Tamil Nadu
-
Tamil Nadu: కాంగ్రెస్ వర్సెస్ టీవీకే
సాక్షి, చెన్నై : కన్యాకుమారి జిల్లా కిల్లియూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే , మంత్రి రాజేష్ కుమార్ ఎన్నికను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు టీవీకే అభ్యర్థి సబీన్ నిర్ణయించారు. ఆయన గెలుపు చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలలో 1,311 ఓట్లతో రాజేష్ కుమార్ సబీన్పై గెలిచారు. సోమవారం సబీన్ స్వయంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేఖను కిల్లియూర్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కౌన్సిల్ కార్యదర్శి , ప్రధాన ఎన్నికల కమిషనర్కు కూడా పంపినట్టు ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్ ఓట్ల నిర్లక్ష్యం : ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కింపు జరపాల్సిన అనేక పోస్టల్ ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ నిర్దేశిత సమయం కంటే ముందే, అంటే ఉదయం 6 గంటలకే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారని వివరించారు. సాంకేతిక లోపం పేరిట ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, తాము ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కౌంటింగ్ అధికారులు సరైన వివరణ ఇవ్వకుండా రకరకాల కారణాలు చెబుతూ తుది ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని సబీన్ ఆరోపించారు.నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లెక్కింపు ఆధారంగా ప్రకటించిన రాజేష్ కుమార్ విజయాన్ని తక్షణమే రద్దు చేయాలని సబీన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే, త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.కాగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యే గెలుపును వ్యతిరేకిస్తూ అధికార పక్షం అభ్యర్థి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చకు దారి తీసింది. -
కాంగ్రెస్కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్’
సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం ఈ యూనిట్ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు. మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు. -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది.!
పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పై సూట్కేసులో దొరికిన కుళ్లిపోయిన తల చేతులు కాళ్లు లేని మృతదేహం కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికినట్లు దర్యాప్తులో తేలింది. తల కాళ్లు, చేతులు లేక పోవడం, మొండెం మాత్రం ఉండటంతోకేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే మృతదేహంపై ఉన్న బ్రాండెడ్ బట్టల బార్కోడ్ ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆ దుస్తులను కొనుగోలు చేసిన షాపును గుర్తించారు. దీనిని ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలింది. కాల్ డేటా రికార్డ్, వాట్సాప్ లోకేషన్ ఆధారంగా నిందితులు తేనాంపేట, టి.నగర్ పరిసరాలలో ఉన్నట్టు గుర్తించారు. హత్యకు గల కారణాలు.. పోలీసుల విచారణలో మరణించిన వ్యక్తి అస్సాంకు చెందిన అమీర్ గుర్తించారు. నిందితురాలు రోకిమాకు అస్సాంలోనే మొదటి వివాహమై ఒక కుమార్తె ఉంది. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఆమె అమీర్ అలీని రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2022 నుండి తేనాంపేటలోని థామస్ రోడ్ హౌసింగ్ బోర్డు క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అయితే అమీర్ అలీకి ఇతర మహిళలతో ఉన్న సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య నిరంతరం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రోకిమాకు టి.నగర్లో కూరగాయల దుకాణం నడుపుతున్న అస్సాంకు అష్రఫ్ (31)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి రోకిమా అతడికి చెప్పగా పథకం ప్రకారం మట్టుబెట్టినట్టు తేలింది. హత్య తర్వాత తన భర్త అమీర్ అలీ స్వయంగా పెట్టినట్లుగా.. తనకు ఇక బతకాలని లేదు, ఎవరూ వెతకవద్దు అని హిందీలో ఒక నకిలీ సందేశాన్ని అతడి ఫెస్బుక్లో రోకిమా పోస్టు చేసింది. మానసిక క్షోభతో∙అమీర్ ఎక్కడికో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకే యత్నించింది.శవాన్ని ముక్కలుగా నరికి.. పథకం ప్రకారం, జూన్ 4వ తేదీ రాత్రి అమీర్ అలీ నిద్రపోతున్న సమయంలో రోకిమా, ఆమె ప్రియుడు అష్రఫ్ అతని గొంతు కోసి హత్య చేశారు. అతని తల, చేతులు, కాళ్లను ముక్కలుగా నరికారు. మొండెం భాగాన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కవర్లో చుట్టి సూట్కేసులో కుక్కారు. జూన్ 5వ తేదీ రాపిడో ఆటోలో ప్రయాణించి ఆ సూట్కేసును పెరంబూర్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. కాగా, నరికిన చేతులు, కాళ్లను ఒక కాలువలో వేయగా, తలను మాత్రం చెంగల్పట్టు జిల్లా పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. కాగా భర్త శరీర బాగాలను నరికేటప్పుడు ఆనందంగా భార్య ఆనందంతో సెల్ఫీలు తీసుకోవడం గమనార్హం.-సాక్షి, చెన్నై -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
విద్యుత్ కోతలపై వివాదం
– టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే లీగల్ నోటీసు సాక్షి, చైన్నె: తమిళనాడులో నెలకొన్న విద్యుత్ కోతల సమస్యకు డీఎంకే నాయకులే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరు వి.కా నగర్ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే తరపున నష్టపరిహారం , అవమానకర వ్యాఖ్యల నోటీసు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన శరవణన్ అన్నాదురై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వంపై, సీఎం విజయ్ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీవీకే ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక టీవీకే ప్రభుత్వం, ఆ పార్టీ మంత్రులు పూర్తిగా అయోమయంలో పడిపోయారన్నారు. విద్యుత్ కోతలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వేసవి కాలంలో ఎదురొయ్యే ఈ పరిస్థితిని గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అయితే, ఇప్పుడు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకేపై నిందలు వేస్తున్నారన్నారు. టీవీకే మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.తిరు వి.క నగర్ ఎమ్మెల్యే పల్లవి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పవర్ కట్స్కు డీఎంకే వారే కారణమంటూ బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆమెకు లీగల్ నోటీసు పంపామని, తాను చేసిన అబద్ధపు ఆరోపణలకు గాను ఎమ్మెల్యే పల్లవి బహిరంగంగా డీఎంకే పార్టీకి క్షమాపణలు చెప్పాలని శరవణన్ అన్నాదురై డిమాండ్ చేశారు. సముద్రంలో గల్లంతైన జాలర్ల రక్షింపు తిరువొత్తియూరు: కడలూరు జిల్లా పరంగిపేట్టై పుదుపేట షణ్ముగ నగర్కు చెందిన రవి అలియాస్ రమేష్ (28), అదే ప్రాంతానికి చెందిన మనోహర్ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళం తెర్కు వీధికి చెందిన నాగవేల్ (40) అనే ముగ్గురు జాలర్లు ఈనెల 2వ తేదీ ఓ ఫైబర్ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. మరుసటి రోజు (3వ తేదీ) వారు తిరిగి రావాల్సి ఉండగా, ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తోటి మత్స్యకారులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మత్స్యకారులు పరంగిపేట్టై సమీపంలోని అన్నన్ కోవిల్ ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో మత్స్యశాఖ అధికారులు జాలర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అన్నన్ కోవిల్ గ్రామానికి వెళ్లిన చిదంబరం నియోజకవర్గ ఎమ్మెల్యే తమిళన్.. అన్సారీ మాయమైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి, పడవ యజమానితో సహా మత్స్యకారులతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిస్థితిలో, సోనంకుప్పంకు చెందిన నలుగురు మత్స్యకారులు సోమ వారం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అక్కడ నడి సంద్రంలో ఆగిపోయిన బోట్లో గల్లంతైన జాలర్లు స్పృహ తప్పి పడి ఉన్నట్లు గుర్తించి వారిని తమ పడవలోకి ఎక్కించుకున్నారు. దీని గురించి తమ వద్ద ఉన్న వైర్లెస్ పరికరం ద్వారా మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాని ప్రకారం, మత్స్యశాఖ అధికారులు తీరంలో 108 అంబులెనన్స్తో సిద్ధంగా ఉన్నారు. పడవ తీరానికి రాగానే, వారిని పడవ నుండి దించి 108 అంబులెన్స్ ద్వారా కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొకై న్ స్మగ్లింగ్లో నిందితుడికి 10 ఏళ్లు జైలు సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో రూ. 2,000 కోట్ల విలువైన కొకై న్ డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన కేసులో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించించింది. వివరాలు.. 2021 ఏప్రిల్లో విదేశాల నుండి కార్గో షిప్ ద్వారా తూత్తుకుడి ఓడరేవుకు ఒక ప్రత్యేక కంటైనర్ వచ్చింది. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థల నుండి భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది.దీని ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు, సదరు కంటైనర్ రికార్డులను పరిశీలించి తూత్తుకుడిలోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్ గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ దిగుమతి చేసుకున్న టేకు కలప దుంగల మధ్య అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 303 కిలోల నాణ్యమైన కొకై న్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ కంటైనర్ చైన్నెకి చెందిన ఓ లాజిస్టిక్స్ కంపెనీ ఐపీ అడ్రస్, ఆఫీస్ సిబ్బంది అయిన సతీష్ కుమార్ అనే ఉద్యోగి మొబైల్ నంబర్ ఉన్నట్లు తేలింది.అధికారులు సతీష్ కుమార్ను విచారించగా, తన బ్రాంచ్ మేనేజర్ అయిన లియో రోసారియో జోసెఫ్ (49) ఆదేశాల మేరకే తాను ఆ కార్గో పెట్టె రాకను పర్యవేక్షించానని అంగీకరించారు. తుది విచారణ అనంతరం మధురై కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితుడు లియోకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన రషీద్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని విచారణలో తేలింది. నేటీకి పరారీలో ఉన్న రషీద్ కోసం పోలీసులు, ప్రత్యేక నిఘా సంస్థలు చురుగ్గా గాలిస్తున్నాయి. -
దిండుగల్ జిల్లాలో మహిళా శక్తి
సాక్షి, చైన్నె: దిండుగల్ జిల్లా పరిపాలనలో మహిళా అధికారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కలెక్టర్ మొదలుకొని వివిధ ప్రభుత్వ శాఖల అగ్ర శ్రేణి పోస్టుల వరకు మహిళలే అత్యధిక సంఖ్యలో నియమితులవడంతో, జిల్లా యంత్రాంగం మొత్తం మహిళల ఆధిపత్యం, నాయకత్వంలో ముందుకు సాగుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం దిండుగల్ జిల్లాలో కీలక పదువులలో ఉన్న వారి బదిలీలు జరిగాయి. ఆమేరకు ఇటీవలే దిండుగల్ జిల్లా కొత్త కలెక్టర్గా దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించారు, అలాగే రెవెన్యూ , గ్రామీణాభివృద్ధి శాఖలను జిల్లా కలెక్టర్ తర్వాత అత్యంత కీలకమైన రెవెన్యూ విభాగాన్ని డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ జయభారతి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని భూపరిపాలన, రెవెన్యూ వ్యవహారాలన్నీ ఈమె నియంత్రణలోనే ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాధరణి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ అంతర్గత పరిపాలన, సమన్వయ బాధ్యతలను కలెక్టర్ వ్యక్తిగత సహాయకురాలు జయంతి చూసుకుంటున్నారు. కొడైకెనాల్ ఆర్డీఓగా కీర్తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ముత్తు శారద విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖను చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉష లీడ్ చేస్తున్నారు. జిల్లా సామాజిక సంక్షేమ అధికారిగా కరోలిన్ సెల్వరాణి, జిల్లా సమగ్ర బాలల అభివృద్ధి పథకం) అధికారిగా పూంగొడి సేవలందిస్తున్నారు. ఇక, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్గా గాయత్రి, జిల్లా పంచాయతీ సెక్రటరీగా రాజేశ్వరి పనిచేస్తున్నారు. కలెక్టర్ దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో.. మహిళల సంక్షేమం, రక్షణ, జీవనోపాధి మరియు బాలల హక్కుల పరిరక్షణకు తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని అగ్ర శ్రేణి పోస్టుల్లో ప్రతిభావంతులైన మహిళా అధికారులే ఉండటం వలన , ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న చివరి లబ్ధిదారునికి కూడా పారదర్శకంగా అందుతాయని, జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని దిండుగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేషన్లో ఆస్తుల వివాదం
సాక్షి, చైన్నె : చైన్నె మహానగర కార్పొరేషన్ లో చట్ట నిబంధనలను తుంగలో తొక్కుతూ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్లతో పాటు ఏకంగా 157 మంది కార్పొరేటర్లు తమ ఆస్తుల వివరాలను సమర్పించలేదనే సంచలన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సోమవారం వెలుగుచూసింది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో 8 నెలల్లో ముగియనున్న తరుణంలో, ప్రజాప్రతినిధుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్టం ఏం చెబుతోంది? తమిళనాడు ప్రభుత్వం 1998లో తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి 2022లో కీలక సవరణలు చేస్తూ 34ఏ అనే కొత్త నిబంధనను చేర్చారు. దీని ప్రకారం.. పట్టణ స్థానిక సంస్థల్లోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు తాము పదవీ బాధ్యతలు స్వీకరించిన 90 రోజులలోపు తమ స్వంత ఆస్తులతో పాటు తమ భార్య, భర్త, పిల్లల ఆస్తుల వివరాలను కార్పొరేషన్లో సమర్పించాలి. అనంతరం 2023లో తెచ్చిన నిబంధనలలోని రూల్ 183 ప్రకారం.. ఈ ఆస్తి వివరాల పత్రాలను కార్పొరేషన్ కమిషనర్కు అందజేయాలి. కమిషనర్ వాటిని అత్యంత భద్రంగా దాచాల్సి ఉంటుంది. సమాచార విచారణలో షాకింగ్ నిజాలు ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన న్యాయవాది శంకర్.. చైన్నె కార్పొరేటర్ల ఆస్తి వివరాల సమర్పణపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీనికి కార్పొరేషన్ యంత్రాంగం ఇచ్చిన సమాధానం అందరినీ షాక్కు గురిచేసింది. చైన్నె కార్పొరేషన్లోని మొత్తం 200 వార్డు లలో కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్తో పాటుగా 157 మంది తమ ఆస్తుల వివరాలను సమర్పించక పోవడం గమనార్హం. కేవల 43 మంది మాత్రమే తమ వివరాలను సమర్పించి ఉన్నారు. మిగిలిన వారిలో నలుగురు ఇప్పటికే మరణించగా, ఇద్దరు అనర్హతకు గురయ్యారు. చట్టాన్ని గౌరవించకుండా, నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధుల జాబితాను కూడా కార్పొరేషన్ అధికారికంగా విడుదల చేయడం గమనార్హం.కార్పొరేషన్ భవనం చర్యలకు చట్టంలో చోటు లేదు ఈ ఉల్లంఘనపై సదరు కార్పొరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించగా, వారు చేతులెత్తేశారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు 90 రోజుల్లోగా ఆస్తి వివరాలు సమర్పించాలని మాత్రమే పేర్కొన్నారు. ఒకవేళ ఆ గడువులోగా వివరాలు ఇవ్వకపోతే వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలో సవరించిన చట్టంలో ఎక్కడా స్పష్టంగా పొందుపరచలేదన్నారు. చర్యలకు చట్టంలో ఆస్కారం లేనందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు. అదే సమయంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో అందరికీ నోటీసులు పంపించామని, 30 రోజులలోపు వివరాలను సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. -
సీఎం విజయ్ వ్యాఖ్య
