్లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అటు టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు కూడా నవంబర్లో భారీ అమ్మకాలు నమోదు చేశాయి. టాటా మోటర్స్ అమ్మకాలు 22 శాతం పెరిగి 57,436 యూనిట్లకు చేరాయి. -
అందుకే.. పెట్రోల్ కంటే సీఎన్జీ కారు మైలేజ్ ఎక్కువ!
సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఇంధన రసాయన నిర్మాణంపెట్రోల్ అనేది C8H18 వంటి హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియోసీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్పెట్రోల్లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువCNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు. -
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా? -
వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్, సీఎన్జీల విషయాన్ని పక్కన పెడితే.. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి మనదేశంలో చాలా తక్కువ. దేశంలోని కార్లకు సరిపడా ఫ్యూయెల్ కావాలంటే.. ఇతర దేశాల నుంచి తప్పకుండా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికోసం లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల్లో పుట్టుకొచ్చించిందే బ్లెండెడ్ ఇథనాల్.భారతదేశంలో బ్లెండెడ్ ఇథనాల్ ప్రయోగం ఇప్పుడు వచ్చింది కాదు. 2001లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్రం 5 శాతం ఇథనాల్ను పెట్రోల్లో కలిపి మహారాష్ట్ర & ఉత్తరప్రదేశ్లో వినియోగించడం ప్రారంభించారు. ఆ తరువాత 2002లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ను ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. 2019లో E10, 2022 డిసెంబర్ 15న E20 (20 శాతం ఇథనాల్ - 80 శాతం పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు.పెట్రోల్ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ఈ ప్రయోగం సరైనదే అయినప్పటికీ, కొంతమంది వినియోగదారుల్లో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. కానీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం.. ఇథనాల్ వినియోగం వల్ల సమస్యలు లేవని, దీనివల్ల పెట్రోల్ దిగుమతి తగ్గిందని.. తద్వారా రూ. 1.40 లక్షల కోట్లు అదా అయిందని లోక్సభలో వెల్లడించారు. నిపుణులు కూడా ఇథనాల్ వినియోగం వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇథనాల్ వినియోగం వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా?, వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు ఉన్నాయా?.. అనేది ఇక్కడ వివరంగా పరిశీలిస్తే..నిపుణులు చెబుతున్న ఉపయోగాలుకాలుష్యం తక్కువ: పెట్రోల్ వినియోగించినప్పుడు వెలువడే.. కాలుష్య కారకాల కంటే ఇథనాల్ ఉపయోగించడం వల్ల వెలువడే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి ఇతర హానికర కారకాల విడుదల కొంత తక్కువగా ఉంటుంది. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు కూడా కొంత తగ్గుతాయిఖర్చు తక్కువ: పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఇథనాల్ ధర కొంత తక్కువే. దీనివల్ల డబ్బు కొంత ఆదా చేసుకోవచ్చు.ఇంజిన్ పనితీరు: కొంతమంది E10/E20 వంటి ఇథనాల్ మిశ్రమాలు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.చమురు దిగుమతులను తగ్గిస్తుంది: భారతదేశం సుమారు 85 శాతం డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ స్థానికంగా తయారవుతుంది, కాబట్టి ఫ్యూయెల్ దిగుమతి కొంతవరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం కాబట్టి.. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం వచ్చే అవకాశం లేదు.వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలుమైలేజ్: ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనేది వాహనదారులు చెబుతున్న ప్రధాన అంశం. ఇది పెట్రోల్ కంటే కూడా 30 శాతం తక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కాకుండా.. మైలేజ్ 4 శాతం నుంచి 5 శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోజువారీ వినియోగదారుడికి ఇది ప్రధానమైన నష్టం.వాహనాల్లో సమస్యలు: 2005 కన్నా పాత కార్లు, బైకులకు ఇథనాల్ సరిపడకపోవచ్చు. దీనివల్ల రబ్బరు హోస్లు, ఫ్యూయల్ పంపులు, ఇతర వాహన భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఫ్యూయెల్ లీక్స్, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఇథనాల్ వల్ల ఇంధన ట్యాంక్లో తేమ పెరగడం, ఫ్యూయల్ సిస్టమ్లో తుప్పు పెరగడం వంటివి జరుగుతాయి.చివరగా..ఇథనాల్ వినియోగం వల్ల.. వచ్చే నష్టాల కంటే, లాభాలే ఎక్కువ. అయితే వాహనదారులు చెప్పిన సమస్యలు కూడా వచ్చే అవకాశం లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇథనాల్ ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, అమెరికా, చైనా, పోలాండ్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దాదాపు 70 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. -
బాహుబలి ఎక్స్కవేటర్ వచ్చేసింది!
