breaking news
Automobile
-
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్ను స్టార్టప్లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!
గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాణా దిశగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్) పథకం కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలతో నడుస్తున్న వాహనాల స్థానే స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు (ఈ-ట్రక్)ను కొనుగోలు చేస్తే రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.పీఎం ఈ-డ్రైవ్ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుఈ-ట్రక్కుపై రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు.మొత్తం దేశవ్యాప్తంగా 5,600 ఈ-ట్రక్కులకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తారు.సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ-ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది.ట్రక్కులతోపాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు.నిబంధనలివే..పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)స్క్రాపేజ్ రుజువును ఈ ప్రోత్సాహకాల కోసం సమర్పించాల్సి ఉంటుంది.పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ-ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి.ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేయాలి.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్(సీడీ) లేని కొనుగోలుదారులు డిజిఈఎల్డీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సీడీలను ఆన్లైన్లో విక్రయిస్తుంది.సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్ డీలర్ ద్వారా నిర్వహిస్తారు.అన్ని వివరాలు ధ్రువీకరించిన తరువాత డీలర్ కొనుగోలుదారు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సాహకాన్ని నేరుగా ఈ-ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీసుస్థిర రవాణా దిశగా అడుగులుభారతదేశాన్ని గ్రీన్ రవాణా ఎకోసిస్టమ్వైపు నడిపించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి నొక్కి చెప్పారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించే భారత్ లక్ష్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ విజన్కు ఈ ప్రయత్నం కూడా తోడవుతుందన్నారు. -
టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వచ్చే వారం భారత మార్కెట్లో లాంఛనంగా అడుగుపెట్టనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జూలై 15న దేశీయంగా తొలి స్టోర్ ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎంపిక చేసిన ప్రముఖులకు టెస్లా పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి కార్ల సెట్ను తమ చైనా ప్లాంటు నుంచి కంపెనీ ఎగుమతి చేసినట్లు వివరించాయి. ఇవి మోడల్ వై రియర్–వీల్ డ్రైవ్ ఎస్యూవీలై ఉంటాయని తెలిపాయి. టెస్లా ఇండియా గత నెలలో ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చ.అ. వేర్హౌస్ స్థలాన్ని అయిదేళ్లకు లీజుకు తీసుకుంది. యూరప్, చైనా మార్కెట్లలో తమ కార్ల విక్రయాలు నెమ్మదిస్తున్న తరుణంలో భారత మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..
ఎలాన్ మస్క్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను ఈ వారంలోనే ప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది. -
స్కోడా ’గ్రూప్’లో బెంట్లీ
న్యూఢిల్లీ: భారత్లో స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియా (ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్ఎన్ఐ) ఈ డీల్తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు. -
బజాజ్ కొత్త బైక్లు.. నాలుగు రైడింగ్ మోడ్లతో..
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్డేట్లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.కొత్త ఫీచర్లురెండు డామినార్ బైక్లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్కు ఈ మోడ్లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్లో లాంటి డిజిటల్ డిస్ప్లేను ఈ రెండు డామినార్ బైక్లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్ను చేర్చింది.ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్నపీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 26 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది. -
టూ వీలర్స్ పెరుగుతాయ్.. ప్యాసింజర్ వాహనాలు తగ్గుతాయ్!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) అమ్మకాల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 1–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా రేటింగ్ సంస్థ అంచనా వేసింది. అధిక ఇన్వెంటరీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ వంటి కీలక ఉపకరణాల కొరత విక్రయాలపై ప్రభావాన్ని చూపొచ్చని పేర్కొంది.అంతకు ముందు.. ఇదే ఎఫ్వై 26లో అమ్మకాల వృద్ధి 4–7% ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్లు(ఓఈఎం)నుంచి స్థిరమైన మోడళ్ల ఆవిష్కరణలు పరిశ్రమ అమ్మకాలకు పాక్షిక మద్దతునిస్తాయని వివరించింది.మే అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలు భారత్ – పాకిస్థాన్ యుద్ధంతో ఉత్తర భారతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు కస్టమర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా ఈ ఏడాది మే నెలలో 3,02,214 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఏప్రిల్ అమ్ముడైన 3,49,939 యూనిట్లతో పోలిస్తే ఇవి 13.6% తక్కువ. ఈ అమ్మకాలు డిమాండ్ క్షీణతకు సంకేతాలని ఇక్రా తెలిపింది. టూ వీలర్స్కు ‘గ్రామీణం’ దన్ను ఇదే ఎఫ్వై 26లో ద్విచక్రవాహన అమ్మకాల వృద్ధి 6–9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. స్థిరమైన గ్రామీణ ఆదాయాలు, సాధారణ వర్షపాత నమోదు, పట్టణ మార్కెట్ పెరగడం తదితర అంశాలు టూ వీలర్స్కు డిమాండ్ను పెంచుతాయి. గ్రామీణ డిమాండ్, మెరుగైన సాగుతో ద్విచక్రవాహన రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదిన 7% వృద్ధి సాధించాయి. -
టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..
టాటా మోటార్స్ అధికారికంగా ‘హారియర్.ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ తన పుణె ప్లాంటులో ఈమేరకు ప్రొడక్షన్ను మొదలు పెట్టినట్లు పేర్కొంది. హారియర్.ఈవీ డెలివరీలు 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి. దాంతో కంపెనీ ఈమేరకు తయారీని మొదలుపెట్టినట్లు స్పష్టం చేసింది.జూన్ 27న ఈ హారియర్.ఈవీ వేరియండ్ ధరలు ప్రకటించిన తరువాత వీటి కోసం బుకింగ్లను ప్రారంభించింది. జులై 2న అధికారికంగా ఈ కార్ల బుకింగ్లు స్వీకరించింది. ఇప్పటికే భద్రత పట్ల దాని నిబద్ధతను చూపుతూ హారియర్.ఈవీ భారత్ ఎన్సీఏపీ 5-స్టార్ రేటింగ్ను సాధించింది. వయోజనుల భద్రతతో 32/32, పిల్లల రక్షణకు 45/49 మార్కును సాధించింది. ఈ విభాగంలో అత్యధిక భద్రతా స్కోర్లలో ఇది ఒకటి.ఇదీ చదవండి: త్వరలో 50 శాతం వైట్కాలర్ జాబ్స్ కనుమరుగుహారియర్.ఈవీ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు బ్యాటరీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ వేరియంట్లు ఉన్నాయి. రెండింటిలోనూ డిఫాల్ట్గా రియర్ వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) సింగిల్ మోటార్ సెటప్ ఉంది. అయితే 75 కిలోవాట్ వేరియంట్ మెరుగైన పనితీరు కోసం ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్ అందిస్తున్నట్లు పేర్కొంది. వేరియంట్ను అనుసరించి ఈ ఈవీ ధర రూ.21.49 లక్షలు(ఎక్స్షోరూమ్) నుంచి రూ.28.99 లక్షలు వరకు ఉంది. -
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్మ్యాన్ కక్కుర్తి..
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు. -
పాత వాహనాలపై నిషేధం ఎత్తివేత
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాత వాహనాల నిషేధానికి సంబంధించి ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం వాహనాల కొనుగోలు తేదీని బట్టి ఆటోమేటిక్ స్క్రాపింగ్ లేదా సీజ్ చేసే ప్రక్రియను అధికారులు ఇకపై కొనసాగించరని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు.పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలను ఢిల్లీలో నడపకుండా నిషేధించాలన్న దీర్ఘకాలిక విధానాన్ని ఈ నిర్ణయంతో నిలిపేశారు. వాస్తవ ఉద్గారాలతో సంబంధం లేకుండా తమ వాహనాలను బాగా నిర్వహించిన వారికి లేదా క్లీనర్ టెక్నాలజీలను ఏర్పాటు చేసిన వారికి ఇది నష్టం కలిగిస్తుందని కొందరి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.‘పాలసీ ఫ్రేమ్వర్క్పై పునరాలోచన చేస్తున్నాం. ఇప్పుడు కేవలం వాహనాల వయసుపై కాకుండా వాస్తవ ఉద్గారాలపై దృష్టి సారించాం’ అని సిర్సా విలేకరుల సమావేశంలో చెప్పారు. పాత వాహనాలనే కాకుండా కాలుష్య కారకాలను లక్ష్యంగా చేసుకునే శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇదీ చదవండి: ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..రూ.లక్షలు పోగేసి కొన్న వాహనాలను మెరుగ్గా నిర్వహిస్తున్నా, నిబంధనలకు లోబడి కాలుష్యకారకాలను నియంత్రిస్తున్నా ఏకమొత్తంగా వాహనాల వయసురీత్యా పాలసీలు అమలు చేయడం తగదని కొందరు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రంగా విమర్శించారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. సోషల్మీడియాలో ‘రూ.84 లక్షలతో రేంజ్ రోవర్ కారు కొన్ని ఎనిమిదేళ్లు అవుతుంది. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఇంట్లోనే పార్క్ చేశాను. మొత్తంగా ఆ కారులో 74 వేల కి.మీ మాత్రమే ప్రయాణించాను. కారు మంచి కండిషన్లో ఉంది. కానీ నిబంధనల ప్రకారం ఇప్పుడు చౌకగా అమ్మాల్సి వస్తుంది’ అనేలా పోస్టులు వెలిశాయి. -
ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్కు ప్రణాళికలు
వచ్చే మూడేళ్ల పాటు వరుసగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మ్యాటర్ మోటర్ వర్క్స్ గ్రూప్ సీవోవో అరుణ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ ఎలక్ట్రిక్ గేర్డ్ బైక్ ‘ఏరా’ (ఏఈఆర్ఏ)ని ఢిల్లీ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 60 డీలర్షిప్లను ప్రారంభించనున్నామని, వీటిలో అత్యధిక భాగం దక్షిణాదిలోనే ఉంటాయని సింగ్ వివరించారు.ఇదీ చదవండి: ఐపీవోకు మీషో రెడీప్రస్తుతానికి తాము మోటర్సైకిల్స్పైనే దృష్టి పెడుతున్నాయని, ఎలక్ట్రిక్ స్కూటర్ల యోచన లేదని చెప్పారు. తమ తొలి మోడల్ ఏఈఆర్ఏని ఆరేళ్ల పాటు రూపొందించామని, గతేడాది అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభించామని వివరించారు. తొలి ఏడాదిలో 10,000తో మొదలుపెట్టి రెండో ఏడాది 50,000–60,000 వరకు వాహనాలను విక్రయించే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అహ్మదాబాద్లోని తమ ప్లాంటుకు ప్రతి నెలా 10,000 వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉందని సింగ్ తెలిపారు. -
రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు. -
టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వేరియంట్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఎక్స్–షోరూం ధర రూ.1.03 లక్షలుగా ప్రకటించింది. ఇందులో అమర్చిన 3.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వల్ల సింగిల్ ఛార్జింగ్తో 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్, బ్యాక్రెస్ట్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.‘ఇప్పటికే ఆరు లక్షలకు పైగా ఐక్యూబ్ యూనిట్లు విక్రయించాం. డ్యూయల్ టోన్ కలర్స్తో రోజు వారీ అనువైన ప్రయాణాలకు అనుగుణంగా తాజా ఐక్యూబ్ను తీర్చిదిద్దాం. కొత్త వేరియంట్ విడుదల ద్వారా విద్యుత్ వాహన విభాగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాం’ అని టీవీఎస్ కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’టఫే, ఏజీసీవో వివాదం సెటిల్మెంట్మాసే ఫెర్గూసన్ బ్రాండ్ వివాదాన్ని టఫే, ఏజీసీవో కార్పొరేషన్ సంస్థలు కోర్టు వెలుపల పరిష్కరించుకున్నాయి. సెటిల్మెంట్ ప్రకారం ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) సంస్థ రూ.2,225 కోట్లు చెల్లించి మాసే ఫెర్గూసన్లో ఏజీసీవో వాటాలను కొనుగోలు చేయనుంది. భారత్, నేపాల్, భూటాన్లో ఈ బ్రాండు పూర్తి యాజమాన్య హక్కు లు టఫేకు దక్కుతాయి. ఏజీసీవో కార్పొరేషన్ గత సెపె్టంబర్లో మాసే ఫెర్గూసన్ బ్రాండ్ లైసెన్స్ సహా టఫేతో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేసుకుంది. -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ రేంజ్
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో సర్వీసులు అందిస్తున్న ఏథర్ ఎనర్జీ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో రిజ్టా ఎస్ మోడల్ను విడుదల చేసింది. మెరుగైన బ్యాటరీ వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. రూ.1,37,047 ఎక్స్ షోరూమ్ ధరతో దీన్ని విపణిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ‘ప్రభుత్వ నిమయాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’ఫీచర్లు ఇవే..3.7 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 159 కి.మీ సామర్థ్యం ఉంటుంది.ఓవర్ నైట్ హోమ్ ఛార్జింగ్, ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ వేరియంట్ల్లో లభిస్తుంది.ఏడు అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే టెక్నాలజీ అందిస్తున్నారు.థెఫ్ట్ అలర్ట్స్, ఫైండ్ మై స్కూటర్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి సాంకేతికత ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.ఓటీఏ(ఓవర్-ది-ఎయిర్) అప్డేట్లు ఎనేబుల్ చేయవచ్చని పేర్కొంది.34 లీటర్ల అండర్ సీట్ స్పేస్ ఉంటుందని చెప్పింది. -
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తాను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించే రేంజ్ రోవర్ను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ-ఎన్సీఆర్లో పాత వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఎండ్ ఆఫ్ లైఫ్(ఈఓఎల్) పాలసీ ప్రకారం డీజిల్ వాహనాల జీవితకాలాన్ని 10 ఏళ్లుగా, పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించింది. దాంతో నిర్ణీత సమయం దగ్గర పడుతున్న వాహనాలను వాహనదారులు ఢిల్లీ ఎన్సీఆర్ వెలుపల నివసిస్తున్న వారికి విక్రయించాల్సి వస్తుంది.రితేష్ గండోత్రా అనే వ్యక్తి తాను రూ.లక్షలుపోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును ఢిల్లీ ఈఓఎల్ నిబంధనలను అనుగుణంగా చౌకగా అమ్మాల్సి వస్తుందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు విలువ చేసే కారును ఇలా అమ్మకాన్ని పెడుతుండడంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాలకు ధన్యవాదాలు. నా కారును విక్రయించవలసి వస్తుంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే ఇవ్వాలి. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’రితేశ్ పోస్ట్కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీలో వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుగా 15 ఏళ్లపాటు రోడ్ ట్యాక్స్ కట్టించుకున్నారు. మిగతా 5 ఏళ్ల ట్యాక్స్ రిటర్న్ ఇవ్వమని అడగాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంకరు ‘మీరు కారు ఏ ధరకు అమ్ముతారో చెప్పండి సర్’ అంటూ స్పందించారు. -
ఆటో ‘జోరు’కు బ్రేక్
ముంబై: దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో జూన్లో వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ అమ్మకాల్లో రెండంకెల క్షీణత నమోదైంది. అయితే డీలర్లకు సరఫరా పెరగడంతో మహీంద్రా–మహీంద్రా అమ్మకాలు ఏకంగా 18% పెరిగాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూన్లో 1,18,906 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది.గత ఏడాది జూన్లో అమ్ముడైన 1,37,160 వాహనాలతో పోలిస్తే 13% తక్కువ. ‘‘చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు అనూహ్యంగా తగ్గడంతో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత నమోదైంది. చరిత్రాత్మకంగా జీడీపీ వృద్ధికి కార్ల అమ్మకాలు 1.5% అధికంగా ఉంటాయి. ఇప్పుడు జీడీపీ 6.5% నమోదైనప్పటికీ.. కార్ల అమ్మకాలు నెమ్మదించాయి. చిన్న కార్ల అమ్మకాల్లో వృద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లింది అనేందుకు ఇది సంకేతం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ తెలిపారు. -
లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్
చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ షావోమీ ఎస్యూ 7 మోడల్ తర్వాత తన రెండో ప్రోడక్ట్ వైయూ 7ను చైనా మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసింది. దీన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. కేవలం లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలిపాయి. దీని ధర వేరియంట్ను అనుసరించి సుమారు రూ.30.22 లక్షల(ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ చెప్పింది.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ కారు లాంచ్ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు, 18 గంటల్లో 2.40 లక్షల ఆర్డర్లు, 24 గంటల్లో 2.89 లక్షల ఆర్డర్లను లాక్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనాలోని మొత్తం 351 షావోమీ ఈవీ రిటైల్ స్టోర్లలో వైయూ7 బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే షావోమీ ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్లు పొందిందో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.A Chinese carmaker Xiaomi just made a record in auto industry pic.twitter.com/j3ANpHGfJH— Interesting STEM (@InterestingSTEM) June 29, 2025ఇదీ చదవండి: అనంత్ అంబానీ జీతం ఎంతో తెలుసా..?ఫీచర్లు ఇవే..ఈ వైయూ7 మోడల్లో 320 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 528 ఎన్ఎం టార్క్తో గంటకు 240 కిలోమీటర్లు టాప్ స్పీడ్తో ఈ వేరియండ్ను లాంచ్ చేసినట్లు చెప్పింది. 0-100 కిమీ/గంట వేగాన్ని 5.9 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొంది. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 835 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని చెప్పింది. 21 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ అవుతుందని పేర్కొంది. -
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి. -
ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్యూవీకి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను జెడ్ 8 ఎల్ వేరియంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్ ఎం చెప్పింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడుఅదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్యూవీ ఇంజిన్లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. -
రెండు మెర్సిడెస్ బెంజ్ జీటీ సిరీస్లో స్పోర్ట్స్ కార్లు
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కొత్తగా జీటీ సిరీస్లో రెండు స్పోర్ట్స్ కార్లను ఆవిష్కరించింది. వీటిలో ఏఎంటీ జీటీ 63 ఫోర్మ్యాటిక్ప్లస్, జీటీ 63 ప్రో ఫోర్మ్యాటిక్ప్లస్ కూపే ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.3 కోట్లు, రూ.3.65 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఎస్పీఎంఈపీసీఐ పథకం కొత్త విదేశీ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లో తాము గత ముప్ఫై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే పుణె ప్లాంటుపై రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని వివరించారు. స్కీమును ప్రకటించడానికి ముందు నుంచే రెండు కార్ల మోడల్స్ను దేశీయంగా ఈ ప్లాంటులోనే తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.ఏఎంజీ జీటీ 63 4 మ్యాటిక్+పవర్: 585 బీహెచ్పీ, 800 ఎన్ఎమ్ టార్క్0–100 కిమీ/గం: 3.2 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 315 కి.మీ.ధర: రూ .3 కోట్లు (ఎక్స్-షోరూమ్)ఇదీ చదవండి: ‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’ఏఎంజీ జీటీ 63 ప్రో 4 మ్యాటిక్+పవర్: 612 బీహెచ్పీ, 850 ఎన్ఎమ్ టార్క్0–100 కి.మీ/గం: 3.1 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 317 కి.మీ.ధర: రూ.3.65 కోట్లు (ఎక్స్-షోరూమ్) -
మారుతీ కారు ఓనర్లకు గుడ్ న్యూస్..
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ సర్వీస్ నెట్వర్క్ను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5,400గా ఉన్న టచ్పాయింట్ల సంఖ్యను 2030–31 నాటికి 8,000కు పెంచుకోనుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, అలాగే తమ ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయిచి తెలిపారు.1,000 పైగా నగరాల్లో 1,500 ఈవీ ఎనేబుల్డ్ సర్వీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో సుశిక్షితులైన సిబ్బంది, అధునాతనమైన పరికరాలు ఉంటాయని తకెయుచి చెప్పారు. మే నెలలో తమ సంస్థ భారీ స్థాయిలో 24.5 లక్షల వాహనాలను సర్వీస్ చేసినట్లు వివరించారు.మరోవైపు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఆన్రోడ్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన క్విక్ రెస్పాన్స్ టీమ్ను కూడా మారుతీ సుజుకీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్వీస్ కార్యకలాపాల సహకారం కోసం ఏఐ ఆధారిత చాట్బాట్లను, వాయిస్ బాట్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. -
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.ఈ విజయం మారుతీ సుజుకీ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్వర్క్ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు. -
టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్లోని ఆస్టిన్లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) సాఫ్ట్వేర్తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్యూవీలను తయారు చేశారు.ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్లెస్ కారు రైడ్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.రైడ్ ధర 4.20 డాలర్లుప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు. -
యూరప్ కారు.. తగ్గిన జోరు!
న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్ దిగ్గజాలు భారత్లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ డేటా, అనలిటిక్స్ అందించే జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం రెనాల్ట్ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్వేగన్ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎస్యూవీలు కీలకం గత మూడేళ్లలో యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా టైర్–2, టైర్–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్వర్క్ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పన్ను ప్రభావమిలా ప్రస్తుత ఆటోమోటివ్ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్ వాహనాల(పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్ వాహనాల(డీజిల్)పై 28 శాతం జీఎస్టీ, 3 శాతం కాంపెన్సేషన్ సస్ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్గల) ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ను విధిస్తారు.దేశీ దిగ్గజాల దూకుడు దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాసహా జపాన్ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్ మార్కెట్ కోసమే సబ్కాంపాక్ట్ ఎస్యూవీ ‘కైలాక్’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్ దిగ్గజాలు భవిష్యత్లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్అండ్డీ, చౌకవ్యయ ప్లాట్ఫామ్స్పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు. -
కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
హోండా కార్స్ ఇండియా సంస్థ న్యూ సిటీ స్పోర్ట్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 14,88,900గా (ఢిల్లీ ఎక్స్ షోరూం) ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ స్పోర్ట్ ట్యాగ్లైన్తో ప్రవేశపెట్టిన ఈ కార్లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. వెలుపల స్పోర్టీ బ్లాక్ గ్రిల్, అలాయ్ వీల్స్, అలాగే లోపల ప్రీమియం లెదర్ బ్లాక్ సీట్లు, రూఫ్ లైనింగ్తో ఇంటీరియర్స్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.మార్కెట్లోకి మహీంద్రా ఫ్యూరియో 8 ట్రక్మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ తాజాగా అత్యధిక మైలేజీ గ్యారంటీతో ఫ్యూరి యో 8 పేరిట తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీనివ్వకుంటే ట్రక్కును వాపసు చేయొచ్చనే ఆఫరుతో దీన్ని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ వాహనం 4, 6 టైర్ల కార్గో వేరియంట్స్లో లభిస్తుంది.కొనుగోలుదారుకు అధిక ఆదాయాలు, కనిష్ట స్థాయిలో నిర్వహణ వ్యయాలతో అన్ని రకాల ప్రయోజనకరంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు. అలాగే, సరీ్వసింగ్ విషయానికొస్తే 36 గంటల టర్నెరౌండ్ సమయం లేదా జాప్యం జరిగిన ప్రతి అదనపు రోజుకు రూ. 3,000 చొప్పున చెల్లించేలా సర్వీస్ హామీ ఉంటుందని వివరించారు. -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!
రాయల్ ఎన్ఫీల్డ్ తన ఐకానిక్ బుల్లెట్ 350 సిరీస్ ధరల్లో స్వల్ప మార్పులు ప్రకటించింది. వేరియంట్ను అనుసరించి ధరను రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచినట్లు తెలిపింది. దాంతో బేస్ వేరియండ్ ధర రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ప్రీమియం మోడల్ ధర రూ.2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ఈ ధరల పెంపుతో పాటు బుల్లెట్ సిరీస్లో అప్డేటెడ్ మోడల్ బెటాలియన్ బ్లాక్ను ప్రవేశపెట్టింది. బెటాలియన్ బ్లాక్ బేస్ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆకట్టుకునే డిజైన్తో బ్లాక్ బాడీ, గోల్డెన్ హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రిప్స్, రెట్రో టెయిల్ లైట్, స్కూప్డ్ సింగిల్ సీట్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరిఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ మిలిటరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.76 లక్షలకు చేరింది. రెడ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దీనిపై రూ.2000 ధర పెరిగింది. బ్లాక్, మెరూన్ రంగుల్లో లభించే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. దీని ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు రూ.2.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) రూ .2,000 పెరిగింది. -
అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి
రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. -
ఈవీ కారు ధరలో రూ.4.4 లక్షలు డిస్కౌంట్..