● నార్వే చెస్ విజేత ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహం ● రూ.50 లక్షలు అందజేసిన సీఎం సాక్షి, చైన్నె: తమిళనాడు క్రీడా శాఖ తరపున గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో తాను గెలుచుకున్న చారిత్రాత్మక విజేత ట్రోఫీని సీఎం విజయ్కు చూపించి, ఆయన అభినందనలు, ఆశీస్సులు అందుకున్నారు. క్రీడల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు, క్రీడా రంగంలో తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఈసందర్భంగా సీఎం విజయ్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించేలా వారికి అత్యాధునిక శిక్షణ అందించడం, విజేతలకు భారీ నగదు బహుమతులు ప్రకటించడం , క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అనేక విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే, గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మక ‘ఎలైట్’ స్కాలర్షిప్ పథకం కింద ఏటా రూ.30 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టించి ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ గ్రాండ్మాస్టర్గా రికార్డు నెలకొల్పిన ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చైన్నెలోని సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం సి. జోసెఫ్ విజయ్ చేతుల మీదుగా ప్రజ్ఞానందకు రూ.50 లక్షల భారీ ప్రోత్సాహక నగదు బహుమతి చెక్కును అందజేశారు. చైన్నెలో ‘హోమ్ ఆఫ్ చెస్’ అకాడమీ క్రీడలను కేవలం ఒక ఆటగా కాకుండా, సామాజిక మార్పునకు ఒక శక్తివంతమైన సాధనంగా సీఎం సి. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈసందర్భంగా ప్రకటించారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను సరైన దిశలో మళ్లించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా వివిరించారు. ఈ లక్ష్య సాధన కోసం చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ‘హోమ్ ఆఫ్ చెస్‘ పేరిట ఒక ప్రత్యేకమైన చెస్ అకాడమీని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ అకాడమీ ద్వారా యువ క్రీడాకారులకు క్రమబద్ధమైన శిక్షణ శిబిరాలు నిర్వహించడం, అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని కల్పించడం, మోడరన్ సాఫ్ట్వేర్ టూల్స్తో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నట్టు వివరించారు.అలాగే, ఆటగాళ్ల మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ప్రణాళికలు , మేధో వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తక్కువ వయసులోనే క్రీడాకారులు ఇంటర్నేషనల్ మాస్టర్ , గ్రాండ్మాస్టర్ వంటి అత్యున్నత హోదాలను సాధించేలా ప్రోత్సహించడమే ఈ అకాడమీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ప్రజాపనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
డీవీఏసీ డైరెక్టర్ అరుణ్పై ఫిర్యాదు
– సవుక్కు శంకర్ సంచలన వ్యాఖ్యలు సాక్షి, చైన్నె: అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్ అరుణ్ ఐపీఎస్ తనను హతమార్చేందుకు ముంబైకి చెందిన కిరాయి ముఠాను రంగంలోకి దించారంటూ ప్రముఖ యూట్యూబర్, సామాజిక విశ్లేషకుడు సవుక్కు శంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన సవుక్కు శంకర్, తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం , పోలీసు అధికారుల తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగలోకి ముంబై నుంచి కిరాయి ముఠా ప్రస్తుతం డీవీఏసీ డైరెక్టర్గా ఉన్న అరుణ్ ఐపీఎస్ తనను అంతమొందించేందుకు ముంబై నుండి కిరాయి ముఠాను రంగంలోకి దించినట్టు ఆరోపించారు.ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు ఈ సమాచారం అందిందన్నారు. అందుకే వెను వెంటనే చైన్నె కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశానన్నారు. గత ఏడాది సెప్టెంబర్ కూడా అరుణ్, సెల్వనాథరత్నం వరుణ్కుమార్ ఐపీఎస్ల సాయంతో దక్షిణ తమిళనాడుకు చెందిన ఒక ముఠాను తనను చంపడానికి పురమాయించారని ఆరోపించారు. అప్పట్లో తాత్కాలిక డీజీపీ వెంకట్రామన్న్ను కలిసి ఫిర్యాదు చేసి, మీడియాకు వివరించడంతో ఆ ప్లాన్ విరమించుకున్నారన్నారు. ఇప్పుడు రెండోసారి తనను టార్గెట్ చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇళ్లపై మలమూత్రాల దాడి.. పోలీసుల ఆలస్యంగా, దేశంలో ఎవరికీ జరగని అరాచకాలు తనపై జరిగాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి బెడ్రూమ్, కిచెన్ భాగాల్లో మలమూత్రాలు, డ్రైనేజీ వ్యర్థాలను తెచ్చి పోశారని, ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనానికి ఫోన్ చేస్తే, కీల్పాకం నుండి రావడానికి 45 నిమిషాల సమయం పట్టిందన్నారు. దానికి ట్రాఫిక్ జామ్ అన్న నెపం నెట్టారని ఆయన మండిపడ్డారు. అరుణ్ గనుక శాంతిభద్రతల విభాగంలో ఉండి ఉంటే.. తనపై 15 కేసులు పెట్టి గుండా యాక్ట్ కింద జైల్లో పెట్టించేవారని, ఇప్పుడు డీవీఏసీలో ఉండటం వలన ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కిందిస్థాయి సిబ్బంది వసూళ్ల పర్వం సీఎం దృష్టికి ఒక షాకింగ్ విషయాన్ని తీసుకెళ్తున్నానని చెప్తూ.. చైన్నె పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన మిని స్టీరియల్ స్టాఫ్ అయ్యప్పన్, యాంటీ వైస్ స్క్వాడ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రస్తుతం డీవీఏసీలో అరుణ్ వద్ద డెప్యుటేషన్పై పని చేస్తున్నారని, వీరిద్దరూ కలిసి స్టార్ హోటల్ బార్ల నుండి భారీగా మామూళ్ల వసూళ్లకు పాలడుతున్నారని ఆరోపించారు. సీఎం ఈ నియమకాలను పునఃసమీక్షించాలని కోరారు. తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన హార్డ్ డిస్క్ల మాయం గురించి స్పందిస్తూ, పేరుకే శివశంకర్ గతంలో మంత్రిగా ఉంట, తెర వెనుక నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారాలు సాగించారని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎందుకు తేలికగా తీసుకుంటుందో అర్థం కావడం లేదు.ఐఏఎస్ అధికారి రాధాకృష్ణన్ గతంలో విద్యుత్ బోర్డు ఛైర్మన్గా ఉన్నారని, ఇప్పుడూ ఆయనే కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ, ఆయనను మార్చకుండా అవినీతిని ఎలా బయటపెడతారు? మొదటి అనుమానం ఆయనపైనే రావాలి అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే కు అనుకూలమైన, అవినీతికి సహకరించిన అధికారులనే ఈ ప్రభుత్వం కూడా కీలక పోస్టుల్లో ఎందుకు నియమించుకుందో.? అంటూ ఈ ప్రభుత్వంలో పై స్థాయిలో తిమింగలాలే అఽధికంగా ఉన్నాయని ఆరోపించారు. -
యాక్షన్ సన్నివేశాల్లో రైసా విల్సన్ ప్రతిభ
తమిళసినిమా: యాక్షన్ సన్నివేశాల్లో హీరోల కంటే హీరోయిన్లు చేస్తే కిక్కే వేరు. అలాంటి యాక్షన్ సన్నివేశాల్లో నటి రైసా నెల్సన్ అదరగొట్టారట. ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం ఫేమ్ నటి రైసా విల్సన్ చిన్న గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం నోవా. ఇంతకు ముందు ఆది, హన్సిక జంటగా నటించిన పార్టనర్ చిత్రాన్ని నిర్మించిన రాయల్ ఫార్చ్యూనా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం నోవా. ఫేస్ ఒన్ –ది అరైవల్ అనే ఉపశీర్షికతో కూడిన ఈ చిత్రం ద్వారా మిలో అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు.ఈయన ఇంతకు ముందు 20కి పైగా వాణిజ్య ప్రకటనను రూపొందించారు. కథానాయికిగా నటి రైసా విల్సన్ నటించిన ఈ చిత్రంలో కర్ణాటకకు చెందిన అద్విక శెట్టి, బెంగాలి నటి కతిక బిశ్వాస్, మలయాళ నటుడు జో జాన్ సాక్కో,సెండ్రయన్, యూట్యూబ్ ఫేమ్ ఫైనలీ స్వాతిక తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది హారర్ సైనన్స్ ఫిక్షన్ సూపర్ నాచురల్ ఫ్యాటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి రైసా విల్సన్ తెలుపుతూ ఇది ఒక కథలో మరో కథ అనే విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం అని చెప్పారు. ఇందులో నేను ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే. సన్నివేశాల ముఖ్యమైన పాత్రలో నటించినట్లు చెప్పారు. ఇలాంటి కథా చిత్రంలో తాను ఇంతకు ముందు ఎప్పుడూ నటించలేదనీ, అందుకే కథ నచ్చడంతో వెంటనే నటించడానికి సమతించినట్లు చెప్పారు.కేరళాలోని మరైయూర్ అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగిందన్నారు అనుమతి లభించడమే కష్టం అయినా గంధపు చెట్ల నడుము రక్తాన్ని పీల్చే పురుగులు, అధిక మంచు, వర్షం అడవి జంతువులు వంటి భయాన్ని కలిగించే ప్రాంతంలో షూటింగ్ చేశాం అని చెప్పారు. అయితే అంత శ్రమ ఉంటుందని తాను ముందు ఊహించలేదు అన్నారు. ఇంతకు ముందు నటించిన చిత్రాలకు ఇంత కష్టపడలేదన్నారు. ఈ చిత్రంలో ఒల్లు గగుర్పాటు చెందేలాంటి పోరాట సన్నివేశాల్లో నటించినట్లు చెప్పారు. -
క్లుప్తంగా
తిరువళ్లూరు: తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాలను 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు భక్తుల కాపుధారణతో ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా రోజూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం అమ్మవారి ఊరేగింపుతో అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు. తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని అగూరు గ్రామంలో మే 29న ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ పగటి సమయాల్లో మహాభారత ప్రవచనాలు, రాత్రి వేళల్లో వీధి నాటకం ప్రదర్శించారు. వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించారు. ఆదివారం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు పసుపు దుస్తులు ధరించి ఊరేగంపుగా సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండానికి ప్రత్యేక పూజలు చేపట్టి ద్రౌపదీదేవి అగ్నిగుండం ముందు కొలువుదీరగా బాణసంచా వేడుకలు నడుమ భక్తులు గోవింద నామస్మరణతో వెయ్యిమంది కంకణాలు ధరించిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు చెల్లించారు. సాక్షి, చైన్నె: బాలల వినోద రంగంలో సరికొత్త విప్లవానికి మార్గంగా ప్రముఖ కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ సోనీ వైఏవై ఒక వినూత్నమైన ప్రకటన చేసింది. ఈవిషయంగా సోమవారం స్థానికంగా ఆసంస్థ బిజినెస్ హెడ్ అంబేష్ తివారి వివరిస్తూ బుల్లితెరపై తన అల్లరితో, నవ్వులు పూయించే డైలాగులతో దశాబ్దాలుగా పిల్లలను, పెద్దలను అలరిస్తున్న ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్లను అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా ద్వారా ఇకపై అభిమానులు షిన్ చాన్తో నేరుగా మాట్లాడే ఇంటరాక్టివ్ వాయిస్ అనుభవాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్ను ఉపయోగించడం చాలా సులభం. అలెక్సా సపోర్ట్ చేసే డివైజ్ లేదా స్మార్ట్ఫోన్ యాప్లో అడిగితే చాలు, షిన్ చాన్ తన ట్రేడ్మార్క్ వాయిస్తో, ఊహించని ఫన్నీ సమాధానాలతో మాట్లాడేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ అనుభూతి పిల్లలకు సరికొత్త థ్రిల్ను ఇస్తుందన్నారు. తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారనే నెపంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు.. నాగర్కోవిల్కు చెందిన ఓ యువతి, అారల్వాయిమొళి ప్రాంతానికి చెందిన యువకుడు గత 6 నెలలుగా ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమయ్యారు. ఇదే క్రమంలో తొలైయావట్టం ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య ఇన్స్ట్రాగామ్లో వాగ్వాదం మొదలైంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి వారు కరుంగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో సమావేశమయ్యారు. అక్కడ ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో అక్కడ ఆపి ఉంచిన పోలీస్ ఇన్ స్పెక్టర్ వాహనంపై రాళ్లు పడటంతో దాని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వర్గాలకు చెందిన సుమారు ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన యువకుడు నిషాంత్ (24). ఇతను కడలూరులో కాలేజీ చదువుతున్నప్పుడు పుదుచ్చేరి కరువడికుప్పం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆ యువతి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నిషాంత్ ఆ ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో చనువుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే తన సెల్ఫోన్లో వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. అయితే గత కొద్దిరోజులుగా నిషాంత్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీని గురించి ఆమె నిలదీయగా, నిషాంత్ వేరే యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఆమె షాక్కు గురైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా, నిషాంత్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కోపానికి గురైన నిషాంత్, తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆమెను బెదిరించాడు. దీనిపై సదరు ఉపాధ్యాయురాలు లాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిషాంత్ను అరెస్ట్ చేశారు. -
ప్రభుత్వ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన చెందిన 14 ఏళ్ల వయస్సు వున్న మైనర్ బాలికకు అరక్కోణం ప్రాంతానికి చెందిన కయళ్విళియన్ మధ్య గత 2024 వ సంవత్సరం నుంచి ప్రేమ వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో బాలిక గర్బం దాల్చిన క్రమంలో కయల్విళియన్ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం అతడిపై గూండా చట్టాన్ని సైతం ప్రయోగించిన క్రమంలో దాదాపు ఏడాది పాటు పుళల్ జైలు శిక్షను అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై వచ్చిన కయళ్విళియన్ మళ్లీ బాలికతో ప్రేమ వ్యవహరం నడిపినట్టు తెలుస్తోంది. దీంతో బాలిక గర్బం దాల్చిడంతో ఆమె తల్లిదండ్రులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లను ఆశ్రయించారు. పోలీసులు, సాంఘిక సంక్షేమశాఖ అధికారుల అనుమతితో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు బాలికకు అబార్షన్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం బాలికతో పాటు ఆమె తల్లి ఆదివారం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. బాలికతో పాటు ఆమె తల్లి మాత్రమే లోపలికి రావాలని కోరగా, యూట్యూబర్ మధుమిత సైతం తాను ఆపరేషన్ రూమ్కు వస్తానని కోరారు. అందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ శివగామసుందరి నిరాకరించడంతో డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందిని దుర్బుషలాడారు. అసిస్టెంట్ ప్రోఫెసర్ శివగామ సుందరి తిరువళ్లూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మధుమితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని కలెక్టర్ వీఎస్ లీల అన్నారు. వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవం సోమవా రం జరిగింది. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించుకున్నారు. అదే విధంగా ప్రజలు ఇచ్చిన సమస్యలను తీసుకున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించగా మరిన్ని వినతులపై విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలిపారు. అదే విధంగా వివిధ శాఖల ద్వారా ప్రజలకు వివిద సంక్షేమ పథకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను 15 రోజుల్లో పు ఆయా శాఖల అధికారులు నేరుగా విచారణ జరి పి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా గ్రీవెన్సెల్కు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నా రు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో సంక్షేమ పథకాలు అధికంగా వచ్చే అవకాశం ఉందనే ఆశతో అర్జీదారులతో కలెక్టరేట్ నిండి పోయింది. జిల్లా రెవవెన్యూ అధికారి శివసుబ్రమణియన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పళని ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
సాక్షి, చైన్నె: దిండుగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయంలో తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ సోమవారం ఉదయం పర్యటించారు. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన మంత్రి, అక్కడి లోపాలపై అధికారులను నిలదీశారు. రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులు పళణి పర్యటనలో భాగంగా మంత్రి రమేష్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పళని – కొడైకెనాల్ రోడ్డులో రూ.53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఎంట్రన్స్ ఆర్చ్ ప్రారంభించారు. పశ్చిమ రథం వీధిలో రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉద్యానవనంను భక్తులకు అంకితం చేశారు.ఆ తర్వాత ఆలయంలో రూ.100 కోట్ల బడ్జెట్తో జరుగుతున్న మెగా మాస్టర్ ప్లాన్ అభివృద్ది పనుల ప్రగతిని మంత్రి పరిశీలించారు. భక్తులతో ముఖాముఖి.. అధికారులపై ఆగ్రహం కొండపైకి వెళ్లే వించ్ రైలు కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల వద్దకు మంత్రి నేరుగా వెళ్లి మాట్లాడారు. తాగునీరు, మరుగుదొడ్ల వసతులపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉండే హాల్లో అనారోగ్యంతో ఉన్న ఒక కుక్క తిరుగుతుండటం చూసి మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని వెంటనే అక్కడి నుండి తరలించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించిన మంత్రి, వెంటనే అదనపు తాత్కాలిక, శాశ్వత టాయిలెట్లను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి ఉపయోగం లేకుండా పక్కన పెట్టిన కొత్త వించ్ రైలును ఎందుకు అందుబాటులోకి తీసుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. పళని ప్రసిద్ధ పంచామృతం తయారీ కేంద్రాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు, రోజువారీ ఉత్పత్తి, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రొటోకాల్ వివాదం..: మంత్రి పర్యటన ప్రారంభోత్సవ కార్యక్రమాలపై స్థానిక పళని నియోజకవర్గ అన్నా డీఎంకే ఎమ్మెల్యే రవిమనోహరన్కు ఆలయ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం స్థానికంగా వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మద్దతుదారులు మంత్రి రమేష్ను కలిసి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి రమేష్, ఆలయ జాయింట్ కమిషనర్ను తీవ్రంగా మందలించారు. తనకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో, ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ఎమ్మెల్యేకు కూడా అదే గౌరవం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే రవిమనోహరన్ను కలిసి, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ ఆయనను శాంతింపజేశారు. ఆ తర్వాత మంత్రి రోప్ కార్ ద్వారా కొండపైకి వెళ్లి మురుగన్ దర్శించుకున్నారు. -