దక్షిణాసియాలోనే అతిపెద్ద నిర్మాణ పరికరాల ప్రదర్శన అయిన ఎక్స్కాన్-2025లో జేసీబీ ఇండియా చారిత్రక ఆవిష్కరణ చేసింది. భారత మౌలిక సదుపాయాలకు అనుగుణంగా 400 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్తో శక్తివంతమైన 52-టన్నుల జేసీబీ 520 ఎక్స్ఎల్ ఎక్స్కవేటర్ను ఆవిష్కరించింది. భారతదేశంలో తయారు చేసిన అత్యంత భారీ యంత్రంగా నిలిచిన ఈ ఎక్స్కవేటర్ దేశీయ భారీ నిర్మాణాల అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని జేసీబీ తెలిపింది.ఇది జాతీయ రహదారుల ప్రాజెక్టులు, విస్తృత మైనింగ్ కార్యకలాపాలు, పట్టణ విస్తరణలో అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఈ యంత్రం లాంచ్తో జేసీబీ హెవీ డ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతోంది. ఇది భారత మౌలిక సదుపాయాల వృద్ధిని మరింత వేగవంతం చేయగలదని కంపెనీ చెప్పింది. ప్రపంచ ఎగుమతుల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పేర్కొంది.ఈ ప్రదర్శనలో జేసీబీ ఒక్క 520 ఎక్స్ఎల్ను మాత్రమే కాకుండా మొత్తం 10కి పైగా కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఈ ఉత్పత్తులన్నీ కస్టమర్ కేంద్రీకృత ఇన్నోవేషన్లుగా ఉంటాయని కంపెనీ చెప్పింది. ఎన్హాన్స్ బ్యాక్హో లోడర్లు, కొత్త 2-5 టన్నుల ఎక్స్కవేటర్ రేంజ్తో సహా ఈ మెషిన్లు లో మేనేజ్మెంట్ ఖర్చు, మెరుగైన ఇంధన సామర్థ్యంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. గత 15 సంవత్సరాల్లో జేసీబీ తన యంత్రాల్లో 45% ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు చెప్పింది.హైడ్రోజన్ జెన్ సెట్ ఆవిష్కరణస్థిరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ జేసీబీ తన హైడ్రోజన్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. 2023లో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ బ్యాక్హో లోడర్ విజయవంతం అయిన తరువాత కంపెనీ ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే జెన్ సెట్ను ప్రకటించింది. ఈ ఆవిష్కరణ జీరో-కార్బన్ ఎమిషన్లతో స్వచ్ఛ ఇంధన పరిష్కారాలను అందిస్తుంది.కస్టమర్ సపోర్ట్ బలోపేతండిజిటల్ పరివర్తనలో భాగంగా జేసీబీ అనేక కొత్త ప్లాట్ఫామ్లను ప్రవేశపెట్టింది. ‘పార్ట్స్ ఆన్లైన్’ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ తరహాలో విడి భాగాల కేటలాగ్ను అందిస్తూ, లావాదేవీలను వేగవంతం చేస్తుంది. నెక్స్ట్-జెన్ టెలిమాటిక్స్ వ్యవస్థ ద్వారా మెషిన్ కంటిషన్ను మెరుగుపరుస్తుంది. రియల్-టైమ్ ఆపరేషనల్ ఇన్సైట్స్ అందిస్తుంది.నైపుణ్యాభివృద్ధికి సిమ్యులేటర్లుశిక్షణా విభాగంలో జేసీబీ ‘దక్ష్’ ద్వారా సిమ్యులేటర్లను అందిస్తుంది. ఇది శిక్షణా ఖర్చులను తగ్గించడంతోపాటు భద్రతను పెంచుతుందని కంపెనీ తెలిపింది. 2026 ప్రారంభంలో ఎక్స్కవేటర్ సిమ్యులేటర్ కూడా విడుదల కానున్నట్లు పేర్కొంది. చిన్న కాంట్రాక్టర్లు ఈ సిమ్యులేటర్ల ద్వారా ఖరీదైన శిక్షణ లేకుండానే ఆపరేటర్ల నైపుణ్యాలను మెరుగుపరచవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి -
పెరగనున్న బెంజ్ కార్ల ధరలు: జనవరి 1 నుంచే..
