breaking news
Automobile
-
జాన్ అలుకాస్ కార్ల కలెక్షన్లో ఈ కొత్త కార్ హైలైట్..
చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్కు అలా కాదు.. బెస్ట్ కార్ తన గ్యారేజ్లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్స్టర్ను జోడించారు.అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్స్టర్ఎంజీ సైబర్స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.బటర్ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ల బ్యాటరీతో ఈ కార్ 580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది. -
జేఎల్ఆర్పై సైబర్ దాడి.. సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తి నిలిపివేత
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ అటాక్తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును కొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ‘మేము మా ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 బుధవారం వరకు పొడిగించాం. సైబర్ అటాక్ సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ ప్రపంచ కార్యకలాపాల నియంత్రిత వ్యవస్థలపై వివిధ దశలను పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ నిరంతర అంతరాయానికి చింతిస్తున్నాం. దర్యాప్తు పురోగతి వివరాలను అప్డేట్ చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.మూడు ప్లాంట్లపై ప్రభావం..టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్వుడ్, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్ అటాక్ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే రెండు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్ఆర్, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.33 వేల మంది ఉద్యోగులు..ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్వేర్ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’ -
ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి
ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు కృష్ణగిరిలో ఉన్న ఫ్యూచర్ఫ్యాక్టరీలో 10 లక్షల వాహనాలను(ఒక మిలియన్) ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. 2021 ఈ ప్లాంటులో తయారీ ప్రారంభించినప్పట్టి నుంచి నాలుగేళ్లలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూట్లర్లు ఎస్1 పోర్ట్ఫోలియోకు, ఇటీవల విడుదల చేసిన రోడ్స్టర్ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు ఆదరణ లభించడంతో తయారీలో వృద్ధి సాధించగలిగామని వివరించింది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ‘రోడ్స్టర్ ఎక్స్ప్లస్’ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. మిడ్నైట్ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ‘‘మాపై నమ్మకం, మా లక్ష్యంపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు గర్వంచదగిన క్షణాలు ఇవి. నాలుగేళ్ల క్రితం ఒక ఆలోచనతో మొదలై నేడు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి ప్రపంచస్థాయిలో భారత్ను ఈవీ హబ్గా నిలపడం మా ధ్యేయం’’ అని ఓలా అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
ఆగస్టులో వాహన అమ్మకాలు ఇలా..
దేశీయంగా ఈ ఆగస్టులో 3,21,840 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. తగ్గిన డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు డీలర్లకు సరఫరాను సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. 2024 ఇదే ఆగస్టులో అమ్ముడైన 3,52,921 వాహనాలతో పోలిస్తే ఈసారి 9% తగ్గాయి.‘‘జీఎస్టీ రేట్ల సవరణ కారణంగా ధరలు తగ్గే వీలుందని అంచనా వేసిన కస్టమర్లు వాహన కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా చేసుకున్నారు. దీంతో ఆగస్టులో డిమాండ్ తగ్గింది. అందుకు తగ్గట్లు కంపెనీలు సైతం డీలర్లకు సరఫరా సర్దుబాటు చేశాయి.’’ అని సియామ్ ప్రకటనలో తెలిపింది.👉అయితే ద్విచక్ర అమ్మకాల్లో 7% వృద్ది నమోదైంది. ఆగస్టులో మొత్తం 18,33,921 అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలు 17,11,662 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,60,866 నుంచి 11,06,638కు; స్కూటర్ల అమ్మకాలు 6,43,169 నుంచి 6,83,397కు పెరిగాయి. అయితే మోపెడ్లు మాత్రం 44,546 నుంచి 43,886కు పరిమితమయ్యాయి.👉త్రి చక్ర వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 8% వృద్ధి నమోదైంది. ఆగస్టులో 69,962 నుంచి 75,759 యూనిట్లకు పెరిగాయి.👉‘‘కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో అందుబాటు ధరల వాహనాలు కస్టమర్లను ఆకర్షిస్తాయి. అలాగే పండుగ ఉత్సాహానికి మరింత ఉపకరిస్తుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
రూ.20.80 లక్షలు తగ్గిన కారు ధర: అంతా జీఎస్టీ ఎఫెక్ట్!
జీఎస్టీ సవరణల తరువాత దాదాపు అన్ని కంపెనీలు తగ్గిన తమ వాహనాల ధరలను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ తరుణంలో లెక్సస్ ఇండియా కూడా.. తగ్గిన ధరలను వెల్లడిందింది.లెక్సస్ ఇండియా దేశంలో విక్రయించే.. LX 500d ధర రూ.20.80 లక్షల వరకు తగ్గినట్లు పేర్కొంది(ఈ కారు అసలు ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువే). దేశంలో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు తగ్గిన ఈ ధరలు అమ్మకాలను కూడా పెంచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.లెక్సస్ ES 300h ఎక్స్క్విజిట్ హైబ్రిడ్ సెడాన్ ఇప్పుడు రూ.64 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభించనుంది. దీని ధర రూ. 1.47 లక్షలు తగ్గింది. లెక్సస్ 350హెచ్, ఆర్ఎక్స్ 350హెచ్, ఆర్ఎక్స్ 500హెచ్, ఎల్ఎమ్ 350హెచ్, ఎల్ఎక్స్ 500డీ ధరలు కూడా చాలా వరకు తగ్గాయి.ఇదీ చదవండి: 2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనాదేశంలోని చాలా లెక్సస్ హైబ్రిడ్ మోడల్స్.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రోడ్ పన్నుకు అర్హత పొందుతాయి. కాబట్టి ఆన్ రోడ్ ధరలు కూడా కొంత తగ్గుతాయి. హైబ్రిడ్ మోడళ్లను ఎంచుకునే కొనుగోలుదారులు రాష్ట్ర పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి ప్రభావవంతమైన ఖర్చులు మరింత తగ్గుతాయని తెలుస్తోంది. -
2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనా
నిర్దిష్ట వయసు దాటిన వాహనాలను ప్రజా రహదారులపై నడపడం నిషిద్ధం. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. దీనికోసం స్క్రాపేజ్ సెంటర్లు కూడా పుట్టాయి. ఈ సెంటర్లలో పాత వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేస్తారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన లైట్ వెయిట్ మోటర్ వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అంచనాల ప్రకారం.. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు వాహనాల జీవితకాలం ముగియనుంది. వీటన్నింటిని అలాగే వదిలేస్తే.. అవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. గాలి, నీరు, మట్టిని కూడా కాలుష్యం చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు.. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్క్రాపింగ్ విధానం సవ్యంగా అమలు కావడానికి.. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. దీంతో స్క్రాప్ కొనుగోలు చేసే కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్టీ తగ్గింది. ఇది రీప్లేస్మెంట్ వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్భారత్లోనే అతి పెద్ద రీసైక్లింగ్ వ్యవస్థఆసియాలోనే అగ్రగామి సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) రీ కర్మ (Re Carma), భారత్లోనే అతి పెద్ద ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ వ్యవస్థగా ఆవిర్భవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ జాఝర్లోని రిలయన్స్ మోడల్ ఎకనమిక్ టౌన్షిప్లో గల రీ కార్మ ఫ్లాగ్షిప్ అధునాతన కేంద్రం ఏడాదికి 30,000 కంటే ఎక్కువ వాహనాలను (ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, ఎర్త్మూవింగ్ ఎక్విప్మెంట్ మొదలైనవి) తుక్కు చేస్తోంది. ఈ హబ్ కాకుండా, రీ కర్మ దేశవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ, భాగస్వాముల నెట్వర్క్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. -
రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు -
కారు రుణాలు వద్దు బాబోయ్!
జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో తమ కారు రుణం రద్దు చేయాలని కోరుతూ బ్యాంక్లకు అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. 1,200సీసీ వరకు సామర్థ్యం కలిగిన కార్లను 28 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ శ్లాబు కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వీటితోపాటు 40 శాతం శ్లాబులోకి మార్చినప్పటికీ, అదనపు లెవీలు లేకపోవడంతో ఖరీదైన కార్ల ధరలు సైతం తగ్గనున్నాయి.ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కో కారుపై రూ.3 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో ఇప్పటికే కార్ల కొనుగోలుకు రుణ ఆమోదాలను పొందిన కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదిస్తున్నారు. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేసుకుంటామని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రుణాన్ని రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే దాని కంటే జీఎస్టీలో మార్పుల ఫలితంగా ఒక్కో కారుపై తగ్గే ధర అధికంగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి రుణానికి దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో కస్టమర్లు ఉన్నట్టు తెలిపారు. హైఎండ్ వేరియంట్స్ పట్ల ఆసక్తికారు డీలర్లు ఇప్పటికే జారీ చేసిన ఇన్వాయిస్లకు సంబంధించి పాత జీఎస్టీ రేట్లు అమలవుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేవారు. దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి జారీ చేసే ఇన్వాయిస్లకు కొత్త రేట్లు అమలవుతాయని తెలుస్తోంది. ధరలు తగ్గడంతో మరిన్ని ఫీచర్లు ఉన్న మెరుగైన మోడళ్లకు వెళ్లాలని కొందరు కొనుగోలు దారులు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సును అమలు చేస్తున్నారు. దీంతో నికర రేటు 29% నుంచి 50 శాతం మధ్య ఉంటోంది. సెపె్టంబర్ 22 నుంచి 1,200 సీసీ సామర్థ్యం మించని పెట్రోల్, 1,500 సీసీ సామర్థ్యం మించని డీజిల్ కార్లపై 18 శాతం జీఎస్టీ రేటు, అంతకుమించిన వాటికి 40 శాతం రేటు అమల్లోకి రానుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
భారత్లో రూ.22.98 లక్షల బైక్ లాంచ్
లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి.. '2025 మల్టీస్ట్రాడా వీ4'ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ టూరర్ ప్రారంభ ధర రూ. 22.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కొత్త అప్డేట్లతో పాటు.. మెరుగైన ఇంధన సామర్థ్యం అందించేలా కూడా నిర్మించారు.2025 డుకాటి మల్టీస్ట్రాడా వీ4.. డబుల్ ఫ్రంట్ హెడ్లైట్ పొందుతుంది. రైడర్ కాళ్లకు ఎక్కువ స్పేస్ అందించడానికి.. పన్నీర్లు, టాప్ కేస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలుమల్టీస్ట్రాడా వీ4 బైక్.. 6.5 ఇంచెస్ ఫుల్ TFT కలర్ స్క్రీన్, 4 పవర్ మోడ్లు, 5 రైడింగ్ మోడ్లు (స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో), డుకాటి వెహికల్ అబ్జర్వర్ (DVO), డుకాటి వీలీ కంట్రోల్ (DWC), డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (EBC), క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 1,158cc గ్రాంటురిస్మో ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 170 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. -
హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలు
భారతదేశంలో ఫ్యూయెల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా కొందరు వీటిని ఎంచుకుంటారు. ఈ కథనంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు గురించి తెలుసుకుందాం.హైబ్రిడ్ కార్లుహైబ్రిడ్ కార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)ను విద్యుత్ మోటారుతో కలుపుతాయి. ఎంచుకునే హైబ్రిడ్ రకాన్ని బట్టి.. ఆ కారు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటరుతో నడుస్తుంది. ఇవి మైల్డ్ హైబ్రిడ్ (చిన్న ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్కు సపోర్ట్), ఫుల్ హైబ్రిడ్ (ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పెద్ద బ్యాటరీ, ప్లగ్ ద్వారా చార్జ్ చేయవచ్చు) అని మూడు రకాలుగా ఉంటాయి.ప్రయోజనాలు●ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.●పూర్తిగా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా.. హైబ్రిడ్ కార్లకు ఇంధన స్టేషన్లలో ఫ్యూయల్ నింపుకోవచ్చు.●సాంప్రదాయ కార్ల కంటే తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.●సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లుఎలక్ట్రిక్ కార్లుఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తాయి. వీటిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ప్రయోజనాలు●తక్కువ నిర్వహణ ఖర్చు●పన్ను ప్రయోజనాలు, సబ్సిడీల వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి●సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇందులో ఇంజిన్ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.●ఉద్గారాలు సున్నా శాతం, కాలుష్య కారకాలు విడుదల కావు. -
దక్షిణాదిన తొలి ‘హంటర్హుడ్’ ఫెస్టివల్!
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్లతో ఈవెంట్ను ఆరంభించారు. స్ట్రీట్ ఆర్టిస్ట్లు వేసిన బైకింగ్ పెయింటింగ్లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఏప్రిల్లో తొలిసారి... ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్ను మలిచామని రాయల్డ్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్బోర్డింగ్లలో లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్కు దన్నుగా నిలవడమే ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్ హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్ను చెన్నై హంటర్హుడ్ ఫెస్టివల్లో ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్స్టయిల్ గేర్తో పాటు ట్రెండింగ్లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లు తమ స్టాల్స్లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్లపై జీఎస్టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్ఫీల్డ్ హంటర్పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.శివరామకృష్ణ మిర్తిపాటి (చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి) -
2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు
2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు●మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్●మారుతి విక్టోరిస్●టాటా పంచ్ ఫేస్లిఫ్ట్●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ●టాటా సియెర్రా ఈవీ●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్●వోక్స్వ్యాగన్ టేరాన్మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ కూడా అక్టోబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనమహీంద్రా థార్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది. -
హోండా మోటార్సైకిల్ ప్రకటన: ఆ బైకులకు రీకాల్..
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా 2019 & 2025 మధ్య తయారైన ఆఫ్రికా ట్విన్ మోటార్సైకిళ్లకు రీకాల్ ప్రకటించింది. ఎడమవైపు ఉన్న హ్యాండిల్బార్ స్విచ్లోని వైరింగ్లో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ స్వచ్ఛందంగా ఈ ప్రకటన చేసింది.ఈ సమస్య హ్యాండిల్ బార్ లోపల ఉన్న హార్నెస్ వైర్ నుంచి వస్తుంది. ఇది సాధారణ స్టీరింగ్ కదలికల కారణంగా పదే పదే వంగి ఉంటుంది. కాలక్రమేణా.. ఇది వైర్ జాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. తద్వారా హారన్ పనిచేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది. అంతే కాకుండా.. హెడ్లైట్ను లో బీమ్ నుంచి హై బీమ్కు మార్చడంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.2026 జనవరి చివరి వారం నుంచి.. భారతదేశంలోని అన్ని హోండా బిగ్వింగ్ డీలర్షిప్లు మీ బైక్ ఇప్పటికీ వారంటీలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. కస్టమర్లకు కంపెనీ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లే డీలర్షిప్ను సందర్శించవచ్చు.భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ కోసం హోండా రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2024 ప్రారంభంలో, ఫిబ్రవరి, అక్టోబర్ 2022 లలో కూడా ఈ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రీకాల్ జారీచేయడానికి సిద్ధమైంది. ఆఫ్రికా ట్విన్ 1,048 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను కలిగి.. 100.5 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా హోండా DCT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికతో లభిస్తుంది. -
డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్లో 10 శాతం ఐసోబుటనాల్ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్లో పదో వంతు ఇథనాల్ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.ఈ20 పెట్రోల్పై తప్పుడు ప్రచారం..ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు. -
ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ‘మెగా ఫెస్టివ్ ఉత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ ఫ్లాగ్షిప్ మోటారు సైకిళ్లు రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనగోళ్లపై క్యాష్ బ్యాక్లు ప్రకటించింది.రోర్ ఈజెడ్ సిగ్మా లేదా రోర్ ఈజెడ్లను రూ.20,000 వరకు ధర తగ్గించి విక్రయిస్తున్నట్టు, దీనికితోడు రూ.10,000 క్యాష్బ్యాక్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రతీ కొనుగోలుపై బంగారం కాయిన్ను ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే లక్కీ డ్రాలో ఐఫోన్ను సైతం గెలుచుకోవచ్చని పేర్కొంది. తమ మోటారు సైకిళ్ల పనితీరును తెలుసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ అసాధారణ విలువతో మెగా ఫెస్టివ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
భవిష్యత్ భారత్దే..!
న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తంతా భారత్దేనని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకెయూచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా నడుస్తుందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాలపరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకెయూచి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. ‘చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్ మొదలైన వాటిని చూశాం. గత మూడు దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్కి సానుకూలమైనవని తకెయూచి చెప్పారు. జపాన్ తరహాలోనే ఇక్కడ కూడా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిల్చిందో భారత్లోను అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకెయూచి చెప్పారు. ‘ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించింది, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), మేకిన్ ఇండియా లాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడంతో పాటు దేశీయంగా డిమాండ్కి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి చర్యలన్నీ కూడా అంతిమంగా తయారీ రంగ వృద్ధికి దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తాయని చెప్పారు. టారిఫ్లు పెద్ద సవాలే.. భారత ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించడమనేది ఆటో విడిభాగాల పరిశ్రమకు పెద్ద సవాలేనని తకెయూచి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సానుకూల ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు కొన్ని సానుకూల ప్రకటనలు చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆటో పరిశ్రమ భవిష్యత్తు కూడా మరింత ఆశావహంగా కనిపిస్తోందన్నారు. 2024–25లో 523 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఆటో విడిభాగాల ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కాగలవని తకెయూచి చెప్పారు. ‘అంతర్జాతీయ తయారీ హబ్గా భారత్ ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే తమ తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారా తయారీ కోసం సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఈ దేశాన్ని ఎంచుకుంది. ఈ వాహనం 100 దేశాలకు ఎగుమతి అవుతుంది’ అని పేర్కొన్నారు. -
కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐభారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
వేలానికి పోప్ లియో సంతకం చేసిన బైక్
'పోప్ లియో XIV'కి బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్' అందించారు. ఈ మోటార్సైకిల్ను మిస్సియో ఆస్ట్రియా అక్టోబర్ 2025లో సోథెబైస్ ద్వారా వేలం వేయనున్నారు. దీని నుంచి వచ్చిన డబ్బును మడగాస్కర్లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు వినియోగించనున్నారు.పోప్ లియో XIVకు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ అనేది కస్టమైజ్డ్ బైక్. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ అధిపతి 'మైఖేల్ సోమర్' అందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. బైకు ఫ్యూయెల్ ట్యాంక్ మీద పోప్ సంతకం, డేట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా 991 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో రూ. 32.50 లక్షలు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో 10.25 ఇంచెస్ TFT కలర్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయెల్ లెవల్, స్పీడ్ మొదలైన వాటిని రైడర్ చూడవచ్చు. డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్ల్యాంప్లు, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు.. రాక్, రోల్ అనే రైడ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం
భారత్లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్క్లేవ్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
స్క్రాప్ సర్టిఫికెట్తో అదనపు డిస్కౌంట్..
న్యూఢిల్లీ: పాత వాహనానికి సంబంధించిన స్క్రాపేజీ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు, కొత్త వాహనాలపై మరిన్ని డిస్కౌంట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే, పాత వాహనాన్ని తుక్కు కింద మార్చి (స్క్రాప్) కొత్తవి కొంటున్న వారికి, జీఎస్టీని కొంత తగ్గించడం రూపంలో కూడా ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కోరినట్లు ఆయన చెప్పారు. భారతీయ ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సంఘం సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్క్రాపేజీ పాలసీ అనేది ఇటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమైనదని గడ్కరీ చెప్పారు. ‘‘ఇది పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ పరిశ్రమ నా మాట ఇంకా పూర్తిగా వినడం లేదు. కొత్త వాహనాన్ని కొనేందుకు, పాతదాన్ని స్క్రాప్ చేసిన వారికి బాగా డిస్కౌంట్లు ఇస్తే, మీ టర్నోవరే భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది. దేశంలో కాలు ష్యం తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు కూడా ఇందు కు తప్పకుండా తోడ్పడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఇటీవల వస్తు, సేవల పన్నులను (జీ ఎస్టీ) క్రమబదీ్ధకరించడం వల్ల ఆటో రంగానికి భారీగా లబ్ధి చేకూరిందని, పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘మన ఆటో పరిశ్రమ ఇప్పుడు పరిమాణంపరంగా నంబర్ 3గా ఎదిగింది. మనం అంతా కలిసి పని చేస్తే తప్పకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోగలం’’ అని గడ్కరీ వివరించారు. తుక్కు రీసైక్లింగ్తో ఉద్యోగాలకు దన్ను.. తుక్కును రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కారణంగా అదనంగా 70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ చెప్పారు. అలాగే ఉక్కు, సీసం, అల్యుమినియం, ప్లాటినం, పల్లాడియం లాంటి లోహాల లభ్యత కూడా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసి అదనంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ తర్వాత ఏర్పడే అదనపు డిమాండ్తో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 16,830 వాహనాలను తుక్కు కింద మారుస్తుండగా, ప్రైవేట్ రంగం రూ. 2,700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు. ఈ–20పై అవాస్తవాలు.. ఈ20 ఇంధనంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ పాడవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలే అని గడ్కరీ కొట్టిపారేశారు. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇథనాల్ ఉపయోగపడుతుందని, దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. దీనితో రైతులకు రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి దేశీయంగా అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.పరిశ్రమకు జీఎస్టీ బూస్ట్.. వాహనాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడుతుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దీనితో రేట్లు తగ్గి, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వాహనాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలిసారిగా వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, మధ్య స్థాయి ఆదాయవర్గాలకు గణనీయంగా ప్రయోజనం లభిస్తుందని చంద్ర వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లోను, అలాగే ఎగుమతులపరంగాను భారతీయ ఆటో పరిశ్రమ స్థిరమైన పనితీరు కనపర్చిందని చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2 శాతం వార్షిక వృద్ధితో, అత్యధికంగా 43 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల విభాగం కూడా కోలుకుంటోందని 9.1 శాతం వృద్ధితో 1.96 కోట్ల విక్రయాలు నమోదయ్యాయని చంద్ర చెప్పారు. -
మూడేళ్లకే ముగిసిన ప్రస్థానం!.. వెబ్సైట్లో కనిపించిన బైక్ ఇదే..
సుజుకి మోటార్సైకిల్ ఇండియా తన లైనప్ నుంచి కటన బైకును నిలిపివేసింది. దీనిని కంపెనీ తన అధికారిక వెబ్సైట్ తొలగించింది. 2022 జులైలో ప్రారంభమైన ఈ బైక్ లేటెస్ట్ రెట్రో డిజైన్ రైడర్లను ఆకట్టుకుని.. మంచి అమ్మకాలను సాధించగలిగింది. అయితే కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. దీంతో దేశంలో అరంగ్రేటం చేసిన మూడేళ్లలోనే మార్కెట్కు దూరమైందని తెలుస్తోంది.రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, కటనను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ బైకును కంపెనీ ఎందుకు తొలగించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆదరణ తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్తో 11,000 rpm వద్ద 150 bhp, 9,250 rpm వద్ద 106 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.సుజుకి ఇప్పుడు కటన బైకును తొలగించడంతో.. పెద్ద బైక్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. అవి హయబుసా (రూ. 16.90 లక్షలు), జీఎస్ఎక్స్-8ఆర్ (రూ. 9.25 లక్షలు), వీ-స్ట్రోమ్ 800డీఈ (రూ. 10.30 లక్షలు). -
మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్ లాబీలు .. ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్: కుమారస్వామి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని చెప్పారు. ఆటో రిటైల్ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పెంచాలి.. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు. -
ముంబైలో మెగా ఈవీ చార్జింగ్ హబ్
ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా పవర్,, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు మంగళవారం భారతదేశపు అతిపెద్ద టాటా. ఈవీ మెగాచార్జర్ హబ్ను ఆవిష్కరించాయి. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 సమీపంలోని ది లీలా ముంబై హోటల్ ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో ఎనిమిది ఫాస్ట్ డీసీ చార్జర్లు, 16 ‘చార్జింగ్ బే’లు ఉంటాయి. ఒకేసారి 16 ఈవీలను చార్జింగ్ చేయొచ్చు.ప్రైవేట్ కారు ఓనర్ల నుంచి ట్యాక్సీలు, రైడ్ సేవల సంస్థలు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు మొదలైన వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. మరోవైపు, ఈవీ చార్జింగ్ నెట్వర్క్ సంస్థ బోల్ట్డాట్ఎర్త్ తాజాగా త్రీవీలర్ ఆటోల సంస్థ యోధతో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్, ఎర్తింగ్ సొల్యూషన్స్ను అందించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంపొందించేందుకు, వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సెప్టెంబర్ 9ని ప్రపంచ ఈవీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5.8 కోట్ల పైచిలుకు ఈవీలు ఉండగా, భారత్లో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో 14.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఈవీల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే.. -
టయోటా కార్ల ధరల తగ్గింపు.. ఫార్చూనర్పై రూ.3.5 లక్షలు..
జీఎస్టీ తగ్గింపు, పరిహార సెస్ రద్దు వాహన కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాల ధరలపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, వాహన తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల సవరించిన ధరలను ప్రకటించడం ప్రారంభించాయి.తాజాగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా తమ అన్ని కార్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సకాలంలో డెలివరీలు అందుకోవడానికి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వీలైనంత త్వరగా బుకింగ్లను కన్ఫర్మ్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది.కొన్ని ప్రీమియం మోడళ్ల తగ్గింపు ధరలను కంపెనీ ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం. అత్యధికంగా ఫార్చ్యూనర్ ధర రూ .3.49 లక్షల వరకు తగ్గుతుంది. దీని తరువాత మరో ప్రీమియం వేరియంట్ లెజెండర్ ధర రూ .3.34 లక్షల వరకు తగ్గనుంది. ఫార్చ్యూనర్, లెజెండర్ ధరలు వరుసగా రూ .36.05 లక్షలు, రూ .44.51 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. తమ లైనప్ లోని ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ సవరించిన ధరలను టయోటా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.సవరించిన జీఎస్టీ నిర్మాణం అన్ని విభాగాలలో కార్ల ధరలను తగ్గించింది. 4 మీటర్ల లోపు పరిమాణం ఉన్న చిన్న కార్లపై (1,200సీసీ వరకు పెట్రోల్ ఇంజిన్లు లేదా 1,500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్లు) ఇకపై 28% బదులుగా 18% జీఎస్టీ వర్తిస్తుంది.దీంతో వీటి ధరలు 5-13% తగ్గుతున్నాయి.ఇక 4 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణం, పెద్ద ఇంజిన్లు ఉన్న పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీకి బదులుగా 40 శాతం (ప్రత్యేక శ్లాబ్) జీఎస్టీ విధిస్తారు. అయితే సెస్ తొలగింపుతో వీటి ధరలు కూడా 3-10% తగ్గే అవకాశం ఉంది. -
చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ ''మినీ'' ఇప్పుడు భారతదేశంలో మినీ కూపర్ ధరలను తగ్గించింది. కేంద్రం కొత్తగా ప్రకటయించిన జీఎస్టీ 2.0 సంస్కరణ తరువాత కంపెనీ ధరలు వెల్లడించింది. సవరించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.మినీ కూపర్ ప్రస్తుతం భారతీయ విఫణిలో.. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎసెన్షియల్, క్లాసిక్, ఫేవర్డ్, జేసీడబ్ల్యు. కంపెనీ ఇప్పుడు ఈ వేరియంట్స్ ధరలను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ఇది కొత్త మినీ కార్ల కొనుగోలుదారులకు ప్రయోజనకారిగా ఉంటుంది.తగ్గిన ధరలు➤ఎసెన్షియల్: రూ. 2,50,000 తగ్గింది - (కొత్త ధర రూ. 43,70,000) ➤క్లాసిక్: రూ. 2,75,000 తగ్గింది - (కొత్త ధర రూ. 49,20,000)➤ఫేవర్డ్: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 52,00,000)➤జేసీడబ్ల్యు: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 54,50,000)ఇదీ చదవండి: జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
ఆగస్టులో 3% పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో స్వల్పంగా 3% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ( ఫాడా) గణాంకాలు వెల్లడించింది. మొత్తం ఆగస్టులో 19,64,547 వాహన రిజి్రస్టేషన్లు కాగా, 2024 ఆగస్టులో ఇవి 19,10,312గా ఉన్నాయని ఫాడా తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ‘‘వేచి చూసే ధోరణి కారణంగా సెపె్టంబర్ ప్రథమార్థమంతా అమ్మకాలు అంతంత మాత్రమే ఉండొచ్చు. జీఎస్టీ విధానంపై స్పష్టత, పండుగ సెంటిమెంట్తో ఈ నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉండొచ్చు’’ అని ఫాడా అంచనా వేసింది. → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3,20,291 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.93% పెరిగి 3,23,256 కు చేరాయి. మెరుగైన ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్తో ఆగస్టు ప్రథమార్థమంతా సానుకూల ధోరణి కని్పంచింది. అయితే ఆగస్టు 15న ప్రధాని జీఎస్టీ సంస్కరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారని ఫాడా తెలిపింది. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 2.17% పెరిగాయి. ఈ ఆగస్టులో మొత్తం 13,73,675 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 13,44,380 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. ఓనమ్, గణేశ్ చతుర్థి పండుగ ప్రారంభంతో చాలా మంది కస్టమర్లు డెలివరీల కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు గ్రామీణ రాకపోకలకు అంతరాయంతో అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో 69,635 యూనిట్ల నుంచి 8.55% పెరిగి 75,592 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్ రిటైల్ అమ్మకాలు 1,05,493 యూనిట్ల నుంచి 2% తగ్గి 1,03,105కు దిగివచ్చాయి. -
టూ వీలర్స్.. రయ్!