చైన్నె బేసిన్ బ్రిడ్జ్ వద్ద ఘోర ప్రమాదం
దూసుకెళ్లిన లారీ సాక్షి, చైన్నె: చైన్నె బేసిన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద సోమవారం లారీ అదుపు తప్పి బైక్లను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ వద్ద దూసుకొచ్చిన లారీ చైన్నె ప్రజల అవసరాల కోసం బియ్యం, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులను రైల్వే వ్యాగన్ల ద్వారా వ్యాసార్పాడి గూడ్స్ షెడ్కు తరలిస్తుంటారు. అక్కడి నుండి రేషన్ బియ్యం బస్తాలను లోడ్ చేసుకుని ఓ లారీ ఆయిల్ మిల్ రోడ్ వైపు బయలుదేరింది. ఈ లారీని కోయంబత్తూరు భారతి నగర్కు చెందిన కుమార్ (46) నడిపాడు.లారీ బేసిన్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా బ్రేకులు పడలేదని సమాచారం. దీంతో పూర్తిగా అదుపు తప్పిన లారీ, అక్కడ సిగ్నల్లో వేచి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మద్రాసు హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ మురళీధరన్ (56), ఆవడి ప్రాంతానికి చెందిన గౌతమ్ (60) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే స్కూటర్పై వెళ్తున్న షావుకారు పేట నివాసి రాజేశ్వరి (45),వ్యాసార్పాడికి చెందిన బాలకృష్ణన్ (63) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. పలువురు వాహనదారులు గాయపడ్డారు. నాలుగు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం నెలకొంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించిన వాషర్మెన్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. -
క్లుప్తంగా
విరుగంబాక్కంలో గ్రీవెన్స్ కార్యాలయం – ప్రారంభించిన మంత్రి ఎన్. ఆనంద్ కొరుక్కుపేట: విరుగంబాక్కంలో ఎమ్మెల్యే , శాసనసభ చీఫ్ విప్ ఆర్. శబరినాథన్ నేతృత్వంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రజా ఫిర్యా దుల పరిష్కార కార్యాలయంగా ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక విరుగం బాక్కం పరిధిలోని సాలిగ్రామంలోని అరుణాచలం రోడ్డులో ఉన్న కొత్తగా పునరుద్ధరించిన కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న టి.వి.కె. ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్. ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి ఎన్. ఆనంద్కు డప్పుల మోతతో ఘన స్వాగతం లభించింది. కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్. ఆనంద, అసెంబ్లీ సభ్యుడు, విప్ ఆర్. శబరినాథన్ను అభినందించి, ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. వేలాది మందికి భోజనం వడ్డించారు. ముఖ్యమంత్రి విజయ్ సహాయకుడు, విప్ ఆర్. శబరినాథన్ తండ్రి అయిన రాజేంద్రన్ కూడా హాజరయ్యారు. రేషన్ డీలర్ల సమ్మె సైరన్ కొరుక్కుపేట: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేషన్ దుకాణం కార్మికులు సమ్మెను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ రేషన్ దుకాణం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలేష్ కుమార్ ఈమేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ సంఘర్షణలు, సహకార శాఖ ఉన్నతాధికారుల తీవ్రమైన బెదిరింపుల కారణంగా డీలర్లందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ, మనశ్శాంతిని కోల్పోతున్నార ని పేర్కొన్నారు. డీలర్ల సంక్షేమం కోసం 8 సూత్రాల డిమాండ్లను జూన్ నెలాఖరులోగా డిమాండ్లు నెరవేర్చకపోతే, జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల మనశ్శాంతిని కాపాడేందు కు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రారంభం కొరుక్కుపేట: తమిళనాడులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ సోమ వారం ప్రారంభమైంది. ఆయా కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలల్లో ప్రవేశాల కోసం సుమారు 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారి స్కోర్ల ఆధారంగా వారిని కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. సోమవారం ప్రతి కళాశాలకు వెయ్యికి పైగా విద్యార్థులు వచ్చారు. చైన్నెలో రాజధాని కాలేజ్, వ్యాసర్పాడి అంబేడ్కర్ కాలేజ్, నందనం ఆర్ట్స్ కాలేజ్, ఆర్.కె. నగర్ ఆర్ట్స్ కాలేజ్, క్వీన్ మేరీ ఉమెన్స్ కాలేజ్ సహా పలు ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి విద్యార్థు లు ఉత్సాహంగా వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ల నాయకత్వంలో సహాయ ఆచార్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తొలి రోజు కౌన్సెలింగ్ చేపట్టారు. రిటైల్ రంగంలో విస్తరణలు సాక్షి, చైన్నె : ప్రముఖ స్ప్రింగ్ మ్యాట్రెస్, స్లీప్ సొల్యూషనన్స్ బ్రాండ్ పెప్స్ ఇండస్ట్రీస్, తమిళనాడులో తన రిటైల్ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మణివాక్కంలో ప్రతిష్టాత్మకమైన 135వ గ్రేట్ స్లీప్ స్టోర్ను ప్రారంభించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న చైన్నె పరిసర ప్రాంతాల వినియోగదారులకు ప్రీమియం, సాంకేతిక ఆధారిత నిద్ర ఉత్పత్తులను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఎక్స్పీరియన్షియల్ స్టూడియోను అందుబాటులోకి తెచ్చారు. పెప్స్ ఇండస్ట్రీస్ సేల్స్ జనరల్ మేనేజర్ ఎస్. రాజేష్, స్థానిక ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వండలూర్ – వాలాజాబాద్ మెయిన్ రోడ్డులో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ స్టూడియో డిజైన్ చేయబడిందని , ఇక్కడ పెప్స్ బ్రాండ్కు చెందిన పూర్తి స్థాయి అన్ని ఉత్పత్తులను పరిశీలించ వచ్చు అని . పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జి. శంకర్ రామ్ తెలిపారు. తమిళనాడు అత్యంత కీలకమైన మార్కెట్ అని, ఇందులోనూ చైన్నె నగరం తమ వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. అతిగా మద్యం తాగి యువకుడి మృతి తిరువొత్తియూరు: దిండివనం సమీపంలోని పెరపేరి మారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన సెల్వం కుమారుడు అజిత్ (26) కూలి పనులు చేస్తుంటాడు. అతడికి మద్యపానం అలవాటు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అతను విపరీతంగా మద్యం సేవించి పడిపోయాడు. స్థానికులు దిండివనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడిని పరీక్షించిన వైద్యులు, అజిత్ ఆసుపత్రికి తీసుకువచ్చే దారిలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెల్లిమేడుపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
డిజిటల్ డేటా పెయింటింగ్లతో అద్భుత సమ్మేళనం
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ ’అశ్వితాస్’లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సమకాలీన కళాకారుల ద్వయం తుక్రాల్ – తాగ్రా రూపొందించిన సరికొత్త కళాఖండాల ప్రదర్శనకు ఉంచారు. మైమెసిస్ను ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ డేటా పెయింటింగ్లతో అద్బుత సమ్మేళనంగా ఇక్కడ చిత్రాలను కొలువు దీర్చారు. ఈ అద్భుతమైన ప్రదర్శన జూలై 17వ తేది వరకు జరగనున్నది. మంగళవారం నుండి శనివారం వరకు, సాయంత్రం 4.00 గంటల నుండి రాత్రి 7.00 గంటల వరకు ముందస్తు అనుమతితో సందర్శించవచ్చు అని నిర్వాహకు లు సోమవారం ప్రకటించారు. ఆర్బోరెటమ్ నుండి మైమెసిస్ వరకు తుక్రాల్ – తాగ్రా గతంలో నిర్వహించిన ఆర్బోరెటమ్ సిరీస్ విజయవంతమైన నేపథ్యంలో, దానికి కొనసాగింపుగా ఈ ’మైమెసిస్’ రూపుదిద్దుకుంది. వృక్షాలు, మానవ స్మృతులు, సజీవ ఆర్కై వ్ల చుట్టూ సాగిన ప్రయాణం తాజాగా సేంద్రీయ పర్యావరణ వ్యవస్థల నుండి డిజిటల్ క్షేత్రాలలోకి అడుగుపెట్టింది. డిజిటల్ ప్రపంచంలో పిక్సెల్లు, బా ర్లు, విచ్ఛిన్నమైన విజువల్ యూనిట్లుగా ఎలా రూ పాంతరం చెందుతుందో ఈ ఎగ్జిబిషన్ అన్వేషిస్తుండటం విశేషం. ఊహాజనిత డేటా రూపాలతో కూడిన వందలాది పెయింటెడ్ కాన్వాస్ల ద్వారా.. వేగవంతమైన డిజిటల్ వ్యవస్థలను చిత్రలేఖనంలోని స్పర్శాత్మకమైన భౌతికత్వంతో ఎలా అనుసంధానించవచ్చో ఈ కళాఖండాలు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. -
పెళ్లిపేరుతో బాలికపై అఘాయిత్యం
● యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని ఆశచూపి, అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన శక్తివేల్ (19) అనే యువకుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. బాలిక తల్లి తన భర్తకు దూరంగా ఉంటూ, తన పిల్లలతో కలిసి పడప్పై ప్రాంతంలో నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన శక్తివేల్ అనే యువకుడు ఈ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి, గతంలో ఒకసారి అపహరించాడు. అతని వద్ద నుంచి బాలికను విడిపించుకొని హెచ్చరించి అతన్ని వదిలేశారు. మళ్లీ ఇప్పుడు ఆ బాలికను తీసుకుని పరారవ్వడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో శక్తివేల్ తన అన్న ఇంట్లో బాలికతో కలిసి దాక్కున్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించి, నిందితుడు శక్తివేల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. తిరువొత్తియూరు: చైన్నె తురైపాక్కం రేడియల్ రోడ్డులో బైక్లు ఢీకొని యువకుడు మృతి చెందారు మరో ఇద్దరు స్నేహితులకు తీవ్ర గాయాలు అయ్యాయి చైన్నె వేళచ్చేరి సమీపంలోని పెరియ కోవిలంబాక్కంకు చెందిన జగన్నాథన్ (23) పెయింటర్.ఇతను తన స్నేహితులు రమేష్ (46), అన్బళగనన్తో కలిసి మద్యం సేవించి, బైక్పై వెళ్తుండగా తురైపాక్కం 200 అడుగుల రేడియల్ రోడ్డులో ఓ ప్రైవేట్ కార్ సర్వీస్ సెంటర్ వద్ద వేగంగా వచ్చిన మరో బైక్ వీరిని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వెంటనే తాంబరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ జగన్నాథన్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రమేష్, అన్బళగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్లికరణై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలూరు: జాతీయ రహదారిలో బ్యాటరీలు తీసుకెళ్తున్న లారీ ఉన్న ఫలంగా దగ్ధం కావడంతో సుమారు గంట పాటూ ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు.. చైన్నె నుంచి పూనేలోని ఓ ప్రైవేటు ఐటీ కంపెనీకి బ్యాటరీలను తీసుకెళ్తు లారీ వేలూరు జిల్లా పల్లిగొండ వద్ద జాతీయ రహదారిపై మంటల్లో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన క్రిష్ణగిరికి చెందిన లారీ డ్రైవర్ తమిళరసన్ వెంటనే లారీని రోడ్డు పక్కన నిలిపి వేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే లారీలోని బ్యాటరీలు పెద్ద శబ్దంతో పేలుతూ మంటలు చెలరగేడంతో చేసేది లేక అక్కడ నుంచి పరుగులు తీశారు. వెంటనే విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అయితే అప్పటికే లారీలోని బ్యాటరీలు పూర్తిగా దగ్ధమైంది. -
ధాన్యం కొనుగోలు చేయాలని వినతి
తిరువళ్లూరు: రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరుతూ దాదాపు 20 మంది రైతులు కలెక్టర్ కవితకు సోమవారం ఉదయం వినతి పత్రం సమర్పించా రు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్లోని ఎరయూరు, మన్నవేడు, రాజపాళ్యం, సోమదేవన్పట్టు, ఒదపై, కొరక్కతండలం, మొయ్యూరు, రాజపాళ్యంతో పాటు పది గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు ఉన్నారు. దాదాపు 500 హెక్టారులో వరి సాగులో ఉంది. ఇక్కడి రైతులు సాగు చేసిన వరి పంటలను మన్నవేడులోని ప్రభుత్వం ఏర్పాటు చేసి వరి కొనుగోలు కేంఽద్రం ద్వారా కొనుగోలు చేయాల్సి వుంది. అయితే కొంత మంది రైతుల నుంచి మాత్రమే వరిని కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 5 వేల వరి బస్తా లు వర్షంలో తడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, అఽధికారులను కోరితే ప్రభుత్వం నిర్ధేశించి లక్ష్యం మేరకు కొనుగోలు చేశామని, ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప మళ్లీ కొనుగోలు చేయలేమని సమాధానమిస్తునన్నట్టు కలెక్టర్ కవితను కలిసి సోమవారం రైతులు వినతి పత్రం సమర్పించారు. దాదాపు నెల రోజుల నుంచి వేచివున్నా ఇంత వరకు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని వాపోయారు. న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ వారికి హమీ ఇచ్చారు. -
తమిళనాడులో డీఎంకే కూటమి లేదు
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంది. రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి అధ్యాయం ముగిసిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయనో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని అటు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ఇటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అనవసరంగా విమర్శించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో విజయ్ నేతృత్వంలో సంకీర్ణ పాలన సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి సీపీఎం బయటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కమ్యూనిస్ట్లు, మిత్ర పక్షాల నేతలంతా డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ను కలిసి చర్చించారని, స్టాలిన్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నటు సమాచారాలు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకేలు భాగస్వామ్యమైనప్పటికీ, సీపీఎం, సీపీఐలు మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఆయా పార్టీలు డీఎంకే కూటమిని పూర్తిగా వీడినట్లు పేర్కొంటూ వస్తున్నారు. కొందరు నాయకులు తాము ఇంకా పాత కూటమిలోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డీఎంకే కూటమి ఉనికి కోల్పోయిందని షణ్ముగం తాజాగా స్పష్టం చేయడం గమనార్హం. ఈ కూటమి అన్నది ప్రస్తుతం లేదని, ఇది ముగిసిన అధ్యయం అని ఆయన వ్యాఖ్యలు చేయడంచర్చకు దారితీశాయి. -
ప్రముఖ యూట్యూబర్ మారీదాస్పై కన్నెర్ర
– మదురైలో అరెస్ట్ చేసిన చైన్నె పోలీసులు సాక్షి, చైన్నె: ప్రముఖ యూట్యూబర్ మారీదాస్ను చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం ఉదయం మదురైలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ స్థానికంగా , సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర వ్యతిరేకత, చర్చకు దారి తీసింది. ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో.. మదురైలోని తమిళనాడు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు క్వార్టర్స్ సమీపంలో నివసిస్తున్న మారీదాస్, యూట్యూబ్ వేదికగా రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం, అలాగే రాష్ట్ర మంత్రులపై ఆయన నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ పలు వీడియోలను విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై చైన్నె నగర సైబర్ క్రైమ్ పోలీసులు మారీదాస్పై కేసు నమోదు చేశారు. మదురైలో అరెస్ట్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారీదాస్ను అరెస్ట్ చేసేందుకు చైన్నె సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం ఉదయం మదురై చేరుకుంది. స్థానిక మదురై కె.పుదూర్ పోలీసుల సహాయంతో మారీదాస్ నివాస గృహానికి చేరుకున్న చైన్నె పోలీసులు, అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి మారీదాస్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు మారీదాస్ను తదుపరి విచారణ నిమిత్తం మదురై నుండి చైన్నెకి తీసుకొస్తున్నారు.అ యితే, ఈ అరెస్టును సర్వత్రా తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో యూ ట్యూబర్లకు, డిజిటల్ మీడియాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సీఎం విజయ్ సారూ..ఇదేనా మార్పు అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వాళ్లు పెరిగారు. వాక్ స్వాతంత్య్ర గురించి గతంలో వీరావేశంగా వ్యాఖ్యలు చేసిన తమరే ఓ యూ ట్యూబర్ గళాన్ని అరెస్టుతో నొక్కేయడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ అరెస్టును నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలి
కొరుక్కుపేట: గాన గాంధర్వుడు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల నుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ ట్రస్ట్ –చైన్నె, డాక్టర్ ఎస్.పి బి కల్చరల్ కాన్సెర్ట్ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కేఎం కొండయ్య తెలిపారు. ఈ మేరకు డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ పి బాల సుబ్రమణ్యం 80వ జయంతిని ఆదివారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె అరుంబాక్కంలోని పిల్లయార్ కోయిల్ వీదిలో ఉన్న సౌండ్ ప్రో డబ్బింగ్ స్టూడియో వేదికై ంది. ముఖ్యఅతిధిగా ప్రముఖ గాయకులు, ఎస్పీబీ సన్నిహితులు తులసీధరన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీబి తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యాంతం అయ్యారు. బాలుకు ఇష్టమైన పాటలను ఆలపించి తులసీ ధరన్ ఆకట్టుకున్నారు. ఎస్పీబీ జయంతి సందర్భంగా గాయనీ గాయకులకు, ట్రస్ట్ కు సహకరిస్తున్న దాతలకు ఎస్పీబీ అవార్డులను అందజేశారు. అలాగే ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో 500లకు 493 మార్కులు సాధించిన కమలేష్ అనే విద్యార్థిని ఘనంగా సత్కరించి పతకాన్ని, నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా కెఎం కొండయ్య మాట్లాడుతూ చైన్నె బీచ్ నుంచి తామరైపాక్కంలో ఉన్న ఎస్పీబీ సమాధి వద్దకు ప్రత్యేక బస్సును వేయాలని కోరారు. ఇందులో ట్రస్ట్ ట్రెజరర్ కె.బాలాజీ రావు, డాక్టర్ ఎస్పీబీ కల్చరల్ కాన్సెర్ట్ ప్యాట్రన్ కె సౌందరరాజన్తోపాటూ ఎస్ఎన్ దురై, రమేష్, కృష్ణ వేణి, విజయ బాలు,, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రీమియం లూబ్రికేషన్లో కొత్త ప్రమాణాలు