2025 ముగుస్తోంది, 2026 రాబోతోంది. ఈ సమయంలో జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' తన మొత్తం ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెరగనున్నాయి. కరెన్సీ అస్థిరత, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, నిరంతర లాజిస్టికల్ సవాళ్లు మొదలైన కారణాల వల్ల.. ధరలు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. యూరోతో పోలిస్తే భారత రూపాయి బలహీనమైన నేపథ్యంలో బీఎండబ్ల్యూ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఇప్పుడు బెంజ్ కంపెనీ ఈ జాబితాలో చేరింది.2026 జనవరి 1నుంచి 2 శాతం ధరలు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కానీ ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని సంస్థ స్పష్టంగా వెల్లడించలేదు. మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో వివిధ రకాల బాడీ స్టైల్స్లో లగ్జరీ కార్లను విక్రయిస్తుంది. వీటిలో స్థానికంగా తయారు చేసినవి, స్థానికంగా అసెంబుల్ చేసినవి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) మోడల్లు ఉన్నాయి. అయితే కొత్త ధరలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా? -
టెస్టింగ్ కోసం మిరాయ్: త్వరలో రానుందా?
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వాహనాల్లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ & ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్య ద్వారా ఏర్పడిన విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది. నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది సుమారు 650 కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పాలి.కంపెనీ కూడా ఈ లేటెస్ట్ మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, భారతదేశ విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు చేసింది. ఈ కారు టెస్టింగ్ పూర్తయిన తరువాత.. అన్నింటా సక్సెస్ సాధిస్తే.. త్వరలోనే రోడ్డుపైకి వస్తుంది.ఇదీ చదవండి: నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లుభారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ & కార్బన్-న్యూట్రాలిటీ లక్ష్యాలను బలోపేతం చేస్తూ.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని TKM & NISE మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. కారును టెస్టింగ్ కోసం అప్పగించడం జరిగింది. -
నవంబర్లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు
భారతదేశంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కొత్త కంపెనీలు వస్తున్నాయ్. కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేయడానికి అమితమైన ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ప్రతి నెలా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో గత నెలలో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.➤టాటా నెక్సాన్: 22,434 యూనిట్లు➤మారుతి సుజుకి డిజైర్: 21,082 యూనిట్లు➤మారుతి సుజుకి స్విఫ్ట్: 19,733 యూనిట్లు➤టాటా పంచ్: 18,753 యూనిట్లు➤హ్యుందాయ్ క్రెటా: 17,344 యూనిట్లు➤మారుతి సుజుకి ఎర్టిగా: 16,197 యూనిట్లు➤మహీంద్రా స్కార్పియో: 15,616 యూనిట్లు➤మారుతి సుజుకి ఫ్రాంక్స్: 15,058 యూనిట్లు➤మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 14,619 యూనిట్లు➤మారుతి సుజుకి బ్రెజా: 13,947 యూనిట్లునవంబర్ 2025లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్ల జాబితాలో.. 22434 యూనిట్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ నిలిచింది. తరువాత జాబితాలో డిజైర్, స్విఫ్ట్ నిలిచాయి. వ్యాగన్ఆర్, బ్రెజా కార్లు చివరి వరుసలో నిలిచాయి. ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల జాబితాలో ఆరు మారుతి సుజుకి కార్లు, రెండు టాటా కార్లు, ఒక హ్యుందాయ్ కారు ఉన్నాయి.నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన టాటా నెక్సాన్.. పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుండటం కారణంగా ప్రారంభం నుంచి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.32 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: కస్టమర్లకు అలర్ట్: హెచ్డీఎఫ్సీ సేవలు రెండు రోజులు బంద్! -
కియా నుంచి కొత్త సెల్టోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్ వెర్షన్ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్కి ప్రాధాన్యమిస్తూ మిడ్సైజ్ ఎస్యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్ను రూపొందించినట్లు చెప్పారు. వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్ లెవెల్ 2, బోస్ 8–స్పీకర్ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్ సేల్స్ ఆఫీసర్ సున్హాక్ పార్క్, సీనియర్ వీపీ అతుల్ సూద్ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్ వాహనాలను కియా విక్రయించింది. -
హార్లే డేవిడ్సన్ కొత్త బైక్: ధర ఎంతో తెలుసా?