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటోమోటివ్ వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించింది. భారత్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి ఆరేళ్లు అవుతున్న నేపథ్యంలో ఎంజీ సంస్థ తన జెడ్ఎస్ ఈవీ మోడల్పై గణనీయమైన ధర తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. లిమిటెడ్ టైమ్ యానివర్సరీ ఆఫర్లో భాగంగా జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు రూ.16.75 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుందని పేర్కొంది.ఇదీ చదవండి: వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!ఎంజీ జెడ్ఎస్ ఈవీ వేరియంట్లను అనుసరించి ఎక్స్షోరూమ్ ధరల్లో మార్పులు ప్రకటించింది. దాంతో ఎసెన్స్ వేరియంట్పై అత్యధికంగా రూ.4,44,000 వరకు రాయితీ పొందవచ్చని ఎంజీ తెలిపింది. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ క్లీన్ మొబిలిటీని పోత్సహించేలా వినియోగదారులకు ఈ ప్రత్యేక ధరలను అందిస్తున్నట్లు తెలిపింది. -
‘బ్యాటరీ సర్వీస్’ ఆప్షన్తో విడా ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: వచ్చే నెల ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్2 కోసం సబ్స్క్రిప్షన్ ఆధారిత బ్యాటరీ–యాజ్–ఏ–సర్వీస్ (బీఏఏఎస్) ఆప్షన్ను అందించనున్నట్లు టూ–వీలర్ల దిగ్గజం హీరో మోటోకార్ప్ తెలిపింది. దీనితో వాహనానికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా తగ్గుతుందని, మరింత మందికి ఎలక్ట్రిక్ మొబిలిటీ చేరువయ్యేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. కస్టమర్లు తమ రోజువారీ, నెలవారీ బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరళతరమైన సబ్్రస్కిప్షన్ ప్లాన్లను ఎంచుకోవచ్చని వివరించింది. స్కూటర్ చాసిస్, బ్యాటరీకి వేర్వేరుగా ఫైనాన్స్ తీసుకునే ఆప్షన్ ఉండటం వల్ల ముందస్తుగా పెద్ద మొత్తం చెల్లించాల్సిన భారం తగ్గుతుందని కంపెనీ తెలిపింది. బీఏఏఎస్ మోడల్, సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, ధర మొదలైన పూర్తి వివరాలను జూలై 1న కంపెనీ ప్రకటించనుంది. -
మారుతీ కార్లు కొనేవారికి ఊరట..
ఆటోమొబైల్స్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు వాహన రుణాల సదుపాయాన్ని అందించేందుకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో చేతులు కలిపింది. కొత్త కార్లు, యూజ్డ్ కార్లు, వాణిజ్య వాహనాలకి రిటైల్ రుణాల కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది.మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లు అందించేందుకు ఇది తోడ్పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు.👉 ఇది చదివారా? టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్.. మహీంద్రా చేతికి ఎస్ఎంఎల్ ఇసుజు వాణిజ్య వాహన తయారీ కంపెనీ ఎస్ఎంఎల్ ఇసుజులో మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) అనుమతి పొందింది. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా ఎక్స్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఎస్ఎంఎల్ ఇసుజులో 58.96 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో ఎంఅండ్ఎం ప్రకటించింది.ఇందుకు రూ. 555 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సంస్థలో సుమితోమో కార్పొరేషన్కున్న పూర్తి వాటా(43.96 శాతం)ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్లో పేర్కొంది. అంతేకాకుండా పబ్లిక్ వాటాదారుగా ఉన్న ఇసుజు మోటార్స్ నుంచి 15 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. -
మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలు
దేశీయంగా మే నెలలో ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) విక్రయాలు స్వల్పంగా 0.8% తగ్గాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 3,44,656 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఇదే మేలో 3,47,492 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మారుతీ నుంచి డీలర్లకు సరఫరాలు 1,44,002 నుంచి 1,35,962కు తగ్గాయి. ఎంఅండ్ఎం సరఫరా 43,218 నుంచి 52,431కు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాలు 49,151 నుంచి 43,861 యూనిట్లకు తగ్గాయి.ద్విచక్ర వాహనాల విక్రయాలు 2% వృద్ధితో 16,20,084 నుంచి 16,55,927 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో మోటార్సైకిళ్ల విక్రయాలు 10,39,156 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 5,79,507 యూనిట్లుగా ఉన్నాయి. త్రి చక్రవాహన అమ్మకాలు 3.3% క్షీణించి 53,942 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మేలో ఈ విక్రయాలు 55,763గా ఉన్నాయి. ఇదీ చదవండి: తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!‘గడిచిన ఆరునెలల్లో ఆర్బీఐ 3 సార్లు రెపోరేటు మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సాధారాణ వర్షపాతం నమోదు అంచనాలు, వినియోగదారుల సెంటిమెంట్ బలపడటం తదితర అంశాలు వాహన విక్రయాల డిమాండ్ కొనసాగేందుకు దోహదపడ్డాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా ‘2025 ఎక్స్ఎల్ 750 ట్రాన్సల్ప్’ పేరుతో అడ్వెంచర్ బైక్ను విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.10,99,990గా ఉంది. బుకింగ్లు మొదలయ్యాయి. జులై నుంచి డెలివరీలు ప్రారంభిస్తారు. రాక్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్ బైక్ 755 సీసీ లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది.ఇది 9,500 ఆర్పీఐ వద్ద గరిష్టంగా 67.5 కిలోవాట్ల పవర్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్కు 6–స్పీడ్ గేర్బాక్స్ జత చేశారు. ఐదు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో థ్రోటిల్–బై–వైర్ (టీబీడబ్ల్యూ) వ్యవస్థ ఉంది. 5.0 అంగుళాల ఫుల్–కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్లులున్నాయి. ఇదీ చదవండి: కొత్త సిమ్ తీసుకునేవారికి జియో బంపర్ ఆఫర్ఇంజిన్ పవర్, బ్రేకింగ్, ఏబీఎస్ వంటి అంశాలు రైడర్ ఇష్టానికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. ముఖ్యంగా సాహస యాత్రలను కోరుకునే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. -
ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపు
గ్రీన్ లాజిస్టిక్స్, సమర్థవంతమైన వెహికల్ డిస్పాచ్ కోసం మారుతి సుజుకి తన మానేసర్ ఫెసిలిటీలో భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ను ప్రారంభించింది. లాజిస్టిక్స్లో కార్బన్ ఉద్గారాలను, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం, రహదారి రద్దీని కట్టడి చేయడం ఇన్-ప్లాంట్ రైల్వే సైడింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా హరియాణా ఆర్బిటల్ రైల్ కారిడార్ (హెచ్ఓఆర్సీ)తో భాగస్వామ్యం ఏర్పరుచుకొని మారుతి సుజుకి ఈ సదుపాయాన్ని సోనిపట్ నుంచి పల్వాల్ వరకు 126 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసింది.ఈ సదుపాయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మల్టీ మోడల్ కనెక్టివిటీకి గేమ్ ఛేంజర్ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. సమర్థవంతమైన ఆటోమొబైల్ రవాణాలో కొత్త ఆవిష్కరణలు చేస్తూ, గ్రీన్ లాజిస్టిక్స్లో మారుతి సుజుకి ఆవిష్కరణలు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: రేపటి కోసం ఏం చేస్తానో తెలుసా..?రైల్ లాజిస్టిక్స్ ద్వారా సుస్థిరతభారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా మారుతి సుజుకి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు దాని సరఫరా గొలుసును ఆప్టిమైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త రైల్వే సైడింగ్ వాహనాల డిస్పాచ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని కంపెనీ భావిస్తుంది. ఇది రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని చెప్పింది.రైల్వే సైడింగ్ ముఖ్య లక్షణాలు46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ను పూర్తిగా విద్యుదీకరణ చేశారు. నాలుగు ఫుల్ లెంత్ ట్రాక్లు, ఒక ఇంజిన్ ఎస్కేప్ ట్రాక్ ఉన్నాయి.4,50,000 వాహనాల వార్షిక డిస్పాచ్ సామర్థ్యం కలిగి ఉంది. నిర్మాణాత్మక మల్టీ మోడల్ కనెక్టివిటీ విధానం ద్వారా భారతదేశం అంతటా 380 నగరాలకు సేవలు అందిస్తుంది.ముంద్రా, పిపావావ్తో సహా ఇతర ఓడరేవులతో అనుసంధానం చేశారు. ప్రపంచ మార్కెట్లకు వాహన ఎగుమతులను ఇది క్రమబద్ధీకరిస్తుంది.హెచ్వోఆర్సీ అభివృద్ధికి రూ.325 కోట్లు, అంతర్గత రైల్వే యార్డు మౌలిక సదుపాయాలకు రూ.127 కోట్లు కేటాయించారు.ఈ కొత్త వ్యవస్థ ఏటా 1,75,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది. 60 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేస్తుందని అంచనా. -
లగ్జరీ కారు .. స్పెషల్ గేరు..
లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా. అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్ ఎడిషన్ల బాట పట్టాయి. హెచ్ఎన్ఐల జోరు .. భారత్లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్లో స్పెషల్ ఎడిషన్లు, హైపర్ కస్టమైజ్డ్ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్ బెంజ్ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్ ఎండ్ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్లో భాగమైన జేఎల్ఆర్ కొత్తగా డిఫెండర్ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్ డిఫెండర్కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్ మోడల్తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్క్లూజివ్ పెయింట్ షేడ్స్, కస్టమైజ్డ్ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్–బెంజ్ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్ పెడుతోంది. తమ టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్–పర్సనలైజేషన్ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్ ఎడిషన్లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్ను అందిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. కలెక్టర్స్ ఎడిషన్ను బెంగళూరులోని మెర్సిడెస్–బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది. మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్ రోవర్ రణ్థంబోర్ ప్రత్యేక ఎడిషన్ రేటు రెగ్యులర్ వెర్షన్తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్ ఎస్ జాన్ కూపర్ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.ఉభయతారకంగా .. వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్తో ఈ మోడల్స్ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్ఆర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్ ఎడిషన్లు, స్పెషల్ ఎడిషన్ మోడల్స్ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. సదరు మోడల్ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ ఆదాయాలపరంగా బాగుంటోంది.కొన్ని కార్లు.. → డిఫెండర్ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు → రేంజ్రోవర్ రణ్థంబోర్ రేటు రూ. 4.98 కోట్లు → మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ఎల్ 680 మోనోగ్రామ్ సిరీస్ ధర రూ. 4.2 కోట్లు → ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ రూ. 4.3 కోట్లు -
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే ‘జిమ్నీ’.. లక్ష మంది కొనేశారు..
ఆఫ్-రోడ్లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్తో వచ్చింది. ఈ ఎస్యూవీ భారత మార్కెట్లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్పీ పవర్ని, 134 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. -
మెర్సిడెస్ బెంజ్ కలెక్టర్స్ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే..
లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్ ఎడిషన్’ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్ ఇండియా ఎక్స్–షోరూం). ప్రస్తుత టాప్ ఎండ్ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా (ఎంబీఆర్డీఐ) భాగస్వామ్యంతో భారత్లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్–పర్సనలైజేషన్ ట్రెండ్ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.స్పేర్ వీల్ కవర్పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్ ఉంటుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ను సూచిస్తుంది.బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్తో ఇంటీరియర్ ఉంటుంది. -
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్వాచీలు, వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
టీవీఎస్ కొత్త మోటార్ సైకిల్ ఆవిష్కరణ.. ధర ఎంతంటే..
టీవీఎస్ సంస్థ అపాచీ కొత్త మోడల్ను ఆవిష్కరించింది. తాజాగా 2025 అపాచీ ఆర్టీఆర్ 200 4వీను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీడీ2బీ ఉద్గార ప్రమాణాలతో ఈ మోడల్ను లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనం ధర రూ.1,53,990(ఎక్స్షోరూమ్)గా నిర్ణయించినట్లు పేర్కొంది. వేరియంట్ల వారీగా ధరల్లో హెచ్చతగ్గులుంటాయని చెప్పింది.ఈ అపాచీ మోడల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. అద్భుతమైన పనితీరు కోసం భద్రతా ఫీచర్లను సైతం మెరుగుపరిచినట్లు చెప్పింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: చైనా పప్పులేం ఉడకవు..ఓబీడీ2బీ కాంప్లయన్స్: కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.37ఎంఎం అప్సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ సస్పెన్షన్: హ్యాండ్లింగ్, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.హైడ్రోఫార్మింగ్ హ్యాండిల్ బార్: నియంత్రణను మెరుగుపరుస్తుంది. వైబ్రేషన్ను తగ్గిస్తుంది.డ్యూయల్ ఛానల్ ఏబీఎస్: బ్రేకింగ్ భద్రతను అందిస్తుంది.3 రైడ్ మోడ్స్: అర్బన్, స్పోర్ట్, రెయిన్.స్లిప్పర్ క్లచ్: స్మూత్ గేర్ షిఫ్ట్ల కోసం ఉపయోగపడుతుంది. -
‘మ్యాగ్నెట్ల’ కొరత ప్రభావం శూన్యం
ప్రస్తుతానికి తమ వాహనాల ఉత్పత్తిపై రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరత ప్రభావమేమీ లేదని మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలన్నీ ప్రణాళికలకు అనుగుణంగా యథాప్రకారమే కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లను దిగుమతి చేసుకునేందుకు చైనా ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే రాబోయే నెలల్లో కూడా తయారీకి ఎలాంటి సమస్య ఉండబోదని వివరించారు.ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు పరిశ్రమ వర్గాల ప్రకారం పలు దేశీ సరఫరా సంస్థలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతికి చైనా ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు రాకపోవడంతో ఈ విషయంలో సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రాసెసింగ్లో అంతర్జాతీయంగా చైనాకు 90 శాతం వాటా ఉంది. వీటిని ఎగుమతి చేయడంపై ఏప్రిల్ 4 నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్తో పాటు వాటికి సంబంధించిన మ్యాగ్నెట్ల ఎగుమతి కోసం ప్రత్యేక లైసైన్సు తీసుకోవాలని నిర్దేశించింది. -
టూ–వీలర్ల విక్రయాలు జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ద్విచక్ర వాహన విక్రయాలు గణనీయంగా పెరగనున్నాయి. కొవిడ్ పూర్వ స్థాయికి మించి 8–9 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, సానుకూల వర్షపాతం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. కేర్ఎడ్జ్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.దేశీయ టూ–వీలర్ పరిశ్రమ 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 8 శాతం, 10 శాతం, 11 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. ఎగుమతులు 21 శాతం మేర పుంజుకోవడంతో పాటు దేశీయంగా అమ్మకాలు 9 శాతం వృద్ధి చెందడంతో 2025 ఆర్థిక సంవత్సరంలో విక్రయాల పరిమాణం గణనీయంగా పెరిగిందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. ద్రవ్యోల్బణ భారం, అధిక వడ్డీ రేట్లు, కరెన్సీ కష్టాలు మొదలైన సమస్యలతో సతమతమైన కీలక మార్కెట్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో ఎగుమతులు కోలుకున్నాయని వివరించింది. ఇక దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ స్థిరంగా కొనసాగడం సానుకూలాంశాలుగా నిల్చాయని పేర్కొంది.‘గత ఆర్థిక సంవత్సర పనితీరును కొనసాగిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ద్విచక్ర వాహనాల విక్రయాలు పటిష్టంగా వృద్ధి చెందనున్నాయి. అధిక బేస్తో పాటు నిర్దిష్ట నిబంధనలను పాటించే క్రమంలో 1–2 శాతం మేర ధరలు పెరిగినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరంలో కూడా పరిశ్రమ 8–9 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉంది‘ అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. ఎగుమతుల పరిమాణం 12–14 శాతం, దేశీయంగా అమ్మకాలు స్థిరంగా 6–8 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడగలదని సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ గోస్వామి తెలిపారు.ఇదీ చదవండి: భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు ఇతరత్రా ముఖ్యాంశాలు..ఎగుమతులకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటం, రుతుపవనాలు..ఆదాయాలపై గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం మొదలైనవి ద్విచక్ర వాహనాల విక్రయాలకు సానుకూలాంశాలుగా నిలవనున్నాయి. ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ 100 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేటును తగ్గించడం వల్ల అఫోర్డబిలిటీ పెరుగుతుంది. డిమాండ్కి ఊతం లభిస్తుంది.అధిక బేస్ వల్ల దేశీయంగా టూ–వీలర్ల అమ్మకాల వృద్ధి ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చు. కానీ ఎగుమతులు పటిష్టంగా ఉండటం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటమనేది మొత్తం పరిశ్రమ స్థాయిలో అమ్మకాల పరిమాణం నిలకడగా పెరిగేందుకు దోహదపడుతుంది.ఎగ్జిక్యూటివ్, ప్రీమియం మోటార్సైకిళ్ల సెగ్మెంటు .. ద్విచక్ర వాహనాల విక్రయ వృద్ధికి దోహదపడతాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు డిమాండ్ పెరుగుతుండటం వల్ల ద్విచక్ర వాహనాల విక్రయాల పరిమాణం మొత్తం మీద పెరిగింది.2023 ఆర్థిక సంవత్సరంలో ఈ–టూవీలర్ల అమ్మకాలు 7.8 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టూ–వీలర్ల విక్రయాల్లో 1.78 శాతం వాటా ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా 4.38 శాతానికి పెరిగింది. తక్కువ బేస్ ఎఫెక్ట్ వల్ల వార్షికంగా 180 శాతం వృద్ధి చెందింది. ఆ తర్వాత సంవత్సరాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 29 శాతం పెరగ్గా, 2025లో 19 శాతం వృద్ధితో 12 లక్షల యూనిట్లకు అమ్మకాలు చేరాయి. -
అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లు
అధిక ధరలు మార్కెట్ అస్థిరతకు కారణం అవుతుండడంతో చైనా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగం ఒడిదొడుకులకు లోనవుతోంది. దాంతో చైనా ఈవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీవైడీ ధరల తగ్గింపు నిర్ణయాలు చేపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది మార్కెట్ స్థిరత్వం, పోటీతత్వంపై ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఇదిలాఉండగా, చైనా ప్రభుత్వం రంగంలోకి దిగి స్థానిక కంపెనీలు స్వీయ నియంత్రణ పాటించాలని, తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని కోరింది.ధరల యుద్ధానికి మూలంఈ పరిణామాలకు కారణం డిమాండ్ కంటే అధిక సరఫరా ఉండడమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనా తయారీదారులు మార్కెట్లోని డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ తగ్గడంతో కంపెనీలు అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దాంతో చేసేదేమిలేక ధరల తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రధాన బ్రాండ్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, చిన్న కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీవైడీ మే చివరి నుంచి ఇప్పటివరకు 21.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది.ప్రభుత్వ జోక్యంమితిమీరిన రాయితీల వల్ల ‘మేడ్-ఇన్-చైనా’ ఎలక్ట్రిక్ వాహనాల దీర్ఘకాలిక ప్రతిష్ఠ మసకబారుతుందని అధికారులు భయపడుతున్నారు. భారీగా ధరల తగ్గింపు వల్ల చైనా బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులు ఉత్పత్తుల నాణ్యత, విలువను ప్రశ్నించేలా చేస్తుంది. దీన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం వాహన తయారీదారులకు ధరల క్రమశిక్షణను పాటించాలని పిలుపునిచ్చింది. పరిశ్రమను దెబ్బతీసే పద్ధతులను నివారించాలని కోరింది. తక్కువ ధరకు తమ ఉత్పత్తులు అమ్ముకోవద్దని వేడుకుంది.ఇదీ చదవండి: బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతుఎగుమతులపై ప్రభావందేశీయ సవాళ్లకు అతీతంగా చైనీస్ ఈవీ తయారీదారులు గ్లోబల్ మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నారు. అయితే స్వదేశంలో అస్తవ్యస్తమైన సప్లై-చెయిన్ వల్ల ఏర్పడిన ధరల యుద్ధం విదేశాల్లో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ పట్టును కోరుకునే కంపెనీలు పోటీ ధరలతో స్థిరమైన లాభదాయకతను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యాన్ని పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. -
టాటా కారు ఓనర్లకు గుడ్న్యూస్..
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ తమ కస్టమర్ల కోసం దేశవ్యాప్తంగా మాన్సూన్ చెకప్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 6న ప్రారంభమైన ఈ క్యాంపులు 20వ తారీఖు వరకు కొనసాగుతాయని వివరించింది. 500 నగరాల్లో 1,090 ఆథరైజ్డ్ వర్క్షాప్లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.ఈ క్యాంపులో భాగంగా వాహనంలోని ముప్ఫై కీలక పాయింట్లను పరీక్షించే సమగ్ర హెల్త్ చెకప్ సేవలు పొందవచ్చని వివరించింది. కార్ టాప్ వాష్, ఒరిజినల్ స్పేర్ పార్టులు, ఇంజిన్ ఆయిల్, యాక్సెసరీలు, లేబర్ చార్జీలపై ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చని టాటా మోటార్స్ తెలిపింది.టాటా మోటార్స్ ఇండియా దేశంలో కర్వ్, టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ తో సహా ఏడు ఐసీఈ కార్లను అందిస్తోంది. అలాగే కర్వ్.ఈవీ, నెక్సాన్.ఈవీ, పంచ్.ఈవీ, టియాగో.ఈవీ, టిగోర్.ఈవీ, ఇటీవల లాంచ్ చేసిన టాటా హారియర్.ఈవీ వంటి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా బ్రాండ్ జాబితాలో ఉన్నాయి. -
టాటా హారియర్ ఈవీ రెడీ
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరింతగా విస్తరించే క్రమంలో హారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజ్ ఉంటుంది. జూలై 2 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. లైఫ్టైమ్ వారంటీ గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ఆటో పార్క్ అసిస్ట్, 6 టెరెయిన్ మోడ్లు, 55 పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ కస్టమర్లకు ఇది ఆకర్షణీయంగా ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ప్రతి నెలా 25,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీమియం ఎస్యూవీ విభాగంలో హారియర్, సఫారీ వాహనాలతో టాటా మోటార్స్కి సుమారు 25 శాతం మార్కెట్ వాటా ఉంది.ఎస్యూవీ సెగ్మెంట్ ఏటా గణనీయంగా వృద్ధి చెందుతోందని, దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ప్రస్తుతం 54 శాతం వాటా దక్కించుకుందని చంద్ర చెప్పారు. చార్జింగ్ వేగం కూడా గణనీయంగా మెరుగుపడటంతో, సంప్రదాయ వాహనాలకు దీటుగా, మెరుగైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. -
భారత్లో టెస్లా తయారీ లేనట్లే!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.కొత్త ఈవీ పాలసీభారత్లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.భారత్లో టెస్లా ప్రణాళికలుటెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్లో రెండో షోరూమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!ట్రంప్కు భయపడ్డారా..?ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్లో తయారీ సాగిస్తున్న యాపిల్ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్మస్క్ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్ చేయడం ఎందుకనే భావనతో భారత్లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి. -
నెలలో 22,315 యూనిట్లు సరఫరా
భారత ఆటోమోటివ్ మార్కెట్లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడాకారెన్స్ క్లావిస్కియా లైనప్లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్ గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు. -
ల్యాండ్ రోవర్ మసారా ఎడిషన్: 12 మందికి మాత్రమే..
