breaking news
Automobile
-
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన సైబర్ ట్రక్ ఎలక్ట్రిక్ కార్లకు రీకాల్ ప్రకటించినట్లు ప్రకటించింది. ఈ ప్రభావం 63,619 వాహనాలను ప్రభావితం చేస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ లైట్లను చాలా ప్రకాశవంతంగా చేసే సాఫ్ట్వేర్ సమస్య కారణంగానే ఈ రీకాల్ ప్రకటించడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సమస్య ఎదురుగా వచ్చే డ్రైవర్ల దృష్టిని దెబ్బతీసే అవకాశం ఉంది.2023 నవంబర్ 13 నుంచి 2025 అక్టోబర్ 11 మధ్య తయారైన సైబర్ ట్రక్కులలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్లలోని సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సమస్యను పరిష్కరించవచ్చని టెస్లా వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక టెస్టులో ఈ సమస్య బయటపడినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు టెస్లా సైబర్ ట్రక్ వినియోగదారుల నుంచి.. ఈ సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందలేదని టెస్లా పేర్కొంది.ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకిటెస్లా తన సైబర్ ట్రక్ కార్లకు రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2025లో కూడా 46,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. ఇప్పుడు మరోమారు.. సాఫ్ట్వేర్ సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది. -
100 దేశాలు.. లక్ష యూనిట్లు!: జిమ్నీ అరుదైన రికార్డ్
పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ 30 రోజుల్లో లక్ష కార్లను విక్రయించి రికార్డ్ సృష్టించగా.. మారుతి సుజుకి కంపెనీకి చెందిన జిమ్నీ 5 డోర్ మోడల్.. లాంచ్ అయినప్పటి నుంచి లక్ష యూనిట్ల మైలురాయిని ఛేదించింది.భారతదేశంలో తయారైన మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ ఎస్యూవీ.. 100 దేశాలకు ఎగుమతి అవుతోంది. 2023 నుంచి ఈ కారు జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చిలీ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతూ ఉంది. అంతే కాకుండా.. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్ మార్కెట్లో జిమ్నీ నోమేడ్ పేరుతో లాంచ్ అయింది. ఇది అక్కడ కూడా ఉత్తమ అమ్మకాలు పొందుతూ.. 50వేలకంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను ఛేదించింది. ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ తర్వాత జిమ్నీ 5-డోర్ ఇప్పుడు మారుతి సుజుకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న రెండవ వాహనంగా మారింది.మారుతి సుజుకి జిమ్నీ.. ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడి.. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.ఇదీ చదవండి: పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారుమారుతి సుజుకి మొత్తం మీద 16 కార్లను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇందులో జిమ్నీ మోడల్ ఎక్కువ మంది ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎగుమతులు, అంతకుముందు ఏడాదితో పిలిస్తే కొంత ఎక్కువే అని తెలుస్తోంది. -
30 రోజుల్లో లక్ష కార్లు.. టాటా ‘పండుగ’ రికార్డ్
పండుగల సందడి టాటా మోటార్స్కు బంపర్ సేల్ని తీసుకువచ్చింది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల విభాగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఇటీవల ముగిసిన పండుగ సీజన్ సందర్భంగా కంపెనీ ఒక్క నెలలో లక్ష యూనిట్ల విక్రయాలు సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది.నవరాత్రులు నుంచి దీపావళి వరకు అంటే సుమారు 30 రోజుల కాలంలో 1 లక్షకు పైగా ప్యాసింజర్ వాహనాలను డెలివరీ చేశామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. ఈ గణాంకాలు గతేడాది ఇదే పండుగ సీజన్తో పోలిస్తే 33 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.ఎస్యూవీలకే ఎక్కువ డిమాండ్పండుగ సీజన్లో ఎస్యూవీల పట్ల వినియోగదారుల ఆకర్షణ మరింత పెరిగింది. టాటా మోటార్స్ విక్రయించిన వాహనాల్లో అత్యధికంగా ఎస్యూవీలే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.నెక్సాన్ విక్రయాలు 73 శాతం పెరిగి సుమారు 38,000 యూనిట్ల వరకు చేరుకున్నాయి. పంచ్ ఎస్యూవీలు 29 శాతం వృద్ధితో సుమారు 32,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఈవీ విభాగంలోనూ పురోగతిపర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారులు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ఎంపిక చేస్తున్నారు. కంపెనీ ఈవీ పోర్ట్ఫోలియోలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ సీజన్లో 37 శాతం వృద్ధితో 10,000కు పైగా ఈవీ వాహనాలు డెలివరీ చేసినట్టు శైలేష్ చంద్ర తెలిపారు. -
మొన్న జెడ్900.. ఇప్పుడు వెర్సిస్ 1100: కవాసకి కొత్త బైక్
జపనీస్ వాహన తయారీదారు.. కవాసకి ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసిన తరువాత, 2026 వెర్షన్ వెర్సిస్ 1100 లాంచ్ చేసింది. దీని ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారతదేశంలో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది.2026 వెర్షన్ వెర్సిస్ 1100 డిజైన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు కనిపించినప్పటికీ.. పనితీరు పెరిగిందని తెలుస్తోంది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువే. కాబట్టి పనితీరు మెరుగ్గా ఉంటుంది.2026 కవాసకి వెర్సిస్ 1100 బైకులో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్, కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (KIBS) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి.. లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా? -
పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు
పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లకు గుడ్బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్యేర్ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు. ప్రముఖ డచ్ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం, ముందువైపు మొత్తం సోలార్ ప్యానెల్స్తో కప్పబడి ఉంటుంది. కారు డిజైన్కు ఇది ఏ మాత్రం ఆటంకం కలిగించదు. పైగా, దీన్ని గాలి ఒరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణాలతో డిజైన్ చేశారు. ఫలితంగా, సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తుంది.ఒక్క సూర్యోదయంతో దాదాపు డైబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేస్తే, ఏకంగా ఏడువందల కిలోమీటర్లు వెళ్లగలదు. అంటే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురుచూసే రోజులు ఇక పోతాయి. గ్రామాలు, ఇంధన సమస్యలున్న ప్రాంతాలకు ఇది నిజమైన ‘సూపర్ హీరో’ కారు. ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు కాని, భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తున్నారు.ఇదీ చదవండి: దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా -
దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' పాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పాస్ను ఇష్టమైనవారికి గిఫ్ట్గా ఇవ్వొచ్చని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్ప్రెస్వేలలో ఏడాది పొడవునా ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.గిఫ్ట్గా ఎలా ఇవ్వాలి?రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ను గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఈ యాప్లోని 'యాడ్ పాస్' ఆప్షన్ మీద క్లిక్ చేసి, వినియోగదారుడు ఎవరికైతే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో.. వారి వెనికల్ నంబర్ & ఇతర వివరాలను ఫిల్ చేసిన తరువాత.. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవద్దు. ఇలా చేసిన తరువాత యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కాగా దీనిని ప్రారంభించిన రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో.. 25 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని దాటింది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాజాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.This Diwali, gift your loved ones #FASTagbasedAnnualPass — a thoughtful gesture ensuring seamless travel and hassle-free toll payments all year round.Read more: https://t.co/WULEWyNDMG Let’s make every journey bright and safe. ✨#NHAI #FASTag #Diwali2025 pic.twitter.com/1dyiHPVj7B— NHAI (@NHAI_Official) October 18, 2025 -
దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా
టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్ను పొందుతుంది.కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్లో.. బంపర్కు మరింత దూకుడుగా ఉండే లుక్ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్ని తెచ్చే సైడ్ స్కర్ట్లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాహైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా
భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. అయితే మోటార్స్పోర్ట్ రంగం మాత్రం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీనిని అభివృద్ధి చేయాలంటే.. తగిన ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయాలని, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) అన్నారు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఈ విభాగం అంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు.ఒక సమావేశంలో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, మీరు మోటార్స్పోర్ట్లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటే, దానికి తగిన పర్యావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు, భారతదేశంలో క్రికెట్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. కొందరు గల్లీలలో క్రికెట్ ఆడతారు. అలా క్రికెట్ మన జీవన శైలిలో భాగమైపోయింది. క్రికెట్ మాదిరిగా.. మోటార్స్పోర్ట్ కోసం ప్రాక్టీస్ లేదు. ప్రస్తుతం మనకు భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే మోటార్స్పోర్ట్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఈ సంఖ్య యూకేలో 70,000 ఉందని ఆయన అన్నారు.కార్టింగ్ లీగ్లు, పబ్లిక్ ట్రాక్లు.. పాఠశాల స్థాయి నుంచి అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో (మోటార్స్పోర్ట్) అభివృద్ధి ఆగిపోతోంది. నారాయణ్ కార్తికేయన్, జెహాన్ దారువాలా, కుష్ మైనీ.. చిన్న వయస్సు నుండే రేసింగ్లో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ సింఘానియా ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు. ఈయన చాలా సందర్భాల్లో రేసింగ్లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని అవెంటడోర్ SVJ, ఫెరారీ 458 ఇటాలియా, మరియు మెక్లారెన్ 720ఎస్ వంటి రేసింగ్ కార్లు ఉన్నాయి. ఆయన ఇటీవలే వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ (WMSC)కు భారతదేశ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఈ హోదాలో పనిచేస్తున్నారు. -
ఐడియా అదిరింది.. డబ్బు మిగిలింది!
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదాజైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్తో JCBలను పొందారని వెల్లడించారు.చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు! -
టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ మోటార్ ఇండియన్ మార్కెట్లో.. 'అపాచీ ఆర్టీఎక్స్ 300' పేరుతో సరికొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పుడున్న టీవీఎస్ బైకుల కంటే ఇది కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు.అపాచీ ఆర్టీఎక్స్ 300.. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ & అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్ రియర్ సీటు, అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రంగులలో అందుబాటులో ఉంది.ఆర్టీఎక్స్ 300 బైక్.. టీఎఫ్టీ డిస్ప్లే పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్లకు కావలసిన సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 35.5 హార్స్ పవర్, 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!
భారతదేశంలో కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి. కాగా ఇప్పుడు కొన్ని వాహన తయారీ సంస్థలు కొన్ని ఎంపిక చేసిన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్) చాలా వరకు తగ్గుతాయి. ఈ కథనంలో ఏ మోడల్పై ఎంత రేటు తగ్గిందనే విషయాలను చూసేద్దాం.మోడల్ వారీగా తగ్గిన ధరలు➤కియా సోనెట్: రూ. 1.02 లక్షలు➤మారుతి బాలెనొ: రూ. 1.05 లక్షలు➤హోండా సిటీ: రూ. 1.27 లక్షలు➤మారుతి ఇన్విక్టో: రూ. 1.40 లక్షలు➤కియా కారెన్స్ క్లావిస్: రూ. 1.41 లక్షలు➤కియా సెల్టోస్: రూ. 1.47 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ వర్టస్: రూ. 1.50 లక్షలు➤హోండా ఎలివేట్: రూ. 1.51 లక్షలు➤కియా సిరోస్: రూ. 1.6 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 1.80 లక్షలు➤మారుతి గ్రాండ్ విటారా: రూ. 1.80 లక్షలు➤స్కోడా స్లావియా: రూ. 2.25 లక్షలు➤మహీంద్రా XUV400: రూ. 2.50 లక్షలు➤స్కోడా కుషాక్: రూ. 2.50 లక్షలు➤మహీంద్రా మరాజో: రూ. 3 లక్షలుఇదీ చదవండి: ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!వాహన తయారీ సంస్థలు ప్రకటించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో కారు కొనాలనుకునే కస్టమర్లు.. తగ్గింపులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఈ తగ్గింపులు బహుశా.. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. -
ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ 'అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్'.. F77 పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో తన బైకులను లాంచ్ చేసింది.అల్ట్రావయోలెట్ బైకులు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్తో సహా అనేక యూరోపియన్ మార్కెట్లలో విజయవంతమైన అమ్ముఅడవుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ను ప్రదర్శించడం.. యూరప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం 12 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.అల్ట్రావయోలెట్ F77 MACH 2 & F77 సూపర్స్ట్రీట్అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ లాంచ్ చేసిన F77 MACH 2 అనేది ప్రత్యేకంగా రైడింగ్ చేసేవారికోసం రూపొందించగా.. ఎఫ్77 సూపర్స్ట్రీట్ రోజువారీ నియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!ఇవి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 40 హార్స్ పవర్, 100 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 155 కిమీ/గం వేగంతో వెళ్లే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రీజనరేవటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
వాహన టోకు విక్రయాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: జీఎస్టీ సంస్కరణ, పండుగ సీజన్ కలిసిరావడంతో తయారీదార్ల నుంచి డీలర్లకు ప్యాసింజర్ వాహనాలు, ద్వి చక్రవాహనాల సరఫరా గణనీయంగా పెరిగాయి. పెరిగిన టోకు విక్రయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ముగించవచ్చనే ఆశాభావంతో వాహన పరిశ్రమ ఉన్నట్లు సియామ్ పేర్కొంది. ‘‘కొత్త జీఎస్టీ ధరలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినప్పట్టకీ.., కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలు గతంలో ఎన్నడూ లేనంతగా సెపె్టంబర్లో అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమల్లోకి తీసుకురావడమనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆటో పరిశ్రమలో కాకుండా, మొత్తం ఆర్థికవ్యవస్థలో చైతన్యం తీసుకొస్తుంది’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. → కంపెనీలు సెపె్టంబర్లో డీలర్లకు 3,72,458 ప్యాసింజర్ వాహనాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే నెలలో పంపిణీ 3,56,752 యూనిట్లతో పోలిస్తే ఇవి 4% అధికం. → ద్వి చక్రవాహన విక్రయాలు 7% వృద్ధి చెంది 21,60,889 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,25,993 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. → త్రీ చక్రవాహన టోకు అమ్మకాలు 79,683 నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన.... వార్షిక ప్రాతిపదికన క్యూ2లో 10.39 లక్షల పీవీ అమ్మకాలు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్ విక్రయాలు 7% వృద్ధి చెంది 55.62 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రి చక్రవాహన విక్రయాలు 10% వృద్ది చెంది 2,29,239 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సెప్టెంబÆ Š‡ త్రైమాసికంలో 2.4 లక్షల వాణిజ్య వాహన విక్రయాలు జరిగాయి. -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా: ఇవి కీలకం..
ఢిల్లీ వంటి మహా నగరాల్లో కాలుష్యం అధికమవడంతో పదిహేనేళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి విక్రయాలకు అక్కడ ప్రత్యేక మార్కెట్లు ఉంటాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు వ్యాపారులు తక్కువ ధరకు వాటిని అక్కడ కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లంటూ విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో రకరకాల పేర్లతో సుమారు 20 వరకు పాత కార్ల దుకాణాలు ఉన్నాయి. ఏటా సుమారు 1,500 నుంచి 2వేల లోపు కార్లు విక్రయాలు సాగుతున్నాయి. ఇవి కాక తెలిసిన వారు, మధ్యవర్తుల సహకారంతో తెచ్చుకునేవి మరో 1,000 వరకు ఉంటాయని తెలుస్తోంది.ధ్రువీకరణ పత్రాలు కీలకం..వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్సీ, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్ఓసీ పొందిన 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహన కాల పరిమితి 15 ఏళ్లు, మోడల్, కంపెనీ(ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. ఇంజిన్ ఆన్ చేసే సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా లీకైనా, పొగవచ్చినా ప్రమాదమని గుర్తించాలి. గేర్ ఇంజిన్ సరి చూసుకోవాలి. టైర్లు సరిగా లేకపోతే మైలేజీ తగ్గుతుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!వాహనాన్ని పసిగట్టొచ్చిలా..వాహన అద్దాల చివర కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి లేకపోతే మార్చారని గ్రహించాలి. డోర్ బాటమ్ ప్రాంతంలో రబ్బర్లు తీసి వాటిపై గుండీల ఆకారంలో అచ్చులుంటే ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. కాళ్ల కింద డిక్కీ ప్రాంతంలో మ్యాట్లు ఎత్తి కింది వైపు దెబ్బతిందో లేదో చూసుకోవాలి. ప్రమాదం జరిగిన వాహనాలకు రంగులు వేసి బఫింగ్ చేస్తే పోల్చుకోవడం కష్టమవుతుంది. -
1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!
ట్రయంఫ్ మోటార్సైకిల్ కంపెనీ.. స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైకును లాంచ్ చేసింది. దీని ధర రూ. 23.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1200 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీనిని 1200 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే భారతదేశానికి ఎన్ని యూనిట్లను కేటాయించిందో వెల్లడించలేదు.ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించబడిన స్పీడ్ ట్రిపుల్ 1200 RX.. ఇప్పటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దీనిని స్పీడ్ ట్రిపుల్ 1200 RS ఆధారంగా రూపొందించారు. అయితే ఇది లేటెస్ట్ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది లేత పసుపు, నలుపు రంగుల కలయికతో చూడచక్కగా ఉంది.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైక్.. 1,163 సీసీ ఇన్లైన్ త్రీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 ఆర్పీఎం వద్ద 183 హార్స్ పవర్, 8750 ఆర్పీఎం వద్ద 128 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. -
4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్..
ఎంట్రీ లెవల్ కార్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో మారుతీ సుజుకీ గడిచిన 4 వారాల్లో 4 లక్షల బుకింగ్స్ సాధించింది. రికార్డు స్థాయిలో 2.5 లక్షల యూనిట్లను విక్రయించింది. ‘జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ తర్వాత కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడంతో ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన నెల రోజుల్లో మొత్తం 4 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. అంటే వారానికి ఒక లక్ష బుకింగ్స్. ఇదే సమయంలో 2.5 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీకిది అత్యుత్తమ పండుగ సీజన్గా నిలిచింది’ అని మారుతీ సుజుకీ సీనియర్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు.ముఖ్యంగా చిన్న కార్ల విభాగానికి చెందిన ఆల్టో, సెలెరియో, వేగనాన్, ఎస్–ప్రెస్సో మొత్తం 80,000 బుకింగ్లు నమోదయ్యాయని తెలిపారు. జీఎస్టీ 2.0 అమలు తర్వాత రేట్లు దిగిరావడంతో కంపెనీ మొత్తం అమ్మకాల్లో 16.7%గా ఉండే చిన్న కార్ల వాటా 21.5 శాతానికి పెరిగిందన్నారు. తొలిసారి కార్లను కొనేందుకు షోరూంను సందర్శిస్తున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండటంతో వినియోగ స్వభావం ద్విచక్ర వాహనాల నుంచి కార్లకు మారే స్వభావాన్ని సూచిస్తుందన్నారు.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
మరింత తగ్గిన ఈ కారు ధర: రూ.3.70 లక్షలు!
భారతదేశంలో ఎక్కువమంది మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణం మల్టిపుల్ మోడల్స్ ఉండటం, ధరలు కొంత తక్కువ కావడం. ఇందులో చెప్పుకోదగ్గ కారు.. దశాబ్దాల చరిత్ర కలిగిన మోడల్ మారుతి ఆల్టో కే10. జీఎస్టీ తగ్గింపు, పండుగ ఆఫర్స్ కలిసి రావడంతో దీని ధర ఇప్పుడు మరింత తగ్గిపోయింది.రూ. 4.23 లక్షల ధర వద్ద లభిస్తున్న మారుతి ఆల్టో కే10 బేస్ వేరియంట్ ఇప్పుడు రూ. 3.70 లక్షల ధరకే లభిస్తుంది. అంటే దీని ధర మునుపటి కంటే రూ. 53000 తక్కువ. టాప్ వేరియంట్ అయిన VXi Plus (O) AMT ధర ఇప్పుడు రూ. 64000 తగ్గి.. రూ. 5.45 లక్షలకు అందుబాటులో ఉంది. జీఎస్టీ 2.0 కంటే ముందు దీని ధర రూ. 6.09 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).ఇదీ చదవండి: ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రామారుతి ఆల్టో కే10 మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను.. కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత తగ్గించింది. ఈ కారు చూడటానికి పరిమాణంలో కొంత చిన్నగా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే.. ఈ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. -
ఇంటర్నేషనల్ సంస్థతో హీరోమోటోకార్ప్ జట్టు
అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా.. ఇటలీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ (Hero Motocorp) వెల్లడించింది. ఇందుకోసం స్థానిక పెల్పి ఇంటర్నేషనల్ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపింది. ప్రాథమికంగా కీలక నగరాల్లో 36 మంది డీలర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు, క్రమంగా ఈ సంఖ్యను 54కి పెంచుకోనున్నట్లు తెలిపింది.ముందుగా ఎక్స్పల్స్ 200 4వీ, ఎక్స్పల్స్ 200 4వీ ప్రో, హంక్ 440ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భాన్ తెలిపారు. తమకు అంతర్జాతీయంగా ఇది 49వ మార్కెట్ అని వివరించారు. ద్విచక్ర వాహనాల పంపిణీ, సేల్స్, సర్వీసెస్ వంటివాటికి సంబంధించి 160 మంది డీలర్లతో ఇటలీలో అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటిగా పెల్పి ఇంటర్నేషనల్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
అమెరికా, చైనా తరువాత భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ దినిదినాభివృద్ది చెందుతోంది. 2014లో రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2025 నాటికి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గ్రేడ్ సెపరేటర్, రోడ్ల విస్తరణ పనులు, కొత్త రోడ్డు ప్రాజెక్టుకు పునాది వేసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా ఇండియా అవతరించిందని అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం పరంగా అమెరికా, చైనా తర్వాత దేశం ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ఎగుమతి రంగానికి ఎంతో దోహదపడిందని గడ్కరీ స్పష్టం చేశారు.దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల కారణంగా డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.వివిధ స్థిరమైన పద్ధతులను అవలంబించడం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించామని, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యర్థాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసిందని అన్నారు.ఇదీ చదవండి: బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి -
ఇటలీ మార్కెట్లోకి హీరో మోటోకార్ప్
అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఇటలీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఇందుకోసం స్థానిక పెల్పి ఇంటర్నేషనల్ సంస్థతో జట్టు కట్టినట్లు తెలిపింది. ప్రాథమికంగా కీలక నగరాల్లో 36 మంది డీలర్లతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు, క్రమంగా ఈ సంఖ్యను 54కి పెంచుకోనున్నట్లు తెలిపింది.ముందుగా ఎక్స్పల్స్ 200 4వీ, ఎక్స్పల్స్ 200 4వీ ప్రో, హంక్ 440ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భాన్ తెలిపారు. తమకు అంతర్జాతీయంగా ఇది 49వ మార్కెట్ అని వివరించారు. ద్విచక్ర వాహనాల పంపిణీ, సేల్స్, సరీ్వస్కి సంబంధించి 160 మంది డీలర్లతో ఇటలీలో అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటిగా పెల్పి ఇంటర్నేషనల్ కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
చిన్న కారు.. పెద్ద డిస్కౌంట్!
2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో, మారుతి సుజుకి వేగన్ ఆర్.. టాటా పంచ్ వంటి పోటీదారులను అధిగమించి నాలుగో సారి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన కిరీటాన్ని నిలుపుకొంది. ఎస్యూవీలు డిమాండ్లో ఉన్నా, ఈ ప్రాక్టికల్ హ్యాచ్బ్యాక్ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటోంది.జీఎస్టీ 2.0 అమలుతో మారుతీ సుజుకీ ధరల నిర్మాణాన్ని మారుస్తూ వాగన్ ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది పండుగ సీజన్లో బడ్జెట్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. దీంతో ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నవారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.వాగన్ ఆర్ ధరల తగ్గింపులు1.0L LXI (మ్యాన్యువల్) – రూ.5,78,500 నుండి రూ.4,98,900 (రూ.79,600 తగ్గింపు)1.0L VXI (మ్యాన్యువల్) – రూ.6,23,500 నుండి రూ.5,51,900 ( రూ.71,600 తగ్గింపు)1.2L ZXI (మ్యాన్యువల్) – రూ.6,52,000 నుండి రూ.5,95,900 ( రూ.56,100 తగ్గింపు)1.2L ZXI+ (మ్యాన్యువల్)– రూ.6,99,500 నుండి రూ.6,38,900 (రూ.60,600 తగ్గింపు)1.0L VXI AMT – రూ.6,73,500 నుండి రూ.5,96,900 ( రూ.76,600 తగ్గింపు)1.2L ZXI AMT– రూ.7,02,000 నుండి రూ.6,40,900 (రూ.61,100 తగ్గింపు)1.2L ZXI+ AMT– రూ.7,49,500 నుండి రూ.6,83,900 ( రూ.65,600 తగ్గింపు)1.0L LXI CNG– రూ.6,68,500 నుండి రూ.5,88,900 ( రూ.79,600 తగ్గింపు)1.0L VXI CNG – రూ.7,13,500 నుండి రూ.6,41,900 ( రూ.71,600 తగ్గింపు)వాగన్ ఆర్ ప్రత్యేకతలు341 లీటర్ల బూట్ స్పేస్ (సెగ్మెంట్లో టాప్)1.0L (67 BHP), 1.2L (89 BHP) ఇంజిన్లుసీఎన్జీ మోడల్ – 32 km/kg మైలేజ్ప్రాక్టికల్ డిజైన్, సులభమైన ఎంట్రీ/ఎగ్జిట్ -
మారుతీ కారు ఓనర్లకు గుడ్న్యూస్..
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో అదనంగా 500 కొత్త సర్వీసు వర్క్షాప్లు ఏర్పాటు చేయనుంది. కోయంబత్తూర్లో తన 5,000వ అరీనా సర్వీసు టచ్పాయింట్ ప్రారంభించినట్లు తెలిపింది.‘‘భవిష్యత్తులోనూ మా నెట్వర్క్ను మరింత విస్తరిస్తాము. గత ఆర్థిక సంవత్సరంలో అరీనా, నెక్సా నెట్వర్క్ల కింద 460 సర్వీస్ టచ్పాయింట్లను ఏర్పాటు చేశాయి. 2025–26లో అదనంగా 500 సరీ్వసు వర్క్షాప్లను ప్రారంభించే యోచనలో ఉన్నాము’’ అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో హిసాషీ టకేయుచి తెలిపారు. కొత్త టచ్పాయింట్ల ఏర్పాటుతో మారుతీ సుజుకీ సరీ్వస్ నెట్వర్క్ 5,640కి చేరనుంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త!
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సొల్యూషన్స్ అందించే థండర్ప్లస్ తాజాగా వాహనాల దిగ్గజం టాటా మోటర్స్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో చిన్న వాణిజ్య వాహనాల చార్జింగ్ కోసం కొత్తగా 5,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను థండర్ప్లస్ ఇన్స్టాల్ చేయనుంది.వాణిజ్య వాహనాల పోర్ట్ఫోలియోను విద్యుదీకరించుకోవాలన్న టాటా మోటర్స్ ప్రయత్నాలకు ఇది సహాయకరంగా ఉండనుంది. నిరాటంకమైన, విశ్వసనీయమైన, విస్తరించతగిన విధంగా ఈవీ చార్జింగ్ స్టేషనలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని థండర్ప్లస్ సీఈవో రాజీవ్ వైఎస్ఆర్ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్కు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్యూవీలకు అప్గ్రేడ్ కావాలనుకునే కస్టమర్లు తమ పంచ్ వాహనం వైపు మొగ్గు చూపే ధోరణి నెలకొందని టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో తమ మొత్తం అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో 21 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25 శాతం వాటా పంచ్దే ఉందని పేర్కొంది.హైదరాబాద్, విజయవాడలో ఈ ఎస్యూవీ విక్రయాలు రెండింతలు పెరిగాయని కంపెనీ వివరించింది. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా టాటా మోటర్స్ విక్రయాల్లో పంచ్ వాటా 33 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. సెప్టెంబర్లో దేశీయంగా టాప్ 5 కార్లలో ఒకటిగా నిల్చిందని వివరించింది. -
కియా క్లావిస్ కొత్త వెర్షన్: ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) తాజాగా కారెన్స్ క్లావిస్ (Carens Clavis)లో కొత్త వెర్షన్ హెచ్టీఎక్స్ (ఓ)ని ప్రవేశపెట్టింది దీని ధర రూ. 19,26,717 (ఎక్స్ షోరూం)గా ఉంటుందని సంస్థ తెలిపింది.ఈ కొత్త వెర్షన్ కారులో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, డ్రైవ్ మోడ్ సెలెక్ట్, స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇది 6,7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే హెచ్టీకే ప్లస్, హెచ్టీకె ప్లస్ (ఓ)లో 6 సీటర్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అక్టోబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా తమ షోరూమ్లలో లభిస్తాయని పేర్కొంది. -
ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆటోమొబైల్ ఔత్సాహిలు. ఈ కారణంగానే పలు కార్లను వినియోగిస్తున్నారు. అయితే ఈయన ఉపయోగించే అన్ని కార్లు కూడా స్వదేశీ ఉత్పత్తులే. ముఖ్యంగా తనకు బొలెరో అంటే చాలా ఇష్టమని.. దీనిని ఆయన బ్లాక్ బీస్ట్ అని పిలుస్తారని గతంలో వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఓ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మా మొట్టమొదటి హార్డ్ టాప్ ఎస్యూవీ అయిన 'మహీంద్రా అర్మాడ' మొదటిసారి విడుదలైనప్పటి నుంచి.. నేను మరే ఇతర కార్ బ్రాండ్ను నడపలేదు. అర్మడకు ముందు, నా దగ్గర హిందూస్తాన్ మోటార్స్ కాంటెస్సా ఉండేది!. అయితే నేను ఇప్పుడు మహీంద్రా లేటెస్ట్ కారు ఎక్స్ఈవీ 9ఈను ఉపయోగిస్తున్నప్పటికీ.. నాకు బొలెరో అంటేనే ఇష్టం అని నిజాయితీగా చెప్పగలను అని ఆనంద్స్కార్పియో ప్రారంభించబడటానికి ముందే నేను "బ్లాక్ బీస్ట్" అనే మారుపేరుతో ఉన్న నా బొలెరోను స్వయంగా నడిపాను. ఇప్పుడు, బీస్ట్ తిరిగి వచ్చింది. ఇది సరికొత్త 2025 అవతార్లో ఉంది. వ్యాగన్ ఆర్ తరువాత.. 2000లో ప్రారంభించినప్పటి నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న పురాతన భారతీయ కార్ బ్రాండ్ బొలెరో. అది ఆల్టో కంటే కేవలం ఒక నెల ముందు వచ్చిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..కొన్నేళ్లుగా.. మహీంద్రా ఆటో బృందాలు బోలెరోను దశలవారీగా నిలిపేయాలని భావించప్పటికీ.. అది సాధ్యం కాలేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2025 బొలెరో మార్కెట్లో లాంచ్ అయిందని వెల్లడించారు.2025 మహీంద్రా బొలెరోమహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కొత్త బొలెరో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చిన్న కాస్మొటిక్ అప్డేట్లతో పాటు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో 5 3 ఇంజిన్ ఉంటుంది. ఇది 76 హార్స్ పవర్, 210 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది.Since the Mahindra Armada, our first hard-top SUV, first rolled out, I’ve never driven any other car brand.(Before the Armada, I had a Hindustan Motors Contessa!)And although today I use the XEV 9e, the most advanced vehicle Mahindra has ever built, I can honestly say that the… pic.twitter.com/K4Axlnmzi2— anand mahindra (@anandmahindra) October 11, 2025 -
కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..
ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ.. ఇటీవల టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా టెస్లా చేసిన ఒక ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది.''టెస్లా ప్రకటన చేయవలసిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో 45 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న రోహిత్ శర్మ (భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్) కొత్త టెస్లా మోడల్ వై కొనుగోలు చేశారు''. అనే పోస్టు టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించడంతో.. దానిని రీపోస్ట్ చేశారు. ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండటం చేత ఈ కారు గురించి అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.టెస్లా మోడల్ వై గురించిటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.This is why Tesla doesn’t need to advertise - Rohit Sharma (captain of India’s national cricket team), who has 45M followers on Instagram, just bought a new Tesla Model Ypic.twitter.com/m02awSltMR https://t.co/XQSLYyo4XZ— Teslaconomics (@Teslaconomics) October 9, 2025 -
లాంచ్కు ముందే అన్నీ కొనేశారు!
స్కోడా ఇండియా.. సరికొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octovia RS) కారును అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా దీనికోసం రూ. 2.50 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలుపెట్టింది. బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే.. దేశీయ విఫణికి కేటాయించిన అన్ని కార్లు అమ్ముడైపోయాయి.స్కోడా (Skoda) కంపెనీ తన ఆక్టావియా ఆర్ఎస్ కారును భారతదేశంలో 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే ఈ కొత్త కారును 100 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. బుకింగ్స్ ప్రారంభమైన తరువాత ఈ 100 యూనిట్లు అమ్ముడైపోయాయని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం. దీనిని సీబీయూ మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు.. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది 13 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదనపు అప్గ్రేడ్లను పొందుతుంది.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 261 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. -
విండ్సర్ ఇన్స్పైర్ ఎడిషన్: ధర ఎంతో తెలుసా?
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్)తో ఈ కారును ఎంచుకునేవారు.. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కావడంతో, కంపెనీ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్.. పెర్ల్ వైట్ అండ్ స్టార్రి బ్లాక్లను కలిగి ఉన్న డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్తో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లపై రోజ్ గోల్డ్ డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉన్న యాక్సెసరీ ప్యాక్తో కూడా లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇన్స్పైర్ ఎడిషన్ దాని థీమ్ను సాంగ్రియా రెడ్ అండ్ బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, హెడ్రెస్ట్లపై ఎంబ్రాయిడరీ ఇన్స్పైర్ లోగో వంటివి పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్ జాబితాలో.. స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ & వైర్లెస్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు ఉన్నాయ., వీటిని ఎంజీ డీలర్షిప్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్లో 38 కిలోవాట్ బ్యాటరీ, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ను పొందుతుంది. ఈ మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్ను అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఒక ఫుల్ ఛార్జ్పై 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిని డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. -
జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు
మారుతి సుజుకి త్వరలో జరగనున్న జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించబోయే.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ గురించి వెల్లడించింది. ఇది 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండింగ్కు మద్దతు ఇచ్చే ప్రస్తుత 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్వీక్డ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం. అయితే కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్ట్రెయిన్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు.జపాన్ మొబిలిటీ షోలో కనిపించనున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు డిజైన్ ముందు భాగంలో సుజుకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. అయితే సైడ్ ప్రొఫైల్ కొన్ని 'ఫ్లెక్స్-ఫ్యూయల్' డెకల్లను పొందుతుంది. టెయిల్గేట్పై ఫ్లెక్స్-ఫ్యూయల్ బ్యాడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది.జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకిజపాన్ మొబిలిటీ షో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటో షో. ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు ఒడైబాలోని టోక్యో బిగ్ సైట్లో జరుగుతుంది. ఇందులో సుజుకి రాబోయే ఈ-విటారా , ఫేస్లిఫ్టెడ్ ఎక్స్-బీ, జిమ్నీ నోమేడ్ (5-సీట్ల మేడ్-ఇన్-ఇండియా జిమ్నీ), స్పేసియా, విజన్ ఈ-స్కై బీఈవీ కాన్సెప్ట్ & ఈ-ఎవ్రీ కమర్షియల్ వ్యాన్ కాన్సెప్ట్లను కూడా ప్రదర్శించనుంది. ఈవేదికపైనే ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ను కూడా ప్రదర్శించనుంది. -
ఐదేళ్లలో అత్యధికం.. లాభాల్లో హోండా మోటార్సైకిల్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నికర లాభం గతేడాది (2024–25) 38 శాతం జంప్చేసి రూ. 3,727 కోట్లకు చేరింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం కాగా.. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది (2023–24)లో రూ. 2,705 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 39,238 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 31,945 కోట్ల టర్నోవర్ సాధించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. జపనీస్ ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్కు చెందిన దేశీ అనుబంధ అన్లిస్టెడ్ సంస్థ ఇది.ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ (ఎఫ్ఏడీఏ) వివరాల ప్రకారం.. గతేడాది రిటైల్గా 1,88,77,812 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. వీటిలో హోండా మోటార్సైకిల్ రిటైల్ అమ్మకాలు 47,89,283 యూనిట్లుగా నమోదయ్యాయి. వెరసి హీరో మోటోకార్ప్(54,45,251 యూనిట్లు) తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలిచింది. కాగా.. 2030కల్లా దేశీ ద్విచక్ర వాహన మార్కెట్లో 30 శాతం వాటాపై హోండా మోటార్సైకిల్ కన్నేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
వాహన అమ్మకాలకు పండుగ జోష్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి తిరుగులేని ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 34% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. సెప్టెంబర్ 22 వరకు మందకొడిగా సాగిన అమ్మకాలు, జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాక విక్రయాలు అనూహ్య రీతిలో పెరిగాయి. వెరసి సెప్టెంబర్లో అన్ని విభాగాలు కలిపి మొత్తం 18,27,337 వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెల 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5.22% అధికంగా ఉన్నాయి. నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల్లో వాహన విక్రయాలు 34% పెరిగి 11,56,935 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,63,327 వాహనాలు అమ్ముడయ్యాయి. ‘‘భారతీయ ఆటోమొబైల్ రిటైల్ పరిశ్రమకు 2025 సెపె్టంబర్ అత్యంత ప్రత్యేకమైన నెల నిలిచింది. కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని అంచనాలతో కస్టమర్లు మూడో వారం వరుకూ కొనుగోళ్ల జోలికెళ్లలేదు. అయితే సెపె్టంబర్ 22 తర్వాత జీఎస్టీ 2.0 రేట్లు అమల్లోకి రావడం, నవరాత్రి ఉత్సవాలు ఒకేసారి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని విభాగాల్లో విక్రయాలు, డెలివరీలు వేగంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు. విభాగాల వారీగా వృద్ధి ఇలా... → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది సెపె్టంబర్తో పోలిస్తే 2,82,945 యూనిట్ల నుంచి ఏకంగా 5.80% పెరిగి 2,99,396 కు చేరాయి. భారీ కొనుగోళ్లు, అందుబాటు ధరల కారణంగా నవరాత్రుల్లో 2,17,744 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నవరాత్రి విక్రయాలు 1,61,443తో పోలిస్తే ఇవి 35% అధికం. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 7% పెరిగాయి. ఈ సెపె్టంబర్లో మొత్తం 12,87,735 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 12,08,996 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగ ఆఫర్లు, డిమాండ్ పెరగడంతో నవరాత్రిలో అమ్మకాలు 36% పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. → త్రి చక్రవాహన రిటైల్ అమ్మకాలు 7% క్షీణించి 98,866కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సెపె్టంబర్ అమ్మకాలు 1,06,534 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నవరాత్రి అమ్మకాల్లో 25% వృద్ధి నమోదైంది. మొత్తం 46,204 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది దసరా సీజన్ విక్రయాలు 37,097గా ఉన్నాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు సెపె్టంబర్లో 70,254 యూనిట్ల నుంచి 3% పెరిగి 72,124 యూనిట్లకు చేరుకున్నాయి. రుణవితరణ పెరగడంతో నవరాత్రి అమ్మకాల్లో 15% వృద్ధి సాధించి మొత్తం 33,856 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సెపె్టంబర్లో ట్రాక్టర్ అమ్మకాలు 64,785 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క నవరాత్రుల్లోనే 21,604 ట్రాక్టర్ల విక్రయాలు జరిగాయి. అక్టోబర్ అమ్మకాలపై మరింత ఆశాభావం ‘‘జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచింది. సానుకూల వర్షాలు, బలమైన ఖరీఫ్ పంటలు గ్రామీణ ఆదాయాలను మెరుగుపరిచాయి. ధంతేరాస్, దీపావళి పండుగల సీజన్లో ఇదే సానుకూల వాతావరణం కొనసాగొచ్చు. తగ్గిన ధరలు, ఆకట్టుకునే ఆఫర్లు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. భారతీయ చరిత్రలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమ రిటైల్ సీజన్గా నిలిచే అవకాశం ఉంది’’ అని ఫాడా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈవీ కార్ల అమ్మకాలు రెండింతలు ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెపె్టంబర్లో 15,329 గా నమోదయ్యాయి. గతేడాది (2024) ఇదే నెలలో నమోదైన 6,191 ఈవీ కార్ల విక్రయాలతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు అధికమని వాహన డీలర్ల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఈవీ రేసులో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ఈవీ కార్ల అమ్మకాలు 62% వృద్ధి చెంది 3,833 నుంచి 6,216 కు చేరాయి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,912 ఈవీ కార్లను అమ్మింది. గతేడాది సెప్టెంబర్లో విక్రయించిన 1,021 యూనిట్లతో పోలిస్తే ఇవి మూడింతలు అధికం. మహీంద్రా అమ్మకాలు 475 యూనిట్ల నుంచి ఏకంగా 3,243కు చేరాయి. అలాగే బీవైడీ ఇండియా 547 యూనిట్లు, కియా ఇండియా 506 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 349 యూనిట్లు, బీఎండబ్ల్యూ ఇండియా 310 యూనిట్లు, మెర్సిడస్ బెంజ్ 97 యూనిట్లను విక్రయించాయి. ఇటీవల భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా సైతం 64 కార్లను విక్రయించింది. -
ఎస్యూవీ మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
నిస్సాన్ మోటార్ ఇండియా సీ-సెగ్మెంట్ ఎస్యూవీ (SUV) మార్కెట్లో కొత్త మోడల్ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిస్సాన్ టెక్టాన్(Nissan Tecton) పేరుతో త్వరలో కొత్త ఎస్యూవీని లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్ పేరు వెల్లడించడంతోపాటు దీని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ డిజైన్ టీజర్ను విడుదల చేసింది. డీలర్లకు ఇప్పటికే దీని వివరాలు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. 2026 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో ఈ మోడల్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.నిస్సాన్ టెక్టాన్ డిజైనింగ్ పరంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎస్యూవీ ఇంజిన్ పైభాగం బానెట్ వెడల్పుగా ఉండడంతోపాటు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL) సిగ్నేచర్ మధ్యలో నిస్సాన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ క్లస్టర్లు, ఫ్రంట్ బంపర్ డిజైన్తో కలిసి దీని ఎస్యూవీ ఆకర్షణను పెంచుతుందని తెలిపారు.వెనుక భాగంలో టెక్టాన్ ఇటీవలి నిస్సాన్ గ్లోబల్ మోడళ్ల మాదిరిగానే కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్స్ను కలిగి ఉంటుందని చెప్పింది. టెక్టాన్ అల్లాయ్ వీల్స్ దీనికి డైనమిక్, ప్రీమియం లుక్ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలిపింది. లేయర్డ్ డాష్బోర్డ్ డిజైన్, లార్జ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థల (ADAS)సూట్ను అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని ఏ ప్రైస్ రేంజ్లో మార్కెట్లో తీసుకొస్తారని అంశాలను వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..
దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తన సూపర్ హిట్ బొలెరో ఎస్యూవీలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బొలెరో B8, బొలెరో నియో N11 అని పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షో రూమ్) వరకూ ఉండనున్నాయి.డిజైన్ పరంగా చూస్తే కొత్త బొలెరోలో ఆకట్టుకునే హారిజోంటల్ యాక్సెంట్స్తో ఆకర్షణీయమైన డిజైన్ను సరికొత్తగా సిద్ధం ఏశారు. ఫాగ్ల్యాంప్స్తోపాటు డైమండ్ కట్ ఆర్-15 అలాయ్ వీల్స్ను అందిస్తున్నారు. మూడు రంగుల్లో, డ్యుయల్టోన్, స్టెల్త్ బ్లాక్ రంగు ఆప్షన్స్తో అందుబాటులో ఉన్న ఈ వాహనాలల్లో ప్రయాణీకుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు.సరికొత్త 17.8 సెం.మీ. టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్పైనే ఆడియో నియంత్రణకు అవసరమైన బటన్లు ఉన్నాయి. అలాగే వాహనాన్ని నడపడంలో సౌలభ్యం కోసం రైడ్ &హ్యాండ్లింగ్ టెక్నాలజీ టెక్ను వాడారు. ఎలాంటి నేలపైనైనా వెళ్లేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.ఈ ఎస్యూవీల్లో 55.9 kW శక్తి మరియు 210 Nm టార్క్ను అందించే mHAWK75 ఇంజిన్ను ఉపయోగించారు. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణ స్వరూపంతో పటిష్టంగా ఉంటుంది. పగుళ్లిచ్చిన రహదారులపై కూడా మెరుగైన ట్రాక్షన్ లభించేలా బొలెరో నియోలో క్రూయిజ్ కంట్రోల్ మరియు మల్టీ-టెరైన్ టెక్నాలజీ (ఎంటీటీ) ఉన్నాయి.ఇంటీరియర్స్ విషయానికి వస్తే లూనార్ గ్రే, మోకా బ్రౌన్ థీమ్ ఆప్షన్లు ఉన్నాయి. లెదరెట్ అప్హోల్స్ట్రీతోపాటు రియర్ వ్యూ కెమెరా, 22.8 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ ఏర్పాట్లు ఉన్నాయి.కొత్త బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ ఎండ్ B8 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంటుంది. కొత్త బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ N11 రేటు రూ. 9.99 లక్షలు. మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట మాట్లాడుతూ “పాతికేళ్లుగా భారతదేశపు అత్యంత విశిష్టమైన, పటిష్టమైన ఎస్యూవీగా సుస్థిర స్థానం సంపాదించుకున్న బొలెరో నవ భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి తీర్చిదిద్దింది. దృఢత్వం, సమకాలీన స్టైలింగ్, మరింత సౌకర్యం, ఆధునిక ఫీచర్ల మేళవింపుతో సరికొత్త బొలెరో, బొలెరో నియో, పట్టణ ప్రాంతాల్లోనూ అటు సంక్లిష్టమైన ఎత్తుపల్లాల్లోనూ సమంగా, అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.ఇదీ చదవండి: 6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం -
త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయిదేళ్లలోగా భారత్ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏథర్ మైలురాయి
బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5 లక్షలవ వాహనాన్ని రోల్-అవుట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఉత్పత్తి మైలురాయిని సాధించినట్లు ఏథర్ ప్రకటించింది. ఈ మైలురాయి వాహనం ఏథర్ ఫ్లాగ్షిప్ ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా.“5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్కు ఒక ప్రధాన మైలురాయి. మా మొట్టమొదటి ప్రోటోటైప్ నుండి నేటి వరకు, మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు, స్కేలబుల్, నమ్మకమైన, స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది” అని ఏథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.ఏథర్ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఒకటి వాహన అసెంబ్లీ కోసం, మరొకటి బ్యాటరీ ఉత్పత్తి కోసం. హోసూర్ ప్లాంట్ సంవత్సరానికి 4,20,000 స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఏథర్ తన మూడవ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఏర్పాటు చేస్తోంది. -
రూ.2.5 లక్షలతో బుకింగ్: కేవలం 100మందికే ఈ కారు!
స్కోడా (Skoda) కంపెనీ భారతదేశంలో.. లాంచ్ చేయనున్న తన కొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octavia RS) కోసం బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారు కోసం రూ. 2.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అక్టోబర్ 17న లాంచ్ అయిన తరువాత.. నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కంపెనీ.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని ధరను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 45 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?కంపెనీ తన కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే.. దీనిని వందమంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 216 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే కారు.. టాప్ స్పీడ్ 250 కిమీ/గం అని సమాచారం. -
హోండా ఏడీవీ 350: ఇప్పుడు కొత్త హంగులతో..
2022లో యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయిన 'హోండా ఏడీవీ 350' (Honda ADV 350) స్కూటర్.. ఇప్పుడు కొత్త వెర్షన్లో కనిపించింది. ఇది కొత్త కాస్మొటిక్ అప్డేట్లను పొందుతుంది. కానీ మెకానికల్, టెక్నికల్ అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాగా ఇది మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది.సరికొత్త హోండా ఏడీవీ 350 స్కూటర్.. 330 సీసీ ఎస్ఓహెచ్సీ ఫోర్ వాల్వ్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్, 31.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లను పొందుతుంది. 11.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాక్స్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్.. ముందు భాగంలో 256 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?ఫీచర్స్ విషయానికి వస్తే హోండా ఏడీవీ 350 స్కూటర్.. ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్లు, హోండా రోడ్సింక్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్, ఫోర్ వే టోగుల్ స్విచ్, స్టోరేజ్ కంపార్ట్మెంట్ లైట్, ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్లు మొదలైనవి పొందుతుంది. అయితే ఈ స్కూటర్ను కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు. -
సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?
బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్.. తన మొట్టమొదటి మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయిన 'స్టోర్ 500'(Storr 500)ను ఆస్ట్రియాలోని తన ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్లు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత డెలివరీ ఎప్పుడనే విషయాన్ని సంస్థ వెల్లడించనుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి.. ముందుగా డెలివరీలు జరుగుతాయని సంస్థ వెల్లడించింది.బ్రిక్స్టన్ స్టోర్ 500 బైక్.. 486 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా 8500 ఆర్పీఎం వద్ద 47.6 బీహెచ్పీ పవర్, 6750 ఆర్పీఎం వద్ద, 43 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, సెంట్రల్ రియర్ మోనోషాక్ వంటి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో డిస్క్ బ్రేక్లు ఈ బైకులో ఉంటాయి.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?ఫీచర్స్ విషయానికి వస్తే.. కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎల్ఈడీ డీఆర్ఎల్ & ఇండికేటర్స్, ఇంటర్నల్ ఫాగ్ ల్యాంప్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఈ బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైకుని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా?, లేదా అనేది వెల్లడించలేదు. -
ఫాస్టాగ్ లేకపోతే డబుల్ ఛార్జ్..
జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ (FASTag) లేకపోతే డబుల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫంక్షనల్ ఫాస్టాగ్లు లేని వాహనాలు లావాదేవీలో నగదును ఉపయోగిస్తే రెట్టింపు రుసుము చెల్లించాలి. అదే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లిస్తే వినియోగదారు రుసుముకు 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతోపాటు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే, ఫంక్షనల్ ఫాస్టాగ్ లేకుండా ఫీజు ప్లాజాలోకి ప్రవేశించే వాహనాలు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపును ఎంచుకుంటే ఆ వాహన కేటగిరికి వర్తించే వినియోగదారు రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.కొత్త ఫీజుల విధానం నవంబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. "ఈ సవరణ ఫీజు వసూలు ప్రక్రియను బలోపేతం చేయడం, టోల్ వసూలులో పారదర్శకతను పెంచడంతోపాటు జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది" అని రోడ్డు రవాణా శాఖ పేర్కొంది. -
భారత్లో రూ.4.12 కోట్ల మసెరటి కారు లాంచ్
మసెరటి ఇండియా.. ఎంసీపూరా, ఎంసీపూరా సిలో కన్వర్టిబుల్ కార్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4.12 కోట్లు, రూ.5.12 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. 2025 జులైలో గుడ్వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్లో కనిపించిన ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 3 నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యాయి.లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. గ్రిల్, సీ పిల్లర్పై ట్రైడెంట్ లోగోలను పొందుతుంది. స్క్రిప్ట్, వీల్ సెంటర్ క్యాప్లపై కూడా ఎంసీపూరా బ్యాడ్జ్లు చూడవచ్చు. బటర్ఫ్లై వింగ్ డోర్లు, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్, కన్వర్టిబుల్ వెర్షన్ కోసం రిట్రాక్టబుల్ గ్లాస్ రూఫ్ వంటివి ఈ కారులో చూడవచ్చు.ఇంజిన్ విషయానికి వస్తే.. మసెరటి ఎంసీ పూరా 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 621 హార్స్ పవర్, 719 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 325 కిమీ/గం. -
9 నెలల్లో 3000 సేల్స్!: ఇండియాలో ఆడి అమ్మకాలు
ఆడి ఇండియా.. 2025 మొదటి తొమ్మిది నెలల్లో కేవలం 3,197 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. భౌగోళిక రాజకీయ సవాళ్లు, కస్టమర్ సెంటిమెంట్ వంటివన్నీ అమ్మకాల మీద ప్రభావం చూపించింది. GST 2.0 అమలు తర్వాత.. పండుగ సమయంలో డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.కంపెనీ అమ్మకాల గురించి.. ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం లగ్జరీ కార్ల విభాగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత.. కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని అన్నారు.ఆడి కంపెనీ దేశ వ్యాప్తంగా తన నెట్వర్క్ విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే.. తన ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, డీలర్షిప్స్ విస్తరించడం వంటివి చేస్తోంది. అంతే కాకుండా బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ వారంటీలను పెంచడం, రోడ్సైడ్ అసిస్ట్ వంటి వాటిని కూడా అందిస్తోంది. -
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు?, దీనివల్ల వాహనదారులకు ఉపయోగం ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ప్రయాణీకులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందేలా చేయడానికి.. ఎన్హెచ్ఏఐ జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేయనుంది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులు.. వాహనదారులకు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా.. నేషనల్ హైవేల సంఖ్య, చైనేజ్, ప్రాజెక్ట్ పొడవును సంబంధించిన వివరాలతో పాటు.. 1033తో సహా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్లను తెలుసుకోవచ్చు. టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్, ఎన్హెచ్ఏఐ ఫీల్డ్ ఆఫీసులు వంటి కీలక అధికారుల సంప్రదింపు వివరాలను కూడా పొందవచ్చు.క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా.. హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, వెహికల్ రిపేర్ షాప్స్, టోల్ ప్లాజాలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు వంటి సమీపంలోని అత్యవసర సేవలకు గురించి కూడా తెలుసుకోవచ్చు. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు అవసరమైన సేవలను గుర్తించడంలో సహాయపడటం ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: కొత్త రూల్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ తప్పనిసరి!జాతీయ రహదారులపై ఈ క్యూఆర్ సైన్బోర్డులను.. రోడ్ స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ల వద్ద మాత్రమే కాకుండా, టోల్ ప్లాజాల దగ్గర, రోడ్డుపక్కన కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఈ క్యూఆర్ కోడ్స్ రహదారి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల గురించి వినియోగదారు అనుభవాన్ని, అవగాహనను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
మహీంద్రా థార్ మళ్లీ మార్కెట్లోకి.. కాస్త కొత్తగా..
మహీంద్రా తన ప్రసిద్ధ ఆఫ్-రోడర్ అయిన థార్ (Mahindra Thar) రిఫ్రెష్ వేరియంట్ను (facelift) భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త థార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ అప్డేట్ మోడల్, థార్ కోర్ బాక్సీ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, రోజువారీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు, కనెక్టివిటీ ఫీచర్లు, కొంతమేర ఎక్స్టీరియర్ మార్పులతో వచ్చింది.ముఖ్యమైన అప్గ్రేడ్లుఇంటీరియర్లో పెద్దదైన 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేసహా), రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రీడిజైన్ అయిన డాష్బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, రీ-లొకేట్ చేసిన పవర్ విండో స్విచ్లు ఉన్నాయి.ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే బాడీ-కలర్ ఫ్రంట్ గ్రిల్, వాషర్తో రియర్ వైపర్, స్పేర్ వీల్ హబ్లో పార్కింగ్ కెమెరా, కొత్తగా టాంగో రెడ్, బాటిల్ షిప్ గ్రే కలర్ షేడ్లు కొత్త వేరియంట్లో అప్డేట్ అయ్యాయి.ఇంజిన్ & ట్రాన్స్మిషన్థార్ మూడు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. 2.0-లీటర్ ఎంస్టాలిన్ పెట్రోల్, 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్, డీ117 సీఆర్డీఈ డీజిల్. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తాయి. డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఆర్డబ్ల్యూడీ, డ్రైవ్ లైన్ డిస్కనెక్ట్ ఫీచర్తో కూడిన 4x4 వేరియంట్లు ఉన్నాయి. వీటివల్ల థార్ను సిటీ వాహనంగానూ, వీకెండ్ ఆఫ్-రోడర్లాగానూ ఉపయోగించవచ్చు.ధరలు (ఎక్స్-షోరూమ్)ఎంట్రీ-లెవల్ ఏఎక్స్టీ ఆర్డబ్ల్యూడీ ఎమ్టీ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు.టాప్-ఎండ్ ఎల్ఎక్స్టీ 4డబ్ల్యూడీ ఏటీ ట్రిమ్ ధర రూ. 16.99 లక్షలు4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 16 లక్షలుసౌకర్యం & ప్రాక్టికాలిటీ:కొత్తగా A-పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఇంధన మూతకు ఇంటీరియర్ ఓపనింగ్ మెకానిజం, అదనంగా యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ వంటివి జోడించడం వల్ల రోజువారీ ఉపయోగంలో థార్ మరింత ప్రాక్టికల్గా మారింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో తొలి టెస్లా కారుకు వాహన పూజ.. -
సిట్రోయెన్ కొత్త కారు: ధర ఎంతంటే?