హైపర్ సిరీస్ విడుదల సేలం: ఇండియన్ ఆయిల్ సోమవారం తన అత్యంత అధునాతన ప్రీమియం లూబ్రికెంట్ ఉత్పత్తి శ్రేణి అయిన సెర్వో హైపర్ సిరీస్ను ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పత్తి ఆధునిక ఇంజన్లు, అభివృద్ధి చెందుతున్న అధిక పని తీరు గల పారిశ్రామిక పరికరాల అవసరాలను తీర్చడానికి రూపొందించారు. అధునాతన సింథటిక్ ఆధారిత నూనెలు, నెక్ట్స్ జనరేషన్ యాడిటివ్ టెక్నాలజీలను ఉపయోగించి అభివృద్ధి చేయబడిన సెర్వో హైపర్ సిరీస్, కఠినమైన ఆపరేటింగ్ వాతావరణాలలో కూడా ఉన్నతమైన ఇంజిన్ పనితీరును, మెరుగైన ఇంధన పొదుపును మరియు సుదీర్ఘ సేవా జీవితాన్ని అందిస్తుంది. దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమిత్ర పి. శ్రీవాస్తవ ఇలా అన్నారు: పరిశ్రమ భవిష్యత్తును మూడు స్తంభాలు తీర్చిదిద్దుతాయి. సాంకేతికత, పనితీరు, విశ్వాసం. సెర్వో హైపర్ సిరీస్ ఈ మూడింటినీ కలిగి ఉందని శ్రీవాస్తవ అన్నారు. -
సత్య శోధనపై చర్చించే ‘ప్రామిస్’
తమిళసినిమా: నా జీవితమే ఒక సత్య శోధన. సత్యాన్ని పరిశోధించబడిన విధానాన్ని తెలుసుకోవాలంటే నా సత్య శోధన అనే జీవిత చరిత్రను చదవండి అని మహాత్మా గాంధీ చెప్పారు. ఆయన రాసిన సత్య శోధన జీవిత చరిత్ర చదివిన తరువాత ఆయన జీవితంలో సత్యం, నిజం,సాయం వంటివి విషయాల గురించి తెలుసుకోవచ్చు. గాంధీజీకి మార్గదర్శిగా సత్యహరిచంద్రుడు సత్యం కోసం చేసిన పోరాటం కథ అని చెప్పవచ్చు. ఇలా సత్యం అనేది మన పారంపర్యం, సంస్కృతి సాంప్రదాయాల నుంచి వస్తోంది.అలాంటి సత్యం జీవితంలో ఆడే ఆటను తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ప్రామిస్ అని.. దర్శక, కథానాయకుడు అరుణ్ కుమార్ శేకర్ చెప్పారు. నటి నదియా సోము నాయకుడిగా నటించిన ఇందులో సుజన్, అమ్రీష్, ప్రతాప్, గోకుల్, సుందరవేల్,రాజ్ కుమార్,కలైవాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్.నాగరాజ్ సమర్పణలో సంఘమిత్రన్ ప్రొడక్షన్స్,అమ్మన్ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో సత్య శోధన పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలా ఈ చిత్రంలో కథానాయకుడు ఎదుర్కొనే సత్య శోధన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన చిత్రం ప్రామిస్. ఇటీవల చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ దర్శకుడు చేరన్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా చిత్ర ట్రైలర్ ఏబీ ఇంటర్నేషనల్ ఛానల్ లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రామిస్ చిత్రాన్ని ఈ నెల 26వ తేదీన యాక్షన్ రీ యాక్షన్ సంస్థ అధినేత జెనీశ్ విడుదల చేస్తున్నారు అని.. దర్శకుడు చెప్పారు. కాగా ఈ చిత్రానికి వినోద్ కుమార్ ఛాయాగ్రహణం, సర్వాణి దీపన్ సంగీతాన్ని అందించారు. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో కొత్త చిత్రంతమిళసినిమా: దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా ముక్కుసూటి మనిషి. మనసులో అనిపించింది చెప్పే భామ. పాత్రల్లో జీవించే నటీమణి. కాస్త బొద్దుగా ఉన్నా, దాన్నే అలంకారంగా భావించే బ్యూటీ. కథా పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరించే నటి. విమర్శలను అస్సలు పట్టించుకోని సంచలన నటి. సెలెక్టీవ్ చేసే నిత్యామీనన్ ఇటీవల తమిళంలో నటించిన తలైవన్ తలైవి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత మరో చిత్రం కమిట్ కానీ ఈమెను తాజాగా ఒక కథ తెగ నచ్చేసిందట. దీంతో ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసినట్లు తాజా సమాచారం. అవును ఇంతకు ముందు యామిరుక్క భయమే, కాట్టేరి, కవల్ వేండామ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన డీకే తాజాగా తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి నిత్యామీనన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈమెకు దర్శకుడు కథ చెప్పగానే తెగ నచ్చేసిందనీ దీంతో ఆమె వెంటనే నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి చిన్న మొత్తాన్నే అడ్వాన్స్గా తీసుకున్నారని, మిగిలింది చిత్రానికి వచ్చే లాభాల్లో షేర్ను తీసుకోవడానికి నిత్యామీనన్ అంగీకరించినట్లు సమాచారం. చాలాకాలంగా నిర్మాతలు కోరుకుంటోంది ఇదే కావడంతో.. ఈ విషయంలో పలువురికి నిత్య మీనన్ మార్గదర్శిగా నిలుస్తారని చెప్పవచ్చు. కాగా ఈమె నటించనున్న తాజా చిత్రానికి సంబంధించి న పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా, వెల్లడించే అయ్యే అవకాశం ఉంది. -
30 ఏళ్ల పోరాటానికి ఫలితం
తమిళసినిమా: కొంచెం ఆలస్యం అవుతుందేమో గాని న్యాయం ఎప్పుడూ ఓడిపోలేదు. గెలిచే తీరుతుంది. ఇదే నటి సుకన్య విషయంలోనూ జరిగింది. పుదు నెల్లు పుదు నాత్తు చిత్రం ద్వారా 1991లో కథానాయకిగా పరిచయం అయిన నటి సుకన్య. ఆ తరువాత చిన్నకౌండర్, ఇండియన్, వాల్టర్ వెట్రివేల్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ కథానాయికిగా రాణించిన ఈమె 2002లో శ్రీధర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే కొద్ది కాలానికే మనస్పర్ధలు కారణంగా భర్త నుంచి విడిపోయి వివాహ రద్దు పొందారు. కాగా ఈమె గంధపు చెక్కల స్మగ్లర్ల్ వీరప్పన్ ఒక భేటీలో చెప్పినట్లుగా జరిగిన వ్యవహారంపై ఓ ప్రైవేటు ఛానల్ చర్చా వేదికలో తన గురించి జరిగిన అసత్య ప్రచారంపై చైన్నె హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ 30 ఏళ్ల తర్వాత సుకన్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కొడుకుకు నటి సుకన్యకు అక్రమ సంబంధం ఉందని వీరప్పన్ ఒక భేటీలో పేర్కొంటున్నారు. అయితే అందులో నిజం లేదని, అది పూర్తిగా అసత్య ఆరోపణ అనీ నటి సుకన్య 1996లో చైన్నె హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆ ప్రైవేట్ ఛానల్ లో ప్రచారం చేసిన అంశాలు తన పేరుకు కళంకం వచ్చేలా ఉన్నాయ ని పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె పిటీషన్ పై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం 2015లో సుకన్యకు అనుకూలంగా తీర్పు ఇస్తూ ఆమెకు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సంబంధిత ప్రైవేట్ ఛానల్ నిర్వాహకులు చైన్నె హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సోమవారం విచారించిన చైన్నె హైకోర్టు ప్రైవేట్ ఛానల్ పిటిషన్ను కొట్టి వేసి ఇంతకు ముందు కింది కోర్టు ఇచ్చిన తీర్పును ధృఢపరిచింది. క్రింది తీర్పు ప్రకారం నటి సుకన్య కు నష్ట పరిహారంగా రూ. 10 లక్షలు వెంటనే చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
వక్ఫ్ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు
– మంత్రి షాజహాన్ సాక్షి, చైన్నె : తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని, భవిష్యత్తులో కూడా అమలు చేయబోమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షాజహాన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం చట్టపరమైన నిపుణులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తమిళనాడు నుంచి సౌదీ అరేబియాలో మక్కా ,మదీనా నగరాలకు బక్రీద్ పండుగ సందర్భఃగా హజ్ యాత్రకు వెళ్లిన బృందాలు తిరుగు పయనం అయ్యాయి. ఈ యాత్రను ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన యాత్రికులకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వం తరపున సోమవారం ఉదయం ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి షాజహాన్ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం మంత్రి షాజహాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ కొత్త వక్ఫ్ చట్టం అమలు కాలేదని గుర్తుచేశారు. తమిళనాడు ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.‘తమిళనాడులో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమని, ఈ సవరణ చట్టంలో ఉన్న పలు వివాదాస్పద నిబంధనలను (షరతులను) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ‘ఉమిద్’ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల వివరాలను నమోదు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అధికారులు తమ శాయశక్తులా వివరాలను అప్లోడ్ చేశారని, ఇంకా నమోదుకాని ఆస్తుల వివరాలను కూడా త్వరలోనే క్రమబద్ధంగా నమోదు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ 7.50 కోట్ల మోసం
తిరువొత్తియూరు: తిరుపూర్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో పదవీ విరమణ చేసిన మహిళా ప్రొఫెసర్ను నమ్మించి రూ.7.50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. తిరుపూర్ ఊత్తుక్కుళి రోడ్డుకు చెందిన 65 ఏళ్ల మహిళ, ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమె సెల్ ఫోన్ నంబర్కు ఇటీవల ఓ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తాను ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ నంబర్ను ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు, అందుకే ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు భయపెట్టారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే, తాము సూచించిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలని చెప్పారు. దీనిని నమ్మిన ఆ మహిళ వారి ఖాతాకు రూ. 7.50 కోట్లు బదిలీ చేసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం తిరువొత్తియూరు: తిరుచ్చిలోని పాలక్కరై ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఏడుగురు బాలురు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు విడిపోవడంతో బాలిక బంధువుల ఇంట్లో ఉంటోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన ఏడుగురు మైనర్లను అబ్జర్వేషన్ హోమ్కు, మిగిలిన ఇద్దరు మోహన్ రాజ్ (19), కిషోర్ (20)ను జైలుకు తరలించారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు: బస్టాండుతోపాటు జనసంచారం రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం రాత్రి ఎస్పీ వివేకానందశుక్లా, డీఎస్పీ కార్తికేయన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ వివేకానందశుక్లా ఆకస్మిక తనిఖీల పేరిట రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగానే ఇప్పటికే పెద్దకుప్పంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. బస్టాండులో ప్రయాణికుల వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఎమైనా ఇబ్బందులు వస్తున్నాయా, మద్యం మత్తులో యువకుల వేధింపులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది వస్తే 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేసి తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు సైతం వేగంగా స్పందిస్తారని హామీ ఇచ్చారు. డీఎస్పీ కార్తికేయన్, సీఐలు విజయకుమార్, దామోదరన్ పాల్గొన్నారు. -
3 నెలలైనా నిలబడతారా?
సాక్షి,చైన్నె: టీవీకే ప్రభుత్వ పాలనపై స్టాలిన్ మరో సారి మండిపడ్డారు. వారిది తుమ్మితే ఊడిపోయే మక్కులాంటి ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఇక డీఎంకేను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాధ్యత, కష్టం, పని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో పార్టీ కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్న పనయూర్ బాబును, ఆయన అనుచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల ముందే మాట్లాడాల్సి వచ్చింది: రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పాలన సాగుతోందో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తాను ఒక మాట చెప్పానని గుర్తు చేశారు. తొలి ఆరు నెలల వరకు తాను ఈ ప్రభుత్వం గురించి ఏమీ మాట్లాడనని పేర్కొన్నట్టు గుర్తు చేస్తూ , అయితే, ఆరు నెలలు తిరగక ముందే దీనిపై మాట్లాడాల్సిన దుస్థితి, భయాందోళనలు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. మూడు నెలల ముచ్చటేనా?: ప్రస్తుత ప్రభుత్వంపై నలుమూలల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలలు కాదు... కనీసం ఒక 3 నెలలైనా ఈ ప్రభుత్వం తట్టుకుని నిలబడుతుందా? అనే అనుమానంతోనే ప్రస్తుతం ఇక్కడ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇటువంటి అస్థిరమైన పరిస్థితుల్లోనే, వీరంతా డీఎంకే సిద్ధాంతాలను నమ్మి పార్టీ బలోపేతం కోసం తరలివచ్చారని, పార్టీ చేపట్టబోయే ప్రతి ప్రజాపోరాటంలోనూ నూతన కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. వీసీకేకు షాక్ ఇది వరకు డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే నేత తిరుమావలవన్ నమ్మిన బంటులలో ఒకరైన పనయూరు బాబు తాజాగా డీఎంకేలో చేరారు. పనయూర్ బాబు గతంలో చేయ్యూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. డీఎంకేలో చేరడానికి ముందు ఆయన వీసీకే పార్టీలో రాష్ట్ర మీడియా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు ఆయన తన అనుచరులతో కలిసి డీఎంకే గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నా అరివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే కోశాధికారి టి.ఆర్. బాలు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధి, శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, పార్టీ ఉన్నత స్థాయి కార్యాచరణ కమిటీ సభ్యుడు ఎ.వి. వేలు, కాంచీపురం సౌత్ జిల్లా కార్యదర్శి సుందర్, చైన్నె సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. సుబ్రమణియన్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రమేష్ తదితరులు ఉన్నారు. తమిళనాడులో ప్రస్తుత పాలన తీరుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా తట్టుకుని నిలబడుతుందా..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. వీసీకేలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పనయూర్ బాబు ఆదివారం డీఎంకేలో చేరారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో పనయూరు బాబు తన అనుచరులు వెయ్యి మందితో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రస్తుత రాజకీయ, ప్రభుత్వ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో కొత్త విధానం
సాక్షి, చైన్నె: తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ ప్రజల సౌకర్యార్థం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఆన్లైన్ ద్వారా పత్రాల రిజిస్ట్రేషన్ చేసుకునే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని త్వరలోనే విధిగా అమలు చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ సీఎం విజయ్ ఆదేశాలుతో ప్రకటించింది. ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి, అవినీతికి తావులేకుండా చేయడానికి ఈ డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలు ఏడాదిలో 365 రోజులు, 24 గంటల పాటు ఎక్కడి నుండైనా తమ పత్రాలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పత్రాల పరిశీలన పూర్తి చేసి సబ్రిజిస్ట్రార్ ఆమోదం తెలపగానే, ఆయన డిజిటల్ సంతకంతో కూడిన అసలు పత్రం నేరుగా లబ్ధిదారుడి అకౌంట్ లాగిన్లోకి లేదా వారి మొబైల్ వాట్సాప్ నంబర్కు పంపుతారు. దాన్ని వారు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ అయ్యే పత్రాలు తొలిదశలో పత్రాల రిజిస్ట్రేషన్కు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు విక్రయ పత్రాలు,బ్యాంకుల నుండి పొందే రుణాల తాలూకు మార్టిగేజ్, రశీదు పత్రాలు. సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రజలు, నిర్మాణ సంస్థలు, డాక్యుమెంట్ రైటర్లు, బ్యాంకులు, న్యాయవాదులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో సొంతంగా లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలను అరికట్టడానికి భద్రతా ప్రమాణాలను కఠినతరం చేశారు. పత్రాలు రాసిచ్చేవారు, రాసి తీసుకునేవారు, సాక్షులు వీరందరి అధికారిక గుర్తింపు కార్డును వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. అలాగే ఐడెంటిఫికేషన్ అథారిటీ ద్వారా వేలిముద్రలు లేదా కంటిపాప (ఐరీష్) గుర్తింపు ప్రక్రియతో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన సాంకేతిక పరికరాలు ఈ సేవలను వినియోగించుకోవడానికి వినియోగదారుల వద్ద మంచి ఇంటర్నెట్ కనెక్షనన్తో పాటు, ప్రభుత్వం అఽఽఽధీకృతం చేసిన ఎల్1 వేలిముద్రల స్కానర్ లేదా ఐరిష్ స్కానర్, వెబ్క్యామ్ ఉండాలి. సందేహాల నివృత్తికి హెల్ప్లైన్ నంబర్లు ఈ సరికొత్త ఆన్లైన్ విధానంలో ప్రజలకు లేదా అధికారులకు సాంకేతిక సమస్యలు తలెత్తితే సంప్రదించాల్సిన నంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. హార్డ్వేర్ సమస్యల కోసం–మహ్మద్ యూనస్, అరుణ్ కుమార్ – 7397574067, 9940446694, సాఫ్ట్వేర్ సమస్యల కోసం– శ్రీనివాస్ గణేష్, ఢిల్లీబాబు – 63697 98973, 85258 05957 నెంబర్లను ప్రకటించారు. -