హీరో మోటోకార్ప్ & హార్లే-డేవిడ్సన్ కంపెనీలు అభివృద్ధి చేసిన బైకులను ఎప్పటికప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తూ.. ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా HD X440 T పేరుతో ఓ బైక్ లాంచ్ చేశాయి. దీని ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).నలుపు, ఎరుపు, నీలం & తెలుపు అనే నాలుగు రంగులలో లభించే ఈ లేటెస్ట్ హార్లే-డేవిడ్సన్ హెచ్డీ ఎక్స్440 టీ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డిజైన్ కలిగిన ఈ బైకులో 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27hp & 38Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్ ఎంపికలో లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి పొందుతుంది. రియర్ సబ్ఫ్రేమ్ కొత్త టెయిల్ సెక్షన్ పొందుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ & పొడవైన సీటు వంటివి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.ఇదీ చదవండి: జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు! -
పల్సర్ బైక్ కొత్త వేరియంట్.. మారిపోయింది!
బజాజ్ ఆటో సంస్థ తన పల్సర్ సిరీస్కి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,23,983గా ఉంది. ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ డిజైన్, లుక్లో కీలక మార్పులు చేసింది.పసిడి వర్ణపు అప్సైడ్ డౌన్ (యూఎస్డీ) ఫోర్క్, స్ల్పిట్ సీట్ బదులు సింగిల్ సీట్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ, బ్లాక్ ఇలా మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. లాంచింగ్ సందర్భంగా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సరంగ్ కనడే మాట్లాడుతూ ‘‘కస్టమర్ల అభిప్రాయాలు, డిమాండ్లకు అనుగుణంగా, దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ మార్పులను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ యూఎస్బీ ఫోర్క్లు, సింగిల్ సీట్తో పల్సర్ ఎన్160ని అప్గ్రేడ్ చేశాము. మరింత మెరుగైన సౌకర్యాన్ని జత చేశాము. ఈ మార్పులు కొత్త తరాన్ని మెప్పిస్తాయని ఆశిస్తున్నాము’’ అన్నారు. -
మిడ్నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
వాహన కొనుగోలుదారుల కోసం ఎంజీ మోటార్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది. ‘మిడ్నైట్ కార్నివాల్’ పేరుతో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న పరిమితకాల ప్రమోషన్లో దేశవ్యాప్తంగా ఎంజీ షోరూమ్లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. వినియోగదారులు సౌకర్యవంతమైన సమయాల్లో తమకు నచ్చిన ఎంజీ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చని చెప్పింది.ఈ మూడు రోజుల ఈవెంట్లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ (ICE) మోడల్స్పై భారీ తగ్గింపులు, ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కొనుగోలుదారుల కోసం రూ.11 కోట్ల విలువైన బహుమతుల పూల్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇందులో అర్హత కలిగిన ఇద్దరు కొనుగోలుదారులు లండన్కు ఉచిత ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.మోడల్ వారీగా గరిష్ట ప్రయోజనాలు(ఐసీఈ మోడల్స్పై)మోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)గ్లోస్టర్ (Gloster)రూ. 4 లక్షల వరకురూ. 38.33 లక్షలుహెక్టర్ / హెక్టర్ ప్లస్ (Hector / Hector Plus)రూ. 90,000 వరకురూ. 14.00 లక్షలుఆస్టర్ (Astor)రూ. 50,000 వరకురూ. 9.65 లక్షలు ఈవీ మోడల్స్పై ప్రయోజనాలుమోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)ZS EVరూ. 1.25 లక్షల వరకురూ. 17.99 లక్షలుకామెట్ EVరూ. 1 లక్ష వరకురూ. 7.50 లక్షలువిండ్సర్ EVరూ. 50,000 వరకురూ. 14.00 లక్షలు -
సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం
దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధివ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, జీరో పొల్యూషన్’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.🚨 "Government-backed studies show no significant performance issues or component damage from using 20% ethanol-blended petrol"- Minister Nitin Gadkari. pic.twitter.com/kZdnmGC5Zl— Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2025ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. -
పుతిన్ కారు ప్రత్యేకతలివే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్లైన్లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్ మోడల్ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్-110 లిమోజీన్ను పోలి ఉండే రెట్రో డిజైన్తో దీన్ని రూపొందించారు.ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలుఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్ప్రూఫ్ ఆర్మర్ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు -
లక్ష చార్జింగ్ పాయింట్లు.. మారుతీ ఫోకస్
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో అగ్రస్థానంపై కన్నేసిన ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ చార్జింగ్ నెట్వర్క్ను పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా డీలర్ పార్ట్నర్లు, చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో కలిసి 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.ఈ–విటారా కారుకి 5 స్టార్ భారత్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ లభించిన సందర్భంగా కంపెనీ ఎండీ హిసాషి తకెయుచి ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే 1,100 పైగా నగరాల్లోని తమ సేల్స్, సర్వీస్ టచ్పాయింట్స్వ్యాప్తంగా 2,000 పైగా ఎక్స్క్లూజివ్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ను నెలకొల్పినట్లు చెప్పారు.యాప్ తయారీ, దేశవ్యాప్తంగా డీలర్ నెట్వర్క్లో చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. తమ ’ఈ ఫర్ మి’ యాప్ ద్వారా చార్జింగ్ పాయింట్ల వివరాలను పొందవచ్చన్నారు. చార్జింగ్ నెట్వర్క్ దన్నుతో 2026లో ఈ–విటారా అమ్మకాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. -
యాప్ నుంచే సర్వీస్ బుకింగ్: ఓలా ఎలక్ట్రిక్
హైపర్సర్వీస్ ప్లాట్ఫాం కింద ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఇన్–యాప్ సర్వీస్ అపాయింట్మెంట్ ఫీచరును ప్రవేశపెట్టింది. దీనితో కంపెనీ యాప్ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన సర్వీస్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ పరిస్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే సర్వీస్కి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట సమగ్రంగా చూసుకోవచ్చు.సంప్రదాయ సర్వీస్ బుకింగ్ విధానంలో ఎదురయ్యే సవాళ్లను తొలగించే విధంగా ఇది ఉంటుందని కంపెనీ తెలిపింది. సిసలైన, అత్యంత నాణ్యమైన విడిభాగాలు, ప్రామాణిక సర్వీస్ ప్రక్రియలు యూజర్లకు లభిస్తాయని పేర్కొంది. కస్టమర్లు, స్వతంత్ర గ్యారేజ్లు, ఫ్లీట్ ఆపరేటర్లకు కూడా తమ స్పేర్ పార్టులు, డయాగ్నోస్టిక్ సాధనాలు, శిక్షణ మొదలైనవి అందుబాటులో ఉండేలా ఓలా ఇటీవలే హైపర్సర్వీస్ ప్లాట్ఫాంని ఆవిష్కరించింది. -
జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు!