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్ 'రేంజ్ రోవర్ ఎస్వీ మసారా'ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.99 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే దీనిని 12 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.రేంజ్ రోవర్ ఎస్వీ మసారా.. చూడటానికి కొంత భిన్నంగా ఉంటుంది. మసారా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఇది భారతీయ సంస్కృతితో దాని లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. బానెట్, టెయిల్గేట్పై రేంజ్ రోవర్ అక్షరాలు కనిపిస్తాయి. 23 ఇంచెస్ ఆబ్లివియన్ 1077 డైమండ్ టర్న్డ్ వీల్స్పై గ్లోస్ డార్క్ గ్రే కాంట్రాస్ట్ & బ్లాక్ కాలిపర్స్ మొదలైనవి ఇందులో చూడవచ్చు.క్యాబిన్ అద్భుతమైన డ్యూయల్ టోన్ థీమ్ కలిగి ఉంది. ఇందులో పూర్తిగా వాలుగా ఉండే సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లాయబుల్ కప్హోల్డర్లు, ఎస్వీ ఎచెడ్ గ్లాస్వేర్తో కూడిన రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ ఉన్నాయి. వీటితో పాటు 13.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ & పవర్డ్ టెయిల్గేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.రేంజ్ రోవర్ ఎస్వీ మసారా ఎడిషన్ 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 615 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.ఇదీ చదవండి: గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే? -
సుజుకి ఈ-యాక్సెస్ vs హోండా యాక్టివా ఈ: రేంజ్ & ధరలు
సుజుకి మోటార్సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఈ-యాక్సెస్'ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కథనంలో ఈ రెండు స్కూటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.స్పెసిఫికేషన్స్రెండు స్కూటర్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్లు. కాబట్టి ఇవి చాలా సింపుల్ డిజైన్ పొందుతాయి. యాక్టివా ఈ స్కూటర్ 6 కిలోవాట్ మోటార్ మోటారుతో శక్తినిస్తుంది. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం.సుజుకి ఈ యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.072 కిలోవాట్ లిథియం ఫాస్పెట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 కిమీ/గం.ఫీచర్స్సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్.. ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 765 మిమీ ఎత్తైన సీటు, 122 కేజీల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బ్లూటూత్/యాప్ కనెక్టివిటీతో పాటు 4.2 ఇంచెస్ TFT LCD కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.హోండా యాక్టివా ఈ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ TFT స్క్రీన్తో పాటు ఆప్షనల్ హోండా రోడ్ సింక్ యాప్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్లు, రివర్స్ మోడ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.ఛార్జింగ్ డీటైల్స్ఛార్జింగ్ విషయంలో మాత్రం రెండు స్కూటర్లు భిన్నంగా ఉంటాయి. పోర్టబుల్ ఛార్జర్ని ఉపయోగించి, సుజుకి ఇ-యాక్సెస్ను 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం, 6 గంటల 42 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం & 2 గంటల 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా'హోండా యాక్టివా ఈ'లో బ్యాటరీని సబ్స్క్రిప్షన్గా అందిస్తుంది. దీనికి ఛార్జ్ చేయదగిన బ్యాటరీలు లేవు కాబట్టి, మార్చుకోగల బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక ప్లాన్ నెలవారీ అద్దె రూ. 1,999 + GSTతో వస్తుంది, దీని ద్వారా 35 kWh ఎనర్జీ లభిస్తుంది. ఈ స్కూటర్ రోజుకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.ధరలుహోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, రోడ్ సింక్. వీటి ధరలు వరుసగా రూ. 1.17 లక్షలు, రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ.. సుజుకి ఈ-యాక్సెస్ ధరలు ఇంకా వెల్లడించలేదు.అయితే దీని ధర రూ. 1.0 నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. -
మహీంద్రా థార్ రాక్స్: డాల్బీ అట్మాస్తో తొలి ఎస్యూవీ ఇదే..
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్యూవీగా ఇది నిలిచింది. మహీంద్రా, డాల్బీ ల్యాబొరేటరీస్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ఈ అద్భుతమైన ఫీచర్ను థార్ రాక్స్ ఏఎక్స్7ఎల్ వేరియంట్కు తీసుకువచ్చింది. సాహసోపేతమైన థార్ రాక్స్ డ్రైవింగ్కు డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ తోడై థ్రిల్లింగ్ అనుభవాన్ని జోడిస్తుంది.ఈ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో గానా యాప్ అనుసంధానం చేశారు. దీని ద్వారా వినియోగదారులు పాటలను నిరంతరాయంగా వినవచ్చు. ప్రీమియం 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంతో నాలుగు ఛానెళ్ల లీనమయ్యే ఆడియో డాల్బీ అట్మాస్ సమకూర్చింది.థార్ రాక్స్ భారత విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన దీని ఉత్పత్తిని మహీంద్రా గణనీయంగా పెంచింది. థార్ రాక్స్, మూడు డోర్ల థార్ కలిపి 2.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేశాయి. ఉత్పత్తి పెరగడం వల్ల థార్ రాక్స్ వేచి ఉండే సమయం 18 నెలల నుండి గరిష్టంగా ఆరు నెలలకు తగ్గింది.థార్ రాక్స్ ధరలు రూ.12.99 లక్షల నుండి రూ.23.39 లక్షల వరకు ఉంటాయి (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు). ఇది రెండు శక్తివంతమైన పవర్ట్రైన్ ఎంపికలు అందిస్తుంది: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ 161.8బిహెచ్పి శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ 176.8బిహెచ్పి శక్తి 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.డీజిల్ ఇంజిన్ కూడా రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభ్యమవుతోంది. మాన్యువల్ 152.1 బీహెచ్పీ శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఆటోమేటిక్ రెండు ట్యూన్లలో వస్తుంది. ఒకటి మాన్యువల్ శక్తిని ఇస్తే, ఇంకొకటి 174.8 బీహెచ్పీ శక్తి 370ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు కేవలం ఆర్డబ్ల్యూడితో వస్తే, డీజిల్ వినియోగదారులు ఆర్డబ్ల్యూడీ, ఫోర్డబ్ల్యూడీలను ఎంపిక చేసుకోవచ్చు. -
2025 జుపీటర్: రూ.88942 మాత్రమే!
టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో తన అప్డేట్ జుపీటర్ 125 డీటీ ఎస్ఎక్స్సీని లాంచ్ చేసింది. దీని ధర రూ. 88,942 (ఎక్స్ షోరూమ్). ఈ వేరియంట్ రిఫ్రెష్ డిజైన్, కొత్త స్టైలింగ్ పొందుతుంది. ఐవరీ బ్రౌన్ అండ్ ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలలో లభించే ఈ స్కూటర్.. డ్యూయల్ టోన్ ప్యానెల్లు, బాడీ కలర్ రియర్ గ్రాబ్ రైల్ పొందుతుంది.టీవీఎస్ స్మార్ట్కనెక్ట్ ఫీచర్ కలిగిన ఈ స్కూటర్ కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, వాహన ట్రాకింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ అదే 124.8సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.7 Bhp పవర్, 11.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: దేశమంతా ఒకే ధరకు ఈ కారు! -
భారత్కు బై చెప్పం..!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్స్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తోందంటూ వస్తున్న వార్తలను కంపెనీ ఇండియా ఎండీ సౌరభ్ వత్స ఖండించారు. అలాంటి యోచనేదీ లేదని స్పష్టం చేశారు. అంతేగాకుండా 2027 నాటికి మరో మూడు కొత్త కార్లను ప్రవేశపెట్టబోతున్నామని, ఈ ఏడాది ఇంకో 20 డీలర్లను నియమించుకోబోతున్నామని వత్స తెలిపారు. భారత్లో జాయింట్ వెంచర్ సంస్థ రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా (ఆర్ఎన్ఏఐపీఎల్)లో నిస్సాన్కి ఉన్న 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రెనో మార్చి 31న ప్రకటించింది. దీంతో నిస్సాన్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వత్స వివరణ ఇచ్చారు. గత 60 ఏళ్లుగా తాము దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, తమ తయారీ, కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు మొదలైనవన్నీ యథాప్రకారంగానే అమలవుతాయని తెప్పారు. 2026 మొదటి త్రైమాసికంలో సెవెన్ సీటర్ బీ–సెగ్మెంట్ ఎంపీవీని, ఆ తర్వాత 2027 తొలి నాళ్లలో ఫైవ్.. సెవెన్ సీటర్ సీ–ఎస్యూవీని ప్రవేశపెట్టనున్నట్లు వత్స తెలిపారు. కొందరు డీలర్లు తప్పుకోవడంతో ప్రస్తుతం డీలర్íÙప్ల సంఖ్య 160కి పరిమితమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి దీన్ని 180కి పెంచుకోనున్నామని వత్స వివరించారు. మరోవైపు, ప్రభుత్వ ఆమోదం పొందిన సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్తో కూడా తమ మాగ్నైట్ ఎస్యూవీ లభిస్తుందని చెప్పారు. అదనంగా రూ. 74,999 చెల్లిస్తే ఈ సదుపాయాన్ని పొందవచ్చన్నారు. తొలి దశలో ఢిల్లీ–ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ తదితర 7 రాష్ట్రాల్లోని ఆథరైజ్డ్ డీలర్íÙప్ల ద్వారా సీఎన్జీ కిట్ ఇన్స్టాలేషన్ను ఆర్డరు చేయొచ్చని, రెండో దశలో దీన్ని మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. -
దేశమంతా ఒకే ధరకు ఈ కారు!
బీఎండబ్ల్యూ ఇండియా తన ఎలక్ట్రిక్ సెడాన్ ఐ7 కారును దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎక్స్-షోరూమ్ ధర(రూ.2.05 కోట్లు)కు అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు, జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్(రాష్ట్రాల ఆదాయాల భర్తీ కోసం ఉద్దేశించినది) ఉంటాయి.కొత్త ధరల ప్రకారం, కస్టమర్లు బీఎండబ్ల్యూ ఐ7కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీయే చెల్లిస్తుంది. కస్టమర్లు బీమా, టీసీఎస్(మూలం వద్దే పన్ను వసూలు), స్థానిక సెస్లను మాత్రమే చెల్లించాలి. ‘‘రిజిస్ట్రేషన్ పన్నులు ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితి కొనుగోలుదారుల్లో అనిశ్చితిని సృష్టిస్తుంది. దీన్ని అధిగమించేందుకు దేశమంతా ఒకే ధరకు వాహనాన్ని అందిస్తున్నాము’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పావా తెలిపారు.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా.. మూడు లక్షల మంది కొనేశారుకర్ణాటక, మహారాష్ట్రలో లేదా మరే ఇతర రాష్ట్రంలో కస్టమర్ ఉన్నా, రిజిస్ట్రేషన్ పన్నులో ఉన్న తేడాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే ధరకు వాహనం లభిస్తుందన్నారు. కస్టమర్ కేంద్రీకృత సేవలపై మరింత దృష్టి సారించడంతో పాటు ఎలక్ట్రిక్ మొబిలిటీ వినియోగాన్ని ప్రోత్సహించడం తమ ముఖ్య ఉద్దేశమని పావా పేర్కొన్నారు. -
జర్మన్ బ్రాండ్తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత 'నీరజ్ చోప్రా'.. జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం 'ఆడి ఇండియా'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని జేఎస్డబ్ల్యు స్పోర్ట్స్ కూడా ధ్రువీకరించింది."నీరజ్ చోప్రా శ్రేష్ఠతకు మాత్రమే కాదు, దృఢ సంకల్పం, ముందుకు సాగడానికి చిహ్నం. చోప్రా దృష్టి, వేగం, అసమానమైన పనితీరు తమ బ్రాండ్తో సంపూర్ణంగా సరిపోతాయి'' అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా.. మూడు లక్షల మంది కొనేశారుఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ.. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024లో కంపెనీ భారతీయ విఫణిలో లక్ష కార్లను విక్రయించింది. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న కంపెనీ ఇటీవల.. ఆర్ఎస్ క్యూ8 పర్ఫామెన్స్ కారును రూ. 2.49 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది.A partnership defined by grit, passion, and performance. We’re super excited to have Neeraj Chopra, our Olympic champion, associated with the Audi India family. Can’t wait for the ride ahead! #AudiIndia #NeerajChopra pic.twitter.com/Oi8aIDczMR— Audi India (@AudiIN) May 26, 2025 -
పేరుకు టాప్ కంపెనీ.. 3,000 మందికి లేఆఫ్స్?
స్వీడన్కు చెందిన వోల్వో కార్స్ ఖర్చు ఆదా ప్రణాళికలో భాగంగా సుమారు 3,000 ఆఫీస్ ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ పెరుగుతున్న ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బలహీనమైన డిమాండ్, వాణిజ్య అనిశ్చితిని ఎదుర్కొంటున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.కంపెనీ మాజీ సీఈఓ హకన్ శామ్యూల్సన్ తిరిగి వోల్వోకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే ఈమేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ చేసే దాదాపు 18 బిలియన్ స్వీడిష్ క్రౌన్లు (సుమారు 1.9 బిలియన్ డాలర్లు) తగ్గించే ప్రణాళికలను సీఈఓ ఏప్రిల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 40 శాతం వాటా కలిగిన వైట్ కాలర్ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లు పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు యూరప్లో 29,000 మంది, ఆసియాలో 10,000 మంది, అమెరికాలో 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన లేఆఫ్స్ రీసెర్చ్, హ్యూమన్ రిసోర్సెస్, కమ్యూనికేషన్ వంటి వివిధ విభాగాల్లో ఉంటాయని శామ్యూల్సన్ తెలిపారు. వోల్వో కార్ కొత్త ఫైనాన్స్ చీఫ్ ఫ్రెడ్రిక్ హాన్సన్ మాట్లాడుతూ.. ఈ లేఆఫ్స్ వల్ల వ్యాపారం తాత్కాలికంగా ప్రభావితం చెందినా భవిష్యత్తులో మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఉద్యోగ తొలగింపులు ఎక్కువగా స్వీడన్లోని గోథెన్ బర్గ్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: ముఖేశ్ భాయ్ ట్రేడింగ్ చేశారా..?వోల్వో కార్స్ ప్రకారం.. దాదాపు 15% కార్యాలయ ఉద్యోగులను తొలగించనున్నారు. ఈ చర్య వల్ల కంపెనీపై 1.5 బిలియన్ క్రౌన్ల భారం పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఇది దాని నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా చేయడానికి సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది. -
ఈ బైక్ కొనుగోలుపై రూ. 40వేలు డిస్కౌంట్
దేశీయ మార్కెట్లో ప్రతి నెల ఏదో ఒక కంపెనీ ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కవాసకి తన జెడ్ఎక్స్-4ఆర్ బైకు కొనుగోలుపై రూ. 40000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపులు మే నెలాఖరు వరకు మాత్రమే.కవాసకి రూ. 40000 తగ్గింపు ప్రకటించిన తరువాత.. దీనిని రూ.8.39 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ అసలు ధర రూ. 8.79 లక్షలు (తగ్గింపుకు ముందు). జెడ్ఎక్స్-4ఆర్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ ఫోర్ ఇంజిన్తో 77 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. -
ధర ఎక్కువైనా.. మూడు లక్షల మంది కొనేశారు
టయోటా కంపెనీ భారతదేశంలో ఫార్చ్యూనర్ కార్లను ఏకంగా మూడు లక్షల యూనిట్లను విక్రయించింది. 2009లో ప్రారంభమైన ఈ కారు ఆ తరువాత కాలంలోనే అనేక అప్డేట్స్ పొందుతూ వచ్చింది. ఇందులో భాగంగానే.. 2021లో లెజెండర్ వేరియంట్ విడుదలైంది. అంతకంటే ముందు ఫేస్లిఫ్ట్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యాయి.ఫార్చ్యూనర్ ప్రస్తుతం 2.8 లీటర్ డీజిల్, 2.7 లీటర్ పెట్రోల్ అనే రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతాయి. పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, జేబీఎల్ స్పీకర్లు, డ్రైవింగ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఫార్చ్యూనర్ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..టయోటా ఫార్చ్యూనర్ ధరల విషయానికి వస్తే.. పెట్రోల్ 4x2 AT వేరియంట్ ధర రూ. 35.37 లక్షలు. డీజిల్ వేరియంట్ ధర 4x2 MT ధర రూ. 36.33 లక్షల నుంచి రూ. 51.94 లక్షల (టాప్-స్పెక్ 4x4 AT GR-S వెర్షన్) వరకు ఉంటుంది. అదే సమయంలో.. లెజెండర్ వేరియంట్ ధర రూ. 44.11 లక్షల నుంచి రూ. 48.09 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. -
అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
దశాబ్దం క్రితం ఇండియన్ మార్కెట్లో తిరుగులేని కారుగా ప్రసిద్ధి చెందిన హిందూస్తాన్ అంబాసిడర్.. తరువాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కగా కొన్ని కార్లు కనిపించినప్పటికీ.. కంపెనీ మాత్రమే ఉత్పత్తిని ఆపేసి చాలాకాలం అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఈ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేయనున్నట్లు, దీనికి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అంబాసిడర్ 2.0 పేరుతో మళ్ళీ ఆ కారు మార్కెట్లో తిరిగి వస్తుందని సమాచారం. ఇది మొదట్లో ఉన్న కారు కంటే కూడా చాలా అద్భుతంగా.. నేటి కాలానికి తగిన విధంగా ఉండేలా సంస్థ రూపొందించే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిందూస్తాన్ అంబాసిడర్ కారు.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బోల్డ్ గ్రిల్ కలిగి వెనుక భాగంలో లేటెస్ట్ స్టైల్ టెయిల్ లైట్స్ పొందుతాయి. ఇది క్లాసీ డిజైన్ కలిగి.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కారు లోపల కూడా ప్రీమియం సీట్లు, పెద్ద టచ్స్క్రీన్ డిస్ప్లే, డిజిటల్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటివి కూడా ఉండనున్నాయి. అయితే డిజైన్, ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..అంబాసిడర్ 2.0 కారు 1.5 లీటర్ లేదా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రావచ్చు. ఆ తరువాత కాలంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలను పొందే అవకాశం ఉంది. ఏబీఎస్, ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి కూడా ఈ కారులో సేఫ్టీ ఫీచర్లుగా ఉండనున్నట్లు సమాచారం. -
సరికొత్త ప్లాట్ఫామ్: రూ.1 లక్ష లోపే బైక్!
ఎలక్ట్రిక్ మోటర్సైకిళ్ల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్తగా ఓ100 (ఓ హండ్రెడ్) పేరిట రెండో ప్లాట్ఫాంపై కసరత్తు చేస్తోంది. రూ.1 లక్ష లోపు ధర ఉండే మోటర్ సైకిల్స్ తయారీ కోసం దీన్ని ఉపయోగించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు.ఈ ప్లాట్ఫాంపై రూపొందించిన వాహనాలను ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆవిష్కరించనున్నట్లు వివరించారు. దేశీ టూ వీలర్ల మార్కెట్లో దాదాపు 30 శాతం వాటా ఉంటున్న 100 సీసీ వాహనాలకు సరిసమాన సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు మధుమిత అగర్వాల్ పేర్కొన్నారు. -
షియోమీ మరో ఎలక్ట్రిక్ కారు: జూలైలో లాంచ్!