సిట్రోయెన్ ఇండియా.. దేశీయ మార్కెట్లో 'ఎయిర్క్రాస్ ఎక్స్' లాంచ్ చేసింది. ఈ కారు ధరలు రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కంపెనీ ఈ లేటెస్ట్ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ రంగులో కనిపించే ఈ కొత్త సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్.. ఎంట్రీ & పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో ఐఆర్వీఎం, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది.లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కారు.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. కాబట్టి ఇందులో ఆరు ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: 8 నెలలు.. 30000 సేల్స్: అమ్మకాల్లో కైలాక్ హవా!ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ & 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికను మాత్రమే పొందుతుంది. రెండోది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను పొందుతుంది. -
సెప్టెంబర్లో రిజిస్టర్ అయిన టెస్లా, విన్ఫాస్ట్ ఈవీల సంఖ్య
ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ ఈవీ తయారీదారుల్లో ఒకటైన టెస్లా, విన్ఫాస్ట్ ఇటీవలే భారత్లోకి ప్రవేశించాయి. గత నెలలో ఈ రెండు దిగ్గజ సంస్థలు తమ తొలి బ్యాచ్ వాహన రిజిస్ట్రేషన్లను నమోదు చేశాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన్ (Vaahan) పోర్టల్ డేటా ప్రకారం సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా మొత్తం 60 టెస్లా కార్లు, 6 విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.జులైలో భారతీయ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఈ రెండు కంపెనీలకు ఇది మొదటి అధికారిక బ్యాచ్ రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్ను శాసిస్తున్న టెస్లా జులై 15న ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించింది. దీని మోడల్ వై ఎస్యూవీ ధరలు రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్కు రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ వేరియంట్ రూ.67.89 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఇది సుమారు 500 కి.మీ. వరకు రేంజ్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.మరోవైపు వియత్నాం ఈవీ తయారీదారు విన్ఫాస్ట్ మిడ్-రేంజ్ మార్కెట్పై దృష్టి సారించింది. కంపెనీ ప్రీ-బుకింగ్లను ప్రారంభించడమే కాకుండా స్థానిక తయారీకి భారీ పెట్టుబడిని ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొల్పిన విన్ఫాస్ట్ అసెంబ్లీ ప్లాంట్ ఆగస్టులో కార్యకలాపాలను మొదలుపెట్టింది. దీని ప్రారంభ సామర్థ్యం ఏటా 50,000 వాహనాలుగా ఉంది. దీనిని 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్ -
హైదరాబాద్లో తొలి టెస్లా కారుకు వాహన పూజ..
భారతదేశంలో ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు దానికి వాహన పూజ చేయించడం ఆనవాయితీ. వాహనాన్ని స్థానిక గుడికి తీసుకెళ్లి పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరిస్తారు. పూజారి ఆ వాహనానికి పూజ చేసి కొబ్బరి కాయ కొడతారు. ఇలా చేస్తే వాహనాలు ఎటువంటి ప్రమాదాలకూ గురికాకుండా దేవుని ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ ఆనవాయితీ ఎలక్ట్రిక్, ఫ్యూచరిస్టిక్ వాహనాల యుగంలో కూడా కొనసాగుతోంది.ఇటీవలే అల్ట్రా రెడ్ టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేసిన హైదరాబాద్కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు కూడా తన కారుకు వాహనపూజ చేయించారు. ఈ సందర్భంగా కొత్త టెస్లా కారును పసుపు, కుంకుమలు, పూలదండలతో అలంకరించి కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు. "వాహన పూజ చేయకపోతే టెస్లాతో సహా ఏ కారు కూడా భారతీయ సంస్కృతిలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందదు" అని రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది తమదైన శైలిలో దీనిపై ప్రతిస్పందించారు. "హా హా !! భారతీయ సౌందర్యంలో ఈ కారు మరింత మెరుగ్గా కనిపిస్తుంది"అని ఓ యూజర్ పేర్కొనగా "భారతదేశంలో వాహన పూజే అంతిమ క్రాష్ టెస్ట్ సర్టిఫికేషన్" అని మరొకరు చమత్కరించారు.టెస్లా ఈ ఏడాది జూలైలో భారత్ లోకి ప్రవేశించింది. లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ కోడూరు గత వారం తన టెస్లా మోడల్ వై కారును డెలివరీ తీసుకున్నారు. ఇది హైదరాబాద్లో మొదటిది. మోడల్ వై కారు రెండు ఇండియన్ వేరియంట్లలో లభిస్తుంది. 60kWh బ్యాటరీతో రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ.59.89 లక్షలు కాగా 75kWh బ్యాటరీతో లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర 67.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) ప్యాకేజీ కావాలంటే మరో రూ.6 లక్షలు అదనం.No car , including Tesla, can get a five star safety rating in Indian culture, unless a vahan Pooja is done @elonmusk @TeslaClubIN @Tesla_India 😀🙏🏻😛 pic.twitter.com/5TxuGQzcPY— Dr Praveen koduru (@drpraveenkoduru) October 1, 2025 -
పెరిగిన కార్ల అమ్మాకాలు: కారణం ఇదే!
న్యూఢిల్లీ: జీఎస్టీ శ్లాబుల క్రమబద్దీకరణ ఫలితంగా కార్ల ధరలు గణనీయంగా తగ్గడంతో సెప్టెంబర్ నెలలో విక్రయాలు బలంగా పుంజుకున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో చక్కని వృద్ధిని నమోదు చేశాయి. నిర్దేశిత సామర్థ్యం కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు మార్చడం తెలిసిందే. ఎలాంటి లెవీ లేకుండా విలాసవంతమైన కార్లపై 40 శాతం పన్ను విధించడంతో వాటి ధరలు సైతం తగ్గడం అమ్మకాలు పెరిగేందుకు దారితీసింది.కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. మారుతీ మొత్తం విక్రయాల పరంగా 3% వృద్ధిని నమోదు చేసినప్పటికీ, దేశీయంగా చూస్తే డీలర్లకు సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్ క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8% తగ్గి 1,32,820 యూనిట్లుగా ఉంది. రిటైల్ విక్రయాలు 27.5 శాతం పెరిగి 1.73 లక్ష లయూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థోబెనర్జీ తెలిపారు. దసరా నవరాత్రుల్లో మొదటి ఎనిమిది రోజుల్లోనే 1.65 లక్షల యూనిట్లను విక్రయించినట్టు, మరో రెండు రోజుల్లో కలిపి 2 లక్షల యూనిట్ల విక్రయాన్ని అధిగమిస్తామని చెప్పారు. -
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్లో కేటీఎం టీమ్..
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎల్) కేటీఎం రేసింగ్, ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ మధ్య కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని కింద ఐఎస్ఆర్ఎల్ సీజన్2లో కేటీఎం ప్రత్యేక నేమింగ్ రైట్స్ పార్టనర్, అధికారిక బైక్ భాగస్వామిగా మారింది. బ్రాండ్ అంబాసిడర్, ఇన్వెస్టర్గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ లీగ్కు మద్దతిస్తున్నారు.ఈ భాగస్వామ్యం కింద, కేటీఎం ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ పేరుతో రేసింగ్ టీమ్ పోటీపడనుంది. భారతీయ మోటార్ స్పోర్ట్ ఫ్రాంచైజీకి ఒక ప్రపంచ మోటార్ సైకిల్ తయారీ సంస్థ పేరు హక్కులను పొందడం ఇదే మొదటిసారి. అనేక ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్స్ తో కేటీఎం దశాబ్దాల ప్రపంచ రేసింగ్ నైపుణ్యాన్ని మోటోక్రాస్, సూపర్ క్రాస్లలో తీసుకురానుంది.ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ బ్రాండ్లను భారతీయ జట్లతో ఏకం చేయాలనే లీగ్ దృష్టికి ఈ భాగస్వామ్యం సరిపోతుందని ఐఎస్ఆర్ఎల్ ప్రమోటర్ వీర్ పటేల్ అన్నారు. టీవీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో 20 మిలియన్లకు పైగా వీక్షకులతో విజయవంతమైన సీజన్ 1 తరువాత, సీజన్2 అక్టోబర్ 25-26 తేదీల్లో ప్రారంభమవుతుంది. తర్వాత రేసులు డిసెంబర్ 6-7, డిసెంబర్ 20-21 తేదీలలో మూడు వేర్వేరు వేదికలలో జరుగుతాయి. -
మూడేళ్లలో పది రెట్లు టర్నోవర్పై దృష్టి
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ రివర్, 2028 మార్చి నాటికి టర్నోవరును పది రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా సేల్స్ నెట్వర్క్ను కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి తెలిపారు. ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ (ఇండీ), 30 సేల్స్ ఔట్లెట్స్తో కంపెనీ రూ. 100 కోట్ల ఆదాయ మార్కును దాటింది.ఔట్లెట్స్ సంఖ్యను 2028 మార్చి నాటికి 350కి పెంచుకోనున్నట్లు మణి చెప్పారు. దీనితో నెలవారీగా అమ్మకాలు సుమారు 20,000 యూనిట్లకు, వార్షిక టర్నోవరు దాదాపు రూ. 1,200 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు, 2027 మార్చి నాటికి రెండు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు మణి పేర్కొన్నారు. కంపెనీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ప్లాంటులో నెలకు 3,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. తదుపరి దశ వృద్ధికి సంబంధించి వచ్చే 3–4 ఏళ్లలో 120–130 మిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. రివర్లో జపాన్కి చెందిన యమహా మోటర్ కార్పొరేషన్, మిత్సుయి అండ్ కో, మరుబెని కార్పొరేషన్ మొదలైనవి 70 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేశాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు డీఏ పెంపు? -
8 నెలలు.. 30000 సేల్స్: అమ్మకాల్లో కైలాక్ హవా!
స్కోడా కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన కైలాక్ కారు అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. కేవలం 8 నెలల్లో 30000 యూనిట్ల కంటే ఎక్కువ సేల్స్ సాధించింది. ఇది కంపెనీ సేల్స్ పెరగడానికి కూడా దోహదపడింది.2025 జనవరిలో 1242 యూనిట్ల అమ్మకాలను సాధించిన స్కోడా కైలాక్.. ఆగస్టులో 3099 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. ఇలా మొత్తం మీద ఈ కారు జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 30190 అమ్మకాలు పొందింది. ఈ కారు ప్రారంభ ధర దేశీయ విఫణిలో రూ. 7.89 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఇదీ చదవండి: దేశంలో అత్యంత సరసమైన 5 బైకులు ఇవే!స్కోడా కైలాక్ 1.10 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 115 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ మరియు ప్రెస్టీజ్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో ఏడు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. -
అల్ట్రావయోలెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్: ఇప్పుడు తిరుపతిలో..
బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ దేశీయ మార్కెట్లో.. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడమే కాకుండా, తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. దీంతో సంస్థ 26 నగరాల్లో తన పాదముద్రను బలోపేతం చేసింది.తిరుపతిలో ప్రారంభమైన అల్ట్రావయోలెట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో.. సేల్స్, సర్వీస్ వంటి వాటితో పాటు విడిభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్స్-47 క్రాస్ఓవర్, ఎఫ్77, ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైకులు ఉన్నాయి. ఈ కొత్త సెంటర్ ప్రారంభోత్సవం సమయంలో సీఈఓ నారాయణ్ మాట్లాడుతూ.. ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కొత్త బైకులను కొనుగోలు చేయవచ్చు. టెస్ట్ రైడ్లు, సర్వీస్ వంటివి కూడా పొందవచ్చని అన్నారు. -
దేశంలో అత్యంత సరసమైన 5 బైకులు ఇవే!
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త టూ వీలర్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 (GST 2.0) అమలులోకి వచ్చిన తరువాత వీటి ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని సరసమైన బైకులు (Affordable Bikes) ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.బజాజ్ ప్లాటినా 100బజాజ్ ప్లాటినా 100 ధర రూ. 65,407 (ఎక్స్ షోరూమ్) చేరింది. ఈ బైక్ 102 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 7.9hp పవర్ & 8.3Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.హోండా షైన్ 100హోండా షైన్ 100 ధర రూ. 63,191 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 98.98 సీసీ ఇంజిన్ 7.38 హార్స్ పవర్, 8.04 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి.. కొంత ఎక్కువ మైలేజ్ ఇస్తున్న కారణంగా ఈ బైకుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.హీరో హెచ్ఎఫ్ 100హీరో హెచ్ఎఫ్ 100 ధర రూ. 58739 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్.. 7.9 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 65 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్దేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో.. టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ కూడా ఒకటి. దీని ధర రూ. 55100 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.3 హార్స్ పవర్, 7.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 2020లో బీఎస్6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అయింది. -
కొత్త రూల్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ తప్పనిసరి!
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని.. 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.అక్టోబర్ 2026 తర్వాత.. తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరిగా ఈవీఏఎస్ కలిగి ఉండాలని మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ సిస్టం వల్ల ఎలక్ట్రిక్ కారు కూడా సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ వల్ల కారును ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు.అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే హైబ్రిడ్ వాహనాలలో AVAS వాడకాన్ని తప్పనిసరి చేశాయి. ఇది రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇండియాలో కూడా ఈ విధానం అమలు చేయాలని సంకల్పించింది.ఇదీ చదవండి: ఐదేళ్లలో 3 లక్షల సేల్స్: మళ్ళీ తగ్గిన ధరనిజానికి ఎలక్ట్రిక్ కార్లు.. ఫ్యూయెల్ కార్ల మాదిరిగా సౌండ్ చేయవు. దీనివల్ల ముందు వెళ్తున్న కారుకు లేదా వ్యక్తులకు వెనుక ఒక కారు వస్తుందనే విషయం తెలియకుండా పోతుంది. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎలక్ట్రిక్ కార్లలో అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఉండాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
ఐదేళ్లలో 3 లక్షల సేల్స్: మళ్ళీ తగ్గిన ధర
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇండియన్ మార్కెట్లో తన థార్ (Mahindra Thar) ఎస్యూవీ లాంచ్ చేసినప్పటి నుంచి 3 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. దీంతో ఈ ఆఫ్ రోడర్ సరికొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది.భారతదేశంలో మహీంద్రా థార్ అక్టోబర్ 2020లో ప్రారంభమైంది. అప్పటి నుంచి కేవలం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఇందులో థార్ రాక్స్ సేల్స్ కూడా ఉన్నాయి. దీనిని (థార్ రాక్స్) కంపెనీ సెప్టెంబర్ 2024లో లాంచ్ చేసింది.2026 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో జరిగిన మొత్తం థార్ అమ్మకాలలో.. థార్ రాక్స్ 68 శాతం వాటా కలిగి ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశీయ విఫణిలో థార్ రాక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రూ. 1.35 లక్షలు తగ్గింది. ఇది అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంది.మహీంద్రా థార్ ధరలు రూ. 10.32 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 16.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. అదే సమయంలో, మహీంద్రా థార్ రాక్స్ ధరలు రూ. 12.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ కార్లు భద్రతలో కూడా మంచి స్కోరింగ్ పొందడంతో.. ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. -
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఓకే
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో నిర్వహణా సంబంధ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా రూ. 10,900 కోట్ల పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా రూ. 2,000 కోట్ల పెట్టుబడులతో 72,300 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తెరతీసింది. సబ్సిడీ పథకానికి అనుగుణంగా వివిధ ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు నిబంధనలు ప్రకటించింది.ప్రభుత్వ సంబంధ కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు తదితరాలలో ఏర్పాటు చేసే అప్స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవీ చార్జింగ్ ఎక్విప్మెంట్కు 100 శాతం సబ్సిడీకి వీలుంటుంది. వీటిని ఉచితంగా పబ్లిక్ యాక్సెస్కు అనుగుణంగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పీఎస్యూల నిర్వహణలోని నగరాలు, జాతీయ రహదారులతోపాటు.. రైల్వే స్టేషన్లు, ఏఏఐ నిర్వహణలోని ఎయిర్పోర్టులు, ఓఎంసీల రిటైల్ ఔట్లెట్లు, ఎస్టీయూ బస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మునిసిపల్ పార్కింగ్ లాట్లు తదితరాలలో ఏర్పాటు చేసే అప్స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 80 శాతం, ఈవీ సరఫరా ఎక్విప్మెంట్ వ్యయాలలో 70 శాతం సబ్సిడీ కవర్ లభిస్తుంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
భారత్లో స్వీడిష్ బ్రాండ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo).. ఇండియన్ మార్కెట్లో ఈఎక్స్30 (EX30) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 41 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కారును అక్టోబర్ 19 కంటే ముందుగా బుక్ చేసుకున్నవారికి కంపెనీ దీనిని రూ. 39.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకే అందిస్తుంది.కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారు.. క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్, రియర్ లైట్స్ వంటి వాటితో పాటు.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఏరోడైనమిక్ వీల్స్ వంటివి పొందుతుంది. ఛార్జింగ్ పోర్ట్ వెనుక ఎడమ క్వార్టర్ ప్యానెల్పై ఉంది.మంచి ఇంటీరియర్ డిజైన్ కలిగిన ఈ కారు.. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో పాటు గూగుల్ బేస్డ్ సిస్టమ్తో పనిచేసే 12.3-ఇంచెస్ వర్టికల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను పొందుతుంది. డాష్బోర్డ్ స్ట్రీమ్లైన్డ్ డ్రైవర్ ఇంటర్ఫేస్, స్టీరింగ్ వీల్ కోసం కొత్త డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల వంటి ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: తగ్గిన ధరలు: కొత్త రేట్లు ప్రకటించిన టీవీఎస్భారతీయ మార్కెట్ కోసం లాంచ్ అయిన కొత్త వోల్వో ఈఎక్స్30 ఎలక్ట్రిక్ కారులో 69 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఛార్జ్పై 480 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 272 హార్స్ పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 180 కిమీ/గం కాగా.. ఇది 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. -
30లోగా హై సెక్యూరిటీ నెంబర్ప్లేట్లు బిగించుకోవాలా? రవాణా శాఖ క్లారిటీ
వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తలపెట్టిన హై సెక్యూరిటీ నెంబర్ప్లేట్ల ఏర్పాటుకు ఎలాంటి గడువు విధించలేదని రవాణా శాఖ (transport department) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30లోగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరిగా బిగించుకోవాలంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని సంయుక్త రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ తెలిపారు.హెచ్ఎస్ఆర్పీ లేని వాహనాలకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు చలానాలు, జరిమానాలు విధిస్తారనేది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు.హెచ్ఎస్ఆర్పీ (high security number plates) అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, హెచ్ఎస్ఆర్పీ బిగిస్తామంటూ మోసం చేసే నకిలీ వెబ్సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆటో విడిభాగాలకు టారిఫ్ల దెబ్బ
న్యూఢిల్లీ: అధికస్థాయిలో యూఎస్ విధిస్తున్న టారిఫ్లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల తయారీని దెబ్బతీయనున్నట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా పేర్కొంది. ఇతర ఆసియా దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే భారత్ నుంచి ఆటో విడిభాగాలను ఎగుమతి చేసే సంస్థలకు ఇది ప్రతికూలంగా పరిణమించనున్నట్లు తెలియజేసింది. ఇది భారత్, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ప్రాధాన్యతను పట్టి చూపుతున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో 30 శాతం ఎగుమతులనుంచే లభిస్తున్నట్లు తెలియజేసింది. దీనిలో ఒక్క యూఎస్ నుంచే 27 శాతం సమకూరుతున్నట్లు వివరించింది. వెరసి ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు దేశీయంగా మొత్తం ఆటో విడిభాగాల ఉత్పత్తిపై ప్రత్యక్షంగా 8 శాతం ప్రభావాన్ని చూపనున్నట్లు ఇక్రా తాజాగా అంచనా వేసింది. 15–30% టారిఫ్లను ఎదుర్కొంటున్న చైనా, జపాన్, వియత్నాం, ఇండొనేసియా తదితర ఆసియా దేశాలతో పోల్చితే భారత్ ఎగుమతిదారులకు ప్రతికూలమేనని తెలియజేసింది. -
తగ్గిన ధరలు: కొత్త రేట్లు ప్రకటించిన టీవీఎస్
టీవీఎస్ మోటార్ కంపెనీ.. భారత మార్కెట్లో విక్రయించే తమ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు & స్కూటర్ల కొత్త ధరలను ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత సంస్థ ఈ ప్రకటన వెల్లడించింది. పండుగ సీజన్ సమయంలో టూ వీలర్ ధరలు తగ్గడం అనేది.. కొత్త వెహికల్స్ కొనేవారికి ఓ మంచి శుభవార్త.కొత్త ధరలు●టీవీఎస్ జూపిటర్ 110: రూ. 72,400 (రూ. 6,481 తగ్గింది)●టీవీఎస్ జూపిటర్ 125: రూ. 75,600 (రూ. 6,795 తగ్గింది)●టీవీఎస్ ఎన్టార్క్ 125: రూ. 80,900 (రూ. 7,242 తగ్గింది)●టీవీఎస్ ఎన్టార్క్ 150: రూ. 1,09,400 (రూ. 9,600 తగ్గింది)●టీవీఎస్ ఎక్స్ఎల్ 100: రూ. 43,400 (రూ. 4,354 తగ్గింది)●టీవీఎస్ రేడియన్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)●టీవీఎస్ స్పోర్ట్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)●టీవీఎస్ స్టార్ సిటీ: రూ. 72,200 (రూ. 6,386 తగ్గింది)●టీవీఎస్ రైడర్: రూ. 80,900 (రూ. 6,725 తగ్గింది)●టీవీఎస్ జెస్ట్: రూ. 70,600 (రూ. 6,291 తగ్గింది)ధరలు ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతాయి. కాబట్టి కచ్చితమైన ధరల కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
పండుగ స్పెషల్.. హోండా కొత్త ఎడిషన్ బైక్
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.01 లక్షల (ఎక్స్-షోరూమ్). దీని కోసం సంస్థ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ 2025 మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.హోండా సీబీ350సీ స్పెషల్ ఎడిషన్.. బిగ్వింగ్ డీలర్షిప్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇంధన ట్యాంక్, ముందు, వెనుక ఫెండర్లలో గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఇది రెబెల్ రెడ్ మెటాలిక్ అండ్ మాట్ డ్యూన్ బ్రౌన్ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది.సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ బైక్ 348.36 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 rpm వద్ద, 20 హార్స్ పవర్, 3000 rpm వద్ద 29.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: క్రాష్ టెస్ట్లో ఇన్విక్టో రికార్డ్!
మారుతి సుజుకి ఇన్విక్టో.. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) పరీక్షలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో ఈ ఎంపీవీ దేశంలోని అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.మారుతి ఇన్విక్టో.. వయోజన ప్రయాణీకుల రక్షణలో 32 పాయింట్లకు 30.43 పాయింట్లు స్కోర్ చేయగలిగింది. పిల్లల రక్షణలో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్లో 16 పాయింట్లకు 14.43 పాయింట్లు సాధించగా, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్లో 16 పాయింట్లు పరిపూర్ణ స్కోరు లభించింది. ఇలా మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ పరీక్షకు ఉపయోగించిన కారు.. 6 ఎయిర్బ్యాగులు కలిగి ఉంది. అంతే కాకుండా ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్తో, 3-పాయింట్ సీట్ బెల్ట్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. -
జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్: 310 మందికే ఈ బైక్!
బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఇండియన్ మార్కెట్లో తన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ (BMW G 310 RR Limited Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర స్టాండర్డ్ జీ 310 ఆర్ఆర్ కంటే కూడా రూ. 18000 తక్కువ. దీనిని 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే.. ఈ బైకును 310 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.భారతదేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ 1000 యూనిట్లు అమ్ముడైన సందర్భంగా.. కంపెనీ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఫ్యూయెల్ ట్యాంక్ మీద 1/310 బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇది రెండు బేస్ కలర్ స్కీమ్లలో అందుబాటులో ఉంది.బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 312 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 9700 rpm వద్ద 34 bhp పవర్, 7700 rpm వద్ద 27.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి. -
కొత్త జీఎస్టీతో ధరలు పెరిగిన బైక్లు..
జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొత్త పన్ను రేట్లు అమల్లోకి రావడంతో 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న చాలా మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. మరోవైపు 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్లను అత్యధిక రేటు కేటగిరిలోకి చేర్చడంతో ద్విచక్ర వాహన కంపెనీలు ఆ మేరకు పెద్ద బైక్ల ధరలను పెంచేశాయి.హోండా (Honda) మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్లో తన పెద్ద బైక్ పోర్ట్ ఫోలియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్టంగా రెబెల్ 500 మోడల్ ధర రూ .37,000 పెరిగింది. కంపెనీ ఫ్లాగ్ షిప్ బైక్ జీఎల్ 1800 గోల్డ్ వింగ్ టూర్ రూ .2.92 లక్షల పెరుగుదలను చూసింది.పూర్తి ధరల జాబితామోడల్పాత ధరకొత్త ధరతేడారెబెల్ 500రూ.5.12 లక్షలురూ.5.49 లక్షలురూ.37,000ఎన్ఎక్స్500రూ.5.90 లక్షలురూ.6.33 లక్షలురూ.43,000సీబీ750 హార్నెట్రూ.8.60 లక్షలురూ.9.22 లక్షలురూ.62,000సీబీ650ఆర్రూ.9.60 లక్షలురూ.10.30 లక్షలురూ.70,000సీబీఆర్ 650ఆర్రూ.10.40 లక్షలురూ.11.16 లక్షలురూ.76,000ఎక్స్ఎల్ 750 ట్రాన్సాల్ప్రూ. 11.00 లక్షలురూ.11.81 లక్షలురూ.81,000ఎక్స్-ఏడీవీరూ .11.91 లక్షలురూ.12.79 లక్షలురూ.88,000సీబీ1000 హార్నెట్ ఎస్పీరూ.12.36 లక్షలురూ.13.29 లక్షలురూ.93,000సీబీఆర్1000ఆర్ఆర్-ఆర్ ఫైర్ బ్లేడ్ ఎస్పీరూ .28.99 లక్షలురూ.31.18 లక్షలురూ.2.19 లక్షలుజీఎల్1800 గోల్డ్ వింగ్ టూర్రూ.39.90 లక్షలురూ.42.82 లక్షలురూ.2.92 లక్షలుసుజుకీ కూడా..సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కూడా తన మోటార్ సైకిళ్ల ధరలను సవరించింది. రేట్లు పెరిగిన బైక్ మోడల్స్ జాబితాలో లెజెండరీ హయాబుసా, వి-స్ట్రోమ్ 800 డీఈ, మిడిల్-వెయిట్ జీఎస్ఎక్స్-8ఆర్ ఉన్నాయి.సుజుకి భారతీయ లైనప్ లో అత్యధిక ధర కలిగిన మోడల్ గా, హయాబుసా (Suzuki Hayabusa) జీఎస్టీ సవరణతో ఎక్కువగా ప్రభావితమైంది. దీని ధర రూ .1.16 లక్షలు పెరిగింది. అంటే ఈ మోటార్ సైకిల్ ధర రూ .16.90 లక్షల నుండి రూ .18.06 లక్షలకు పెరిగింది.ఇక వీ-స్ట్రోమ్ 800డీఈ (V-Strom 800DE) జిక్సర్ (GSX-8R) కూడా ధరల పెరుగుదలను అనుభవించాయి. వి-స్ట్రోమ్ ధర రూ .71,000 పెరిగి రూ .11.01 లక్షలకు చేరింది. జిక్సర్ ధర రూ .64,000 పెరిగి రూ .9.89 లక్షలకు చేరుకుంది.ఇదీ చదవండి: ‘ఇండియన్ ఐటీ కంపెనీలు మేల్కోకపోతే మునిగిపోతాయ్’ -
కార్లకు దసరా కళ..
అటు జీఎస్టీ రేట్ల తగ్గింపు, ఇటు దసరా నవరాత్రులు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకి బాగా కలిసొచ్చాయి. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు కంపెనీ 75,000 పైచిలుకు వాహనాలను విక్రయించింది. చిన్న కార్లలో కొన్ని వేరియంట్ల డెలివరీ కోసం నిరీక్షించే పరిస్థితి కూడా నెలకొందని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.ప్రస్తుతం రోజుకు 80,000 పైచిలుకు ఎంక్వైరీలు వస్తున్నాయని, ఇది సాధారణంగా వచ్చే 40,000–45,000 ఎంక్వైరీలకు రెట్టింపని వివరించారు. రోజుకు సుమారు 18,000 బుకింగ్స్ నమోదవుతున్నాయన్నారు. ‘నవరాత్రులు ప్రారంభమయ్యాక గురువారం సాయంత్రం 6 గం.ల సమయానికి 75,000 వాహన విక్రయాలు నమోదయ్యాయి. రోజు ముగిసే సరికి ఇది 80,000 యూనిట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం‘ అని పార్థో బెనర్జీ తెలిపారు. పండుగ సీజన్లో చిన్న కార్లపై గణనీయంగా ఆసక్తి నెలకొందని ఆయన చెప్పారు.ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్లో దేశవ్యాప్తంగా బుకింగ్స్ 50 శాతం పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు కోసం కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారని, అప్గ్రేడ్ కావడానికి ఇదే సరైన సమయమని బెనర్జీ వివరించారు. ఉత్పత్తిని ఒక్కసారిగా పెంచడానికి లేనందున బ్రెజా, డిజైర్, బాలెనో లాంటి కార్లలో కొన్ని వేరియంట్లను నాలుగైదు రోజుల తర్వాత సత్వరం సరఫరా చేసే అవకాశం ఉండదన్నారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
24 గంటల్లో 3000 బుకింగ్స్: ఈ బైక్ గురించి తెలుసా?
అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఇటీవల లాంచ్ చేసిన సరికొత్త మోటార్సైకిల్ 'ఎక్స్-47 క్రాస్ఓవర్' (X-47 Crossover) అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మొదటి 24 గంటల వ్యవధిలోనే 3000 కంటే ఎక్కువ బుకింగ్స్ (Bookings) పొందగలిగింది. దీంతో పరిచయ ధరను 5000 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ పరిచయ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). లాంచ్ సమయంలో ఈ ధర కేవలం మొదటి 1000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. అయితే డిమాండ్ భారీగా పెరగడంతో ఈ సంఖ్యను 5000కు పెంచింది. అంటే పరిచయ ధర మొదటి 5000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత ఈ బైక్ ధర రూ. 2.74 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుతుంది.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లుఎక్స్-47 క్రాస్ఓవర్ గురించిఆల్ట్రావయొలెట్ ఎక్స్-47 క్రాస్ఓవర్ బైక్ 10.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. ఛార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 40 హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 8.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 145 కిమీ/గం కావడం గమనార్హం. -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కి.మీ వెళ్లే ఎలక్ట్రిక్ బైక్
ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తాజాగా ఎక్స్–47 క్రాసోవర్ బైక్ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 2.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 323 కి.మీ. రేంజి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే తొలి’ రాడార్ ఇంటిగ్రేటెడ్ బైక్’ అని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో నారాయణ్ సుబ్రమణియం తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 వాహన విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 30,000 యూనిట్ల నుంచి 1 లక్ష యూనిట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అలాగే ఉత్పత్తుల శ్రేణిని కూడా వచ్చే ఏడాది మరింతగా విస్తరించనున్నట్లు నారాయణ్ చెప్పారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
రూ.10 కోట్ల రోల్స్రాయిస్ కంటే రూ.10 లక్షల కారే నయం కదా!
రూ.కోట్లు పెట్టి కొన్న వస్తువులు కూడా కొన్ని సందర్భాల్లో పనికిరాకుండా పోతుంటాయి. సాధారణ సగటు వస్తువులే మేలనిపిస్తాయి. అలాంటి సంఘటనే ఇది. సుమారు రూ.10 కోట్ల ధర ఉండే రోల్స్రాయిస్ (Rolls Royce ) కారు.. వరద నీటిలో చిక్కుకుని ఇక నావల్ల కాదంటూ ముందుకెళ్లకుండా మొరాయిస్తే.. రూ.10 లక్షల లోపుండే మామూలు కార్లు రయ్మంటూ దూసుకెళ్లాయి.కోల్కతాలో (Kolkata) అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచి ఉంది. ఈ క్రమంలో ఓ రోల్స్ రాయిస్ కారు ఆ వరద నీటిలో నిలిచిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోలో టాటా వాహనంలో ప్రయాణిస్తున్న ఒక వాహనదారుడు రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు వరద నీటిలో ఎలా చిక్కుకుపోయిందో పేర్కొన్నారు. రూ .10 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు కంటే తన రూ .10 లక్షల టాటా కారే నయం అంటూ ఈ క్లిప్లో ఆ వాహనదారుడు వ్యాఖ్యానించారు. ఈ ఘటన దక్షిణ కోల్కతాలోని బాలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ.!వైరల్గా మారిన ఈ వీడియోపై పలువురు ఇన్స్టాగ్రామ్ యూజర్లు ప్రతిస్పందించారు. రోల్స్ రాయిస్ లగ్జరీ కారని, నీటితో నిండిన వీధుల్లో నడపడానికి ఉద్దేశించినది కాదని కొందరు వ్యాఖ్యానించగా, కోల్కతా నగర రోడ్ల దుస్థితిని మరికొంతమంది ప్రశ్నిస్తూ కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Ravi DAS (@kolkata_cab_riders) -
మార్కెట్లోకి కొత్త ఈవీ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ.!
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మ్యాటర్ తాజాగా తమ ఎరా మోటర్సైకిల్ను (Matter Aera) హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎరా 5000ప్లస్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 1,93,826గా (హైదరాబాద్ ఎక్స్షోరూం) ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 172 కి.మీ. రేంజి, బ్యాటరీపై లైఫ్టైమ్ వారంటీ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.ప్రస్తుతమున్న 15 డీలర్షిప్లను మరింతగా విస్తరిస్తున్నామని, హైదరాబాద్లో ఒకటి ఉండగా, ఖమ్మంలో మరొకటి ప్రారంభిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీటీవో కుమార్ ప్రసాద్ తెలికెపల్లి చెప్పారు. త్వరలో మరో 200 మిలియన్ డాలర్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలిపారు.కొత్త ప్లాంటు ఏర్పాటు, ఇతరత్రా అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు ప్రసాద్ చెప్పారు. ఇప్పటివరకు సుమారు 75 మిలియన్ డాలర్లు సమీకరించగా, కంపెనీకి ప్రస్తుతం సాణంద్లో 1.2 లక్షల వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఓ ప్లాంటు ఉంది.ఇదీ చదవండి: ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పిన కంపెనీ -
ఉత్పత్తి నిలిపివేత ఇంకొంత కాలం పొడిగింపు
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన ఉత్పత్తి నిలిపివేతను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మొదట ఈ అటాక్తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును మరికొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.దశలవారీగా ఉత్పత్తి పునప్రారంభ ప్రణాళికలపై పని చేస్తున్నాం. సైబర్ అటాక్కు సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నందున రాబోయే వారంలో దీనిపై స్పష్టత వస్తుంది. జేఎల్ఆర్ సైబర్ సెక్యూరిటీ నిపుణులతో, బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్సీఎస్సీ)తో కలిసి పని చేస్తోంది. ఈ ఉత్పత్తి అంతరాయాన్ని నిర్వహించడానికి కంపెనీ సహోద్యోగులు, సరఫరాదారులు, భాగస్వాములతో పని చేస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే కంపెనీ సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని అక్టోబర్ 1 వరకు తాజాగా పొడిగించడం గమనార్హం.మూడు ప్లాంట్లపై ప్రభావం..టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్వుడ్, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్ అటాక్ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే మూడు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్ఆర్, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.33 వేల మంది ఉద్యోగులు..ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్వేర్ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.ఇదీ చదవండి: ర్యాపిడోలో స్విగ్గీ వాటా విక్రయం -
పండగ బ్లాక్బస్టర్!
న్యూఢిల్లీ: పండగ సీజన్లో జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో పలు ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పండగ సీజన్లో అమ్మకాలు భారీగా ఉంటాయని వాహనాలు, ఎల్రక్టానిక్ ఉపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు, రిటైలర్లు ఆశిస్తున్నారు. ఇదే తీరు పండుగ సీజన్ మొత్తం కొనసాగుతుందని భావిస్తున్నాయి. ఇప్పటికే దసరా నవరాత్రుల సందర్భంగా తొలిరోజే కొన్ని వాహనాలు, ఏసీల తయారీ సంస్థలు రికార్డు స్థాయి విక్రయాలు నమోదు చేశాయి. మొదటి రోజున 10,000 ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. దీనితో పాటు దేశవ్యాప్తంగా 25,000 పైచిలుకు కస్టమర్ల ఎంక్వైరీలు వచ్చినట్లు తెలిపింది. గత అయిదేళ్లలో తొలిసారిగా ఒకే రోజున అత్యధికంగా మారుతీ సుజుకీ 30,000 యూనిట్లు, హ్యుందాయ్ 11,000 వాహనాలను విక్రయించినట్లు వెల్లడించాయి. కన్జూమర్ సెంటిమెంటు, సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపుతో పండగ సీజన్ అమ్మకాల ధోరణిపై స్పందిస్తూ ‘వాహనాల కొనుగోలు కోసం కస్టమర్లు పెద్ద ఎత్తున షోరూంలకు వస్తున్నారు’ అని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ‘ఈ పండగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. జీఎస్టీ తగ్గింపు, ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లతో కొనుగోళ్లపై కస్టమర్లలో అసాధారణంగా ఆసక్తి పెరిగింది‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ, సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. నవరాత్రుల తొలి రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా డీలర్షిప్లను సందర్శించే కస్టమర్ల సంఖ్య, ఎంక్వయిరీలు, వాహనాల డెలివరీలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆయన పేర్కొన్నారు.ఇతర కంపెనీలు ఏమన్నాయంటే.. → ‘సాధారణంగా సోమవారం నాడు కస్టమర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం భారీగా పెరిగింది. రోజువారీగా కన్నా డెలివరీల పరిమాణం రెట్టింపు పెరిగింది‘ అని విజయ్ సేల్స్ డైరెక్టర్ నీలేష్ గుప్తా చెప్పారు. → ఏసీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం, ఆకర్షణీయమైన ఆఫర్ల దన్నుతో పండగ సీజన్ ప్రారంభంలోనే తమ ఏసీల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదైనట్లు పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఏసీ గ్రూప్) అభిషేక్ వర్మ తెలిపారు. → అమ్మకాలపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంత ఉందనేది ఇప్పుడే అంచనా వేయలేకపోయినా, మొత్తం మీద విక్రయాలు మాత్రం చాలా సానుకూలంగా ఉన్నాయని గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్ (అప్లయెన్సెస్ బిజినెస్) కమల్ నంది తెలిపారు. కొన్ని స్టోర్స్ సుదీర్ఘ సమయం పాటు తెరిచి ఉంటున్నాయని చెప్పారు. → కొనుగోలుదారుల సెంటిమెంటు సానుకూలంగా, అమ్మకాల ధోరణులు ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఇక ముందు కూడా ఇదే తీరు కొనసాగవచ్చని వివరించారు. → జీఎస్టీ రేట్ల సవరణతో అమ్మకాలకు ఊతం లభిస్తుందని క్రోమా రిటైల్ చెయిన్ నిర్వహించే టాటా గ్రూప్ సంస్థ ఇన్ఫినిటీ రిటైల్ సీఈవో శిబాశీష్ రాయ్ తెలిపారు. -
దుల్కర్ సల్మాన్ కార్ల ప్రపంచం: ఫెరారీ నుంచి బెంజ్ వరకు..
లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతిపై కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగానే సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారులతో సహా వారి నివాసాలలో.. తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని 30 ప్రదేశాలలో రవాణ కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేరు కూడా వినిపిస్తోంది. అయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.నిజానికి నటుడు దుల్కర్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఈ కారణంగానే ఈయన ఒక ప్రత్యేకమైన గ్యారేజ్ ఏర్పాటు చేసుకుని, ఇందులో అత్యంత ఖరీదైన వాహనాలను నిలుపుకున్నారు. ఈ కథనంలో దుల్కర్ సల్మాన్ గ్యారేజిలోని కార్ల గురించి తెలుసుకుందాం.ఫెరారీ 296 జీబీటీ: రోసో రుబినో ఫెరారీ 296 GTB అనేది దుల్కర్ గ్యారేజీలో మొదటి హైబ్రిడ్ ఫెరారీ. దీని ప్రారంభ ధర భారతదేశంలో దాదాపు రూ. 5.88 కోట్లు. ఈ కారును దుల్కర్ సల్మాన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ.. చెన్నై వీధుల్లో చాలాసార్లు కనిపించారు.పోర్స్చే 911 జీటీ3: ఈ కారు ధర రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించిస్తుందని దుల్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. ఇది ఆయనకు ఇష్టమైన కార్లలో ఒకటని కూడా సమాచారం.మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ: ఈ కారు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా దుల్కర్ గ్యారేజిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని దుల్కర్ ఫ్యూచర్ క్లాసిక్ అని పిలుస్తారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 2.54 కోట్లు.బీఎండబ్ల్యు ఎం3 ఈ46: ఆటోమొబైల్ ఔత్సాహికులు ఈ కారును అత్యుత్తమ బీఎండబ్ల్యుగా పరిగణిస్తారు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 50 లక్షలు అని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తిలో లేదు. కానీ ఇప్పటికే కొనుగోలు చేసినవారు మాత్రం వినియోగిస్తున్నారు.దుల్కర్ సల్మాన్ ఇతర కార్లునటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా.. పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ ఏఎంజీ ఏ45, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫోక్స్వ్యాగన్ పోలో జీటీఐ, మినీ కూపర్ ఎస్, మాజ్డా ఎంఎక్స్5, టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే! -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు
జీఎస్టీ 2.0 ఎప్పుడెప్పుడు అమలవుతుందా.. కొత్త కార్లు ఎప్పుడు కొనుగోలు చేద్దామా అని చాలామంది ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. దీంతో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.జీఎస్టీ సంస్కరణలు అమలులోకి రావడంతో చిన్నకార్ల ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో కార్లను కొనుగోలు చేయడానికి వాహనప్రియులు ఎగబడ్డారు. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటిరోజే.. మారుతి సుజుకి (Maruti Suzuki) 30,000 యూనిట్ల కార్లను విక్రయించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) సుమారు 11,000 కార్లను విక్రయించింది. టాటా మోటార్స్ (Tata Motors) కూడా 10,000 కార్లను విక్రయించింది.ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగడానికి టిప్స్దేశంలో చిన్న కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఆటోమొబైల్ కంపెనీలు జీఎస్టీ ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు అందిస్తున్నాయి. రాబోయి రోజుల్లో కూడా ఈ సేల్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. సోమవారం కార్లను కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో డీలర్షిప్లకు తరలిరావడంతో, ఆటోమోటివ్ డీలర్ల రద్దీ పెరిగిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది. -
కారు మైలేజ్ పెరగడానికి టిప్స్
ఒక కారు కొనుగోలు చేయాలంటే కొందరు ఫీచర్స్ చూస్తారు, ఇంకొందరు డిజైన్ చూస్తారు, మరికొందరు సేఫ్టీ చూస్తుంటారు. అయితే చాలామందికి కావల్సినది మాత్రం మంచి మైలేజ్ ఇచ్చే కార్లే. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఉత్తమ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఉపయోగించే కారు మైలేజ్ కొంత ఎక్కువ ఇవ్వాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అలాంటి టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం.➤కారును డ్రైవ్ చేసే సమయంలో.. తక్కువ వేగంలో టాప్ గేర్, ఎక్కువ వేగంలో స్టార్టింగ్ గేర్స్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే ఇంజిన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి సరైన గేర్ ఉపయోగించాలి.➤అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం, ఎక్స్లేటర్ వేగాన్ని పెంచడం వంటివి చేయకూడదు.➤ఎక్కువ మైలేజ్ కావలనంటే కారు టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.➤కారు కెపాసిటీ కంటే ఎక్కువ లోడింగ్ వేయకూడదు. ఓవర్ లోడింగ్ మీ కారు మైలేజిని తగ్గిస్తుంది.➤కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి. ఇది మైలేజిని మెరుగుపరుస్తుంది.➤దుమ్ముపట్టిన ఎయిర్ ఫిల్టర్స్.. ఇంజిన్లో గాలి ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్స్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: క్విడ్ స్పెషల్ ఎడిషన్: 500 మందికి మాత్రమే! -
క్విడ్ స్పెషల్ ఎడిషన్: 500 మందికి మాత్రమే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. భారతదేశంలో క్విడ్ లాంచ్ చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్ను లాంచ్ చేసింది. అయితే దీనిని 500 మందికి మాత్రమే విక్రయించనుంది.రెనాల్ట్ క్విడ్ 10వ యానివర్సరీ ఎడిషన్ ఆటోమాటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 5.63 లక్షలు, రూ. 5.14 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది డ్యూయల్ టోన్ కలర్ ఎంపికలో మార్కెట్లో లాంచ్ అయింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.4.50 లక్షలు తగ్గిన జీప్ ధరలులిమిటెడ్ ఎడిషన్ క్విడ్ లోపలి భాగంలో 10వ వార్షికోత్సవ నేపథ్యంతో కూడిన సీటు డిజైన్లు, ప్రీమియం డీటెయిలింగ్లు ఉన్నాయి. సీట్లపై ఎల్లో కలర్ యాక్సెంట్స్, మెటల్ మస్టర్డ్ స్టిచ్తో కూడిన లెథరెట్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సరౌండ్, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు, పుడిల్ లాంప్లు మొదలైనవి ఉన్నాయి. ఇందులోని అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్బెల్ట్లు, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లను పొందుతుంది. -
తండ్రికి క్రికెటర్ తిలక్ వర్మ బహుమతి.. ధర ఎంతంటే..
ప్రముఖ భారతీయ క్రికెటర్ తిలక్ వర్మ తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈని బహుమతిగా ఇచ్చారు. తన తల్లిదండ్రులకు ఈ కారు బహుమతినిస్తూ దిగిన ఫొటోలు ‘మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అప్లోడ్ చేశారు. ఇవికాస్తా వైరల్గా మారాయి. ఈ మోడల్ విడుదలైనప్పటి నుంచి భారత మార్కెట్లో వినియోదారుల ఆదరణ పెరుగుతోంది. వేరియంట్ను అనుసరించి ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9వీ ఫీచర్లు, ధరలు విభిన్నంగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కీలక ఫీచర్లుబ్యాటరీ వేరియంట్లు: 59 కిలోవాట్హవర్ (542 కిలోమీటర్ల పరిధి) లేదా 79 కిలోవాట్హవర్ (656 కిలోమీటర్ల పరిధి)పవర్ అవుట్పుట్: వేరియంట్ను అనుసరించి 282బీహెచ్పీ, 380ఎన్ఎమ్ టార్క్ వరకు పవర్ ఇస్తుంది.ఇన్ఫోటైన్మెంట్: ట్రిపుల్ 12.3 అంగుళాల స్క్రీన్లు + రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు.ఎంఏఐఏ (మహీంద్రా AI ఆర్కిటెక్చర్)క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 8295 ప్రాసెసర్24 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్భద్రత: 7 ఎయిర్ బ్యాగులు, లెవల్ 2+ ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా.ధరల శ్రేణి (ఎక్స్-షోరూమ్): వేరియంట్ను బట్టి రూ.21.90 లక్షలు నుంచి రూ.31.25 లక్షలు వరకు(కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది)ఇదీ చదవండి: పని మొదలు పెట్టాలంటే ఏడుపొస్తుంది! -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ.4.50 లక్షలు తగ్గిన జీప్ ధరలు
కొత్త జీఎస్టీ (GST) ఈ రోజు (సోమవారం) అమలులోకి వచ్చింది. అంతకంటే ముందు అమెరికన్ కార్ల తయారీ సంస్థ అయిన జీప్ (Jeep) ఇండియన్ మార్కెట్లోని తన కార్ల ధరలను గరిష్టంగా రూ. 4.57 లక్షలు తగ్గించినట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు కూడా నేటి నుంచే (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తాయి.➤జీప్ కంపాస్: పాత ధర రూ. 18.99 లక్షలు & కొత్త ధర రూ. 17.73 లక్షలు (రూ. 1.26 లక్షలు తగ్గింది)➤జీప్ మెరిడియన్ : పాత ధర రూ. 24.99 లక్షలు & కొత్త ధర రూ. 23.33 లక్షలు (రూ. 1.66 లక్షలు తగ్గింది)➤జీప్ రాంగ్లర్ : పాత ధర రూ. 68.65 లక్షలు & కొత్త ధర రూ. 64.08 లక్షలు (రూ. 4.57 లక్షలు తగ్గింది)➤జీప్ గ్రాండ్ చెరోకీ : పాత ధర రూ. 67.50 లక్షలు & కొత్త ధర రూ. 63.00 లక్షలు (రూ. 4.50 లక్షలు తగ్గింది)ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: చౌకగా లభించే కార్ల జాబితాజీప్ కంపెనీ ఇప్పటి వరకు భారతదేశంలో లాంచ్ చేసిన దాదాపు అన్ని కార్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి దేశీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందగలుగుతున్నాయి. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: చౌకగా లభించే కార్ల జాబితా
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ 2.0 రేపటి (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత చాలా వరకు కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఇది భారత ఆటో రంగంలోని.. అతిపెద్ద ధరల సవరణలలో ఒకటిగా నిలిచింది. బ్రాండ్ వారీగా ధరల తగ్గింపు వివరాలు ఇక్కడ చూడవచ్చు.జీఎస్టీ 2.0 కింద చౌకగా లభించే కార్లు - తగ్గిన ధరమహీంద్రా▸బొలెరో నియో: రూ. 1.27 లక్షలు తగ్గుతుంది▸ఎక్స్యూవీ 3ఎక్స్ఓ: రూ. 1.40 లక్షల తగ్గింపు▸థార్ రేంజ్: రూ. 1.35 లక్షల వరకు తక్కువ▸థార్ రోక్స్: రూ. 1.33 లక్షల తగ్గింపు▸స్కార్పియో క్లాసిక్: రూ. 1.01 లక్షలు తగ్గుతుంది▸స్కార్పియో ఎన్: రూ. 1.45 లక్షల తగ్గింపు▸ఎక్స్యూవీ 700: రూ. 1.43 లక్షలు తక్కువటాటా మోటార్స్⬩టియాగో: రూ. 75,000 తక్కువ⬩టిగోర్: రూ. 80,000 తగ్గింపు⬩ఆల్ట్రోజ్: రూ. 1.10 లక్షలు తగ్గింపు⬩పంచ్: రూ. 85,000 తక్కువ⬩నెక్సాన్: రూ. 1.55 లక్షలు తక్కువ ధరకు⬩హారియర్: రూ. 1.40 లక్షలు తగ్గింపు⬩సఫారీ: రూ. 1.45 లక్షలు తక్కువ ధర⬩కర్వ్: రూ. 65,000 తగ్గింపుటయోటా»ఫార్చ్యూనర్: రూ. 3.49 లక్షలు తగ్గింపు»లెజెండర్: రూ. 3.34 లక్షలు తక్కువ»హైలక్స్: రూ. 2.52 లక్షలు తక్కువ»వెల్ఫైర్: రూ. 2.78 లక్షల తగ్గింపు»క్యామ్రీ: రూ. 1.01 లక్షలు తక్కువ»ఇన్నోవా క్రిస్టా: రూ. 1.80 లక్షల తగ్గింపు»ఇన్నోవా హైక్రాస్: రూ. 1.15 లక్షల తగ్గింపురేంజ్ రోవర్➢రేంజ్ రోవర్ 4.4పీ SV LWB: రూ. 30.4 లక్షలు తక్కువ➢రేంజ్ రోవర్ 3.0డీ SV LWB: రూ. 27.4 లక్షలు తగ్గింపు➢రేంజ్ రోవర్ 3.0పీ ఆటోబయోగ్రఫీ: రూ. 18.3 లక్షలు తగ్గింది➢రేంజ్ రోవర్ స్పోర్ట్ 4.4 SV ఎడిషన్ టూ: రూ. 19.7 లక్షల తగ్గింపు➢వేలార్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 6 లక్షలు తక్కువ➢ఎవోక్ 2.0D/2.0P ఆటోబయోగ్రఫీ: రూ. 4.6 లక్షల తగ్గింపు➢డిఫెండర్ రేంజ్: రూ. 18.6 లక్షల వరకు తగ్గింపు➢డిస్కవరీ: రూ. 9.9 లక్షల తగ్గింపు➢డిస్కవరీ స్పోర్ట్: రూ. 4.6 లక్షలు తక్కువకియా▸సోనెట్: రూ. 1.64 లక్షలు తక్కువ▸సిరోస్: రూ. 1.86 లక్షల తగ్గింపు▸సెల్టోస్: రూ. 75,372 తగ్గింపు▸కారెన్స్: రూ. 48,513 తక్కువ▸కారెన్స్ క్లావిస్: రూ. 78,674 తగ్గింపు▸కార్నివాల్: రూ. 4.48 లక్షల తగ్గింపు▸స్కోడా - రూ. 5.8 లక్షల వరకు ప్రయోజనాలు▸కోడియాక్: రూ. 3.3 లక్షల తగ్గింపు▸కుషాక్: రూ. 66,000 తగ్గింపు▸స్లావియా: రూ. 63,000 తగ్గింపుహ్యుందాయ్ㆍగ్రాండ్ ఐ10 నియోస్: రూ. 73,808 తగ్గింపుㆍఆరా: రూ. 78,465 తక్కువㆍఎక్స్టర్: రూ. 89,209 తగ్గింపుㆍఐ20: రూ. 98,053 తక్కువㆍవెన్యూ: రూ. 1.23 లక్షలు తగ్గింపుㆍవెర్నా: రూ. 60,640 తక్కువㆍక్రెటా: రూ. 72,145 తగ్గింపుㆍఅల్కాజార్: రూ. 75,376 తక్కువㆍటక్సన్: రూ. 2.4 లక్షలు తగ్గింపురెనాల్ట్కిగర్: రూ. 96,395 తక్కువమారుతి సుజుకి⭑ఆల్టో కే10: రూ. 40,000 తక్కువ⭑వ్యాగన్ఆర్: రూ. 57,000 తగ్గింపు⭑స్విఫ్ట్: రూ. 58,000 తక్కువ⭑డిజైర్: రూ. 61,000 తక్కువ⭑బాలెనో: రూ. 60,000 తగ్గింపు⭑ఫ్రాంక్స్: రూ. 68,000 తక్కువ⭑బ్రెజ్జా: రూ. 78,000 తగ్గింపు⭑ఈకో: రూ. 51,000 తక్కువ⭑ఎర్టిగా: రూ. 41,000 తగ్గింపు⭑సెలెరియో: రూ. 50,000 తక్కువ⭑ఎస్-ప్రెస్సో: రూ. 38,000 తగ్గింపు⭑ఇగ్నిస్: రూ. 52,000 తక్కువ⭑జిమ్నీ: రూ. 1.14 లక్షలు తక్కువ⭑ఎక్స్ఎల్6: రూ. 35,000 తగ్గింపు⭑ఇన్విక్టో: రూ. 2.25 లక్షల తగ్గింపు -
అమ్మకాల్లో సరికొత్త రికార్డ్: 5 లక్షల మంది కొన్నారు!
భారతదేశంలో బజాజ్ చేతక్ లాంచ్ అయినప్పటి నుంచి ఐదు లక్షల అమ్మకాలను అధిగమించింది. నవంబర్ 2023లో 1,00,000 అమ్మకాల మైలురాయిని చేరుకున్న ఈ స్కూటర్.. తాజాగా 5,10,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.2020లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి బజాజ్ చేతక్ 46 నెలల్లో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. అయితే గడిచిన 10 నెలల కాలంలోనే 2.06 లక్షల కంటే ఎక్కువ సేల్స్ పొందగలిగింది. మొత్తం మీద ఐదు లక్షల సేల్స్ అధిగమించింది. దీన్నిబట్టి చూస్తే దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే!బజాజ్ చేతక్ అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం.. ఇది 3001, 3501, 3502, 3503 అనే వేరియంట్లలో అందుబాటులో ఉండటం మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా 3,800 కంటే ఎక్కువ టచ్పాయింట్లతో కూడిన సర్వీస్ నెట్వర్క్ కూడా అని తెలుస్తోంది. ఈ స్కూటర్లు లేటెస్ట్ డిజైన్ కలిగి.. 3 కిలోవాట్ బ్యాటరీ, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో అబందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.99,900 (ఎక్స్ షోరూమ్). -
ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే!
ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తరువాత జాబితాలో డిజైర్, క్రెటా, వ్యాగన్ ఆర్, నెక్సాన్ మొదలైనవి నిలిచాయి. ఈ కథనంలో.. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏవో చూసేద్దాం.➤మారుతి ఎర్టిగా: 18,445➤మారుతి డిజైర్: 16,509➤హ్యుందాయ్ క్రెటా: 15,924➤మారుతి వ్యాగన్ఆర్: 14,552➤టాటా నెక్సాన్: 14,004➤మారుతి బ్రెజ్జా: 13,620➤మారుతి బాలెనో: 12,549➤మారుతి ఫ్రాంక్స్: 12,422➤మారుతి స్విఫ్ట్: 12,385➤మారుతి ఈకో: 10,785పై జాబితాను గమనిస్తే.. టాప్ 10 కార్లలో 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. మిగిలిన రెండు హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా, టాటా మోటార్స్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!ఈ నెలలో (సెప్టెంబర్) కూడా.. దేశంలో వాహన అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం వాహనాల ధరల తగ్గుదల, ఫెస్టివల్ సీజన్. విజయదశమి, దీపావళి సందర్భంగా చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో వాహనాల సేల్స్ పెరుగుతాయి. -
జీఎస్టీ 2.0 రేపటి నుంచే.. ఈ చిన్న కార్లు మరింత చౌక!