2026 ప్రారంభంలో సీలియన్ 7 ధరలు పెరుగుతాయని బీవైడీ ఇండియా ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు.. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎల్డబ్ల్యుబీ, టెస్లా మోడల్ వై, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5, వోల్వో ఈసీ40 వంటివాటికి ప్రత్యర్థిగా ఉంది.బీవైడీ సీలియన్ 7 ధరలు రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షల (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్న వారికి ఈ ధరలే వర్తిస్తాయి. 2026 జనవరి 1 నుంచి ధరల్లో మార్పులు జరగనున్నాయి. కాబట్టి అప్పుడు బుక్ చేసుకున్న వారికి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే కంపెనీ ధరలను ఎంత పెంచుతుందనే విషయాన్ని వెల్లడించలేదు.భారతదేశంలో ఇప్పటివరకు 2,000 యూనిట్లకు పైగా సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 82.56kWh బ్యాటరీ ఎంపికలో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్లో 313hp & 380Nmలను అభివృద్ధి చేసే రియర్ మౌంటెడ్ మోటారుకు శక్తినిస్తుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ముందు ఇరుసులో మోటారు ఉంటుంది. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లు వరుసగా 482 కిమీ, 456 కిమీ రేంజ్ అందిస్తాయి. -
ఉత్పత్తిలో సరికొత్త రికార్డ్!.. కంపెనీ నుంచి మరో బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ & బీఎండబ్ల్యూ మోటోరాడ్ తమ దీర్ఘకాల భాగస్వామ్యంలో రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. 2013లో ఇరు కంపెనీలు కలిసినప్పటి నుంచి సబ్ 500సీసీ విభాగంలో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్ మోడల్స్ పుట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి.'బీఎండబ్ల్యూ మోటోరాడ్'తో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యంలో.. ఆవిష్కరణ & నాణ్యత భాగస్వామ్య విలువలు, విజయానికి పునాదిగా నిలిచాయి. మేము యూరప్, అమెరికా & ఆసియాలోని ప్రముఖ మార్కెట్లలోని అనేక కొత్త ఉత్పత్తులను రూపొందించామని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ అండ్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు.రెండు లక్షల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. టీవీఎస్ హోసూర్ తయారీ కేంద్రం నుంచి బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ అడ్వెంచర్ బైక్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది రెండు కంపెనీల ప్రయాణానికి గొప్ప అధ్యాయం అని బీఎండబ్ల్యూ మోటోరాడ్ సీఈఓ మార్కస్ ఫ్లాష్ పేర్కొన్నారు.బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ బైక్.. 420సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్తో 8,750 rpm వద్ద 48 bhp & 6,750 rpm వద్ద 43 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. బీఎండబ్ల్యూ బేస్ మోడల్ మినహా అన్నింటిలోనూ క్విక్షిఫ్టర్ను అందిస్తుంది, అయితే టాప్-స్పెక్ జీఎస్ ట్రోఫీ ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్ను పొందుతుంది. -
డుకాటీ కొత్త బైక్.. రెండు వేరియంట్స్
లగ్జరీ మోటర్సైకిల్ బ్రాండ్ డుకాటీ తాజాగా స్ట్రీట్ఫైటర్ వీ2ని భారత్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 17,50,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 890 సీసీ వీ2 ఇంజిన్, అధునాతన ఎల్రక్టానిక్స్, డుకాటీ చాసిస్, సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.స్ట్రీట్ఫైటర్ వీ2, స్ట్రీట్ఫైటర్ వీ2 ఎస్ అని రెండు వేరియంట్స్లో ఇది లభిస్తుంది. ఇందులో నలుగు రైడింగ్ మోడ్స్ (రేస్, స్పోర్ట్, రోడ్, వెట్) ఉంటాయి. ల్యాప్ టైమర్ ప్రో సెల్ఫ్ టైమింగ్ సిస్టం, క్రూయిజ్ కంట్రోల్, టర్న్ బై టర్న్ నేవిగేటర్, యూఎస్బీ పవర్ సాకెట్లాంటి యాక్సెసరీలు అందుబాటులో ఉంటాయి.పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు2025 డుకాటి స్ట్రీట్ ఫైటర్ V2 పానిగేల్ V2 ప్లాట్ఫామ్పై ఆధారపడి, స్ట్రీట్ రైడింగ్కు అనుకూలంగా మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్, అధునాతన ఎలక్ట్రానిక్స్తో రూపొందింది. డుకాటి దీన్ని తమ “ఫైట్ ఫార్ములా”గా పిలుస్తుంది.