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారు అయిన షియోమీ (Xiaomi) తన 'వైయూ7' ఎలక్ట్రిక్ కారు అమ్మకాలను జూలైలో ప్రారంభించనున్నట్లు.. కంపెనీ సీఈఓ 'లీ జున్' పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్ చైనాలో టెస్లా బెస్ట్ సెల్లింగ్ కారు 'వై'కి ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది.చైనా సంస్థ 'షియోమీ' ఇప్పటికే తన లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ 'ఎస్యూ7' (SU7) అల్ట్రా కారును కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కారును తీసుకురావడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త వైయూ7 ఎలక్ట్రిక్ కారు.. ఒక సింగిల్ ఛార్జితో 835 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని ధర 60,000 - 70,000 యువాన్ల (సుమారు రూ.8 లక్షలు) వరకు ఉండే అవకాశం ఉంది. అయితే అధికారిక ధరలు జులైలో వెల్లడవుతాయి. ఈ కారు డిజైన్, ఇతర ఫీచర్స్ అన్నీ కూడా త్వరలోనే వెల్లడవుతాయి.ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారుషియోమీ లాంచ్ చేసిన ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 2,58,000 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందినట్లు తెలుస్తోంది. ఇది స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది. -
ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) డేటా ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 'మహారాష్ట్ర' మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ముందుంది.SIAM డేటా ప్రకారం.. 2024-25లో మహారాష్ట్రలో ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు 5,06,254 యూనిట్లు (11.8 శాతం)గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 4,55,530 యూనిట్లు (10.6 శాతం), గుజరాత్ 3,54,054 యూనిట్లు (8.2 శాతం) అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత నాల్గవ స్థానంలో కర్ణాటక 3,09,464 యూనిట్లతో (7.2 శాతం), హర్యానా 2,94,331 యూనిట్లతో (6.8 శాతం) ఐదవ స్థానంలో ఉన్నాయి.ద్విచక్ర వాహన విభాగంలో.. ఉత్తరప్రదేశ్ 28,43,410 యూనిట్ల అమ్మకాలతో (14.5 శాతం వాటా) అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 20,91,250 యూనిట్లతో (10.7 శాతం), తమిళనాడు 14,81,511 యూనిట్లతో (7.6 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో కర్ణాటక (12,94,582 యూనిట్ల), గుజరాత్ (12,90,588 యూనిట్లు) ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీత్రిచక్ర వాహనాల విభాగంలో.. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 93,865 యూనిట్లు (12.7 శాతం) అమ్మకాలు జరపగా, గుజరాత్ 83,947 యూనిట్లు (11.3 శాతం), మహారాష్ట్ర 83,718 యూనిట్లు (11.3 శాతం) అమ్మకాలు జరిపాయని డేటా తెలిపింది. కర్ణాటక 70,417 యూనిట్లతో (9.5 శాతం) నాల్గవ స్థానంలో, బీహార్ 47,786 యూనిట్లతో (6.4 శాతం) ఐదవ స్థానంలో నిలిచాయి. -
హోండా నుంచి రెండు కొత్త బైకులు
గురుగ్రాం: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన ప్రీమియం పోర్ట్ఫోలియోలో సీబీ750 హార్నెట్, సీబీ1000 హార్నెట్ ఎస్పీ పేర్లతో రెండు మోటార్స్సైకిళ్లను విడుదల చేసింది. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ.8,59,500లు, రూ.12,35,900గా ఉన్నాయి. ఈ రెండు మోడళ్లకు బుకింగ్లు ప్రారంభమయ్యాయి.హోండా సీబీ750 హార్నెట్755సీసీ, సీబీ1000 హార్నెట్ ఎస్పీ 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు కలిగి ఉన్నాయి. ఈ బైకుల్లో 6–స్పీడ్ గేర్బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ ఉంది. అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ –బై –టర్న్ నావిగేషన్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ (హోండా రోడ్సింక్), యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.రెండు బైకుల్లో స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, యూజర్ అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్తో 3 స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సీబీ750 హార్నెట్ బిగ్వింగ్ టాప్లైన్, బిగ్వింగ్ డీలర్షిప్లో అందుబాటులో ఉంచగా, సీబీ 1000 హార్నెట్ ఎస్పీ మాత్రం ప్రత్యేకంగా బిగ్వింగ్ టాప్లైన్ డీలర్íÙప్ల ద్వారా మాత్రమే విక్రయిస్తుంది. -
ఓలా రోడ్స్టర్ ఎక్స్ బైక్ల డెలివరీలు ప్రారంభం
ముంబై: తొలి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 ఆఫర్తో రోడ్స్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో మోటార్ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ‘‘మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించే క్రమంలో ‘రోడ్స్టర్ ఎక్స్’ అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు. ఈ డెలివరీతో ద్విచక్రవాహన కేటగిరిలో ఈవీ సామర్థ్యం అన్లాక్ అవుతుంది. ఈవీల వినియోగం, మరింత పుంజుకుంటుంది’’ అని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ ఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు.ఓలా కంపెనీ రోడ్స్టర్ ఎక్స్ సిరీస్లో మోటార్సైకిల్స్ను 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో సిరీస్లో 4.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,29,999, మరో వేరియంట్ 9.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోటార్ సైకిల్ ధర రూ.1,99,999గా ఉన్నాయి. -
చిన్న కార్లు.. ప్రీమియం ఫీచర్లు
న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా తగ్గుతున్న చిన్న కార్ల అమ్మకాలను మళ్లీ పెంచుకునేందుకు వాహనాల కంపెనీలు కొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. ప్రీమియం ఫీచర్లను పొందుపరుస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదటిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు బేసిక్ వేరియంట్ కన్నా కాస్తంత ఎక్కువ ఫీచర్లుండే వాహనాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతూ మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.పదేళ్ల క్రితం మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా దాదాపు 50 శాతం వరకు ఉండేది. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఇది 22 శాతానికి పడిపోయింది. ఈ సెగ్మెంట్లో అంతర్గతంగా చూస్తే ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్లపై ప్రతికూల ప్రభావం అత్యధికంగా ఉంది. నియంత్రణలపరంగా వివిధ నిబంధనలను అమలు చేయాల్సి వస్తుండటంతో వీటి ధరలు భారీగా పెరిగిపోవడమే ఇందుకు కొంత కారణంగా నిలుస్తోంది. కఠినతరమైన ఉద్గారాల నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించాల్సి రావడంతో గత కొన్నేళ్లలో చిన్న కార్ల ధరలు దాదాపు రూ. 90,000 వరకు పెరిగాయి. ఇక, కాస్తంత ఎక్కువ వెచ్చించగలిగే స్థోమత ఉన్న వాళ్లు మరింత ప్రీమియంగా అనిపించే, మరిన్ని ఫీచర్లు ఉండే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో రూ. 4.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఖరీదు చేసే ఎంట్రీ స్థాయి హ్యాచ్బ్యాక్ల అమ్మకాల వాటా 10 శాతం లోపునకు క్షీణించగా ప్రీమియం హ్యాచ్బ్యాక్ల వాటా 32 శాతానికి పెరిగినట్లు పరిశ్రమ వర్గాల తెలిపాయి. రూ. 7.5 లక్షల నుంచి రూ. 13.5 లక్షల వరకు ఖరీదు చేసే ప్రీమియం హ్యాచ్బ్యాక్లు దేశీయంగా ఏటా 3,00,000–3,50,000 వరకు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో చిన్న కార్ల వాటా 20–22 శాతం నుంచి పెద్దగా పెరగకపోయినా .. ప్రీమియం మోడల్స్కి డిమాండ్ నెలకొనడంతో మార్కెట్ పరిధి పెరిగి, వాల్యూమ్స్ సైతం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కొత్త ఉత్పత్తుల రాకతో ఈసారి ప్రీమియం హ్యాచ్బ్యాక్ల అమ్మకాలు మరికాస్త మెరుగుపడొచ్చని వివరించాయి. వడ్డీ రేట్ల కోతలతో దన్ను .. ఆదాయ పన్ను శ్లాబ్లలో మార్పులు, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర పరిణామాలనేవి ప్రజలు వినియోగంపై మరికాస్త ఎక్కువ వెచ్చించేందుకు దోహదపడే అవకాశం ఉంది. అయితే, వారు దేనిపై వెచ్చిస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, ఆ తర్వాత రోజుల్లోనూ ఒక్కసారిగా వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. అది ప్రస్తుతం కాస్త తగ్గింది. ఇప్పుడు కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు వెళ్లడంలాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దిగ్గజాలు అంచనా వేస్తున్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్ వృద్ధి 1–2 శాతానికే పరిమితం కాకుండా 5 శాతం మేర నమోదయ్యే అవకాశం ఉందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడమనేది పొదుపునకు కాస్త దారి తీసినా .. ప్రస్తుతం రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల చిన్న కార్ల అమ్మకాలకు పెద్దగా తోడ్పడకపోవచ్చని భార్గవ చెప్పారు. అఫోర్డబిలిటీ సమస్య.. కార్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడమనేది చిన్న కార్ల అమ్మకాలకు సవాలుగా మారుతోందంటూ మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది మొత్తం ఆటో మార్కెట్పై ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘రూ. 10 లక్షల కారు కొనాలంటే కుటుంబ వార్షికాదాయం రూ. 12 లక్షల పైగా ఉంటే తప్ప కొనే పరిస్థితి లేదు. దేశంలో ఆ స్థాయి ఆదాయాలు ఉండే వాళ్లు సుమారు 12 శాతం ఉండొచ్చు. మిగతా 88 శాతం మంది వార్షికాదాయం చాలా తక్కువే ఉంటోంది. ఇలాంటప్పుడు కార్ల మార్కెట్ అధిక వృద్ధి సాధించడం సవాలుగా ఉంటోంది‘ అని ఆయన పేర్కొన్నారు.అఫోర్డబిలిటీ సమస్య కారణంగా 66 శాతం మంది వినియోగదారులకు కార్ల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని వివరించారు. చిన్న కార్లు పుంజుకుంటే తప్ప దేశీ పరిశ్రమ వృద్ధి ఒక మోస్తరు వృద్ధితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుందని భార్గవ తెలిపారు. దేశీయంగా 20 కోట్లకు పైగా కుటుంబాల వార్షికాదాయం రూ. 5,00,000 లోపే ఉంటోందంటూ ఇటీవల ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైన అంశాలు భార్గవ అభిప్రాయానికి ఊతమిస్తున్నాయి. -
ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి.. కొత్త టోల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఏడాదికి ఒకేసారి చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఏడాదికి ఒకేసారి 3000 రూపాయలు టోల్ ఫీజు(యాన్యువల్ ప్యాకేజీ)ను చెల్లించడం ద్వారా.. డ్రైవర్లు/వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, స్టేట్ ఎక్స్ప్రెస్వేలలో అపరిమిత దూరం ప్రయాణించవచ్చు. ప్రతి టోల్ గేటు దగ్గర టోల్ ఫీజును ప్రత్యేకించి చెల్లించాల్సిన అవసరం లేదు.యాన్యువల్ ప్యాకేజీ కోసం.. వాహనదారులకు లేదా డ్రైవర్లకు అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫాస్ట్ట్యాగ్(FASTag)ను రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే జీవితకాల ఫాస్ట్ట్యాగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధానం కింద రూ. 30,000 చెల్లిస్తే.. 15 సంవత్సరాలు రోడ్డుపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని ప్రభుత్వం అమలుచేసే అవకాశం లేదు.ఇదీ చదవండి: కారు కొనడానికి హెలికాఫ్టర్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియోవార్షిక ప్యాకేజ్ మాత్రమే కాకుండా డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది. -
రేంజ్ రోవర్ హిమాలయన్: సరికొత్త స్పెషల్ ఎడిషన్
రేంజ్ రోవర్ రణథంబోర్ స్పెషల్ ఎడిషన్ మంచి ఆదరణ పొందటంతో.. కంపెనీ ఇప్పుడు మరో స్పెషల్ ఎడిషన్ను 'హిమాలయన్' పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది లేత పెయింట్ షేడ్స్ పొందనున్నట్లు సమాచారం.రేంజ్ రోవర్ హిమాలయన్ ఎడిషన్ గురించి కంపెనీ చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ఇప్పుడున్న అన్ని ఎడిషన్స్ కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ను ఎన్ని యూనిట్లకు పరిమితం చేసింది. ఎప్పటి నుంచి విక్రయిస్తుందనే విషయాలను కూడా వెల్లడించలేదు.స్పెషల్ ఎడిషన్లకు డిమాండ్ పెరగడంతో.. హిమాలయన్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు.. జేఎల్ఆర్ గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ లింపెర్ట్ పేర్కొన్నారు. కస్టమర్లు మరిన్ని స్పెషల్ ఎడిషన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము మరో మోడల్ ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాకు సింగర్ ట్వీట్: సాయం చేయండి అంటూ..గతంతో పోలిస్తే.. రేంజ్ రోవర్ కార్లు మంచి అమ్మకాలను పొందుతున్నాయి. గడచిన ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో లగ్జరీ విభాగంలో మూడో స్థానానికి చేరింది. రేంజ్ రోవర్ & రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క స్థానిక అసెంబ్లీ మోడళ్ల అమ్మకాలు 2.5 రెట్లు పెరిగాయి. -
అశోక్ లేలాండ్ బోనస్ షేర్లు
ముంబై: వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతంపైగా జంప్చేసి రూ. 1,246 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,542 కోట్ల నుంచి రూ. 14,696 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 12,037 కోట్ల నుంచి రూ. 13,097 కోట్లకు పెరిగాయి. ఈ నెల(మే) 22న చెల్లించిన(రెండో) రూ. 4.25 డివిడెండ్ను తుది డివిడెండ్గా ప్రకటించింది. మరోవైపు వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో ప్రతీ షేరుకి మరో షేరుని ఉచితంగా జారీ చేయనుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం రూ. 2,696 కోట్ల నుంచి రూ. 3,383 కోట్లకు బలపడింది. మొత్తం ఆదాయం రూ. 45,703 కోట్ల నుంచి రూ. 48,535 కోట్లకు ఎగసింది. వెరసి క్యూ4తోపాటు పూర్తి ఏడాదిలో రికార్డ్ ఆదాయం సాధించినట్లు కంపెనీ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. గతేడాది మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 1,95,093 యూనిట్లను తాకాయి. కంపెనీ ఆర్థికంగా పటిష్టస్థితిలో ఉన్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో షేను అగర్వాల్ పేర్కొన్నారు. 2025 మార్చికల్లా రూ. 4,242 కోట్ల నగదు నిల్వలున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 240 వద్ద ముగిసింది. -
ఈవీలకు ‘హైబ్రిడ్’ దన్ను
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలతో హైబ్రిడ్ వాహనాలు పోటీపడటం కాకుండా వాటి విక్రయాలకు ఇతోధికంగా దోహదపడుతున్నాయని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. ఈ రెండు రకాల కస్టమర్ల సెగ్మెంట్లు వేర్వేరుగా ఉంటున్నాయని పేర్కొంది. భారత్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లే క్రమంలో.. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే హైబ్రిడ్లు, సీఎన్జీలు, బయోఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రాధాన్యం కొనసాగుతుందని వివరించింది. ‘స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్హెచ్ఈవీ), బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీ) ఒకదాని మార్కెట్ను మరొకటి ఆక్రమించకుండా, వేర్వేరు వర్గాల కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయి. ఎస్హెచ్ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న రాష్ట్రాల్లో బీఈవీల అమ్మకాలు కూడా పటిష్ట వృద్ధిని సాధించాయి. దేశంలోనే అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యే ఉత్తర్ప్రదేశ్లో ఎస్హెచ్ఈవీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచి్చనప్పటికీ, 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్ఈవీ విక్రయాలకు సరిసమాన స్థాయిలో ఈవీల అమ్మకాల వృద్ధి నమోదైంది. ఎస్హెచ్ఈవీల విక్రయాలు, బీఈవీల అమ్మకాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఈ ధోరణితో తెలుస్తోంది‘ అని నివేదిక వివరించింది. ఎస్హెచ్ఈవీలను ప్రోత్సహిస్తే, ఈవీల విక్రయాలు తగ్గిపోతాయనేది అపోహ మాత్రమేనని తెలిపింది. కొత్త మోడల్స్ రాకతో గత ఆరు నెలల్లో ఈవీల వినియోగం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.మరిన్ని ముఖ్యాంశాలు.. → గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1.9 శాతంగా ఉన్న ఫోర్ వీలర్ ఈవీల విక్రయాలు, ఆఖరు త్రైమాసికంలో 2.5 శాతానికి పెరిగాయి. → మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో (పీవీ) ఎస్హెచ్ఈవీల వాటా 2025 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతంగా ఉంది. → ధరకు తగ్గ విలువను అందించే విధంగా ఉంటే ఈవీలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉంటున్నారు. విండ్సర్ కస్టమర్లు 7–8 ఏళ్ల తర్వాత బ్యాటరీ రీప్లేస్మెంట్ వ్యయం గురించి ఆందోళన చెందకుండా ఎంజీ సంస్థ లీజింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టడం, రేంజి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఎంఅండ్ఎం తమ బీఈవీల్లో భారీ బ్యాటరీని అందించడం మొదలైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. → మారుతీ సుజుకీ (ఎంఎస్ఐఎల్), టయోటా కిర్లోస్కర్ కంపెనీలు ప్రవేశపెట్టిన ఎస్హెచ్ఈవీలు 2023 అలాగే 2024 ఆర్థిక సంవత్సరాల్లో డీజిల్ వేరియంట్ల మార్కెట్ వాటాను ఆక్రమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వేరియంట్లు, హైబ్రిడ్ల వాటా స్థిరంగా నమోదైంది. → కొత్త మోడల్స్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సమీప భవిష్యత్తులో హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు దోహదపడనున్నాయి. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు సరికొత్త EVలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఏవి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.టాటా హారియర్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా సాగుతున్న.. టాటా మోటార్స్ జూన్ 3న హారియర్ ఈవీ లాంచ్ చేయనుంది. ఇది 500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ధర, బుకింగ్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.కియా క్లావిస్ ఈవీకియా మోటారు తన క్లావిస్ కారును ఈ రోజు (మే 23) రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 400 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్మహీంద్రా XUV 3ఎక్స్ఓ ఈవీఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. ఈ కంపెనీ XUV 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.మారుతి ఈ విటారామారుతి సుజుకి కూడా ఈ ఏడాది తన మొట్టమొదటి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కనిపించింది. ఇది సెప్టెంబర్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48.8 కిలోవాట్ బ్యాటరీ, 61.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి. -
బజాజ్ ఆటో చేతికి కేటీఎమ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా ఆ్రస్టియన్ బైక్ తయారీ కంపెనీ కేటీఎమ్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు వీలుగా సొంత అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న కేటీఎమ్కు డెట్ ఫండింగ్ ప్యాకేజీ ద్వారా 80 కోట్ల యూరోలు(సుమారు రూ. 7,765 కోట్లు) అందించనుంది. వెరసి కేటీఎమ్లో మైనారిటీ వాటాదారు స్థాయినుంచి మెజారిటీ (యాజమాన్య) సంస్థగా అవతరించనున్నట్లు బజాజ్ ఆటో తాజాగా వివరించింది. సంయుక్త డెవలప్మెంట్ పథకంలో భాగంగా కేటీఎమ్ బిజినెస్ను పట్టాలెక్కించనున్నట్లు తెలియజేసింది. అభివృద్ధి, తయారీ, అమ్మకాలు చేపట్టడం ద్వారా భారత్సహా 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. డెట్ ఫండింగ్ ప్యాకేజీలో భాగంగా ఆ్రస్టియన్ కోర్టు ఆదేశాల ప్రకారం రుణదాతలకు తగినస్థాయిలో చెల్లింపులతోపాటు కంపెనీ కార్యకలాపాల పునరుద్ధరణకు నిధులు అందించనున్నట్లు వివరించింది. ఇప్పటికే 20 కోట్ల యూరోలు విడుదల చేయగా.. మిగిలిన 60 కోట్ల యూరోలను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ కేటీఎమ్, హస్వానా, గస్గస్ పేరుతో సుప్రసిద్ధ మోటార్సైకిళ్ల బ్రాండ్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కేటీఎమ్ ఏజీ హోల్డింగ్ సంస్థ పీరర్ మొబిలిటీ ఏజీ(పీఎంఏజీ)కాగా.. తాజా లావాదేవీకి ముందు పీఎంఏజీ/కేటీఎమ్లో బజాజ్ ఆటో 37.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 0.5 శాతం బలపడి రూ. 8,734 వద్ద ముగిసింది. -
24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్గఢ్లతో సహా మల్టిపుల్ ఎక్స్ప్రెస్వేల గుండా ప్రయాణించింది.రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్టార్క్ రేస్ ఎక్స్పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్టీవీఎస్ ఎన్టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. -
రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్
దేశీయ మార్కెట్లో సరికొత్త 'టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్' లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). నాలుగు ట్రిమ్లలో లభించే ఈ కొత్త కారు.. పెట్రోల్, డీజిల్, CNG అనే మూడు ఇంజన్ ఎంపికలను పొందుతుంది. కంపెనీ దీని కోసం జూన్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభిస్తుంది.స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ మంచి డిజైన్ పొందుతుంది. కొత్త ఎల్ఈడీ హెడ్లైట్లు, కొత్త గ్రిల్, బంపర్లు, 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్, ఫ్లష్ ఫిట్టింగ్ ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ లైట్ బార్, టీ షేప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ మొదలైనవి ఉన్నాయి. ఇది డ్యూన్ గ్లో, ఎంబర్ గ్లో, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచెస్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, 8 స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్లైట్లు, వైపర్లు, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ అనేవి మీరు ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతాయి.1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ CNG ఇంజిన్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇంజిన్ ఆటోమాటిక్ లేదా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికలను పొందుతాయి. CNG వేరియంట్ ఫ్యూయెల్ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. -
హోండా కొత్త స్కూటర్.. రూ.12 లక్షలు
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ఎక్స్-ఎడివి మ్యాక్సీ స్కూటర్ను భారత్లో విడుదల చేసింది. దీని ధర రూ .11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అడ్వెంచర్ మోటార్ సైకిల్లాగా ఉంటూ మరోవైపు స్కూటర్ లాంటి సౌకర్యం ఉండేలా ఈ మ్యాక్సీ స్కూటర్ ను రూపొందించినట్లు హోండా పేర్కొంది. ఎక్స్-ఏఏడీవీ మ్యాక్సీ స్కూటర్ కోసం హోండా బిగ్ వింగ్ డీలర్ షిప్లలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుండి ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.హోండా ఎక్స్-ఏడీవీ ప్రత్యేకతలుఇంజిన్& పవర్ ట్రయిన్: హోండా ఎక్స్-ఏడీవీ 745 సీసీ లిక్విడ్-కూల్డ్ ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ పారలల్-ట్విన్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6,750 ఆర్పీఎం వద్ద 57 బీహెచ్పీ శక్తిని, 4,750 ఆర్పీఎం వద్ద 69 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.డిజైన్ & హార్డ్వేర్: అడ్వెంచర్ అప్పీల్ వచ్చేలా ఎక్స్-ఏడీవీ మొత్తం డిజైన్ను రూపకల్పన చేశారు. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్లైట్స్, డీఆర్ఎల్ ఇచ్చారు. ముందు భాగంలో 17-అంగుళాల స్పోక్ వీల్, వెనుక భాగంలో 15-అంగుళాల స్పోక్ వీల్ ఉన్నాయి. సస్పెన్షన్ డ్యూటీ ముందు భాగంలో 41 ఎంఎం యూఎస్డీ ఫోర్కులు, వెనుక భాగంలో స్ప్రింగ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్లో డ్యూయల్ రేడియల్ మౌంట్ ఫోర్-పిస్టన్ కాలిపర్ ముందు భాగంలో 296 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్తో సింగిల్-పిస్టన్ కాలిపర్ ఉన్నాయి.ఫీచర్లు: హోండా ఎక్స్-ఏడీవీలో యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, 5-అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్టీ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషషన్ , మ్యూజిక్, వాయిస్ కమాండ్ కంట్రోట్ వంటి ఫీచర్లున్న హోండా రోడ్ సింక్ యాప్ను ఈ స్కూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు డిఫాల్ట్ రైడింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
టీవీఎస్ కొత్త ఈవీ త్రీవీలర్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఫీచర్లుబ్యాటరీ: హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్ లిథియం-అయాన్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ.గరిష్ట వేగం: 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!స్మార్ట్ కనెక్టివిటీ: టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్ట్ స్మార్ట్ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది. -
మార్కెట్లోకి హోండా ‘రెబల్ 500’: బుకింగ్లు ప్రారంభం
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ‘హోండా రెబల్ 500’ పేరుతో కొత్త మోటార్ సైకిల్ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్–షోరూమ్)గా ఉంది. బుకింగ్లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.గురుగ్రామ్, ముంబై, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్వింగ్ డీలర్íÙప్లో బుకింగ్లు మొదలయ్యాయి. ఈ జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. 471 సీసీ లిక్విడ్–కూల్డ్, 4–స్ట్రోక్, 8–వాల్వ్, ప్యారలల్ ట్విన్–సిలిండర్ ఇంజిన్తో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన రెబల్ 500ను భారత్కు తీసుకురావడం సంతోషంగా ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ సత్సుము ఒటానీ తెలిపారు. -
నిస్సాన్ తయారీ ప్లాంట్ల మూసివేత? కంపెనీ క్లారిటీ
దేశంలోని కొన్ని తయారీ ప్లాంట్లను మూసివేస్తారని వస్తున్న వార్తలను నిస్సాన్ మోటార్ ఇండియా అధికారికంగా తోసిపుచ్చింది. తమ కార్యకలాపాలు, డీలర్లు, భాగస్వాములు, వినియోగదారులకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇండియాలో తమ సర్వీసులపట్ల నిబద్ధతతో ఉన్నట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది.తయారీ కార్యకలాపాలపై స్పష్టతనిస్సాన్ కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా మెక్సికోలో ఫ్రాంటియర్, నవరా పికప్స్ ఉత్పత్తి ఏకీకృతం చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ పుకార్లు వెలువడ్డాయి. అయితే ఈ మార్పుల వల్ల భారత తయారీ ప్లాంట్లు ప్రభావితం కావని నిస్సాన్ స్పష్టం చేసింది. భారతదేశంలో తమ వ్యాపార వ్యూహం బలంగా ఉందని, ఏ కర్మాగారంలో కార్యకలాపాలను నిలిపివేసే అధికారిక ప్రణాళికలు లేవని వాటాదారులకు హామీ ఇచ్చింది.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..రెనాల్ట్కు ఆర్ఎన్ఏఐపీఎల్ వాటామార్చి 2025లో రెనాల్ట్ గ్రూప్ రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎఐపిఎల్)లో 51% వాటాను కొనుగోలు చేస్తుందని నిస్సాన్ ప్రకటించింది. ఈ చర్య రెనాల్ట్-నిస్సాన్ ప్రపంచ భాగస్వామ్యాన్ని కీలకం కానుందని కంపెనీ తెలిపింది. ఇది చెన్నై ఆధారిత ఉత్పత్తి కేంద్రంపై రెనాల్ట్ పూర్తి నియంత్రణను తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా, నిస్సాన్ భారతదేశ వ్యాపారం పూర్తిగా పనిచేస్తుందని, కస్టమర్ నిమగ్నత, డీలర్షిప్ విస్తరణపై నిరంతరం దృష్టి పెడతామని కంపెనీ స్పష్టం చేసింది. -
త్రీవీలర్ ఈవీలకు కేరాఫ్ భారత్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా భారత్ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ మార్కెట్ గురించి కీలకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్గా భారత్ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే. ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్ అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్ టూవీలర్లకు భారత్ చురుకైన మార్కెట్గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్ యూనిట్లలో 80 శాతం వాటా టాప్–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.అధిక ధరలు, తీవ్ర పోటీ సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్హవర్ బ్యాటరీ, 6కిలోవాట్ పీక్ పవర్ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. -
24 గంటల్లో 8000 బుకింగ్స్.. ఒకేరోజు 150 కార్ల డెలివరీ
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇటీవల.. 'విండ్సర్ ప్రో' పేరుతో పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. మార్కెట్లో కొత్తగా విడుదలైన ఈ కారు.. కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. కంపెనీ కూడా డెలివరీలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే.. బెంగళూరులోని 150 మంది కస్టమర్లకు ఒకేసారి విండ్సర్ ప్రో డెలివరీలు చేసింది.ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్లను పొందిన ఎంజీ విండ్సర్ ప్రో.. ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్గేట్పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్.. లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారుసెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఎంజీ విండ్సర్ ప్రో.. 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది. -
టాటా హైస్పీడ్ చార్జింగ్ స్టేషన్లు.. 15 నిమిషాల్లోనే 150 కి.మీ. రేంజ్!