జీఎస్టీ 2.0 కొత్త నిర్మాణం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. సవరించిన పన్ను నిర్మాణం కారణంగా దేశంలో ప్యాసింజర్ వాహనాలపై పన్ను భారం గణనీయంగా తగ్గనుంది. ఫలితంగా దేశంలోని కార్ల తయారీ సంస్థలు ధరల తగ్గింపును ప్రకటించాయి. జీఎస్టీ తగ్గింపుతో హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వంటి చిన్న కార్లలో ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. 10 పాపులర్ చిన్న కార్ల ధరలు ఎలా తగ్గుతున్నాయన్నది ఇప్పుడు చూద్దాం..మారుతి సుజుకి ఆల్టో కె10మారుతి సుజుకి ఆల్టో కె 10 దేశంలో అత్యంత చౌక ఐసీఈ-శక్తితో నడిచే హ్యాచ్ బ్యాక్. దాని ప్రాక్టికాలిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, అధిక విలువ ప్రతిపాదన కారణంగా ఆల్టో కె 10 ప్రైవేట్ కొనుగోలుదారుల విభాగంలోనే కాకుండా, క్యాబ్ విభాగంలో కూడా ప్రాచుర్యం పొందింది. మారుతి సుజుకి ఆల్టో కె 10 ధరలు వేరియంట్లను బట్టి రూ .107,600 వరకు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి చిన్న హ్యాచ్ బ్యాక్ ధర రూ .369,900 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోమారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రైవేట్, టాక్సీ విభాగాలలో భారతదేశంలో మరొక ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్. 1.0-లీటర్ ఇంజిన్, మినీ ఎస్ యూవీ స్టాన్స్ డిజైన్ ఫిలాసఫీతో నడిచే ఈ చిన్న హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .349,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. ఎస్-ప్రెస్సో వేరియంట్ ను బట్టి రూ .129,600 వరకు ధర తగ్గింది.మారుతి సుజుకి సెలెరియోఆల్టో కె 10 లేదా ఎస్-ప్రెస్సో అంత ప్రాచుర్యం పొందకపోయినా మారుతి సుజుకి సెలెరియో కూడా దాని కాంపాక్ట్ డిజైన్, మెరుగైన ఫీచర్లతో చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. ఇది సెప్టెంబర్ 22 నుండి రూ .469,900 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. మారుతి సుజుకి ఈ మోడల్కు రూ .94,100 వరకు ధర తగ్గింపును ప్రకటించింది.మారుతి సుజుకి వ్యాగన్ఆర్ఆల్టో కె 10 తర్వాత మారుతి సుజుకి నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్. ఈ టాల్ బాయ్ హ్యాచ్ బ్యాక్ భారతదేశంలో చాలా కాలంగా వ్యాపారంలో ఉంది. ముఖ్యంగా టాక్సీ విభాగంలో ఇప్పటికీ దానికి కస్టమర్ల ఆదరణ కొనసాగుతోంది. జీఎస్టీ తగ్గింపు తరువాత, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రూ .498,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. తగ్గింపు రూ .79,600.మారుతి సుజుకి స్విఫ్ట్ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటి, భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ కారు మారుతి సుజుకి స్విఫ్ట్. జిఎస్టి 2.0 కింద దీనినై రూ .84,600 వరకు ధరను తగ్గించింది కంపెనీ. సెప్టెంబర్ 22 నుండి ఈ హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .578,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.మారుతి సుజుకి బాలెనోనెక్సా రిటైల్ నెట్ వర్క్ ద్వారా విక్రయించే మారుతి సుజుకి బాలెనో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ .598,900 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. జీఎస్టీ 2.0 పాలనలో ఈ హ్యాచ్ బ్యాక్ ధర రూ.86,100 వరకు తగ్గింది.మారుతి సుజుకి ఇగ్నిస్మారుతి సుజుకి నుండి వచ్చిన స్పోర్టీ,కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి ఇగ్నిస్. నెక్సా రిటైల్ చైన్, ఇగ్నిస్ ద్వారా కంపెనీ దీన్ని విక్రయిస్తోంది. సవరించిన పన్ను నిర్మాణం కింద దీని ధర రూ .71,300 వరకు తగ్గింది. ఈ హ్యాచ్ బ్యాక్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభ ధర రూ .535,100 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.టాటా టియాగోటాటా టియాగో అధిక ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ తో పాటు ప్రీమియం ఫీచర్లు, కఠినమైన బిల్డ్ క్వాలిటీతో భారతీయ హ్యాచ్ బ్యాక్ మార్కెట్లో గేమ్ చేంజర్ ఈ కారు. ఎస్యూవీలపై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, టాటా మోటార్స్ టియాగో హ్యాచ్ బ్యాక్ ను భారతదేశంలో విక్రయిస్తూనే ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ కు పోటీ అయిన ఈ హ్యాచ్ బ్యాక్ కొత్త పన్ను విధానంలో రూ .75,000 వరకు ధర తగ్గింపును పొందింది.టాటా ఆల్ట్రోజ్మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20 వంటి ప్రత్యర్థులతో నేరుగా పోటీ పడే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ జీఎస్టి 2.0 కింద రూ .110,000 భారీ ధర తగ్గింపును పొందింది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో పాటు విస్తృత రేంజ్ ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభిస్తుంది. ఆల్ట్రోజ్ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభ ధర రూ .630,390 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్దక్షిణ కొరియా ఆటో బ్రాండ్ ఇండియా లైనప్ లో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ20 నియోస్.. జీఎస్టి 2.0 పాలనలో రూ .73,800 వరకు ధరను తగ్గించింది. దీనితో ఈ హ్యాచ్ బ్యాక్ సెప్టెంబర్ 22 నుండి రూ .547,278 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభిస్తుంది. -
వాహన ధరలు తగ్గించిన సుజుకీ మోటార్సైకిల్
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకీ మోటార్సైకిల్ ఇండియా’ తన వాహన ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్లు ఎంపిక చేసుకున్న మోడల్ను బట్టి రూ.18,024 వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.ఆటోమొబైల్స్పై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ‘జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తున్నాము. పండుగ సీజన్లో టూవీలర్స్కు డిమాండ్ మరింత ఊపందుకోవచ్చు’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా అన్నారు.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
బిగ్ బిలియన్ డేస్ సేల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను ఇక ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం బైక్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మేరకు ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కు ముందు రాయల్ ఎన్ఫీల్డ్ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ నుండి ఈ ప్రకటన వచ్చింది.ఈ భాగస్వామ్యం కింద రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ మోడల్ రేంజ్ బైక్లు సెప్టెంబర్ 22 నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి వచ్చే రోజు కూడా ఇదే కావడం గమానార్హం.అంటే బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లను కొనుగోలు చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోటార్ సైకిళ్లను ఆన్లైన్ లో అందించడం ఇదే మొదటిసారి. బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవా క్లాసిక్ 350, న్యూ మెటియోర్ 350 వంటి మోడళ్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.బెంగళూరు, గురుగ్రామ్, కోల్ కతా, లక్నో, ముంబైలలో ఉన్న కస్టమర్లు పూర్తి జీఎస్టీ ప్రయోజనాలతో పాటు వివిధ సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలను ఉపయోగించి ఆర్డర్లు ఇవ్వవచ్చు. తమకు నచ్చిన మోడల్ బైక్లను కొనుగోలు చేయవచ్చు. -
మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!
వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) మార్పుల నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మోడల్ను బట్టి ధర తగ్గింపు రూ.1,29,600 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.ద్విచక్ర వాహనాల యూజర్లు .. కార్లకు అప్గ్రేడ్ కావడంలో సహాయకరంగా ఉండేలా, జీఎస్టీపరంగా 8.5% తగ్గింపునకు అదనంగా, చిన్న కార్ల ధరలను మరింతగా తగ్గించినట్లు సంస్థ వివరించింది. దేశీయంగా కార్ల వినియోగం చాలా తక్కువగా ఉన్నందున మార్కెట్ దిగ్గజం హోదాలో కార్లను మరింత అందుబాటులో స్థాయిలోకి తెచ్చేందుకు తాము చొరవ తీసుకుంటున్నట్లు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. గత కొన్నాళ్లుగా నెమ్మదిస్తున్న ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్ పుంజుకోవడానికి ధరల తగ్గింపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
నిస్సాన్ మాగ్నైట్కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!
నిస్సాన్ కంపెనీ అక్టోబర్ 2024లో మాగ్నైట్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసింది. దీంతో సంస్థ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ సెటప్తో భారతదేశంలో తయారు చేసిన మాగ్నైట్ను సౌదీ అరేబియాకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. అదే సమయంలో దేశీయ విఫణిలో విక్రయించడానికి కూడా ఉత్పత్తి చేస్తోంది. కాగా ఇప్పుడు సౌదీ అరేబియా మార్కెట్లో విక్రయించిన నిస్సాన్ మాగ్నైట్ కోసం బ్రాండ్ రీకాల్ జారీ చేసింది.బ్రేక్ పైపు, హీట్ షీల్డ్ మధ్య తగినంత ఖాళీ లేకపోవడం వల్ల కలిగే భద్రతా సమస్యను నిస్సాన్ గుర్తించింది. ఇది బ్రేక్ పెడల్ పనితీరును దెబ్బతీస్తుందని.. ప్రమాదానికి కారణమవుతుందని కంపెనీ వెల్లడించింది. బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజీకి కూడా దారితీస్తుందని కూడా సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి నిస్సాన్ రీకాల్ జారీచేసింది. ఈ రీకాల్ నిర్ణయం సౌదీ అరేబియాలోని మొత్తం 1,552 యూనిట్ల మాగ్నైట్ ను ప్రభావితం చేయబోతోంది. అయితే నిస్సాన్ మోటార్ ఇండియా భారతదేశానికి సంబంధించిన మోడళ్లకు ఎటువంటి రీకాల్ జారీ చేయలేదు.ఇదీ చదవండి: ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!భారతదేశం, సౌదీ అరేబియాలో విక్రయించే నిస్సాన్ మాగ్నైట్ మోడల్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను పంచుకుంటాయి. తేడా ఏమిటంటే ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ అయితే.. సౌదీ అరేబియాలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఈ కారణంగానే బ్రేక్ ఫ్లూయిడ్ పైపుల రూటింగ్ అనేది కొంత భిన్నంగా ఉంటుంది. ఇదే సమస్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. -
గ్లోబల్గా చైనా ఈవీలతో టాటా పోటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ధరలపరంగా పోటీపడటంపై దృష్టి పెడుతున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే కొన్ని అంశాల్లో దీటుగా పోటీనిస్తుండగా, వచ్చే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో చైనా తయారీ సంస్థలకు సరిసమానమైన రేట్లకే వాహనాలను అందించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా తయారీ, స్వావలంబన సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ఉత్పత్తి స్థాయితో పాటు ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకాలు చైనా కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని, అందుకే అవి తక్కువ రేట్లకు ఉత్పత్తులను అందించగలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా స్థిరమైన పాలసీలపరంగా ప్రభుత్వ తోడ్పాటు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 5 శాతానికి పెరిగిందని చెప్పారు. టాటా మోటర్స్ ఆగస్టులో 7,111 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గతేడాది ఆగస్టులో నమోదైన 4,392 యూనిట్లతో పోలిస్తే ఇది 62 శాతం అధికం. -
ఈ స్కూటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పిన కంపెనీ
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తమ కస్టమర్లకు మంచి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా 500 ఎక్స్ పీరియన్స్ సెంటర్ (ఈసీ)లను అధిగమించింది. ఇది దాని రిటైల్ విస్తరణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు 2025), ఏథర్ 101 కొత్త ఈసీలను జోడించింది."మా వృద్ధి భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది" అని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా అన్నారు. "దక్షిణ భారతదేశం మా కంచుకోటగా నిలిచినప్పటికీ, రిజ్తా విజయం టైర్-2, 3 నగరాల్లో మా విస్తరణను వేగవంతం చేసింది" అన్నారు.ఆగ్రా, జబల్పూర్, బిలాస్పూర్, వడోదర, సుందర్గఢ్ వంటి నగరాల్లో ఏథెర్ ఇప్పుడు ఈసీలను కలిగి ఉంది. అలాగే కాలికట్, గుంటూరు, హల్ద్వానీ, కోటా వంటి పట్టణాల్లోకి చొచ్చుకుపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో చోట 50కి పైగా ఈసీలు ఉన్నాయి. బెంగళూరులో ఏకంగా 18 కేంద్రాలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా ఏథర్ మార్కెట్ వాటా 2026 తొలి త్రైమాసికంలో 14.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరం ఇది 7.6% ఉండగా రెట్టింపు అయింది. మధ్య భారతదేశంలో వాటా 10.7 శాతానికి పెరిగగా, దక్షిణ భారతదేశంలో 22.8 శాతంతో ఆధిపత్యాన్ని చాటింది.ఏథర్ పోర్ట్ ఫోలియోలో పనితీరు-ఆధారిత 450 సిరీస్, ఫ్యామిలీ-ఫోకస్డ్ రిజ్టా ఉన్నాయి. అథెర్ కమ్యూనిటీ డే 2025లో ఇది తన నెక్స్ట్-జెన్ ఈఎల్ ప్లాట్ ఫామ్, ఏథర్ స్టాక్ 7.0, ఇన్ఫినిట్ క్రూయిజ్, పోథోల్ అలర్ట్స్ వంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది.తమిళనాడులోని హోసూర్ లో ఏథర్ రెండు ప్లాంట్ లను నిర్వహిస్తోంది. మహారాష్ట్రలోని బిడ్కిన్ లో మూడవ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది మొత్తం సామర్థ్యాన్ని సంవత్సరానికి 1.42 మిలియన్ యూనిట్లకు పెంచుతుంది. భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈసీలను 700లకు పైగా పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
393 బైకులు వెనక్కి!.. డుకాటి కీలక ప్రకటన
డ్యూకాటీ తన పానిగేల్ వీ4, స్ట్రీట్ఫైటర్ వీ4 బైకులకు రీకాల్ ప్రకటించింది. వెనుక చక్రాల ఇరుసులో లోపం ఉన్నందున డుకాటి ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య భారతదేశంలోని 393 యూనిట్లను ప్రభావితం చేస్తుంది. దీనిని పరిష్కరించడానికి సంస్థ సిద్ధమైంది.భారతదేశంలో 2018 నుంచి 2024 మధ్య తయారైన పానిగేల్ వీ4, 2018 నుంచి 2025 మధ్య తయారైన స్ట్రీట్ఫైటర్ వీ4 ఈ రీకాల్ ద్వారా ప్రభావితమయ్యాయి. ఈ రీకాల్ ద్వారా లోపభూయిష్ట వెనుక ఆక్సిల్ను చెక్ చేయడంతో పాటు.. ఉచితంగా సమస్యను పరిష్కరించనుంది.ఇదీ చదవండి: సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్7 బైక్: ధర రూ.15.5 లక్షలు!ఒక మోటార్ సైకిల్ కదులుతున్నప్పుడు వెనుక ఇరుసు విరిగిపోయిన ఒక సంఘటన తర్వాత డుకాటి విస్తృత ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా.. బైక్ తయారీదారు యునైటెడ్ స్టేట్స్లో అమ్ముడైన 10,000 కంటే ఎక్కువ మోటార్సైకిళ్లను రీకాల్ జారీ చేసింది. -
ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!
భారతదేశంలో ఈ20 పెట్రోల్ వినియోగించాలని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. కొందరు నిపుణులు ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అయితే చండీగఢ్కు చెందిన ఒక వ్యక్తి ఈ20 ఫ్యూయెల్ పెట్రోల్ హై-ఎండ్ వాహనాలపై చూపే ప్రభావాన్ని ఎత్తి చూపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక స్నేహితుడి ఫెరారీ కారుకు ఈ20 పెట్రోల్ ఉపయోగించాడు. అయితే ఆ కారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వలేదు. కొందరు నిపుణులు ఈ20 ఇంధనం వల్లనే.. ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీనికి గడ్కరీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.నిజం ఏమిటంటే.. సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇథనాల్ గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఫ్యూయెల్ ట్యాంక్లో తేమశాతం పెరుగుతుంది. ఫలితంగా కారు స్టార్ట్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని ఆ వ్యక్తి ఎక్స్ ఖాతాలో వివరించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఫెరారీ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఈ20 ఫ్యూయెల్ కారణమా? లేక ఇంకేమైనా సమస్యా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే E20 ఇంధనం వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఇథనాల్ కారణంగానే ఇలాంటి సమస్య వచ్చినట్లు ఇదివరకు కంప్లైంట్స్ రాలేదు.ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్ఇప్పటికే బ్రెజిల్, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ20 ఫ్యూయెల్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో దీని వినియోగాన్ని పెంచాలని.. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో నితిన్ గడ్కరీ.. ఈ20 పెట్రోల్ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇథనాల్-మిశ్రమ ఇంధనం CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని.. ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం 2023లో భారతదేశంలో ఈ20 పెట్రోల్ను ప్రవేశపెట్టింది.ఈ20 పెట్రోల్ కారణంగా వెహికల్ మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. E20 పెట్రోల్తో చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవని చెబుతూ.. చెరకు, మొక్కజొన్న రైతులు ఆర్థికంగా లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక SIAM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.A friend’s Ferrari was filled with E20 petrol, and just a few days later it refused to start. The technicians say the damage is due to the E20 fuel. Now tell me, will Gadkari take responsibility for this? After spending crores on the car, paying road tax, vehicle GST tax, and… pic.twitter.com/4j9MGBjNGS— Rattan Dhillon (@ShivrattanDhil1) September 17, 2025 -
సిద్ధమవుతున్న డబ్ల్యూఎన్7 బైక్: ధర రూ.15.5 లక్షలు!
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. కంపెనీ దీనిని 'డబ్ల్యుఎన్7' పేరుతో మార్కట్లో లాంచ్ చేయనుంది. ఇది ఒక ఛార్జ్పై 130 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.హోండా డబ్ల్యుఎన్7 బైక్.. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 30 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అయితే 6కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు అని తెలుస్తోంది. ఈ బైకులో 18కేడబ్ల్యు లిక్విడ్ కూల్డ్ మోటార్ ఉంటుంది. కాగా ఈ బైక్ బరువు 217 కేజీలు అని సమాచారం.హోండా డబ్ల్యుఎన్7 బైక్ 5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్సింక్ కనెక్టివిటీతో వస్తుంది. ఇందులో ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ముందు భాగంలోని హెడ్లైట్పై పెద్దదిగా కనిపిస్తుంది. కంపెనీ ఈ బైకును యూకేలో 12999 పౌండ్స్కి (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 15.5 లక్షలు) విక్రయించే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ భారతీయ విఫణిలో లాంచ్ అయ్యే అవకాశం లేదని సమాచారం. -
మరో నాలుగు రోజులు ఇంతే..
భారతదేశం అంతటా ద్విచక్ర వాహన డీలర్షిప్ల్లో షోరూమ్ బుకింగ్లు దాదాపు స్తంభించాయి. సెప్టెంబర్ 4న సవరించిన పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ధరల తగ్గింపునకు వేచిచూస్తున్నారు.ఏదేమైనా, ఈ ప్రకటన విస్తృతంగా కొనుగోలుదారులను కట్టిపడేసింది. వినియోగదారులు తాము కొనాలనుకునే ఉత్పత్తులపై త్వరలో ధరల రాయితీ ఉంటుందని నమ్మి ఇలా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ‘జీఎస్టీ రేటు తగ్గింపును ప్రధాని ప్రకటించినప్పటి నుంచి అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 4న చేసిన కొత్త రేట్లను అధికారికంగా ఆమోదం తెలపడంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు’ అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) డీలర్ ఆశిష్ పాండే చెప్పారు.‘సెప్టెంబర్ 22 కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు తర్వాతే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇది భవిష్యత్తులో సాధారణ ప్రక్రియగానే మారుతుందని, పరిమిత సమయ పథకం కాదని వినియోగదారులకు తెలుసు’ అన్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే షోరూమ్ బుకింగ్స్ దాదాపు 50% పడిపోయాయని దేశవ్యాప్తంగా డీలర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు -
జాన్ అలుకాస్ కార్ల కలెక్షన్లో ఈ కొత్త కార్ హైలైట్..
చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్కు అలా కాదు.. బెస్ట్ కార్ తన గ్యారేజ్లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్స్టర్ను జోడించారు.అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్స్టర్ఎంజీ సైబర్స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.బటర్ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ల బ్యాటరీతో ఈ కార్ 580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది. -
జేఎల్ఆర్పై సైబర్ దాడి.. సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తి నిలిపివేత
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ అటాక్తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును కొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ‘మేము మా ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 బుధవారం వరకు పొడిగించాం. సైబర్ అటాక్ సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ ప్రపంచ కార్యకలాపాల నియంత్రిత వ్యవస్థలపై వివిధ దశలను పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ నిరంతర అంతరాయానికి చింతిస్తున్నాం. దర్యాప్తు పురోగతి వివరాలను అప్డేట్ చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.మూడు ప్లాంట్లపై ప్రభావం..టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్వుడ్, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్ అటాక్ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే రెండు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్ఆర్, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.33 వేల మంది ఉద్యోగులు..ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్వేర్ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’ -
ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి
ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడు కృష్ణగిరిలో ఉన్న ఫ్యూచర్ఫ్యాక్టరీలో 10 లక్షల వాహనాలను(ఒక మిలియన్) ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. 2021 ఈ ప్లాంటులో తయారీ ప్రారంభించినప్పట్టి నుంచి నాలుగేళ్లలో ఈ మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్ స్కూట్లర్లు ఎస్1 పోర్ట్ఫోలియోకు, ఇటీవల విడుదల చేసిన రోడ్స్టర్ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు ఆదరణ లభించడంతో తయారీలో వృద్ధి సాధించగలిగామని వివరించింది.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ‘రోడ్స్టర్ ఎక్స్ప్లస్’ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. మిడ్నైట్ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. ‘‘మాపై నమ్మకం, మా లక్ష్యంపై విశ్వాసం ఉంచిన ప్రతి భారతీయుడు గర్వంచదగిన క్షణాలు ఇవి. నాలుగేళ్ల క్రితం ఒక ఆలోచనతో మొదలై నేడు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. శిలాజ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి ప్రపంచస్థాయిలో భారత్ను ఈవీ హబ్గా నిలపడం మా ధ్యేయం’’ అని ఓలా అధికార ప్రతినిధి ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్ -
ఆగస్టులో వాహన అమ్మకాలు ఇలా..
దేశీయంగా ఈ ఆగస్టులో 3,21,840 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. తగ్గిన డిమాండ్కు అనుగుణంగా కంపెనీలు డీలర్లకు సరఫరాను సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. 2024 ఇదే ఆగస్టులో అమ్ముడైన 3,52,921 వాహనాలతో పోలిస్తే ఈసారి 9% తగ్గాయి.‘‘జీఎస్టీ రేట్ల సవరణ కారణంగా ధరలు తగ్గే వీలుందని అంచనా వేసిన కస్టమర్లు వాహన కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా చేసుకున్నారు. దీంతో ఆగస్టులో డిమాండ్ తగ్గింది. అందుకు తగ్గట్లు కంపెనీలు సైతం డీలర్లకు సరఫరా సర్దుబాటు చేశాయి.’’ అని సియామ్ ప్రకటనలో తెలిపింది.👉అయితే ద్విచక్ర అమ్మకాల్లో 7% వృద్ది నమోదైంది. ఆగస్టులో మొత్తం 18,33,921 అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలు 17,11,662 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,60,866 నుంచి 11,06,638కు; స్కూటర్ల అమ్మకాలు 6,43,169 నుంచి 6,83,397కు పెరిగాయి. అయితే మోపెడ్లు మాత్రం 44,546 నుంచి 43,886కు పరిమితమయ్యాయి.👉త్రి చక్ర వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 8% వృద్ధి నమోదైంది. ఆగస్టులో 69,962 నుంచి 75,759 యూనిట్లకు పెరిగాయి.👉‘‘కేంద్రం జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో అందుబాటు ధరల వాహనాలు కస్టమర్లను ఆకర్షిస్తాయి. అలాగే పండుగ ఉత్సాహానికి మరింత ఉపకరిస్తుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. -
రూ.20.80 లక్షలు తగ్గిన కారు ధర: అంతా జీఎస్టీ ఎఫెక్ట్!
జీఎస్టీ సవరణల తరువాత దాదాపు అన్ని కంపెనీలు తగ్గిన తమ వాహనాల ధరలను ఇప్పటికే ప్రకటించాయి. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ తరుణంలో లెక్సస్ ఇండియా కూడా.. తగ్గిన ధరలను వెల్లడిందింది.లెక్సస్ ఇండియా దేశంలో విక్రయించే.. LX 500d ధర రూ.20.80 లక్షల వరకు తగ్గినట్లు పేర్కొంది(ఈ కారు అసలు ధర రూ. 2 కోట్ల కంటే ఎక్కువే). దేశంలో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు తగ్గిన ఈ ధరలు అమ్మకాలను కూడా పెంచే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.లెక్సస్ ES 300h ఎక్స్క్విజిట్ హైబ్రిడ్ సెడాన్ ఇప్పుడు రూ.64 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లభించనుంది. దీని ధర రూ. 1.47 లక్షలు తగ్గింది. లెక్సస్ 350హెచ్, ఆర్ఎక్స్ 350హెచ్, ఆర్ఎక్స్ 500హెచ్, ఎల్ఎమ్ 350హెచ్, ఎల్ఎక్స్ 500డీ ధరలు కూడా చాలా వరకు తగ్గాయి.ఇదీ చదవండి: 2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనాదేశంలోని చాలా లెక్సస్ హైబ్రిడ్ మోడల్స్.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రోడ్ పన్నుకు అర్హత పొందుతాయి. కాబట్టి ఆన్ రోడ్ ధరలు కూడా కొంత తగ్గుతాయి. హైబ్రిడ్ మోడళ్లను ఎంచుకునే కొనుగోలుదారులు రాష్ట్ర పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రోత్సాహకాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు వాటి ప్రభావవంతమైన ఖర్చులు మరింత తగ్గుతాయని తెలుస్తోంది. -
2025 నాటికి రెండు కోట్ల వాహనాలు: సీపీసీబీ అంచనా
నిర్దిష్ట వయసు దాటిన వాహనాలను ప్రజా రహదారులపై నడపడం నిషిద్ధం. ఇలాంటి వాహనాలను స్క్రాపేజ్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. దీనికోసం స్క్రాపేజ్ సెంటర్లు కూడా పుట్టాయి. ఈ సెంటర్లలో పాత వాహనాలను తుక్కు చేసి.. రీసైక్లింగ్ చేస్తారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన లైట్ వెయిట్ మోటర్ వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లు పైబడినవి 34 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) అంచనాల ప్రకారం.. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 కోట్ల పైచిలుకు వాహనాల జీవితకాలం ముగియనుంది. వీటన్నింటిని అలాగే వదిలేస్తే.. అవి మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మాత్రమే కాకుండా.. గాలి, నీరు, మట్టిని కూడా కాలుష్యం చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు.. 75 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్క్రాపింగ్ విధానం సవ్యంగా అమలు కావడానికి.. ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. దీంతో స్క్రాప్ కొనుగోలు చేసే కంపెనీలు చెల్లించాల్సిన జీఎస్టీ తగ్గింది. ఇది రీప్లేస్మెంట్ వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణహితమైన విధానాలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్భారత్లోనే అతి పెద్ద రీసైక్లింగ్ వ్యవస్థఆసియాలోనే అగ్రగామి సర్క్యులర్ ఎకానమీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) రీ కర్మ (Re Carma), భారత్లోనే అతి పెద్ద ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్ (ఈఎల్వీ) రీసైక్లింగ్ వ్యవస్థగా ఆవిర్భవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ జాఝర్లోని రిలయన్స్ మోడల్ ఎకనమిక్ టౌన్షిప్లో గల రీ కార్మ ఫ్లాగ్షిప్ అధునాతన కేంద్రం ఏడాదికి 30,000 కంటే ఎక్కువ వాహనాలను (ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, ఎర్త్మూవింగ్ ఎక్విప్మెంట్ మొదలైనవి) తుక్కు చేస్తోంది. ఈ హబ్ కాకుండా, రీ కర్మ దేశవ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ, భాగస్వాముల నెట్వర్క్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. -
రోజుకు వెయ్యి బుకింగ్స్.. లాంచ్కు ముందే ఫుల్ డిమాండ్
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సరికొత్త ఎస్యూవీ విక్టోరిస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 10.5 లక్షల నుంచి రూ. 19.99 లక్షలు (ఎక్స్షోరూం). ఈ కారు హైబ్రిడ్, ఫోర్ వీల్ డ్రైవ్, సీఎన్జీ, స్మార్ట్ హైబ్రిడ్ తదితర 21 వేరియంట్స్లో లభిస్తుంది. బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 1,000 చొప్పున వస్తున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటివరకు 10,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు.సెప్టెంబర్ 22 నుంచి విక్టోరిస్ అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మిడ్–సైజ్ ఎస్యూవీ మార్కెట్లో అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు 10 లక్షలు అమ్ముడవగా, 1.94 లక్షల యూనిట్లతో హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా అగ్రగామిగా ఉంది.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు -
కారు రుణాలు వద్దు బాబోయ్!