స్పోర్టీ, దూకుడు డిజైన్తో రెండు వేరియంట్లు పూర్తి ఎల్ఈడీ లైటింగ్, కాంపాక్ట్ ఫ్రంట్ ఎండ్, స్లీక్ టెయిల్ కలిగి ఉంటాయి.890సీసీ వీ-ట్విన్ ఇంజన్ 118.3 బీహెచ్పీ, 93.3 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. DQS 2.0 క్విక్షిఫ్ట్తో కూడిన 6-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షనల్ రేసింగ్ ఎగ్జాస్ట్ అవుట్పుట్ను 124.2 బీహెచ్పీకి పెంచుతుంది.రెండు వేరియంట్ల సస్పెన్షన్లో ప్రధాన తేడా ఉంది. వీ2లో పూర్తిగా సర్దుబాటు చేయగల మార్జోచి, కయాబా సెటప్ ఉండగా, వీ2ఎస్లో ప్రీమియం ఓహ్లిన్స్ నిక్స్-30 ఫోర్క్లు, ఓహ్లిన్స్ రియర్ షాక్ను ఇచ్చారు.రెండు మోడళ్లలో బ్రెంబో M50 బ్రేకులు, పిరెల్లి డియాబ్లో రోస్సో IV టైర్లు, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. 5-అంగుళాల డిస్ప్లే మూడు లేఅవుట్లను అందిస్తుంది. -
ఈ-విటారా లాంచ్ డేట్ ఫిక్స్!: పూర్తి వివరాలు
మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఈ-విటారా'ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ డిసెంబర్ 2న మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టనుంది. ఈ లేటెస్ట్ ఈవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ, ఈ కథనంలో..మారుతి సుజుకి ఈ-విటారా స్టైలింగ్ మొత్తం.. ఈవీఎక్స్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో వై-షేప్ డీఆర్ఎల్, యాంగ్యులర్ హెడ్ల్యాంప్ యూనిట్లు, వీల్ ఆర్చ్లు ఉన్నాయి.టెయిల్-ల్యాంప్ డిజైన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కొత్త డాష్బోర్డ్ ఉండటం గమనించవచ్చు. ఒక జత ఫ్రీ-స్టాండింగ్ డిస్ప్లేలు, డాష్బోర్డ్ పైభాగంలో ఉన్నాయి. ఫాసియా అంతటా సాఫ్ట్-టచ్ ప్యానెల్ ఉంటుంది. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ క్రింద ఒక చిన్న సెట్ ఫిజికల్ కంట్రోల్స్ ఉన్నాయి. గేర్ సెలెక్టర్ను రోటరీ డయల్తో భర్తీ చేశారు.ఈ-విటారా కారులో.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, నాలుగు స్పీకర్లు & ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్-వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్, ఫాగ్ ల్యాంప్లు & 360-డిగ్రీల కెమెరా వంటివి ఉన్నాయి.మారుతి సుజుకి ఈ-విటారా 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి. -
జనవరి 26న లాంచ్ అయ్యే రెనాల్ట్ కారు ఇదే!
రెనాల్ట్ కంపెనీ.. కొత్త తరం డస్టర్ కారును భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అంతకంటే ముందే సంస్థ దీనిని టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఈ కారుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.కొత్త డస్టర్ కారును.. రెనాల్ట్ కంపెనీ 2026 జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇది కొత్త డిజైన్, ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఏముంటుందనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనిని ప్రత్యర్థులకు పోటీగా.. వాహన వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్మించనున్నట్లు అర్థమవుతోంది.ఒకప్పుడు దేశీయ మార్కెట్లో.. మంచి అమ్మకాలతో, వివిధ ఉత్పత్తులను లాంచ్ చేసిన రెనాల్ట్ కంపెనీ.. ప్రస్తుతం కైగర్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు సంస్థ.. తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా కొత్త కారును ప్రవేశపెడుతోంది. ఇందులో వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు గ్రిల్ బోల్డ్ RENAULT అక్షరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.రాబోయే రెనాల్ట్ డస్టర్ కారు.. అనేక పవర్ట్రెయిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో కలిపి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, మొత్తం 128.2 hp ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. 1.2kWh బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసిన 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 138 hp గరిష్ట ఉత్పత్తిని అందిస్తుంది. అదనంగా, 98.6 hpని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్-LPG ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుందని సమాచారం. -
సేఫ్టీలో 5 స్టార్.. సురక్షితమైన కారుగా అమేజ్!