ముంబై: జీఎస్టీ క్రమబద్ధీకరణ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాల్లో 5–6%, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2–3% వృద్ధి నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో తెలిపింది. ఈ సెపె్టంబర్ 22 నుంచి 5%, 18% పన్ను శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయంటూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మరింత పుంజుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. జీఎస్టీ కోతతో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో 90% వాల్యూమ్స్ కలిగిన టూ–వీలర్స్, ప్యాసింజర్ వాహనాలకు వరుసగా 2%, 1% డిమాండ్ పెరగనుందని వివరించింది. క్రిసిల్ రేటింగ్స్లో మరిన్ని విశేషాలు.... → కోవిడ్ సంక్షోభం, ఆన్బోర్డ్ డయాగ్నస్టిక్ టూల్స్ ఐఐ(ఓబీడీ2) తప్పనిసరి అమలు, ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ బైక్లకు తగ్గిన డిమాండ్, ప్యాసింజర్ వాహన ధరలు భారీగా పెరగడం తదితర కారణాలతో ఆటో పరిశ్రమ ఇబ్బందులకు లోనవుతోంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చు. → గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, సాధారణ వర్షపాత నమోదుతో పాటు ఈ ఏడాదిలో 15కి పైగా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్స్ మార్కెట్లోకి విడుదల పరిణామాలు డిమాండ్ పునరుద్ధరణకు మరింత తోడ్పడవచ్చు. అయితే పండుగ సీజన్లో డీలర్ల వద్ద వాడని పన్ను క్రెడిట్ల కారణంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. → అధిక అమ్మకాలు కంపెనీల సామర్థ్య వినియోగం, ఆపరేటింగ్ లీవరేజ్ల మెరుగుపరిచే అవకాశం కలిగిస్తుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలకు బలమైన నగదు ప్రవాహాలు, మెరుగైన లాభాల మార్జిన్లు లభిస్తాయి. అదేవిధంగా, జీఎస్టీ తగ్గింపు తర్వాత 50–55 రోజుల ప్యాసింజర్ వాహనాల నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించి, డీలర్ల నగదు ప్రవాహానికి మద్దతిస్తుంది. ‘‘జీఎస్టీ తగ్గింపు లాభాల బదలాయింపుతో వాహన ధరలు 5–10% (చిన్న స్థాయి పీవీలపై రూ.30–60 వేలు, టూ వీలర్స్పై రూ.3,000 –7,000 తగ్గింపు) దిగివచ్చే వీలుంది. దీనికి తోడు పండుగ సీజన్, ఆటో కంపెనీలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన కొనుగోలు సామర్థ్యం తదితర అంశాలు కలిసొచ్చి ఈ ద్వితీయార్థంలో ఆటో పరిశ్రమ దూసుకెళ్తుంది’’ అని క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేత్ తెలిపారు. ఆటో పరిశ్రమపై జీఎస్టీ తగ్గింపు: కొత్త జీఎస్టీ ప్రకారం చిన్న కార్లు, 350 సీసీలోపు మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్ పడనుంది. మధ్య, భారీ ప్యాసింజర్ వాహనాలపై పన్ను 3–7 శాతం వరకు తగ్గనుంది. ట్రాక్టర్లను సైతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. సంక్షిప్తంగా చిన్న కార్లు, బైకులు(350 సీసీ) ధరలు భారీగా తగ్గనున్నాయి. పెద్ద కార్లు, ఎస్యూవీలు కొద్దిమేర చవకగా మారాయి. అయితే పెద్ద (హై ఎండ్)బైకులు ధరలు భారీగా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహన ధరలు: జీఎస్టీ తగ్గింపు లాభాలు పూర్తి స్థాయి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తే ధరలు 5 నుంచి 10% తగ్గుతాయి. చిన్న కార్లు రూ.60వేల వరకు, త్రీ వీలర్స్ రూ.15,000 నుంచి రూ.20వేల వరకు తగ్గొచ్చు. మీడియం, హెవీ వాణిజ్య వాహన ధరలు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల తగ్గొచ్చు. యథావిథిగా 5% జీఎస్టీ కొనసాగింపుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్, త్రీ వీలర్స్ వాహన ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. -
ఆడి కీలక ప్రకటన: రూ.7 లక్షలు తగ్గిన క్యూ8 ధర
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సోమవారం (సెప్టెంబర్ 8) భారతదేశంలోని అన్ని మోడళ్లలో ధరల తగ్గింపును ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇది ఆడి కార్ల కొనుగోలుదారులకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.GST 2.0 అమలు తర్వాత 'ఆడి ఇండియా' తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో అంతటా సవరించిన ధరలను ఒక ప్రకటనలో ప్రకటించింది. ధరల తగ్గుదల తరువాత మోడల్ను బట్టి రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సరికొత్త ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. పండుగ సీజన్కు ముందు కస్టమర్ డిమాండ్కు ధరల తగ్గింపు ఊతం ఇస్తున్నాయని ప్రకటన పేర్కొంది.కొత్త ధరల ప్రకారం.. కంపెనీ ఎంట్రీ SUV క్యూ3 ధర రూ. 43.07 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని ధర గతంలో రూ. 46.14 లక్షలు. అదే విధంగా టాప్ ఎండ్ SUV క్యూ8 ప్రారంభ ధర రూ. 1.1 కోట్లుగా ఉంటుంది. ఇది గతంలో రూ. 1.18 కోట్లుగా ఉండేది. సెడాన్లు A4, A6 లతో పాటు SUVలు క్యూ5, క్యూ7 వంటి ఇతర మోడళ్ల ధరలు కూడా తగ్గుతాయి. -
హైదరాబాద్లో టీవీఎస్ 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే..
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్టార్క్ 150’ను హైదరాబాద్లో ఆవిష్కరించింది. స్పోర్టీ, ప్రీమియంలుక్తో ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్టీ వేరియంట్ ధర రూ.1,29,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ధరల్లో ఇటీవలి జీఎస్టీ శ్లాబుల సరళీకరణను పరిగణించలేదని, సెప్టెంబర్ 22 తర్వాత కొత్త ధరలు అప్డేట్ అయ్యే అవకాశం ఉందని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.హైదరాబాద్లో ఈ స్కూటర్ ఆవిష్కరించిన నేపథ్యంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెడ్ కమ్యుటర్, ఈవీ బిజినెస్ అండ్ హెడ్ బ్రాండ్ మీడియా) అనిరుద్ధా హల్దార్ మాట్లాడుతూ..‘అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ఈ స్కూటర్ను జెన్జీ(2000 తర్వాత జన్మించినవారు) యువత ఎంతో ఇష్టపడుతారు. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్, ఫ్యుచరిస్టిక్ డిజైన్కు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. ఇందులోని టీఎఫ్టీ వేరియంట్లో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా, స్మార్ట్ వాచ్ అడాప్టబిలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్/కాల్ అలర్ట్లు వంటివి ఉన్నాయి’ అని చెప్పారు.రైడ్ మోడ్లు, భద్రతకు సంబంధించి కూడా ఇందులో జాగ్రత్తలు వహించినట్లు కంపెనీ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఇందులో రేస్ మోడ్, స్ట్రీట్ మోడ్ అనే డ్యూయల్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. పరిస్థితులుకు తగినట్లు ఏదైనా వాడుకునేందుకు వీలుంటుంది. క్రాష్ అలర్ట్, థెఫ్ట్ హెచ్చరిక, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, పార్క్ చేసిన ప్రదేశం, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.కంపెనీ వివరాల ప్రకారం.. 149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.ఇదీ చదవండి: భారతీయులకు అమెరికా మరో షాక్.. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ. 3లక్షలు తగ్గిన టయోటా కారు ధర
హ్యుందాయ్ తన కార్ల ధరలు ఎంత తగ్గుతాయని విషయాన్ని వెల్లడించిన తరువాత, టయోటా కూడా తగ్గిన ధరలను స్పష్టం చేసింది. ఈ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయు. సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో GST 2.0 ప్రకటన తర్వాత ధరల తగ్గుదల జరిగింది.మోడల్ వారీగా తగ్గిన టయోటా కార్ల ధరలు➜గ్లాంజా: రూ. 85,300 ➜టైసర్: రూ.1,11,100➜రూమియన్: రూ. 48,700➜హైరైడర్: రూ. 65,400➜క్రిస్టా: రూ. 1,80,600➜హైక్రాస్: రూ. 1,15,800➜ఫార్చ్యూనర్: రూ. 3,49,000➜లెజెండర్: రూ. 3,34,000➜హైలక్స్: రూ. 2,52,700➜కామ్రీ: రూ. 1,01,800➜వెల్ఫైర్: రూ. 2,78,000ఇదీ చదవండి: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
వాహన బీమా.. కావాలి ధీమా!
మేఘాలకు చిల్లులు పడ్డాయా! అన్నట్టు స్వల్ప వ్యవధిలోనే వర్షాలు కుమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. గంటలో 10 సెంటీమీటర్లకు పైగా పడుతున్న వర్షంతో హైదరాబాద్, ముంబై సహా ఎన్నో నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం చూస్తున్నాం. వర్షాలు, వరదల కారణంగా వాహనాలు దెబ్బతిని ఆర్థిక నష్టం ఎదురైతే..? బైక్ లేదా కారు ఇంజన్ దెబ్బతింటే..? అలాంటి సందర్భంలో థర్డ్ పార్టీ బీమా కవరేజీ ఉన్నా, ఎందుకూ ఉపయోగపడదు. కావాల్సింది సమగ్ర కవరేజీతో కూడిన బీమా పాలసీ. ఇది లేకపోతే ఎదురయ్యే నష్టాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. అందుకే వాహన బీమా పాలసీ తీసుకునే ముందు పరిశీలించాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. మెరుగైన ఆదాయం నేపథ్యంతో మన దేశంలో కార్లు కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024–25లో 43 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఆరి్థక సంవత్సరంలోనూ 42 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు 2024–25లో ఏకంగా 1.9 కోట్లకు చేరాయి. కానీ, వాహనం కొనేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పెద్ద తప్పు.. డీలర్ ఇచ్చే థర్డ్ పార్టీ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్తో సరిపెట్టుకోవడం. తొలిసారి వాహనం కొనుగోలు చేస్తున్న వారే కాదు, కొత్త వాహనానికి మారుతున్న వారిలోనూ ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్కే పరిమితమవుతున్నారు. ఎందుకంటే మోటారు వాహ న చట్టం ప్రకారం.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం తప్పనిసరి. కారు అయితే మూడేళ్లు, టూవీలర్ అయితే ఐదేళ్ల కాలానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కొనుగోలు సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ (సమగ్ర బీమా) తప్పనిసరి కాదు. దీంతో చాలా మంది వాహనదారులు అనవసర ఖర్చు ఎందుకని భావించి థర్డ్పార్టీ కవరేజీకి పరిమితమవుతున్నారు. థర్డ్ పార్టీ.. సొంతానికి రాజీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నది.. తన వాహనం కారణంగా మరో వ్యక్తికి (మూడో పక్షం/థర్డ్ పార్టీ) గాయాలు కావడం లేదా మరణానికి దారితీయడం లేదా మూడో పార్టీకి చెందిన ప్రాపర్టీకి నష్టం కలిగించిన సందర్భాల్లో పరిహారం చెల్లించడానికి పరిమితమవుతుంది. వాహనదారుడు గాయపడడం లేదా సొంత వాహనానికి నష్టం ఏర్పడితే ఈ ప్లాన్లో పరిహారం రాదు. ఇందుకు థర్డ్ పార్టీతోపాటు ఓన్ డ్యామేజ్ పాలసీ కూడా ఉండాలి. కాంప్రహెన్సివ్ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇవన్నీ ఉంటాయి. స్టాండర్డ్ కాంప్రహెన్సివ్ పాలసీలో వరదల వల్ల కారు లేదా బైక్ ఇంజన్కు నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. కానీ, ఇందులో తిరకాసు ఉంది. వర్షపు నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను స్టార్ట్ చేయడం కారణంగా ఇంజన్కు నష్టం వాటిల్లితే పరిహారం రాదు. నీటి వల్ల ఇంజన్కు సహజంగా నష్టం జరిగితేనే పరిహారం వస్తుంది. నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను ఆన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇంజన్లోని కంబషన్ చాంబర్లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో లోపలి విడిభాగాలు దెబ్బతింటాయి. దీన్ని హైడ్రోస్టాటిక్ లాక్గా చెబుతారు. ఇక్కడ పాలసీ దారుడు మొదటి పార్టీ, బీమా సంస్థ రెండో పార్టీ అవుతుంది.ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల జరిగే నష్టానికి కూడా పరిహారం కావాలంటే అప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ను జోడించుకోవాలి. ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజీ ఉంటే అప్పుడు వరద నీటి కారణంగా ఇంజన్కు, గేర్ బాక్స్కు నష్టం ఏర్పడితే మరమ్మతులకు అయ్యే అధిక వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. రీపెయిర్ చేయలేని విధంగా దెబ్బతింటే కొత్త ఇంజన్, గేర్ బాక్స్కు అయ్యే వ్యయాలను నిబంధనల మేరకు చెల్లిస్తుంది. కనుక రెగ్యులర్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా తీసుకోవాలి. ప్రీమియం కొంత పెరిగినప్పటికీ.. ఊహించని పరిస్థితుల్లో ఆరి్థక నష్టాన్ని నివారిస్తుంది. ఇంజన్కు మరమ్మతులు సొంతంగా చేయించుకోవాలంటే భారీగానే ఖర్చవుతుంది. ‘వాహనాలు అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్నాయి. ఎలక్ట్రిక్, డీజిల్, పెట్రోల్ అన్నదానితో సంబంధం లేకుండా అవి కీలక ఆస్తులుగా మారుతున్నా యి. వాటికి రక్షణ కల్పించుకోవాలి. సమగ్ర బీమా రక్షణతో మానసికంగా నిశి్చంత ఏర్పడుతుంది’ అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ పరాస్ పస్రిచా తెలిపారు. జీరో డిప్రీసియేషన్ కవర్ వాహనంలోని విడిభాగాలు వాడుకలో కొంత కాలానికి విలువను కోల్పోతుంటాయి. క్లెయిమ్ చేసినప్పుడు ఆ మేరకు విలువలో బీమా సంస్థలు కోత పెడతాయి. ప్రమాదం కారణంగా ఏదైనా విడిభాగం దెబ్బతిని దాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తే, అప్పుడు పూర్తి పరిహారం రాక, కొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ ఉంటే విడిభాగం మార్పిడి ఖర్చును బీమా సంస్థే చెల్లిస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ ఈ యాడాన్ కవర్ తీసుకుంటే.. వాహనం చోరీకి గురైనా లేక ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు చేయలేని సందర్భంలో తిరిగి వాహనం కొనుగోలు, పన్నులు, రిజి్రస్టేషన్కు అయ్యే చార్జీలన్నింటినీ బీమా కంపెనీ నుంచి పొందొచ్చు. ఈ సందర్భంగా ‘ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ’ (ఐడీవీ) గురించి తెలుసుకోవాలి. వాహనం చోరీకి గురైనప్పుడు లేదా ప్రమాదం వల్ల మరమ్మతులు చేయలేని స్థితిలో వాహనం ధరతో సంబంధం లేకుండా ఐడీవీనే బీమా సంస్థ చెల్లిస్తుంది.రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రయాణంలో ఉన్నట్టుండి బైక్ లేదా కారు మొరాయించొచ్చు. ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు రోడ్సైడ్ అసిస్టెన్స్ కవర్ అదుకుంటుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదం కారణంగా వాహనం దెబ్బతిని నిలిచిపోయిన సందర్భంలోనూ సాయపడుతుంది. వారంలో అన్ని రోజులూ, రోజులో అన్ని సమయాల్లోనూ ఈ సదుపాయాన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బైక్ లేదా కారును సమీపంలోని మరమ్మతుల కేంద్రానికి (సరీ్వసింగ్ సెంటర్)కు తరలిస్తారు. ఇందుకయ్యే ఖర్చును బీమా కంపెనీయే పెట్టుకుంటుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ కవరేజీ అనుకూలం. సాధారణంగా వాహనం మొరాయించిన ప్రదేశం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో (ఒక్కొక్క కంపెనీ ఒక్కో పరిమితి)ని కేంద్రానికి టోయింగ్ వాహనంపై తరలిస్తాయి. చిన్న సమస్య అయితే కొన్ని సందర్భాల్లో మెకానిక్ను పంపించి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తుంటాయి. న్యాయ సాయం ఇది కూడా ఐచ్ఛిక కవరేజీయే. ప్రమాదం అనంతరం ఎదురయ్యే న్యాయ సమస్యలకు సంబంధించి సాయాన్ని దీని కింద ఉచితంగా పొందొచ్చు. ప్రమాదం వల్ల నేరాభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తే లాయర్ సేవలకు అయ్యే చార్జీలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. బ్యాటరీకి రక్షణ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ బ్యాటరీ దెబ్బతింటే రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ మార్చుకునేందుకు కొన్ని రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తయారీ లోపాలు లేదా వాడుకలో భాగంగా బ్యాటరీ దెబ్బతింటే స్టాండర్డ్ ఆటో ఇన్సూరెన్స్లో పరిహారం రాదు. కనుక బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్ను జోడించుకుంటే.. ఉన్నట్టుండి బ్యాటరీ విఫలమైతే మరమ్మతులు లేదా కొత్త బ్యాటరీ ఏర్పాటుకు అయ్యే వ్యయాలను పొందొచ్చు. డైలీ అలవెన్స్ కవర్ ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుల కారణంగా వాహనానికి మరమ్మతులు అవసరమై గ్యారేజీకి వెళ్లిందనుకోండి. వాహన మరమ్మతులు పూర్త య్యే వరకు రోజువారీగా రూ.500–1,500 వరకు నగదు ప్రయోజనం పొందొచ్చు. దీనివల్ల ప్రత్యామ్నాయ రవాణా కోసం అయ్యే ఖర్చులను భర్తీ చేసుకోవచ్చు. ఇతర యాడాన్లు ఇవి కాకుండా కన్జ్యూమబుల్స్, టైర్ ప్రొటెక్టర్, క్లచ్ ప్రొటెక్టర్ తదితర యాడాన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలంగా ఉన్న వాటిని, ప్రీమియం ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత వస్తువులు పోతే.. కాంప్రహెన్సివ్ కారు పాలసీలో కారు చోరీకి గురైతే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ ప్రకారం బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. కానీ, కారులో ఉన్న విలువైన వస్తువులకు సైతం పరిహారం కోరుకునే వారు ఈ యాడాన్ పాలసీ తీసుకోవచ్చు. ఇవి గమనించాలి.. → ముఖ్యంగా వరద నీటికి అవకాశం ఉన్న పల్లపు ప్రాంతాల్లో నివసించే వారు, ఆయా ప్రాంతాల మీదుగా రవాణా చేసే వారు ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ను తప్పకుండా తీసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు అందులో కవరేజీ సదుపాయాలు, మినహాయింపులతోపాటు ఏవైనా తగ్గింపులు ఉన్నాయా? అని సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ప్లాన్లలోని ఫీచర్లతో పోల్చి చూసుకున్న తర్వాత మెరుగైన బీమా పాలసీని తీసుకోవాలి. వాహన డీలర్ ఆఫర్ చేసే ప్లాన్లలో ఫీచర్ల వివరాలను ఆయా కంపెనీల వెబ్సైట్లకు వెళ్లి తెలుసుకోవచ్చు. కేవలం ప్రీమియం కాకుండా రక్షణ సదుపాయాలను గమనించాలి. → వాహనానికి ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తెలుసుకున్న తర్వాతే కొనుగోలుకు వెళ్లాలి. → కొనుగోలు సమయంలో కొందరు సరైన వివరాలు ఇవ్వడం లేదు. దీనివల్ల తర్వాత క్లెయిమ్ తిరస్కరణ ఎదురుకావొచ్చు. → ముఖ్యంగా జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, రోడ్సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్లను జోడించుకోవడం ఎంతో అవసరం. → తక్కువ ఖర్చు అయ్యే భాగాలకు ప్రత్యేకంగా యాడాన్లు అవసరం లేదు. → నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ చేసే ప్లాన్ను పరిశీలించొచ్చు. దీనివల్ల ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేనప్పుడు రెన్యువల్ ప్రీమియంపై తగ్గింపు లభిస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యమహా ఆర్15: ఇప్పుడు కొత్త రంగులో..
యమహా కంపెనీ తన ఆర్15 వీ4 లైనప్ను రీఫ్రెష్ చేసింది. ఇందులో భాగంగానే కొత్త కలర్ (ప్రీమియం మెటాలిక్ గ్రే షేడ్) ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఇది వెర్మిలియన్ వీల్స్తో స్టీల్టీ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ను పొందుతుంది. దీంతో ధరలు కూడా పెరిగాయి.కొత్త కలర్ యమహా ఆర్15 వీ4 బైక్ ధరలు రూ. 1.67 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 2.01 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య ఉన్నాయి. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్షిఫ్టర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ముందు భాగంలో అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో లింక్డ్ టైప్ మోనోషాక్ వంటివి ఇందులో చూడవచ్చు.2025 యమహా ఆర్15 వీ4 బైకులో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్పీ పవర్, 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇంజన్ డెల్టాబాక్స్ ఫ్రేమ్ లోపల ఉంటుంది. పనితీరు మాత్రమే స్టాండర్డ్ బైక్ మాదిరిగానే ఉంటుంది. -
జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర
జీఎస్టీ సమావేశం తరువాత వచ్చిన ప్రతిపాదనలు.. కార్ల రేట్లను తగ్గేలా చేశాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని.. కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు.. వినియోగదారులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీంతో భారతదేశం అంతటా ఉన్న హ్యుందాయ్ కస్టమర్లు తమకు ఇష్టమైన హ్యుందాయ్ మోడళ్లను మరింత అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలరు. ఈ పండుగ సీజన్లో బ్రాండ్ కార్ల సేల్స్ పెరుగుతాయి.ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించడానికి.. భారత ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టితో కూడిన చర్యను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' అన్నారు. ఈ సంస్కరణ ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ మార్గంలో పాయిస్తున్నప్పుడు.. ఆటోమొబైల్ రంగం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.జీఎస్టీ 2.0 అమలుతో.. హ్యుందాయ్ టక్సన్ కారు ధర గరిష్టంగా రూ. 2,40,303 వరకు తగ్గింది. గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 73,808 తగ్గింది. మోడల్ వారీగా తగ్గిన ధరలు ఎలా ఉన్నాయంటే..➤గ్రాండ్ ఐ 10 నియోస్: రూ.73,808➤ఆరా: రూ.78,465➤ఎక్స్టర్: రూ.89,209➤ఐ20: రూ.98,053➤ఐ20 ఎన్ లైన్: రూ.1,08,116➤వెన్యూ: రూ.1,23,659➤వెన్యూ ఎన్ లైన్: రూ.1,19,390➤వెర్నా: రూ.60,640➤క్రెటా: రూ.72,145➤క్రెటా ఎన్ లైన్: రూ.71,762➤అల్కాజార్: రూ.75,376➤టక్సన్: రూ.2,40,303 -
జావా, యెజ్డి బైక్ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ప్రకటించిన కంపెనీ
క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) తమ జావా, యెజ్డి బైక్ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా భారతదేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలో నిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో, జావా, యెజ్డీ బైక్లు తిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి 18 శాతం పరిధిలోకి తీసురావడాన్ని స్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీ జావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్మెన్స్ క్లాసిక్ బైక్ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.కొత్త ధరలు ఇవే42 మోడల్ పాత ధర రూ.1,72,942 కాగా కొత్త ధర రూ.1,59,431 తగ్గింపు రూ. 13,511జావా 350 పాత ధర రూ.1,98,950, కొత్త ధర రూ.1,83,407, తగ్గింపు రూ.15,54342 బాబర్ పాత ధర రూ.2,09,500, కొత్త ధర రూ.1,93,133, తగ్గింపు రూ.16,36742 బాబర్ (ఇంకొక వేరియంట్) పాత ధర రూ.2,10,142, కొత్త ధర రూ.1,93,725, తగ్గింపు రూ.16,417పెరక్ పాత ధర రూ.2,16,705, కొత్త ధర రూ.1,99,775, తగ్గింపు రూ.16,930 -
టీవీఎస్ అపాచీ.. కొత్త వేరియంట్లు వచ్చాయ్..
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత టీవీఎస్ మోటార్ సంస్థ తన ప్రధాన మోటార్ సైకిల్ టీవీఎస్ అపాచీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అపాచీ ఆర్టీఆర్ 160, 180, 200, టీవీఎస్ అపాచీ RR310, RTR310 లైనప్లలో లిమిటెడ్–ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ లైనప్లో ప్రత్యేకమైన బ్లాక్–షాంపైన్–గోల్డ్ లివరీ, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, యూఎస్బీ చార్జర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.ఇప్పటికే ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, 200 లైనప్లలో అత్యున్నత స్థానంలో నిలిచే కొత్త 4 వీ వేరియంట్లు, అత్యాధునిక క్లాస్–డి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఎల్ఈడీ డీఆర్ఎన్లు, ఆల్–ఎల్ఈడీ లైటింగ్, 5 అంగుళాల కనెక్టెడ్ టీఎఫ్టీ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బోల్డ్ కొత్త రంగులు, డైనమిక్ గ్రాఫిక్స్ తదితర అదనపు ఫీచర్లు లభించాయి. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కె.ఎన్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల టీవీఎస్ అపాచీ కమ్యూనిటీకి కృతజ్ఞతలు తెలిపారు. -
కార్ల ధరల తగ్గింపు షురూ...