జీఎస్టీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో తమ కారు రుణం రద్దు చేయాలని కోరుతూ బ్యాంక్లకు అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. 1,200సీసీ వరకు సామర్థ్యం కలిగిన కార్లను 28 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ శ్లాబు కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. వీటితోపాటు 40 శాతం శ్లాబులోకి మార్చినప్పటికీ, అదనపు లెవీలు లేకపోవడంతో ఖరీదైన కార్ల ధరలు సైతం తగ్గనున్నాయి.ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఒక్కో కారుపై రూ.3 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో ఇప్పటికే కార్ల కొనుగోలుకు రుణ ఆమోదాలను పొందిన కస్టమర్లు బ్యాంక్ శాఖలను సంప్రదిస్తున్నారు. జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాతే కారు కొనుగోలు చేసుకుంటామని బ్యాంక్ అధికారులకు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రుణాన్ని రద్దు చేసుకోవడం వల్ల నష్టపోయే దాని కంటే జీఎస్టీలో మార్పుల ఫలితంగా ఒక్కో కారుపై తగ్గే ధర అధికంగా ఉంటున్నట్టు చెప్పారు. దీంతో కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి రుణానికి దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో కస్టమర్లు ఉన్నట్టు తెలిపారు. హైఎండ్ వేరియంట్స్ పట్ల ఆసక్తికారు డీలర్లు ఇప్పటికే జారీ చేసిన ఇన్వాయిస్లకు సంబంధించి పాత జీఎస్టీ రేట్లు అమలవుతాయని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేవారు. దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి జారీ చేసే ఇన్వాయిస్లకు కొత్త రేట్లు అమలవుతాయని తెలుస్తోంది. ధరలు తగ్గడంతో మరిన్ని ఫీచర్లు ఉన్న మెరుగైన మోడళ్లకు వెళ్లాలని కొందరు కొనుగోలు దారులు భావిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం కార్లపై 28 శాతం జీఎస్టీతోపాటు, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ఒక శాతం నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సును అమలు చేస్తున్నారు. దీంతో నికర రేటు 29% నుంచి 50 శాతం మధ్య ఉంటోంది. సెపె్టంబర్ 22 నుంచి 1,200 సీసీ సామర్థ్యం మించని పెట్రోల్, 1,500 సీసీ సామర్థ్యం మించని డీజిల్ కార్లపై 18 శాతం జీఎస్టీ రేటు, అంతకుమించిన వాటికి 40 శాతం రేటు అమల్లోకి రానుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
భారత్లో రూ.22.98 లక్షల బైక్ లాంచ్
లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి.. '2025 మల్టీస్ట్రాడా వీ4'ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ అడ్వెంచర్ టూరర్ ప్రారంభ ధర రూ. 22.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కొత్త అప్డేట్లతో పాటు.. మెరుగైన ఇంధన సామర్థ్యం అందించేలా కూడా నిర్మించారు.2025 డుకాటి మల్టీస్ట్రాడా వీ4.. డబుల్ ఫ్రంట్ హెడ్లైట్ పొందుతుంది. రైడర్ కాళ్లకు ఎక్కువ స్పేస్ అందించడానికి.. పన్నీర్లు, టాప్ కేస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలుమల్టీస్ట్రాడా వీ4 బైక్.. 6.5 ఇంచెస్ ఫుల్ TFT కలర్ స్క్రీన్, 4 పవర్ మోడ్లు, 5 రైడింగ్ మోడ్లు (స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో), డుకాటి వెహికల్ అబ్జర్వర్ (DVO), డుకాటి వీలీ కంట్రోల్ (DWC), డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (EBC), క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 1,158cc గ్రాంటురిస్మో ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 170 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. -
హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు: ప్రయోజనాలు
భారతదేశంలో ఫ్యూయెల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా కొందరు వీటిని ఎంచుకుంటారు. ఈ కథనంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు గురించి తెలుసుకుందాం.హైబ్రిడ్ కార్లుహైబ్రిడ్ కార్లు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)ను విద్యుత్ మోటారుతో కలుపుతాయి. ఎంచుకునే హైబ్రిడ్ రకాన్ని బట్టి.. ఆ కారు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటరుతో నడుస్తుంది. ఇవి మైల్డ్ హైబ్రిడ్ (చిన్న ఎలక్ట్రిక్ మోటార్, ఇంజిన్కు సపోర్ట్), ఫుల్ హైబ్రిడ్ (ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలిసి పనిచేస్తాయి), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పెద్ద బ్యాటరీ, ప్లగ్ ద్వారా చార్జ్ చేయవచ్చు) అని మూడు రకాలుగా ఉంటాయి.ప్రయోజనాలు●ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడతాయి.●పూర్తిగా ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా కాకుండా.. హైబ్రిడ్ కార్లకు ఇంధన స్టేషన్లలో ఫ్యూయల్ నింపుకోవచ్చు.●సాంప్రదాయ కార్ల కంటే తక్కువ ఉద్గారాలు వెలువడతాయి.●సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: 2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లుఎలక్ట్రిక్ కార్లుఇవి పూర్తిగా బ్యాటరీలతోనే నడుస్తాయి. వీటిని మళ్ళీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ప్రయోజనాలు●తక్కువ నిర్వహణ ఖర్చు●పన్ను ప్రయోజనాలు, సబ్సిడీల వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయి●సైలెంట్ డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. ఇందులో ఇంజిన్ లేకపోవడం వల్ల నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.●ఉద్గారాలు సున్నా శాతం, కాలుష్య కారకాలు విడుదల కావు. -
దక్షిణాదిన తొలి ‘హంటర్హుడ్’ ఫెస్టివల్!
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్లతో ఈవెంట్ను ఆరంభించారు. స్ట్రీట్ ఆర్టిస్ట్లు వేసిన బైకింగ్ పెయింటింగ్లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఏప్రిల్లో తొలిసారి... ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్ను మలిచామని రాయల్డ్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్బోర్డింగ్లలో లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్కు దన్నుగా నిలవడమే ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్ హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్ను చెన్నై హంటర్హుడ్ ఫెస్టివల్లో ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్స్టయిల్ గేర్తో పాటు ట్రెండింగ్లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లు తమ స్టాల్స్లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్లపై జీఎస్టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్ఫీల్డ్ హంటర్పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.శివరామకృష్ణ మిర్తిపాటి (చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి) -
2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు
2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు●మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్●మారుతి విక్టోరిస్●టాటా పంచ్ ఫేస్లిఫ్ట్●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ●టాటా సియెర్రా ఈవీ●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్●వోక్స్వ్యాగన్ టేరాన్మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ కూడా అక్టోబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనమహీంద్రా థార్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది. -
హోండా మోటార్సైకిల్ ప్రకటన: ఆ బైకులకు రీకాల్..
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా 2019 & 2025 మధ్య తయారైన ఆఫ్రికా ట్విన్ మోటార్సైకిళ్లకు రీకాల్ ప్రకటించింది. ఎడమవైపు ఉన్న హ్యాండిల్బార్ స్విచ్లోని వైరింగ్లో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ స్వచ్ఛందంగా ఈ ప్రకటన చేసింది.ఈ సమస్య హ్యాండిల్ బార్ లోపల ఉన్న హార్నెస్ వైర్ నుంచి వస్తుంది. ఇది సాధారణ స్టీరింగ్ కదలికల కారణంగా పదే పదే వంగి ఉంటుంది. కాలక్రమేణా.. ఇది వైర్ జాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. తద్వారా హారన్ పనిచేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది. అంతే కాకుండా.. హెడ్లైట్ను లో బీమ్ నుంచి హై బీమ్కు మార్చడంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.2026 జనవరి చివరి వారం నుంచి.. భారతదేశంలోని అన్ని హోండా బిగ్వింగ్ డీలర్షిప్లు మీ బైక్ ఇప్పటికీ వారంటీలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. కస్టమర్లకు కంపెనీ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లే డీలర్షిప్ను సందర్శించవచ్చు.భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ కోసం హోండా రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2024 ప్రారంభంలో, ఫిబ్రవరి, అక్టోబర్ 2022 లలో కూడా ఈ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రీకాల్ జారీచేయడానికి సిద్ధమైంది. ఆఫ్రికా ట్విన్ 1,048 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను కలిగి.. 100.5 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా హోండా DCT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికతో లభిస్తుంది. -
డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్లో 10 శాతం ఐసోబుటనాల్ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్లో పదో వంతు ఇథనాల్ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.ఈ20 పెట్రోల్పై తప్పుడు ప్రచారం..ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు. -
ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ‘మెగా ఫెస్టివ్ ఉత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ ఫ్లాగ్షిప్ మోటారు సైకిళ్లు రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనగోళ్లపై క్యాష్ బ్యాక్లు ప్రకటించింది.రోర్ ఈజెడ్ సిగ్మా లేదా రోర్ ఈజెడ్లను రూ.20,000 వరకు ధర తగ్గించి విక్రయిస్తున్నట్టు, దీనికితోడు రూ.10,000 క్యాష్బ్యాక్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రతీ కొనుగోలుపై బంగారం కాయిన్ను ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే లక్కీ డ్రాలో ఐఫోన్ను సైతం గెలుచుకోవచ్చని పేర్కొంది. తమ మోటారు సైకిళ్ల పనితీరును తెలుసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ అసాధారణ విలువతో మెగా ఫెస్టివ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
భవిష్యత్ భారత్దే..!
న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తంతా భారత్దేనని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకెయూచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా నడుస్తుందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాలపరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకెయూచి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. ‘చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్ మొదలైన వాటిని చూశాం. గత మూడు దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్కి సానుకూలమైనవని తకెయూచి చెప్పారు. జపాన్ తరహాలోనే ఇక్కడ కూడా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిల్చిందో భారత్లోను అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకెయూచి చెప్పారు. ‘ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించింది, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), మేకిన్ ఇండియా లాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడంతో పాటు దేశీయంగా డిమాండ్కి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి చర్యలన్నీ కూడా అంతిమంగా తయారీ రంగ వృద్ధికి దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తాయని చెప్పారు. టారిఫ్లు పెద్ద సవాలే.. భారత ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించడమనేది ఆటో విడిభాగాల పరిశ్రమకు పెద్ద సవాలేనని తకెయూచి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సానుకూల ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు కొన్ని సానుకూల ప్రకటనలు చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆటో పరిశ్రమ భవిష్యత్తు కూడా మరింత ఆశావహంగా కనిపిస్తోందన్నారు. 2024–25లో 523 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఆటో విడిభాగాల ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కాగలవని తకెయూచి చెప్పారు. ‘అంతర్జాతీయ తయారీ హబ్గా భారత్ ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే తమ తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారా తయారీ కోసం సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఈ దేశాన్ని ఎంచుకుంది. ఈ వాహనం 100 దేశాలకు ఎగుమతి అవుతుంది’ అని పేర్కొన్నారు. -
కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐభారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
వేలానికి పోప్ లియో సంతకం చేసిన బైక్
'పోప్ లియో XIV'కి బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్' అందించారు. ఈ మోటార్సైకిల్ను మిస్సియో ఆస్ట్రియా అక్టోబర్ 2025లో సోథెబైస్ ద్వారా వేలం వేయనున్నారు. దీని నుంచి వచ్చిన డబ్బును మడగాస్కర్లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు వినియోగించనున్నారు.పోప్ లియో XIVకు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ అనేది కస్టమైజ్డ్ బైక్. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ అధిపతి 'మైఖేల్ సోమర్' అందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. బైకు ఫ్యూయెల్ ట్యాంక్ మీద పోప్ సంతకం, డేట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా 991 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో రూ. 32.50 లక్షలు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో 10.25 ఇంచెస్ TFT కలర్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయెల్ లెవల్, స్పీడ్ మొదలైన వాటిని రైడర్ చూడవచ్చు. డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్ల్యాంప్లు, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు.. రాక్, రోల్ అనే రైడ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం
భారత్లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్క్లేవ్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
స్క్రాప్ సర్టిఫికెట్తో అదనపు డిస్కౌంట్..
న్యూఢిల్లీ: పాత వాహనానికి సంబంధించిన స్క్రాపేజీ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు, కొత్త వాహనాలపై మరిన్ని డిస్కౌంట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే, పాత వాహనాన్ని తుక్కు కింద మార్చి (స్క్రాప్) కొత్తవి కొంటున్న వారికి, జీఎస్టీని కొంత తగ్గించడం రూపంలో కూడా ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కోరినట్లు ఆయన చెప్పారు. భారతీయ ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సంఘం సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్క్రాపేజీ పాలసీ అనేది ఇటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమైనదని గడ్కరీ చెప్పారు. ‘‘ఇది పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ పరిశ్రమ నా మాట ఇంకా పూర్తిగా వినడం లేదు. కొత్త వాహనాన్ని కొనేందుకు, పాతదాన్ని స్క్రాప్ చేసిన వారికి బాగా డిస్కౌంట్లు ఇస్తే, మీ టర్నోవరే భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది. దేశంలో కాలు ష్యం తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు కూడా ఇందు కు తప్పకుండా తోడ్పడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఇటీవల వస్తు, సేవల పన్నులను (జీ ఎస్టీ) క్రమబదీ్ధకరించడం వల్ల ఆటో రంగానికి భారీగా లబ్ధి చేకూరిందని, పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘మన ఆటో పరిశ్రమ ఇప్పుడు పరిమాణంపరంగా నంబర్ 3గా ఎదిగింది. మనం అంతా కలిసి పని చేస్తే తప్పకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోగలం’’ అని గడ్కరీ వివరించారు. తుక్కు రీసైక్లింగ్తో ఉద్యోగాలకు దన్ను.. తుక్కును రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కారణంగా అదనంగా 70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ చెప్పారు. అలాగే ఉక్కు, సీసం, అల్యుమినియం, ప్లాటినం, పల్లాడియం లాంటి లోహాల లభ్యత కూడా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసి అదనంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ తర్వాత ఏర్పడే అదనపు డిమాండ్తో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 16,830 వాహనాలను తుక్కు కింద మారుస్తుండగా, ప్రైవేట్ రంగం రూ. 2,700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు. ఈ–20పై అవాస్తవాలు.. ఈ20 ఇంధనంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ పాడవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలే అని గడ్కరీ కొట్టిపారేశారు. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇథనాల్ ఉపయోగపడుతుందని, దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. దీనితో రైతులకు రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి దేశీయంగా అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.పరిశ్రమకు జీఎస్టీ బూస్ట్.. వాహనాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడుతుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దీనితో రేట్లు తగ్గి, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వాహనాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలిసారిగా వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, మధ్య స్థాయి ఆదాయవర్గాలకు గణనీయంగా ప్రయోజనం లభిస్తుందని చంద్ర వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లోను, అలాగే ఎగుమతులపరంగాను భారతీయ ఆటో పరిశ్రమ స్థిరమైన పనితీరు కనపర్చిందని చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2 శాతం వార్షిక వృద్ధితో, అత్యధికంగా 43 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల విభాగం కూడా కోలుకుంటోందని 9.1 శాతం వృద్ధితో 1.96 కోట్ల విక్రయాలు నమోదయ్యాయని చంద్ర చెప్పారు. -
మూడేళ్లకే ముగిసిన ప్రస్థానం!.. వెబ్సైట్లో కనిపించిన బైక్ ఇదే..
సుజుకి మోటార్సైకిల్ ఇండియా తన లైనప్ నుంచి కటన బైకును నిలిపివేసింది. దీనిని కంపెనీ తన అధికారిక వెబ్సైట్ తొలగించింది. 2022 జులైలో ప్రారంభమైన ఈ బైక్ లేటెస్ట్ రెట్రో డిజైన్ రైడర్లను ఆకట్టుకుని.. మంచి అమ్మకాలను సాధించగలిగింది. అయితే కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. దీంతో దేశంలో అరంగ్రేటం చేసిన మూడేళ్లలోనే మార్కెట్కు దూరమైందని తెలుస్తోంది.రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, కటనను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ బైకును కంపెనీ ఎందుకు తొలగించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆదరణ తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్తో 11,000 rpm వద్ద 150 bhp, 9,250 rpm వద్ద 106 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.సుజుకి ఇప్పుడు కటన బైకును తొలగించడంతో.. పెద్ద బైక్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. అవి హయబుసా (రూ. 16.90 లక్షలు), జీఎస్ఎక్స్-8ఆర్ (రూ. 9.25 లక్షలు), వీ-స్ట్రోమ్ 800డీఈ (రూ. 10.30 లక్షలు). -
మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్ లాబీలు .. ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్: కుమారస్వామి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని చెప్పారు. ఆటో రిటైల్ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పెంచాలి.. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు. -
ముంబైలో మెగా ఈవీ చార్జింగ్ హబ్
ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా పవర్,, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు మంగళవారం భారతదేశపు అతిపెద్ద టాటా. ఈవీ మెగాచార్జర్ హబ్ను ఆవిష్కరించాయి. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 సమీపంలోని ది లీలా ముంబై హోటల్ ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో ఎనిమిది ఫాస్ట్ డీసీ చార్జర్లు, 16 ‘చార్జింగ్ బే’లు ఉంటాయి. ఒకేసారి 16 ఈవీలను చార్జింగ్ చేయొచ్చు.ప్రైవేట్ కారు ఓనర్ల నుంచి ట్యాక్సీలు, రైడ్ సేవల సంస్థలు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు మొదలైన వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. మరోవైపు, ఈవీ చార్జింగ్ నెట్వర్క్ సంస్థ బోల్ట్డాట్ఎర్త్ తాజాగా త్రీవీలర్ ఆటోల సంస్థ యోధతో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్, ఎర్తింగ్ సొల్యూషన్స్ను అందించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంపొందించేందుకు, వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సెప్టెంబర్ 9ని ప్రపంచ ఈవీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5.8 కోట్ల పైచిలుకు ఈవీలు ఉండగా, భారత్లో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో 14.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఈవీల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే.. -
టయోటా కార్ల ధరల తగ్గింపు.. ఫార్చూనర్పై రూ.3.5 లక్షలు..
జీఎస్టీ తగ్గింపు, పరిహార సెస్ రద్దు వాహన కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాల ధరలపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, వాహన తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల సవరించిన ధరలను ప్రకటించడం ప్రారంభించాయి.తాజాగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా తమ అన్ని కార్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సకాలంలో డెలివరీలు అందుకోవడానికి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వీలైనంత త్వరగా బుకింగ్లను కన్ఫర్మ్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది.కొన్ని ప్రీమియం మోడళ్ల తగ్గింపు ధరలను కంపెనీ ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం. అత్యధికంగా ఫార్చ్యూనర్ ధర రూ .3.49 లక్షల వరకు తగ్గుతుంది. దీని తరువాత మరో ప్రీమియం వేరియంట్ లెజెండర్ ధర రూ .3.34 లక్షల వరకు తగ్గనుంది. ఫార్చ్యూనర్, లెజెండర్ ధరలు వరుసగా రూ .36.05 లక్షలు, రూ .44.51 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. తమ లైనప్ లోని ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ సవరించిన ధరలను టయోటా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.సవరించిన జీఎస్టీ నిర్మాణం అన్ని విభాగాలలో కార్ల ధరలను తగ్గించింది. 4 మీటర్ల లోపు పరిమాణం ఉన్న చిన్న కార్లపై (1,200సీసీ వరకు పెట్రోల్ ఇంజిన్లు లేదా 1,500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్లు) ఇకపై 28% బదులుగా 18% జీఎస్టీ వర్తిస్తుంది.దీంతో వీటి ధరలు 5-13% తగ్గుతున్నాయి.ఇక 4 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణం, పెద్ద ఇంజిన్లు ఉన్న పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీకి బదులుగా 40 శాతం (ప్రత్యేక శ్లాబ్) జీఎస్టీ విధిస్తారు. అయితే సెస్ తొలగింపుతో వీటి ధరలు కూడా 3-10% తగ్గే అవకాశం ఉంది. -
చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ ''మినీ'' ఇప్పుడు భారతదేశంలో మినీ కూపర్ ధరలను తగ్గించింది. కేంద్రం కొత్తగా ప్రకటయించిన జీఎస్టీ 2.0 సంస్కరణ తరువాత కంపెనీ ధరలు వెల్లడించింది. సవరించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.మినీ కూపర్ ప్రస్తుతం భారతీయ విఫణిలో.. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎసెన్షియల్, క్లాసిక్, ఫేవర్డ్, జేసీడబ్ల్యు. కంపెనీ ఇప్పుడు ఈ వేరియంట్స్ ధరలను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ఇది కొత్త మినీ కార్ల కొనుగోలుదారులకు ప్రయోజనకారిగా ఉంటుంది.తగ్గిన ధరలు➤ఎసెన్షియల్: రూ. 2,50,000 తగ్గింది - (కొత్త ధర రూ. 43,70,000) ➤క్లాసిక్: రూ. 2,75,000 తగ్గింది - (కొత్త ధర రూ. 49,20,000)➤ఫేవర్డ్: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 52,00,000)➤జేసీడబ్ల్యు: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 54,50,000)ఇదీ చదవండి: జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
ఆగస్టులో 3% పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో స్వల్పంగా 3% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ( ఫాడా) గణాంకాలు వెల్లడించింది. మొత్తం ఆగస్టులో 19,64,547 వాహన రిజి్రస్టేషన్లు కాగా, 2024 ఆగస్టులో ఇవి 19,10,312గా ఉన్నాయని ఫాడా తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ‘‘వేచి చూసే ధోరణి కారణంగా సెపె్టంబర్ ప్రథమార్థమంతా అమ్మకాలు అంతంత మాత్రమే ఉండొచ్చు. జీఎస్టీ విధానంపై స్పష్టత, పండుగ సెంటిమెంట్తో ఈ నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉండొచ్చు’’ అని ఫాడా అంచనా వేసింది. → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3,20,291 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.93% పెరిగి 3,23,256 కు చేరాయి. మెరుగైన ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్తో ఆగస్టు ప్రథమార్థమంతా సానుకూల ధోరణి కని్పంచింది. అయితే ఆగస్టు 15న ప్రధాని జీఎస్టీ సంస్కరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారని ఫాడా తెలిపింది. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 2.17% పెరిగాయి. ఈ ఆగస్టులో మొత్తం 13,73,675 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 13,44,380 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. ఓనమ్, గణేశ్ చతుర్థి పండుగ ప్రారంభంతో చాలా మంది కస్టమర్లు డెలివరీల కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు గ్రామీణ రాకపోకలకు అంతరాయంతో అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో 69,635 యూనిట్ల నుంచి 8.55% పెరిగి 75,592 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్ రిటైల్ అమ్మకాలు 1,05,493 యూనిట్ల నుంచి 2% తగ్గి 1,03,105కు దిగివచ్చాయి. -
టూ వీలర్స్.. రయ్!
ముంబై: జీఎస్టీ క్రమబద్ధీకరణ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాల్లో 5–6%, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2–3% వృద్ధి నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో తెలిపింది. ఈ సెపె్టంబర్ 22 నుంచి 5%, 18% పన్ను శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయంటూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మరింత పుంజుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. జీఎస్టీ కోతతో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో 90% వాల్యూమ్స్ కలిగిన టూ–వీలర్స్, ప్యాసింజర్ వాహనాలకు వరుసగా 2%, 1% డిమాండ్ పెరగనుందని వివరించింది. క్రిసిల్ రేటింగ్స్లో మరిన్ని విశేషాలు.... → కోవిడ్ సంక్షోభం, ఆన్బోర్డ్ డయాగ్నస్టిక్ టూల్స్ ఐఐ(ఓబీడీ2) తప్పనిసరి అమలు, ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ బైక్లకు తగ్గిన డిమాండ్, ప్యాసింజర్ వాహన ధరలు భారీగా పెరగడం తదితర కారణాలతో ఆటో పరిశ్రమ ఇబ్బందులకు లోనవుతోంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చు. → గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, సాధారణ వర్షపాత నమోదుతో పాటు ఈ ఏడాదిలో 15కి పైగా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్స్ మార్కెట్లోకి విడుదల పరిణామాలు డిమాండ్ పునరుద్ధరణకు మరింత తోడ్పడవచ్చు. అయితే పండుగ సీజన్లో డీలర్ల వద్ద వాడని పన్ను క్రెడిట్ల కారణంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. → అధిక అమ్మకాలు కంపెనీల సామర్థ్య వినియోగం, ఆపరేటింగ్ లీవరేజ్ల మెరుగుపరిచే అవకాశం కలిగిస్తుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలకు బలమైన నగదు ప్రవాహాలు, మెరుగైన లాభాల మార్జిన్లు లభిస్తాయి. అదేవిధంగా, జీఎస్టీ తగ్గింపు తర్వాత 50–55 రోజుల ప్యాసింజర్ వాహనాల నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించి, డీలర్ల నగదు ప్రవాహానికి మద్దతిస్తుంది. ‘‘జీఎస్టీ తగ్గింపు లాభాల బదలాయింపుతో వాహన ధరలు 5–10% (చిన్న స్థాయి పీవీలపై రూ.30–60 వేలు, టూ వీలర్స్పై రూ.3,000 –7,000 తగ్గింపు) దిగివచ్చే వీలుంది. దీనికి తోడు పండుగ సీజన్, ఆటో కంపెనీలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన కొనుగోలు సామర్థ్యం తదితర అంశాలు కలిసొచ్చి ఈ ద్వితీయార్థంలో ఆటో పరిశ్రమ దూసుకెళ్తుంది’’ అని క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేత్ తెలిపారు. ఆటో పరిశ్రమపై జీఎస్టీ తగ్గింపు: కొత్త జీఎస్టీ ప్రకారం చిన్న కార్లు, 350 సీసీలోపు మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్ పడనుంది. మధ్య, భారీ ప్యాసింజర్ వాహనాలపై పన్ను 3–7 శాతం వరకు తగ్గనుంది. ట్రాక్టర్లను సైతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. సంక్షిప్తంగా చిన్న కార్లు, బైకులు(350 సీసీ) ధరలు భారీగా తగ్గనున్నాయి. పెద్ద కార్లు, ఎస్యూవీలు కొద్దిమేర చవకగా మారాయి. అయితే పెద్ద (హై ఎండ్)బైకులు ధరలు భారీగా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహన ధరలు: జీఎస్టీ తగ్గింపు లాభాలు పూర్తి స్థాయి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తే ధరలు 5 నుంచి 10% తగ్గుతాయి. చిన్న కార్లు రూ.60వేల వరకు, త్రీ వీలర్స్ రూ.15,000 నుంచి రూ.20వేల వరకు తగ్గొచ్చు. మీడియం, హెవీ వాణిజ్య వాహన ధరలు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల తగ్గొచ్చు. యథావిథిగా 5% జీఎస్టీ కొనసాగింపుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్, త్రీ వీలర్స్ వాహన ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. -
ఆడి కీలక ప్రకటన: రూ.7 లక్షలు తగ్గిన క్యూ8 ధర
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సోమవారం (సెప్టెంబర్ 8) భారతదేశంలోని అన్ని మోడళ్లలో ధరల తగ్గింపును ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇది ఆడి కార్ల కొనుగోలుదారులకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.GST 2.0 అమలు తర్వాత 'ఆడి ఇండియా' తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో అంతటా సవరించిన ధరలను ఒక ప్రకటనలో ప్రకటించింది. ధరల తగ్గుదల తరువాత మోడల్ను బట్టి రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సరికొత్త ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. పండుగ సీజన్కు ముందు కస్టమర్ డిమాండ్కు ధరల తగ్గింపు ఊతం ఇస్తున్నాయని ప్రకటన పేర్కొంది.కొత్త ధరల ప్రకారం.. కంపెనీ ఎంట్రీ SUV క్యూ3 ధర రూ. 43.07 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని ధర గతంలో రూ. 46.14 లక్షలు. అదే విధంగా టాప్ ఎండ్ SUV క్యూ8 ప్రారంభ ధర రూ. 1.1 కోట్లుగా ఉంటుంది. ఇది గతంలో రూ. 1.18 కోట్లుగా ఉండేది. సెడాన్లు A4, A6 లతో పాటు SUVలు క్యూ5, క్యూ7 వంటి ఇతర మోడళ్ల ధరలు కూడా తగ్గుతాయి. -
హైదరాబాద్లో టీవీఎస్ 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే..
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్టార్క్ 150’ను హైదరాబాద్లో ఆవిష్కరించింది. స్పోర్టీ, ప్రీమియంలుక్తో ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్టీ వేరియంట్ ధర రూ.1,29,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ధరల్లో ఇటీవలి జీఎస్టీ శ్లాబుల సరళీకరణను పరిగణించలేదని, సెప్టెంబర్ 22 తర్వాత కొత్త ధరలు అప్డేట్ అయ్యే అవకాశం ఉందని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.హైదరాబాద్లో ఈ స్కూటర్ ఆవిష్కరించిన నేపథ్యంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెడ్ కమ్యుటర్, ఈవీ బిజినెస్ అండ్ హెడ్ బ్రాండ్ మీడియా) అనిరుద్ధా హల్దార్ మాట్లాడుతూ..‘అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ఈ స్కూటర్ను జెన్జీ(2000 తర్వాత జన్మించినవారు) యువత ఎంతో ఇష్టపడుతారు. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్, ఫ్యుచరిస్టిక్ డిజైన్కు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. ఇందులోని టీఎఫ్టీ వేరియంట్లో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా, స్మార్ట్ వాచ్ అడాప్టబిలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్/కాల్ అలర్ట్లు వంటివి ఉన్నాయి’ అని చెప్పారు.రైడ్ మోడ్లు, భద్రతకు సంబంధించి కూడా ఇందులో జాగ్రత్తలు వహించినట్లు కంపెనీ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఇందులో రేస్ మోడ్, స్ట్రీట్ మోడ్ అనే డ్యూయల్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. పరిస్థితులుకు తగినట్లు ఏదైనా వాడుకునేందుకు వీలుంటుంది. క్రాష్ అలర్ట్, థెఫ్ట్ హెచ్చరిక, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, పార్క్ చేసిన ప్రదేశం, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.కంపెనీ వివరాల ప్రకారం.. 149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.ఇదీ చదవండి: భారతీయులకు అమెరికా మరో షాక్.. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ. 3లక్షలు తగ్గిన టయోటా కారు ధర
హ్యుందాయ్ తన కార్ల ధరలు ఎంత తగ్గుతాయని విషయాన్ని వెల్లడించిన తరువాత, టయోటా కూడా తగ్గిన ధరలను స్పష్టం చేసింది. ఈ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయు. సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో GST 2.0 ప్రకటన తర్వాత ధరల తగ్గుదల జరిగింది.మోడల్ వారీగా తగ్గిన టయోటా కార్ల ధరలు➜గ్లాంజా: రూ. 85,300 ➜టైసర్: రూ.1,11,100➜రూమియన్: రూ. 48,700➜హైరైడర్: రూ. 65,400➜క్రిస్టా: రూ. 1,80,600➜హైక్రాస్: రూ. 1,15,800➜ఫార్చ్యూనర్: రూ. 3,49,000➜లెజెండర్: రూ. 3,34,000➜హైలక్స్: రూ. 2,52,700➜కామ్రీ: రూ. 1,01,800➜వెల్ఫైర్: రూ. 2,78,000ఇదీ చదవండి: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
వాహన బీమా.. కావాలి ధీమా!