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టాటాఈవీ తొలిసారిగా 10 మెగాచార్జర్ స్టేషన్లను ప్రారంభించింది. ముంబై–అహ్మదాబాద్ హైవేపై మూడు, ఢిల్లీ–జైపూర్ హైవేలో నాలుగు, పుణె–నాసిక్ హైవేలో ఒకటి, బెంగళూరు.. ఉదయ్పూర్ నగరాల్లో చెరొకటి చొప్పున చార్జ్జోన్, స్టాటిక్ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇవిఅత్యంత వేగంగా కేవలం 15 నిమిషాల్లోనే సుమారు 150 కి.మీ. రేంజికి సరిపడేంత చార్జింగ్ చేసుకునేందుకు వీలు కలిగిస్తాయి.ఈ స్టేషన్లలో రెస్ట్రూమ్లు, డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 500 మెగాచార్జర్లను ఇన్స్టాల్ చేయాలన్న లక్ష్యంలో భాగంగా వీటిని నెలకొల్పినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ బాలాజీ రాజన్ తెలిపారు. 2027 నాటికి ప్రస్తుతమున్న చార్జ్ పాయింట్లను రెట్టింపు స్థాయి పెంచడంపై సంస్థ దృష్టి పెడుతోంది. -
పెట్రోల్ అమ్మకాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: వేసవి నేపథ్యంలో పెట్రోల్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ నెల మొదటి 15 రోజుల్లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 10 శాతం పెరిగినట్టు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థల (బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఇంధన అమ్మకాల్లో 90 శాతం వాటా ఈ సంస్థల చేతుల్లోనే ఉంది. మే 1–15 తేదీల మధ్య 1.37 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి.వేసవి సెలవుల్లో వ్యక్తిగత వాహన వినియోగం పెరగడం ఇందుకు మద్దతుగా ఉంది. డీజిల్ విక్రయాలు 2 శాతం పెరిగి 3.36 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. రవాణా, వ్యవసాయ రంగంలో ప్రధానంగా వినియోగించే డీజిల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలోనూ 2 శాతం పెరగడం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డీజిల్ విక్రయాలు 8.23 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాల కంటే 4 శాతం అధికం. ఏప్రిల్నెల మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 3.19 మిలియన్ టన్నులతో పోల్చి చూస్తే 5 శాతం వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుండడంతో గత కొన్ని నెలలుగా డీజిల్ అమ్మకాల్లో వృద్ధి పరిమితంగానే ఉంటున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్పీజీ అమ్మకాలదీ ఎగువబాటే విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు మే మొదటి 15 రోజుల్లో 3,27,900 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలం అమ్మకాల కంటే 1.1 శాతం తగ్గాయి. పాకిస్థాన్తో ఘర్షణల నేపథ్యంలో ఉత్తరాదికి విమాన సరీ్వసులు ప్రభావితం కావడం వినియోగం తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ఎల్పీజీ అమ్మకాలు 10.4 శాతం పెరిగి 1.34 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. -
సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ను లాంచ్ చేసింది.సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టైలిష్ డిజైన్ అంశాలతో మిళితం చేసి సుజుకి యాక్సెస్ స్కూటర్ కొత్త ఎడిషన్ను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ ఎనేబుల్డ్, ఫుల్ కలర్ 4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త ఎడిషన్ ముఖ్యమైన ఫీచర్. ఇందులో డిస్ప్లే రైడర్కు క్లీనర్ ఇంటర్ఫేస్, మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.కొత్త కలర్కాగా యాక్సిస్ వాహనాలకు ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్లకు అదనంగా కొత్త ఎడిషన్ "పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్" రంగును పరిచయం చేస్తుంది. మ్యాట్ ఫినిష్ స్కూటర్ కు ఆధునిక, ప్రీమియం లుక్ను ఇస్తుంది. దీంతోపాటు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే మరో నాలుగు కలర్ షేడ్స్లోనూ యాక్సిస్ కొత్త ఎడిషన్ లభిస్తుంది.సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్టీ ఎడిషన్ ఇప్పుడు భారతదేశంలోని డీలర్షిప్లలో రూ .1,01,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లభిస్తుంది. స్మార్ట్ టెక్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ కలర్ స్కీమ్ జోడించడంతో కొత్త వేరియంట్ పోటీ 125 సీసీ స్కూటర్ విభాగంలో యాక్సెస్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది. -
హ్యుందాయ్ లాభం డౌన్.. రూ.21 డివిడెండ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం నీరసించి రూ. 1,614 కోట్లకు పరిమితమైంది. దేశీ అమ్మకాలు మందగించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,677 కోట్లు ఆర్జించింది.వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 21 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 17,671 కోట్ల నుంచి రూ. 17,940 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీయంగా 1,53,550 వాహనాలను విక్రయించింది. 2023–24 క్యూ4లో రూ. 1,60,317 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అయితే ఎగుమతులు 33,400 యూనిట్ల నుంచి 38,100 వాహనాలకు జంప్ చేశాయి.పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హ్యుందాయ్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,640 కోట్లను తాకింది. 2023–24లో రూ. 6,060 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 69,829 కోట్ల నుంచి రూ. 69,193 కోట్లకు స్వల్పంగా తగ్గింది. దేశీ అమ్మకాలు 6,14,721 యూనిట్ల నుంచి 5,98,666 యూనిట్లకు వెనకడుగు వేశాయి. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో 1,63,386 యూనిట్లకు చేరాయి. 2030కల్లా 20 ఐసీఈ, 6 ఈవీలతో కలిపి 26 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఎండీ అన్సూ కిమ్ పేర్కొన్నారు.వీటిలో 8 మోడళ్లు 2027కల్లా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2025–26) రూ. 7,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలియజేశారు. వీటిలో 40 శాతాన్ని పుణేలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హ్యుందాయ్ షేరు 1.3 శాతం లాభంతో రూ. 1,860 వద్ద ముగిసింది. -
కేటీఎం బైక్ల ధరలు పెరిగాయ్..
ప్రముఖ ప్రీమియం బైక్ల తయారీ సంస్థ కేటీఎం ఇండియన్ మార్కెట్లో విక్రయించే తమ ద్విచక్ర వాహనాల ధరలను సవరించింది. ఈ మార్పులతో వివిధ బైక్ల ధర రూ.12,000 వరకు పెరిగింది. ఆయా మోడళ్లపై కనీసం రూ.1,000 మేర ధరలను కంపెనీ పెంచేసింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ వ్యత్యాసానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఇతర కంపెనీలతోపాటు కేటీఎం కూడా తమ బైక్ల ధరలను పెంచింది.ఏ బైక్పై ఎంత పెరిగింది?🔺కేటీఎం 390 డ్యూక్పై అత్యల్పంగా రూ .1,000 పెరిగింది. దీంతో ఈ బైక్ ధర రూ.2.96 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది. అయితే ఇంతకుముందు ఈ బైక్ ధరను రూ.18,000 తగ్గించింది. దాంతో అప్పుడు ఈ ద్విచక్ర వాహనం ధర రూ.3.13 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు (ఎక్స్ షోరూమ్) తగ్గింది.🔺 ఇక కేటీఎం 250 డ్యూక్, ఆర్సీ 390 మోడళ్ల ధరలు రూ .5,000 కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 250 డ్యూక్ ధర రూ.2.30 లక్షలకు చేరగా, ఆర్సీ 390 ధర రూ.3.23 లక్షలకు (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) చేరింది. ఇండియన్ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ 250, హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్, సుజుకి జిక్సర్ 250 వంటి ప్రసిద్ధ మోడళ్లలో కేటీఎం 250 డ్యూక్ కూడా ఒకటి.🔺కేటీఎం ఆర్సీ 200 బైక్ ధర అత్యధికంగా రూ .12,000 పెరిగింది. ఈ మార్పుతో, ఈ బైక్ ప్రారంభ ధర రూ .2.21 లక్షల నుండి రూ .2.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, సుజుకి ఎస్ఎఫ్ 250, యమహా ఆర్ 15 వీ4 వంటి మోడళ్లకు పోటీగా ఉంది. -
జపాన్లో అదరగొట్టిన మేడ్ ఇన్ ఇండియా కారు
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ విదేశీ మార్కట్లకు కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (JNCAP) క్రాష్ టెస్ట్లో భారతదేశంలో తయారైన 'ఫ్రాంక్స్' 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.సుజుకి ఫ్రాంక్స్ అసెస్మెంట్లో 84 శాతం స్కోర్ను కలిగి ఉంది. మొత్తం 193.8 పాయింట్లలో 163.75 పాయింట్లను పొందగలిగింది. అంతేకాకుండా, ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్లో 85.8 పాయింట్లకు గానూ 79.42 పాయింట్లను సాధించగా.. కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్ 100 పాయింట్లలో 76.33 పాయింట్లను సొంతం చేసుకుంది.ఆఫ్సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్లో, సుజుకి ఫ్రాంక్స్ 24 పాయింట్లకు 21.08 పాయింట్లు సాధించింది. ఫుల్-ర్యాప్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్, సైడ్ కొలిషన్ టెస్ట్ మరియు పాదచారుల లెగ్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్లలో కూడా ఈ కారు లెవల్ 5/5 సాధించింది.జపాన్లో విక్రయించే సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్ నుంచి ఎగుమతి అయినప్పటికీ.. ఇది భారతీయ వెర్షన్ మాదిరిగా కాకుండా.. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ సిస్టమ్ వంటి మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తాయి. -
సిద్దమవుతున్న ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్: లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 2020లో మార్కెట్లో విడుదలైన తరువాత.. ఈ హ్యాచ్బ్యాక్ (ఆల్ట్రోజ్) మొదటిసారి ఫేస్లిఫ్ట్ రూపంలో రానుంది. ఇది మల్టిపుల్ వేరియంట్లలో.. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టనుంది.2025 టాటా ఆల్ట్రోజ్ లేదా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్.. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ ఎస్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ CNG, 1.5-లీటర్ టర్బో డీజిల్ అనే ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: వివరాలుటాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్ ఫీచర్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 90 డిగ్రీస్ ఓపెనింగ్ డోర్స్, 3D ఫ్రంట్ గ్రిల్, మల్టిపుల్ ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఈ కారులో ఉంటాయని తెలుస్తోంది. డిజైన్ కొంత స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. ఇది ఈ నెల 22న లాంచ్ అవుతుందని సమాచారం. -
లాంచ్కు సిద్దమవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే: వివరాలు
రాయల్ ఎన్ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6'ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మొదటిసారిగా ఈఐసీఎంఏ 2024 వేదికపై కనిపించిన ఈ.. ఈవీ బైక్ 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటి వరకు పెట్రోల్ బైకులను లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్.. ఎలక్ట్రిక్ విభాగంలోకి కూడా తన హవా కొనసాగించడానికి సన్నద్ధమవుతోంది. పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6.. లేటెస్ట్ డిజైన్, కొత్త ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ లైట్, అల్యూమినియం ఛాసిస్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వింటేజ్ బైకును గుర్తుకు తెస్తాయి. స్ప్లిట్ సీట్ కలిగిన ఈ బైక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైకుకు సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.ఇదీ చదవండి: 24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రోదేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 బైక్.. ఒక సింగిల్ ఛార్జితో 100 కిమీ రేంజ్ అందించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ బరువు కూడా 100 కేజీల కంటే తక్కువే ఉంటుందని సమాచారం. కాగా దీని ధర, బుకింగ్స్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. -
‘గోగో’ ఈవీను విడుదల చేసిన బజాజ్ ఆటో
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ కొత్తగా ఎలక్ట్రిక్ ఆటో ‘గోగో’ను విడుదల చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బజాజ్ ఆటో లిమిటెడ్ ఇంట్రాసిటీ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సమర్దీప్ సుబంధ్ , వినాయక బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి బాబుల్ రెడ్డి కలిసి గోగోను ఆవిష్కరించారు.బజాజ్ గోగోను P5009, P5012, P7012 మూడు వేరియంట్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.వేరియంట్ను అనుసరించి గోగోలో 9.2 కిలోవాట్ నుంచి 12.1 కిలోవాట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 251 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది.ఇది నాలుగు గంటలలోపు 80% ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?గోగోలో మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు ఉన్నాయి. ఎకో, పవర్, క్లైంబ్, పార్క్ అసిస్ట్ వంటి మోడ్లున్నట్లు కంపెనీ తెలిపింది. విభిన్న డ్రైవింగ్ అవసరాలకు వీటిని వినియోగించవచ్చని పేర్కొంది.డ్రైవర్ సౌలభ్యం కోసం డిజిటల్ డిస్ ప్లే, యూఎస్బీ ఛార్జింగ్, స్టోరేజ్ స్పేస్ ఉంటుందని చెప్పింది.రేడియల్ ట్యూబ్ లెస్ టైర్లు, హై గ్రౌండ్ క్లియరెన్స్తో వివిధ రోడ్డు పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ‘స్కోడా కోడియాక్’ డెలివరీ
హైదరాబాద్: స్కోడా ఆటో డీలర్షిప్ ‘మహావీర్ స్కోడా’ తెలుగు రాష్ట్రాల్లోని తమ షోరూంల్లో ఆల్న్యూ స్కోడా కోడియాక్ ఎస్యూవీల డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర రూ.46.89 లక్షలు. 2.0 లీటర్ టర్బో పె ట్రోల్ ఇంజిన్తో ఈ ఎస్యూవీ 14.86 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.పనోరమా సన్రూఫ్, 9 ఎయిర్బ్యాగులు, 1,976 లీటర్ల లగేజీ స్పేస్ కలిగి ఉంది. ఐదేళ్ల వారంటీ/1.25 లక్షల కి.మీ.., పదేళ్ల రోడ్సైడ్ అసిస్టెన్స్, ఏడాది స్కోడా సూపర్కేర్ ప్యాకేజీ సౌకర్యాలున్నాయి. మహవీర్ స్కోడా షోరూంల్లో టెస్ట్డ్రైవ్తో బుకింగ్ సదుపాయం ఉంది. -
లాభాల్లోనూ ‘హీరో’
ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24 శాతం జంప్చేసి రూ. 1,169 కోట్లను తాకింది. వ్యయ నియంత్రణ, విభిన్న ప్రొడక్టులు, మెరుగుపడిన మార్జిన్లు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 943 కోట్లు మాత్రమే ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 65 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 9,794 కోట్ల నుంచి రూ. 10,244 కోట్లకు బలపడింది. అయితే మోటార్సైకిళ్లు, స్కూటర్ల మొత్తం విక్రయాలు 13.92 లక్షల నుంచి 13.81 లక్షల యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?వాహన అమ్మకాలు అప్మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హీరో మోటో నికర లాభం 17 శాతం ఎగసి రూ. 4,376 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 3,742 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 38,643 కోట్ల నుంచి రూ. 41,967 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 5 శాతం అధికంగా 58.99 లక్షల వాహనాలు విక్రయించింది. 2023–24లో 56.21 లక్షల వాహన అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు ఆర్జించినట్లు హీరో మోటో ఈడీ, తాత్కాలిక సీఈవో విక్రమ్ ఎస్ కస్బేకర్ పేర్కొన్నారు. వరుసగా 24వ ఏడాదిలోనూ మార్కెట్ లీడర్గా కంపెనీ కొనసాగినట్లు తెలియజేశారు. కీలకమైన 125 సీసీ విభాగంలో కన్సాలిడేషన్ జరుగుతున్నదని, భవిష్యత్లో ఈవీల విడుదల ద్వారా వృద్ధి కొనసాగనున్నట్లు వివరించారు. -
ట్రయంఫ్ కొత్త బైక్ లాంచ్: ధర ఎంతంటే?
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్.. తన మేడ్ ఇన్ ఇండియా 400 సీసీ స్క్రాంబ్లర్ హై స్పెక్ వేరియంట్ (ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC) లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర రూ. 27000 ఎక్కువ.రేసింగ్ ఎల్లో, స్టార్మ్ గ్రే, వెనిల్లా వైట్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC.. 398 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,000 rpm వద్ద 39.45 bhp పవర్.. 6,500 rpm వద్ద 37.5 Nm పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని పనితీరు సాధారణ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మాదిరిగా ఉంటుంది.స్క్రాంబ్లర్ 400 XC స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్ రోడ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్ థ్రోటిల్, టార్క్ అసిస్ట్ క్లచ్, USB ఛార్జింగ్ సాకెట్, సిగ్నేచర్ DRLలతో కూడిన ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి. డ్యూయల్ ఫార్మాట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్లు అవసరమైన అన్ని సమాచారాన్ని సులభంగా చూడవచ్చు. -
హోండా ఈ-క్లచ్ టెక్నాలజీ బైక్స్: ధరలు ఎలా ఉన్నాయంటే?
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. తన సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులను ఈ-క్లచ్ వేరియంట్స్ రూపంలో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 9.60 లక్షలు, రూ. 10.40 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). వీటి ధరలు స్టాండర్డ్ మోడల్స్ ధరల కంటే రూ. 40000 ఎక్కువ.హోండా సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ బైకులు చూడటానికి స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులోని ఈ క్లచ్ టెక్నాలజీ క్లచ్ లివర్ను మాడ్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండా గేర్లను మార్చడానికి అనుమతిస్తుంది. ఇందులో క్లచ్ లివర్ అలాగే ఉంటుంది. అయితే రైడర్ కావలసినప్పుడు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ. 51వేలతో బుకింగ్: లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారుసీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ ఈ వేరియంట్స్ రెండూ కూడా 649cc ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ ద్వారా 95 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. -
రూ. 51వేలతో బుకింగ్: లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారు
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా త్వరలోనే దేశీయ మార్కెట్లో సరికొత్త ఎంపీవీ 'ఎం9' లాంచ్ చేయనుంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం రూ. 51000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.లాంచ్కు సిద్దమవుతున్న ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు.. పరిమాణం పరంగా కియా కార్నివాల్ & టయోటా వెల్ఫైర్ వంటి వాటికంటే పెద్దదిగా ఉంటుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్న ఈ ఎంపీవీ మార్చి ప్రారంభంలోనే లాంచ్ కావాల్సి ఉంది. కానీ లాంచ్ వాయిదా పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. దీని ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: 24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రోరెండు సన్రూఫ్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో పవర్డ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, ఫోల్డ్ అవుట్ ఒట్టోమన్ సీట్లు, పవర్డ్ రియర్ స్లైడింగ్ డోర్లు, రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు వంటి వాటితో పాటు.. లెవల్ 2 ADAS కూడా ఈ కారులో ఉండనుంది. బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. -
పెరగనున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల రేట్లు
ఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ కార్ల ధరలను ఈ ఏడాది రెండు దఫాల్లో మూడు శాతం వరకు పెంచనుంది. విదేశీ మారక ద్రవ్య విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దీని ప్రకారం వివిధ మోడల్స్ను బట్టి (సి 200 నుంచి మేబ్యాక్ ఎస్ 680 వరకు) జూన్ నుంచి రేట్లు రూ. 90,000 నుంచి రూ. 12.2 లక్షల వరకు పెరగనున్నాయి.తదుపరి సెప్టెంబర్ నుంచి 1.5 శాతం వరకు రేట్లు పెరుగుతాయి. గత నాలుగు నెలల్లో యూరోతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు పది శాతం తగ్గిందని, ఫలితంగా వ్యయాలపరమైన ఒత్తిళ్లు పెరిగాయని అయ్యర్ పేర్కొన్నారు. దీంతో స్వల్ప భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. -
24 గంటల్లో 8000 బుకింగ్స్: దూసుకెళ్తున్న విండ్సర్ ఈవీ ప్రో
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన కొత్త 'విండ్సర్ ఈవీ ప్రో' ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లో 8,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కాగా కంపెనీ ఈ కారు ధరలను కూడా ఇప్పుడు రూ. 60000 వరకు పెంచింది. దీంతో విండ్సర్ ఈవీ ప్రో ప్రారంభ ధర రూ. 18.10 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది.ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసిన కొత్త విండ్సర్ ఈవీ ప్రో.. ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 449 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు 136 హార్స్ పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!చూడటానికి సాధారణ ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ వెర్షన్ లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇది సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. -
కియా క్లావిస్ వచ్చేసింది: రేపటి నుంచే బుకింగ్స్..
కియా కారెన్స్ క్లావిస్ మార్కెట్లో విడుదలైంది. కంపెనీ ఈ కారు బుకింగ్లను మే 9నుంచి స్వీకరించనుంది. దీనిని బ్రాండ్ వెబ్సైట్ లేదా డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. ఈ MPV ఆరు పవర్ట్రెయిన్ ఎంపికలు, ఏడు వేరియంట్ (HTE, HTE(O), HTK, HTK+, HTK+(O), HTX, HTX+)లలో అందుబాటులో ఉంటుంది.కొత్త డిజైన్ కలిగిన కియా క్లావిస్ డిజిటల్ టైగర్ ఫేస్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, యాంగ్యులర్ రియర్ బంపర్, డ్యూయల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, లైట్ బార్, బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. లోపల 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు.. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్, 4-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.కియా క్లావిస్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఐవరీ సిల్వర్ గ్లోస్, ప్యూటర్ ఆలివ్, ఇంపీరియల్ బ్లూ, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, స్పార్కింగ్ సిల్వర్, అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్ అనే ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ మరియు కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ విడుదల చేసిన ఒక నివేదికలో.. 2032 నాటికి ఇండియాలో 12.3 కోట్ల వాహనాలు ఉంటాయని వెల్లడించింది.దేశం అభివృద్ధి వైపు సాగుతున్న సమయంలో.. 2070 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా వాహన కొనుగోలుదారులు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే 2030 నాటికి భారతీయ రోడ్లపై ఉన్న వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.ఎలక్ట్రిక్ వాహన వినియోగం లేదా కొనుగోలును పెంచడానికి ఫేమ్-2 వంటి స్కీమ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ డిమాండును ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా.. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెంపుకు కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!2030 నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్లు 80 శాతానికి, ఫోర్ వీలర్స్ 30 శాతం, కమర్షియల్ కార్లు 70 శాతం, ఎలక్ట్రిక్ బస్సులు 40 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు పెరిగితే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 76000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2032 నాటికి 21 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం. -
449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా.. ఇండియన్ మార్కెట్లో విండ్సర్ ప్రో లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 17.46 లక్షలు. ఈ ధర మొదటి 8000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్గేట్పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది. ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజాల హవా!.. ఏప్రిల్లో కార్ సేల్స్ ఇలా..