ముంబై: జీఎస్టీ క్రమబద్ధీకరణ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు ఆటో కంపెనీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా తమ వాహన ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. పండుగ సీజన్ అమ్మకాలు పెంచుకునే లక్ష్యంలో భాగంగా మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనో ఇండియా, టయోటా కిర్లోస్కర్ ఇండియా, వాహన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన ధరల్ని కనీసం రూ. 75 వేల నుంచి గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు తగ్గిస్తామని తెలిపింది. మరో వైపు సవరించిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కార్ల ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సీ.భార్గవ చెప్పారు. మెుత్తానికి ఈ పండుగ సీజన్లో వాహన విక్రయాలు దుమ్ముదులిపేస్తాయని ఆటో పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా: ఎక్స్యూవీ3ఎక్స్ఓ డీజిల్ మోడల్పై రూ.1.56 లక్షల వరకు, స్కా రి్పయో ఎన్ ధర రూ.1.45 లక్షలు వరకూ తగ్గించింది. ఎక్స్యూవీ700పై రూ.1.43 లక్ష,లు, ఎక్స్యూవీ3ఎక్స్ఓ పెట్రోల్ మోడల్పై రూ.1.40 లక్షల వరకు, థార్ 2డబ్ల్యూడీ (డీజిల్) వేరియంట్ రూ.1.35 లక్షల వరకు, థార్ 4డబ్ల్యూడీ డీజిల్ కార్లపై రూ.1.01 లక్షల వరకు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షల వరకు థార్ రోక్స్ పై రూ.1.33 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బొలెరో/నియోపై రూ.1.27 లక్షలు తగ్గించింది. జీఎస్టీ కొత్త రేట్లు సెపె్టంబర్ 22, 2025 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ మహీంద్రా మాత్రం తక్షణమే వినియోగదారులకు లాభం చేకూర్చాలని నిర్ణయించింది. కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా సందేశంలో, ‘‘అందరూ సెపె్టంబర్ 22 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మేము ఇప్పుడే జీఎస్టీ ప్రయోజనాలను అందిస్తున్నాం. తక్షణమే (సెప్టెంబర్ 6 నుంచే) తగ్గింపు రేట్లను పొందండి’’ అని పేర్కొన్నారు. రెనో ఇండియా సైతం: తన మోడళ్లపై తగ్గింపులను జీఎస్టీ క్రమబదీ్ధకరణకు అనుగుణంగా ప్రకటించింది. మోడళ్ల వారీగా తగ్గిన రెనో రేట్లను పరిశీలిస్తే.. ఎంట్రీ లెవల్ క్విడ్ మోడల్ ధర రూ.55,095 తగ్గింది. ట్రైబర్ మోడల్ రూ.80,195 వరకు చౌకగా మారుతుంది. కైగర్ మోడల్ రూ.96,395 వరకు ధర తగ్గింపుతో అందుబాటులోకి వస్తోంది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. తగ్గింపు బాటలో టయోటో కిర్లోస్కర్: టయోటా కిర్లోస్కర్ మోటార్ సైతం జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. తమ కార్ల ధరలను గరిష్టంగా రూ.3.34 లక్షల వరకు తగ్గించనున్నట్లు వెల్లడించింది. సెపె్టంబర్ 22 నుంచి చేసే అన్ని డెలివరీలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ... ఫార్చ్యూ నర్ ధర రూ. 3.49 లక్షల వరకు తగ్గనుంది. వెల్ఫైర్ ధర రూ. 2.78 లక్షలు, హైలక్స్ ధర రూ.2.52 లక్షలు, కామ్రీ ధర రూ.1.01 లక్షల తగ్గనున్నాయి. కామ్రీ ధరలో రూ. 1.01 లక్షలు, లెజెండర్లో రూ. 3.34 లక్షలు, అర్బన్ క్రూయిజర్ హైరైడర్లో రూ. 65,400, గ్లాంజాలో రూ. 85,300 తగ్గింపు ఉంటుంది. ‘‘చారిత్రాత్మక సంస్కరణ చేపట్టిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది ఆటో సెక్టార్లో విశ్వాసా న్ని బలోపేతం చేస్తుంది. ఈ రాయితీలు కస్టమర్లకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని టయోటో కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వధ్వా తెలిపారు. సిట్రోయెన్ ‘బసాల్ట్ ఎక్స్’ కార్లు ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభం కార్ల కంపెనీ సిట్రోయెన్ ఇండియా తాజాగా బసాల్ట్ ఎక్స్ శ్రేణి కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో దేశీయంగా తొలిసారి ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘కారా’, ప్రీమియం ఇంటీరియర్స్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, రిమోట్ స్టార్ట్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ మధ్య నుంచి ఇవి టెస్ట్ డ్రైవ్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. -
టీవీఎస్ ఆర్బిటర్ vs ఐక్యూబ్: ఏది ఎక్కువ రేంజ్..
టీవీఎస్ మోటార్ ఇటీవలే.. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో.. ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఈవీకి అమ్మకాల పరంగా కొంత పోటీ పడుతుంది. రెండూ ఒకే కంపెనీకి చెందినవైనప్పటికీ.. డిజైన్, ఫీచర్స్, ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఆర్బిటర్ vs ఐక్యూబ్: డిజైన్ & ఫీచర్స్కొత్త టీవీఎస్ ఆర్బిటర్ 845 మిమీ ప్లాట్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్ పొందుతుంది. దీని కారణంగా రైడర్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అనుభవించవచ్చు. ఇది 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఐక్యూబ్లో 32 లీటర్లు.కొత్త ఆర్బిటర్ ముందు భాగంలో హై-మౌంటెడ్ హెడ్ల్యాంప్ క్లస్టర్ ఉంది. ఇది డీఆర్ఎల్ స్ట్రిప్తో కలిసి.. ఫ్రంట్ ఆప్రాన్లో విలీనం అవుతుంది. ఈ స్కూటర్ రెండు చివర్లలో 14 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ. ఇది క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటెడ్ హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం డిజైన్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. ఆర్బిటర్ కంటే కూడా కొంత తక్కువ అండర్ సీట్ కెపాసిటీ పొందుతుంది.ఆర్బిటర్ vs ఐక్యూబ్: పర్ఫామెన్స్ & రేంజ్టీవీఎస్ ఆర్బిటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 145 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. 2.2 కిలోవాట్, 3.1 కిలోవాట్, 5.3 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99000కాగా.. ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మార్కెట్లో కొత్త వియాత్నం కార్లు: ధరలు ఇలా..
వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు.. విన్ఫాస్ట్ తన రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీలు VF6, VF7 ధరలను ప్రకటించింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 20.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న కంపెనీ కొత్త ప్లాంట్లో స్థానికంగా అసెంబుల్ చేస్తారు. సంస్థ వీటికోసం జులై 15 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.విన్ఫాస్ట్ VF6విన్ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది స్ప్లిట్ హెడ్లైట్, టెయిల్లైట్ సెటప్లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!విన్ఫాస్ట్ VF7టేపింగ్ రూఫ్లైన్, యాంగ్యులర్ రియర్ విండ్షీల్డ్తో స్ట్రీమ్లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది. -
మస్క్ ముంగిట కనీవినీ ఎరుగని జీతం...
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముంగిటకు కనీవినీ ఎరుగని జీతం ప్రతిపాదన వచ్చింది. టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల) విలువైన జీత ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే ఇది సాధారణ జీతం కాదు. పూర్తిగా పనితీరు ఆధారితమైనది. ఈ ప్యాకేజీని పొందాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి.ముఖ్యమైన షరతులు ఇవే..టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి 10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి10 లక్షల హ్యూమనాయిడ్ ఏఐ బాట్స్ రూపొందించాలికనీసం 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్కు ఉంచనుంది. గతంలో డెలావేర్ కోర్టు కొట్టివేసిన 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది. భారత విస్తరణలో భాగంగా టెస్లా ఢిల్లీలో ఇటీవల రెండవ షోరూమ్ను ప్రారంభించింది. భారతీయ ఈవీ మార్కెట్లో మరింత లోతుగా ప్రవేశించేందుకు ఇది కీలక అడుగు. -
జీఎస్టీ ఎఫెక్ట్...టాటా మోటార్స్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. తన ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గించనున్నట్లు శుక్రవారం తెలిపింది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. చిన్న కార్ల విభాగంలోని టియాగోపై రూ.75వేల తగ్గింపు, టిగోర్పై రూ.80 వేలు, ఆల్ట్రోజ్పై రూ.1.10 లక్షల తగ్గింపు ఉంటుంది. కాంపాక్ట్ ఎస్యూవీ పంచ్పై రూ.85 వేలు, నెక్సాన్ కారుపై రూ.1.55 లక్షల తగ్గింపు అమలులోకి రానుంది. మిడ్ సైజ్ మోడల్ కర్వ్పై రూ.65 వేలు, ప్రీమియం ఎస్యూవీలు హారియర్పై రూ.1.40 లక్షలు, సఫారీపై రూ.1.45 లక్షల తగ్గింపు ఉండనుందని కంపెనీ పేర్కొంది. ‘‘దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి ఉద్దేశాలకు అనుగుణంగా... ‘వినియోగదారునికే తొలి ప్రాధాన్యత’ అనే మా సిద్ధాంతాన్ని అవలంబిస్తూ, జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభాన్ని ఎటువంటి కోత లేకుండా కస్టమర్లకే పూర్తిగా అందజేస్తున్నాం’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. -
టీవీఎస్ ఎన్టార్క్ 150 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్టార్క్ 150’ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ, ప్రీమియం లుక్తో వస్తున్న ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్టీ వేరియంట్ ధర రూ.1,29,000 గా ఉంది.149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..హై–రిజల్యూషన్ టీఎఫ్టీ క్లస్టర్తో పాటు టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్షన్ టెక్నాలజీ ఉంది. అలెక్సా, స్మార్ట్వాచ్ ఇంటిగ్రేషన్, టర్న్–బై–టర్న్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్, చివరిగా పార్క్ చేసిన స్థానం, కాల్/మెసేజ్ అలర్ట్స్, రైడ్, స్ట్రీట్ మోడ్లు, ఓటీఏ అప్డేట్స్, కస్టమ్ విడ్జెట్లు వంటి మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. -
భారత్లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికి ఈ కారు కోసం 600 బుకింగ్స్ వచ్చాయిగా. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారును (First Tesla Car in India) డెలివరీ చేసింది. ఇంతకీ తొలి కస్టమర్ ఎవరో తెలుసా?తెలుపు రంగు టెస్లా ‘మోడల్ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్పీరియెన్స్ సెంటర్’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్లో విక్రయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తరువాత ‘మోడల్ వై’ కారు (Tesla Model Y) విక్రయాలు మొదలయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు చేపట్టింది.#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from 'Tesla Experience Centre' at Bandra Kurla Complex, Mumbai, being made to the State's Transport Minister Pratap Sarnaik. 'Tesla Experience Center', the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG— ANI (@ANI) September 5, 2025టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
చిన్న కారు.. హుషారు!
ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీతో కూడిన ఎస్యూవీల ధాటికి చిన్న కార్లు చిన్నబోతున్న తరుణంలో.. జీఎస్టీ రేటు కోత తిరిగి ప్రారంభ స్థాయి కార్లకు డిమాండ్ను పెంచుతుందని ఆటోమొబైల్ పరిశ్రమలో ఆశాభావం వ్యక్తమవుతోంది. రోడ్లపై మళ్లీ చిన్న కార్లు తెగ సందడి చేయనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్టీలో 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తీసుకొచి్చన నేపథ్యంలో ఒక్క చిన్న కార్ల ధర రూ.లక్ష వరకు తగ్గనుంది. దీంతో మరింత మంది వినియోగదారులకు ఇవి చేరువ కానున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ కార్ల మొత్తం విక్రయాల్లో చిన్న కార్ల వాటా 31 శాతంగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో 27 శాతానికి పడిపోయింది. ‘‘12 శాతం రేటు తగ్గిన ఫలితంగా కొనుగోలు వ్యయం రూ.లక్ష మేర తగ్గనుంది. దీంతో డిమాండ్ పుంజుకుంటుంది. పండగుల తరుణంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అమ్మకాలు పెరుగుతాయి. మధ్యశ్రేణి, విలాస కార్లపై జీఎస్టీ రేటు 40 శాతానికి పెరగనుంది. కాంపెన్సేషన్ సెస్ లేకపోవడంతో వీటి ధరలు కూడా తగ్గనున్నాయి’’అని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా అంచనా వేశారు. అందరికీ మేలు..: వాహనాలపై జీఎస్టీ రేటు తగ్గింపును భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర ఆహ్వానించారు. సకాలంలో తీసుకున్న ఈ చర్య ఆటోమోటివ్ రంగంలో తాజా ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ‘‘వాహనాల ధరలు చౌకగా మారతాయి. ముఖ్యంగా ఆరంభ స్థాయి కార్ల ధరలు తగ్గుతాయి. మొదటిసారి కొనుగోలుదారులకు, మధ్యాదాయ కుటుంబాలకు మేలు కలుగుతుంది’’అని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం రేటును కొనసాగించడాన్ని సైతం స్వాగతించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు సాహసోపేతమైనవి, మార్పును తీసుకొచ్చేవిగా ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో వాహన ధరలు అందుబాటులోకి వస్తాయని, డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన పండుగల సీజన్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా రేట్ల తగ్గింపు అమలు చేయడం ద్వారా ప్రయోజనాలను కస్టమర్లకు అందేలా చూడొచ్చన్నారు. ప్రీమియం కార్లకూ ప్రయోజనమే.. పెద్ద కార్లపై లెవీలను క్రమబద్ధీ్దకరిస్తూ.. చిన్న కార్లపై రేటు తగ్గించడం సామాన్యులకు వాహనాలను చేరువ చేస్తాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ డీఎండీ స్వప్నేష్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సెస్సు లేకుండా ప్రీమియం కార్లపై 40 శాతం జీఎస్టీ అమలు చేయడం వల్ల విక్రయాలు పెరుగుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.మరిన్ని వేగవంతమైన సంస్కరణల బాటలోకి చేరాం. ఇవి వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయి. ఎకానమీ విస్తృతమై, ప్రపంచవేదికపై భారత్ స్వరాన్ని బలపరుస్తుంది. ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అన్న వివేకానంద సందేశాన్ని గుర్తు చేసుకోవాలి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ -
భద్రతే లక్ష్యంగా కొత్త రూల్: నితిన్ గడ్కరీ
ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..రోడ్డు ప్రమాదాల గురించిరోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. -
రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?
ఇండియాలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. వీటికి కస్టమైజేషన్ చేయడం వంటివి చేస్తే.. రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి కోసం సరికొత్త 'బీఎండబ్ల్యూ' కారును కొనుగోలు చేయనున్నారు. దీని ధర రూ. 3.66 కోట్లు అని తెలుస్తోంది. మరి ఇంత ఖరీదైన కారుకు జీఎస్టీ వర్తిస్తుందా?, లేదా?.. అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కోసం 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్మాన్ గార్డ్' ఉపయోగిస్తున్నారు. ఈ కారు స్థానంలో సరికొత్త బీఎండబ్ల్యూ కారు చేరనుంది. రాష్ట్రపతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కార్లను మారుస్తూ ఉంటారు. ఈ కార్లు కస్టమ్స్ బుల్లెట్ ప్రూఫ్.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికసాధారణంగా హై ఎండ్ కార్లను దిగుమతి చేసుకుంటే.. చాలా రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జీఎస్టీ, ఐజీఎస్టీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు సెస్సు వంటివి ఉంటాయి. కానీ రాష్ట్రపతి కోసం దిగుమతి చేసుకునే కారు కాబట్టి.. జీఎస్టీ నుంచి మాత్రమే కాకుండా సెస్సు నుంచి కూడా జీఎస్టీ కౌన్సిల్ మినహాయింపు కల్పించింది. ఇలాంటి మినహాయింపులు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా ప్రస్తుతం లగ్జరీ కార్లు 40 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్నాయి. -
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం: అదే స్లాబులో ఎలక్ట్రిక్ వెహికల్స్..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద 5 శాతం, 18 శాతం జీఎస్టీ స్లాబ్స్ తీసుకురావడంతో.. చాలా వస్తువుల ధరలతో పాటు, వాహనా ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇందులో చిన్న కార్లు, బైకుల ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మాత్రం యధావిధిగా 5 శాతం స్లాబులోనే నిలిచాయి.రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద ఉన్న కార్లు 5 శాతం స్లాబులో, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలు 18 శాతం స్లాబులో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. టాటా మోటార్స్, మహీంద్రా కార్ల ధరలలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.ఎలక్ట్రిక్ కార్ల ధరలు 5 శాతం స్లాబులో ఉండటం వల్ల.. ధరలు కొంత నిర్దిష్టంగా ఉంటాయి. ఇది కొనుగోలుదారుల సంఖ్య పెంచుతుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే.. కాలుష్య కారకాలు తగ్గుతాయి. తద్వారా క్లిన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. ఈ కారణంగానే ఈవీలను 5 శాతం స్లాబులో ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుఈ సంవత్సరం ఏప్రిల్ - జూలై మధ్య.. ఈవీ అమ్మకాలు 15,500 యూనిట్లను చేరుకున్నారు. ఇందులో టాటా మోటార్స్ 40% వాటాతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా 18% వాటాతో ఉంది. టెస్లా కూడా దేశంలో దాని మోడల్ Yతో ప్రవేశించింది, అయితే డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. -
మారుతీ కొత్త ఎస్యూవీ ‘విక్టోరిస్’
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. విక్టోరిస్ను అభివృద్ధి చేయడంపై సుమారు రూ.1,240 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వెర్షన్లు కూడా ఉన్నాయి.కొత్త తరం కస్టమర్లు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విక్టోరిస్ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని 100 పైగా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28 శాతానికి ఎగిసిందని తకెయుచి వివరించారు.మారుతీ సుజుకీ ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా లాంటి ఎస్యూవీలను విక్రయిస్తోంది. దేశీయంగా మిడ్–సైజ్ ఎస్యూవీల అమ్మకాలు ప్రస్తుతం ఏటా 9.5 లక్షల యూనిట్లుగా ఉండగా, మొత్తం ఎస్యూవీల మార్కెట్లో వీటి వాటా 40 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు -
యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్లోని హన్సల్పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్మెంట్లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారుమారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
బ్యాటరీ తయారీలో అశోక్ లేలాండ్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు
భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఎకోసిస్టమ్ను బలోపేతం చేసే దిశగా వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడుల పెడుతోంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో తదుపరి తరం బ్యాటరీల అభివృద్ధి, తయారీ కోసం రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. హిందూజా గ్రూప్ యాజమాన్యంలోని ఈ సంస్థ చైనా బ్యాటరీ టెక్నాలజీ లీడర్ సీఏఎల్బీ గ్రూప్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, భారత్లో బలమైన బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించడం లక్ష్యంగా ఈ సహకారం కుదిరినట్లు ఇరు వర్గాలు తెలిపాయి.ఆటోమోటివ్, ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్లు..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్)తో సహా ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్లలో ఈ పెట్టుబడులు విస్తరించనున్నాయి. అశోక్ లేలాండ్ బ్యాటరీ ఉత్పత్తి విభాగంలోకి ప్రవేశించడంతో సొంత వాణిజ్య వాహన వ్యాపారానికి మద్దతుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంలో బ్యాటరీ సరఫరా గొలుసును సృష్టించే దిశగా సీఏఎల్బీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కీలక అడుగు అని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షెను అగర్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాటరీ వ్యాపారంలో ప్రాథమికంగా ఆటోమోటివ్ అప్లికేషన్లపై దృష్టి సారిస్తాం. తరువాత పారిశ్రామిక, నివాస ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలతో సహా నాన్-ఆటోమోటివ్ రంగాలకు ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
వాహన విక్రయాలకు జీఎస్టీ 2.0 బ్రేకులు
కొత్త జీఎస్టీ విధానంతో ధరలు తగ్గొచ్చనే ఆశావహ అంచనాలతో కస్టమర్లు వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆగస్టులో ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% శ్లాబులో ఉంది. వాహన రకాన్ని బట్టి 1–22% పరిహార సెస్ విధిస్తున్నారు. చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్యూవీలపై 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. జీఎస్టీ 2.0 విధానంలో అన్ని వాహనాలను ఒకే శ్లాబులోకి ఉంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో కస్టమర్లు జీఎస్టీ ప్రకటన వెలువడే వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మారుతీ సుజుకీ దేశీయంగా ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో అమ్ముడైన 1,43,075 వాహనాలతో పోలిస్తే 8% తక్కువ. ఎగుమతులతో మొత్తం అమ్మకాలు 1,80,683 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘జీఎస్టీ సంస్కరణ ఆటో పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఏదైనా మంచి ఫలితం దక్కాలంటే.., ముందుగా కష్టాన్ని భరించాలి. అందుకే ఆగస్టు నెలలో డీలర్లకు సరఫరా తగ్గింది. జీఎస్టీ ప్రకటన తర్వాత పరిస్థితి మారుతుంది. మా వద్ద 1.5 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. డీలర్ల వద్ద నిల్వలు 48–50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారు
ప్రముఖ చైనా వాహన తయారీ సంస్థ అయిన బీవైడీ.. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇండియాలో 10000వ ప్యాసింజర్ కారును డెలివరీ చేసినట్లు ఇటీవల ప్రకటించింది.2021 చివరిలో భారతదేశంలో తన మొదటి ప్యాసింజర్ వాహనాన్ని ఈ6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మొదట్లో కమర్షియల్ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసిన బీవైడీ ఇండియా.. ఆ తరువాత ప్యాసింజర్ కార్లను లాంచ్ చేసింది.BYD ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు కార్లను (సీల్, ఆట్టొ, ఈ6, ఈమ్యాక్స్7) విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో తన లైనప్ను పెంచుకోవడంలో భాగంగా.. కంపెనీ ఆట్టొ 2 లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది క్రెటా ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.ప్రపంచవ్యాప్తంగా.. బీవైడీ 13 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీని వల్ల 2025 జులై 31 నాటికి 106.52 బిలియన్ కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను ఆదా చేయడంలో కంపెనీ సహాయపడింది. ఇది దాదాపు 1.77 బిలియన్ చెట్లు గ్రహించిన CO2కు సమానం. ఈ కంపెనీ వరుసగా మూడు సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్జెడ్ ద్వారా టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది, 2025లో దీని బ్రాండ్ విలువ USD 14.4 బిలియన్లు, ఇది సంవత్సరానికి 43.6% వృద్ధిని సూచిస్తుంది. -
వాహనాలకు ప్రీమియం నంబర్లు.. ఇక కొత్త నిబంధనలు
తెలంగాణలో వాహనాలకు ప్రీమియం నంబర్లకు సంబంధించిన నిబంధనలు మారాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని రూల్ 81కు సమగ్ర సవరణ చేస్తూ ప్రీమియం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసే ఫీజు విధానం, ప్రక్రియను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇకపై రవాణా శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం, అవినీతిని అరికట్టడం, మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిజిటల్-ఓన్లీ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకుకొచ్చారు.కొత్త అంచెల ఫీజు విధానంసవరించిన నిబంధనల ప్రకారం నంబర్ల పాపులారిటీ, ప్రత్యేకత ఆధారంగా ఆరు అంచెల ఫీజు వ్యవస్థను ప్రవేశపెట్టారు.టైర్ 1లో 1, 9, 9999 నంబర్లకు అత్యధికంగా రూ.1,50,000టైర్ 2లో 99, 100, 786, 888, 999 నంబర్లకు రూ 1,00,000టైర్ 3లో 33, 111, 555, 666, 777, 1000 నంబర్లకు రూ. 50,000 టైర్ 4లో 1234, 2023, 2525, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9090 నంబర్లకు రూ. 20,000టైర్ 5లో 123, 143, 202, 345, 789, 987 నంబర్లకు రూ. 10,000టైర్ 6లో ఇతర అన్ని నంబర్లకు రూ.2,000అధిక-డిమాండ్ నంబర్లకు ఆన్లైన్ వేలంఅధిక-డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే నంబర్ల కోసం ప్రభుత్వం ఆన్లైన్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డర్లు రెండు గంటల విండోలో పోటీపడతారు. అత్యధిక బిడ్డర్ నంబర్ను సొంతం చేసుకుంటారు. విఫలమైన బిడ్డర్లు చెల్లించిన ఫీజులో 10% కోల్పోతారు.గెలిచిన బిడ్డర్ 30 రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అలాగే మొత్తం రుసుమును సీజ్ చేస్తారు. ఆన్లైన్ విధానం వల్ల అక్రమాలు తగ్గడమే కాకుండా ప్రీమియం సేవల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సవరణలను ఖరారు చేయడంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా గెజిట్ వెలువడిన 15 రోజుల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
సెప్టెంబర్ 4న లాంచ్ అయ్యే టీవీఎస్ స్కూటర్ ఇదే
టీవీఎస్ మోటార్ కంపెనీ.. సెప్టెంబర్ 4న 'ఎన్టార్క్ 150'ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో రాబోయే స్కూటర్ హెడ్ల్యాంప్ క్లస్టర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది క్వాడ్ ఎల్ఈడీ సెటప్తో.. టీ-షేప్ హౌసింగ్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటరుకు సంబంధించిన మెకానికల్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. -
సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!
సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులకు రీకాల్ జారీ చేసింది. వెనుక బ్రేక్ సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 జూన్ మధ్యలో తయారైన 5145 యూనిట్ల బైకులపై ఈ రీకాల్ ప్రభావం పడింది. అయితే వినియోగాదారుల నుంచి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బ్రాండ్ ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.వెనుక బ్రేక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. ప్యాడ్లు, బ్రేక్ డిస్క్ల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడమే. అత్యవసర సమయంలో బ్రేకింగ్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కంపెనీ దీనిని పరిష్కరించడానికి ఈ రీకాల్ జారీ చేసింది. ఫిబ్రవరి 2024లో కూడా ఇంజిన్ క్యామ్షాఫ్ట్ సమస్య కారణంగా సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రామ్ ఎస్ఎక్స్ బైకులకు రీకాల్ జారీ చేసింది.సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 వినియోగదారులు బైకులోని సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలోని సర్వీస్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ, సాంకేతిక నిపుణులు మోటార్సైకిల్ను తనిఖీ చేసి, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తారు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవేసుజుకి జిక్సర్ 250.. జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులు 249సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 26.5 హార్స్ పవర్, 22 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. -
లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవే
వియాత్నం కంపెనీ విన్ఫాస్ట్.. భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను 2025 సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కనిపించిన ఈ కార్లు త్వరలోనే రోడ్డుపై కనిపించనున్నాయి. కాగా కంపెనీ ఈ కార్ల కోసం ఫ్రీ-బుకింగ్లను జులై 15 నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. వినియోగదారులు రూ. 21,000 రీఫండబుల్ డిపాజిట్ ద్వారా ఆన్లైన్లో లేదా విన్ఫాస్ట్ అవుట్లెట్లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని కోరుకునే భారతీయ కొనుగోలుదారులను.. లక్ష్యంగా చేసుకుని విన్ఫాస్ట్ VF6 & VF7 లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కలిగి ఉంటాయని, పనోరమిక్ గ్లాస్ రూఫ్లను కూడా పొందుతాయని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారువిన్ఫాస్ట్ తన సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్వర్క్ను విస్తరించడంతో భాగంగా.. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 నగరాల్లో 32 షోరూమ్లను ఏర్పాటు చేయడానికి 13 డీలర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి.. కంపెనీ రోడ్గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు ఇంక పెరిగేది ఇంతే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1–4 శాతం పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. డీలర్ల వద్ద అధిక నిల్వలు, బేస్ ఎఫెక్ట్ల కారణంగా అవుట్లుక్ వృద్ధిని పరిమితం చేసినట్లు రేటింగ్ సంస్థ తెలిపింది. అయితే ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు)లు కొత్త మోడళ్ల ఆవిష్కరణ, జీఎస్టీ రేట్ల తగ్గింపు అవకాశాలు కొన్ని ప్రత్యేక విభాగాల్లో డిమాండ్కు తోడ్పడతాయని పేర్కొంది.‘‘పండుగ సీజన్కు ముందు ఓఈఎంలు ఇన్వెంటరీ నిల్వలను పెంచుకోవడంతో నెల వారీ ప్రాతిపదికన జూలై హోల్సేల్ అమ్మకాల్లో 8.9 శాతం వృద్ధి నమోదైంది. అయితే వార్షిక ప్రాతిపదికన ఫ్లాటుగా 3.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన రిటైల్ అమ్మకాలు 10.4% వృద్ధి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదకన స్వల్పంగా 0.8% క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఎస్యూవీలు 65–66% వాటా సాధించాయి. సమీప భవిష్యత్తులో యుటిలిటీ వాహనాలు పరిశ్రమ వృద్ధికి కీలక ప్రచోదకాలుగా మారాయి’’ అని ఇక్రా వివరించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఈ బైక్ ధరలు భారీగా పెరగనున్నాయ్!
పండుగ సీజన్లో వాహనాల ధరలు కొంత తగ్గుతాయి, అప్పుడు నచ్చిన బైక్ కొనుగోలు చేద్దామని కొంతమంది వేచి చూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే జీఎస్టీ పెరుగుదల కారణంగా.. బైక్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.ముఖ్యంగా 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్.. ఆన్ రోడ్ ధరలు ఇప్పుడు 30 శాతం లేదా.. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాగా తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇప్పటి వరకు అన్ని మోటార్ సైకిల్స్ 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. అయితే 350 సీసీ బైకులకు 28 శాతం జీఎస్టీతో పాటు 3 శాతం సెస్సు కలుస్తుంది. అంటే వీటిపై జీఎస్టీ 31 శాతానికి చేరుతుంది. ఇక త్వరలో రాబోయే జీఎస్టీ 2.0 విధానంలో రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ రద్దు అవుతాయి. అయితే 40 శాతం జీఎస్టీ అనేది లగ్జరీ వాహనాలకు వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుజీఎస్టీ ప్రభావం వల్ల.. బైక్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు పెరుగుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ప్రస్తుత ఆన్ రోడ్ ధర రూ. 3.80 లక్షలు. జీఎస్టీ కారణంగా దీని ధర రూ. 4.13 లక్షలకు చేరుతుంది. అదే విధంగా కేటీఎం ధర కూడా రూ. 3.60 లక్షల నుంచి రూ. 3.91 లక్షలకు చేరుతుంది. ట్రయంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్సన్ వంటి బైకుల ధరలు కూడా పెరుగుతాయి. -
టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
టీవీఎస్ మోటార్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ ను లాంచ్ చేసింది. సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ .99,900 (ఎక్స్-షోరూమ్, పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్, బెంగళూరు, న్యూఢిల్లీతో సహా). దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ను అందిస్తుంది.ఆర్బిటర్ 3.1 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రెండు హెల్మెట్లు పట్టేంత 34 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఇందులో ఉన్నాయి.కనెక్టెడ్ యాప్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్, క్రాష్/ఫాల్ అలర్ట్స్, యాంటీ థెఫ్ట్ నోటిఫికేషన్లు, ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ను ఈ స్కూటర్ అందిస్తోంది. కలర్ ఎల్సీడీ క్లస్టర్ కాల్స్, మెసేజ్ లు, పర్సనలైజ్డ్ అలర్ట్ లను ప్రదర్శిస్తుంది.పొడవైన 845 ఎంఎం ఫ్లాట్ ఫార్మ్ సీట్, స్ట్రెయిట్ లైన్ ఫుట్ బోర్డ్, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్ తో డిజైన్ చేసిన ఈ ఆర్బిటర్ రైడర్ కంఫర్ట్, ఎర్గోనామిక్స్ కు ప్రాధాన్యమిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్, లైవ్ ట్రాకింగ్, టోయింగ్ అలర్ట్స్, 169 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నాయి.ఆర్బిటర్ నియాన్ సన్బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్స్ కాపర్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
కారు తెచ్చిన చిక్కులు.. షారుఖ్, దీపికలపై కేసులు
బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలకు చిక్కులు ఎదురయ్యాయి. రాజస్థాన్కు చెందిన కీర్తి సింగ్ అనే న్యాయవాది హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2022లో రూ.23.97 లక్షలకు కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.యాక్సిలరేటర్ తొక్కినప్పుడు ఆర్పీఎమ్ పెరిగినా కారు వేగం పెరగలేదని సింగ్ ఆరోపిస్తున్నారు. వాహనం కంపించి ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టం పనిచేయకపోవడం లేదన్న హెచ్చరికను ప్రదర్శించింది అంటున్నారు. దీనిపై హ్యుందాయ్ డీలర్ను అడిగితే ఇది తయారీ లోపమని, దాన్ని పూర్తిగా సరిచేయడానికి వీలుకాదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.హ్యుందాయ్ కంపెనీ, డీలర్ షిప్ వారు కారును ఫిక్స్ చేయడానికి లేదా మార్చడానికి నిరాకరించడంతో కీర్తి సింగ్ వారిపై సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని నిబంధనలను కూడా ఆయన ఉపయోగించారు. ఇది తప్పుదోవ పట్టించే ప్రమోషన్లకు మద్దతుదారులను బాధ్యులను చేస్తుంది.షారుఖ్ , దీపికలపైనా కేసు ఎందుకంటే..బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు ఇద్దరు నటుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. షారుఖ్ 1998 నుండి హ్యుందాయ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపిక డిసెంబర్ 2023లో హ్యుందాయ్ తో చేరారు. లోపభూయిష్టమైన ఉత్పత్తిని విశ్వసించేలా వారి ఎండార్స్ మెంట్ లు వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని కీర్తి సింగ్ వాదిస్తున్నారు. -
ద్విచక్ర వాహన విక్రయాలు పెరగొచ్చు.. ఇక్రా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాలు 6–9% పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్థిరమైన రిప్లేస్మెంట్(పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం), పట్టణ ప్రాంతాల్లో వినియోగ రికవరీ, సాధారణ వర్షపాతం నమోదుతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, జీఎస్టీ రేట్ల తగ్గింపు తదితర అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడతాయని రేటింగ్ సంస్థ తెలిపింది.‘పరిశ్రమ అవుట్లుక్ ఇప్పట్టకి సానుకూల వైఖరి కలిగి ఉంది. స్థిరమైన డిమాండ్ ఉతమిస్తుంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు అంశం వృద్ధి వేగవంతం కావడానికి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది’ అని పేర్కొంది. పండుగ సీజన్కు ముందు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు) డీలర్లకు బలమైన పంపిణీ కారణంగా ఈ జూలైలో టూ వీలర్స్ హోల్సేల్ అమ్మకాలు 9% వృద్ధితో 15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో రిటైల్ అమ్మకాలు 6.5% క్షీణించాయి. పట్టణ ప్రాంతంలో డిమాండ్ స్తబ్ధత, అధిక వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమని పేర్కొంది. ఎగుమతుల వృద్ధి సైతం కొనసాగొచ్చని తెలిపింది. రాబోయే పండుగ సీజన్ నాటికి రిటైల్ డిమాండ్ పుంజుకోవచ్చని రేటింగ్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
5 ఏళ్లు.. 70,000 కోట్లు
హన్సల్పూర్, గుజరాత్: ఆటో రంగ జపనీస్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారత్లో రానున్న 5–6ఏళ్లలో రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. దేశీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి సైతం ప్రధాని తెరతీశారు. రానున్న 5–6 ఏళ్లలో దేశీయంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొషిహిరో వెల్లడించారు. భారత్ మొబిలిటీ ప్రయాణంలో నాలుగు దశాబ్దాలుగా భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్ మొబిలిటీ, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వార్షికంగా 40 లక్షల యూనిట్ల తయారీ లక్ష్యాన్ని అందుకునేందుకు తాజా పెట్టుబడులను వినియోగించనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇందుకు మద్దతుగా మౌలికసదుపాయాలు, ఆర్అండ్డీ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్జీఎస్టీ సమావేశం తర్వాత.. వచ్చే నెలలో నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తదుపరి గుజరాత్లో రెండో ప్లాంటు ఏర్పాటుపై స్పష్టత రాగలదని భార్గవ పేర్కొన్నారు. రూ. 35,000 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును నెలకొల్పనున్నట్లు గతేడాది ప్రకటించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా భార్గవ జీఎస్టీ నిర్ణయాల కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ–విటారా కార్లను 100 దేశాలకు సరఫరా చేయనున్నట్లు భార్గవ వెల్లడించారు. అయితే దేశీయంగా ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించలేదు. బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండటంతో కార్ల తయారీ ధర అధికంగా ఉందన్నారు. కాగా.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్లో రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 11 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలియజేసింది.#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad. (Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025 -
జీఎస్టీ తగ్గాకే కొందాంలే..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో ఆఫర్లు బాగున్నాయని గోపాల్ కొత్తగా మారుతీ బలెనో కొనుక్కుందామని బుక్ చేశారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. కానీ, అకస్మాత్తుగా కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు. అటు డీలరు రోజూ ఇంకాస్త కట్టేసి కారును తీసుకెళ్లండంటూ వెంటబడుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ సాగదీస్తున్నారే తప్ప డీల్ పూర్తి చేయడం లేదు. గోపాలే కాదు వాహనాల కొనుగోలు నిర్ణయాలను చాలా మంది ఇలాగే వాయిదా వేసుకుంటున్నారు. కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ విధానంలో కార్లపై పన్నులు తగ్గి, మరింత ప్రయోజనం లభించనుండటమే ఇందుకు కారణం. ఇది కొనుగోలుదారులపరంగా చూస్తే బాగానే ఉన్నప్పటికీ వాహనాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల పండుగ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా దీన్ని అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, దీన్ని ఆ తర్వాతెప్పుడో అమలు చేస్తామంటూ, పండుగ సీజన్లో ముందుగా ప్రకటించడమే ప్రస్తుతం తంటా తెచి్చపెట్టింది. ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం 5, 12, 18, 28గా ఉన్న శ్లాబుల స్థానంలో ఇకపై 5, 18 శ్లాబులు మాత్రమే ఉంటాయి. నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రం 40% ఉంటుంది. వాహనాల విషయం తీసుకుంటే.. ప్రస్తుతం వాటిపై జీఎస్టీ 28 శాతంగా ఉండగా, రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సు కూడా ఉంటోంది. ఫలితంగా చిన్న పెట్రోల్ కార్లపై 29 శాతం నుంచి మొదలుకుని ఎస్యూవీలకు 50 శాతం వరకు జీఎస్టీ వర్తిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే జీఎస్టీ విధానంతో వాహనాలపై జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3–4న సమావేశం కానుంది. ఎకాయెకిన 10% మేర పన్ను భారం తగ్గితే గణనీయంగా మిగులుతుంది కాబట్టి వాహన కొనుగోలుదారులు.. కొత్త జీఎస్టీ వచ్చాకే కొనుక్కుందాములే అని వాయిదా వేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు డీలర్లకు సంకటంగా మారింది. సరిగ్గా పండుగ సీజన్లో ఇలా చేయడం వల్ల అమ్మకాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు. పండుగ సీజన్పై ఆశలు పెట్టుకుని ఉత్పత్తిని భారీగా పెంచుకోగా, అమ్మకాలు నెమ్మదిస్తే, నిల్వలు పేరుకుపోతాయని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.కొత్త రేట్లను వెంటనే అమలు చేయాలి: ఎఫ్ఏడీఏకొత్త జీఎస్టీ రేట్లను సత్వరం అమల్లోకి తేవాలంటూ కేంద్రానికి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీపై ప్రకటన వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి ఎఫ్ఏఐడీఏ లేఖ రాసింది. దీని ప్రకారం ఓనం (ఆగస్టు 26), వినాయక చవితి (ఆగస్టు 27), అక్టోబర్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా డీలర్లు గణనీయంగా వాహనాల నిల్వలను పెంచుకున్నారు. అయితే, జీఎస్టీ క్రమబదీ్ధకరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంతో పాటు, కొత్త రేట్ల వివరాల గురించి డీలర్లను అడుగుతున్నారు. దీంతో పండుగ అమ్మకాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రేట్లను ప్రకటించిన తర్వాత దీపావళి సందర్భంలో మాత్రమే అమ్మకాలు పుంజుకునే అవకాశం నెలకొంది. ‘కాబట్టి జీఎస్టీ మండలి ప్రధాన పండుగల కన్నా కాస్త ముందుగానే సమావేశమై, కొత్త రేట్లను ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాం. దీనివల్ల దీపావళికే పరిమితం కాకుండా సీజన్ ఆసాంతం డిమాండ్ ఏర్పడుతుంది. ఇటు పరిశ్రమకు అటు కొనుగోలుదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది‘ అని లేఖలో ఎఫ్ఏడీఏ తెలిపింది. ఫైనాన్సింగ్ వ్యవధిని పెంచాలి.. మరోవైపు, నిల్వలను సమకూర్చుకునేందుకు తీసుకున్న స్వల్పకాలిక ఫైనాన్సింగ్ తిరిగి చెల్లింపు వ్యవధిని అదనంగా 30–45 రోజుల వరకు పొడిగించేలా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) ఆదేశించాలని ఎఫ్ఏడీఏ కోరింది. సాధారణంగా 45–60 రోజుల వరకు ఈ వ్యవధి ఉంటుంది. కానీ కొత్త జీఎస్టీ రేట్ల కోసం ఎదురుచూపులతో అమ్మకాలు మందగిస్తే, డీలర్లకు ఆర్థికంగా పెనుభారం పడుతుంది కాబట్టి ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని ఎఫ్ఏడీఏ వివరించింది. ఎఫ్ఏడీఏలో దేశవ్యాప్తంగా దాదాపు 15,000 డీలర్ ప్రిన్సిపల్స్, సుమారు 30,000 డీలర్లకు సభ్యత్వం ఉంది. -
ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీ
ఇండియన్ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. వాహన ఉత్పత్తిలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దీనిని పరిశ్రమకు "కొత్త విజయగాథ" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి అంశంపై.. ప్రభుత్వం మొదటిసారిగా ఒక సంఖ్యను నిర్ణయించింది. దేశీయ వాహన తయారీదారులు తమ ప్రపంచ వ్యూహాలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు.. ఆటోమొబైల్ రంగం కీలకంగా ఉంది. దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.దశాబ్ద కాలంలో.. భారతదేశ ఆటో ఎగుమతులు బాగా పెరిగాయి. 2014లో దీని విలువ రూ. 50,000 కోట్లు ఉండగా.. నేడు ఇది రూ. 1.2 లక్షల కోట్లకు చేరిందని మోదీ స్పష్టం చేశారు. భారతదేశం నుంచి కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. మెట్రో కోచ్లు, ట్రైన్ కోచ్లు, లోకోమోటివ్ల రవాణాను పెంచాలని అన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!భారతదేశం ఎదగాలంటే.. అనుకున్నది సాధించాలంటే, దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విదేశాలలో లభించే పరిజ్ఞానం బాగానే ఉండవచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక స్థితిని నిర్ణయించేది మాత్రం స్వదేశీ ఆవిష్కరణలేనని అన్నారు. సొంత పరిజ్ఞానం అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు. -
సరికొత్త ఇండియన్ మోటార్ సైకిల్స్ వచ్చేశాయ్
ఇండియన్ మోటార్ సైకిల్స్.. భారతదేశంలో 2025 స్కౌట్ రేంజ్ బైకులను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్స్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. మంచి పనితీరును అందించేలా రూపుదిద్దుకున్నాయి.2025 ఇండియన్ స్కౌట్ శ్రేణిలో.. స్కౌట్ సిక్స్టీ లైనప్ కింద మూడు బైకులు (స్కౌట్ సిక్స్టీ క్లాసిక్, స్కౌట్ సిక్స్టీ బాబర్).. స్కౌట్ క్లాసిక్ లైనప్ కింద ఐదు మోడళ్లు (స్కౌట్ క్లాసిక్, స్కౌట్ బాబర్, స్పోర్ట్ స్కౌట్, సూపర్ స్కౌట్, 101 స్కౌట్) ఉన్నాయి.స్కౌట్ సిక్స్టీ రేంజ్ బైకులు 999సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 85 bhp పవర్, 87 Nm టార్క్ అందిస్తుంది. స్కౌట్ క్లాసిక్ రేంజ్ బైకులు 1250 సీసీ ట్విన్ మోటారు ద్వారా 105 Bhp పవర్, 108 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్లు 6 స్పీడ్ గేర్బాక్స్తో వస్తాయి.ఇదీ చదవండి: రెనాల్ట్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?డిజిటల్ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అనలాగ్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఇగ్నిషన్, కనెక్టెడ్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి.. లేటెస్ట్ ఇండియన్ మోటార్ సైకిళ్ళలో చూడవచ్చు. -
రెనాల్ట్ కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?
రెనాల్ట్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'కైగర్ ఫేస్లిఫ్ట్' లాంచ్ చేసింది. నాలుగు ట్రిమ్లలో లభించే ఈ కొత్త మోడల్ ధరలు రూ. 6.30 లక్షల నుంచి రూ. 11.30 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది.కొత్త కైగర్ ఫేస్లిఫ్ట్.. చాలా వరకు కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్.. ట్రై ప్రొజెక్టర్ హెడ్లైట్ ఇందులో ఉన్నాయి. డేటైమ్-రన్నింగ్ లాంప్ (DRL) క్లస్టర్ల కింద ఉండటం గమనించవచ్చు. 16 ఇంచెస్ అల్లాయ్ వేల కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే టెయిల్ల్యాంప్ పొందుతుంది.ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో కూడిన 8 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఈ కారులో ఉంటుంది. క్యాబిన్ ఇప్పుడు మెరుగైన సౌండ్ ఇన్సులేషన్ను అందిస్తుంది. క్యాబిన్ ట్రైబర్ ఫేస్లిఫ్ట్ లాగానే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అపోల్స్ట్రే, 360 డిగ్రీ కెమెరాలు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్లు ఉన్నాయి. ఈ కారులో ఇప్పుడు ఆరు ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు2025 రెనాల్ట్ కైగర్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్.. 72 bhp పవర్, 96 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025 -
ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ను 999 యూనిట్లకు పరిమితం చేసింది. కాగా కంపెనీ దీని కోసం ఈ రోజు బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైన 135 సెకన్లలో.. అన్నీ యూనిట్లు అమ్ముడైపోయాయి.లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ తరువాత 999 యూనిట్లకు చేరింది. అన్ని యూనిట్లు ఇప్పుడు పూర్తిగా అమ్ముడైపోయాయి. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.From 999 to 000 in just 135 seconds. That's how quickly we sold all units of the BE 6 Batman Edition.Deliveries will begin on Batman Day, 20th September 2025.#BE6BatmanEdition #DriveYourLegend #MahindraBE6 #MahindraElectricOriginSUVs pic.twitter.com/u4x8LVxAIG— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) August 23, 2025 -
భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ'.. భారతదేశంలో ఇప్పటి వరకు 5,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో ఆరు EVలను విక్రయిస్తున్న సంస్థ.. నవంబర్ 2021లో iXతో దేశీయ లగ్జరీ ఈవీ రంగంలోకి ప్రవేశించింది.కార్ల అమ్మకాలను మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 4,000 కి.మీ పవర్ ఛార్జింగ్ కారిడార్ కూడా ప్రారంభించింది. కంపెనీ ఛార్జింగ్ కారిడార్ జమ్మూ నుంచి మధురై వరకు విస్తరించి, జాతీయ రహదారులు & ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కోయంబత్తూర్, మధురై వంటి నగరాలను కవర్ చేస్తుంది. ఇది 120 kW నుంచి 720 kW వరకు సామర్థ్యాలతో ఛార్జర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 6000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు సమాచారం. బీఎండబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మైబీఎండబ్ల్యూ యాప్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.మూడు శాతం పెరిగిన బీఎండబ్ల్యూ ధరలుబీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. -
'తప్పుడు ప్రచారం చేస్తున్నారు': నితిన్ గడ్కరీ
20 శాతం ఇథనాల్ను పెట్రోల్తో కలపడం వల్ల ఇంజిన్ల పనితీరు తగ్గిపోతుందని వార్తలు వస్తున్న వేళ.. అవన్నీ పూర్తిగా అబద్ధం అని 'నితిన్ గడ్కరీ' తోసిపుచ్చారు. 'పెట్రోలియం లాబీ' ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. ఇంజిన్ల పర్ఫామెన్స్ తగ్గిపోతుందనేది అబద్దం. మేము దీనిని నిరూపించడానికి ప్రస్తుతం పాత కార్లపైన ట్రయల్స్ నిర్వహించామని గడ్కరీ అన్నారు. సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అని కూడా పరిశీలించాము. పెట్రోలియం లాబీలో కొంతమంది తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. బ్రెజిల్లో వారు 27 శాతం బ్లెండింగ్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు.20 శాతం ఇథనాల్ ఉపయోగించడం వల్ల ఉద్గారాలు తగ్గడమే కాకుండా.. పెట్రోల్ దిగుమతి కూడా తగ్గుతుంది. ఇథనాల్ శుభ్రమైన ఇంధనం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది. రైతులకు సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్బ్లెండింగ్ కార్యక్రమం గురించి ఆందోళనలు ఉన్నాయి, ఇది వాహన పనితీరు.. మన్నికను ప్రభావితం చేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్తో ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతుందని.. దాని తుప్పు పట్టే లక్షణాలు ఇంధన వ్యవస్థలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా బ్లెండింగ్ కార్యక్రమం ఆహార పంటలను పండించే రైతులను కూడా పక్కదారి పట్టిస్తుంది. -
విషాదకర ఘటన.. పొరపాటా, సాంకేతిక లోపమా?
తమిళనాడులో టాటా హారియర్ ఈవీ ఆటోపైలట్ మోడ్ వల్ల ఓ వ్యక్తి మృతి చెందాల్సి వచ్చిందనేలా సామాజిక మాధ్యామాల్లో వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా మృతుడి పొరపాటా.. లేదా కారులో సాంకేతిక లోపమా అనే స్పష్టమైన కారణాలు తెలియరాలేదని గమనించాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వివరాల ప్రకారం.. ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసిన ఓ వ్యక్తి మీదకు అదుపుతప్పి టాటా హారియర్ ఈవీ దూసుకుపోయింది. తమిళనాడులోని అవినాశిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి తలకు బలమైన గాయమైంది. డ్రైవర్ కారు డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి అడుగు పెట్టకముందే అప్పటికే ఎత్తుపై ఉన్న హ్యారియర్ ఒక్కసారిగా వంపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిన ఆ వ్యక్తిపైకి కారు టైర్ ఎక్కేసింది. ఈ సంఘటనలో అతడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.అయితే టాటా మోటార్స్పై కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం అయితే తెలియరాలేదు. ఇది సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదా బాహ్య కారకాల వల్ల సంభవించిందా అనేది ధ్రువీకరించాల్సి ఉందని గమనించాలి. టాటా మోటార్స్ ప్రకటనఈ ఘటనపై టాటా మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నట్లు చెప్పింది. వీడియోలోని దశ్యాల ప్రకారం వాలుగా ఉండడంవల్లే వాహనం కిందకు వచ్చి ఉంటుందని పేర్కొంది.సమన్ మోడ్కిక్కిరిసిన పార్కింగ్ స్థలాల కోసం డిజైన్ చేయబడిన కీని ఉపయోగించి రిమోట్గా కారు ముందుకు కదలడానికి లేదా రివర్స్ చేయడానికి అనుమతించే సెమీ అటానమస్ ఫీచర్. జూన్ 2025లో హారియర్ ఈవీతో ప్రవేశపెట్టిన టాటా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సూట్లో ఇది భాగం. ఇదిలాఉండగా, ఇలాంటి ఫీచర్లను అమలు చేయడానికి ముందు కఠినమైన నిబంధనలు, యూజర్ ఎడ్యుకేషన్, రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయాలని నిపుణులు కోరుతున్నారు. -
మొన్న 300 మందికే.. ఇప్పుడు 999 మందికి
మహీంద్రా ఇటీవల వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ఎడిషన్ ఇప్పుడు 999 యూనిట్లకు చేరింది. అంటే దీనిని 999 మంది కొనుగోలు చేయగలరు.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల నుంచి మహీంద్రా అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కాగా కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీమహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి. -
కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
కొన్నేళ్ళకు ముందు పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. పరిస్థితులు మార్పులు.. ఉద్గారప్రమాణాలు అమలులోకి రావడం వల్ల.. డీజిల్ కార్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెట్రోల్ కార్లు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. కార్ల కొనుగోలు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ కథనంలో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇంధన రకానికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.పెట్రోల్ కార్లుమీరు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లయితే.. ఇందులో విభిన్న ధరల వద్ద కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లు ఇతర కార్లతో పోలిస్తే కొంత తక్కువ ధర వద్ద లభిస్తాయి. అంతే కాకుండా దేశంలో పెట్రోల్ పంపులు కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, దూర ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.డీజిల్ కార్లుడీజిల్ కార్లు ఒకప్పుడు విరివిగా అందుబాటులో ఉండేవి. బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వంటి నగరాల్లో పాత డీజిల్ కార్లను కొన్నాళ్ళు నిషేధించారు. భవిష్యత్తులో డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా కంపెనీలు బాగా తగ్గించే అవకాశం ఉంది. డీజిల్ కార్ల ధరలు కూడా పెట్రోల్ కార్ల ధరల కంటే ఎక్కువ. వీటిని కూడా రోజువారీ వినియోగనికి, దూర ప్రయాణాలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు.ఎలక్ట్రిక్ కార్లుప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం.. ఈవీలపై జీఎస్టీ తగ్గింపు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ అందించింది. అయితే ఇప్పుడు ఈవీల వినియోగానికి ప్రధాన సమస్య.. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే. వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. నగర ప్రయాణాల కోసం ఈవీలను ఎంచుకోవచ్చు. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించాలనుకుంటే మాత్రం ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓసీఎన్జీ కార్లుపెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే.. సీఎన్జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ కార్లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కంపెనీలు తమ సీఎన్జీ కార్లలో మంచి బూట్ స్పేస్ కూడా అందిస్తున్నాయి. ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.హైబ్రిడ్ కార్లుభారతదేశంలో ప్రస్తుతం మైల్డ్ హైబ్రిడ్ కార్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా 10 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తాయి. అంతే కాకుండా ఇవి కాలుష్య కారకాలను కూడా తక్కువగానే విడుదల చేస్తాయి. వీటి ధరలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి. -
ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. -
అమ్మకాల్లో హవా.. ఉత్పత్తిలో రికార్డ్: ఏకంగా ఐదు లక్షలు
ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్న మారుతి సుజుకి అమ్మకాల్లో కూడా అరుదైన మైలురాళ్లను చేరుకుంటోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.2023లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ఇటీవల 5,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రతి నెలా 12,000 నుంచి 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. 2023 మార్చిలో ఫ్రాంక్స్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ నాటికి.. కేవలం 9 నెలల్లో కంపెనీ లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది.2024 జూన్ నాటికి రెండు లక్షల యూనిట్లు, నవంబర్ 2024 నాటికి 3 లక్షల యూనిట్లు, ఫిబ్రవరి 2025 నాటికి 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కాగా జులైలో దీని ఉత్పత్తి 5 లక్షల యూనిట్లకు చేరుకుంది. అమ్మకాల్లో కూడా దూసుకెళ్తున్న ఈ SUV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా & ఆల్ఫా వేరియంట్స్. వీటి ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 13.07 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా మంచి విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగానే ఎగుమతుల్లో కూడా దూసుకెళ్తోంది. -
భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్లో తన 'స్ట్రీట్ బాబ్ 117' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.77 లక్షలు (ఎక్స్ షోరూం). ధరలు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ బైకులో 1923 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5020 rpm వద్ద 91.18 Bhp పవర్, 2750 rpm వద్ద 156 Nm టార్క్ అందిస్తుంది. 13.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు.. 293 కేజీలు (కర్బ్). ఇది 49 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు & ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి పొందుతుంది.స్ట్రీట్ బాబ్ పొడవైన హ్యాంగర్ హ్యాండిల్బార్ పొందుతుంది. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్బార్పై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి కొంత పాత మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుంది. టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్లు, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివి కూడా పొందుతుంది.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్ -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు.. ఇవే!