అన్నామలైతో బీజేపీకి నష్టం లేదు
సాక్షి,చైన్నె: తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకురా లు తమిళసై సౌందరరాజన్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్య లు చేశారు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బీజేపీ బలహీనపడలేదని, ఆయన వెళ్లాకే పార్టీ మరింత బలంగా మారిందని ఆమె స్పష్టం చేశారు. మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై, విద్యుత్ శాఖ మంత్రిపై , అన్నామలై కొత్తగా పెట్టిన రాజకీయ ప్రస్థానంపై ఆమె ఘాటుగా విమర్శలు గుప్పించారు. హిందూ ప్రజల సెంటిమెంట్లను, దైవ భక్తిని గౌరవించనందుకే గత ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసి, అధికారాన్ని కోల్పోయిందన్నారు. తిరుప్పరంకుండ్రం ఆలయ దీపస్తంభంపై దీపం వెలిగించే విషయంలో కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, శాంతిభద్రతల పేరిట భక్తుల భావాలను గాయపరచడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంలో గత డీఎంకే ప్రభుత్వం చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తునదని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో 26 హార్డ్ డిస్క్లు మాయమవడం వెనుక ఉన్న అవినీతిని దాచడానికే మంత్రి నిర్మల్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నామలై వెళ్తే పోయేదేమీ లేదు అన్నామలై కొత్తగా ప్రారంభించిన ఉద్యమం, పార్టీలో లక్షలాది మంది చేరుతున్నారనే ప్రచారంపై తమిళసై తీవ్రంగా స్పందించారు. బీజేపీ పార్టీ కోసం రక్తం, చె మట చిందించిన అసలైన కార్యకర్తలు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారన్నారు.. కేవలం స్వార్థపరులు మాత్రమే పార్టీని వీడి వెళ్లారన్నారు. ప్రజా సేవ చేయాలనుకునే వారు ఎక్కడికీ పోలేదు. అన్నామలై రాకతో పార్టీకి అ దనంగా వచ్చిన బలమేమీ లేదన్నారు. ఆయన వెళ్లినంత మాత్రాన పార్టీ కోల్పోయిన బలమేమీ లేదన్నారు. బీజేపీలో ఉన్న ఒక తామర రేకును కూడా ఎవరూ కదల్చలేరని, 2031లో తమిళనాడులో బీజేపీ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మోదీ, అమిత్ షా మద్దతు లేదు బీజేపీకి ఉన్నది ఒకటే ముఖం అని, వేరే ముసుగులు వేసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అన్నామలై వెనుక ప్రధాని మోదీ, అమిత్ షాల మద్దతు ఏమాత్రం లేదన్నారు. ఆయన పార్టీ ఎందుకు వీడారో ఆయననే అడగాలి అని ఆమె పేర్కొన్నా రు. తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నెల రోజుల పాలనను తడబడుతూ పూర్తి చేసిందని తమిళసై విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిందన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతు న్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుందా లేదా అనేది వారి చేతుల్లో లేదన్నారు. ఈ ప్రభుత్వ తలరాత ప్రస్తుతం కమ్యూనిస్టులు, వీసీకే చేతుల్లో ఉందన్నారు. వెనుక నుండి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ వీరికి తాత్కాలికంగా మద్దతు ఇస్తున్నారన్నారు. ఈ సపోర్ట్ తీసేస్తే ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తమిళసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. -
ఉత్తర చైన్నెలో జీ స్క్వేర్ భారీ ప్రాజెక్ట్
సాక్షి, చైన్నె: జీ స్క్వేర్ గ్రూప్ ఉత్తర చైన్నె పరిధిలోని కరణోడై సరికొత్త ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్ల ప్రాజెక్ట్ జీ స్క్వేర్ క్షేత్ర పేరిట ప్రారంభించింది. చైన్నె పెరిఫెరల్ రింగ్ రోడ్ అనుకుని, ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ను లేఅవుట్ చేశారు.ఈ కారిడార్ పరిధిలో ప్రస్తుతం మార్కెట్ ధర చదరపు అడుగుకు రూ.4,000 నుండి రూ. 6,000 వరకు పలుకుతుండగా, జీ స్క్వేర్ సంస్థ మొదటి 50 బుకింగ్స్కు మాత్రమే వర్తించేలా చదరపు అడుగుకు కేవలంరూ1,890 ప్రత్యేక ప్రారంభ ధరను ప్రకటించింది. ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 50 శాతం తక్కువ కావడం గమనార్హం.అంతేకాకుండా, సంస్థ ఒక వినూత్నమైన సవాల్ను విసిరింది. తమ ప్రాజెక్ట్ నుండి 3 కిలోమీటర్ల పరిధిలో దీనికంటే తక్కువ ధర ఎక్కడైనా చూపిస్తే, కేవలం రూ. 1కే ప్లాట్ ఇస్తాం అని జీ స్క్వేర్ ప్రకటించింది. ఇది వినియోగదారులకు అత్యంత లాభదాయకమైన పెట్టుబడి అవకాశమని సంస్థ తెలిపింది. పారిశ్రామిక హబ్లకు సమీపంలో.. శ్రీసిటీ, థర్వాయ్ కండిగై సిప్కాట్, గుమ్మిడిపూండి సిప్కాట్, మనల్లూరు, ఆరంబాక్కం సిప్కాట్, మిచెలిన్ టైర్స్ ప్లాంట్, రాబోయే మహీంద్రా వరల్డ్ సిటీ , శ్రీపెరంబుదూర్ పారిశ్రామిక ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరగా ఉంది. కాట్టుపల్లి, అదానీ, ఎన్నోర్ పోర్టుల ద్వారా ఇక్కడ పారిశ్రామిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తుండటం గమనార్హం. ఈ లాంచ్ సందర్భంగా జీ స్క్వేర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ బాల రామాజయం మాట్లాడుతూ మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక వృద్ధి కారణంగా ఉత్తర చైన్నె రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. ప్రస్తుతం కరణోడై ప్రాంతం ఈ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. -
అలరించిన ‘దుర్యోధన వధ’
గుడిపాల: మండలంలో పిళ్లారికుప్పంలోని ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో 18 రోజులుగా నిర్వహిస్తున్న మహాభారత ఉత్సవాలు ఆదివారం దుర్యోధన వధ ఘట్టంతో ముగిశాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. తదుపరి భాగవతారిణి గీతావాణి హరికథాగానం చేశారు. అనంతరం మధ్యాహ్నం దుర్యోధన వద ఘట్టాన్ని కళాకారులు రక్తి కట్టించారు. దుర్యోధనుడు గంగ మడుగులో దాక్కుని ఉండగా.. భీమసేనుడు బయటకి లాక్కొచ్చి చేసే యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్యోధనుడి ప్రతిమ వద్ద సాగిన భీమ, దుర్యోధన వేషధారులు వధ ఘట్ట ప్రదర్శనతో ఆద్యంతమూ ప్రేక్షకులను రోమాంఛితుల్ని చేశారు. అనంతరం ధర్మరాజుల పట్టాభిషేకం, సాయంత్రం అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం యడంవారిపల్లెలో జరుగుతున్న మహాభారత ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. 18 రోజులు సాగిన మహాభారత యుద్ధంలో కీలక ఘట్టమైన దుర్యోధన వధను ఆదివారం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. భీముడు–దుర్యోధనుడి మధ్య జరిగిన యుద్ధం, దుర్యోధన వధ ఘట్టాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
డీఎంకేపై మాణిక్యం ఠాకూర్ ఫైర్
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత డీఎంకే ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు. డీఎంకే నాయకులు చేసిన భారీ అవినీతి, వసూలు చేసిన కమిషన్లను తాము పక్కనే ఉండి చూసినప్పటికీ, కూటమి ధర్మం కోసమే ఇన్నాళ్లూ బయటపెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. శివకాశిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాణిక్యం ఠాగూర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, డీఎంకే వైఖరి, సీమాన్ విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. డీఎంకే 36శాతం కమీషన్ల పాలన.. తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో హైవేల శాఖ, పట్టణాభివృద్ధి శాఖల్లో ఏకంగా 36 శాతం కమిషన్లు నడిచాయన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కో ఎకరానికి 7 లక్షల రూపాయల చొప్పున డీఎంకే విరాళాల పేరిట వసూలు చేసిందన్నారు. ఇదంతా తాము పక్కనే ఉండి చూశామన్నారు. అయితే, కూటమి ధర్మానికి కట్టుబడి నోరు విప్పలేదన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలో ఆ అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందన్నారు. ఉదయనిధి స్టాలిన్ హయాంలో పూర్తిగా పాడైపోయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కదిద్దడానికి ప్రస్తుత ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. సీమాన్, ఉదయనిధిపై ధ్వజం 2026 ఎన్నికల ఓటమి చాలామందికి షాక్ ఇచ్చిందన్నారు. ఆ బాధ నుండి తేరుకోలేక కొందరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇన్నాళ్లూ ఉదయనిధి స్టాలిన్ నుండి వచ్చిన అరుపులు, పెడబొబ్బలు.. ఇప్పుడు నామ్ తమీళర్కట్చి నేత సీమాన్ నుండి వస్తున్నాయన్నారు. సొంత జిల్లాలోనే డిపాజిట్ దక్కించుకోలేని సీమాన్, వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మర్యాదగా మాట్లాడకపోతే కాంగ్రెస్ శ్రేణులు అదే రీతిలో బుద్ధి చెబుతాయన్నాయన్నారు. సవాల్కు సిద్ధమా?: డీఎంకే మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలని సీమాన్ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేస్తూ, మొదట కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన ఉదయనిధి స్టాలిన్ను రాజీనామా చేయమనండి అని సూచించారు. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ సవాల్కు సిద్ధమేనా అని సీమాన్ తన సోదరుడు ఉదయనిధిని అడిగి చెప్పాలన్నారు. బీజేపీతో ఉదయనిధి అండర్ డీలింగ్స్ కరుణానిధి మరణం తర్వాత డీఎంకే ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని మాణిక్యం ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన డీఎంకే కార్యకర్తలు ఇళ్లలోనే ఉండిపోయారన్నారు. ప్రస్తుతం అద్దెకు తెచ్చుకున్న వాళ్లతో రాజకీయం నడుపుతున్నారన్నారు. కొత్తగా గెలిచిన విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఆయన సీఎం కాకుండా అడ్డుకోవడానికి బీజేపీ వేసిన ప్లాన్లో ఉదయనిధి స్టాలిన్ ఒక ముఖ్య సూత్రధారిగా పేర్కొన్నారు. ఆయన బీజేపీతో పెట్టుకున్న లోపాయికారీ ఒప్పందాలను త్వరలోనే ప్రజల ముందు పెడుతామన్నారు. జూన్ 8న జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే దూరంగా ఉండటమే ఆ పార్టీ బీజేపీకి బీ–టీమ్ అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అని ఆరోపించారు. తమిళనాడులో రాబోయే కాలంలో ఉదయనిధి నేతృత్వంలోని డీఎంకే భారీ పతనాన్ని చూస్తుందని ఆయన జోస్యం చెప్పారు. డీఎంకేతో కలవడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీ 18 మంది ఎమ్మెల్యేల నుండి ఐదుగురికి పడిపోయిందని, చేరకూడని చోట చేరి మోసపోయామని అన్నారు. సీఎం విజయ్, రాహుల్ గాంధీల మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసినవేనని, ఈ స్నేహం, కూటమి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయని ధీమా వ్యక్తంచేశారు. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
చిత్తూరు అర్బన్: ముందస్తు నేరాల నియంత్రంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. కార్వేటినగరంలో నాటు సారా తయారీకి ఉపయోగించే 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. చిత్తూరు వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 20 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 70 మందికి డ్రగస్స్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా చిత్తూరు తాలూకా, యాదమరి ప్రాంతాల్లో ఐదుగురికి మాదకద్రవ్యాల పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీళ్లకు ప్రత్యేకించి కౌన్సెలింగ్ చర్యలు హెచ్చరించారు. నగరి: నగరి డివిజన్ పరిధిలో ఆదివారం విస్తతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. నగరితోపాటు నిండ్ర, విజయపురం, పాలసముద్రం, ఎస్ఆర్ పురం మండల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ కిట్లతో అనుమానితులకు గంజాయి పరీక్షలు చేశారు. అనంతరం సీఐ మాట్లాడారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే వివిధ మం లాల్లోని కరకంఠాపురం, వేదాంతపురం ఎస్టీ కాలనీ, కేవీపురం దళితవాడ, పచ్చికాపల్లం, పాలసముద్రం దళితవాడ, పొదలపల్లె, కొటార్వేడులో కార్డన్ సెర్చ్తో ప్రతి గృహాన్ని తనిఖీ చేశామన్నారు. వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించామన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచామన్నారు. కొటార్వేడులో సారాఊట ధ్వంసం చేసినట్లు చెప్పారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ(డీటీసీ) జే.రాంబాబు డివిజన్లోని ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు. తిరుమల: బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ నవీన్ కుమార్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 లక్షలు విరాళం ఇచ్చారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈఓ చాంబర్లో విరాళం డీడీని దాత అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు నాగారం మురళి, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
వైభవం.. సీతారాముల కల్యాణం
కొరుక్కుపేట: లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. చైన్నె పెరంబూరు పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతారముల కల్యాణ వైభవంలో భాగంగా శనివారం రాత్రి వసంత కేళికై , పవలింపు, ఆంజనేయోత్సవం అనంతరం ఆదివారం ఉదయం 8గంటలకు అష్టపది, గీతాగోవిందం, ఉపచార పూజ, దీపారాధన, డోలోత్సవాన్ని వైష్ణవ ఆగమనం ప్రకారం వేదపండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల తిరుకల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనంద భాగవతర్ నేతత్వంలోని కళాకారుల బృందం సంగీతంతో అందించిన కీర్తనలకు హైదరాబాదుకు చెందిన శ్రీకాంత్ అభినయం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు. ముఖ్యఅతిథి డి.జంబు, పురప్రముఖులను తమ్మినేని బాబు సత్కరించారు. సమాజం సెక్రటరీ వెంకటరామన్, కోశాధికారి కోదండరామయ్య, జాయింట్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ కోశాధికారి వెంకట రమణుడు, ట్రస్టీ రామచంద్రన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం కీల్పాక్లో ఉన్న మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలో ఎం.జయరామన్ స్మారకార్థం అన్నదానం చేశారు. -
కుశస్థలినదిలో ఊట బావులకు గ్రామీణుల వ్యతిరేకత
తిరుత్తణి: కుశస్థలి నదిలో ఊటబావులు ద్వారా తిరుత్తణి కొండ ఆలయానికి తాగునీరు సరఫరా చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించి మంగళవారం నిరసన తెలిపారు. తిరువలంగాడు యూనియన్లోని నల్లాట్టూరు సమీపంలోని కుశస్థలినది నుంచి రూ.11 కోట్ల వ్యయంతో మూడు ఊటబావులు నిర్మించి రోజూ తిరుత్తణి ఆలయంకు 5 లక్షల లీటర్ల తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకున్నారు. వాటర్బోర్డు ద్వారా ఊటబావుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం నల్లాట్టూరు గ్రామస్తులు ఊటబావుల పనులను అడ్డుకుని వ్యతిరేకత తెలిపారు. దీంతో పనులు ఆగడంతో వాటర్బోర్డు ఏడీ సంపత్. తహసీల్దారు కుమార్, ఆలయ ఇంజినీరు నేతాజీ తదితరులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. నదిలో 15 అడగుల లోతు ఊటబావులు ఏర్పాటు చేసి మూడు అడుగుల లోతు నుంచి ఊట నీటిని మాత్రమే పైపులైన్లు ద్వారా తరలించనున్నట్లు తద్వారా గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడదని గ్రామీణులకు తెలిపారు. అయితే ఇప్పటికే మూడు ఊటబావులు నిర్మించి మూడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్న క్రమంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదమున్నట్లు గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతంలో ఊటబావులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ఊట బావుల ద్వారా భూగర్భజలాలు అడుగంటే అవకాశమే లేదని ఊట నీటిని మాత్రమే వినియోగిస్తామని అధికారులు చెప్పడంతో గ్రామీణులు ఆందోళన విరమించారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం
నిండ్ర (నగరి): నిండ్ర మండలం అత్తూరు గ్రామ పంచాయతీలోని ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల తిరునాళ్లలోభాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. తొలుత ఉదయం దుర్యోధన వధ ఘట్టం అనంతరం భక్తులు దేవాలయం వద్ద పొంగళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయం ఎదుట మైదానంలో అగ్ని గుండాన్ని అర్చకులు పూజల నిర్వహించి రగిలించారు. ఆ తర్వాత ద్రౌపదీదేవి ఉత్సవమూర్తిని పలు పుష్పాలతో విశేషంగా అలంకరించి గ్రామ సరిహద్దు నుంచి కంకణం ధరించిన భక్తులు గోవింద నామస్మరణతో అమ్మవారి వెంట అగ్నిగుండం వద్దకు చేరారు. సాంప్రదాయ పూజలు నిర్వహించి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారిని పురవీధులలో ఊరేగించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరి రూరల్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో నిండ్ర, విజయపురం ఎస్ఐలు మల్లికార్జున వెంకట సుబ్బయ్య బందోబస్తు నిర్వహించారు. -
లోక్భవన్.. ముట్టడిస్తాం!