మేఘాలకు చిల్లులు పడ్డాయా! అన్నట్టు స్వల్ప వ్యవధిలోనే వర్షాలు కుమ్మేయడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. గంటలో 10 సెంటీమీటర్లకు పైగా పడుతున్న వర్షంతో హైదరాబాద్, ముంబై సహా ఎన్నో నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం చూస్తున్నాం. వర్షాలు, వరదల కారణంగా వాహనాలు దెబ్బతిని ఆర్థిక నష్టం ఎదురైతే..? బైక్ లేదా కారు ఇంజన్ దెబ్బతింటే..? అలాంటి సందర్భంలో థర్డ్ పార్టీ బీమా కవరేజీ ఉన్నా, ఎందుకూ ఉపయోగపడదు. కావాల్సింది సమగ్ర కవరేజీతో కూడిన బీమా పాలసీ. ఇది లేకపోతే ఎదురయ్యే నష్టాన్ని సొంతంగా భరించాల్సి వస్తుంది. అందుకే వాహన బీమా పాలసీ తీసుకునే ముందు పరిశీలించాల్సిన విషయాలు బోలెడు ఉన్నాయి. మెరుగైన ఆదాయం నేపథ్యంతో మన దేశంలో కార్లు కొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024–25లో 43 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఆరి్థక సంవత్సరంలోనూ 42 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు 2024–25లో ఏకంగా 1.9 కోట్లకు చేరాయి. కానీ, వాహనం కొనేటప్పుడు ఎక్కువ మంది చేస్తున్న పెద్ద తప్పు.. డీలర్ ఇచ్చే థర్డ్ పార్టీ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్తో సరిపెట్టుకోవడం. తొలిసారి వాహనం కొనుగోలు చేస్తున్న వారే కాదు, కొత్త వాహనానికి మారుతున్న వారిలోనూ ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్కే పరిమితమవుతున్నారు. ఎందుకంటే మోటారు వాహ న చట్టం ప్రకారం.. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం తప్పనిసరి. కారు అయితే మూడేళ్లు, టూవీలర్ అయితే ఐదేళ్ల కాలానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను కొనుగోలు సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ (సమగ్ర బీమా) తప్పనిసరి కాదు. దీంతో చాలా మంది వాహనదారులు అనవసర ఖర్చు ఎందుకని భావించి థర్డ్పార్టీ కవరేజీకి పరిమితమవుతున్నారు. థర్డ్ పార్టీ.. సొంతానికి రాజీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నది.. తన వాహనం కారణంగా మరో వ్యక్తికి (మూడో పక్షం/థర్డ్ పార్టీ) గాయాలు కావడం లేదా మరణానికి దారితీయడం లేదా మూడో పార్టీకి చెందిన ప్రాపర్టీకి నష్టం కలిగించిన సందర్భాల్లో పరిహారం చెల్లించడానికి పరిమితమవుతుంది. వాహనదారుడు గాయపడడం లేదా సొంత వాహనానికి నష్టం ఏర్పడితే ఈ ప్లాన్లో పరిహారం రాదు. ఇందుకు థర్డ్ పార్టీతోపాటు ఓన్ డ్యామేజ్ పాలసీ కూడా ఉండాలి. కాంప్రహెన్సివ్ ఆటో ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇవన్నీ ఉంటాయి. స్టాండర్డ్ కాంప్రహెన్సివ్ పాలసీలో వరదల వల్ల కారు లేదా బైక్ ఇంజన్కు నష్టం వాటిల్లితే పరిహారం లభిస్తుంది. కానీ, ఇందులో తిరకాసు ఉంది. వర్షపు నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను స్టార్ట్ చేయడం కారణంగా ఇంజన్కు నష్టం వాటిల్లితే పరిహారం రాదు. నీటి వల్ల ఇంజన్కు సహజంగా నష్టం జరిగితేనే పరిహారం వస్తుంది. నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను ఆన్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇంజన్లోని కంబషన్ చాంబర్లోకి నీరు ప్రవేశిస్తుంది. దీంతో లోపలి విడిభాగాలు దెబ్బతింటాయి. దీన్ని హైడ్రోస్టాటిక్ లాక్గా చెబుతారు. ఇక్కడ పాలసీ దారుడు మొదటి పార్టీ, బీమా సంస్థ రెండో పార్టీ అవుతుంది.ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ నీటిలో మునిగినప్పుడు ఇంజన్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల జరిగే నష్టానికి కూడా పరిహారం కావాలంటే అప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ను జోడించుకోవాలి. ఇంజన్ ప్రొటెక్షన్ కవరేజీ ఉంటే అప్పుడు వరద నీటి కారణంగా ఇంజన్కు, గేర్ బాక్స్కు నష్టం ఏర్పడితే మరమ్మతులకు అయ్యే అధిక వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. రీపెయిర్ చేయలేని విధంగా దెబ్బతింటే కొత్త ఇంజన్, గేర్ బాక్స్కు అయ్యే వ్యయాలను నిబంధనల మేరకు చెల్లిస్తుంది. కనుక రెగ్యులర్ పాలసీకి అదనంగా ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కూడా తీసుకోవాలి. ప్రీమియం కొంత పెరిగినప్పటికీ.. ఊహించని పరిస్థితుల్లో ఆరి్థక నష్టాన్ని నివారిస్తుంది. ఇంజన్కు మరమ్మతులు సొంతంగా చేయించుకోవాలంటే భారీగానే ఖర్చవుతుంది. ‘వాహనాలు అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్నాయి. ఎలక్ట్రిక్, డీజిల్, పెట్రోల్ అన్నదానితో సంబంధం లేకుండా అవి కీలక ఆస్తులుగా మారుతున్నా యి. వాటికి రక్షణ కల్పించుకోవాలి. సమగ్ర బీమా రక్షణతో మానసికంగా నిశి్చంత ఏర్పడుతుంది’ అని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ పరాస్ పస్రిచా తెలిపారు. జీరో డిప్రీసియేషన్ కవర్ వాహనంలోని విడిభాగాలు వాడుకలో కొంత కాలానికి విలువను కోల్పోతుంటాయి. క్లెయిమ్ చేసినప్పుడు ఆ మేరకు విలువలో బీమా సంస్థలు కోత పెడతాయి. ప్రమాదం కారణంగా ఏదైనా విడిభాగం దెబ్బతిని దాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వస్తే, అప్పుడు పూర్తి పరిహారం రాక, కొంత జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. జీరో డిప్రీషియేషన్ కవర్ ఉంటే విడిభాగం మార్పిడి ఖర్చును బీమా సంస్థే చెల్లిస్తుంది. రిటర్న్ టు ఇన్వాయిస్ ఈ యాడాన్ కవర్ తీసుకుంటే.. వాహనం చోరీకి గురైనా లేక ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు చేయలేని సందర్భంలో తిరిగి వాహనం కొనుగోలు, పన్నులు, రిజి్రస్టేషన్కు అయ్యే చార్జీలన్నింటినీ బీమా కంపెనీ నుంచి పొందొచ్చు. ఈ సందర్భంగా ‘ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ’ (ఐడీవీ) గురించి తెలుసుకోవాలి. వాహనం చోరీకి గురైనప్పుడు లేదా ప్రమాదం వల్ల మరమ్మతులు చేయలేని స్థితిలో వాహనం ధరతో సంబంధం లేకుండా ఐడీవీనే బీమా సంస్థ చెల్లిస్తుంది.రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రయాణంలో ఉన్నట్టుండి బైక్ లేదా కారు మొరాయించొచ్చు. ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు రోడ్సైడ్ అసిస్టెన్స్ కవర్ అదుకుంటుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదం కారణంగా వాహనం దెబ్బతిని నిలిచిపోయిన సందర్భంలోనూ సాయపడుతుంది. వారంలో అన్ని రోజులూ, రోజులో అన్ని సమయాల్లోనూ ఈ సదుపాయాన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బైక్ లేదా కారును సమీపంలోని మరమ్మతుల కేంద్రానికి (సరీ్వసింగ్ సెంటర్)కు తరలిస్తారు. ఇందుకయ్యే ఖర్చును బీమా కంపెనీయే పెట్టుకుంటుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఈ కవరేజీ అనుకూలం. సాధారణంగా వాహనం మొరాయించిన ప్రదేశం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో (ఒక్కొక్క కంపెనీ ఒక్కో పరిమితి)ని కేంద్రానికి టోయింగ్ వాహనంపై తరలిస్తాయి. చిన్న సమస్య అయితే కొన్ని సందర్భాల్లో మెకానిక్ను పంపించి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తుంటాయి. న్యాయ సాయం ఇది కూడా ఐచ్ఛిక కవరేజీయే. ప్రమాదం అనంతరం ఎదురయ్యే న్యాయ సమస్యలకు సంబంధించి సాయాన్ని దీని కింద ఉచితంగా పొందొచ్చు. ప్రమాదం వల్ల నేరాభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తే లాయర్ సేవలకు అయ్యే చార్జీలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. బ్యాటరీకి రక్షణ ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ బ్యాటరీ దెబ్బతింటే రూ.50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ మార్చుకునేందుకు కొన్ని రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తయారీ లోపాలు లేదా వాడుకలో భాగంగా బ్యాటరీ దెబ్బతింటే స్టాండర్డ్ ఆటో ఇన్సూరెన్స్లో పరిహారం రాదు. కనుక బ్యాటరీ ప్రొటెక్షన్ కవర్ను జోడించుకుంటే.. ఉన్నట్టుండి బ్యాటరీ విఫలమైతే మరమ్మతులు లేదా కొత్త బ్యాటరీ ఏర్పాటుకు అయ్యే వ్యయాలను పొందొచ్చు. డైలీ అలవెన్స్ కవర్ ప్రమాదం లేదా ప్రకృతి విపత్తుల కారణంగా వాహనానికి మరమ్మతులు అవసరమై గ్యారేజీకి వెళ్లిందనుకోండి. వాహన మరమ్మతులు పూర్త య్యే వరకు రోజువారీగా రూ.500–1,500 వరకు నగదు ప్రయోజనం పొందొచ్చు. దీనివల్ల ప్రత్యామ్నాయ రవాణా కోసం అయ్యే ఖర్చులను భర్తీ చేసుకోవచ్చు. ఇతర యాడాన్లు ఇవి కాకుండా కన్జ్యూమబుల్స్, టైర్ ప్రొటెక్టర్, క్లచ్ ప్రొటెక్టర్ తదితర యాడాన్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. తమ అవసరాలకు అనుకూలంగా ఉన్న వాటిని, ప్రీమియం ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత వస్తువులు పోతే.. కాంప్రహెన్సివ్ కారు పాలసీలో కారు చోరీకి గురైతే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ ప్రకారం బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. కానీ, కారులో ఉన్న విలువైన వస్తువులకు సైతం పరిహారం కోరుకునే వారు ఈ యాడాన్ పాలసీ తీసుకోవచ్చు. ఇవి గమనించాలి.. → ముఖ్యంగా వరద నీటికి అవకాశం ఉన్న పల్లపు ప్రాంతాల్లో నివసించే వారు, ఆయా ప్రాంతాల మీదుగా రవాణా చేసే వారు ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ను తప్పకుండా తీసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు అందులో కవరేజీ సదుపాయాలు, మినహాయింపులతోపాటు ఏవైనా తగ్గింపులు ఉన్నాయా? అని సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ప్లాన్లలోని ఫీచర్లతో పోల్చి చూసుకున్న తర్వాత మెరుగైన బీమా పాలసీని తీసుకోవాలి. వాహన డీలర్ ఆఫర్ చేసే ప్లాన్లలో ఫీచర్ల వివరాలను ఆయా కంపెనీల వెబ్సైట్లకు వెళ్లి తెలుసుకోవచ్చు. కేవలం ప్రీమియం కాకుండా రక్షణ సదుపాయాలను గమనించాలి. → వాహనానికి ఎలాంటి కవరేజీ అవసరం అన్నది తెలుసుకున్న తర్వాతే కొనుగోలుకు వెళ్లాలి. → కొనుగోలు సమయంలో కొందరు సరైన వివరాలు ఇవ్వడం లేదు. దీనివల్ల తర్వాత క్లెయిమ్ తిరస్కరణ ఎదురుకావొచ్చు. → ముఖ్యంగా జీరో డిప్రీసియేషన్, ఇంజన్ ప్రొటెక్షన్, రోడ్సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్లను జోడించుకోవడం ఎంతో అవసరం. → తక్కువ ఖర్చు అయ్యే భాగాలకు ప్రత్యేకంగా యాడాన్లు అవసరం లేదు. → నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ చేసే ప్లాన్ను పరిశీలించొచ్చు. దీనివల్ల ఒక సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేనప్పుడు రెన్యువల్ ప్రీమియంపై తగ్గింపు లభిస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యమహా ఆర్15: ఇప్పుడు కొత్త రంగులో..
యమహా కంపెనీ తన ఆర్15 వీ4 లైనప్ను రీఫ్రెష్ చేసింది. ఇందులో భాగంగానే కొత్త కలర్ (ప్రీమియం మెటాలిక్ గ్రే షేడ్) ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఇది వెర్మిలియన్ వీల్స్తో స్టీల్టీ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ను పొందుతుంది. దీంతో ధరలు కూడా పెరిగాయి.కొత్త కలర్ యమహా ఆర్15 వీ4 బైక్ ధరలు రూ. 1.67 లక్షల నుంచి ప్రారంభమై.. రూ. 2.01 లక్షల (ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య ఉన్నాయి. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్షిఫ్టర్, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ముందు భాగంలో అప్సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో లింక్డ్ టైప్ మోనోషాక్ వంటివి ఇందులో చూడవచ్చు.2025 యమహా ఆర్15 వీ4 బైకులో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 18.1 బీహెచ్పీ పవర్, 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇంజన్ డెల్టాబాక్స్ ఫ్రేమ్ లోపల ఉంటుంది. పనితీరు మాత్రమే స్టాండర్డ్ బైక్ మాదిరిగానే ఉంటుంది. -
జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర
జీఎస్టీ సమావేశం తరువాత వచ్చిన ప్రతిపాదనలు.. కార్ల రేట్లను తగ్గేలా చేశాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుంది. ఈ తరుణంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలు భారీగా తగ్గుతాయని.. కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు.. వినియోగదారులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీంతో భారతదేశం అంతటా ఉన్న హ్యుందాయ్ కస్టమర్లు తమకు ఇష్టమైన హ్యుందాయ్ మోడళ్లను మరింత అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేయగలరు. ఈ పండుగ సీజన్లో బ్రాండ్ కార్ల సేల్స్ పెరుగుతాయి.ప్యాసింజర్ వాహనాలపై జీఎస్టీ తగ్గించడానికి.. భారత ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టితో కూడిన చర్యను మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'అన్సూ కిమ్' అన్నారు. ఈ సంస్కరణ ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశం వికసిత్ భారత్ మార్గంలో పాయిస్తున్నప్పుడు.. ఆటోమొబైల్ రంగం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.జీఎస్టీ 2.0 అమలుతో.. హ్యుందాయ్ టక్సన్ కారు ధర గరిష్టంగా రూ. 2,40,303 వరకు తగ్గింది. గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ. 73,808 తగ్గింది. మోడల్ వారీగా తగ్గిన ధరలు ఎలా ఉన్నాయంటే..➤గ్రాండ్ ఐ 10 నియోస్: రూ.73,808➤ఆరా: రూ.78,465➤ఎక్స్టర్: రూ.89,209➤ఐ20: రూ.98,053➤ఐ20 ఎన్ లైన్: రూ.1,08,116➤వెన్యూ: రూ.1,23,659➤వెన్యూ ఎన్ లైన్: రూ.1,19,390➤వెర్నా: రూ.60,640➤క్రెటా: రూ.72,145➤క్రెటా ఎన్ లైన్: రూ.71,762➤అల్కాజార్: రూ.75,376➤టక్సన్: రూ.2,40,303 -
జావా, యెజ్డి బైక్ల ధరలు తగ్గింపు.. కొత్త రేట్లు ప్రకటించిన కంపెనీ
క్లాసిక్ లెజెండ్స్ (సీఎల్) తమ జావా, యెజ్డి బైక్ల కొత్త ధరలను ప్రకటించింది. వీటిలో అడ్వెంచర్, రోడ్స్టర్, బాబర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఉన్నాయి. ఇప్పుడివి రూ .2 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. పర్యావరణానికి పనికిరాదని భావించిన టూ స్ట్రోక్ మోటార్ సైకిల్ ను నిషేధించిన విధాన మార్పు కారణంగా భారతదేశంలో జావా, యెజ్డీ అమ్మకాలను కంపెనీ గతంలో నిలిపివేసింది. అయితే జీఎస్టీ 2.0 సంస్కరణలతో, జావా, యెజ్డీ బైక్లు తిరిగి రోడ్లపైకి వస్తాయని కంపెనీ తెలిపింది.350 సీసీ లోపు మోటార్ సైకిళ్లపై జీఎస్టీని తగ్గించి 18 శాతం పరిధిలోకి తీసురావడాన్ని స్వాగతిస్తున్నట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో తమ 293 సీసీ జావా, 334 సీసీ యెజ్డి పర్ఫార్మెన్స్ క్లాసిక్ బైక్ల ధరలు కస్టమర్లకు మరింత అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.కొత్త ధరలు ఇవే42 మోడల్ పాత ధర రూ.1,72,942 కాగా కొత్త ధర రూ.1,59,431 తగ్గింపు రూ. 13,511జావా 350 పాత ధర రూ.1,98,950, కొత్త ధర రూ.1,83,407, తగ్గింపు రూ.15,54342 బాబర్ పాత ధర రూ.2,09,500, కొత్త ధర రూ.1,93,133, తగ్గింపు రూ.16,36742 బాబర్ (ఇంకొక వేరియంట్) పాత ధర రూ.2,10,142, కొత్త ధర రూ.1,93,725, తగ్గింపు రూ.16,417పెరక్ పాత ధర రూ.2,16,705, కొత్త ధర రూ.1,99,775, తగ్గింపు రూ.16,930 -
టీవీఎస్ అపాచీ.. కొత్త వేరియంట్లు వచ్చాయ్..
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత టీవీఎస్ మోటార్ సంస్థ తన ప్రధాన మోటార్ సైకిల్ టీవీఎస్ అపాచీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అపాచీ ఆర్టీఆర్ 160, 180, 200, టీవీఎస్ అపాచీ RR310, RTR310 లైనప్లలో లిమిటెడ్–ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ లైనప్లో ప్రత్యేకమైన బ్లాక్–షాంపైన్–గోల్డ్ లివరీ, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, యూఎస్బీ చార్జర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.ఇప్పటికే ఉన్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, 200 లైనప్లలో అత్యున్నత స్థానంలో నిలిచే కొత్త 4 వీ వేరియంట్లు, అత్యాధునిక క్లాస్–డి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఎల్ఈడీ డీఆర్ఎన్లు, ఆల్–ఎల్ఈడీ లైటింగ్, 5 అంగుళాల కనెక్టెడ్ టీఎఫ్టీ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బోల్డ్ కొత్త రంగులు, డైనమిక్ గ్రాఫిక్స్ తదితర అదనపు ఫీచర్లు లభించాయి. ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈవో కె.ఎన్. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల టీవీఎస్ అపాచీ కమ్యూనిటీకి కృతజ్ఞతలు తెలిపారు. -
కార్ల ధరల తగ్గింపు షురూ...
ముంబై: జీఎస్టీ క్రమబద్ధీకరణ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు ఆటో కంపెనీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా తమ వాహన ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. పండుగ సీజన్ అమ్మకాలు పెంచుకునే లక్ష్యంలో భాగంగా మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనో ఇండియా, టయోటా కిర్లోస్కర్ ఇండియా, వాహన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన ధరల్ని కనీసం రూ. 75 వేల నుంచి గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు తగ్గిస్తామని తెలిపింది. మరో వైపు సవరించిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కార్ల ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సీ.భార్గవ చెప్పారు. మెుత్తానికి ఈ పండుగ సీజన్లో వాహన విక్రయాలు దుమ్ముదులిపేస్తాయని ఆటో పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా: ఎక్స్యూవీ3ఎక్స్ఓ డీజిల్ మోడల్పై రూ.1.56 లక్షల వరకు, స్కా రి్పయో ఎన్ ధర రూ.1.45 లక్షలు వరకూ తగ్గించింది. ఎక్స్యూవీ700పై రూ.1.43 లక్ష,లు, ఎక్స్యూవీ3ఎక్స్ఓ పెట్రోల్ మోడల్పై రూ.1.40 లక్షల వరకు, థార్ 2డబ్ల్యూడీ (డీజిల్) వేరియంట్ రూ.1.35 లక్షల వరకు, థార్ 4డబ్ల్యూడీ డీజిల్ కార్లపై రూ.1.01 లక్షల వరకు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షల వరకు థార్ రోక్స్ పై రూ.1.33 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. బొలెరో/నియోపై రూ.1.27 లక్షలు తగ్గించింది. జీఎస్టీ కొత్త రేట్లు సెపె్టంబర్ 22, 2025 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ మహీంద్రా మాత్రం తక్షణమే వినియోగదారులకు లాభం చేకూర్చాలని నిర్ణయించింది. కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా సందేశంలో, ‘‘అందరూ సెపె్టంబర్ 22 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మేము ఇప్పుడే జీఎస్టీ ప్రయోజనాలను అందిస్తున్నాం. తక్షణమే (సెప్టెంబర్ 6 నుంచే) తగ్గింపు రేట్లను పొందండి’’ అని పేర్కొన్నారు. రెనో ఇండియా సైతం: తన మోడళ్లపై తగ్గింపులను జీఎస్టీ క్రమబదీ్ధకరణకు అనుగుణంగా ప్రకటించింది. మోడళ్ల వారీగా తగ్గిన రెనో రేట్లను పరిశీలిస్తే.. ఎంట్రీ లెవల్ క్విడ్ మోడల్ ధర రూ.55,095 తగ్గింది. ట్రైబర్ మోడల్ రూ.80,195 వరకు చౌకగా మారుతుంది. కైగర్ మోడల్ రూ.96,395 వరకు ధర తగ్గింపుతో అందుబాటులోకి వస్తోంది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. తగ్గింపు బాటలో టయోటో కిర్లోస్కర్: టయోటా కిర్లోస్కర్ మోటార్ సైతం జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. తమ కార్ల ధరలను గరిష్టంగా రూ.3.34 లక్షల వరకు తగ్గించనున్నట్లు వెల్లడించింది. సెపె్టంబర్ 22 నుంచి చేసే అన్ని డెలివరీలపై ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ... ఫార్చ్యూ నర్ ధర రూ. 3.49 లక్షల వరకు తగ్గనుంది. వెల్ఫైర్ ధర రూ. 2.78 లక్షలు, హైలక్స్ ధర రూ.2.52 లక్షలు, కామ్రీ ధర రూ.1.01 లక్షల తగ్గనున్నాయి. కామ్రీ ధరలో రూ. 1.01 లక్షలు, లెజెండర్లో రూ. 3.34 లక్షలు, అర్బన్ క్రూయిజర్ హైరైడర్లో రూ. 65,400, గ్లాంజాలో రూ. 85,300 తగ్గింపు ఉంటుంది. ‘‘చారిత్రాత్మక సంస్కరణ చేపట్టిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇది ఆటో సెక్టార్లో విశ్వాసా న్ని బలోపేతం చేస్తుంది. ఈ రాయితీలు కస్టమర్లకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయని టయోటో కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వధ్వా తెలిపారు. సిట్రోయెన్ ‘బసాల్ట్ ఎక్స్’ కార్లు ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభం కార్ల కంపెనీ సిట్రోయెన్ ఇండియా తాజాగా బసాల్ట్ ఎక్స్ శ్రేణి కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో దేశీయంగా తొలిసారి ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ‘కారా’, ప్రీమియం ఇంటీరియర్స్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, రిమోట్ స్టార్ట్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ మధ్య నుంచి ఇవి టెస్ట్ డ్రైవ్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. -
టీవీఎస్ ఆర్బిటర్ vs ఐక్యూబ్: ఏది ఎక్కువ రేంజ్..
టీవీఎస్ మోటార్ ఇటీవలే.. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో.. ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఈవీకి అమ్మకాల పరంగా కొంత పోటీ పడుతుంది. రెండూ ఒకే కంపెనీకి చెందినవైనప్పటికీ.. డిజైన్, ఫీచర్స్, ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఆర్బిటర్ vs ఐక్యూబ్: డిజైన్ & ఫీచర్స్కొత్త టీవీఎస్ ఆర్బిటర్ 845 మిమీ ప్లాట్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్ పొందుతుంది. దీని కారణంగా రైడర్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అనుభవించవచ్చు. ఇది 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఐక్యూబ్లో 32 లీటర్లు.కొత్త ఆర్బిటర్ ముందు భాగంలో హై-మౌంటెడ్ హెడ్ల్యాంప్ క్లస్టర్ ఉంది. ఇది డీఆర్ఎల్ స్ట్రిప్తో కలిసి.. ఫ్రంట్ ఆప్రాన్లో విలీనం అవుతుంది. ఈ స్కూటర్ రెండు చివర్లలో 14 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ. ఇది క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటెడ్ హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం డిజైన్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్స్క్రీన్ TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. ఆర్బిటర్ కంటే కూడా కొంత తక్కువ అండర్ సీట్ కెపాసిటీ పొందుతుంది.ఆర్బిటర్ vs ఐక్యూబ్: పర్ఫామెన్స్ & రేంజ్టీవీఎస్ ఆర్బిటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 145 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. 2.2 కిలోవాట్, 3.1 కిలోవాట్, 5.3 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99000కాగా.. ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
మార్కెట్లో కొత్త వియాత్నం కార్లు: ధరలు ఇలా..
వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు.. విన్ఫాస్ట్ తన రెండు ఎలక్ట్రిక్ ఎస్యూవీలు VF6, VF7 ధరలను ప్రకటించింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 16.49 లక్షలు, రూ. 20.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న కంపెనీ కొత్త ప్లాంట్లో స్థానికంగా అసెంబుల్ చేస్తారు. సంస్థ వీటికోసం జులై 15 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.విన్ఫాస్ట్ VF6విన్ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది స్ప్లిట్ హెడ్లైట్, టెయిల్లైట్ సెటప్లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!విన్ఫాస్ట్ VF7టేపింగ్ రూఫ్లైన్, యాంగ్యులర్ రియర్ విండ్షీల్డ్తో స్ట్రీమ్లైన్డ్ ప్రొఫైల్ కలిగిన విన్ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది. -
మస్క్ ముంగిట కనీవినీ ఎరుగని జీతం...
టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ముంగిటకు కనీవినీ ఎరుగని జీతం ప్రతిపాదన వచ్చింది. టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల) విలువైన జీత ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే ఇది సాధారణ జీతం కాదు. పూర్తిగా పనితీరు ఆధారితమైనది. ఈ ప్యాకేజీని పొందాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి.ముఖ్యమైన షరతులు ఇవే..టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి 10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు ఉత్పత్తి చేయాలి10 లక్షల హ్యూమనాయిడ్ ఏఐ బాట్స్ రూపొందించాలికనీసం 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్కు ఉంచనుంది. గతంలో డెలావేర్ కోర్టు కొట్టివేసిన 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది. భారత విస్తరణలో భాగంగా టెస్లా ఢిల్లీలో ఇటీవల రెండవ షోరూమ్ను ప్రారంభించింది. భారతీయ ఈవీ మార్కెట్లో మరింత లోతుగా ప్రవేశించేందుకు ఇది కీలక అడుగు. -
జీఎస్టీ ఎఫెక్ట్...టాటా మోటార్స్ కార్ల ధరలు తగ్గాయ్
న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. తన ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గించనున్నట్లు శుక్రవారం తెలిపింది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. చిన్న కార్ల విభాగంలోని టియాగోపై రూ.75వేల తగ్గింపు, టిగోర్పై రూ.80 వేలు, ఆల్ట్రోజ్పై రూ.1.10 లక్షల తగ్గింపు ఉంటుంది. కాంపాక్ట్ ఎస్యూవీ పంచ్పై రూ.85 వేలు, నెక్సాన్ కారుపై రూ.1.55 లక్షల తగ్గింపు అమలులోకి రానుంది. మిడ్ సైజ్ మోడల్ కర్వ్పై రూ.65 వేలు, ప్రీమియం ఎస్యూవీలు హారియర్పై రూ.1.40 లక్షలు, సఫారీపై రూ.1.45 లక్షల తగ్గింపు ఉండనుందని కంపెనీ పేర్కొంది. ‘‘దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి ఉద్దేశాలకు అనుగుణంగా... ‘వినియోగదారునికే తొలి ప్రాధాన్యత’ అనే మా సిద్ధాంతాన్ని అవలంబిస్తూ, జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభాన్ని ఎటువంటి కోత లేకుండా కస్టమర్లకే పూర్తిగా అందజేస్తున్నాం’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. -
టీవీఎస్ ఎన్టార్క్ 150 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్టార్క్ 150’ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ, ప్రీమియం లుక్తో వస్తున్న ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్టీ వేరియంట్ ధర రూ.1,29,000 గా ఉంది.149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..హై–రిజల్యూషన్ టీఎఫ్టీ క్లస్టర్తో పాటు టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్షన్ టెక్నాలజీ ఉంది. అలెక్సా, స్మార్ట్వాచ్ ఇంటిగ్రేషన్, టర్న్–బై–టర్న్ నావిగేషన్, వెహికల్ ట్రాకింగ్, చివరిగా పార్క్ చేసిన స్థానం, కాల్/మెసేజ్ అలర్ట్స్, రైడ్, స్ట్రీట్ మోడ్లు, ఓటీఏ అప్డేట్స్, కస్టమ్ విడ్జెట్లు వంటి మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. -
భారత్లో టెస్లా తొలి కస్టమర్ ఎవరంటే..
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికి ఈ కారు కోసం 600 బుకింగ్స్ వచ్చాయిగా. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారును (First Tesla Car in India) డెలివరీ చేసింది. ఇంతకీ తొలి కస్టమర్ ఎవరో తెలుసా?తెలుపు రంగు టెస్లా ‘మోడల్ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్పీరియెన్స్ సెంటర్’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. మంత్రి ప్రతాప్ మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈవీలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్లో విక్రయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తరువాత ‘మోడల్ వై’ కారు (Tesla Model Y) విక్రయాలు మొదలయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు చేపట్టింది.#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from 'Tesla Experience Centre' at Bandra Kurla Complex, Mumbai, being made to the State's Transport Minister Pratap Sarnaik. 'Tesla Experience Center', the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG— ANI (@ANI) September 5, 2025టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
చిన్న కారు.. హుషారు!
ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీతో కూడిన ఎస్యూవీల ధాటికి చిన్న కార్లు చిన్నబోతున్న తరుణంలో.. జీఎస్టీ రేటు కోత తిరిగి ప్రారంభ స్థాయి కార్లకు డిమాండ్ను పెంచుతుందని ఆటోమొబైల్ పరిశ్రమలో ఆశాభావం వ్యక్తమవుతోంది. రోడ్లపై మళ్లీ చిన్న కార్లు తెగ సందడి చేయనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీఎస్టీలో 28 శాతం పన్ను రేటును 18 శాతానికి తీసుకొచి్చన నేపథ్యంలో ఒక్క చిన్న కార్ల ధర రూ.లక్ష వరకు తగ్గనుంది. దీంతో మరింత మంది వినియోగదారులకు ఇవి చేరువ కానున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ కార్ల మొత్తం విక్రయాల్లో చిన్న కార్ల వాటా 31 శాతంగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో 27 శాతానికి పడిపోయింది. ‘‘12 శాతం రేటు తగ్గిన ఫలితంగా కొనుగోలు వ్యయం రూ.లక్ష మేర తగ్గనుంది. దీంతో డిమాండ్ పుంజుకుంటుంది. పండగుల తరుణంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అమ్మకాలు పెరుగుతాయి. మధ్యశ్రేణి, విలాస కార్లపై జీఎస్టీ రేటు 40 శాతానికి పెరగనుంది. కాంపెన్సేషన్ సెస్ లేకపోవడంతో వీటి ధరలు కూడా తగ్గనున్నాయి’’అని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ సాకేత్ మెహ్రా అంచనా వేశారు. అందరికీ మేలు..: వాహనాలపై జీఎస్టీ రేటు తగ్గింపును భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర ఆహ్వానించారు. సకాలంలో తీసుకున్న ఈ చర్య ఆటోమోటివ్ రంగంలో తాజా ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. ‘‘వాహనాల ధరలు చౌకగా మారతాయి. ముఖ్యంగా ఆరంభ స్థాయి కార్ల ధరలు తగ్గుతాయి. మొదటిసారి కొనుగోలుదారులకు, మధ్యాదాయ కుటుంబాలకు మేలు కలుగుతుంది’’అని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం రేటును కొనసాగించడాన్ని సైతం స్వాగతించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు సాహసోపేతమైనవి, మార్పును తీసుకొచ్చేవిగా ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో వాహన ధరలు అందుబాటులోకి వస్తాయని, డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కీలకమైన పండుగల సీజన్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఎలాంటి ఆటంకాల్లేకుండా రేట్ల తగ్గింపు అమలు చేయడం ద్వారా ప్రయోజనాలను కస్టమర్లకు అందేలా చూడొచ్చన్నారు. ప్రీమియం కార్లకూ ప్రయోజనమే.. పెద్ద కార్లపై లెవీలను క్రమబద్ధీ్దకరిస్తూ.. చిన్న కార్లపై రేటు తగ్గించడం సామాన్యులకు వాహనాలను చేరువ చేస్తాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ డీఎండీ స్వప్నేష్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి సెస్సు లేకుండా ప్రీమియం కార్లపై 40 శాతం జీఎస్టీ అమలు చేయడం వల్ల విక్రయాలు పెరుగుతాయని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.మరిన్ని వేగవంతమైన సంస్కరణల బాటలోకి చేరాం. ఇవి వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయి. ఎకానమీ విస్తృతమై, ప్రపంచవేదికపై భారత్ స్వరాన్ని బలపరుస్తుంది. ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి’ అన్న వివేకానంద సందేశాన్ని గుర్తు చేసుకోవాలి. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్ -
భద్రతే లక్ష్యంగా కొత్త రూల్: నితిన్ గడ్కరీ
ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..రోడ్డు ప్రమాదాల గురించిరోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. -
రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?
ఇండియాలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. వీటికి కస్టమైజేషన్ చేయడం వంటివి చేస్తే.. రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే భారత రాష్ట్రపతి కోసం సరికొత్త 'బీఎండబ్ల్యూ' కారును కొనుగోలు చేయనున్నారు. దీని ధర రూ. 3.66 కోట్లు అని తెలుస్తోంది. మరి ఇంత ఖరీదైన కారుకు జీఎస్టీ వర్తిస్తుందా?, లేదా?.. అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కోసం 'మెర్సిడెస్ బెంజ్ ఎస్600 పుల్మాన్ గార్డ్' ఉపయోగిస్తున్నారు. ఈ కారు స్థానంలో సరికొత్త బీఎండబ్ల్యూ కారు చేరనుంది. రాష్ట్రపతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు కార్లను మారుస్తూ ఉంటారు. ఈ కార్లు కస్టమ్స్ బుల్లెట్ ప్రూఫ్.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికసాధారణంగా హై ఎండ్ కార్లను దిగుమతి చేసుకుంటే.. చాలా రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జీఎస్టీ, ఐజీఎస్టీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు సెస్సు వంటివి ఉంటాయి. కానీ రాష్ట్రపతి కోసం దిగుమతి చేసుకునే కారు కాబట్టి.. జీఎస్టీ నుంచి మాత్రమే కాకుండా సెస్సు నుంచి కూడా జీఎస్టీ కౌన్సిల్ మినహాయింపు కల్పించింది. ఇలాంటి మినహాయింపులు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి కోసం ఈ వెసులుబాటు కల్పించారు. కాగా ప్రస్తుతం లగ్జరీ కార్లు 40 శాతం జీఎస్టీ స్లాబులో ఉన్నాయి. -
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం: అదే స్లాబులో ఎలక్ట్రిక్ వెహికల్స్..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద 5 శాతం, 18 శాతం జీఎస్టీ స్లాబ్స్ తీసుకురావడంతో.. చాలా వస్తువుల ధరలతో పాటు, వాహనా ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. ఇందులో చిన్న కార్లు, బైకుల ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్లు మాత్రం యధావిధిగా 5 శాతం స్లాబులోనే నిలిచాయి.రూ. 20 లక్షల కంటే తక్కువ ధర వద్ద ఉన్న కార్లు 5 శాతం స్లాబులో, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలు 18 శాతం స్లాబులో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. టాటా మోటార్స్, మహీంద్రా కార్ల ధరలలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.ఎలక్ట్రిక్ కార్ల ధరలు 5 శాతం స్లాబులో ఉండటం వల్ల.. ధరలు కొంత నిర్దిష్టంగా ఉంటాయి. ఇది కొనుగోలుదారుల సంఖ్య పెంచుతుంది. దీంతో సేల్స్ పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే.. కాలుష్య కారకాలు తగ్గుతాయి. తద్వారా క్లిన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. ఈ కారణంగానే ఈవీలను 5 శాతం స్లాబులో ఉంచాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుఈ సంవత్సరం ఏప్రిల్ - జూలై మధ్య.. ఈవీ అమ్మకాలు 15,500 యూనిట్లను చేరుకున్నారు. ఇందులో టాటా మోటార్స్ 40% వాటాతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా 18% వాటాతో ఉంది. టెస్లా కూడా దేశంలో దాని మోడల్ Yతో ప్రవేశించింది, అయితే డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. -
మారుతీ కొత్త ఎస్యూవీ ‘విక్టోరిస్’
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా ‘విక్టోరిస్’ ఎస్యూవీని ఆవిష్కరించింది. తద్వారా మిడ్ సైజ్ ఎస్యూవీల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో వాహనాల శ్రేణిని మరింతగా విస్తరించింది. అయితే దీని ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. విక్టోరిస్ను అభివృద్ధి చేయడంపై సుమారు రూ.1,240 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో హైబ్రిడ్, సీఎన్జీ వెర్షన్లు కూడా ఉన్నాయి.కొత్త తరం కస్టమర్లు వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. ఈ నేపథ్యంలో గణనీయంగా పెరుగుతున్న యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విక్టోరిస్ను రూపొందించినట్లు చెప్పారు. దీన్ని 100 పైగా మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్యూవీల వాటా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతంగా ఉండగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28 శాతానికి ఎగిసిందని తకెయుచి వివరించారు.మారుతీ సుజుకీ ప్రస్తుతం ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ, గ్రాండ్ విటారా లాంటి ఎస్యూవీలను విక్రయిస్తోంది. దేశీయంగా మిడ్–సైజ్ ఎస్యూవీల అమ్మకాలు ప్రస్తుతం ఏటా 9.5 లక్షల యూనిట్లుగా ఉండగా, మొత్తం ఎస్యూవీల మార్కెట్లో వీటి వాటా 40 శాతంగా ఉంది.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు -
యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్లోని హన్సల్పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్మెంట్లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారుమారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
బ్యాటరీ తయారీలో అశోక్ లేలాండ్ రూ.5,000 కోట్ల పెట్టుబడులు
భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఎకోసిస్టమ్ను బలోపేతం చేసే దిశగా వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ పెట్టుబడుల పెడుతోంది. వచ్చే 7 నుంచి 10 ఏళ్లలో తదుపరి తరం బ్యాటరీల అభివృద్ధి, తయారీ కోసం రూ.5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. హిందూజా గ్రూప్ యాజమాన్యంలోని ఈ సంస్థ చైనా బ్యాటరీ టెక్నాలజీ లీడర్ సీఏఎల్బీ గ్రూప్తో దీర్ఘకాలిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, భారత్లో బలమైన బ్యాటరీ సరఫరా గొలుసును నిర్మించడం లక్ష్యంగా ఈ సహకారం కుదిరినట్లు ఇరు వర్గాలు తెలిపాయి.ఆటోమోటివ్, ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్లు..ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్)తో సహా ఆటోమోటివ్, నాన్ ఆటోమోటివ్ అప్లికేషన్లలో ఈ పెట్టుబడులు విస్తరించనున్నాయి. అశోక్ లేలాండ్ బ్యాటరీ ఉత్పత్తి విభాగంలోకి ప్రవేశించడంతో సొంత వాణిజ్య వాహన వ్యాపారానికి మద్దతుగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వేగవంతం చేయడానికి, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశంలో బ్యాటరీ సరఫరా గొలుసును సృష్టించే దిశగా సీఏఎల్బీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక కీలక అడుగు అని అశోక్ లేలాండ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ షెను అగర్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాటరీ వ్యాపారంలో ప్రాథమికంగా ఆటోమోటివ్ అప్లికేషన్లపై దృష్టి సారిస్తాం. తరువాత పారిశ్రామిక, నివాస ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలతో సహా నాన్-ఆటోమోటివ్ రంగాలకు ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తాం’ అన్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
వాహన విక్రయాలకు జీఎస్టీ 2.0 బ్రేకులు
కొత్త జీఎస్టీ విధానంతో ధరలు తగ్గొచ్చనే ఆశావహ అంచనాలతో కస్టమర్లు వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆగస్టులో ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% శ్లాబులో ఉంది. వాహన రకాన్ని బట్టి 1–22% పరిహార సెస్ విధిస్తున్నారు. చిన్న పెట్రోల్ కార్లపై 29% నుంచి ఎస్యూవీలపై 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. జీఎస్టీ 2.0 విధానంలో అన్ని వాహనాలను ఒకే శ్లాబులోకి ఉంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో కస్టమర్లు జీఎస్టీ ప్రకటన వెలువడే వరకు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మారుతీ సుజుకీ దేశీయంగా ఆగస్టులో 1,31,278 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో అమ్ముడైన 1,43,075 వాహనాలతో పోలిస్తే 8% తక్కువ. ఎగుమతులతో మొత్తం అమ్మకాలు 1,80,683 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘జీఎస్టీ సంస్కరణ ఆటో పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఏదైనా మంచి ఫలితం దక్కాలంటే.., ముందుగా కష్టాన్ని భరించాలి. అందుకే ఆగస్టు నెలలో డీలర్లకు సరఫరా తగ్గింది. జీఎస్టీ ప్రకటన తర్వాత పరిస్థితి మారుతుంది. మా వద్ద 1.5 లక్షల వాహన ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. డీలర్ల వద్ద నిల్వలు 48–50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి.’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారు
ప్రముఖ చైనా వాహన తయారీ సంస్థ అయిన బీవైడీ.. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇండియాలో 10000వ ప్యాసింజర్ కారును డెలివరీ చేసినట్లు ఇటీవల ప్రకటించింది.2021 చివరిలో భారతదేశంలో తన మొదటి ప్యాసింజర్ వాహనాన్ని ఈ6 ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మొదట్లో కమర్షియల్ విభాగాన్ని దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసిన బీవైడీ ఇండియా.. ఆ తరువాత ప్యాసింజర్ కార్లను లాంచ్ చేసింది.BYD ప్రస్తుతం భారత మార్కెట్లో నాలుగు కార్లను (సీల్, ఆట్టొ, ఈ6, ఈమ్యాక్స్7) విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో తన లైనప్ను పెంచుకోవడంలో భాగంగా.. కంపెనీ ఆట్టొ 2 లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది క్రెటా ఈవీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.ప్రపంచవ్యాప్తంగా.. బీవైడీ 13 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీని వల్ల 2025 జులై 31 నాటికి 106.52 బిలియన్ కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను ఆదా చేయడంలో కంపెనీ సహాయపడింది. ఇది దాదాపు 1.77 బిలియన్ చెట్లు గ్రహించిన CO2కు సమానం. ఈ కంపెనీ వరుసగా మూడు సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్జెడ్ ద్వారా టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది, 2025లో దీని బ్రాండ్ విలువ USD 14.4 బిలియన్లు, ఇది సంవత్సరానికి 43.6% వృద్ధిని సూచిస్తుంది. -
వాహనాలకు ప్రీమియం నంబర్లు.. ఇక కొత్త నిబంధనలు
తెలంగాణలో వాహనాలకు ప్రీమియం నంబర్లకు సంబంధించిన నిబంధనలు మారాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని రూల్ 81కు సమగ్ర సవరణ చేస్తూ ప్రీమియం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసే ఫీజు విధానం, ప్రక్రియను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇకపై రవాణా శాఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం, అవినీతిని అరికట్టడం, మొత్తం రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిజిటల్-ఓన్లీ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకుకొచ్చారు.కొత్త అంచెల ఫీజు విధానంసవరించిన నిబంధనల ప్రకారం నంబర్ల పాపులారిటీ, ప్రత్యేకత ఆధారంగా ఆరు అంచెల ఫీజు వ్యవస్థను ప్రవేశపెట్టారు.టైర్ 1లో 1, 9, 9999 నంబర్లకు అత్యధికంగా రూ.1,50,000టైర్ 2లో 99, 100, 786, 888, 999 నంబర్లకు రూ 1,00,000టైర్ 3లో 33, 111, 555, 666, 777, 1000 నంబర్లకు రూ. 50,000 టైర్ 4లో 1234, 2023, 2525, 3333, 4444, 5555, 6666, 7777, 8888, 9090 నంబర్లకు రూ. 20,000టైర్ 5లో 123, 143, 202, 345, 789, 987 నంబర్లకు రూ. 10,000టైర్ 6లో ఇతర అన్ని నంబర్లకు రూ.2,000అధిక-డిమాండ్ నంబర్లకు ఆన్లైన్ వేలంఅధిక-డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే నంబర్ల కోసం ప్రభుత్వం ఆన్లైన్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్డర్లు రెండు గంటల విండోలో పోటీపడతారు. అత్యధిక బిడ్డర్ నంబర్ను సొంతం చేసుకుంటారు. విఫలమైన బిడ్డర్లు చెల్లించిన ఫీజులో 10% కోల్పోతారు.గెలిచిన బిడ్డర్ 30 రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేయకపోతే, రిజర్వేషన్ రద్దు చేస్తారు. అలాగే మొత్తం రుసుమును సీజ్ చేస్తారు. ఆన్లైన్ విధానం వల్ల అక్రమాలు తగ్గడమే కాకుండా ప్రీమియం సేవల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. సవరణలను ఖరారు చేయడంలో విస్తృత భాగస్వామ్యం ఉండేలా గెజిట్ వెలువడిన 15 రోజుల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఆహ్వానించింది. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
సెప్టెంబర్ 4న లాంచ్ అయ్యే టీవీఎస్ స్కూటర్ ఇదే
టీవీఎస్ మోటార్ కంపెనీ.. సెప్టెంబర్ 4న 'ఎన్టార్క్ 150'ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో రాబోయే స్కూటర్ హెడ్ల్యాంప్ క్లస్టర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది క్వాడ్ ఎల్ఈడీ సెటప్తో.. టీ-షేప్ హౌసింగ్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటరుకు సంబంధించిన మెకానికల్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఎన్టార్క్ 150 స్కూటర్.. యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. -
సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!
సుజుకి మోటార్సైకిల్ ఇండియా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులకు రీకాల్ జారీ చేసింది. వెనుక బ్రేక్ సమస్యల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 జూన్ మధ్యలో తయారైన 5145 యూనిట్ల బైకులపై ఈ రీకాల్ ప్రభావం పడింది. అయితే వినియోగాదారుల నుంచి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బ్రాండ్ ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.వెనుక బ్రేక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. ప్యాడ్లు, బ్రేక్ డిస్క్ల మధ్య సరైన కనెక్షన్ లేకపోవడమే. అత్యవసర సమయంలో బ్రేకింగ్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కంపెనీ దీనిని పరిష్కరించడానికి ఈ రీకాల్ జారీ చేసింది. ఫిబ్రవరి 2024లో కూడా ఇంజిన్ క్యామ్షాఫ్ట్ సమస్య కారణంగా సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వీ-స్ట్రామ్ ఎస్ఎక్స్ బైకులకు రీకాల్ జారీ చేసింది.సుజుకి జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250 వినియోగదారులు బైకులోని సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలోని సర్వీస్ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ, సాంకేతిక నిపుణులు మోటార్సైకిల్ను తనిఖీ చేసి, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన మరమ్మతులు చేస్తారు.ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవేసుజుకి జిక్సర్ 250.. జిక్సర్ ఎస్ఎఫ్ 250 బైకులు 249సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 26.5 హార్స్ పవర్, 22 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. -
లాంచ్కు సిద్దమవుతున్న వియాత్నం బ్రాండ్ కార్లు.. ఇవే
వియాత్నం కంపెనీ విన్ఫాస్ట్.. భారతదేశంలో తన VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను 2025 సెప్టెంబర్ 6న ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో కనిపించిన ఈ కార్లు త్వరలోనే రోడ్డుపై కనిపించనున్నాయి. కాగా కంపెనీ ఈ కార్ల కోసం ఫ్రీ-బుకింగ్లను జులై 15 నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. వినియోగదారులు రూ. 21,000 రీఫండబుల్ డిపాజిట్ ద్వారా ఆన్లైన్లో లేదా విన్ఫాస్ట్ అవుట్లెట్లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.ప్రీమియం ఎలక్ట్రిక్ మొబిలిటీని కోరుకునే భారతీయ కొనుగోలుదారులను.. లక్ష్యంగా చేసుకుని విన్ఫాస్ట్ VF6 & VF7 లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కలిగి ఉంటాయని, పనోరమిక్ గ్లాస్ రూఫ్లను కూడా పొందుతాయని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారువిన్ఫాస్ట్ తన సేల్స్, సర్వీస్, స్పేర్స్ నెట్వర్క్ను విస్తరించడంతో భాగంగా.. ఢిల్లీ, బెంగళూరు, పూణే, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన కేంద్రాలతో సహా 27 నగరాల్లో 32 షోరూమ్లను ఏర్పాటు చేయడానికి 13 డీలర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతే కాకుండా ఛార్జింగ్ స్టేషన్స్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి.. కంపెనీ రోడ్గ్రిడ్, మైటీవీఎస్, గ్లోబల్ అష్యూర్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు ఇంక పెరిగేది ఇంతే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 1–4 శాతం పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. డీలర్ల వద్ద అధిక నిల్వలు, బేస్ ఎఫెక్ట్ల కారణంగా అవుట్లుక్ వృద్ధిని పరిమితం చేసినట్లు రేటింగ్ సంస్థ తెలిపింది. అయితే ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు)లు కొత్త మోడళ్ల ఆవిష్కరణ, జీఎస్టీ రేట్ల తగ్గింపు అవకాశాలు కొన్ని ప్రత్యేక విభాగాల్లో డిమాండ్కు తోడ్పడతాయని పేర్కొంది.‘‘పండుగ సీజన్కు ముందు ఓఈఎంలు ఇన్వెంటరీ నిల్వలను పెంచుకోవడంతో నెల వారీ ప్రాతిపదికన జూలై హోల్సేల్ అమ్మకాల్లో 8.9 శాతం వృద్ధి నమోదైంది. అయితే వార్షిక ప్రాతిపదికన ఫ్లాటుగా 3.4 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన రిటైల్ అమ్మకాలు 10.4% వృద్ధి నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదకన స్వల్పంగా 0.8% క్షీణత నమోదైంది. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో ఎస్యూవీలు 65–66% వాటా సాధించాయి. సమీప భవిష్యత్తులో యుటిలిటీ వాహనాలు పరిశ్రమ వృద్ధికి కీలక ప్రచోదకాలుగా మారాయి’’ అని ఇక్రా వివరించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఈ బైక్ ధరలు భారీగా పెరగనున్నాయ్!
పండుగ సీజన్లో వాహనాల ధరలు కొంత తగ్గుతాయి, అప్పుడు నచ్చిన బైక్ కొనుగోలు చేద్దామని కొంతమంది వేచి చూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే జీఎస్టీ పెరుగుదల కారణంగా.. బైక్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.ముఖ్యంగా 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్.. ఆన్ రోడ్ ధరలు ఇప్పుడు 30 శాతం లేదా.. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాగా తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు తగ్గే అవకాశం ఉంది.ఇప్పటి వరకు అన్ని మోటార్ సైకిల్స్ 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. అయితే 350 సీసీ బైకులకు 28 శాతం జీఎస్టీతో పాటు 3 శాతం సెస్సు కలుస్తుంది. అంటే వీటిపై జీఎస్టీ 31 శాతానికి చేరుతుంది. ఇక త్వరలో రాబోయే జీఎస్టీ 2.0 విధానంలో రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ రద్దు అవుతాయి. అయితే 40 శాతం జీఎస్టీ అనేది లగ్జరీ వాహనాలకు వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుజీఎస్టీ ప్రభావం వల్ల.. బైక్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు పెరుగుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ప్రస్తుత ఆన్ రోడ్ ధర రూ. 3.80 లక్షలు. జీఎస్టీ కారణంగా దీని ధర రూ. 4.13 లక్షలకు చేరుతుంది. అదే విధంగా కేటీఎం ధర కూడా రూ. 3.60 లక్షల నుంచి రూ. 3.91 లక్షలకు చేరుతుంది. ట్రయంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్సన్ వంటి బైకుల ధరలు కూడా పెరుగుతాయి. -
టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
టీవీఎస్ మోటార్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ ను లాంచ్ చేసింది. సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ .99,900 (ఎక్స్-షోరూమ్, పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్, బెంగళూరు, న్యూఢిల్లీతో సహా). దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ను అందిస్తుంది.ఆర్బిటర్ 3.1 కిలోవాట్ల బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రెండు హెల్మెట్లు పట్టేంత 34 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఇందులో ఉన్నాయి.కనెక్టెడ్ యాప్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్, క్రాష్/ఫాల్ అలర్ట్స్, యాంటీ థెఫ్ట్ నోటిఫికేషన్లు, ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ను ఈ స్కూటర్ అందిస్తోంది. కలర్ ఎల్సీడీ క్లస్టర్ కాల్స్, మెసేజ్ లు, పర్సనలైజ్డ్ అలర్ట్ లను ప్రదర్శిస్తుంది.పొడవైన 845 ఎంఎం ఫ్లాట్ ఫార్మ్ సీట్, స్ట్రెయిట్ లైన్ ఫుట్ బోర్డ్, నిటారుగా ఉండే హ్యాండిల్ బార్ తో డిజైన్ చేసిన ఈ ఆర్బిటర్ రైడర్ కంఫర్ట్, ఎర్గోనామిక్స్ కు ప్రాధాన్యమిస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్, లైవ్ ట్రాకింగ్, టోయింగ్ అలర్ట్స్, 169 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నాయి.ఆర్బిటర్ నియాన్ సన్బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లార్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్స్ కాపర్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
కారు తెచ్చిన చిక్కులు.. షారుఖ్, దీపికలపై కేసులు
బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలకు చిక్కులు ఎదురయ్యాయి. రాజస్థాన్కు చెందిన కీర్తి సింగ్ అనే న్యాయవాది హ్యుందాయ్ మోటార్ ఇండియా, దాని బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2022లో రూ.23.97 లక్షలకు కొనుగోలు చేసిన హ్యుందాయ్ అల్కాజర్ ఎస్యూవీలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు.యాక్సిలరేటర్ తొక్కినప్పుడు ఆర్పీఎమ్ పెరిగినా కారు వేగం పెరగలేదని సింగ్ ఆరోపిస్తున్నారు. వాహనం కంపించి ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టం పనిచేయకపోవడం లేదన్న హెచ్చరికను ప్రదర్శించింది అంటున్నారు. దీనిపై హ్యుందాయ్ డీలర్ను అడిగితే ఇది తయారీ లోపమని, దాన్ని పూర్తిగా సరిచేయడానికి వీలుకాదని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.హ్యుందాయ్ కంపెనీ, డీలర్ షిప్ వారు కారును ఫిక్స్ చేయడానికి లేదా మార్చడానికి నిరాకరించడంతో కీర్తి సింగ్ వారిపై సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద ఫిర్యాదు చేశారు. ఐపిసి సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని నిబంధనలను కూడా ఆయన ఉపయోగించారు. ఇది తప్పుదోవ పట్టించే ప్రమోషన్లకు మద్దతుదారులను బాధ్యులను చేస్తుంది.షారుఖ్ , దీపికలపైనా కేసు ఎందుకంటే..బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు ఇద్దరు నటుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. షారుఖ్ 1998 నుండి హ్యుందాయ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపిక డిసెంబర్ 2023లో హ్యుందాయ్ తో చేరారు. లోపభూయిష్టమైన ఉత్పత్తిని విశ్వసించేలా వారి ఎండార్స్ మెంట్ లు వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని కీర్తి సింగ్ వాదిస్తున్నారు.