మార్కెట్లో ఎన్నెన్ని కార్లు వచ్చినా.. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో కేవలం పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా.. డీజిల్ హైబ్రిడ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.5. మారుతి డిజైర్భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటైన మారుతి డిజైర్. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటి. రూ. 6.48 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన డిజైర్.. 25.71 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.4. మారుతి స్విఫ్ట్మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ కూడా ఎక్కువ మైలేజ్ అందించే కార్ల జాబితాలో ఒకటి. ఇది 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 మాన్యువల్, ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూం).3. మారుతి సెలెరియో1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మారుతి సెలెరియో.. 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ద్వారా 26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 69 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూం).2. హోండా సిటీ ఈ:హెచ్ఈవీహోండా కంపెనీకి చెందిన సిటీ ఈ:హెచ్ఈవీ అనేది హైబ్రిడ్ కారు. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర రూ. 19.90 లక్షలు (ఎక్స్ షోరూం).1. టయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారాటయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా రెండూ కూడా వేరు వేరు కంపెనీ కార్లు అయినప్పటికీ.. ఇవి 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయని సమాచారం. ఈ కార్లు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 92 హార్స్ పవర్, 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.84 లక్షలు, రూ. 8.34 లక్షలు (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్
మురుగప్ప గ్రూప్.. క్లీన్ మొబిలిటీ విభాగం అయిన మోంట్రా ఎలక్ట్రిక్, శ్రీరామ్ హర్షతో కలిసి హైదరాబాద్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (e-SCV) డీలర్షిప్ను ప్రారంభించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ తన ఉనికిని విస్తరించడంలో భాగంగా డీలర్షిప్ ప్రారంభించింది.మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్లో EViator కమర్షియల్ వెహికల్స్ ప్రదర్శిస్తారు. ఇవి తక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగి.. చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హైదరాబాద్లో పెరుగుతున్న లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్లీట్ యజమానులు, వ్యవస్థాపకుల నెట్వర్క్ వంటి వాటికి సేవలు అందించడానికి కంపెనీ డీలర్షిప్ ప్రారంభించింది.EViator వెహికల్ 80 కిలోవాట్ మోటారు ద్వారా 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 245 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడినప్పటికీ.. రియల్ వరల్డ్ రేంజ్ 170 కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వెహికల్ కొనుగోలుపై ఏడు సంవత్సరాలు లేదా 2.5 లక్షల కిమీ వారంటీ అందిస్తోంది.హైదరాబాద్లో డీలర్షిప్ ప్రారంభ కార్యక్రమానికి.. ఐటీ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా, TIVOLT ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సాజు నాయర్ మొదలైనవారు పాల్గొన్నారు. -
టయోటా స్పెషల్ ఎడిషన్: 25.4 కిమీ/లీ మైలేజ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. దేశీయ మార్కెట్లో కొత్త 'క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్'ను రూ. 48.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ యాక్సెసరీ కిట్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది.టయోటా క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిమెంట్ గ్రే, ప్రెషియస్ మెటల్ & డార్క్ బ్లూ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే బానెట్, రూప్ వంటివి మ్యాట్ బ్లాక్ కలర్ పొందుతాయి. ఈ కారులోని 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ను పొందుతాయి.క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. లోపలి భాగంలో యాంబియంట్ లైటింగ్, పుడిల్ లాంప్స్ వంటివి పొందుతుంది.12 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో ఉన్నాయి.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్టయోటా లాంచ్ చేసిన క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ డిజైన్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో సాధారణ క్యామ్రీలోని 2.5 లీటర్ నాలుగు సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 187 హార్స్ పవర్, 221 న్యూటన్ మీటర్ టార్క్, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది లీటరుకు 25.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఈ కారు భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యధిక మైలేజ్ కార్ల జాబితాలో ఒకటిగా మారింది. -
బడ్జెట్ కార్లపై రూ.80,000 వరకు రాయితీ?
ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ మందగించడంతో వాహన తయారీదారులు, డీలర్లు ఈ పండుగ సీజన్లో ఆఫర్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్వెంటరీ పేరుకుపోతుండడంతో అమ్మకాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్ కార్లపై రూ.20,000 నుంచి రూ.80,000 వరకు డిస్కౌంట్లను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.భారతీయ ఆటో పరిశ్రమకు ఒకప్పుడు అమ్మకాల్లో భారీగా వాల్యూమ్ జనరేట్ చేసిన ఈ విభాగం ఈ మధ్య కాలంలో నిరంతరం మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్యూవీలకు డిమాండ్ బలంగా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న డీప్ డిస్కౌంట్ల వల్ల తక్కువ మార్జిన్లతో సంస్థలు నెట్టుకొస్తున్నాయనే వాదనలున్నాయి. ‘భారీ డిస్కౌంట్లు డీలర్లకు నష్టం కలిగిస్తాయి. ఎంట్రీ లెవల్ కార్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య మునుపటి స్థాయికి రాలేదు’ అని ఓ ఆటోమొబైల్ డీలర్ తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండరూ.10 లక్షల లోపు కేటగిరీలోని బడ్జెట్ సెగ్మెంట్ వాహనాల అమ్మకాలపై ఒత్తిడి ఉన్నట్లు అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ అంగీకరించింది. ‘రూ.10 లక్షలలోపు కార్ల అమ్మకాల్లో ఒత్తిడి ఉంది. డిమాండ్ కూడా తగ్గింది. ఈ విభాగంలో సంవత్సరం ప్రాతిపదికన దాదాపు 15% క్షీణత నమోదైంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. -
కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్
సౌత్ కొరియా బ్రాండ్ అయిన కియా మోటార్స్.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు కొత్త కార్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఇండియాలో కియా కారెన్స్ క్లావిస్ & కారెన్స్ క్లావిస్ ఈవీ లాంచ్ చేసింది.కియా ఇండియా లాంచ్ చేసిన ఈ రెండు కార్లు నాలుగు నెలల్లోనే 21,000 బుకింగ్లను పొందినట్లు కంపెనీ ప్రకటించింది. కారెన్స్ క్లావిస్ 20,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందగా.. క్లావిస్ ఈవీ 1,000 కంటే ఎక్కువ ఆర్డర్లను పొందింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.కియా కారెన్స్ క్లావిస్ మంచి డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇది స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రెండవ వరుస సీట్లు, వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్, మూడవ వరుస యాక్సెస్ను సులభతరం చేయడానికి సెగ్మెంట్-ఫస్ట్ బాస్ మోడ్ వంటివి పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ పనోరమిక్ డిస్ప్లేలు, బోస్ 8 స్పీకర్ ఆడియో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ డాష్క్యామ్ వంటివి మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్/ఇన్ఫోటైన్మెంట్ స్వాప్ స్విచ్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?క్లావిస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. 42kWh యూనిట్ 404 కి.మీ రేంజ్ అందిస్తే.. 51.4kWh యూనిట్ 490 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఈ కారు 100 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. సేఫ్టీ పరంగా కూడా ఇవి రెండూ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. -
రూ.1.30 లక్షలు తగ్గిన ధర: ఇప్పుడు ఈ బైక్ రేటు ఎంతంటే?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకి 'కేఎల్ఎక్స్230' బైకును రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరకు అందిస్తోంది. గత ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.30 లక్షలు. అంటే సంస్థ ధరను లోకలైజేషన్ కారణంగా ఇప్పుడు రూ. 1.30 లక్షలు తగ్గించింది.స్థానీకరణ కారణంగానే కంపెనీ తన కేఎల్ఎక్స్230 ధరను చాలా తగ్గించింది. ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఈ బైక్ హీరో Xpulse 210, కేటీఎం 390 ఎండ్యూరో ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.కంపెనీ తన కేఎల్ఎక్స్230 బైకును స్థానీకరణ చేయడం మాత్రమే కాకుండా.. కొన్ని యాంత్రిక మార్పులను కూడా చేసింది. ముందు భాగంలో 20 మిమీ, వెనుక 27 మిమీ సస్పెన్షన్ తగ్గించింది. అయితే రెండు చివర్లలో ఇప్పుడు పెద్ద డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. 233 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ 19 హార్స్ పవర్, 19 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఈ బైకులో లభిస్తుంది. -
విన్ఫాస్ట్ కార్ల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫైనాన్సింగ్
న్యూఢిల్లీ: ఇన్వెంటరీ, ఆటో ఫైనాన్సింగ్ సదుపాయం కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విన్ఫాస్ట్ ఆటో ఇండియా తెలిపింది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసినట్లు పేర్కొంది. భారత్లో ఒక బ్యాంకింగ్ సంస్థతో కుదర్చుకున్న తొలి ఎంఓయూ ఇది.నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు ముందు ఎలాంటి అంతరాయాలు లేని రుణ సదుపాయాలు అందించడం ఈ ఒప్పంద లక్ష్యమని కంపెనీ వివరించింది. భారతీయ కస్టమర్లకు సౌకర్యవంతమైన, ఆధునాతన ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రయత్నాల్లో ఈ ఎంఓయూ మైలురాయిగా నిలుస్తుందని విన్ఫాస్ట్ ఇండియా సీఈఓ ఫామ్ సాన్ చౌ తెలిపారు.‘ఈవీల వినియోగం పెరుగుతున్న క్రమంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కస్టమర్ల ఆకాంక్షలకు పెద్దపీట వేయడంలో బ్యాంకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ అసెట్స్ హెడ్ అరవింద్ వోహ్రా తెపారు. విన్ఫాస్ట్ ఆటో ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ ముందు వీఎఫ్7, వీఎఫ్6 మోడళ్లను లాంచ్ చేయనుంది. -
స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి ఓలా ఎలక్ట్రిక్
ముంబై: ఓలా ఎలక్ట్రిక్ తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి అడుగు పెట్టనుంది. తాజాగా స్పోర్టియర్ వెర్షన్లో కనిపిస్తున్న ఓ స్కూటర్ టీజర్ను బుధవారం విడుదల చేసింది. ఓలా ‘కృత్రిమ్’ ఏఐ ఫీచర్స్తో ఈ స్పోర్ట్స్ స్కూటర్లు రానున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.ప్రతి ఏటా ఆగస్టు 15న నిర్వహించే తన వార్షిక ‘సంకల్ప్’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయంగా టీవీఎస్ ఎన్టార్క్, యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్ఆర్160 మోడళ్లు స్పోర్ట్స్ స్కూటర్ల విభాగంలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఓలా ఎలక్ట్రిక్ డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయాలతో పాటు సొంతంగా తయారు చేసిన 4680 సెల్ ఫీచర్లతో జెన్ 3 స్కూటర్లను ఆవిష్కరించింది. -
కేవలం 300 మందికే ఈ బ్యాట్మాన్ ఎడిషన్: ధర ఎంతంటే?
మహీంద్రా & మహీంద్రా దేశీయ మార్కెట్లో 'బీఈ 6 బ్యాట్మాన్' ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.27.79 లక్షలు. కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న బ్యాట్మ్యాన్ డే సందర్బంగా మొదలవుతాయి. కాగా సంస్థ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే దీనిని 300 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి సాధ్యమవుతుంది.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లుమహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి. -
హైదరాబాద్లో ఈ-వాహనాలదే హవా
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో ఈ– బండి టాప్గేర్లో పరుగులు తీస్తోంది. ఈవీలపై జీవితకాల పన్ను మినహాయింపుతో ఈ ఏడాది ఇప్పటి వరకు లక్షకుపైగా ద్విచక్ర వాహనాలు, 22 వేల కార్లు రోడ్డెక్కాయి. కొంతకాలంగా ఈ రెండు కేటగిరీలకు చెందిన వాహనాల అమ్మకాలు ఊపందుకున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.ఈ సంవత్సరం కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు భారంగా మారుతున్న దృష్ట్యా సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్రమంగా పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారుతున్నారు. గ్రేటర్లో ఈ నెల 10 నాటికి 1,88,549 ద్విచక్ర వాహనాలు, 22,365 కార్లు నమోదైనట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తగా 5,097 ఆటోలు, మరో 5,363 తేలికపాటి వస్తు రవాణా వాహనాలు రోడ్డెక్కాయి. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,21,374 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు నమోదైనట్లు అధికారులు చెప్పారు.ఈ వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో వాహనదారులకు రూ.91.93 లక్షల రాయితీ లభించింది. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకోసారి విధించే క్వార్టర్లీ ట్యాక్స్ నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీపీ రమేష్ సూచించారు. -
ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు
ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. -
ఓలా ఎలక్ట్రిక్ భారత్ సెల్: ఈ స్కూటర్లపై భారీ డిస్కౌంట్
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' తమిళనాడులోని తన గిగాఫ్యాక్టరీలో తయారు చేసిన లిథియం అయాన్ బ్యాటరీ అయిన 4680 “భారత్ సెల్”ను ప్రారంభించింది. అంతే కాకుండా కంపెనీ తన రోడ్స్టర్ X+, ఎస్1 ప్రో ధరలను కూడా తగ్గించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో తయారైన భారత్ సెల్.. పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ సెల్ వెడల్పు 46 మిమీ, ఎత్తు 80 మిమీ ఉంటుంది. ఇది వేగంగా ఛార్జ్ చేసుకోగలదు. ఇది ఎక్కువ పరిధిని అందించేలా రూపొందించారు. ఈ కొత్త సెల్ మన దేశంలో రూపొందించడం వల్ల.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకునే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' మిషన్కు దోహదపడుతుంది.ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీని లాంచ్ చేయడంతో పాటు.. రోడ్స్టర్ X+ (9.1 kWh), S1 ప్రో+ ధరలను తగ్గించింది. ధరల తగ్గుదల తరువాత రోడ్స్టర్ X+.. ఇప్పుడు రూ.1.89 లక్షలకు, S1 ప్రో+ ధర రూ.1.69 లక్షలకు చేరుకుంది. అంతే కాకుండా ఆగస్టు 17 లోపల బుక్ చేసుకుంటే.. మరో రూ.10000 తగ్గింపు లభిస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బుక్ చేసుకున్న తరువాత.. డెలివరీలు నవరాత్రి నుంచి ప్రారంభమవుతాయి.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లుభారత్ సెల్ అనేది భవిష్యత్ మోటార్ సైకిళ్ళు.. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా శక్తినివ్వగలదు. సొంతంగా పవర్ బ్యాటరీలను తయారు చేయడం ద్వారా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కొంత తగ్గుతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేస్తుంది. తద్వారా ఇండియాలో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. -
దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా'.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి నాలుగు (విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ) కొత్త కాన్సెప్ట్ ఎస్యూవీలను ఆవిష్కరించింది. ఈ నాలుగు కార్లు సరికొత్త డిజైన్ కలిగి.. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.మహీంద్రా ఆవిష్కరించిన కొత్త ''విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ ఎస్, విజన్ ఎన్ఎక్స్టీ'' కార్లు.. ఎన్యూ.ఐక్యూ (NU.IQ) అనే కొత్త ప్లాట్ఫామ్పై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి.మహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీమహీంద్రా విజన్ టీ & విజన్ ఎన్ఎక్స్టీ రెండూ కూడా చూడటానికి కొంత థార్ మాదిరిగా ఉంటాయి. విజన్ టీ కారు బాక్సీ బాడీని కలిగి ఉండగా, విజన్ ఎన్ఎక్స్టీ డెక్లోని స్పేర్ వీల్స్కు అనుగుణంగా ఉండే.. ట్రక్ లాంటి క్యాబిన్ను పొందుతుంది. మొత్తం మీద ఈ కార్లు దృఢంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వీటికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.మహీంద్రా విజన్ ఎస్మహీంద్రా విజన్ ఎస్ అనేది బాక్సీ అవుట్లైన్ పొందుతుంది. ఎల్ఈడీ లైట్స్, ట్విన్ పీక్స్ లోగో, హెడ్ల్యాంప్ కోసం సరికొత్త డిజైన్ వంటివి గమనించవచ్చు. ఇది ఆఫ్ రోడ్ మాదిరిగా అనిపిస్తుంది. కాబట్టి రూప్ మీద లైట్స్, దృఢమైన బంపర్, వీల్ ఆర్చ్లతో సైడ్ ప్లాస్టిక్ క్లాడింగ్ వంటివన్నీ గమనించవచ్చు. విజన్ ఎస్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రీమ్లైన్డ్ ఓఆర్వీఎం, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ గమనించవచ్చు.ఇదీ చదవండి: పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..మహీంద్రా విజన్ ఎక్స్మహీంద్రా విజన్ ఎక్స్ కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో సన్నని హెడ్ల్యాంప్, పొడవుగా ఉండే హుడ్ వంటివి ఈ కారులో గమనించవచ్చు. పైకప్పు క్రిందికి వాలుగా ఉంటుంది, ఇది కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. విజన్ ఎక్స్ ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ ఫినిషింగ్ను కలిగి ఉన్న వెనుక బంపర్ పొందుతుంది. -
పెరగనున్న ఆ బ్రాండ్ కార్ల ధరలు: సెప్టెంబర్ 1 నుంచే..
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.భారతదేశంలో బీఎండబ్ల్యూ లగ్జరీ సెడాన్లను, ఎస్యూవీలను, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇందులో రూ. 46.9 లక్షల ధర కలిగిన 2 సిరీస్ గ్రాన్ కూపే నుంచి రూ. 2.6 కోట్ల ధర కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ వరకు ఉన్నాయి.ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో కంపెనీ అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే నిరంతర ఫారెక్స్ ప్రభావం.. ప్రపంచ సరఫరా గొలుసు డైనమిక్స్ వంటి అంశాలు మెటీరియల్ & లాజిస్టిక్స్ ఖర్చులను పెంచడానికి కారణమవుతున్నాయని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ 'విక్రమ్ పవా' పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో మరికొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్బీఎండబ్ల్యూ స్థానికంగా 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ లాంగ్ వీల్బేస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340ఐ వంటి మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా ఐ4, ఐ5, ఐ7, ఐ7 ఎం70, ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం కూపే వంటి కార్లను సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటోంది. -
ప్రపంచ ఆటోమొబైల్ రంగం: తిరుగులేని శక్తిగా భారత్
సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి.1957 వరకు సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్హౌస్లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.ఆవిరితో నడిచే వాహనాలు..తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.భారతీయ ఆటోరంగానికి ఆటంకం..ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.SIAM ఏర్పాటు..భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.ఇదీ చదవండి: 79 ఏళ్ల రూపాయి ప్రస్థానం ఇలా..వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.➢ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.➢ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.➢స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.➢భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. ఇటీవల అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కూడా తన మొదటి కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. -
భారత్లో అత్యంత సరసమైన కార్లు ఇవే!
దేశీయ మార్కెట్లో ఎన్నెన్ని కొత్త కార్లను లాంచ్ అయినా.. కొనుగోలుదారులు మాత్రం సరసమైన వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు తక్కువ ధర వద్ద కూడా కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 10 అఫర్డబుల్ కార్లు ఏవో చూసేద్దాం.➜మారుతి సుజుకి ఆల్టో కే10: రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షలు➜మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.01 లక్షలు➜రెనాల్ట్ క్విడ్: రూ. 4.70 లక్షల నుంచి 6.5 లక్షలు➜టాటా టియాగో: రూ. 5 లక్షల నుంచి రూ. 8.85 లక్షలు➜సిట్రోయెన్ సీ3: రూ. 5.25 లక్షల నుంచి రూ. 9.90 లక్షలు➜మారుతి సుజుకి సెలెరియో: రూ. 5.64 లక్షల నుంచి రూ. 7.37 లక్షలు➜మారుతి సుజుకి ఈకో: రూ. 5.7 లక్షల నుంచి రూ. 6.06 లక్షలు➜మారుతి సుజుకి వ్యాగన్ ఆర్: రూ. 5.79 లక్షల నుంచి రూ. 7.02 లక్షలు➜మారుతి సుజుకి ఇగ్నిస్: రూ. 5.85 లక్షల నుంచి రూ. 8.12 లక్షలు➜హ్యుందాయ్ ఐ10 నియోస్: రూ. 5.98 లక్షల నుంచి రూ. 8.66 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూం)ఇదీ చదవండి: ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు -
ఒక్కనెలలో 4300 మంది కొన్న కారు ఇదే..
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ' పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది ప్రారంభం నుంచి ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తూ.. గొప్ప అమ్మకాలను పొందుతోంది. గత నెలలో (జులై 2025) కూడా విండ్సర్ సేల్స్ 4308 యూనిట్లుగా నమోదైంది. దీంతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఎంజీ విండ్సర్ అమ్మకాలు మొత్తం 36,000 యూనిట్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ మార్కెట్ వాటా పెరగడానికి కూడా ఈ కారు దోహదపడింది. విండ్సర్ నెలవారీ అమ్మకాలు 17 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.ఎంజీ విండ్సర్ ఈవీఎంజీ విండ్సర్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్సైట్ (38kWh), ఎక్స్క్లూజివ్ (38kWh), ఎసెన్స్ (38kWh), ఎక్స్క్లూజివ్ ప్రో (52.9kWh), ఎసెన్స్ ప్రో (52.9kWh). కస్టమర్లు ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్ లేదా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్స్క్రిప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. దీని ధరలు రూ. 14.00 లక్షల నుంచి రూ. 18.31 లక్షల (ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్, బ్యాటరీ ఆప్షన్ల మీద ఆధారపడి ఉంటాయి.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 136 పీఎస్ పవర్ 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 37.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్, 52.9 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. రేంజ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. -
స్కోడా ఆటో నుంచి లిమిటెడ్ ఎడిషన్ కార్లు
అంతర్జాతీయంగా 130 ఏళ్లు, భారత్లో పాతికేళ్ల వార్షికోత్సవ వేడుక సందర్భంగా స్కోడా ఆటో తన ప్రముఖ మోడళ్లు కైలాక్, స్లావియా, కుషాక్లకు లిమిటెడ్ ఎడిషన్ కార్లు విడుదల చేసింది. ఈ పరిమిత ఎడిషన్లను ఇప్పటికే ఉన్న హై–స్పెసిఫికేషన్ల ఆధారంగా తీర్చిదిద్దారు. అంటే కుషాక్, స్లావియా కోసం మోంటే కార్లో ట్రిమ్లపై, కైలాక్ కోసం ప్రెస్టీజ్, సిగ్నేచర్ ప్లస్ ట్రిమ్లపై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.ఎడిషన్ వేరియంట్లు ప్రత్యేకంగా 25వ వార్షికోత్సవ బ్యాడ్జ్తో, మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా తయారయ్యాయి. ఉచితంగా ఇచ్చే యాక్సెసరీస్ కిట్లో 360–డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, అండర్ బాడీ లైటింగ్, ప్రత్యేక బాడీ గార్నిష్లు ఉంటాయి. ఈ కిట్ వేరియంట్లకు ప్రీమియం లుక్తో పాటు, మరింత ఫంక్షనల్ అప్గ్రేడ్ను అందిస్తుంది. ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?‘మా సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన అభిమానులకు ఇది మేము ఇస్తున్న కానుక. కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్ద పీట వేస్తూ ఉత్పత్తులు అందించే మా బలమైన అంకితభావానికి నిదర్శనం. ఇకపైనా అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాము’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశిష్ గుప్తా తెలిపారు. -
ఐఐటీ హైదరాబాద్లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.అన్ని విధాలా సిద్దంగా..ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.ఈ డ్రైవర్ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్బెడ్ను కూడా టిహాన్ నిర్మించింది.ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది. -
యెజ్డి రోడ్స్టర్ 2025 మోడల్ వచ్చేసింది: ధర ఎంతంటే?