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి ఇండియా వాటా ఏప్రిల్లో 40 శాతం లోపునకు పడిపోయింది. 1,38,021 వాహన విక్రయాలతో 39.44 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్లో 1,39,173 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 40.39 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది.ఆటోమోటివ్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం భారీ స్థాయిలో ఎస్యూవీ విక్రయాలతో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఏప్రిల్లో అత్యధికంగా లబ్ధి పొందింది. నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.కంపెనీ అమ్మకాలు 38,696 యూనిట్ల నుంచి 48,405 యూనిట్లకు పెరగడంతో.. మార్కెట్ వాటా 11.23 శాతం నుంచి 13.83 శాతానికి పెరిగింది. ఇక సుదీర్ఘకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ (హెచ్ఎంఐఎల్) 43,642 యూనిట్ల అమ్మకాలు, 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్ 44,065 వాహన విక్రయాలతో మూడో స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్లో దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 3,44,594 యూనిట్ల నుంచి 1.55 శాతం వృద్ధితో 3,49,939 యూనిట్లకు చేరాయి.2024–25 పూర్తి సంవత్సర వివరాలు..➤గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 16,71,559 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ 40.25 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. 2023–24లో 16,08,041 వాహనాలు విక్రయించగా, మార్కెట్ షేర్ 40.6 శాతంగా నమోదైంది.➤హెచ్ఎంఐఎల్ 5,59,149 యూనిట్లు, 13.46 శాతం మార్కెట్ వాటాతో 2024–25లో మారుతీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2023–24లో 5,62,865 వాహన విక్రయాలు, 14.21 శాతం వాటాను సాధించింది.ఇదీ చదవండి: ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!➤టాటా మోటార్స్ 5,35,960 యూనిట్లు విక్రయాలు, 12.9 శాతం వాటాతో మూడో స్థానంలో కొనసాగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 5,39,567 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 13.62 శాతం. ➤5,12,626 యూనిట్ల అమ్మకాలు, 12.34 శాతం మార్కెట్ వాటాతో ఎంఅండ్ఎం నాలుగో స్థానంలో నిలి్చంది. 2023–24లో కంపెనీ రిటైల్ అమ్మకాలు 4,27,390 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 10.79 శాతంగా ఉంది. -
మహీంద్రా కొత్త ప్లాంట్
ముంబై/న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (2024–25, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 13.3% ఎగబాకి రూ.3,542 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,125 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.35,373 కోట్ల నుంచి రూ.42,586 కోట్లకు పెరిగింది. 20% వృద్ధి చెందింది. వాహన, వ్యవసాయ పరికరాల విభాగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదం చేసినట్లు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈఓ అనీష్ షా చెప్పారు. కాగా, క్యూ4లో కంపెనీ 18 శాతం పెరుగుదలతో మొత్తం 2.53 లక్షల వాహనాలను విక్రయించింది. ఇందులో ఎస్యూవీలు 1.49 లక్షలుగా ఉన్నాయి. కొత్త ప్లాంట్... ప్యాసింజర్ వాహనాల (పీవీ) తయారీ కోసం కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2028 మార్చి నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించవచ్చని అంచనా. ‘మేము భవిష్యత్తు తరం వాహనాల నిమిత్తం ఒక కొత్త ప్లాంట్ను నెలకొల్పనున్నాం. ప్రధానంగా పీవీల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నప్పటికీ.. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర ప్రత్యేక వాహనాలను కూడా జత చేసే అవకాశం ఉంది. ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం’ అని మహీంద్రా సీఈఓ (ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాలు) రాజేష్ జెజూరికర్ పేర్కొన్నా రు. కాగా, చకన్ (పుణే)లో అదనంగా 1.2 లక్షల వార్షిక తయారీ సామర్థ్యాన్ని జత చేసేలా కొత్త ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 15న దీన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఎక్స్యూవీ3ఎక్స్ఓ, థార్ రాక్స్ తయారీ సామర్థ్యాన్ని 2025–26లో 3,000 మేర పెంచుతామని వెల్లడించారు. పూర్తి ఏడాదికి... మార్చితో ముగిసిన 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.14,073 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది లాభం రూ.12,270 కోట్లతో పోలిస్తే 15 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం కూడా 15 శాతం వృద్ధితో రూ.1,38,279 కోట్ల నుంచి రూ.1,58,750 కోట్లకు చేరింది. కాగా, ఒక్కో షేరుకు రూ.25.30 చొప్పున తుది డివిడెండ్ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 3 శాతం ఎగసి రూ.3,021 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 11,322 కోట్లు ఎగసి రూ.3,72,720 కోట్లకు చేరింది. -
30 మందికి మాత్రమే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జీప్'.. ఇండియన్ మార్కెట్లో రాంగ్లర్ కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విల్లీస్ '41 స్పెషల్ ఎడిషన్' లాంచ్ చేసింది. దీని ధర రూ. 73.24 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎడిషన్ భారత సైన్యానికి గుర్తుగా స్పెషల్ కలర్ పొందింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం. అంటే ఈ కారును 30 మంది కస్టమర్లు మాత్రమే కొనుకోలు చేయగలరు. జీప్ రాంగ్లర్ టాప్ స్పెక్ రూబికాన్ వేరియంట్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. 1941 అనే డెకాల్ హుడ్పై ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!కొత్త స్పెషల్ ఎడిషన్ రాంగ్లర్లో పవర్డ్ సైడ్ స్టెప్, కొత్త ఇంటీరియర్ గ్రాబ్ హ్యాండిల్స్, వెదర్ ఫ్లోర్ మ్యాట్లు, ఫ్రంట్ అండ్ రియర్ డాష్క్యామ్లు కూడా ఉన్నాయి. డిజైన్ కొంత కొత్తగా అనిపించినప్పటికీ.. అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 270 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
ఏప్రిల్లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) 2025 ఏప్రిల్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ గత నెలలో 4,80,896 యూనిట్ల అమ్మకాలు జరిగిపింది. ఇందులో దేశీయ అమ్మకాలు 4,22,931 యూనిట్లు కాగా.. ఎగుమతులు 57,965 యూనిట్లు. 2024 ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అమ్మకాలు 11.26 శాతం తగ్గాయి.ఏప్రిల్ నెలలో.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హెచ్ఎంఎస్ఐ లేటెస్ట్ అప్గ్రేడ్లను కలిగి ఉన్న డియో 125 అప్డేట్ వెర్షన్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ప్రీమియం మోటార్సైకిల్ పోర్ట్ఫోలియోను విస్తరించడంలో భాగంగా.. సీబీ350, సీబీ350 హైనెస్, సీబీ350ఆర్ఎస్ 2025 ఎడిషన్లను.. కొత్త కలర్ ఆప్షన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..హోండా మోటార్సైకిల్ వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను లాంచ్ చేస్తోంది. ఈ కారణంగానే మార్కెట్లోని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. ఆశించిన అమ్మకాలను పొందగలుగుతోంది. -
ఏప్రిల్లో ఎక్కువ అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు
భారతీయ మార్కెట్లో.. ఎలక్ట్రిక్ వాహనాలకు (ఫోర్ వీలర్స్, టూ వీలర్స్) డిమాండ్ పెరుగుతోంది. అమ్మకాల్లో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. గత నెలలో (2025 ఏప్రిల్) దేశీయ విఫణిలో ఎక్కువ అమ్మకాలు జరిపిన ఐదు కంపెనీల గురించి తెలుసుకుందాం.వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఏప్రిల్ 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్గా టీవీఎస్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కంపెనీ గత నెలలో 19,736 యూనిట్లను విక్రయించి 154 వృద్ధిని పొందింది. 2024 ఏప్రిల్లో కంపెనీ మొత్తం సేల్స్ 7,762 యూనిట్లు.ఓలా ఎలక్ట్రిక్ 2025 ఏప్రిల్లో 19,709 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఈ అమ్మకాలు 2024 ఏప్రిల్ (34163 యూనిట్లు) కంటే 42 శాతం తక్కువ.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు2025 ఏప్రిల్లో బజాజ్ అమ్మకాలు 19,001 యూనిట్లు కాగా.. ఏథర్, హీరో కంపెనీల సేల్స్ వరుసగా 13,167 యూనిట్లు, 6,123 యూనిట్లు. ఈ మూడు కంపెనీలు అమ్మకాలు వరుసగా 151 శాతం, 218 శాతం, 540 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈ మూడు కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
లాంచ్కు సిద్దమవుతున్న కార్లు ఇవే.. వివరాలు
2025 ప్రారంభం నుంచి అనేక వాహన తయారీ సంస్థలు దేశీయ మార్కెట్లో కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కాగా ఈ నెలలో (2025 మే) వోక్స్వ్యాగన్, కియా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు తమ కార్లను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ కథనంలో త్వరలో మార్కెట్లో లాంచ్ కానున్న కార్లను గురించి తెలుసుకుందాం.కియా క్లావిస్ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కార్ల జాబితాలో కియా క్లావిస్ ఒకటి. ఇది అప్డేటెడ్ కియా కారెన్స్ అని తెలుస్తోంది. అయితే క్లావిస్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్ ఫీచర్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డేటైమ్ రన్నింగ్ లైట్లు అన్నీ కూడా అప్డేట్ అయ్యాయని సమాచారం. రియర్ బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ అన్నీ కూడా కారెన్స్ కంటే భిన్నంగా ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అంతే కాకుండా ఇది మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్నట్లు తెలుస్తోంది.ఎంజీ విండ్సర్ (50 కిలోవాట్ బ్యాటరీ)ప్రస్తుతం 39 కిలోవాట్ ప్యాక్ కలిగిన ఎంజీ విండ్సర్ కారు.. ఈ నెలలో 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో లాంచ్ కానుంది. ఇది 460 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 39 కిలోవాట్ ప్యాక్ 332 కిమీ రేంజ్ అందిస్తుంది. రాబోయే ఎంజీ విండ్సర్ డిజైన్, ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోటారు విషయంలో స్పష్టత రావడం లేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఏప్రిల్ 2025లో ఎక్కువమంది కొన్న కారు ఇదే..ఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐగ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న.. ఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ఈ నెలలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది సొగసైన ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్, జీటీఐ బ్యాడ్జింగ్, హానీ కూంబ్ గ్రిల్, వెనుక భాగంలో డిఫ్యూజర్, రిఫ్రెష్డ్ టెయిల్లైట్ మొదలైనవి ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, టెయిల్గేట్పై GTI బ్యాడ్జ్లు కనిపిస్తాయి. అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది.టాటా ఆల్ట్రోజ్ ఫేస్లిఫ్ట్2020లో ప్రారంభమైన టాటా ఆల్ట్రోజ్ త్వరలో ఫేస్లిఫ్ట్ రూపంలో మార్కెట్లో లాంచ్ కానుంది. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్, రీపోజిషన్ డీఆర్ఎల్, అప్డేటెడ్ ఫ్రంట్ ఎండ్ వంటి వాటితో పాటు.. కొత్త అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ఈ కారులో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే టాటా లోగోతో కూడిన రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది కాకుండా.. పెద్ద టచ్స్క్రీన్, అప్డేటెడ్ డాష్బోర్డ్, ఏసీ కంట్రోల్స్,, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీల కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కూడా ఇందులో ఉండనున్నాయి. -
భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..
అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్లోకి ప్రవేశించాయి. సూరత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్ట్రక్ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్ట్రక్ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్ తెలిపారు.ధర రూ.60 లక్షలు..లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్ట్రక్ భారత్లోనే మొదటిదని పీయూష్ పేర్కొన్నారు. ‘మేము ఆన్లైన్లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్ట్రక్ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్లో ఉన్న టెస్లా షోరూమ్లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్ట్రక్ వేరియంట్ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులుఎవరీ లవ్జీ దాలియా?‘లవ్జీ బాద్షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు. -
మళ్ళీ ఇదే కారు.. అమ్మకాల్లో అదే జోరు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కంపెనీకి చెందిన క్రెటా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఈ కారు వరుసగా రెండో నెల కూడా మంచి అమ్మకాలను పొందినట్లు సంస్థ వెల్లడించింది.హ్యుందాయ్ క్రెటా గత నెలలో (2025 ఏప్రిల్) మొత్తం 17016 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ అమ్మకాలు ఏప్రిల్ 2024తో పోలిస్తే.. 10.2 శాతం ఎక్కువ. కాగా ఈ కారును 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 69914 మంది కొనుగోలు చేశారు.హ్యుందాయ్ క్రెటాభారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారుగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి మూడు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు. ట్రాన్స్మిషన్స్.. ఎంచుకునే ఇంజిన్లను లేదా వేరియంట్ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ కారు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్ కీలక నిర్ణయం: మరోసారి పెరిగిన కార్ల ధరలు -
జర్మన్ బ్రాండ్ కీలక నిర్ణయం: మరోసారి పెరిగిన కార్ల ధరలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన కార్ల ధరలపై 2 శాతం పెంపును ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' వెల్లడించారు.ప్రస్తుత ఆడి ఇండియా లైనప్లో ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్5 స్పోర్ట్బ్యాక్, ఆర్ఎస్ క్యూ8, క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్బ్యాక్ ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ ఉన్నాయి. 2025 మే 15నుంచి వీటన్నింటి ధరలు పెరుగుతాయి. వేరియంట్ వారీగా కొత్త ధరలు త్వరలోనే అందుబాటులో వస్తాయి.ఇదీ చదవండి: రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..2025లో ఆడి ఇండియా ధరలను పెంచడం ఇది రెండోసారి. జనవరిలోనే కంపెనీ మొదటిసారి ధరలను పెంచింది. ధరల ప్రభావం కార్ల అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అమ్మకాలను పెంచడానికి కంపెనీ ఎలాంటి చర్యలను తీసుకుందనే విషయం తెలియాల్సి ఉంది. -
టారిఫ్ల ఎఫెక్ట్.. టాప్ కార్ల తయారీ కంపెనీ ఔట్!
యూరప్లోని అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరున్న వోక్స్ వ్యాగన్ పునర్నిర్మాణ ప్రయత్నంలో భాగంగా 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న కారియాడ్ సాఫ్ట్వేర్ విభాగంలో అధికంగా ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుంది. దిగుమతి చేసుకున్న వాహనాలపై అమెరికా సుంకాలు, యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సంబంధించిన జరిమానాల కారణంగా 2025 క్యూ1లో కంపెనీ నికర లాభం 40 శాతం తగ్గిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.వోక్స్ వ్యాగన్ నష్టాలకు కారణాలు..అమెరికా సుంకాల ప్రభావందిగుమతి చేసుకున్న ఆటోమొబైల్స్పై అమెరికా 25% సుంకం విధించింది. ఇది వోక్స్ వ్యాగన్ మెక్సికో యూనిట్లో తయారవుతున్న వాహనాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది దాని యూఎస్ అమ్మకాలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. సుంకాలు పెరగడంతో ఖర్చులు అధికమయ్యాయి. డిమాండ్ తగ్గిపోయింది. ఇది లాభాల మార్జిన్లపై ప్రభావం చూపింది.ఈయూ కార్బన్ ఉద్గార జరిమానాలువోక్స్ వ్యాగన్ కఠినమైన యూరోపియన్ యూనియన్ కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడం సవాలుగా మారుతుంది. నిబంధనలు పాటించనందుకు విధించే జరిమానాల కోసం కంపెనీ 600 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది దాని ఆర్థిక దృక్పథాన్ని మరింత దెబ్బతీసింది.ఇదీ చదవండి: పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!కారియాడ్ సాఫ్ట్వేర్ విభాగంఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) సాఫ్ట్వేర్ అభివృద్ధిలో కంపెనీ అనుబంధ సంస్థ కారియాడ్ నిరంతరం జాప్యం చేస్తోంది. ఇది వోక్స్ వ్యాగన్ ఈవీ లక్ష్యాలను ప్రభావితం చేసింది. ఈ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడానికి కంపెనీ 200 మిలియన్ యూరోలను కేటాయించింది. ఇది ఉద్యోగాల కోతకు, కార్యాచరణ మార్పులకు దారితీసింది. -
దాదాపు లక్ష.. కార్ల విక్రయాల రికార్డ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక విక్రయాలను నమోదు చేసింది. 99,000 యూనిట్లకు పైగా విక్రయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడేళ్లలో కంపెనీకి ఇవే అత్యధిక వార్షిక విక్రయాలు. న్యూ నిస్సాన్ మాగ్నైట్ బీ-ఎస్యూవీ బలమైన పనితీరుతో 35 శాతం వృద్ధిని సాధించింది.దేశీయంగా 28,000 యూనిట్లు, ఎగుమతుల్లో 71,000 యూనిట్లతో, నిస్సాన్ తన “ఒక కారు, ఒక ప్రపంచం” విధానంతో 65కు పైగా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది. 2024 అక్టోబర్లో ప్రవేశపెట్టిన న్యూ మాగ్నైట్ 1.5 లక్షల విక్రయాలు, 50,000 ఎగుమతి యూనిట్లను దాటింది. సౌదీ అరేబియాలో తొలి ఎల్హెచ్డీ మార్కెట్గా అడుగుపెట్టింది.నిస్సాన్ 25 ఆర్థిక సంవత్సరంలో 7-సీటర్ బీ-ఎంపీవీ, 26 ఆర్థిక సంవత్సరంలో 5-సీటర్ సీ-ఎస్యూవీని ప్రవేశపెట్టనుంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్లో భాగంగా చెన్నై జేవీ ప్లాంట్లో వాటాను అలయన్స్ భాగస్వామికి అప్పగించినప్పటికీ, భారత్లో నిస్సాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారత్లో వృద్ధి స్థిరంగా ఉందని, భవిష్యత్ ఉత్పత్తుల పైప్లైన్ అలాగే ఉంటుందని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!
వార్షిక ప్రాతిపదికన వృద్ధి 2–4 శాతానికి పరిమితమైనా.. దేశీ, విదేశీ మార్కెట్లలో అమ్మకాల దన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ల వాహనాల విక్రయాలు 50 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. అంటే రోజూ 13,698 వాహనాలు విక్రయిస్తారని అంచనా వేసింది. తద్వారా వరుసగా నాలుగో ఏడాదీ రికార్డు అమ్మకాలు సాధించినట్లవుతుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణం కన్నా మెరుగైన వర్షపాతం ఉంటుందనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటే ఎంట్రీ–స్థాయి కార్లకు డిమాండ్ మెరుగుపడొచ్చని వివరించింది.‘ప్యాసింజర్ వాహనాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 2–4 శాతానికి పరిమితం కావచ్చు. కానీ, కొత్త ఉత్పత్తులతో యుటిలిటీ వాహనాల (యూవీ) వృద్ధి 10 శాతం స్థాయిలో దూసుకెళ్తుంది. మొత్తం అమ్మకాల పరిమాణంలోను, కొత్తగా వచ్చే మోడల్స్లోనూ యూవీల వాటా 68–70 శాతంగా ఉండనుంది’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో దేశీ మార్కెట్ వాటా 85 శాతంగా ఉండగా, మిగతా వాటా ఎగుమతులది ఉంది.ఈవీల వృద్ధి 3.5 శాతానికి పరిమితం..కొత్త మోడల్స్ ప్రవేశపెట్టినా, బ్యాటరీ ఖరీదు తగ్గినా అధిక రేట్లు, ఒక మోస్తరు చార్జింగ్ మౌలిక సదుపాయాలు, రేంజ్ (మైలేజీ)పరమైన అనుమానాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాల వృద్ధి 3–3.5 శాతానికి పరిమితం కావచ్చు. పట్టణ ప్రాంత యూజర్లు దీన్ని రెండో కారు కింద ఒక ఆప్షన్గా మాత్రమే పరిగణించవచ్చు. లో బేస్ కారణంగా గతేడాది ఈవీ సెగ్మెంట్ రెట్టింపయినప్పటికీ ఆ తర్వాత వృద్ధి నెమ్మదించింది. టెస్లా సహా గ్లోబల్ ఈవీ మోడల్స్ రావడం వల్ల ప్రీమియం సెగ్మెంట్లో పోటీ తీవ్రతరమవుతుంది. కస్టమర్ల అంచనాలు పెరిగిపోతాయి కాబట్టి దేశీ తయారీ సంస్థలు వేగవంతంగా కొత్త టెక్నాలజీలకు అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ప్రస్తుతం భారీ టారిఫ్లు ఉన్నందున దిగుమతులు వెల్లువెత్తకపోవచ్చు.రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల తగ్గింపు వేగం, ఈవీల వినియోగం, సరఫరావ్యవస్థపరమైన షాక్లు మొదలైనవి చిప్లు, బ్యాటరీ సెల్స్ లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎగుమతులు 5–7 శాతానికి నెమ్మదించవచ్చు. మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో అమెరికా వాటా సుమారు 1 శాతమే కాబట్టి జూన్ నుంచి అమలయ్యే 25 శాతం టారిఫ్ల ప్రభావం పరిశ్రమపై పెద్దగా ఉండకపోవచ్చు. భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాహనాల కంపెనీలు ప్రత్యామ్నాయంగా మెక్సికో, గల్ఫ్ దేశాలు, దక్షిణాఫ్రికా, తూర్పు ఆసియా మార్కెట్లపై దృష్టి పెట్టొచ్చు. -
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అక్షయ తృతీయను పురస్కరించుకుని 72 గంటల ఎలక్ట్రిక్ రష్ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అదే రోజు స్కూటర్ డెలివరీలు కూడా ఉంటాయి.ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. జెన్ 2, జెన్ 3 మోడళ్లతో సహా S1 పోర్ట్ఫోలియో అంతటా రూ.40,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపులు తరువాత Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుంచి.. Gen 3 లైన్అప్ ధర రూ. 73,999 నుంచి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.ఓలా #హైపర్డ్రైవ్ సర్వీస్ కింద.. అదే రోజు డెలివరీ, రిజిస్ట్రేషన్ వంటివి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్లను ఆన్లైన్లో లేదా డీలర్షిప్లో కొనుగోలు చేసుకోవచ్చు.అక్షయ తృతీయ ఆఫర్స్ ఇస్తున్న ఇతర కంపెనీలుఅక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్ వంటివి కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే విషయం తెలుసుకోవడానికి మీ సమీపంలోని బ్రాండ్ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
18 ఏళ్లలో 33 లక్షల మంది కొన్న కారు: దీని గురించి తెలుసా?
2007లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 'హ్యుందాయ్ ఐ10' ఏకంగా 33 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఒక్క భారతదేశంలోనే ఈ కారును 20 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కాగా కంపెనీ 140 కంటే ఎక్కువ దేశాలలో మరో 13 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10ను ఎక్కువగా దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ దేశాలకు ఎగుమతి చేశారు. 2007లో మొదటి సారి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు.. ఆ తరువాత అనేక అప్డేట్స్ పొందుతూ.. ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ అనే మూడు వేరియంట్లలో.. 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమాటిక్, CNGతో 1.2 లీటర్ పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీహ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రతి ఏటా సగటున లక్ష యూనిట్ల కంటే ఎక్కువ ఐ10 కార్లను విక్రయించింది. ఇది మంచి డిజైన్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక కొత్త ఫీచర్స్ పొందింది. గ్రాండ్ i10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్జ్, ఆస్టా అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది. -
ఆటో విడిభాగాలకు టారిఫ్ల సెగ
న్యూఢిల్లీ: టారిఫ్ల వల్ల ఎగుమతులు మందగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాలు సుమారు రూ. 4,500 కోట్ల మేర క్షీణించవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా పరిశ్రమ ఆదాయం నమోదైందని, ఒకవేళ టారిఫ్ల వివాదం వల్ల అమెరికాకు ఎగుమతులు మధ్యస్త–గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో క్షీణించిన పక్షంలో 2025–26లో ఆదాయ వృద్ధి 6–8 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. గతంలో ఇది 8–10 శాతంగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. భారీ టారిఫ్ల వల్ల సరఫరా వ్యవస్థపై అదనంగా రూ. 9,000 కోట్ల భారం పడుతుందని, దీన్ని అమెరికా వినియోగదారులు, అక్కడి దిగుమతిదారులు, భారతీయ ఎగుమతిదారులు భరించాల్సి వస్తుందని వివరించింది. సరఫరాదారు ప్రాధాన్యత, పోటీ, సాంకేతిక ప్రాధాన్యత అంశాలను బట్టి వారు ఎంత మేర భారాన్ని బదలాయించగలరనేది ఆధారపడి ఉంటుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దివాన్ తెలిపారు. ఒకవేళ అదనపు టారిఫ్ వ్యయాల్లో 30–50 శాతాన్ని భారతీయ ఆటో విడిభాగాల ఎగుమతిదారులు భరించే పక్షంలో సుమారు రూ. 2,700–4,500 కోట్ల భారం మోయాల్సి వస్తుందని వివరించారు. ఇది పరిశ్రమ నిర్వహణ లాభాల్లో 3–6 శాతమని, ఆటో విడిభాగాల ఎగుమతిదార్ల నిర్వహణ లాభాల్లో 10–15 శాతం అని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 8 శాతంగా నమోదైంది. 2020–24 మధ్య కాలంలో అమెరికాకు ఆటో విడిభాగాల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15 శాతం స్థాయిలో పెరిగాయి. ఇంజిన్లు, ఎలక్ట్రికల్ కాంపొనెంట్లులాంటి కీలకమైన ఆటోమొబైల్ విడిభాగాలపై మే 3 నుంచి అమల్లోకి వచ్చేలా అమెరికా 25 శాతం టారిఫ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే విడిభాగాల్లో దాదాపు 65 శాతం కాంపొనెంట్లు 25 శాతం టారిఫ్ల కేటగిరీలోకి వస్తాయి. -
ఈ-అంబులెన్స్ల తయారీలో జాప్యం.. కారణం..
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్లు రోడెక్కేందుకు మరింత సమయం పట్టనుంది. 2024 సెప్టెంబర్లో ఈ-అంబులెన్స్ల కోసం రూ.500 కోట్ల కేటాయించారు. ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది ఇప్పటికీ స్పష్టమైన ఫలితాలను ఇవ్వలేదు. పీఎం ఈ-డ్రైవ్ కోసం మొత్తం రూ.10,900 కోట్ల వ్యయం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ-అంబులెన్స్ విభాగంలో ఫోర్స్ మోటార్స్, మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే వీటి తయారీకి ఆసక్తి కనబరిచాయి.కీలక సవాళ్లుపరిమిత తయారీదారుల భాగస్వామ్యం వల్ల ఇప్పటి వరకు తయారీలో పురోగతి లేదనే వాదనలున్నాయి. 2025 మార్చి నాటికి ఈ-అంబులెన్స్లను ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టుకు కట్టుబడిన మొదటి కంపెనీ ఫోర్స్ మోటార్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాహనాలను పంపిణీ చేయలేదు. మారుతీ సుజుకి ఇండియా తయారీని ప్రారంభించినట్లు తెలిపింది. కానీ సంస్థ ఎండీ హిసాషి టకేచి వాహనాల కచ్చితమైన డెలివరీ సమయాన్ని మాత్రం తెలియజేయలేదు.సబ్సిడీ మార్గదర్శకాల్లో జాప్యంఏఆర్ఏఐ లేదా ఐసీఏటీ వంటి ఏజెన్సీలు వాహనాలకు హోమోలాగేషన్ (పబ్లిక్ రోడ్లపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణిస్తుందనే అధికారిక ఆమోదం) లేకపోవడం వల్ల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీల మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇప్పటివరకు భారత్లో సర్టిఫైడ్ ఈ-అంబులెన్స్లు లేకపోవడం కూడా భద్రతా మార్గదర్శకాల అమలుకు నిరోధకంగా మారింది.హైబ్రిడ్ అంబులెన్సులుతక్షణ అవసరాలను తీర్చడానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం హైబ్రిడ్ అంబులెన్సులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంది. ఈ హైబ్రిడ్ అంబులెన్స్లను వినియోగించేందుకు అన్ని విధాలా సహకరిస్తుంది. అయినప్పటికీ, హైబ్రిడ్ నమూనాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ప్రధానంగా 14,028 ఈ-బస్సులు, 2.05 లక్షల ఈ-త్రీవీలర్ వాహనాలు, 1.10 లక్షల ఈ-రిక్షాలు, 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు, ఇ-ట్రక్కులు, ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?ఈ-బస్సులు, ఈ-టూ వీలర్స్ వంటి విభాగాల్లో పురోగతి ఉన్నప్పటికీ ఈ-అంబులెన్స్లు తయారీ ఇంకా ప్రాథమిక ధశలోనే ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ జాప్యాన్ని అంగీకరిస్తున్నారు. కానీ నిబంధనలను ఖరారు చేయడానికి, విజయవంతంగా వాటిని అమలు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తయారీ భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి వీటిని వీలైనంత త్వరగా రోడెక్కించాలని నిపుణులు కోరుతున్నారు. -
నేటి నుంచి ఏథర్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ నేడు(28న) ప్రారంభంకానుంది. 30న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 304–321కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 321 ధరలో 4.17 కోట్ల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 1,340 కోట్లు అందుకుంది. మ్యూచువల్ ఫండ్స్సహా 36 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 2,981 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో గతేడాది ఆగస్ట్లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మొత్తం రూ. 11,956 కోట్ల విలువలో ఏథర్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లవరకూ దరఖాస్తుకు వీలుంటుంది. షేర్ల కేటాయింపు మే 2న ఉండవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 6న లిస్టయ్యే వీలుంది. -
ఒకేచోట 15 లక్షల కార్లు: ఇండియాలో సౌత్ కొరియా బ్రాండ్ హవా
సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ అయిన 'కియా మోటార్స్'.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని తన తయారీ కేంద్రం నుంచి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.కియా ఇండియా 2019 ఆగస్టు నుంచి దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. అతి తక్కువ కాలంలో ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న కార్ల తయారీదారుగా కియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అనంతపురం ప్లాంట్ కియా కార్యకలాపాలకు మూలస్తంభంగా ఉంది.కియా ఇండియా అనంతపురం ప్లాంట్లో సెల్టోస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, సైరోస్ వంటి కార్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ఈ కార్లను భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా.. ఇక్కడ నుంచి విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.ఇదీ చదవండి: 2025 హంటర్ 350 బైక్ ఇదే.. ధర ఎంతంటే?ఉత్పత్తి గణాంకాల విషయానికొస్తే.. సెల్టోస్ 7,00,668 యూనిట్ల ఉత్పత్తితో (46.7%) ముందంజలో ఉంది. తరువాత సోనెట్ 5,19,064 యూనిట్లతో (34.6%) రెండవ స్థానంలో ఉంది. కారెన్స్ 2,41,582 యూనిట్లు (16.1%), సైరోస్ & కార్నివాల్ వంటి ఇటీవలి మోడళ్లు వరుసగా 23,036 యూనిట్లు (1.5%) మరియు 16,172 యూనిట్లు (1.1%)గా ఉన్నాయి. -
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు దాని అత్యంత సరసమైన మోటార్సైకిల్.. హంటర్ 350ను కొత్త హంగులతో 2025 వెర్షన్గా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ అప్గ్రేడ్లను పొందుతుంది.2025 హంటర్ 350 బైకులో అతిపెద్ద మార్పు సస్పెన్షన్ అప్గ్రేడ్. వెనుక భాగంలో మెరుగైన కంప్రెషన్ & రీబౌండ్ అనుభవాలను అందించే ప్రోగ్రెసివ్ స్ప్రింగ్లు లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో స్లిప్ అండ్ క్లచ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. కొత్త హ్యాండిల్బార్, ఫాస్ట్ USB ఛార్జింగ్, కొత్త సీటు, కొత్త ఎగ్జాస్ట్ రూటింగ్ మాత్రమే కాకుండా పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి ఇక్కడ చూడవచ్చు.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీపర్ఫామెన్స్ పరంగా, ఇంజిన్లో ఎటువంటి మార్పులు లేవు. ఈ బైక్ మూడు కొత్త రంగులలో లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ. 1.50 లక్షలు, మిడ్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు, టాప్ ఎండ్ ధర రూ. 1.82 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్). -
ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విడిభాగాల తయారీ విభాగంలోకి ప్రవేశించినట్లు హిందాల్కో వెల్లడించింది. ఇందుకు సంబంధించి పుణెలోని చకాన్లో రూ. 500 కోట్లతో తేలికపాటి బ్యాటరీ సొల్యూషన్స్ ఉత్పత్తి కోసం తయారీ ప్లాంటును ప్రారంభించింది. ఎంఅండ్ఎం సంస్థకు 10,000 అల్యూమినియం బ్యాటరీ ఎన్క్లోజర్లను కూడా అందించినట్లు కంపెనీ సందర్భంగా తెలిపింది.మహీంద్రాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీ ఎన్క్లోజర్, సాధారణ ఉక్కు డిజైన్లతో పోలిస్తే 40 శాతం తక్కువ బరువు ఉంటుంది. వాహన రేంజి సుమారు 8–10 శాతం మెరుగుపడుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగానే అత్యంత నాణ్యమైన అల్యూమినియం ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు చకాన్ ప్లాంటు తోడ్పడగలదని హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. -
మారుతీ సుజుకీ వెనకడుగు..