సాక్షి, చైన్నె : సీబీఎస్ఈ పాఠశాలల్లో సిలబస్ ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని నిరసిస్తూ, అలాగే విశ్వవిద్యాలయాల అధికారాలను లాగేసుకునే వీపీఎస్ఏ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 23వ తేదీన చైన్నెలోని లోక్ భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్ను ముట్టడించనున్నట్టు డీఎంకే విద్యార్థి విభాగం ప్రకటించింది. వివరాలు.. పుదుచ్చే రి రాష్ట్ర డీఎంకే విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లు, నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల అత్యవసర సమీక్షా సమావేశం ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. డీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర కన్వీనర్ శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు డీఎంకే విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరమణి ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం వీరమణి మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై తమిళనాడులోని ప్రస్తుత తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యావ్యవస్థను తాకట్టు పెడుతున్నారు పీఎం శ్రీ పేరిట పాఠశాలల వ్యవహారంలో తమిళనాడులోని టీవీకే ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై పరిశీలిస్తున్నామని విద్యాశా ఖ మంత్రి చెబుతుండటం హాస్యాస్పదం. విద్యావ్యవస్థను కేంద్రానికి తాకట్టు పెట్టేందుకు టీవీకే ప్రభుత్వం సన్నద్దమైందన్నారు. జూలై నెల నుండి సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ప్ర యత్నిస్తునదన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ లు చేయనివ్వమని, తమిళనాడులో హిందీని దొడ్డి దా రిన తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. 9 వ తరగతిలో మూడో భాషకు మార్కులు ఉండవని చె బుతారని, అయితే, ఆ తర్వాత 10వ తరగతికి వచ్చే సరికి అదే మార్కులను తప్పనిసరి చేస్తారన్నారు. ఇది విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని పెంచడమేనని పేర్కొన్నా రు. సీబీఎస్ఈ సిలబస్ ద్వారా జరుగుతున్న హిందీ వి ధింపును అడ్డుకోవడానికి, వర్సిటీల స్వయంప్రతిపత్తి ని దెబ్బతీసే వీపీఎస్ఏ విధానాన్ని రద్దు చేయాలని డి మాండ్ చేస్తూ జూన్ 23న చైన్నెలోని గవర్నర్ బంగ్లా లోక్భవన్, పుదుచ్చేరిలోని లోక్ నివాస్ల ముట్టుడి ది శగా డీఎంకే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ఎ త్తున నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టనున్నట్లు వీరమ ణి స్పష్టం చేశారు. పుదుచ్చేరి డీఎంకే విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
శత జయంతోత్సవాలకు ముస్తాబు
ఏర్పేడు: ఏర్పేడులో వెలసిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవ్యాసాశ్రమం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శత జయంతోత్సవాలకు ముస్తాబవుతోంది. 1926లో కేరళ రాష్ట్రానికి చెందిన సద్గురు మలయాళ స్వామి ఏర్పేడులో శ్రీవ్యాసాశ్రమాన్ని నెలకొల్పారు. శ్రీవ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆధ్వర్యంలో ఆగస్ట్ 27వ తేదీ నుంచి వారం రోజులపాటు ఆశ్రమ ప్రాంగణంలో శత జయంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో వ్యాసాశ్రమంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. సద్గురు మలయాళ స్వామి అధిష్టాన మందిరం వద్ద పచ్చదనాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలోని అన్ని భవనాలను ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. అన్నదాన కేంద్రం నవీకరణ పనులు చేపడుతున్నారు. కాశీబుగ్గతీర్థం ప్రాంగణంలో చలువరాతి నిర్మాణాలు , అన్నదాన కేంద్రం సమీపంలో పార్క్ తీర్చిదిద్దారు. శ్రీవాల్మీకి మహర్షితో పాటు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మలయాళస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. -
అరక్కోణం యార్డులో ఇంజినీరింగ్ పనులు
సాక్షి, చైన్నె: అరక్కోణం రైల్వే యార్డులో అత్యవసర ఇంజినీరింగ్, ట్రాక్ ఆధునీకరణ పనులు జరగనున్నందున, చైన్నె సబర్బన్ పరిధిలో నడిచే 47 ఎలక్ట్రికల్ (లో కల్) రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మార్పులు సోమవారం 8వ తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు మొత్తం 5 రోజులు అమలులో ఉంటాయని వివరించారు. ఈ మేరకు చైన్నె రైల్వే డివిజన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. పలు రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పూర్తిగా రద్దయిన రైళ్లు జూన్ 8 నుండి 12వ తేదీ వరకు 5 రైళ్లు పూర్తిగా రద్దు చే శారు. ఇందులొఓ అరక్కోణం – తిరుత్తణి మధ్య తెల్లవారుజామున 4.00 గంటలకు, 5:00 గంటలకు నడిచే లోకల్ రైళ్లు, తిరుత్తణి – అరక్కోణం మధ్య రాత్రి 9:15 గంటలకు, 11:10 గంటలకు నడిచే లోకల్ రైళ్లు. తిరుత్తణి – చైన్నె సెంట్రల్ మధ్య ఉదయం 6:30 గంటలకు నడిచే లోకల్ రైలు ఉన్నాయి పాక్షికంగా రద్దయిన రైళ్లు చైన్నె సెంట్రల్,బీచ్ నుండి అరక్కోణం వైపు వెళ్లే పలు రైళ్లను తిరువాలాంగడు స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఇవి తిరువాలాంగడు – అరక్కోణం మధ్య నడవవు అని ప్రకటించారు. ఇందులో చైన్నె బీచ్ – అరక్కోణం మధ్య తెల్లవారుజామున 4.05, మధ్యాహ్నం 2.25 గంటల రైళ్లు, ఆవడి – అరక్కోణం మధ్య ఉదయం 6.20 గంటల రైలు, చైన్నె సెంట్రల్ – అరక్కోణం మధ్య ఉదయం 6.30, 9.10, 10.30, 11.00, మధ్యాహ్నం 12.40, 1.25, రాత్రి 3.45, సాయంత్రం 4.45, 5.15, 5.45, 6.05, 6.40, రాత్రి 7.30, 8.20, 9.10, 10.00, 10.55 గంటలకు బయలుదేరే రైళ్లు తిరువాలాంగడు వరకే నడుస్తాయి. అలాగే అరక్కోణం నుండి చైన్నె సెంట్రల్కు బయలుదేరాల్సిన కింద పేర్కొన్న సమయాల రైళ్లు అరక్కోణానికి బదులుగా తిరువాలాంగడు స్టేషన్ నుండే చైన్నెకి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారం. ఈమేరకు తెల్లవారుజామున 3.45, 4.25, 5.25, ఉదయం 6.40, 8.15, 8.55, 11.15, మధ్యాహ్నం 2.25, రాత్రి 3.40, సాయంత్రం 4.50, 6.00, 7.00, 7.25, రాత్రి 8.25, 8.50, 9.45 గంటల రైళ్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా అరక్కోణం – చైన్నె బీచ్ మధ్య నడిచే మరో 4 లోకల్ రైళ్లు కూడా పాక్షికంగా రద్దయ్యాయి. -
విక్రమ్ @63
విక్రమ్ రియా శిబు తమిళసినిమా: విక్రమ్ చిత్రం అంటేనే సమ్ థింగ్ స్పెషల్గా ఉంటుంది. వీర ధీర సూరన్ చిత్రం తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని నటించడానికి సిద్ధమయ్యారు విక్రమ్. ఈయన నటిస్తున్న 63వ చిత్రం ఆదివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైనట్టు సమాచారం. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ కాంబినేషన్లో ఇరుమురున్ అనే చిత్రం 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇందులో సర్వంమాయ మలయాళ చిత్రం ఫేమ్ రియాశిబు కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు విక్రమ్ హీరోగా వీర ధీర సూరన్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఇంకా పేరు నిర్ణయించని విక్రమ్ 63వ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలోని పాత్ర కోసం విక్రమ్ దర్శకుడి సూచనల మేరకు మేకోవర్ అయినట్లు సమాచారం. ఎంఎస్ భాస్కర్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. తమిళసినిమా: అందం, ఐశ్వర్యం, ఆనందం, ఆసక్తి, ఆకర్షణ, నిరాకరణ, సంతృప్తి, అసంతృప్తి, ఆవేదన అన్నీ కలగలిపిన పరిశ్రమ సినిమా. ఇక్కడ ప్రతిభ, అదృష్టాలను పరీక్షించుకుని ఉన్నంత స్థాయికి చేరుకున్న వారు ఎందరో. తమ కలలను పండించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నా వారు ఉన్నారు. అదే సమయంలో వివక్ష గొంతెత్తే వారు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేరారు. లక్ష్మీకల్యాణం అనే తెలుగు చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అగ్ర కథానాయిక స్థాయికి చేరారు. కాజల్ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలా ఒక బిడ్డకు తల్లి కూడా అయినా ఈ ఉత్తరాది భామ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాజల్ తాజాగా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న తెరపైకి రానుంది. కమలహాసన్తో కలిసి నటించిన ఇండియన్– చిత్రం విడుదల కావలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ సందర్భం వచ్చినప్పుడల్లా గ్లామర్ ను ప్రదర్శిస్తూ అవకాశాల వేటలో పడుతున్నారు. తాజాగా చిత్రపరిశ్రమలో వివక్ష గురించి ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో ఆడ, మగ మధ్య వివక్ష లేదని చెప్పలేను కానీ ఈ పరిస్థితి మారాలి. సినిమా ఇప్పుడు కార్పొరేట్గా మారిపోతోంది. అయినా ఆడ, మగ మధ్య పారితోషికం విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. నాకు అక్కడ లేని సౌకర్యం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలుగుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. త్వరలో ది ఒన్ విత్తిన్ యూ తమిళసినిమా: హరీష్ణి పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపాల్ బాలకృష్ణన్, శివరామనాథన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ది ఒన్ విత్తిన్ యూ. ఆదిరా రాకెప్పన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్, టీజర్లను విడుదల చేశారు. చిత్రం వివరాలను దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతూ ఇది హైపర్ లింక్ డ్రామాతో కూడిన యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. మానవ అనుబంధాలతో కూడిన వైవద్యభరిత కథ ఇదని చెప్పారు. ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తుల జీవితాల్లో విధి, పరిస్థితుల కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటమే ది ఒన్విత్తిన్ యూ అని అన్నారు. కోయంబత్తూర్ పశ్చిమ కొండ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అనూహ్య సంఘటనల కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు? వంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. ఇందులో నటి లియోమోల్జోస్ నటిస్తుండగా, పరుత్తివీరన్ శరవణన్, పావల్ నవగీతన్, నమిత కృష్ణమూర్తి, గీతాకై లాసం, ప్రవీణ్ రాజా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. జిబ్రాన్ సంగీతాన్ని, వినోద్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర టైటిల్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందని త్వరలోనే ఆడియో, చిత్ర విడుదలకు సంబంధించిన వివరాల వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చిత్ర పరిశ్రమలో వివక్ష ఉంది -
స్నేహమేరా జీవితం..
గుడిపాల: స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం– అని రెండున్నర దశాబ్దాల తర్వాత వారంతా సందడి చేశారు. తమ భవితకు బాటలు వేసిన పాఠశాలలో ఆదివారం కలిశారు. జ్ఞాపకాల పేజీలు తిరగేస్తూ బాల్య స్మతులతో కేరింతలు కొట్టారు. మండలంలోని నరహరిపేట ఉన్నత పాఠశాలలో 2002–2003లో పదవ తరగతి చదివిన విద్యార్థులు కాలక్రమంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మళ్లీ అందరూ కలవాలని ఫోన్లలో పరస్పరం చర్చించుకుని డేట్ నిర్ణయించడంతో ఆలస్యం ఎక్కడెక్కడి నుంచో అందరూ వాలిపోయారు. తమ తరగతి గదుల్లో తిరుగుతూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లారు. తమ విద్యాబుద్ధులు చెప్పిన గురుదేవులను సన్మానించి ఆశీస్సులు అందుకున్నారు. స్కూల్ అభివృద్ధి కోసం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు దూర్వాసులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. తిరుచ్చి అరియమంగళం ప్రాంతానికి చెందిన మహబూబ్బాషా కుమారుడు బాషా (25). ఇతను పేరు మోసిన రౌడీ. ఇతను శనివారం రాత్రి 11.30 గంటలకు బైక్లో కాట్టూర్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో వెళుతున్నాడు. ఆసమయంలో అతన్ని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. ఒక మలుపు వద్ద బాషా బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో, వెనుకనే వచ్చిన ముగ్గురు అతడి తలపై వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల విచారణలో గత సెప్టెంబర్లో కూడా బాషాపై దాడి జరిగిందని, అప్పట్లో అతడి వేళ్లు తెగిపోయాయని తెలిసింది. తిరువెరుంబూర్ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. తిరువొత్తియూరు: హత్య కేసులో ఓ మహిళ, ఆమె ప్రియుడిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్ట్ చేశారు. కృష్ణగిరి జిల్లా పాలక్కురికి చెందిన సైనిక ఉద్యోగి మహేష్ కుమార్ (36), తండ్రి, మాజీ సైనికుడు సెల్లప్పన్ (64)లను మే 11న హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చివేశారు. మహేష్కుమార్ భార్య భానుప్రియ. ఈమె తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ప్రియుడు పూవరసన్తో కలిసి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు, వీరిద్దరిపై గూండా చట్టం ప్రయోగించారు. పూవరసనను సేలం కేంద్ర కారాగారానికి, భానుప్రియను కోయంబత్తూర్ మహిళా ప్రత్యేక జైలుకు తరలించారు. చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన కొండ రవి బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు వరణ్య, షణ్ముఖ, ప్రియ, సాత్విక, కార్తీక, విహాన, సహస్ర, భార్గవి, మన్య, హన్విత, జ్ఞాపిక, క్రియాంశ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. మంత్రముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ఖాదర్వల్లి, ఇన్చార్జ్ ఏఓ సూర్యతేజ కళాకారులతోపాటు గురువులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. వెంకటగిరి రూరల్: చిల్లర దుకాణానికి బైక్పై సిగరేట్ కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ చెవులోని కమ్మను అపహరించుకెళ్లిన ఘటన వెంకటగిరి–నాయుడుపేట మార్గంలోని బాలాయపల్లి మండలం, మేల్చూరు గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మేల్చూరుకి చెందిన కాసరం కృష్ణమ్మ చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని యువకులు మోటారు సైకిల్పై వచ్చి సిగరేట్లు అడిగారు. వాటిని ఇవ్వబోయే సమయంలో కృష్ణమ్మ మెడలోని బంగారు సరుడు లాగ బోయారు. ఈ మేరకు కృష్ణమ్మ కేకలు వేయడంతో ఆ యువకులు ఆమె చెవిలోని 3 గ్రాముల బంగారు కమ్మను లాక్కెళ్లారు. బాధితురాలు బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయం మూడో గేటు సమీపంలోని జల వినాయకుడి వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్ పది రోజులుగా పనిచేయకుండా నిలిచిపోయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ స్క్రీన్న్ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన నాలుగు నెలలకే అది పనిచేయకుండా పోవడం గమనార్హం. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,107 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 52,236 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. -
తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుత్తణి: వారాంతపు సెలవు దినంతో పాటు శుభ ముహూర్తదినం సందర్భంగా ఆదివారం తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తిరుత్తణిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం సెలవు దినంతో పాటు శుభముహూర్త దినం సందర్భంగా ఆలయ అధికారుల అనుమతితో ఆలయ మండపాల్లో 15 వివాహాలు జరిగాయి. దీంతో పాటు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుత్తణి కొండ ఆలయంకు పోటెత్తారు. దీంతోపాటు పట్టణ వ్యాప్తంగా ప్రయివేటు కల్యాణ మండపాల్లో 50కు పైబడిన వివాహాలు జరిగాయి. వివాహాలు ద్వారా ఏకమైన నవ దంపతులతో పాటు వారి కుటుంబీకులు, బందువులు స్వామి దర్శనంకు కొండ ఆలయంకు పోటెత్తారు. సర్వ దర్శన క్యూలైన్లతో పాటు రూ. వంద ప్రత్యేక దర్శన మార్గాల్లో భక్తులు మూడు గంటల పాటు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాత్రి ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తిరుత్తణి కొండ ఆలయంలో భక్తుల రద్దీ అలంకరణలో ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి -
గ్యాస్ ధర పెంపుతో మధ్యతరగతి అస్తవ్యస్తం
– ఎస్డీబీఐ పార్టీ మండిపాటు కొరుక్కుపేట: గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఎస్డీబీఐ పార్టీ రాష్ట్ర కోశాధికారి ముస్తఫా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను మరోసారి పెంచింది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను ఇది పూర్తిగా అస్తవ్యస్తం చేస్తుందన్నారు. ఇటీవల వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను గణనీయంగా పెంచినప్పటికీ, ఇప్పుడు గృహ వినియోగం కోసం వాడే సిలిండర్ల ధరను పెంచడం పేద, సామాన్య ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు తగ్గే సమయాల్లో, ప్రజలకు ప్రయోజనాలు కల్పించకుండా ధరలను తగ్గించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. ధరలు పెరిగినప్పుడు మాత్రమే ఆ భారాన్ని వెంటనే ప్రజలపై మోపుతుంది. అందువల్ల, పేద, సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. -
క్లుప్తంగా
టాస్మాక్ దుకాణం ధ్వంసం తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం కడియప్పాక్కం గ్రామంలో ఉన్న టాస్మాక్ (మద్యం) దుకాణాన్ని తొలగించాలని కోరుతూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పలుమార్లు విన్నవించినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు, దుకాణంపై కరల్రతో దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. ఈ మద్యం దుకాణం పాఠశాలకు సమీపంలో ఉండటం వల్ల స్థానికులకు, విద్యార్థులకు తీవ్ర అసౌ కర్యం కలుగుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం దుకాణాన్ని తెరిచేందుకు సిబ్బంది ప్రయత్నించగా, వందలాది మంది మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. సుమారు 50 మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. స్నేహితుడిని హత్య కేసులో యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఘర్షణ పడి స్నేహితుడిని హత్య చేసిన యువకుడిని పోలీసు లు అరెస్ట్ చేశారు. చైన్నె చోళవరానికి సమీపంలో ఉన్న వండలూర్ బైపాస్ సర్వీస్ రోడ్డులో జూన్ 5వ తేదీ రాత్రి ఒక మృతదేహం పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. పరీక్షించిన వైద్యులు ఆ వ్యక్తి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు చైన్నె వ్యాసార్పాడికి చెందిన మణికంఠన్ (29) అని తెలిసింది. పోలీసుల విచారణలో మణికంఠన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరగడంతోటింకర్ సెంథిల్ (44) అనే వ్యక్తి మణికంఠన్ను కర్రతో కొట్టి చంపినట్లు తెలిసింది. పోలీసులు సెంథిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న విక్కీ కోసం వెతుకుతున్నారు. విద్యార్థినులకు లైంగిక వేధింపులు – కళాశాల యాజమాన్యంపై కేసు తిరువొత్తియూరు: దిండుకల్ సమీపం వత్తలగుండులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాల హాస్టల్ వార్డెన్ సెల్ఫోన్ ద్వారా విద్యార్థినులకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు 30 మందికి పైగా విద్యార్థినులు దిండుకల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ విశాఖను కలిసి ఫిర్యాదు చేశారు. హాస్టల్లో కనీస వసతులు లేవని, నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ రాత్రి సమయాల్లో విద్యార్థినులకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు పేర్కొన్నారు. దీనిపై గత 6 నెలలుగా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. తమను వెంటనే వేరే కళాశాలకు మార్చాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకో వాలని విద్యార్థినులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులపై (కళాశాల కరస్పాండెంట్, వార్డెన్ సహా) ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, మహిళలపై వేధింపుల నిరోధక చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వాకింగ్ చేస్తూ మిద్దైపె నుంచి పడి.. – గర్భిణి మృతి తిరువొత్తియూరు: వాకింగ్ చేస్తున్న సమయంలో మేడపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్ సమీపం పెరియ సెవలై గ్రామానికి చెందిన వీరప్పన్ కుమార్తె యువశ్రీ (25). ఈమెకు, తిరువైన్నెనల్లూర్ సమీపంలోని మాంబరై గ్రామానికి చెందిన రాజదురైకి గతేడాది వివాహం జరిగింది. రాజదురై ఆర్మూర్ వద్ద ఐటిబిపి విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గర్భిణి అయిన యువశ్రీ ప్రసవం కోసం కొన్ని రోజుల క్రితం పెరియ సెవలైలోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం సాయంత్రం ఆమె తన ఇంటి మేడపై నడుస్తుండగా ఊహించని విధంగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే విల్లుపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స విభాగంలో చికిత్స పొందుతూ, శనివారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స ఫలించక యువశ్రీ , ఆమె కడుపులోని బిడ్డ ఇద్దరూ మరణించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తుమాత్రల విక్రయం – ఇద్దరు యువకుల అరెస్ట్ తిరువళ్లూరు: మత్తుమాత్రలను అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో మత్తుమాత్రలను విక్రయిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టి అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన యువకులు తాంబరం ప్రాంతానికి చెందిన రాజ్కుమారుడు శరవణన్(24), విశ్వనాథన్ కుమారుడు కమలేష్(23)గా గుర్తించారు. వీరు ఒడిశా నుంచి మత్తుమాత్రలను తీసుకొచ్చి యువత, విద్యార్థులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
విజయ్ ప్రభుత్వం 3 నెలలైనా ఉంటుందా?