యెజ్డి మోటార్సైకిల్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో తన '2025 రోడ్స్టర్' (2025 Yezdi Roadster) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది.2025 యెజ్డి రోడ్స్టర్ ఆరు ఫ్యాక్టరీ కస్టమ్ కిట్లతో లభిస్తుంది. కాబట్టి ఇది సాధారణ రోడ్స్టర్ కంటే అద్భుతంగా ఉంటుంది. జావా బాబర్ బైక్ లాంటి సిల్హౌట్ ఈ బైకులో చూడవచ్చు. రీడిజైన్ టెయిల్ ల్యాంప్, ఇండికేటర్ వంటి వాటిని ఈ బైక్ పొందుతుంది. మాడ్యులర్ స్ప్లిట్ సీటు కలిగి ఉన్న ఈ బైకులో అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!2025 యెజ్డి రోడ్స్టర్లో ఆల్ఫా2 ఇంజిన్ ఉంది. ఇందులోని 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ యూనిట్ 29.1 హార్స్ పవర్, 29.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ ధర సాధారణ మోడల్ ధర కంటే రూ. 4000 ఎక్కువ అని తెలుస్తోంది. -
కేటీఎమ్ కొత్త బైక్: ధర రూ.1.85 లక్షలు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎమ్ తన డ్యూక్ ఫ్యామిలీని ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. దేశీయ మార్కెట్లో కొత్త 'డ్యూక్ 160' లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.కేటీఎమ్ డ్యూక్ 125 స్థానంలో లాంచ్ అయిన డ్యూక్ 160 బైక్ 164.2 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 rpm వద్ద, 19 bhp పవర్, 7500 rpm వద్ద 15.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.కొత్త కేటీఎమ్ 160 బైకులోని చాలా భాగాలు కేటీఎమ్ 200 డ్యూక్ని పోలి ఉంటాయి. దీని ముందు భాగంలో అప్సైడ్-డౌన్ ఫోర్క్లు, వెనుక భాగంలో ప్రీలోడ్-సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, వెనుక 230 మిమీ డిస్క్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా రెండో షోరూం ప్రారంభంఫీచర్స్ విషయానికి వస్తే.. కేటీఎమ్ 160 డ్యూక్ బైకులో కేటీఎమ్ కనెక్ట్ యాప్తో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & కాల్/మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ & సిల్వర్ మెటాలిక్ మాట్టే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. -
నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
భారతీయ కుబేరుడు & రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ', వారి కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. ఈ కారణంగానే వీరు ఖరీదైన బంగ్లాలో నివసిస్తూ.. లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను కలిగి ఉన్న అంబానీ గ్యారేజిలోకి రూ. 100 కోట్ల విలువైన కారు చేరినట్లు తెలిసింది.నీతా అంబానీ రూ.100 కోట్ల ఖరీదైన 'ఆడి ఏ9 క్యామెలియాన్' (Audi A9 Chameleon) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అంబానీ ఫ్యామీలీగానీ, ఆడి కంపెనీ గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నీతా అంబానీ ఆడి ఏ9 క్యామిలియెన్ కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఆడి ఏ9 క్యామెలియాన్ పేరుకు తగ్గట్టుగానే ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చే టెక్నాలజీని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ మోడల్ కార్లు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇది ఎంత అరుదైన కారు అనే విషయం స్పష్టమవుతుంది.సింగిల్ పీస్ విండ్స్క్రీన్, రూఫ్ కలిగి ఉండటం వల్ల ఆడి ఏ9 క్యామెలియాన్ చూడటానికి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఐదు మీటర్ల పొడవున్న ఈ కారు రెండు డోర్స్ మాత్రమే పొందుతుంది. ఇది 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ద్వారా 600 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్నీతా అంబానీ ఉపయోగించే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ మేబాచ్ ఎస్600 గార్డ్, ఫెరారీ 812 సూపర్ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, రోల్స్ రాయిస్ కల్లినన్, బీఎండబ్ల్యు 7 సిరీస్ 760ఎల్ఐ వంటి మరెన్నో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. -
రూ.1.12 లక్షల కొత్త హార్నెట్ బైక్
హోండా మోటార్సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్లో 'సీబీ 125' హార్నెట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్ షోరూం).అప్డేటెడ్ డిజైన్ కలిగిన హోండా సీబీ 125 హార్నెట్ బైక్.. 123.94 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్తో 10.99 bhp పవర్మ, 11.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ కొత్త స్టీల్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మితమై ఉంది.ఇదీ చదవండి: 'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ట్యూబ్లెస్ టైర్లను కలిగిన సీబీ 125 హార్నెట్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్, వెనుక భాగంలో 130 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అదనపు భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ను అందించే 4.2 ఇంచెస్ TFT డిస్ప్లే ఈ బైకులో చూడవచ్చు. USB-C ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది. -
'అలాంటి ఒక్క వాహనం చూపించండి': గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్
పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనే వాదనలు నిజం కాదని, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మైలేజీపై E20 పెట్రోల్ ప్రభావం అనే ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.''ప్రపంచంలో ఎక్కడైనా E20 పెట్రోల్ కారణంగా సమస్యలు ఎదుర్కొన్న ఒక వాహనాన్ని మీరు నాకు చూపించండి'' అని బహిరంగంగా సవాలు విసిరారు. ఇంధనం కారణంగా ఇంజిన్కు పెద్దగా నష్టం జరగదు. అయితే కొత్త కార్లలో మైలేజ్ 2 శాతం, అప్గ్రేడ్ చేసిన విడి భాగాలను ఉపయోగించిన కార్ల మైలేజ్ 6 శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది సర్వ సాధారణం అని చెప్పవచ్చు. దీనిని సమస్యగా పరిగణించలేము.స్థానికంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ వాడకం వల్ల, భారతదేశానికి పెట్రోల్ దిగుమతి ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా ఈ ఇంధనం కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,200 నుంచి రూ.2,600 ఉంటుంది. దీని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. కాబట్టి ఇంధన ధరలు కొంత తగ్గుతాయని అన్నారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా: హెచ్ఆర్ ఏమన్నారంటే?ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో మొక్కజొన్న విస్తీర్ణం మూడు రెట్లు పెరిగింది. దీనివల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విధంగా వైవిధ్యపరచడం వల్ల జీడీపీలో వ్యవసాయ వాటా ప్రస్తుత 12 శాతం నుండి 22 శాతానికి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో 'ఇథనాల్'ను 100 శాతం ఇంధనంగా ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. -
నేపాల్లో రెండు మహీంద్రా కార్లు లాంచ్
భారతదేశంలో అమ్ముడవుతున్న మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు నేపాల్లో లాంచ్ అయ్యాయి. NAIMA నేపాల్ మొబిలిటీ ఎక్స్పోలో కనిపించిన BE 6 ధర NR 57 లక్షలు (రూ. 35.66 లక్షలు), XEV 9e ధర దాదాపు NR 69 లక్షలు (రూ. 41 లక్షలు).సరికొత్త డిజైన్ కలిగిన మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. లెవల్ 2+ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, పెట్ మోడ్తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, రికార్డర్ ఫంక్షన్తో 360-డిగ్రీ కెమెరా, డాల్బీ అట్మోస్తో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్స్ పొందుతాయి.ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..XEV 9e మూడు స్క్రీన్లతో వైడ్స్క్రీన్ డిస్ప్లే పొందుతుంది. BE 6 వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. XEV 9e మరియు BE 6 లు 59 kWh మరియు పెద్ద 79 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తాయి. XEV 9e రేంజ్ 542 కి.మీ (59 kWh) & 656 కి.మీ (79 kWh). BE 6 రేంజ్ 535 కి.మీ (59 kWh) & 682 కి.మీ 79 kWh. -
ఈ బ్యాటరీ వచ్చిందంటే టెస్లాకు చావే!
చైనా టెక్ దిగ్గజం హువావే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బ్యాటరీ టెక్నాలజీలో సంచలనం సృష్టించబోతోంది. తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే, ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీని రూపొందిస్తున్న ఈ కంపెనీ అందులో పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. బీజీఆర్ రిపోర్ట్ ప్రకారం.. ఈ కొత్త సాలిడ్-స్టేట్ బ్యాటరీ 1,800 మైళ్ళు (సుమారు 3,000 కిలోమీటర్లు) డ్రైవింగ్ పరిధిని అందించగలదు. ఐదు నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు రీఛార్జ్ అవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే టెస్లా వంటి దిగ్గజాల ఆధిపత్యానికి చావు తప్పదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.2023లో దాఖలు చేసిన పేటెంట్ ప్రకారం.. ఈ బ్యాటరీ అధిక-సాంద్రత కలిగిన సాలిడ్-స్టేట్ ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. మెరుగైన భద్రత, దీర్ఘ మన్నిక, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ను అందిస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో రెండు ఇబ్బందులు ఉంటాయి. అవి తక్కువ రేంజ్, ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం. ఈ బ్యాటరీ కమర్షియల్గా పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక రేంజ్ గురించి ఆందోళనలు అక్కర్లేదు. ఛార్జింగ్ సమయాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.టెస్లాకు ముప్పు ఎందుకంటే..టెస్లా అత్యంత అధునాతన మోడళ్లు గరిష్టంగా 400–500 మైళ్ల రేంజ్ను అందిస్తున్నాయి. వీటిని ఛార్జ్ చేయడానికి 15–30 నిమిషాలు పడుతోంది. హువావే ప్రోటోటైప్ పనితీరు, సౌలభ్యం రెండింటిలోనూ పురోగతిని సూచిస్తుంది. దీంతో బ్యాటరీ ఆవిష్కరణ కేంద్రాన్ని అమెరికా నుంచి చైనాకు మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అయినప్పటికీ, ఈ బ్యాటరీ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. వాస్తవ ప్రపంచ పనితీరు ప్రయోగశాల ఫలితాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. "ఇది ఒక ఆశాజనక దశ, కానీ భారీ ఉత్పత్తి, వాహనాలలో ఇంటిగ్రేషన్ నిజమైన పరీక్ష" అని బెంగళూరుకు చెందిన ఈవీ పరిశోధకుడు డాక్టర్ అనిల్ మెహతా అన్నారు.ఈ బ్యాటరీని ఎప్పుడు లాంచ్ చేసేదీ, ఏ వాహనంతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేది హువావే ఇంకా వెల్లడించలేదు. కానీ ఇలాంటి బ్యాటరీ రాబోతోందన్న వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈవీ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న భారత్ వంటి మార్కెట్లలో మరింత చర్చనీయాంశంగా మారాయి. -
ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో జోష్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన ప్యాసింజర్ విక్రయాలు జూలైలో 93% వృద్ధిని సాధించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన నెలలో 15,528 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయాలు 8,037 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో ఏకంగా 6,047 ఈవీ కార్లను విక్రయించి టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగించింది. గతేడాది కంపెనీ జూలైలో 5,100 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే ఈవీ టూవీలర్స్ విక్రయాల్లో 4% క్షీణత నమోదైంది. గతేడాది జూలైలో 1,07,655 యూనిట్లు అమ్మకాలు జరగ్గా ఈ జూలైలో 1,02,973 యూనిట్లకు పరిమితయ్యాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 22,256 యూనిట్ల రిజి్రస్టేషన్లతో అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ 63,675 యూనిట్ల నుంచి 9% పెరిగి 69,146 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలో 9,766 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. గతేడాది కంటే మహీంద్రా 40 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన రిటైల్ అమ్మకాలు జూలైలో 52 శాతం పెరిగి 1,244 యూనిట్లకు చేరాయి. ఈ సెగ్మెంట్లోనూ టాటా మోటార్స్ 333 యూనిట్లతో ముందుంది. ‘‘భారత్ ఆటో పరిశ్రమలో ఈవీ పరివర్తన వేగంగా కదులుతుందనేందుకు గణాంకాలు నిదర్శనం. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు, ఫైనాన్స్, చార్జింగ్ మౌలిక సదుపాయాల కారణంగా అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. -
టాటా మోటార్స్ రివర్స్ గేర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం 62% క్షీణించి రూ. 4,003 కోట్లను తాకింది. యూఎస్ టారిఫ్లతో జేఎల్ఆర్ లాభాలు తగ్గడం, అమ్మకాలు క్షీణించడం, అధిక బేస్ తదితర అంశాలు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 10,587 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,07,102 కోట్ల నుంచి రూ. 1,04,407 కోట్లకు నీరసించింది. గతంలో అంటే 2024 ఏప్రిల్లో పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్ను టాటా క్యాపిటల్(టీసీఎల్)లో విలీనం చేయడంతో రూ. 8,016 కోట్ల టీసీఎల్ ఈక్విటీ షేర్లను అందుకుంది. తద్వారా రూ. 4,975 కోట్ల లాభం జమ చేసుకుంది. ఇది అధిక బేస్కు కారణం. జేఎల్ఆర్ తీరిలా: యూకే, ఈయూలో తయారైన కార్లపై యూఎస్ టారిఫ్ల కారణంగా బ్రిటిష్ అనుబంధ కంపెనీ జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 9% తగ్గి 6.6 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. టారిఫ్ల వల్ల జేఎల్ఆర్పై 25 కోట్ల పౌండ్ల ప్రభావం పడినట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ చెప్పారు. తదుపరి తరం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై 3.8 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు జేఎల్ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. టాటా మోటార్స్ షేరు 2.2% క్షీణించి రూ. 633 వద్ద ముగిసింది. -
75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..
సుజుకి మోటార్ కార్పొరేషన్.. 'వ్యాగన్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా 1 కోటి అమ్మకాలు దాటిందని ప్రకటించింది. ఈ కారు 1999లో భారతదేశంలో అడుగుపెట్టడానికి ముందే.. జపాన్, యూరప్ వంటి మార్కెట్లలో మంచి అమ్మకాలను పొందింది.1993 సెప్టెంబర్లో జపాన్లో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది సెమీ బోనెట్ స్టైల్ పొందింది. దీని పరిమాణం, డిజైన్ కారణంగానే అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. జపాన్ తరువాత భారతదేశం (1999), హంగేరీ (2000), ఇండోనేషియా (2013), పాకిస్తాన్ (2014)లలో వ్యాగన్ ఆర్ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ సుమారు 75 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తోంది.1998 అక్టోబర్ నాటికి 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకున్న వ్యాగన్ ఆర్.. 2010 ఫిబ్రవరి నాటికి 50 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంది. 2022 జనవరి నాటికి 90 లక్షలు, 2025 జూన్ నాటికి ఒక కోటి యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకోగలిగింది.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!భారతదేశంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ 1.0 లీటర్, త్రీ సిలిండర్, 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో మాత్రమే కాకుండా.. CNG ఎంపికలో కూడా లభిస్తోంది. ఈ కారు ధరలు రూ. 5.78 లక్షల నుంచి ప్రారంభమై రూ. 7.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. -
జులై వాహన విక్రయాలు 4% డౌన్
న్యూఢిల్లీ: రిటైల్ వాహన విక్రయాలు జూలైలో తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఇదే నెలలో 20,52,759 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈసారి 4% తగ్గి 19,64,213 యూనిట్లుకు దిగివచ్చాయి. ప్రయాణికుల వాహనాలు(పీవీలు), టూ–వీలర్స్కు డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఆటో మొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది జూలైలో పోలిస్తే 3,31,280 యూనిట్లు నుంచి స్వల్పంగా 0.81% తగ్గి 3,28,613 కు పరిమితమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. → ద్వి చక్రవాహనాల రిజిస్ట్రేషన్ 6.48% క్షీణత చవిచూసింది. ఈ జూలైలో మొత్తం 13,55,504 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 14,49,487 యూనిట్లుగా ఉన్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు మొదలవడం, అధిక వర్షాలు కొనసాగడం గ్రామీణ ప్రాంత డిమాండ్ను దెబ్బతీసింది. పండుగ సీజన్ ప్రారంభం నేపథ్యంలో వాహన కొనుగోలు నిర్ణయం ఆగస్టుకు వాయిదా పడిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు జూలైలో 76,261 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.23% పెరిగి 76,439 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, తగ్గిన మోతాదులు నిల్వలు పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య వాహనాలకు డిమాండ్ లభించింది. అయితే అధిక వర్షపాతాలు, రవాణా సమస్యలు, రుణ పంపిణీ మందగమన అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్ను తగ్గించాయి. → ట్రాక్టర్ల రిటైల్ అమ్మకాలు 11% పెరిగి 79,961 యూనిట్ల నుంచి 88,722 యూనిట్లకు పెరిగాయి. అధిక వర్షపాత అంచనాలు, వ్యవసాయ సబ్సిడీలు పెరగడం ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు కారణమయ్యాయి. -
ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్స్: రూ.10 లక్షల తగ్గింపు!
భారతదేశంలో పండుగ సీజన్ మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు.. తమ ఉత్పత్తులపై డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అందించడానికి సిద్ధమయ్యారు. ఈ కథనంలో ఆగస్టు నెలలో ఎలక్ట్రిక్ కార్లపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్ గురించి తెలుసుకుందాం.కియా ఈవీ6కియా ఈవీ6 కొనుగోలుపైన ఈ నెలలో కంపెనీ సుమారు రూ.10 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం GT-లైన్ AWD వేరియంట్లో మాత్రమే ఈ కారు అమ్మకానికి ఉంది.మహీంద్రా XUV400దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలో తన XUV400 ఈవీ కొనుగోలుపై రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. డిస్కౌంట్ అనేది మీరు ఎందుకుని వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారు 375 కిమీ నుంచి 456 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ జెడ్ఎస్ ఈవీ & కామెట్ఎంజీ మోటార్ తన జెడ్ఎస్ ఈవీ కొనుగోలుపైన రూ. 2.5 లక్షలు, కామెట్ ఈవీపైన రూ. 60,000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే విండ్సర్ మీద ఎటువంటి తగ్గింపులు లేదు.సిట్రోయెన్ ఈసీ3సిట్రోయెన్ తన ఈసీ3 కొనుగోలుపైన రూ. 1.25 లక్షల డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. చూడటానికి SUV మాదిరిగా కనిపించే ఈ హ్యాచ్బ్యాక్ 2540 మిమీ వీల్బేస్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్క్రెటా ఎలక్ట్రిక్ కారుపైన హ్యుందాయ్ కంపెనీ రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్ ఎంపిక చేసుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. 390 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు.. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?టాటా ఎలక్ట్రిక్ కార్లుటాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల మీద రూ. 45000 నుంచి రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ టియాగో, పంచ్ , నెక్సాన్ , కర్వ్, హారియర్ ఈవీ వంటివాటి మీద ఈ డిస్కౌంట్ అందిస్తోంది. హారియర్ ఈవీ కొనుగోలుపై లాయల్టీ ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. టియాగో ఈవీ కొనుగోలుపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు.NOTE: డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అనేవి నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. డిస్కౌంట్స్ గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి, మీ సమీపంలోని బ్రాండ్ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
20 ఏళ్లలో 12 లక్షల మంది కొన్నారు
2005లో భారతీయ మార్కెట్లో ప్రారంభమైన 'టయోటా ఇన్నోవా' ఏకంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీ దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొనుగోలుదారులను ఆకట్టుకుంటూ, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ వంటివి పుట్టుకొచ్చాయి.ప్రారంభం నుంచి మార్కెట్లో ఇన్నోవా 12 లక్షల యూనిట్లు అమ్మకాలను సాధించింది. ఈ అమ్మకాల్లో సాధారణ ఇన్నోవా మాత్రమే కాకుండా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ కూడా ఉన్నాయి. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.2016లో ప్రారంభమైన ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 148 హార్స్ పవర్, 343 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 27.17 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?2022లో ప్రారంభమైన ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుంచి రూ. 32.58 లక్షల మధ్య ఉంది. ఇది 2.0 లీటర్ VVTi పెట్రోల్ ఇంజిన్ ద్వారా 172 హార్స్ పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. -
ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్ను
ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ అయస్కాంతాల కొరత వాహన తయారీదారులకు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇది ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగంలోని వారికి తీవ్ర సంకటంగా మారింది. దీనికి తక్షణ పరిష్కారం కనిపించకపోవడంతో ఇండియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం) ఎలక్ట్రిక్ మోటార్లలో అంతర్భాగమైన రేర్ ఎర్త్ అయస్కాంతాలను భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి.ఈవీ ఉత్పత్తిపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలకు శక్తినిచ్చే అధిక పనితీరు మోటార్లకు రేర్-ఎర్త్ అయస్కాంతాలు అవసరం. ఇవి వాహనం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పదార్థాలకు సంబంధించి భారత్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ముఖ్యంగా భారీగా దిగుమతి చేసుకునే రేర్-ఎర్త్ రకాలపై ప్రపంచ సరఫరాలో 80% పైగా నియంత్రించేది చైనానే. ఈ దేశం అక్కడి అవసరాలకు భారీగా వినియోగిస్తుంది. ఈ సరఫరా గొలుసు అంతరాయం ఆటోమోటివ్ పరిశ్రమ అంతటా ఆందోళనలు కలిగిస్తోంది. దాంతో భారతీయ ఓఈఎంలు ఒత్తిడికి గురవుతున్నాయి.చైనాకు దరఖాస్తులురేర్ ఎర్త్ అయస్కాంతాల స్థిరమైన సరఫరా కోసం భారత ఆటోమొబైల్ కంపెనీలు చైనాకు 30కి పైగా దరఖాస్తులను సమర్పించాయి. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘హెవీ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం ఎటువంటి దరఖాస్తులు ఇంకా ఆమోదించలేదు. సరఫరా ఎప్పుడు పునప్రారంభమవుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నాం’ అని తెలిపారు.ప్రత్యామ్నాయాల వైపు అడుగులురేర్-ఎర్త్ అయస్కాంతాల సంక్షోభం తీవ్రతరం కావడంతో వీటిపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఓఈఎంలు ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంకేతికతలను అన్వేషిస్తున్నాయి. ఏదేమైనా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వీటి అవసరాలు అధికమవుతున్నాయి. సిరామిక్ అయస్కాంతాలు, గ్రాఫీన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం, నానో స్ఫటిక పదార్థాలు, సింథటిక్ మెటిరియోరైట్ అయస్కాంతాలు, ఐరన్ నైట్రైడ్ సూపర్ అయస్కాంతాలు వంటి ప్రత్యామ్నాయాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. అయితే వీటి సామూహిక ఉత్పత్తికి వాణిజ్యపరంగా ఆచరణీయ మార్గాలు పరిమితంగా ఉన్నాయని ప్రిమస్ పార్టనర్స్ సలహాదారు అనురాగ్ సింగ్ తెలిపారు. ఇదీ చదవండి: యాపిల్కు ట్రంప్ వణుకు?మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కొరతను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎంఅండ్ఎం ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ..‘వచ్చే త్రైమాసికానికి రేర్-ఎర్త్ అయస్కాంతాల స్థానంలో తేలికపాటి రేర్-ఎర్త్ ప్రత్యామ్నాయాలు వాడుతాం. ఈమేరకు చర్యలు ప్రారంభించాం’ అని చెప్పారు. -
బ్లాక్ థీమ్లో నిస్సాన్ మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్..
నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ .8.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). నిస్సాన్ డీలర్షిప్లు, నిస్సాన్ ఇండియా వెబ్సైట్లో దీని బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రూ.11,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ను బ్లాక్ కలర్ థీమ్ ఆధారంగా రూపొందించారు.మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ఎక్స్టీరియర్ లో పియానో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రెసిన్ బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ వాహనం ఎడమ ఫెండర్ పై మాగ్నైట్ బ్రాండింగ్ కింద 'కురో' బ్యాడ్జ్ ను ఇచ్చారు.ఈ మోడల్ లో బ్లాక్ డ్యాష్ బోర్డ్, పియానో బ్లాక్ గేర్ షిఫ్ట్ గార్నిష్, పియానో బ్లాక్ స్టీరింగ్ ఇన్సర్ట్, బ్లాక్ సన్ వైజర్స్, బ్లాక్ డోర్ ట్రిమ్స్ ఉన్నాయి. లైట్సాబర్ టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సాబుల్ బ్లాక్ వైర్లెస్ ఛార్జర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ డిస్ప్లే ఉన్నాయి. డాష్ క్యామ్ ను యాక్ససరీగా అందిస్తున్నారు.నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ పవర్ట్రెయిన్లు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్లో లభిస్తాయి. 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (72 పీఎస్, 96 ఎన్ఎమ్) 5-స్పీడ్ ఎంటీ లేదా ఏఎంటీతో జత చేయవచ్చు. అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 పీఎస్, 160 ఎన్ఎమ్)కు 5-స్పీడ్ ఎంటీ, సీవీటీ ఆప్షన్లు ఉంటాయి. -
ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త బైక్: 175 కిమీ రేంజ్
బెంగళూరు: ఒబెన్ ఎలక్ట్రిక్ సంస్థ మోటార్ సైకిల్ విభాగంలో ‘రోర్ ఈజెడ్ సిగ్మా’ పేరుతో కొత్త మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.27 లక్షలు, 4.4 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ.1.37 లక్షలుగా ఉంది.కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. రూ.2,999 టోకెన్ అమౌంట్ను చెల్లించి, బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఆగస్టు 15 నుంచి మొదలవుతాయి. బ్రాండ్ అభివృద్ధి చేసిన ఎల్ఎఫ్పీ బ్యాటరీ టెక్నాలజీను ఇందులో ఉపయోగించారు. ఒకసారి పూర్తి చార్జింగ్తో 175 కిమీ వరకు ప్రయాణించవచ్చు. 3.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు. గంటన్నరలో 80% వరకు చార్జ్ అవుతుంది. -
భారత్లో వియత్నాం కంపెనీ: 3000 ఉద్యోగాలు..
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ఇండియావైపు చూస్తున్నాయి. ఇటీవలే టెస్లా దేశీయ విఫణిలో తన మొదటి కారును లాంచ్ చేసింది. ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ (VinFast) తమిళనాడులోని ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్లో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ సంస్థ భారతదేశంలో తన ఉనికిని మరింత విస్తరించడానికి సన్నద్ధమవుతోంది.తూత్తుకుడిలోని విన్ఫాస్ట్ కర్మాగారం ప్రారంభంలో సంవత్సరానికి 50,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచి ఏడాదికి 1,50,000 కార్లకు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులో ఓడరేవులు ఉండడం వల్ల.. ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవడానికి కంపెనీ ఆలోచిస్తోంది. అంతే కాకుండా.. ఈ కర్మాగారం ద్వారా సుమారు 3,000 కంటే ఎక్కువ మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది.విన్ఫాస్ట్ తమిళనాడును ఎంచుకోవడానికంటే ముందు భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో 15 ప్రదేశాలను పరిశీలించినట్లు కంపెనీ తెలిపింది. తయారీకి మాత్రమే కాకుండా.. ఎగుమతులకు కూడా ఈ రాష్ట్రం అనుకూలంగా ఉండటం చేత సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. -
చెప్పినట్లే చేసిన టెస్లా.. ఇక రెండో షోరూం ఎక్కడంటే?
ఆగస్టు 4న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో తన మొదటి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇదివరకే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జింగ్ స్టాల్స్(డీసీ చార్జింగ్), నాలుగు డెస్టినేషన్ చార్జింగ్ స్టాల్స్(ఏసీ చార్జింగ్) ఉన్నాయి.వీ4 సూపర్చార్జర్లు కిలోవాట్కి రూ.24, డెస్టినేషన్ చార్జర్లు కిలోవాట్కి రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెప్టెంబర్ చివరి కల్లా ముంబైలోని లోయర్ పరేల్, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో కొత్త చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ వివరించింది.ఢిల్లీలో రెండో షోరూంటెస్లా తన రెండో షోరూంను ఢిల్లీలోని ఏరోసిటీ(వరల్డ్ మార్క్ 3)లో ఆగస్టు 11న ప్రారంభించనుంది. కాగా తొలి షోరూంను జూలై 15న ముంబైలోని బాంద్రా కుర్లా కాంపెక్స్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జులైలో ఎక్కువమంది కొన్న కారు ఏదంటే?టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. -
జులైలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
దేశంలో ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కార్లు, బైకులు సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయి. 2025 జులై నెలలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవో ఈ కథనంలో చూసేద్దాం..మారుతి సుజుకి డిజైర్ జూలై 2025లో అత్యధికంగా (20,895 యూనిట్లు) అమ్ముడైన కారుగా నిలిచింది. జూన్ 2025లో ఈ కారు సేల్స్ 15,484 యూనిట్లు. దీన్ని బట్టి చూస్తే.. డిజైర్ సేల్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిడిజైర్ తరువాత ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా (16,898 యూనిట్లు), మారుతి ఎర్టిగా (16,604 యూనిట్లు), మారుతి వ్యాగన్ ఆర్ (14,710 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (14,200 యూనిట్లు), మారుతి బ్రెజ్జా (14,100 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (13,800 యూనిట్లు), మారుతి ఫ్రాంక్స్ (12,900 యూనిట్లు), టాటా నెక్సాన్ (12,855 యూనిట్లు), మారుతి బాలెనొ (12,600 యూనిట్లు) ఉన్నాయి. -
టీవీఎస్ మోటార్ విక్రయాలు పెరిగాయ్..