మూడవ తరం హోండా అమేజ్.. భారత్ ఎన్సీఏపీ క్రాష్-టెస్ట్ ప్రోగ్రామ్ కింద.. పెద్దల ప్రయాణీకులకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ & పిల్లల ప్రయాణీకులకు 4-స్టార్ రేటింగ్ను సొంతం చేసుకుంది. దీంతో ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కుటుంబ సెడాన్లలో ఒకటిగా నిలిపింది.క్రాష్ టెస్టింగ్లో హోండా అమేజ్ గొప్ప ఫలితాలను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్లో 16కి 14.33 పాయింట్లు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్లో 16కి 14.00 స్కోర్ చేసి.. మొత్తం అడల్ట్ సేఫ్టీ టెస్టులో 24కి 23.81 స్కోర్ సాధించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, లోడ్ లిమిటర్లతో కూడిన బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్బ్యాగ్లు, సైడ్ ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లుపిల్లల సేఫ్టీ విషయంలో.. అమేజ్ CRS ఇన్స్టాలేషన్లో 12/12 స్కోర్ను సాధించింది. ఈ సెడాన్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్బెల్ట్ రిమైండర్లు, ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎయిర్బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్ అండ్ చైల్డ్-సేఫ్టీ లాక్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణంలో రక్షణ కల్పిస్తాయి. -
కొత్త ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్తో 679 కిలోమీటర్లు!
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్ఈవీ9ఎస్ని ప్రవేశపెట్టింది. ఈ సెవెన్ సీటర్ ధర రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు (ఎక్స్–షోరూం) ఉంటుంది. 2027, 2028 క్యాలెండర్ సంవత్సరాల నాటికి తమ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాని 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ వివరించారు.ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 8,000 ఈవీల స్థాయికి పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 4,000–5,000 ఈవీలను విక్రయిస్తుండగా, దీన్ని 7,000కు పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయన్నారు. గత ఏడు నెలల్లో 30,000 పైగా ఈవీలను (బీఈ 6, ఎక్స్ఈవీ 9) విక్రయించామని, రూ. 8,000 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.2027 కల్లా 1,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమ బీఈ6 వాహనాల తయారీకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని రాజేష్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 14 సంక్రాంతి నుంచి ఎక్స్ఈవీ9ఎస్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. జనవరి 23 నుంచి డెలివరీలు మొదలవుతాయని వెల్లడించింది.ఈ ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు 59 kWh (కిలోవాట్ హవర్), 70 kWh, 79kWh బ్యాటరీ ప్యాక్లతో వస్తుంది. 175 కిలోవాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ వేరియంట్లను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. వీటిలో 79 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జ్కు గరిష్ఠంగా 679 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.ఇక ఈ 7 సీటర్ ఎక్స్ఈవీలో 527 లీటర్ల బూట్ స్పేస్, డ్యాష్ బోర్డుపై మూడు డిజిటల్ స్క్రీన్లు, రెండో వరుసలో ప్రయాణికుల కోసం రెండు అదనపు స్క్రీన్లు ఇచ్చారు. ఏడు ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ వ్యవస్థ, ఆటో పార్కింగ్, డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. -
భారత్లో టెస్లా సెంటర్
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత్లో తమ తొలి టెస్లా సెంటర్ను గురుగ్రామ్లో ప్రారంభించింది. రిటైల్, ఆఫ్టర్–సేల్స్ సర్వీస్, డెలివరీ, చార్జింగ్లాంటి ప్రధాన సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారత్లో వివిధ రకాల కస్టమర్ల లైఫ్స్టయిల్స్కి అనుగుణంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ తెలిపారు. పెద్ద ఎత్తున సూపర్చార్జింగ్ సదుపాయాలతో పాటు కస్టమర్లకు హోమ్–చార్జింగ్ సొల్యూషన్స్ని కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల పైగా టెస్లా కార్ల విక్రయాలు, 3.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడ్డాయని ఆయన తెలిపారు. టెస్లా భారత్లో విక్రయించే మోడల్ వై కారు ధర రూ. 59.89 లక్షలుగా ఉంది.