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై డీఎంకే చీఫ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వం మూడు నెలలు కూడా కొనసాగడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 60 ఏళ్ల కాలంలో ఏర్పడిన ఏకైక డీఎంకేయేతర, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం విజయ్ జోసెఫ్ సారథ్యంలో మేలో ఏర్పడటం తెల్సిందే. ఆదివారం చెన్నైలో వీసీకే ఎమ్మెల్యే పనైయూర్ బాబు డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. ‘‘ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటిదో నేను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, మరో ఆరు నెలల వరకు ఎలాంటి విమర్శలు చేయబోనని చెప్పా. ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడక తప్పడం లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని నెలలు ఉంటుందనికాదు, కనీసం మూడు నెలలయినా మనుగడ సాగిస్తుందా అన్నదే అసలు ప్రశ్న’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి కొత్తగా వచ్చే వారు తాము వచ్చిన పార్టీని విమర్శించవద్దని కోరారు. -
జల్లికట్టు ఉద్యమం చూపిన పాఠం మరవొద్దు: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత బాధ్యతతో పరిశీలించి, సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.నేటి భారతదేశంలో లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ఉద్యోగ నియామకాలపై అనిశ్చితి వంటి అంశాలు యువతలో ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు కేవలం పరిపాలనా అంశాలుగానే కాకుండా సామాజిక సమస్యలుగా కూడా చూడాల్సిన అవసరం ఉందన్నారు.చరిత్రను పరిశీలిస్తే ప్రజల హృదయాల్లో పుట్టిన ఉద్యమాలను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన గుర్తు చేశారు. 2017లో చెన్నైలోని మేరినా బీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రారంభంలో కొద్దిమంది యువకులు, విద్యార్థులతో మొదలైన ఆ ఉద్యమం క్రమంగా లక్షలాది మంది ప్రజల మద్దతు పొందిందన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే లక్ష్యంతో ఐక్యమై ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.జల్లికట్టు ఉద్యమం రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కాకుండా ప్రజల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రజల సంకల్పం ఎంత బలంగా ఉంటుందో ఆ ఉద్యమం దేశానికి చూపించిందని వ్యాఖ్యానించారు. ప్రజల భావోద్వేగాలను గౌరవించిన ప్రభుత్వాలు చట్టసవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు.యువతలో నిరాశ, నిరుత్సాహం పెరిగినప్పుడు వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రెండు ప్రజాస్వామ్య మార్గాలను ఎంచుకుంటారని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఒకటి శాంతియుత ప్రజా ఉద్యమాలు కాగా, మరొకటి బ్యాలెట్ ద్వారా తమ ఆకాంక్షలను వ్యక్తపరచడం అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్పై ఉన్న అనిశ్చితి కారణంగా యువతలో అసంతృప్తి పెరిగిందని, అది రాజకీయ వ్యవస్థలో మార్పు కోరే భావనగా కూడా వ్యక్తమవుతోందన్నారు.జల్లికట్టు వంటి ప్రజా ఉద్యమాలు ఒకవైపు కనిపిస్తుండగా, ఎన్నికల రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించే ధోరణి కూడా కనిపించిందన్నారు. దీనికి తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం పార్టీ సాధించిన అనూహ్య ప్రజాదరణ ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిణామాలు సహజమని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువతలో అభద్రతాభావం పెరగడానికి విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అంశాలపై యువతలో చర్చలు, ఆందోళనలు పెరుగుతున్నాయని, వాటిని పాలకులు సకాలంలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యువత ఆవేదనను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు పరిష్కారం సంభాషణ, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ఉద్యమాలు పుట్టుకురావడానికి కారణమయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించి నివారించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. అలా జరగని పక్షంలో ప్రజా ఉద్యమాలు అనివార్యమవుతాయని పేర్కొన్నారు.ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, వారి సమస్యలను సకాలంలో పరిష్కరించే ప్రభుత్వాలే చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. యువత శక్తిని తక్కువ అంచనా వేయరాదని సూచిస్తూ, యువత కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో, శాంతియుత మార్గాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరారు. ప్రభుత్వాలకు హెచ్చరికలు ఇవ్వడం కంటే శాంతియుత మార్గాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి..
రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, శిక్షించేందుకు తనిఖీలను ముమ్మరం చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పబ్లిక్ కంపార్ట్మెంట్ల తగ్గింపు, రైళ్ల కొరత వంటి అవకతవకల కారణంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే పరిపాలన విభాగం టికెట్ ఇన్స్పెక్టర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నెలవారీ ఆదాయ లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది.జరిమానాలు వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల ని ప్రణాళిక వేస్తున్నారు. ప్రయాణికుడు ప్రయాణించిన దూరం ఆధారంగా ఈ జరిమానాను లెక్కిస్తారు. రిజర్వేషన్ లేకుండా రెగ్యులర్ స్లీపర్ కోచ్లలో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లను టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణించి జరిమానా విధిస్తారు. ప్రస్తుతం పాలక్కాడ్ డివిజన్లో స్లీపర్ కోచ్లను పర్యవేక్షించే టికెట్ ఇన్స్పెక్టర్ నెలవారీ జరిమానా పరిమితిని రూ.10,000 నుంచి రూ. 25,000కు పెంచారు. దీనివల్ల సంవత్సరానికి రూ. 27 కోట్ల వరకు జరిమానా విధించాల్సి వస్తుంది. సరైన అనుమతి లేకుండా ఖరీదైన బాక్సులకు మారడం వంటి చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై జరిమానాలు విధిస్తారు. ఈ తీవ్రమైన చర్య ఉద్యోగులు, ప్రయాణికుల మధ్య అనవసర ఘర్షణలకు దారితీయవచ్చని రైల్వే కార్మిక సంఘాలు హెచ్చరించాయి.మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు విధించే కనీస జరిమానాలను ఈమేరకు సవరించారు. జనరల్ కోచ్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 320, సిట్టింగ్ రిజర్వ్ కంపార్ట్మెంట్లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ. 335, స్లీపర్ కోచ్లో ప్రతి 200 కిలోమీటర్లకు రూ. 530 జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, ఏసీ కోచ్కు కనీస జరిమానా రూ. 745గా, థర్డ్ ఏసీ కోచ్లో ప్రతి 300 కిలోమీటర్లకు రూ.2,070గా , సెకండ్ ఏసీ కోచ్లో ప్రతి 800 కిలోమీటర్లకు రూ. 2,070గా నిర్ణయించారు. అదే సమయంలో రెగ్యులర్, సీజన్ టికెట్ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, రైల్వే పరిపాలన రిజర్వేషన్ లేని జనరల్ కోచ్ల సంఖ్యను పెంచలేదు. దీనికి విరుద్ధంగా, ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ కోచ్లను తగ్గించి, వాటిని ఏసీ కోచ్లుగా మారుస్తున్నారు. తగినన్ని రైళ్లు లేకపోవడంతో, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఓఎంఆర్లో శాటిలైట్ కార్యాలయం
రెసిడెన్స్ కేంబ్రిడ్జ్ సాక్షి, చైన్నె: డీఏసీ డెవలపర్స్ నేతృత్వంలో చైన్నెలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ అయిన ఓల్డ్ మహాబలిపురం రోడ్లో కొత్త శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. శనివారం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యుబీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌరవ్ కుమార్ , డీఏసీ డెవలపర్స్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ సంతానం హాజరయ్యారు. రూ. 250 కోట్ల భారీ పెట్టుబడి ప్లాట్ఫారమ్గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ. 66 కోట్ల నిధులను యుబి సమకూర్చిందని ప్రకటించారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఏడాది కాలంలో భూసేకరణ అవకాశాలను పెంపొందించుకోవడానికి ముందుకెళ్లనున్నట్టు వివరించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు, డీఏసీ డెవలపర్స్ తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డీఏసీ కేంబ్రిడ్జ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఇంగ్లాండ్లోని ప్రముఖ కేంబ్రిడ్జ్ నగర నిర్మాణ శైలి, అక్కడి చారిత్రాత్మక వైభవం, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ను రూపకల్పన చేశారు. -
పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కవిత హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా తండలం గ్రామంలో సుమారు రూ.17.20 కోట్లు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులు, కూవం నదిలో రూ.5.98 కోట్లు వ్యయంతో ఆనకట్ట పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులను కలెక్టర్ కవిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత, వేగాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్లకు నిర్ణయించిన వ్యవధిలోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతను అధికారులు తరచూ పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కడంబత్తూరు యూనియన్ సత్తరై గ్రామంలో 14.5 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణపు పనులను సైతం కలెక్టర్ పరిశీలించి వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కొరుక్కుపేట: పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపూ ఉందని ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ) కార్యదర్శి ఏ జే హరిహరన్ అన్నారు. గ్రేటర్ చైన్నె కార్పోరేషన్ నిరాశ్రయుల ఆశ్రమంలోని నివాసితులు, సిబ్బంది భాగస్వామ్యంతో, దాని పైకప్పుపై ఒక రూఫ్ గార్డెన్న్ను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య సామాజిక అభివృద్ధి అధికారి (సీసీడీఓ), సామాజిక అభివృద్ధి అధికారి(సీఈఓ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ ఇంజినీర్ (ఏఈ) హాజరయ్యారు. అనంతరం, ఆశ్రమంలోని నివాసితులు పర్యావరణంపై అవగాహన కల్పించే రెండు నాటకాలు, ఒక పాటను ప్రదర్శించారు. అధికారులు ఆశ్రమవాసుల కృషిని అభినందించి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: తమిళనాడులోని శీర్కాళి, వైదీశ్వరన్ కోయిల్, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరెంటు లేకపోవడంతో ప్రజలు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు కూడా దెబ్బతింటున్నాయి. గోవిందరాజ్ నగర్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 వరకు కరెంటు ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనికి నిరసనగా సుమారు 200 కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు, వద్ధులు రోడ్లపైకి వచ్చి శుక్రవారం రాత్రి కాగడాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న చెత్త కుప్పల వల్ల పాములు, తేళ్లు వంటి విషజంతువులు ఇళ్లలోకి వస్తున్నాయని, కరెంటు లేని సమయంలో వాటి వల్ల ప్రాణభయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు. తిరుత్తణి: తిరుత్తణిలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పిటిషన్ మేళాలో 50 పెటిషన్లను పరిష్కరించారు. పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా పెండింగ్లో వున్న పెటిషన్లకు పరిష్కారం కనుగొనే విధంగా పిటిషన్ మేళా తిరుత్తణిలోని పోలీసుల బేరక్స్లో శనివారం నిర్వహించారు. ఏఎస్పీ శుభమ్ధిమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో తిరుత్తణి సబ్ డివిజన్లోని తిరుత్తణి, తిరువలంగాడు, కనకమ్మసత్రం, పొదటూరుపేట, ఆర్కేపేట, పళ్ళిపట్టు సహా 6 పోలీస్ స్టేషన్ల నుంచి పిటిషనర్లు పాల్గొన్నారు. పోలీసుల సమక్షంలో వాది, ప్రతివాదులు పాల్గొని పెటిషన్ల పట్ల పరిష్కారంకు చర్యలు చేపట్టి 50 పెటిషన్లను పరిష్కరించారు. ఇందులో ఇన్స్పెక్టర్లు కార్తిక్, శివకుమార్ సహా పోలీసులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు: పొన్నేరి ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉత్పత్తులను గోడౌన్లలో దాచి ఉంచి, చిల్లర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తమిళన్బన్కు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా ఇన్స్పెక్టర్, పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొన్నేరి సమీపంలోని తిరువాయుర్పాడిలో ఉన్న ఒక చిన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, చిన్నకావణం ప్రాంతానికి చెందిన హరి బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో, దుకాణాలకు హోల్సేల్గా గుట్కా సరఫరా చేస్తున్నది ఎవరో తెలిసింది. తిరువేంగడపురంకు చెందిన అరుణ్ కుమార్, పులిక్కుళం ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ బస్తాల కొద్దీ గుట్కాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు అరుణ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ 75 వేల విలువైన 106 కిలోల గుట్కా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొన్నేరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరుక్కుపేట: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వివరాలు.. తేని జిల్లా లోని పెరియకుళం వడకరైకి చెందిన ముత్తుపాండి (34) పెరియకుళంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతను అరువుపై గృహోపకరణాలు కొనుగోలు చేసి, వాటికి డబ్బు చెల్లించకుండా, పనికి వెళ్లకుండా ఉండేవాడు. ఈ విషయమై ఆ ప్రైవేట్ కంపెనీ తేని పోలీస్ స్టేషన్లో సబ్–ఇన్ స్పెక్టర్ షేక్ సమీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ ఫిర్యాదుపై సబ్–ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేయలేదు. ఈ పరిస్థితిలో, కొన్ని రోజుల క్రితం, తాను పనిచేస్తున్న కంపెనీకి కొత్తగా వచ్చిన ముత్తుపాండి మేడ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని తర్వాత, అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై పోలీసులు ఆ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుపై ముందుగా విచారణ జరపని సబ్–ఇన్స్పెక్టర్ షేక్ సమీమ్ను, ఫిర్యాదు గురించి సమాచారం ఇవ్వని స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ అరుల్ను జిల్లా ఎస్పీ స్నేహ సస్పెండ్ చేశారు. వేటకు వెళ్లిన జాలర్లు అదృశ్యం తిరువొత్తియూరు: సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు అదృశ్యమయ్యారు. కడలూరు జిల్లా సి.పుదుపేట షణ్ముగ నగర్కు చెందిన రవి(28), మనోహర్ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళంకి చెందిన నాగవేల్ (40) ఈనెల 2న పుదుపేట ఇందిరానగర్కు చెందిన వీరవేల్ ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. వారు మరుసటి రోజే ఒడ్డుకు తిరిగి రావాల్సి ఉంది. కానీ వారు తిరిగి రాకపోవడంతో తోటి జాలర్లు వారి కోసం వెతికారు. కోస్ట్ గార్డ్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని కనిపెడతామని హామీ ఇచ్చారు. -
300 మంది పోలీసు అధికారులకు సీఎం పతకాలు
కొరుక్కుపేట: పోలీసు శాఖలో ప్రతిభ కనబరిచిన 300 మంది పోలీసు అధికారులకు సీఎం పతకాలను ప్రదానం చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అమల్ రాజ్ చేతుల మీదుగా వాటిని పోలీసు అధికారులను అందజేసి ప్రశంసించారు. వీరిలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డివిజన్కు చెందిన 157 మంది పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, సాయుధ దళాలు , మోటార్ వెహికల్స్ డివిజన్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చైన్నెలోని మోడరన్ పోలీస్ కంట్రోల్ రూమ్కు చెందిన 94 మంది పోలీసు అధికారులు ఉన్నారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్లో పనిచేస్తున్న 300 మంది పురుష, మహిళా పోలీసు అధికారులకు సీఎం పతకాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. వీరిలో సెక్యూరిటీ పోలీస్ యూనిట్, హైకోర్టు సెక్యూరిటీ పోలీస్ యూనిట్, క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో, ప్రివెన్షన్ యూనిట్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న 49 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ సాక్షి, చైన్నె : తమిళనాడులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని, కావేరి జలాలలను త్వరలోనే సాగు నిమిత్తం విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ తెలిపారు. కుంభకోణం పరిధిలోని కోవిలాచ్చేరి, మిళలై ప్రాంతాలలో సి, డి విభాగం కాలువల పూడికతీత పనులను వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ శనివారం ప్రారంభించారు. వ్యవసాయ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కోవిలాచ్చేరి మిళలైలో 6.9 కి.మీ., కల్లూర్లో 14.6 కి.మీ., తిరునల్లూర్లో 2.6 కి.మీ., నీరత్తనల్లూర్లో 2.5 కి.మీ చొప్పున మొత్తం 26.65 కి.మీ పొడవునా రూ.9.25 లక్షల అంచనా వ్యయంతో ఈ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి వినోద్ మీడియాతో మాట్లాడారు. జూన్ 12వ తేదీన మేట్టూరు డ్యాం నుంచి కావేరి జలాలలను సాగు నిమిత్తం విడుదల చేస్తారా? అని ప్రశ్నించగా, ముందస్తుగానే కావేరి నీటిని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి విడిగా ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, అరసలాటి నదిలో 3వ విడతగా 4.30 కి.మీ పొడవునా జరుగుతున్న పూడికతీత పనులను కూడా మంత్రి వినోద్ స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. మీడియాను సీఎం కలవాల్సిన అవసరం లేదు సాక్షి, చైన్నె : సీఎం విజయ్ మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదని మంత్రి నిర్మల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మదురైలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుప్పర కుండ్రం దీపం వ్యవహారంలో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితి ఉందో, అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగాలన్నదే ప్రభుత్వ విధానంగా వ్యాఖ్యలు చేశారు. మత శక్తులు ఇక్కడ రాజకీయం చేయడానికి తాము నూటికి నూరు శాతం అనుమతించమన్నారు. తాము ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేమని, ప్రజా సేవలోనే ఉన్నామని స్పష్టంచేశారు. మీడియా విధానం సీఎం విజయ్ మీడియాను కలిసే విధానంపై మంత్రి నిర్మల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న పాలకులు తమ సొంత ప్రచారం కోసం, ఉనికిని చాటుకోవడానికి రోజూ మీడియా ముందుకు వచ్చేవారన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తోందని, మంత్రులు రోజూ ప్రజలను కలుస్తున్నారన్నారు. విద్యుత్ బోర్డులో హార్డ్ డిస్క్ల మయం విషయంగా డీఎంకే నేత సెంథిల్ బాలాజీ స్పందించడం ఏమిటో? అని విమర్శించారు. ఈ విషయాలతో సెంథిల్ బాలాజీకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎందుకు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు? విచారణ తర్వాత అన్ని విషయాలూ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. -
ముందే చెప్పే బయటకు వచ్చాం!