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. నవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్ప వెనకడుగుతో రూ. 3,911 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 3,952 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,471 కోట్ల నుంచి రూ. 40,920 కోట్లకు బలపడింది.మొత్తం వ్యయాలు 8%పైగా పెరిగి రూ. 37,585 కోట్లను తాకాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 135 డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో 3% అధికంగా 6,04,635 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఒక క్వార్టర్కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. దేశీ విక్రయాలు 3% వృద్ధితో 5,19,546 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 8% ఎగసి 85,089గా నమోదయ్యాయి.పూర్తి ఏడాదికి...మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.5 శాతం పుంజుకుని రూ. 14,500 కోట్లయ్యింది. 2023–24లో రూ. 13,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,41,858 కోట్ల నుంచి రూ. 1,52,913 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో మొత్తం 22,34,266 వాహనాలను విక్రయించింది. వెరసి గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు, ఎగుమతులను నమోదు చేసింది. దేశీయంగా మందగమనం ఉన్నప్పటికీ పటిష్ట ఫలితాలు సాధించినట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. -
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
చైనీస్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియన్ మార్కెట్లో 'సీలియన్ 7' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కొనుగోలుదారులు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒకే రోజు 52 కార్లను డెలివరీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ను సాధించినట్లు ప్రకటించింది.గతంలో చాలా కంపెనీ వందలాది వాహనాలను డెలివరీ చేశాయి. కానీ బీవైడీ కంపెనీ డెలివరీ చేసిన కారు ధరలు ధర రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షలు మధ్య ఉన్నాయి. ఇంత ఖరీదైన కార్లను 52 డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీకి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 308 Bhp పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తే.. పర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా 523 Bhp పవర్, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా వరుసగా 567 కిమీ, 542 కిమీ రేంజ్ అందిస్తాయి. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. View this post on Instagram A post shared by BYD India (@byd.india) -
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి ‘ఎండ్-ఆఫ్-లైఫ్(ఈఓఎల్-నిబంధనల ప్రకారం వాడకూడని వాహనాలు)’ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ప్రధాన కారమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని ఇంధన స్టేషన్లలో జూన్ 30, 2025 నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అధునాతన వ్యవస్థ ఈఓఎల్ వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. ఈ ఆంక్షలు ఒక్క ఢిల్లీకే పరిమితం కావని కొందరు అధికారులు తెలుపుతున్నారు. నవంబర్ 1, 2025 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ నిషేదాజ్ఞలు ఉండబోతున్నాయి. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026 నాటికి ఈ విధానం మొత్తం ఎన్సీఆర్ను పరిధిలో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యంమరోవైపు 2025 నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, వాణిజ్య గూడ్స్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) నిషేధించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో వాహన కాలుష్యం క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఈ విధానాలు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఎంతో తోడ్పడుతాయని అధికారులు తెలిపారు. -
బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యం
మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సవరించిన మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల వివరాలు ఇంకా విడుదల కాకపోవడంతో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాత సాధారణంగా ఈ రేట్లను ప్రకటిస్తారు.ప్రస్తుతానికి అయితే బీమా సంస్థలు గత ఏడాది రేట్ల ఆధారంగానే ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. త్వరలో వెలువడే సవరించిన రేట్లు ప్రస్తుతం కంటే ఎక్కువగా ఉంటే బీమా సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇప్పటికే తన సిఫార్సులను పూర్తి చేసిందని, తదుపరి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ రేట్లను 2025 మార్చి 31 లోపు విడుదల చేయాలని అధికారులు భావించారు. వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ రేట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. అయితే ఈసారి కొన్ని వాహన కేటగిరీలకు 10-15% ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంబయి ఎయిర్పోర్ట్లో సేవలు నిలిపివేత.. కారణం..గత ఐదేళ్లలో థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు 2-4% వరకు స్వల్పంగా పెరిగాయి. కానీ బీమా సంస్థలు ఈ ఏడాది గణనీయంగా రేట్లను సవరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్ ఖర్చులు కంపెనీల నష్టాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇదిలాఉండగా, రోడ్డు ప్రమాద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బాధితుల సామాజిక భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉండాలి. కానీ రేట్ల నిర్ధారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థల వైఖరిపట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఇండియాలో టెస్లా సైబర్ ట్రక్
టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మోడల్ వై టెస్టింగ్ దశలో ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా ఇప్పుడు సైబర్ట్రక్ కనిపించింది. అయితే ఈ కారు దుబాయ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా దీనిని తాత్కాలికంగా దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.టెస్టింగ్ దశలో టెస్లా కారుటెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.టెస్లా సైబర్ ట్రక్టెస్లా సైబర్ట్రక్ డిసెంబర్ 2023లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఇది ప్రత్యేకమైన స్టెయిన్లెస్-స్టీల్ బాడీ.. వెనుక భాగంలో 4x6 అడుగుల లోడింగ్ బెడ్ను కలిగి ఉంది. సైబర్ట్రక్ భారీ 35 ఇంచెస్ టైర్లపై నడుస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ గరిష్టంగా 432 మిమీ వరకు ఉంటుంది. ఈ కారు సింగిల్ ఛార్జితో 563 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.Source: Powerdrift -
వాహనాలకూ సైబర్ రిస్కులు
కార్లు, రవాణా వాహనాలు మరింత కనెక్టెడ్గా, సాఫ్ట్వేర్ ఆధారితమైనవిగా మారిపోతున్న నేపథ్యంలో ఎయిర్బ్యాగ్లలాగా ఆటోమోటివ్ సైబర్సెక్యూరిటీ కూడా ప్రామాణిక ఫీచరుగా మారనుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అంతర్గతంగా వాహన నెట్వర్క్ ట్యాంపరింగ్, జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్, స్టీరింగ్..బ్రేకింగ్ మొదలైన సిస్టమ్లను రిమోట్గా కంట్రోల్ చేయడం వంటి సైబర్సెక్యూరిటీపరమైన ముప్పులు కొత్త తరం వాహనాల్లో గణనీయంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇలాంటి రిస్కుల నుంచి వాహనాలను కాపాడేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా పలు సంస్థలు వాహన రంగం కోసం సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్లుగా ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్ల తరహాలోనే డిజిటల్ భద్రత సాధనాలూ వాహనాల్లో తప్పనిసరి ఫీచర్లుగా మారొచ్చని సైబర్సెక్యూరిటీ సంస్థ హ్యాకర్స్ఎరా వ్యవస్థాపకుడు వికాస్ చౌదరి తెలిపారు. ఐడీపీఎస్ (ఇన్ట్రూజన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్స్), వీఎస్ఓసీ (వెహికల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్స్) లాంటి సిస్టమ్లు ముప్పులను నివారించడానికే కాకుండా కొనుగోలు ప్రణాళికలనూ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. రియల్ టైమ్పర్యవేక్షణ..పెద్ద ఎత్తున వాహనాలను నిర్వహించే ఫ్లీట్ ఆపరేటర్లు, కనెక్టెడ్ ప్రజా రవాణా వ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించి ఏ ఒక్క వాహనంలోనైనా సెక్యూరిటీపరమైన సమస్యలు తలెత్తితే అవి మొత్తం నెట్వర్క్ అంతటికీ వ్యాపించే అవకాశం ఉంటుందని చౌదరి తెలిపారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు రూపొందించిన వీఎస్వోసీలు సాంప్రదాయ ఐటీ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్లలాగానే పని చేస్తాయి. కానీ ఇవి ప్రత్యేకంగా వాహనాల కోసం రూపొందించినవై ఉంటాయి. వాహనాల నుంచి వీటికి రియల్ టైమ్లో డేటా లభిస్తుంది. తద్వారా రిస్కులకు దారి తీసే ధోరణులను, ముప్పులను ఇవి పసిగట్టగలవు.కొత్త తరం వాహనాలకు డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రాంలను రూపొందించడం కోసం వాహనాల తయారీ సంస్థలు, సరఫరాదారులు, మొబిలిటీ స్టార్టప్లతో తాము కలిసి పని చేస్తున్నట్లు చౌదరి వివరించారు. ఎథర్నెట్, ఆర్ఎఫ్, బ్లూటూత్ మొదలైన వాటన్నింటికీ దేని రిస్కు దానికి ఉంటుందని, ఒక్కో దానికి ఒక్కో రకమైన రక్షణ అవసరమని పేర్కొన్నారు. కనెక్టెడ్ వాహనాల్లో బలహీనతలను గుర్తించేందుకు, తగిన విధంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుందని టాటా మోటార్స్ ప్రతినిధి తెలిపారు. ఐఎస్వో/ఎస్ఏఈ 21434లాంటి పరిశ్రమ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ద్వారా ఉత్తమ విధానాలను పాటించవచ్చని పేర్కొన్నారు.కంపెనీలు ఎప్పటికప్పుడు వాహన సాఫ్ట్వేర్ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లతో అప్డేట్ చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏఐఎస్ 189 ప్రమాణాలు భారత్లో కూడా అమల్లోకి రానున్నట్లు చౌదరి చెప్పారు. ఇక యూఎన్ ఆర్155, ఐఎస్వో 21434లాంటి గ్లోబల్ ప్రమాణాలు కూడా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో వాహనాల సైబర్సెక్యూరిటీ కేవలం ఉత్తమ విధానంగానే కాకుండా చట్టబద్ధంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు వాహనం ‘ఎంత మైలేజీ’ ఇస్తుందనే మాట్లాడుకుంటూ ఉండగా.. ఇకపై ‘ఎంత సెక్యూర్గా ఉంటుంది’ అని మాట్లాడుకునే రోజులు వస్తాయని పేర్కొన్నారు. - సాక్షి, బిజినెస్ డెస్క్ -
2025 కవాసకి నింజా 650 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి.. దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 2025 నింజా 650 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది OBD-2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధర కంటే కూడా రూ. 11000 ఎక్కువ. కాబట్టి ఈ కొత్త బైక్ ధర రూ. 7.27 లక్షలు (ఎక్స్ షోరూమ్).2025 కవాసకి నింజా 650 బైక్ ఇప్పుడు వైట్ / ఎల్లో రంగుతో.. కొత్త ఆకుపచ్చ రంగులో లభిస్తుంది. ఇది చూడటానికి కొంత కవాసకి పోర్ట్ఫోలియోలోని నింజా ఆర్ సిరీస్ బైకు మాదిరిగా ఉంటుంది. ఇందులో 4.3 ఇంచెస్ ఫుల్ డిజిటల్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కవాసకి రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.2025 కవాసకి నింజా 650 బైకులో.. అదే 649 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 67.31 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. 196 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ కెపాసిటీ 15 లీటర్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో.. -
ట్రంప్ కొట్టిన దెబ్బ.. ఊడుతున్న 800 ఉద్యోగాలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అన్ని పరిశ్రమల్లోనూ అనిశ్చితి ఆవహించింది. ఈ క్రమంలో స్వీడన్కు చెందిన భారీ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కులకు డిమాండ్ తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో అమెరికాలోని మూడు కర్మాగారాలలో 550 నుంచి 800 మంది కార్మికులను తొలగించేందుకు సిద్ధమైందని రాయిటర్స్ కథనం పేర్కొంది.ఈ తొలగింపులు పెన్సిల్వేనియాలోని మకుంగీలో ఉన్న మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియాలోని డబ్లిన్, మేరీల్యాండ్లోని హేగర్స్టౌన్లో ఉన్న రెండు వోల్వో సైట్లలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని, ముఖ్యంగా ఆటోమోటివ్, భారీ పరికరాల రంగాలను అస్తవ్యస్తం చేసి, తయారీ ఖర్చులను పెంచడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇది చదివారా? ట్రంప్ టారిఫ్ల దెబ్బ.. కార్ల కంపెనీ మూతసుంకాలే కారణం..ఉత్తర అమెరికాలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉన్న వోల్వో సంస్థ భారీ-డ్యూటీ ట్రక్కులకు మార్కెట్ బలహీనంగా ఉన్నందున ఉత్పత్తిని సర్దుబాటు చేయడానికి ఈ ఉద్యోగ కోతలు అవసరమని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వివరించింది. సరుకు రవాణా రేట్లలో అస్థిరత, సంభావ్య నియంత్రణ మార్పులు, సుంకాల వల్ల కలిగే విస్తృత ఆర్థిక ప్రభావం వంటి అనేక కారణాలు ఈ తొలగింపులకు దోహదపడ్డాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని నిర్ధారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాము” ఆ ప్రతినిధి తెలిపారు.ఇటీవలి నెలల్లో అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇప్పుడీ సుంకాలు.. ముడి పదార్థాలు, విడి భాగాల ఖర్చులను మరింత పెంచాయి. ఫ్రైట్ డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి వంటివి వోల్వో వంటి స్థిరమైన వాణిజ్య పరిస్థితులపై ఆధారపడే సంస్థలను మరింత ఒత్తిడికి గురిచేశాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలగింపునకు సంభందించిన పూర్తి వివరాలు వెల్లడి కానప్పటికీ ప్రభావితమైన కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర సాయాన్ని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. -
ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 20) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది. ఈ విధానం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ వంటి అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది.ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలుదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల్లో నిన్నటి పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. గత ఐదు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 20న పెట్రోల్ ధర లీటరుకు ఏయే నగరంలో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ.107.46విజయవాడ: రూ.109.74న్యూ ఢిల్లీ: రూ.94.77ముంబై: రూ.103.50కోల్కతా: రూ.105.01చెన్నై: రూ.101.03బెంగళూరు: రూ.102.98అహ్మదాబాద్: రూ.94.58లక్నో: రూ.94.58పాట్నా: రూ.106.11డీజిల్ ధరలుడీజిల్ ధరలు కూడా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య విభిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 20న డీజిల్ ధరలు లీటర్కు ఇలా ఉన్నాయి.హైదరాబాద్: రూ.95.70విజయవాడ: రూ.97.57న్యూ ఢిల్లీ: రూ.87.67ముంబై: రూ.90.03కోల్కతా: రూ.91.82చెన్నై: రూ.92.39బెంగళూరు: రూ.90.99అహ్మదాబాద్: రూ.90.17 -
భారత్లో జర్మన్ కంపెనీ అరుదైన రికార్డ్
జర్మన్ కంపెనీ అయిన 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2,00,000 ప్యాసింజర్ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేసిన మొట్టమొదటి లగ్జరీ కార్ బ్రాండ్గా అవతరించింది. మహారాష్ట్రలోని పూణేలోని చకన్ ప్లాంట్ నుంచి ఎలక్ట్రిక్ కారు EQSను విడుదల చేయడంతో కంపెనీ ఈ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.మెర్సిడెస్ బెంజ్ పూణేలోని చకన్ ప్లాంట్లో 50000 యూనిట్లను అసెంబుల్ చేయడానికి 19 సంవత్సరాలు (1995 నుంచి 2014 వరకు) పట్టింది. ఆ తరువాత 1.50 లక్షల యూనిట్లను కేవలం పదేళ్లలో (2015 నుంచి 2025 వరకు) ఉత్పత్తి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఉత్పత్తి సుమారు 470 శాతం పెరిగింది. -
దేశంలో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (ఏప్రిల్ 19) స్థిరంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాల విలువ ఆధారిత పన్ను (VAT), రవాణా ఖర్చులు, స్థానిక నిబంధనల కారణంగా నగరాల మధ్య ధరలలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ ధరలను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు డైనమిక్ ఇంధన ధరల నిర్ణయ విధానం ప్రకారం సవరిస్తారు. ఇది 2017 జూన్ నుండి అమలులో ఉంది. ఈ విధానం అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్ వంటి అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తుంది.ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలుదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల్లో నిన్నటి పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. గత ఐదు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ 19న పెట్రోల్ ధర లీటరుకు ఏయే నగరంలో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ.107.46విజయవాడ: రూ.109.74న్యూ ఢిల్లీ: రూ.94.77ముంబై: రూ.103.50కోల్కతా: రూ.105.01చెన్నై: రూ.101.03బెంగళూరు: రూ.102.98అహ్మదాబాద్: రూ.94.58లక్నో: రూ.94.58పాట్నా: రూ.106.11డీజిల్ ధరలుడీజిల్ ధరలు కూడా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య విభిన్నంగా ఉంటాయి. ఏప్రిల్ 19న డీజిల్ ధరలు లీటర్కు ఇలా ఉన్నాయి.హైదరాబాద్: రూ.95.70విజయవాడ: రూ.97.57న్యూ ఢిల్లీ: రూ.87.67ముంబై: రూ.90.03కోల్కతా: రూ.91.82చెన్నై: రూ.92.39బెంగళూరు: రూ.90.99అహ్మదాబాద్: రూ.90.17 -
2025 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ కంపెనీ.. 2025 అపాచీ ఆర్ఆర్ 310 బైకును మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.2025 అపాచీ ఆర్ఆర్ 310.. టర్న్ సిగ్నల్ లాంప్స్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ అనే రెండు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను పొందుతుంది. లాంచ్ కంట్రోల్, కొత్త 8 స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఈ బైకులో ఉన్నాయి. టీవీఎస్ ఆసియా ఓఎంసీ రేస్ బైక్ నుంచి ప్రేరణ పొందటం చేత.. ఈ బైక్ సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ స్కీమ్ పొందుతుంది.ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ అదే 312 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 9,800 rpm వద్ద 37 bhp & 7,900 rpm వద్ద 29 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ బైక్ కోసం కంపెనీ ప్రత్యేకంగా కిట్ కూడా అందిస్తోంది. దీనికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. -
టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారతదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు టెస్లా కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కారు త్వరలోనే అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది.టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.టెస్లా మోడల్ వైప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న టెస్లా మోడల్ వై కారు.. సింగిల్ ఛార్జిపై 526 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందింది. 4.6 సెకన్లలో 0 నుంచి 96 కిమీ వేగాన్ని అందుకునే ఈ ఎలక్ట్రిక్ వెహికల్.. టాప్ స్పీడ్ 200 కిమీ. చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!భారతదేశంలో టెస్లా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉంటుందనే చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు భారతీయ రోడ్లకు తగిన విధంగా ఉండేలా కంపెనీ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు
2024లో ప్రపంచ మార్కెట్లో అడుగుపెట్టిన అయిన రెండవ తరం స్కోడా కొడియాక్ ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ అయింది. ఇది లౌరిన్ & క్లెమెంట్ (L&K), స్పోర్ట్లైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 46.89 లక్షలు, రూ. 48.69 లక్షలు (ఎక్స్ షోరూమ్).2025 స్కోడా కొడియాక్ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ కారు ముందు భాగంలో సిగ్నేచర్ బటర్ఫ్లై గ్రిల్ ఉంటుంది. స్ప్లిట్ హెడ్ల్యాంప్ అలాగే ఉంది. కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్ సిగ్నేచర్లను పొందుతాయి. బంపర్ రెండు అంచులలో ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ను పొందుతుంది. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో సీ షేప్ టెయిల్ లాంప్ వంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొత్త కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉంటుంది.కొడియాక్ లోపలి భాగంలో 13 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!ఇంజిన్ విషయానికి వస్తే.. 2025 కొడియాక్ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండు వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి. మైలేజ్ 14.86 కిమీ/లీ వరకు ఉంటుందని స్కోడా వెల్లడించింది. -
‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’
అమెరికా టారిఫ్లు వాహన ధరలను పెంచుతాయని నిస్సాన్ అమెరికా ఛైర్మన్ క్రిస్టియన్ మ్యూనియర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కారు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నట్లు తెలిపారు. మెక్సికో నుంచి ఎగుమతయ్యే వాహనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను కుదిపేస్తాయని చెప్పారు.‘20,000 డాలర్ల(రూ.16 లక్షలు) సగటు ధర కలిగిన నిస్సాన్ వెర్సా మెక్సికోలో తయారవుతుంది. టారిఫ్ అమల్లోకి రావడంతో అమెరికాకు దీని ఎగుమతులు కష్టంగా మారుతున్నాయి. యూఎస్లో చౌకగా లభించే కారు ఇకపై కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మెక్సికోకు బదులుగా అమెరికాలోనూ నిస్సాన్ చౌక వాహనాలను తయారు చేయడం సాధ్యమే అయినప్పటికీ, మెక్సికో నుంచి కొన్ని విడిభాగాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే సవాళ్లు ఎదురవుతాయి’ అని మ్యూనియర్ అన్నారు.ఇదీ చదవండి: భారత్లో పత్తి పండుతున్నా దిగుమతులెందుకు?కాక్స్ ఆటోమోటివ్ విశ్లేషణ ప్రకారం.. యూఎస్లో కారు సగటు ధర 48,000 డాలర్లు(సుమారు రూ.40 లక్షలు). ప్రభావిత మోడళ్ల ధరలకు టారిఫ్లు 10% నుండి 15% వరకు అదనంగా పెరుగుతాయి. లెవీ పరిధిలో లేని వాహనాల ధరలు మొత్తంగా 5% పెరుగుతాయని సంస్థ అంచనా వేస్తోంది. టారిఫ్ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మోడళ్లలో 30,000 డాలర్ల(రూ.25 లక్షలు) కంటే తక్కువ ధర కలిగినవే ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉత్పత్తి అవుతున్నవే కావడం గమనార్హం. -
ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్..
ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. ఈ వేడివల్ల కారు లోపలి భాగం కూడా వేడెక్కిపోతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటే సమస్య ఉండదు. కానీ పార్కింగ్ చేసినప్పుడు కూడా కారులో ఏసీ ఆన్ చేసి పెట్టడం కుదరదు. కాబట్టి సమ్మర్లో కారు చల్లగా ఉండాలంటే పాటించాల్సిన ఐదు టిప్స్ పాటించాలి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.విండో వైజర్లు & సన్షేడ్లను ఉపయోగించండిక్వాలిటీ ఉన్న సన్షేడ్ను ఉపయోగించడం వల్ల.. కారు లోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎందుకంటే అవి సూర్యరష్మిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. తద్వారా డ్యాష్బోర్డ్, సీట్లు వేడెక్కకుండా ఉంటాయి. నీటిని, చెత్తను కూడా లోపలికి రాకుండా ఇవి కొంత నియంత్రిస్తాయి. అయితే రోడ్డుపై ప్రయాణించేటప్పుడు సన్షేడ్ లేదా సన్ఫిల్మ్ నిషేధం. దీనిని వాహనదారులు గుర్తుంచుకోవాలి.నీడలో పార్క్ చేయాలికారును ఎండగా ఉన్న ప్రదేశంలో కాకుండా.. నీడగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. చెట్లు, పార్కింగ్ గ్యారేజీలు లేదా పెద్ద భవనాల నీడ తగిలే చోట కారును పార్క్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండా నేరుగా కారుపై పడదు. అప్పుడు కారు లోపలి వాతావరణం వేడెక్కకుండా ఉంటుంది.విండోస్ ఓపెన్ చేయండికారును పార్కింగ్ చేసే సమయంలోనే విండోస్ ఓపెన్ చేయడం మంచిది. ఇలా చేస్తే.. బయట గాలి లోపలకు, లోపలి గాలి బయటకు వస్తుంది. అయితే పార్కింగ్ చేసే ప్రదేశం సురక్షితంగా ఉందని నిర్దారించుకున్నప్పుడు.. విండోస్ ఓపెన్ చేయాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!స్టీరింగ్ వీల్ & సీట్ కవర్లను ఉపయోగించండిఅధిక వేడి కారణంగా.. స్టీరింగ్ వీల్, సీట్లు తొందరగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి స్టీరింగ్ వీల్, సీట్లను కాపాడుకోవడానికి వాటికి సరైన కవర్లను ఉపయోగించాలి. ఇవి సీట్ల మీద, స్టీరింగ్ వీల్ మీద ఎండా పడకుండా చేస్తాయి.పార్కింగ్ పొజిషన్ ముఖ్యంకారును ఉపయోగించిన తరువాత ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తే.. కారులోని వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి పార్కింగ్ పొజిషన్ కూడా ముఖ్యమన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సూర్య కిరణాలు ఏ వైపు తక్కువగా పడుతున్నాయో గమనించి పార్కింగ్ చేయాలి.ఎండాకాలం కారును రక్షించుకోవడం చాలా అవసరం. లేకుంటే చాలా తొందరగా పనికిరాకుండా పోతుంది. ఎప్పటికప్పుడు కారును వాష్ చేయడం, టైర్ ప్రెజర్ చెక్ చేస్తూ ఉండటం, ఏసీ వెంట్స్ గమనించడం, లోపల క్యాబిన్లో వ్యర్థ పదార్థాలు లేదా తినుబండారాలను నిల్వ చేయకుండా చూసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే.. కారు లైఫ్ టైమ్ కొంత బాగుంటుంది. -
ఫోక్స్వ్యాగన్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
ఫోక్స్వ్యాగన్ తన టిగువాన్ ఆర్ లైన్ను దేశీయ మార్కెట్లో రూ. 49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన తర్వాత భారతదేశానికి వచ్చిన కొత్త తరం టిగువాన్ ఈ ఆర్-లైన్. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికీ దిగుమతి అవుతుంది.అప్డేటెడ్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగిన ఫోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్.. పెర్సిమోన్ రెడ్, నైట్ షేడ్ బ్లూ, గ్రెనడిల్లా బ్లాక్, ఒనిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్, సిప్రెస్సినో గ్రీన్, ఓయిస్టర్ సిల్వర్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ముందు బంపర్ మీద ఎయిర్ డ్యామ్, షార్ప్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.ఫోక్స్వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ 2.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 201 Bhp పవర్, 320 Nm టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్తో లభిస్తుంది. ఇది 12.58 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. వాస్తవ ప్రపంచంలో మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది. -
త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే పాలసీ
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై అధిక టోల్ ఛార్జీల నుంచి లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలిగించే కొత్త టోల్ పాలసీ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు వేగంగా కదులుతున్నాయి. రెండున్నర లేన్లుగా ఉన్న ఇరుకైన జాతీయ రహదారులపై యూజర్ ఫీజు రద్దు, కార్ల అపరిమిత ప్రయాణానికి రూ .3,000 వార్షిక పాస్.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ చేసిన ఈ రెండు ప్రతిపాదనలు ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి.ఈ ప్రతిపాదనలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే వీటి వల్ల ఖజానా కొంతమేర నష్టం కలుగనున్న నేపథ్యంలో వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. వార్షిక పాసులవల్ల టోల్ ఆదాయానికి కొంతమేర గండి పడనున్నప్పటికీ, ఇరుకైన రహదారులపై యూజర్ ఫీజు వసూలును నిలిపివేయడం వల్ల మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు.ప్రైవేటు వాహనాలకు వార్షిక, జీవితకాల పాస్ ఆప్షన్ను అందించే ప్రణాళిక గురించి రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో చెప్పారు. దీనిపట్ల వాహన యజమానులలో విశేష స్పందన ఉన్న నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టింది. 2024-25లో మొత్తం టోల్ ఆదాయం రూ.61,000 కోట్లలో ప్రైవేటు కార్ల వాటా 20-21 శాతంగా ఉంది. 79-80% రుసుములో ఎక్కువ భాగం వాణిజ్య , భారీ వాహనాల నుండి వస్తోంది. -
పాత బైక్ ధరకే 2025 సుజుకి హయబుసా
సుజుకి మోటార్సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఖరీదైన బైకులలో సుజుకి హయబుసా ఒకటి. దీనిని కంపెనీ OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. అయితే ఈ అప్డేట్ బైక్ ధరలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు. అంటే ఈ కొత్త బైక్.. పాత బైక్ ధరకే అందుబాటులో ఉందన్నమాట.2025 సుజుకి హయబుసా బైక్ ధర రూ. 16.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). చూడటానికి మునుపటి బైక్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఉద్గార నియమాలకు అనుగుణంగా అప్డేట్ అయింది. ఈ బైక్ అదే 1340 సీసీ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్ లాంచ్: రేటెంతంటే?కొత్త హయబుసా ఇప్పుడు మెటాలిక్ మ్యాట్ స్టీల్ గ్రీన్/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్/మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్/పెర్ల్ వైగర్ బ్లూ అనే కొత్త డ్యూయెల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
దేశీయ మార్కెట్లో ఆస్ట్రియన్ బ్రాండ్ బైక్ లాంచ్: రేటెంతంటే?
కేటీఎం కంపెనీ ఇండియన్ మార్కెట్లో.. 390 ఎండ్యూరో ఆర్ బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ చాలావరకు ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న కేటీఎం 390 అడ్వెంచర్ మాదిరిగా ఉంటాయి. అయితే దీని ధర స్టాండర్డ్ 390 అడ్వెంచర్ కంటే రూ. 31,000 తక్కువ.కొత్త కేటీఎం 390 ఎండ్యూరో ఆర్.. సస్పెన్షన్ ట్రావెల్, గ్రౌండ్ క్లియరెన్స్ రెండూ కూడా భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి రైడింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులోని 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 46 హార్స్ పవర్, 39 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!సింగిల్-పీస్ సీటులోనే విలీనమైన ఫ్యూయెల్ ట్యాంక్ ఇక్కడ చూడవచ్చు. దీని కెపాసిటీ 9 లీటర్లు. ఈ బైక్ ప్రత్యేకింగ్ ఆఫ్ రోడింగ్ ప్రియుల కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. -
డిస్క్ బ్రేక్తో స్ల్పెండర్ ప్లస్
ప్రముఖ టూవీలర్ విక్రయ సంస్థ హీరో స్ల్పెండర్ ప్లస్ మోడల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఈ బైక్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెసులుబాటును అందిస్తున్నట్లు పేర్కొంది. ఇది బైక్ భద్రత, బ్రేకింగ్ పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పింది. ఈ ఫీచర్ స్ల్పెండర్ ప్లస్ ఎక్స్టెక్ వేరియంట్లో తీసుకురాబోతున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ హెడ్లైట్స్ వస్తాయని చెప్పాయి.ఇదీ చదవండి: కొత్తగా 34 బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభంపట్టణ రవాణా పరిస్థితుల్లో డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో అవసరమని భావించి ఈ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బైక్లో మెరుగైన బ్రేకింగ్ నియంత్రణ కోసం 240 మిమీ ఫ్రంట్ డిస్క్ను అందిస్తున్నట్లు చెప్పారు. వెనుక భాగంలో ప్రస్తుతం ఉన్నట్లుగానే డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుందని తెలిపారు. ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 8.02 పీఎస్, 8.05 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్ల్పెండర్ ప్లస్ ఎక్స్టెక్ వేరియంట్ ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. -
మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.స్పిన్నీ డేటా ప్రకారం.. 2025 మొదటి త్రైమాసికంలో ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్లో గణనీయమైన మార్పులను నివేదించింది. అమ్మకాలలో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారా జరుగుతున్నాయి. మహిళా కొనుగోలుదారుల సంఖ్య 28 శాతం పెరిగింది. మొదటిసారి కారు కొనుగోలు చేసినవారు 74 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిక్ కార్ల అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలు, పూణేలలో కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా బ్రాండ్ కార్లను అధికంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారని నివేదిక ద్వారా తెలుస్తోంది. తెలుపు, బూడిద, ఎరుపు రంగు కార్లకే డిమాండ్ ఎక్కువని స్పిన్నీ స్పష్టం చేసింది.డిజిటల్ లావాదేవీలు 2023లో 70 శాతం, 2024లో 75 శాతం ఉండగా 2025 మొదటి త్రైమాసికంలో 77 శాతానికి చేరింది. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న వారిలో 57 శాతం మంది లోన్ ద్వారానే కార్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. మహిళా కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో 26 శాతం మంది మహిళా కొనుగోలుదారులు ఉండగా.. 2025 నాటికి వీటి సంఖ్య 28 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఏదంటే..60 శాతం మంది మహిళలు ఆటోమేటిక్ హ్యాచ్బ్యాక్లను ఇష్టపడుతుంటే.. 18 శాతం మంది కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. లోన్ ద్వారా కార్లను కొనుగోలుచేస్తున్న మహిళలు 27 శాతం ఉన్నారని నివేదికలో వెల్లడైంది.రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి వాహనాలు అధిక ప్రజాదరణ పొందుతుండగా.. కాంపాక్ట్ SUVల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఉన్నాయి. అమ్మకాల్లో 84 శాతం పెట్రోల్ కార్లు, 10 శాతం డీజిల్ కార్లు, 4 శాతం CNG కార్లు, 2 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నిక్సన్ ఈవీ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ కూడా బాగా అభివృద్ధి చెందితోంది. అంటే కొనుగోలుదారుల్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఆదరణ పెరుగుతుండడంతో ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో వాటి కొనుగోళ్లకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది ఈవీలను ప్రోత్సహించడంతోపాటు అక్కడ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో ఈవీ స్వీకరణను వేగవంతం చేయడానికి, వాయు కాలుష్యం సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ 2.0ను ప్రవేశపెట్టింది.ఈ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ.36,000 వరకు సబ్సిడీ ఇవ్వడం ద్వారా మహిళా కొనుగోలుదారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న మొదటి 10,000 మంది మహిళలకు ఈ సబ్సిడీ లభిస్తుందని పేర్కొంది. ఈ విధానం ప్రధాన ఉద్దేశం పర్యావరణహితమైన అనుకూల రవాణా అందించేలా వాహనదారులను ప్రోత్సహించడం, వాహనం ఉండాలని కొరుకునే మహిళలకు ఆర్థిక అవరోధాన్ని తగ్గించడం అని ప్రభుత్వం తెలిపింది.అదనపు ప్రోత్సాహకాలుఈ విధానంలో భాగంగా పాత, కాలుష్యకారక శిలాజ ఇంధనంతో నడిచే వాహనాలను స్క్రాప్ చేసే వారు కొత్త ఈవీ వాహనం కొనుగోలు చేస్తే ప్రయోజనాలను అందించనుంది. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, వాణిజ్య వాహనాలు వంటి విభాగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇది పరిశుభ్రమైన, గ్రీన్ మొబిలిటీకి ఎంతో తోడ్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?మహిళలకు ఎంతో మేలుఢిల్లీ వంటి కాలుష్యకారక నగరాలకు ఇలాంటి పాలసీలు ఎంతో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నాయి. ఈ నగరంలో ఏడాది పొడవునా తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 పర్యావరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉండటంతో మహిళ రోజువారీ ప్రయాణంపై భరోసాను కలిగి ఉంటారని చెబుతున్నారు. ఇది ప్రజా రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వ్యక్తిగత వాహనాలతో మహిళలు ఏ సమయంలోనైనా సురక్షితంగా ప్రయాణించవచ్చు. -
జాగ్వార్ ల్యాండ్ రోవర్ రికార్డ్ సేల్స్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. 6,183 యూనిట్లను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం. హోల్సేల్ విక్రయాలు 39 శాతం పెరిగి 6,266 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిఫెండర్ అమ్మకాలు అత్యధికంగా 90 శాతం, దేశీయంగా తయారు చేసిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ విక్రయాలు వరుసగా 72 శాతం, 42 శాతం మేర పెరిగాయి. రిటైల్, హోల్సేల్ అమ్మకాల్లో పరిశ్రమను మించిన పనితీరును కనపర్చినట్లు జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ దీన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు. -
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్లో రెండు, వరంగల్లో ఒకటి చొప్పున మొత్తం 3 షోరూమ్లను ప్రారంభించింది. వీటిలో సర్వీస్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒక్కో కొత్త షోరూమ్లో రోర్ ఈజెడ్ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 30 కస్టమర్లకు కాంప్లిమెంటరీగా బంగారు నాణెం అందిస్తున్నట్లు సీఈవో మధుమిత అగ్రవాల్ తెలిపారు.రోర్ ఈజెడ్ వాహనం ధర రూ. 89,999గా ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజి ఇస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 50 నగరాల్లో 100 పైచిలుకు షోరూమ్లు, సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 35 షోరూమ్లు ఉన్నాయి. ఒబెన్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 15 కొత్త షోరూమ్లను ప్రారంభించగా పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా అడుగు పెట్టింది. దీనితో పాటు ఇప్పటికే ఉన్న మార్కెట్లలో తన పరిధిని బలోపేతం చేసుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర ప్రదేశ్లలో కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. -
భారత్లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
ఎంజీ విండ్సర్ (MG Windsor) ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో అరుదైన ఘనత సాధించిందని జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. మార్కెట్లో లాంచ్ అయిన ఆరు నెలల్లో 20,000 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ నిలిచింది.ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఎంజీ మోటార్ కార్లకంటే భిన్నంగా ఉన్న.. విండ్సర్ ఈవీ అతి వేంగంగా అమ్ముడైందని.. జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ సేల్స్ & మార్కెటింగ్ రాకేష్ సేన్ స్పష్టం చేశారు. మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్.. అధిక రేంజ్ వంటి కారణాల వల్ల దీనిని చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.ఎంజీ విండ్సర్ 38 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్పై 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 136 హార్స్ పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎక్సైట్ (రూ. 13,99,800), ఎక్స్క్లూజివ్ (రూ. 14,99,800), ఎసెన్స్ (రూ. 15,99,800) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకుఎంజీ మోటార్ కంపెనీ.. భారతదేశంలో ప్రస్తుతం హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జెడ్ఎస్ఈవీ, కామెట్ వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కాగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సైబర్స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. -
బజాజ్ ఆటో మాజీ వైస్ ఛైర్మన్ కన్నుమూత
బజాజ్ ఆటో మాజీ వైస్ ఛైర్మన్ మాధుర్ బజాజ్(73) మృతి చెందారు. వృద్ధాప్య కారణాల వల్ల అస్వస్థతతో ఇటీవల దక్షిణ ముంబైలో ఉన్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతుండగానే శుక్రవారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా గతేడాది జనవరిలో బజాజ్ ఆటో వైస్ ఛైర్మన్ పదవికి మాధుర్ రాజీనామా చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు మాధుర్ బజాజ్. విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయన గ్రూప్లోని పలు కంపెనీలకు డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్)తో పాటు సీఐఐ, ఇతర పారిశ్రామిక సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు.ఇదీ చదవండి: డాలర్కు ట్రంప్ గండంకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు భారత వృద్ధిలో భాగస్వామ్యం అయ్యారంటూ బజాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబ స్నేహితుడు కన్నుమూశారని విచారం వ్యక్తం చేస్తూ భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కళ్యాణి సంతాపం తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (వెస్ట్రన్ రీజియన్) ఛైర్మన్గా, చాంబర్ ఆఫ్ మరాఠ్వాడా ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అధ్యక్షుడిగా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్తో భాగస్వామిగా ఆయన ఎంతో సేవలందించారని బాబా కళ్యాణి తెలిపారు. -
ఓలా ఎలక్ట్రిక్ తొలి ‘రోడ్స్టర్ ఎక్స్’ బైక్ విడుదల
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ క్రిష్ణగిరి ‘ఫ్యూచర్ఫ్యాక్టరీ’లో తయారుచేసిన తొలి ‘రోడ్స్టర్ ఎక్స్ మోటార్సైకిల్’ను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏప్రిల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ‘‘విద్యుత్ వాహన విప్లవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే నిబద్దతకు ప్రతిరూపమే ‘రోడ్స్టర్ ఎక్స్ సిరీస్’. మా కొత్త ఉత్పత్తి ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కొత్త శకానికి నాందిగా నిలిస్తుంది.’’ అని కంపెనీ చైర్మన్ ఎండీ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఈ బైక్ను కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్–డ్రైవ్ మోటార్తో రూపొందించింది. ఇందులో ఎంసీయూ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక టెక్నాలజీ కూడా ఉంది. ఐపీ67 సరి్టఫైడ్ బ్యాటరీలు ఉన్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్ సిరీస్ 2.5 కిలోవాట్ హవర్(కేడబ్ల్యూహెచ్) 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.84,999, రూ.94,999, రూ.1,04,999గా ఉన్నాయి. కాగా, ఎక్స్ప్లస్ సిరిస్లో 4.5కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,14,999 లక్షలు ఉండగా, 9.1కేడబ్ల్యూహెచ్ బైక్ ధర రూ.1,84,999గా ఉంది. -
టెస్లా కొత్త సైబర్ట్రక్ విడుదల.. ధర ఎంతంటే..
ప్రముఖ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా యూఎస్లో కొత్త సైబర్ట్రక్ వెర్షన్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) నిర్ణయించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు సైబర్ట్రక్ మోడళ్లలో చౌకైనదిగా కంపెనీ పేర్కొంది. కొత్త సైబర్ట్రక్ వేరియంట్కు సంబంధించిన రేంజ్, టోవింగ్ సామర్థ్యం, యాక్సిలరేషన్ వంటి స్పెసిఫికేషన్లపై కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.అమెరికాలో 69,990 డాలర్ల ధరతో ఎంట్రీ లెవల్ సైబర్ట్రక్ యూఎస్ మార్కెట్లో ఆదరణ పొందుతున్న ఫోర్డ్ ఎఫ్-150 లైటనింగ్, రివియన్ ఆర్ 1 టీ వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఎక్సోస్కెలెటన్, ఆర్మర్డ్ గ్లాస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సామర్థ్యాలు సైబర్ట్రక్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: 'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'ఈవీ విభాగంలో టెస్లా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కంపెనీ కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ హెచ్చుతగ్గులుండడం వాహన తయారీదారులు ధరలకు సంబంధించి పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో టెస్లా తీసుకున్న నిర్ణయం వినియోగదారులు మరింత సరసమైన ధరలకు కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా మారుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరికైనా జరిమానా తప్పదు, అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేను కూడా ముంబైలో రెండు సార్లు ఫైన్ కట్టానని రైజింగ్ భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పుడు హైవేలమీద అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేదు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. కెమెరా ఫోటో తీస్తుంది. జరిమానా తప్పకుండా కట్టాల్సిందే. కఠినమైన ట్రాఫిక్ చలాన్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. జరిమానాలు ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టలేదు. చట్టానికి కట్టుబడి ఉండటానికి తీసుకొచ్చాము. జరిమానాలు పెరిగాయని ప్రజలు అంటున్నారు.. అలాంటప్పుడు నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండే సరిపోతుందని గడ్కరీ అన్నారు.ప్రభుత్వం 2019లో మోటారు వాహన చట్టాన్ని సవరించింది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, రవాణా నియమాల ఉల్లంఘనలు పెరగడం వల్ల.. రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించడానికి ప్రధాన మార్గం అధిక జరిమానాలు విధించడమే. 2019లో రోడ్డు ప్రమాదం వల్ల మరణించినవారి సంఖ్య సుమారు 1.59 లక్షలు, ఈ సంఖ్య 2022 నాటికి 1.68 లక్షలకు చేరింది. కాబట్టి నియమాలంయు మరింత కఠినతరం చేయకపోతే.. మరణాల సంఖ్య నానాటికి గణనీయంగా పెరిగిపోతుందని గడ్కరీ అన్నారు.గత సంవత్సరం.. ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి, జరిమానాలు విధించడానికి కృత్రిమ మేధస్సుతో పాటు.. ఇతర సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించాలని గడ్కరీ పేర్కొన్నారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు రూల్స్ అతిక్రమించినవారిని గుర్తించడంలో సహాయపడతాయి. తద్వారా దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.#RisingBharatSummit2025 | Topics which are good for the society should be propagated, irrelevant topics must be completely neglected: Union Minister @nitin_gadkari@KishoreAjwani | #Nagpur #AurangzebControversy #Maharashtra pic.twitter.com/bAVslfIOJl— News18 (@CNNnews18) April 8, 2025 -
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా క్రూయిజర్ హైరైడర్.. ఇప్పుడు మరికొన్ని కొత్త ఫీచర్లతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటర్స్ వెల్లడించింది.సరికొత్త టయోటా క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు.. ఆరు ఎయిర్బ్యాగ్స్ పొందుతుంది. ఈ సేఫ్టీ ఫీచర్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉందని కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏడబ్ల్యూడీ వేరియంట్లో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ స్థానంలో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, నిర్దిష్ట వేరియంట్స్లో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రవేశపెట్టినట్లు వివరించింది.కొత్త ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రారంభ ధర రూ. 11.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఈ కారు అదే పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. -
భారత్లో ఇకపై ఈ రెండు బైకులు కనిపించవు!
ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. అధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తన G 310 GS & G 310 R బైకులను నిలిపివేసింది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వకపోవడం, అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిజానికి కంపెనీ ఈ బైకుల డెలివరీలను 2025 జనవరి నుంచే నిలిపివేసింది. సుమారు ఏడు సంవత్సరాలు ఇండియాలో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన ఈ బీఎండబ్ల్యూ బైకులను కంపెనీ దాని లైనప్ నుంచి తీసివేసింది. దీనిపై బీఎండబ్ల్యూ మోటోరాడ్ అధికారికంగా స్పందించలేదు.బీఎండబ్ల్యూ G 310 GS & G 310 R బైకులు 313 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 34 Bhp పవర్, 28 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది. జీ 310 జీఎస్ 145 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. జీ 310 ఆర్ బైక్ టాప్ స్పీడ్ 143 కిమీ/గం.ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఏదో తెలుసా?బీఎండబ్ల్యూ కంపెనీ ఈ రెండు బైకులను నిలిపివేయడానికి.. సరైన అమ్మకాలు లేకపోవడం మాత్రమే కాదు, పూర్తిగా కొత్త ప్లాట్ఫామ్కు మార్గం సుగమం చేసుకోవడానికి అని తెలుస్తోంది. బహుశా రాబోయే రోజుల్లో కొత్త బైకులు మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉందని, నిలిపివేసిన బైకుల స్థానాన్ని అవి భర్తీ చేస్తాయని తెలుస్తోంది.