చెన్నై: టీవీఎస్ మోటార్ విక్రయాలు 2025 జూలై నెలలో మొత్తం 29 శాతం పెరిగి 4,56,350 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే జూలైలో డీలర్లకు 3,39,676 వాహనాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. దేశీయంగా(భారత్లో) 3,08,720 వాహన అమ్మకాలు నమోదవ్వగా, 2024 జూలైలో విక్రయాలు 2,54,250 యూనిట్లగా ఉన్నాయి.ఇందులో మోటార్సైకిల్ విభాగ విక్రయాల వృద్ధి 25 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 1,61,074 యూనిట్లుగా ఉండగా, 2025 జూలైలో 2,01,494 యూనిట్లకు చేరాయి. ఇదే జూలైలో మొత్తం 198,265 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయించిన 1,39,995 యూనిట్లతో పోలిస్తే ఇవి 42% అధికంగా ఉన్నాయి.ఎల్రక్టానిక్ వాహన(ఈవీ) విభాగం అమ్మకాల వృద్ధి 10 శాతంగా ఉంది. మొత్తం 21,442 యూనిట్ల నుంచి 23,605 యూనిట్లకు చేరింది. జూలైలో మొత్తం 1,42,629 యూనిట్లు ఎగుమతి కాగా, గతేడాది ఇదే నెలలో 97,589 యూనిట్లు విదేశాలకు తరలించారు. -
ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. దీని ద్వారా సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రకటించారు. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2025-26 సంవత్సరానికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ధర రూ. 3,000. వినియోగదారుడు రాజ్మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్హెచ్ఏఐ (NHAI) వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు పూర్తయిన తరువాత యాన్యువల్ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్.. ప్రైవేట్ కార్లు, జీప్, వ్యాన్లు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్ప్రెస్వే (NE) టోల్ ప్లాజాల ద్వారా ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందు అయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం వినియోగదారులు ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్ట్యాగ్లో వార్షిక పాస్ను యాక్టివేట్ చేయవచ్చు.ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
ధర ఎక్కువైనా.. భారత్లో తగ్గని డిమాండ్
భారతదేశంలో ఖరీదైన బైకులను విక్రయించే బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ దేశీయ విఫణిలో 1000 యూనిట్ల 'ఎస్ 1000 ఆర్ఆర్' (S 1000 RR) సూపర్బైక్లను విక్రయించింది. సంస్థ తన 1000 బైకును ఇటీవలే ఢిల్లీలో లుటియన్స్ మోటోరాడ్ యజమానికి డెలివరీ చేసింది.ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ 2025 ఎస్ 1000 ఆర్ఆర్ ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి స్టాండర్డ్ (రూ. 21.30 లక్షలు), ప్రో (రూ. 23.80 లక్షలు) & ప్రో ఎం స్పోర్ట్ (రూ. 26.05 లక్షలు). ఇవన్నీ లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి.ఇదీ చదవండి: సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ 999 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 210 హార్స్ పవర్, 113 న్యూటన్ మీటర్ తారక్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్బాక్స్తో లభించే ఈ సూపర్బైక్ కేవలం 3.3 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్గా ప్రసిద్ధి చెందింది. -
ఆటోల ధరలు ఖరారు.. ఎక్కువకు విక్రయించకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా నియంత్రించింది.ఓఆర్ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు. 20 వేల ఆటోలకు ప్రొసీడింగ్లు.. అర్హులైన ఆటోడ్రైవర్లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి కన్సల్టెంట్లు... ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. -
వాహన విక్రయాలు.. స్లోడౌన్
ముంబై: దేశీయంగా డిమాండ్ స్తబ్దత కొనసాగడంతో జూలైలోనూ వాహన విక్రయాలు నెమ్మదించాయి. దిగ్గజ ఆటో కంపెనీలైన మారుతీ సుజుకీ విక్రయాలు స్వల్పంగా పెరగ్గా.., హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు తగ్గాయి. మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా విక్రయాల్లో రెండంకెలు, ఒక అంకె వృద్ధి నమోదు చేశాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూలైలో 1,37,776 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైలో అమ్ముడైన 1,37,463 వాహనాలతో పోలిస్తే స్వల్పంగా 0.22% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 9,960 నుంచి 6,822 యూనిట్లకు తగ్గాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు 10% క్షీణించి 43,973 యూనిట్లకు వచ్చి చేరింది. ‘వాహన పరిశ్రమ గత కొన్ని నెలలుగా డిమాండ్ లేమి పరిస్థితిని ఎదుర్కొంటోంది. పండుగ సీజన్పై ఆశావహంగా ఉన్నాం. పూర్తి స్థాయి సరఫరా, నూతన ఉత్పత్తులతో సిద్ధంగా ఉన్నాం’ అని హ్యుందాయ్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు మహీంద్రా యుటిలిటీ వాహన సేల్స్ 20% వృద్ధి తో 49,871 యూ నిట్లుగా నమోదైంది. -
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
దేశీయ మార్కెట్లో 7 సీటర్ కార్లకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఈ విభాగంలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 15 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 ఉత్తమమైన వాహనాలను గురించి తెలుసుకుందాం..➢రెనాల్ట్ ట్రైబర్: రూ. 6.3 లక్షల నుంచి రూ. 9.17 లక్షలు➢మారుతి ఎర్టిగా: రూ. 9.12 లక్షల నుంచి రూ. 13.41 లక్షలు➢మహీంద్రా బొలెరో: రూ. 9.81 లక్షల నుంచి రూ. 10.93 లక్షలు➢మహీంద్రా బొలెరో నియో: రూ. 9.97 లక్షల నుంచి రూ. 12.18 లక్షలు➢టయోటా రూమియన్: రూ. 10.67 లక్షల నుంచి రూ. 13.96 లక్షలు➢కియా కారెన్స్: ప్రారంభ ధర రూ. 11.41 లక్షలు➢కియా క్లావిస్: రూ. 11.50 లక్షల నుంచి రూ. 19.50 లక్షలు➢సిట్రోయెన్ ఎయిర్క్రాస్: రూ. 12.50 లక్షల నుంచి రూ. 14.60 లక్షలు➢మహీంద్రా స్కార్పియో క్లాసిక్: ప్రారంభ ధర రూ. 13.77 లక్షలు➢మహీంద్రా స్కార్పియో ఎన్: ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు -
సరికొత్త బీఎస్ఏ బైకులు ఇవే - వివరాలు
బ్రిటిష్ బ్రాండ్ 'బీఎస్ఏ మోటార్సైకిల్స్' తన సరికొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650, బీఎస్ఏ బాంటమ్ 350 లను ఆవిష్కరించింది. 1861 నాటి వారసత్వం కనిపించేలా వీటిని డిజైన్ చేయడం జరిగింది.బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650కొత్త బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 క్లాసిక్ 652సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ DOHC ఇంజిన్ ద్వారా 45 పీఎస్ పవర్, 55 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, 41mm టెలిస్కోపిక్ ఫోర్కులు, 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీ లోడ్తో కూడిన ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇందులో ఉన్నాయి.థండర్ గ్రే, రావెన్ బ్లాక్, విక్టర్ యెల్లో అనే మూడు రంగులలో లభించే ఈ బైక్.. డ్యూయల్ ఛానల్ ABSతో బ్రెంబో బ్రేక్లు, గ్రిప్పీ పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్టీఆర్ టైర్లు, వైర్ స్పోక్ అల్లాయ్ రిమ్ వంటివి పొందుతుంది. 12 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగిన ఈ బైక్ బరువు 218 కేజీలు.బీఎస్ఏ బాంటమ్ 350బీఎస్ఏ బాంటమ్ 350 నిజమైన క్లాసిక్కు నిదర్శనం.ఇది 334 సీసీ లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ కలిగి 6-స్పీడ్ గేర్బాక్స్తో 7750 rpm వద్ద 29PS పవర్ 6000rpm వద్ద 29.62Nm టార్క్ అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, ట్విన్ షాక్ అబ్జార్బర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.రౌండ్ హెడ్లైట్, టియర్డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, వంపుతిరిగిన రియర్ ఫెండర్ కలిగిన ఈ బైక్ అవలోన్ గ్రే, ఆక్స్ఫర్డ్ బ్లూ, ఫైర్క్రాకర్ రెడ్, బారెల్ బ్లాక్, విక్టర్ యెల్లో వంటి రంగులలో లభిస్తుంది. -
సరికొత్త హోండా షైన్ లాంచ్.. ధర తక్కువే!
ఇండియన్ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే బైకులకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'హోండా మోటార్సైకిల్' కంపెనీ కొత్త 'షైన్ 100 డీఎక్స్' లాంచ్ చేసింది. దీని ధర రూ.74,989 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.హోండా షైన్ 100 డీఎక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా స్టైలిష్గా ఉంటుంది. ఇందులో కొత్త గ్రాఫిక్స్, క్రోమ్ యాక్సెంట్స్ వంటి వాటితో పాటు ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. స్టీల్ ఛాసిస్పై నిర్మితమైన ఈ బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, ఫైవ్ టైప్స్ అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ల పొందుతుంది. ఇది రెండు చివర్లలో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ట్యూబ్లెస్ టైర్లతో వస్తుంది.పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, జెనీ గ్రే మెటాలిక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభించే కొత్త హోండా షైన్ 100 డీఎక్స్ 98.98 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7500 rpm వద్ద 7.28 Bhp పవర్, 5000 rpm వద్ద 8.04 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఫోర్ స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. -
టాటా మోటార్స్ రూ.10,000 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్హెచ్టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
కైనెటిక్ కొత్త స్కూటర్.. తిరిగొచ్చిన మరో ఐకానిక్ బండి
లూనా తర్వాత కైనెటిక్ నుంచి మరో ఐకానిక్ బండి తిరిగి కొత్తగా మార్కెట్లోకి వస్తోంది. కైనెటిక్ డీఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత్లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ .1.12 లక్షల నుంచి రూ.1.18 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ డీఎక్స్, డిఎక్స్+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 116 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఈ డీఎక్స్ స్కూటర్కు కైనెటిక్ గ్రీన్ మూడు సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీని అందిస్తోంది. దీంతోపాటు తొమ్మిది సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ ఎంచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. వైట్, బ్లూ, బ్లాక్, సిల్వర్, రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటు ఉంటుంది.జూలై 28 నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుక్కోవాలనుకుంటున్నవారు రూ .1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2025 అక్టోబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే డెలివరీలను 40,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కైనెటిక్ గ్రీన్ వెల్లడించింది.ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన లూనాతో పాటు కైనెటిక్ తన బ్రాండ్ కింద రెండవ ఐకానిక్ నేమ్ ప్లేట్ ను పునరుద్ధరించింది. భారత్కు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీ సంయుక్త భాగస్వామ్యంలో 1984 నుండి 2007 మధ్య కైనెటిక్ డీఎక్స్ స్కూటర్లు ఉత్పత్తి అయ్యాయి. హోండా ఎన్హెచ్ సిరీస్ స్కూటర్ల కింద రూపొందిన ఆ స్కూటర్ 98 సీసీ టూ-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇప్పుడిది ఎలక్ట్రిక్ మోడల్గా తిరిగి రోడ్డెక్కుతోంది. -
టెస్లా బాటలోనే మరో కంపెనీ
భారత్లో టెస్లా అరంగేట్రం చేసిన కొన్ని రోజుల్లోనే వియత్నాం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇండియాలో తన మొదటి షోరూమ్ను గుజరాత్లోని సూరత్లో ప్రారంభించింది. సూరత్లోని పిప్లోడ్లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫెసిలిటీ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, వాహన అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్లో విన్ఫాస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీలు వీఎఫ్ 6, వీఎఫ్ 7లను ప్రదర్శిస్తుంది.విన్ఫాస్ట్ వీఎఫ్ 7, వీఎఫ్ 6 మోడళ్లలో రైట్హ్యాండ్ డ్రైవ్ వెర్షన్ను మొదటిసారి ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్షిప్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. విన్ఫాస్ట్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీల కోసం 2025 జులై 15న అధికారికంగా బుకింగ్లను ప్రారంభించింది. ఎక్స్క్లూజివ్ షోరూమ్ల్లో లేదా అధికారిక వెబ్సైట్ VinFastAuto.in ద్వారా రూ.21,000 పూర్తిగా రీఫండబుల్ అమౌంట్తో బుక్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటుతమిళనాడులోని తూత్తుకుడిలో రాబోయే రోజుల్లో విన్ఫాస్ట్ ఏర్పాటు చేయనున్న కర్మాగారంలో ఈ వాహనాలను స్థానికంగా అసెంబుల్ చేస్తామని పేర్కొంది. విన్ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మాట్లాడుతూ..‘భారతీయ వినియోగదారులకు విన్ఫాస్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని చేరువ చేయబోతున్నందుకు సంతోషిస్తున్నాం’ అని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2020లో కేవలం 5,000 యూనిట్ల నుంచి 2024 నాటికి 1,13,000 యూనిట్లకు పుంజుకుంది. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉండగా, 2030 నాటికి ఈ వాటాను 30 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆటో మొబైల్... ఎగుమతులు ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎగుమతులు జూన్ త్రైమాసికంలో ఆకర్షణీయంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం పెరిగాయి. మొత్తం 14,57,461 యూనిట్లు ఎగుమతి అయినట్టు ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు అధికంగా జరిగాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 1,80,483 యూనిట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. మారుతి సుజుకీ 96,181 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను క్యూ1లో ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని ఎగుమతులు 69,962 యూనిట్ల కంటే 37 శాతం ఎక్కువ. గత నాలుగేళ్ల నుంచి ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంటున్నట్టు సంస్థ సీఈవో (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. క్యూ1లో తమ వాటా 47 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. మారుతి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా అత్యధికంగా 48,140 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం అధికం. ద్విచక్ర వాహన ఎగుమతులు 11,36,942 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ద్విచక్ర వాహన ఎగుమతులు 9,23,148 యూనిట్ల కంటే 23 శాతం పెరిగాయి. వాణిజ్య వాహన ఎగుమతులు సైతం 23 శాతం పెరిగి 19,427 యనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 34 శాతం పెరిగి 95,796 యూనిట్లకు చేరాయి. -
ఈ బుల్లి కారు.. ఇక మరింత ప్రియం
బుల్లి ఎలక్ట్రిక్ కారు ‘ఎంజీ కామెట్ ఈవీ’ ధరలను ఎంజీ మోటార్ మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో మైక్రో ఎలక్ట్రిక్ హ్యాచ్ కారు ధరల సవరణ ఇది మూడోసారి. తాజా అప్డేట్లో రూ .15,000 వరకు పెరగడంతో, కామెట్ ఈవీ ధరలు ఇప్పుడు రూ .7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, బ్యాటరీ కలిపి) నుండి ప్రారంభమవుతాయి. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఎస్) మోడల్ కింద కామెట్ ఈవీ ధర రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.బ్యాటరీ అద్దెలూ పెంపుబీఏఎస్ మాడ్యూల్ ప్రకారం బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ధరలను కిలోమీటరుకు రూ.2.9 నుంచి రూ.3.1కి పెంచారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో కామెట్ ఈవీ బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ.2.50గా ఉండేది. కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎంజీ కామెట్ ఈవీ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లుధర పెరగడం మినహా కామెట్ ఈవీలో ఇతర మార్పులేమీ లేవు. ఫీచర్ల విషయానికి వస్తే, కామెట్ ఈవీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్లను కలిగి ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, మాన్యువల్ ఏసీ, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, 4-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), నాలుగు డిస్క్ బ్రేకులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.కోమెట్ ఈవీలో 17.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది వెనుక యాక్సిల్పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తుంది. ఇది 41 బిహెచ్పీ, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. 7.4 కిలోవాట్, 3.3 కిలోవాట్ల ఛార్జర్లతో 0 నుండి 100 శాతం ఛార్జ్ సమయం వరుసగా 3.5 గంటలు, ఏడు గంటలు పడుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లోకి మహీంద్రా 3ఎక్స్వో రెవ్ఎక్స్
వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఎక్స్యూవీ 3ఎక్స్వో పోర్ట్ఫోలియోలో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన రెవ్ఎక్స్ సిరీస్ను తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ఆవిష్కరించింది. బుకింగ్స్తో పాటు డెలివరీలు కూడా ప్రారంభమైనట్లు సంస్థ సేల్స్ విభాగం జోనల్ హెడ్ (సౌత్) అరుణాంగ్షు రాయ్ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇదీ చదవండి: వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డుఇందులో రెవ్ఎక్స్ ఎం, ఎం(ఓ), ఏ అని మూడు వేరియంట్లు ఉన్నాయి. వేరియంట్ను బట్టి ధర రూ.8.94 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రీమియం లెదరెట్ సీట్లు, సన్రూఫ్, బిల్ట్ఇన్ అలెక్సా, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, తదితర ఫీచర్లు ఉంటాయని రాయ్ చెప్పారు. గతేడాది ఆవిష్కరించిన 3ఎక్స్వో కేవలం 11 నెలల్లోనే 1 లక్ష యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 10,000 పైచిలుకు యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో సీఎన్జీ వాహనాలకు కష్టాలు
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న సీఎన్జీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ స్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 83 సీఎన్జీ స్టేషన్లే ఉన్నాయి. ఇవి రోజూ 55 వేల నుంచి 60 వేల వాహనాలకు గ్యాస్ సేవలు అందిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.లోక్సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా సీఎన్జీపైనే ఆధారపడుతున్నాయి. కానీ స్టేషన్ల తక్కువ సంఖ్య వల్ల వాహనదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి లోక్సభ వేదికగా తెలిపారు. -
ఫాస్టెస్ట్ ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది..
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎంజీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా చెబుతున్న సైబర్స్టర్ను జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా విడుదల చేసింది. రూ .74.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రీ-లాంచ్ రిజర్వేషన్ చేసుకున్నట్లయితే రూ .72.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు లభిస్తుంది.స్పెసిఫికేషన్లుఎంజీ సైబర్స్టర్ 77 కిలోవాట్ల అల్ట్రా-థిన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్తో వచ్చే ఈ ఈవీ ఇది 510 పీఎస్, 725 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. లాంచ్ కంట్రోల్ మోడ్తో ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతేకాకుండా, బ్యాటరీ ప్యాక్ కేవలం 110 మిమీతో పరిమాణంతో పరిశ్రమలోనే స్లిమ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల (ఎంఐడీసీ సర్టిఫైడ్) రేంజ్ను అందిస్తుంది.టాప్ స్పీడ్ఎంజీ సైబర్స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. రాజస్థాన్ లోని సాంబార్ సాల్ట్ లేక్ వద్ద గంటకు 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి.ఎక్స్టీరియర్సైబర్స్టర్లో ఎలక్ట్రిక్ సిజర్ డోర్లు, సాఫ్ట్-టాప్ రూఫ్, సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్, కమ్బ్యాక్ రియర్, యాక్టివ్ ఏరో ఎలిమెంట్స్ ఉన్నాయి. విలక్షణమైన ఎల్ఈడీ లైటింగ్, షార్ప్ డీఆర్ఎల్స్, స్కిప్టెడ్ బానెట్తో కారు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇక వెనుక భాగం ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్లతో ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ను కలిగి ఉంది. పిరెల్లి పి-జీరో టైర్లతో జతచేసిన 20-అంగుళాల తేలికపాటి అల్లాయ్ వీల్స్ మెరుగైన గ్రిప్, పనితీరు అందిస్తాయి.ఇంటీరియర్లోపలి భాగంలో ఎంజీ సైబర్స్టర్ ట్రిపుల్-డిస్ప్లే ఇంటర్ఫేస్తో డ్రైవర్-సెంట్రిక్ కాక్పిట్ను కలిగి ఉంది. ఇందులో సెంట్రల్ 10.25-అంగుళాల టచ్స్క్రీన్, రెండు 7-అంగుళాల డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి. పీఎమ్ 2.5 ఫిల్టరేషన్ తో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, డ్రైవ్ మోడ్ ల కోసం స్టీరింగ్-మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లతో తెలివైన పనితీరును మెరుగుపరుస్తుంది. వీటితో పాటు సస్టెయినబుల్ డైనమికా, ప్రీమియం వెజిటేరియన్ లెదర్ అప్హోలెస్టరీ, నాయిస్ కాంపన్సేషన్తో కూడాన బోస్ ఆడియో సిస్టమ్ హైలైట్ గా ఉన్నాయి.ఫీచర్లుఎంజీ సైబర్ స్టర్ అధిక-శక్తి హెచ్-ఆకారంలో ఉన్న పూర్తి క్రెడిల్ స్ట్రక్చర్, 1.83 స్టాటిక్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ (ఎస్ఎస్ఎఫ్) తో సురక్షితమైన డ్రైవ్ను అందిస్తుంది. రోల్ఓవర్ నిరోధకతను నిర్ధారిస్తుంది. ఇది లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఎడీఎఎస్), రియల్ టైమ్ డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్, కాంబినేషన్ సైడ్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. -
వేగంగా 1 లక్ష కార్లు ఎగుమతి చేసి రికార్డు
భారత ఆటోమొబైల్ తయారీలో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ ఎగుమతుల్లో రికార్డు నెలకొల్పింది. భారతదేశం నుంచి వేగంగా 1 లక్ష ఎగుమతులను అధిగమించిన ఎస్యూవీగా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. 2023 జూన్లో ప్రపంచ ఎగుమతి కార్యకలాపాలు ప్రారంభమైన కేవలం 25 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకుందని చెప్పింది.గుజరాత్లోని మారుతీ సుజుకీ ప్లాంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రాంక్స్ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా విదేశీ మార్కెట్లలో బలమైన పనితీరును కనబరుస్తోందని కంపెనీ తెలిపింది. జపాన్లో దీనికి పెరుగుతున్న ప్రజాదరణ ఎగుమతి వృద్ధికి దోహదం చేసిందని చెప్పింది. మారుకీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టేకుచి మాట్లాడుతూ.. ‘ప్రపంచ మార్కెట్ల కోసం ప్రపంచ స్థాయి వాహనాలను తయారు చేయగల సామర్థ్యం కంపెనీకి ఉంది. మేక్ ఇన్ ఇండియా చొరవకు కంపెనీ సాధించిన విజయమే నిదర్శనం. ప్యాసింజర్ వాహన ఎగుమతులు, అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్పాట్2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే మారుతీ సుజుకీ 96,000 వాహనాలను ఎగుమతి చేయడం విశేషం. భారతదేశ ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో 47 శాతం వాటాను ఆక్రమించింది. వరుసగా నాలుగో ఏడాది భారతదేశపు టాప్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా కంపెనీ తన స్థానాన్ని నిలుపుకుంది. -
సరికొత్తగా రెనో ట్రైబర్...
ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం రెనో సరికొత్త ‘ఆల్–న్యూ రెనో ట్రైబర్’ను లాంచ్ చేసింది. ఈ కొత్త ట్రైబర్లో దాని ప్రత్యేకమైన 7 సీటర్ కెపాసిటీని, సీట్లను మార్చుకునే వెసులుబాటును అలాగే ఉంచుతూ డిజైన్, ఫీచర్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.6.29 లక్షలుగా ఉంది.ఈ సందర్భంగా రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. భారత్లో ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థ మెరుగైన వృద్ధి సాధించిన తర్వాతే మార్కెట్లోకి ఈవీ ఉత్పత్తులను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్, నిబంధనలు, ఎకో సిస్టమ్ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. సరైన సమయంలో ఈవీలను ఆవిష్కరిస్తామన్నారు.డిజైన్లో చేసిన మార్పులు ఎక్స్టీరియర్ నుంచే కనిపిస్తున్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ పూర్తిగా పునరుద్ధరించిన ఫ్రంట్ ఫేస్ను కలిగి ఉంది. వర్టికల్ స్లాట్లను కలిగి ఉన్న గ్లాస్ బ్లాక్ గ్రిల్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ల్యాంప్లలోకి అనుసంధానమై ఉంటుంది.ఫ్రంట్ బంపర్ను కూడా పూర్తీగా మార్చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో పెద్ద ఎయిర్ డ్యామ్, రీపోజిషన్ చేసిన ఫాగ్ ల్యాంప్లు, వర్టికల్ ఎయిర్ ఇన్లెట్లను కలిగి ఉంటుంది.కొత్త ట్రైబర్లో రెనాల్ట్ సొగసైన 2డీ డైమండ్ లోగోను తీసుకొచ్చారు. స్టైలిష్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పూర్తిగా నల్లటి రూఫ్ను పొందుతుంది. వెనుక భాగంలో, టెయిల్గేట్లో స్లీకర్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్లు, గ్లాస్ బ్లాక్ ట్రిమ్ ప్యానెల్, 'TRIBER' లెటరింగ్, రీడిజైన్ చేసిన బంపర్ ఉన్నాయి.లోపల, క్యాబిన్ పాత బ్లాక్ అండ్ సిల్వర్ లేఅవుట్ స్థానంలో ఇప్పుడు ఫ్రెష్ గ్రే అండ్ బీజ్ థీమ్ను కలిగి ఉంది. నవీకరించిన డాష్బోర్డ్ డిజైన్లో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఉంది. ఏసీ వెంట్స్ కింద ఇచ్చారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్లైట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఫేస్లిఫ్టెడ్ ట్రైబర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందిస్తుంది. -
సంస్థ సారథులు.. పెరుగుతున్న వేతనాలు
కార్పొరేట్ సంస్థల్లో సాధారణ ఉద్యోగుల జీతాల కంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసే వారి వేతనాలు అధికంగా ఉంటాయి. దానికితోడు ఏటా వారి వేతన పెరుగుదల శాతం ఎక్కువగానే ఉంటోంది. ఇదే విషయాన్ని తాజాగా ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. భారత్లో సగటు సీఈవో వేతనం రూ.17.2 కోట్లకు (సుమారు 2 మిలియన్ డాలర్లు) చేరిందని, ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ జీతాలు 2019 నుంచి 50 శాతం పెరిగాయని ఆక్స్ఫామ్ తెలిపింది.అదే సమయంలో కిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు 1 శాతం మాత్రమే పెరిగాయని నివేదికలో పేర్కొంది. భారత ఆటోమొబైల్లో రంగంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన ఆటో సెక్టార్ సీఈఓగా నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయన మొత్తం వేతనం రూ.109.41 కోట్లుగా ఉంది.గల్లా జయదేవ్అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.67.29 కోట్లు పారితోషికం తీసుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం అధికం. గల్లా వేతనం ఆ కంపెనీలోని ఉద్యోగుల సగటు వేతనం కంటే 2,232 రెట్లు అధికం. ఇదే సమయంలో సగటు ఉద్యోగి వేతనాలు 2.44 శాతం పెరిగాయి.రాజీవ్ బజాజ్బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.58.58 కోట్లు పొందారు. దీంతో కంపెనీ లాభాల్లో వృద్ధి కూడా 9 శాతం పెరిగింది. 2025 ఏప్రిల్ నుంచి మరో ఐదేళ్ల కాలానికి ఆయన పదవికాలం పొడిగించాలని బజాజ్ ఆటో షేర్ హోల్డర్లను కోరింది.అనీష్ షామహీంద్రా గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా తొలిసారి టాప్ పెయిడ్ ఆటో సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అతని మొత్తం సంపాదన రూ .47.33 కోట్లకు చేరుకోవడంతో అతని వేతనంలో 95% పెరుగుదల నమోదైంది. షా నాయకత్వంలో మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. స్కార్పియో, థార్, కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్యూవీ 3ఎక్స్ఓ వంటి మోడళ్ల విజయం సహాయపడింది.ఇదీ చదవండి: ఆర్కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్రఅరవింద్ పొద్దార్ఎగుమతి ఆధారిత టైర్ల తయారీ సంస్థ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ పొద్దార్కు కంపెనీ రూ.47.54 కోట్లు చెల్లించింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన కుమారుడు రాజీవ్ పొద్దార్కు రూ.46.42 కోట్లు పారితోషికం చెల్లించారు. -
ఎంజీ ఎం9 ఈవీ లాంచ్.. 548 కి.మీ.రేంజ్
జెఎస్బ్ల్యు-ఎంజీ మోటార్ ఇండియా ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేసింది. భారత్లో రూ .69.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభించే ఈ మోడల్ను రూ.1 లక్ష చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.ఎంజీ సెలెక్ట్ చైన్ ఆఫ్ డీలర్ షిప్ ల ద్వారా విక్రయించే కొత్త ఎం9 ఈవీ డెలివరీలు ఆగస్టు 10 న ప్రారంభం కానున్నాయి. కియా కార్నివాల్, టయోటా వెల్ ఫైర్ లకు పోటీగా వస్తున్న ఈ ఈవీలో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో 241 బీహెచ్పీ, 350 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. 548 కిలోమీటర్ల (ఎంఐడిసి సైకిల్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.ఎంజీ ఎం9 ఈవీ ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే లెవల్ 2 ఏడీఏఎస్ సూట్, ఎలక్ట్రిక్ స్లైడింగ్ రియర్ డోర్లు, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన 16-వే అడ్జస్టబుల్ సెకండ్-లైన్ సీట్లు, పవర్డ్ బాస్ మోడ్, డ్రైవర్, ప్యాసింజర్ కోసం వెల్ కమ్ సీట్ ఫంక్షన్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఆటో హోల్డ్ తో కూడిన ఈపీబీ, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్, ఏడు అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే, 13-స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్) వంటివి ఉన్నాయి. -
హైవేపై ఇరుక్కుపోవడమెందుకు? కారుతో రైలెక్కండి..
ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కెడెక్కడో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో వాహనాల రాకపోకలతో రహదారులు కిక్కిరుస్తాయి. వందలకొద్దీ వాహనాలతో హైవేలు స్తంభిస్తాయి. ఇక కారు వేసుకుని వెళ్లి గంటలకొద్దీ ఆ హైవేలపై ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని సంక్రాంతి సమయంలో మన తెలుగురాష్ట్రాల మధ్య హైవేలపై చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సమయంలో తలెత్తే రద్దీకి కొంకణ్ రైల్వే వినూత్న పరిష్కారంతో ముందుకువచ్చింది. భారతదేశపు మొట్టమొదటి కార్ ఫెర్రీ రైలు సేవను కోలాడ్ (మహారాష్ట్ర), వెర్నా (గోవా) మధ్య ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేవ ద్వారా ప్రయాణికుల తమ ప్రైవేట్ కార్లను రైలు ద్వారా రవాణా చేయనుంది. అదే సమయంలో వాహనదారులు కూడా ఆ రైలుకు జతచేసిన ప్యాసింజర్ బోగీలలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని కొంకణ్ రైల్వే పేర్కొంది.గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలోని రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని ఉంటుంది. ఇంతటి ట్రాఫిక్లో కార్లను రోడ్డు మార్గం ద్వారా కోలాడ్, వెర్నా మధ్య తీసుకెళ్లాలంటే 20–22 గంటల సమయం పడుతుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ కార్ ఫెర్రీ రైలు సహాయపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 12 గంటలకు తగ్గిస్తుంది.కోలాడ్-వెర్నా కార్ ఫెర్రీ రైలు సర్వీస్ ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కోలాడ్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వెర్నా చేరుకుంటుంది. అయితే మూడు గంటలు ముందే అంటే మధ్యాహ్నం 2 గంటలకే కోలాడ్ స్టేషన్ వద్దకు కారు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రైలులో 20 ప్రత్యేక వ్యాగన్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో రెండు చొప్పున 40 కార్లు తీసుకెళ్తుంది. అయితే, కనీసం 16 కార్లు అయినా బుక్ అయితేనే ఈ రైలు నడుస్తుంది.ఒక్కో కారుకు సరుకు రవాణా ఛార్జీ రూ.7,875 (వన్ వే) ఉంటుంది. భద్రత కోసం వాహనాలను సురక్షితంగా బిగించి హ్యాండ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణ సమయంలో కారులో కూర్చునేందుకు ఎవరినీ అనుమతించరు. వాహనదారులు కూర్చునేందుకు సౌకర్యవంతమైన స్థలం ఉంటుంది. 3ఏసీ బోగీల్లో ఒక్కొక్కరికి రూ.935 చెల్లించి ఇద్దరు సీట్లు బుక్ చేసుకోవచ్చు. అదనంగా మరో వ్యక్తి ఉంటే రూ.190 చెల్లించి స్లీపర్ కోచ్ లో ప్రయాణించవచ్చు. దీని కోసం బుకింగ్స్ జూలై 21 నుంచి ఆగస్ట్ 13 వరకూ అందుబాటులో ఉంటాయి. -
ఈవీ, హైడ్రోజన్, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో భారత్ నం.1
భారతదేశ రవాణా, ఇంధన విభాగంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని అంశాలు పంచుకున్నారు. దేశంలోని ఎలక్ట్రిక్, హైడ్రోజన్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహన విభాగాలు ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతాయని తెలిపారు. గ్రీన్ మొబిలిటీ, ఎనర్జీ డైవర్సిఫికేషన్, పారిశ్రామిక స్వావలంబన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు.ఇంధన విధానంలో సమూల మార్పులుఅధిక ఇథనాల్ ఇంధన మిశ్రమాలు, ముఖ్యంగా ఈ100 (100% ఇథనాల్)పై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తగ్గించే ప్రతిపాదనను గడ్కరీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇథనాల్ ఆధారిత వాహనాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, వ్యవసాయం, పరిశ్రమలు, ఎనర్జీ అంతటా బలమైన ఇథనాల్ ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘పూర్తిగా ఇథనాల్తో నడిచే వాహనాలు ఆచరణీయం మాత్రమే కాదు.. అవి దేశ భవిష్యత్తుకు చాలా అవసరం’ అని గడ్కరీ నొక్కి చెప్పారు. ఖరీదైన శిలాజ ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఈమేరకు పైలట్ ప్రాజెక్టుల అవసరాన్ని, ఇథనాల్ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమాముడిచమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఆ వినియోగంలో రవాణా ప్రధాన వాటాను కలిగి ఉన్నందున, ఇంధన భద్రతను మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ ఇంధనాలు కీలకం. ఈ100-అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించడం ద్వారా చెరకు, బియ్యం, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ వాడకాన్ని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఒనగూరే లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి.శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించండంతక్కువ కర్బన ఉద్గారాలుగ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వడంగ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీల్లో పారిశ్రామిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంజాతీయ బయో-ఎనర్జీ ప్రోగ్రామ్కు మద్దతు ఇవ్వడం -
ఎలక్ట్రిక్ కార్ల జోరు.. రానున్న రోజులు ఈవీలవే..
కొత్త మోడల్స్ ఎంట్రీతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) సరఫరా సమస్యలు సకాలంలో పరిష్కారమైతే, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు మరింతగా పెరుగుతాయని కేర్ఎడ్జ్ అడ్వైజరీ ఒక నివేదికలో తెలిపింది. 2028 నాటికి దేశీయంగా మొత్తం కార్ల విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడమనేది, చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై కూడా ఆధారపడి ఉంటుందని కేర్ఎడ్జ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా తెలిపారు. ఈవీల వినియోగం పెరగడానికి ప్రధాన అవరోధంగా ఉంటున్న చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.దేశీయంగా 2022 క్యాలెండర్ ఇయర్లో 5,151గా ఉన్న పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో 26,000కు చేరినట్లు నివేదిక తెలిపింది. మరోవైపు, 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్ల స్థాయిలో నమోదైన ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07 లక్షల యూనిట్లకు చేరాయి. సాధారణంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో ఫోర్ వీలర్ల వాటా చాలా తక్కువగానే ఉంటుంది. -
ఒకే మోడల్.. నాలుగేళ్లలో 6 లక్షల యూనిట్లు తయారీ
టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ కార్లును ఇప్పటివరకు 6,00,000 తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు తయారీ ప్రారంభించిన నాలుగు ఏళ్లలో ఈమేరకు గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఇండియాలోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో ఈ మోడల్ గేమ్ ఛేంజర్గా నిలిచినట్లు చెప్పింది.‘అక్టోబర్ 2021లో లాంచ్ అయిన టాటా పంచ్ దాని డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర ఫీచర్లతో త్వరగా వినియోగదారుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. టాటా ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్తో నిర్మించిన పంచ్ ఓ మోస్తారు ఎస్యూవీ వాహనాలు చూస్తున్న వారిని ఎంతో ఆకర్షించింది’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: భారత్లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?2024 క్యాలెండర్ ఇయర్లో ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారుగా టాటా పంచ్ నిలిచిందని సంస్థ పేర్కొంది. అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ దశాబ్దాల ఆధిపత్యాన్ని అధిగమించినట్లు తెలిపింది. గత 40 ఏళ్లలో వార్షిక అమ్మకాల్లో మారుతీని తొలిసారి టాటా వెనక్కి నెట్టినట్లు చెప్పింది. ఇది ఐసీఈ, ఈవీ వెర్షన్ల్లో లభ్యం అవుతుంది. -
ఆటోమోటివ్ మిషన్ ప్లాన్పై కేంద్రం కసరత్తు
భారత్ను అంతర్జాతీయ ఆటోమోటివ్ దిగ్గజంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047 రూపకల్పనపై కసరత్తు జరుగుతున్నట్లు భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి హనీఫ్ ఖురేషి తెలిపారు. పర్యావరణహితంగా, కొత్త ఆవిష్కరణలకు తోడ్పాటు అందించే విధంగా ఈ విధానం ఉంటుందని చెప్పారు.ఇదీ చదవండి: పన్ను రిఫండ్ మెయిల్స్ పట్ల జాగ్రత్తఆటోమోటివ్ రంగం పురోగతి, ఎగుమతుల వృద్ధికి సంబంధించిన లక్ష్యా లు, విధానాలపై చర్చించేందుకు ఏఎంపీ 2047 సబ్ కమిటీలు సమావేశమైనట్లు వివరించారు. 2030, 2037, 2047 మైలురాళ్లను లక్ష్యంగా పెట్టుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ఏడు సబ్–కమిటీలు ఏర్పాటైనట్లు చెప్పారు. వీటిలో ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా రంగం నుంచి నిపుణులు ఉన్నారన్నారు. -
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 310 సీసీలో 2025 వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సరికొత్త అప్డేట్లతో వచ్చిన ఈ బైక్ బేసిక్ మోడల్ ధర రూ.2.39 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.57 లక్షలుగా ఉంది. ఓబీడీ2బీ నిబంధనలకు లోబడి పనిచేసే 312.12 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఇందులో ఉంది.ఇది 9700 ఆర్పీఎమ్ వద్ద 35.6 పీఎస్ శక్తిని, 6,650 ఆర్పీఎమ్ వద్ద 28.7 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ట్రాన్స్పేరెంట్ క్లచ్ కవర్, క్రూయిజ్ కంట్రోల్, అయిదు అంగుళాల టీఎఫ్టీ జెన్–2 కనెక్టెడ్ క్లస్టర్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ తదితర ఫీచర్లున్నాయి. ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా‘టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 అరంగేట్రం నాటి నుంచే నేకెడ్ స్పోర్ట్స్ విభాగంలో ట్రెండ్సెట్టర్గా నిలిచింది. 2025 ఎడిషన్లో అత్యాధునిక సాంకేతిక, డిజిటల్ ఇంటర్ఫేస్లు, స్టయిలిష్తో పాటు రైడర్ భద్రతను మరింత మెరుగుపరిచాము’ అని టీవీఎస్ మోటార్ బిజినెస్ హెడ్(ప్రీమియం విభాగం) విమల్ సుంబ్లే అన్నారు. -
ఈ–కార్ట్స్ వ్యాపారంలోకి కైనెటిక్ గ్రీన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్ గ్రీన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్స్టయిల్స్ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకోసం ఏర్పాటు చేసే కైనెటిక్ గ్రీన్ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్) జాయింట్ వెంచర్ సంస్థలో కైనెటిక్ గ్రీన్కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్ వెంచర్ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, ఎయిర్పోర్టుల్లో ఎలక్ట్రిక్ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. -
భారత్లో ఒకటొస్తే.. యూఎస్లో రెండొస్తాయ్..
టెస్లా కొత్త మోడల్ వై ఈవీని ఇటీవలే భారత్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ.61 లక్షలుగా నిర్ణయించింది. టెస్లా వ్యాపారం సాగిస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో ధరలు అధికంగా ఉన్నాయనే వాదనలున్నాయి. అయితే అందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్స్లు, కంపెనీ మార్జిన్లు, ఉత్పత్తి వ్యయం అంతా తోడైందని నిపుణులు చెబుతున్నారు.ఆటోమొబైల్ విశ్లేషకులు సంజయ్ లింక్డ్ఇన్ పోస్ట్లో తెలిపిన వివరాల ప్రకారం..‘టెస్లా మీ నిజమైన కొనుగోలు కారు కాదు. ఇది ఒక టాక్స్ స్లిప్. ఇదే మోడల్ వై అమెరికాలో దాదాపు రూ.32 లక్షలకు అమ్ముడవుతుండగా, భారతీయ కొనుగోలుదారులు దాదాపు రెట్టింపు వెచ్చిస్తున్నారు. అందులో 28% జీఎస్టీ, లార్జ్ వాహనాలకు 22% పరిహార సెస్, 10% రహదారి పన్ను, బీమాపై 18% జీఎస్టీ, దిగుమతి సుంకాలు, షిప్పింగ్, రిజిస్ట్రేషన్ ఫీజులున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఎరువుల కోసం రైతన్న పడిగాపులుముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా తన మొదటి షోరూమ్ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. భారత్ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు భవిష్యత్తులో మరింత మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్లో ఫోన్ కాల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. -
మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్..
మారుతీ సుజుకీ ఎర్టిగా, బాలెనో కార్ల ధరలు పెంచింది. ఈ మోడళ్లలో స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగులు అందిస్తున్న కారణంగా వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎర్టిగా ఎక్స్షోరూమ్ ధర 1.4% మేర పెరగ్గా.. బాలెనో ధర 0.5% పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. జులై 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనో ధర రూ.6.7 లక్షలు – రూ.9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.25 లక్షల వరకు ఉంది.ఇదీ చదవండి: ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడిధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి ముడి పదార్థాలు సంవత్సర ప్రాతిపదికన గణనీయమైన పెరుగుదలను చూశాయి. అల్యూమినియం 10.6%, రబ్బరు దాదాపు 27% పెరిగింది. ఇవి నేరుగా తయారీ వ్యయాలను పెంచుతాయి.యూఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి.భారత్ స్టేజ్ 7 ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహన తయారీదారులు శుభ్రమైన సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి.ఆపరేషనల్ & లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇంధనం, రవాణా, గిడ్డంగుల ఛార్జీలు పెరిగాయి.స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు పెరిగాయి. ఇది మార్జిన్లపై ప్రభావం చూపింది. -
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
72 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఇచ్చి భారీ జీతం పొందిన అండర్ గ్రాడ్యుయేట్గా వార్తల్లో నిలిపింది. సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో రోబొటిక్స్ అండ్ ఆటోమేషన్ చదువుతున్న రితుపర్ణ గతంలో చేసిన ప్లేస్మెంట్ ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో ఇంత భారీ అవకాశాన్ని పొందగలిగింది. ఈ కాలపు యువతకు స్ఫూర్తిని ఇవ్వదగ్గ రితుపర్ణ పరిచయం...రితుపర్ణ కథ అచ్చు సినిమా కథలాగే మలుపులతో ఉంటుంది. సామాన్యమైన అమ్మాయని అందరూ అంచనా వేస్తే అసామాన్యురాలిగా కనిపించి, నిరూపించి నివ్వెర పరిచింది. అర్హతలున్నాయా అని ప్రశ్నించిన చోటే ఆశ్చర్య పోయే అంగీకారం పొందింది. మరి ప్రఖ్యాత రోల్స్ రాయిస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.73.3 లక్షల ప్రీ–ప్లేస్మెంట్ ఆఫర్ పొందడం అంటే మాటలా? దేశంలో ఈ అవకాశాన్ని పొందిన అతి కొద్దిమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరు కె.ఎస్. రితుపర్ణ.డాక్టర్ కాబోయి...కర్నాటకలోని తీర్థహళ్లి తాలూకా కోడూరుకు చెందిన కె.ఎన్.సరేష్, గీత దంపతుల కుమార్తె రితుపర్ణ. ఆమె చెల్లెలు రిత్విక. రితుపర్ణ పీయూసీ పూర్తి చేసిన తర్వాత మెడిసిన్ చదవాలని అనుకుంది. ఆ తర్వాత యూపీఎస్సీ రాసి సివిల్ సర్వీసెస్లో చేరాలన్నది ఆమె కల. ఇందుకోసం 2002లో నీట్ రాసింది. అయితే ఆమెకు ప్రభుత్వ సీటు రాలేదు. ప్రైవేటులో చదివేంత స్థోమత లేదు. ఆ సమయంలో ఇంజినీరింగ్లో చేరమని ఆమె తండ్రి సలహా ఇచ్చారు. ఇంజినీరింగ్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని సలహా ఇచ్చారు. అలా సీఈటీ కౌన్సెలింగ్లో ప్రభుత్వ సీటు సం పాదించి సహ్యాద్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్లో చేరింది రితుపర్ణ. మొదట్లో బి.టెక్ పట్ల అంత ఆసక్తి చూపక పోయినా రాను రాను ఆసక్తి పెంచుకొని ఉన్నతి సాధించింది. రోబొటిక్స్ కోర్సు ఆసక్తికరంగా అనిపించి కొత్తగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం ఆమెకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె ఆవిష్కరణదేశానికి వెన్నెముకగా నిలిచే రైతు వ్యవసాయంలో ఇంకా శ్రమపడుతూ ఉన్నాడు. అతని శ్రమను తగ్గించే క్రమంలో ఏదైనా కొత్తగా కనుక్కుంటే బాగుంటుందని ఆమె భావించింది. ప్రధానంగా వక్కలు పండించడం చాలా శ్రమతో కూడుకున్న పని అని ఆమె గమనించింది. ఆ శ్రమను తగ్గించేందుకు తన బృందంతో కలిసి రోబోటిక్ హార్వెస్టర్ స్ప్రేయర్ మోడల్ను అభివృద్ధి చేసింది. ఈ ఆవిష్కరణ గోవా ఐనెక్స్ పోటీలో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది. ఇది ఆమె తొలి విజయం. తరువాత ఎన్ఐటీకే సూరత్కల్లోని పరిశోధనా బృందంలో రితుపర్ణ చేరింది. అక్కడ ఆమె ప్రాజెక్టులు ప్రయోగశాలకే పరిమితం కాలేదు. డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ను కలిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఒక యాప్ అభివృద్ధికి కృషి చేసింది. అందరూ తన ప్రతిభను మెచ్చుకుంటున్నా రితుపర్ణ దృష్టి మాత్రం అంతర్జాతీయ గుర్తింపుపైనే ఉంది. ఇదీ చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!రోల్స్ రాయిస్ సందేహంతన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఇంటర్న్షిప్ కోరుతూ రోల్స్ రాయిస్ను సంప్రదించింది రితుపర్ణ. అయితే అక్కడి నుంచి ఆమెకు విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘మీరు మా సంస్థలో భాగం కావడానికి అర్హతలున్నాయా?‘ అని మొదలుపెట్టి, ‘ఒక నెలలో మేం చెప్పే పనుల్లో ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేరని‘ అని వాళ్లు సమాధానం ఇచ్చారు. దీంతో కంపెనీ తన అర్హతను ప్రశ్నిస్తోందని ఆమె అర్థం చేసుకుంది. అయినా నిరుత్సాహపడకుండా ధైర్యంగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం కోరింది. కంపెనీ అంగీకరించి ఒక నెల గడువు తో కూడిన పనిని అప్పగించింది. దీక్ష, పట్టుదల, సంకల్పంతో నెల రోజుల గడువున్న ఆ పనిని ఆమె వారంలోనే పూర్తి చేసింది. ఆమె వేగం, కచ్చితత్వం, పట్టుదలకు రోల్స్ రాయిస్ యాజమాన్యం ఆశ్చర్య పోయింది. ఆమెపై నమ్మకంతో మరిన్ని పనులు అప్పగించారు. అలా ఎనిమిది నెలల పాటు ఒక పక్క కళాశాలకు వెళ్తూనే మరోవైపు వారిచ్చిన పనులన్నీ సకాలంలో పూర్తిచేసింది. గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ ఆమెకు వారి జెట్ ఇంజిన్ తయారీ విభాగంలో ప్రీ–ప్లేస్మెంట్ అవకాశాన్ని అందించింది. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ కంపెనీలో పనిచేస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి వచ్చేది రితుపర్ణ. ఆమె పనితీరు గమనించి తన ప్రారంభ ప్యాకేజీని సంవత్సరానికి రూ.39.6 లక్షల నుండి రూ.72.3 లక్షలకు పెంచింది కంపెనీ. ఏడో సెమిస్టర్ పూర్తి చేసిన తర్వాత, రితుపర్ణ అధికారికంగా అమెరికాలోని టెక్సాస్ యూనిట్లో చేరనుంది. ‘ఈ విజయం మీకెలా ఉంది’ అని రితుపర్ణని అడిగితే, ‘ప్రముఖ సంస్థలు కేవలం పట్టణం, నగరంలో చదివే విద్యార్థులకు మాత్రమే అవకాశాలు ఇస్తాయని చాలామంది అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించడం ఆనందంగా ఉందని’ పేర్కొంది. ప్రభుత్వ సీటు పొందిన స్థాయి నుండి రోల్స్ రాయిస్లో ఉద్యోగిగా ఎదగడం వరకూ ప్రోత్సహించిన తన అమ్మానాన్నలు, కుటుంబసభ్యులు, అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపింది. -
మేడిన్ ఇండియా ‘కియా క్యారెన్స్ క్లావిస్’
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ కియా ఇండియా, దేశీయంగా తయారు చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం క్యారెన్స్ క్లావిస్ ఈవీని ఆవిష్కరించింది. ఇది 404 కి.మీ., 490 కి.మీ. రేంజిని ఇచ్చేలా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలుగా ఉంటుంది.ఫాస్ట్ చార్జర్తో 39 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుందని కియా ఇండియా ఎండీ గ్వాంగూ లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లోని ప్లాంటులో కియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రస్తుతం ఈవీ6, ఈవీ9 పేరిట రెండు ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుని, విక్రయిస్తోంది. -
విదేశీ విస్తరణలో హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ మార్కెట్లలోకి అడుగు పెట్టే ప్రణాళికల్లో ఉంది. 2024–25 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కంపెనీ చైర్మన్ పవన్ ముంజాల్ ఈ విషయాలు తెలిపారు.హీరో ఫర్ స్టార్టప్స్ తదితర సొంత వేదికల ద్వారా కొత్త తరం ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కొత్త ఉత్పత్తులు, సేవలపై పరిశోధనలు సాగించేందుకు, వాటిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాసియా నుంచి లాటిన్ అమెరికా వరకు అంతర్జాతీయ మార్కెట్లలో 2024–25లో 43 శాతం వార్షిక వృద్ధి సాధించినట్లు ముంజాల్ వివరించారు. రిటైల్లో వ్యూహాత్మక విస్తరణతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలు 200 శాతం పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుఇక లిస్టెడ్ కంపెనీ ఏథర్ ఎనర్జీతో భాగస్వామ్యం కట్టడమనేది దేశీయంగా ఈవీ చార్జింగ్ నెట్వర్క్ను, ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. అటు అమెరికన్ సంస్థ జీరో మోటర్సైకిల్స్తో భాగస్వామ్యం ద్వారా సరికొత్త ప్రీమియం మోటర్సైకిల్ వస్తోందని చెప్పారు. యూలర్ మోటర్స్లో రూ.510 కోట్ల పెట్టుబడి పెట్టడమనేది అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సెగ్మెంట్లో తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
భారత్లో టెస్లా ప్రవేశం.. మొదటి షోరూమ్ ఓపెన్
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో ఎలాన్మస్క్కు చెందిన టెస్లా తన మొదటి షోరూమ్ను మంగళవారం ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం టెస్లా భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్లా భారత్లోనూ తయారీ ప్లాంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.‘టెస్లా తన వ్యాపార విస్తరణ కోసం సరైన నగరాన్ని ఎంచుకుంది. మహారాష్ట్ర భారతదేశానికి వ్యవస్థాపక రాజధానిగా కొనసాగుతోంది. 2015లో యూఎస్ పర్యటనలో భాగంగా టెస్లాలో మొదటగా ప్రయాణించాను. ఇండియాలోనూ ఇలాంటి కార్లు రావాలని భావించాను. పదేళ్ల తర్వాత అది ఇప్పుడు సాధ్యమైంది’ అని ఫడ్నవీస్ అన్నారు.ఇదీ చదవండి: మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణంకంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల ధరలను కూడా ఈ సందర్భంగా వెల్లడించింది. మోడల్ వై ఆన్-రోడ్ ధర రూ.61 లక్షలుగా తెలిపింది. రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ధర రూ.59.89 లక్షలుగా ఉందని చెప్పింది. భారత్ ఇప్పటికే ప్రకటించిన ఈవీ పాలసీ ప్రకారం దిగుమతి సుంకాల తగ్గింపు, ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి టెస్లాకు మరింత మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వ్యక్తిగతంగా సమావేశం అయ్యారు. అనంతరం మోదీ, ఎలాన్ మస్క్ ఏప్రిల్లో ఫోన్ కాల్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. -
అమెజాన్లో కొత్త ఈవీ విక్రయం
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా తమ రోర్ ఈజెడ్ మోటర్సైకిల్ను ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కూడా అందుబాటులోకి తెచ్చింది. దీన్ని అమెజాన్లో విక్రయిస్తున్నట్లు సంస్థ వివరించింది. ఈ వాహనం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ధర రూ.1,19,999 నుంచి ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఫీచర్లు ఇవే..గరిష్టంగా గంటకు 95 కి.మీ. వేగంఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 175 కి.మీ. రేంజిఫాస్ట్ చార్జింగ్ సదుపాయంరెట్టింపు బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు రోర్ ఈజెడ్లో ఉన్నాయి.ఎలెక్ట్రో యాంబర్, ల్యూమినా గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుంది.రూ.9,999కి ఎనిమిదేళ్లు లేదా 80,000 కి.మీ. వరకు బ్యాటరీపై వారంటీ ఇస్తున్నట్లు సంస్థ ఫౌండర్ మధుమిత అగర్వాల్ తెలిపారు.