సాక్షి, చైన్నె: డీఎంకేకు ముందే చెప్పే కూటమి నుంచి బయటకు వచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యలు చేశారు. శనివారం చైన్నెలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర పాండియన్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలను తమ కూటమిలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ ) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి. వీరపాండ్యన్ను కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. చైన్నె టి.నగర్ లోని సీపీఐ ప్రధాన కార్యాలయం బాలన్ ఇల్లంలో ఈ భేటీ జరిగింది. రాబోయే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం చిదంబరం ను మీడియా ప్రశ్నించగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ ను కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలని చిదంబరం క్లుప్తంగా ముగించారు. డీఎంకే కూటమి గురించి.. అదే సమయంలో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికల తర్వాత కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా టీవీకే పార్టీకి మద్దతుగా వెళ్లిపోయిందనే విమర్శలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా, తాను ఈ విషయంలో లోతుగా వెళ్లాలనుకోవడం లేదన్నారు. అయితే, తాము డీఎంకేకు ముందే చెప్పే వచ్చామని, దీనికి మించి తానేమీ మాట్లాడనన్నారు. మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అటు పార్టీగానీ, ఇటు తమిళనాడు ప్రజలుగానీ సిద్ధంగా లేరన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా వ్యక్తం చేశాయన్నారు. తమ వైఖరిలో, ఇతర మిత్రపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. వారు రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని, తాము మరుసటి రోజే నిర్ణయం తీసుకున్నామని, కేవలం సమయంలోనే తేడా తప్ప, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ పి. చిదంబరం తమ కార్యాలయానికి రావడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో చిదంబరంతో కలిసి పనిచేసిన మోహన్ కుమారమంగళం, ఎ.ఎమ్. గోపు, టి పాండియన్, కె.డి.కె. తంగమణి, వి.పి. చింతన్ వంటి సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుల గురించి తాము చర్చించామన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, ప్రజల తీర్పుపై సాధారణంగా మాట్లాడుకున్నామన్నారు. కాంగ్రెస్ కూటమిలోకి కమ్యూనిస్టులు?: కాంగ్రెస్ ప్రయత్నాలపై స్పందిస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ అంత సులభంగా ఏ కూటమిలోనూ చేరదన్నారు. అలాంటి నిర్ణయాలు తాము ఒంటరిగా తీసుకోమని, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ కమిటీ ద్వారానే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాము సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి(డీఎంకే) లోనే ఉన్నామన్నారు. ఆ కూటమిలో ఉంటూనే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరు కాక పోవడం వారి వ్యక్తిగత నిర్ణయమి తాము ఇండియా కూటమిలోనే ఉన్నామన్నారు. జాతీయ స్థాయిలో జరిగే సమావేశంలో తమ పార్టీ కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు. చిదంబరం -
రజనీ చిత్రానికి మళ్లీ మార్పు
తమిళసినిమా: రజనీకాంత్ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ దర్శకుల మార్పు జరుగుతూనే ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న జైలర్–2 చిత్రాన్ని పూర్తి చేసేశారు. ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్కి సిద్ధం అవుతోంది. దీంతో తర్వాత తన 173వ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించి చాలా కాలమైంది. ఈ చిత్రానికి చాలా మంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరికి సుందర్ సి పేరును ఖరారు చేశారు. ఈయనతో చిత్ర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా సుందర్ సి చిత్రం నుంచి వైదొలిగారు.ఆ తరువాత పార్కింగ్ చిత్రం దర్శకుడు రామ్కుమార్ బాలకృష్ణన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ సెట్ కాలేదు. ఆ తరువాత డాక్టర్, డాన్ చిత్రాల దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్కు నచ్చడంతో ఆయన పేరు ఖరారైంది. ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్ చేస్తానని సిబి చక్రవర్తి ఒక వేదికపై చాలా నమ్మకంగా చెప్పారు. అలాంటిది ఆ తరువాత ఆయన పేరు మారిన వారి లిస్ట్లో చేరిపోయింది. తాజాగా ఓమై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వద్ మారిముత్తు పేరు వినిపిస్తోంది. అంతే కాదు ఈయన ఫిక్స్ అనే. ప్రచారం జరుగుతోంది. ఇందులో దర్శకుడు మిష్కిన్ ఒక కీలక పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయాన్ని యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. కథ నచ్చే వరకు తమ అన్వేషణ కొనసాగుతుంది అని కమలహాసన్ ఇంతకుముందే పేర్కొన్నారు అన్నది గమనార్హం. అశ్వద్ మారిముత్తు, రజనీకాంత్ -
12న తెరపైకి మూండ్రామ్ కన్
తమిళసినిమా: విదార్థ్, కలైయరసన్, త్రిగుణ్, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మూండ్రామ్ కన్. ట్రెండింగ్ ఎంటర్టెయిన్మెంట్ అండ్ వైట్ హార్స్ స్టూడియోస్ సంస్థపై కే.శశికుమార్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా సహోగణేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తేజుఅశ్విని, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఇందులో జాన్విజయ్, కేపీవై శరత్ ముఖ్యపాత్రలు పోషించారు. రాజ్ ప్రతాప్ సంగీతాన్ని,ఉదయ్ కుమార్ చాయాగ్రహణం అందించారు. ఈనెల 12న చిత్రం తెరపైకి రానుంది. శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు చిత్రం గురించి తెలుపుతూ హైపర్ లింక్, ఆంథాలజీ నేపథ్యంలో రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. కథ చెప్పగానే నూతన దర్శకుడు అని ఆలోచించకుండా తనపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత శశికుమార్ కు ధన్యవాదాలు అన్నారు. చిత్ర నిర్మాత శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని, దీంతో వెంటనే నిర్మించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు సహోగణేశన్ ధన్యవాదాలు అన్నారు. -
తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శి
– బాధ్యతలు స్వీకరించిన శాంతి సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శిగా శాంతి నియమితులయ్యారు. ఆమె శనివారం తన బాధ్యతలను స్వీకరించారు.సీఎం విజయ్, అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. కె. శాంతి తమిళనాడు శాసనసభ సచివాలయంలో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ అధికారి. ఆమె నేరుగా ఐఏఎస్ కేడర్ అధికారి కాకపోయినప్పటికీ, అసెంబ్లీ సెక్రటేరియట్ సర్వీసెస్ ద్వారా పదోన్నతులు పొందుతూ ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అసెంబ్లీ నిబంధనలు, చట్టసభల పనితీరుపై ఉన్న పట్టు కారణంగా ఆమె మార్చి లో శాసనసభ ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్ రాజీనామాతో తమిళనాడు ప్రభుత్వం ఆమెను పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమించింది. ఆమె పదవీకాలం జూలైతో ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా, సభలో ఏవైనా రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చిక్కులు వచ్చినప్పుడు స్పీకర్కు తగిన సలహాలు ఇచ్చే మొదటి వ్యక్తి కార్యదర్శే. సభ నియమ నిబంధనల పుస్తకంపై వీరికి పూర్తి అథారిటీ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరగాలనే తేదీల అధికారిక నోటిఫికేషన్లను జారీ చేయడం. సభలో రోజూ ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ అంశాలపై చర్చ జరగాలనే అజెండా ముందుగానే సిద్ధం చేయడం , కొత్త చట్టాల రూపకల్పన ప్రక్రియలోలోపాలు లేకుండా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు. -
సంతానోత్పత్తే లక్ష్యంగా సముద్రంలోకి షార్క్స్
సాక్షి, చైన్నె: సముద్ర జీవుల సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే ఘట్టం శనివారం ఆవిష్కృత మైంది. చైన్నెలోని విజీపీ మైరెన్ కింగ్డమ్ తమ అక్వేరియంలో కృత్రిమ వాతావరణంలో పుట్టి పెరిగిన శ్రీబ్యాండెడ్ బాంబూ షార్క్క్ను రకం సొరచేపలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేసింది. సుస్థిర సముద్ర జీవవైవిధ్య సంరక్షణ , బాధ్యతాయుతమైన ఆక్వాకల్చర్ దిశగా ఈ ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎ. శ్రీనాథ్ సమక్షంలో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సముద్ర జీవశాస్త్రవేత్తలు, పర్యావరణ సంరక్షణ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాసీ్త్రయ అక్వేరియం నిర్వహణకు నిదర్శనం సముద్రంలోకి విడుదల చేసిన సొరచేపలు పూర్తిగా విజీపీ మైరెన్ కింగ్డమ్ సముద్ర జీవ నిపుణుల పర్యవేక్షణలో జన్మించి, పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ బ్యాండెడ్ బాంబూ షార్క్స్ను విజయవంతంగా సంతానోత్పత్తి చేసినట్లు విజీపీ మైరెన్ కింగ్డమ్ ప్రకటించింది. ఈసందర్భంగా మంత్రి ఎ. శ్రీనాథ్ మాట్లాడుతూ, ఈ వినూత్న కార్యక్రమం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే తరాలలో సముద్ర జీవుల సంరక్షణపై అవగాహన పెంచడం చాలా అవసరం అన్నారు. శాసీ్త్రయ పరిశోధనలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రయత్నాలు భారతదేశ సంపన్న సముద్ర వారసత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విజీపీ గ్రూప్స్ చైర్మన్ వి.జి. సంతోష్ మాట్లాడుతూ, విజీపీ కుటుంబంలో సీనియర్ సభ్యుడిగా, సమాజానికి, సముద్ర సంరక్షణకు ఉపయోగపడే ఇంతటి గొప్ప ప్రాజెక్ట్ను విజీపీ మైరెన్ కింగ్డమ్ విజయవంతం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదన్నారు. భావితరాలకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోవిజీపీ మైరెన్ కింగ్డమ్ ఎండీ వి.జి.పి. రవిదాస్, డైరెక్టర్ వి.జి.పి.ఆర్. ప్రేమ్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
మలేషియా సంస్థతో చైన్నెస్ అమృత ఒప్పందం
సాక్షి, చైన్నె: ప్రపంచవ్యాప్త ఉద్యోగ అవకాశాలను విస్తరించేందుకు నగరానికి చెందిన చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్(ఎంఏహెచ్)తో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు స్థానికంగా జరిగిన సమావేశంలో చైన్నెస్ అమృత ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ భూమినాథన్ , మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఐజాక్రాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ముందుగా చైన్నెకి చెందిన అమృత విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పండ్లు, కూరగాయల చెక్కడాలు, కళ్లకు గంతలు కట్టుకుని నాప్కిన్లను మడవడం, సృజనాత్మక టవల్ ఆర్ట్ ప్రదర్శనలతో తమ అసాధారణమైన ఆతిథ్య నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆర్. భూమినాథన్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ విద్యార్థులకు అంతర్జాతీయ కెరీర్ మార్గాలను మెరుగుపరిచే దిశగా మలేషియా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,100కు పైగా హోటళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మలేషియాలోని మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకోవటం తమ విద్యార్థులు అదృష్టమని అన్నారు. ఈ సహకారం కింద, మలేషియాలోని ఎంఏహెచ్ అనుబంధ హోటళ్లలో ఏటా 1,000 మందికి పైగా విద్యార్థులు ప్లేస్మెంట్ అవకాశాలతో ప్రయోజనం పొందుతారన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులకు అమూల్యమైన ప్రపంచవ్యాప్త అనుభవాన్ని, అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందగలరని పేర్కొన్నారు. చైన్నెస్ అమృత ఇప్పటికే 31,651 జాతీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ల అద్భుతమైన రికార్డుతో హాస్పిటాలిటీ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇందులో ఫ్యూచర్ డ్రీమ్ అకాడమీ సీఈఓ కలైయరసన్, చైన్నెస్ అమృత ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బానుమతి తదితరులు పాల్గొన్నారు. -
సోనీ ఖాతాలో టెక్సాస్ టైగర్ ఆడియో
తమిళసినిమా: యూకే స్క్వాడ్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం టెక్సాస్ టైగర్. ఫ్యామిలీ పడం చిత్రం ఫేమ్ సెల్వ కుమార్ తిరుమారన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో డ్యూడ్ చిత్రం ఫేమ్ హిరుదు హరూన్, సంయుక్త విశ్వనాథన్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు సెల్వకుమార్ తిరుమారన్ తెలుపుతూ ఎంటర్టెయిన్మెంట్, భావోద్రేకాలతో కూడిన సన్నివేశాలు, ఆసక్తికరమైన అంశాలతో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందని చెప్పారు. చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ పొందిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన ఈ మ్యూజిక్ సంస్థ తమ చిత్రం ఆడియో హక్కులను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఎంతో అంకితభావంతో శ్రమించిన చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి, ఆడియోకు ప్రపంచ ప్రేక్షకుల అందించే ఆదరణను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్ర ఆడియో, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. -
వివాహితపై అత్యాచారం కేసులో..
తిరువళ్లూరు: ఆలయ ఉత్సవానికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణమైన మహిళను బలవంతంగా లాక్కెళ్లి ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో పాటూ ఆమె వద్ద వున్న బంగారు నగలను లాక్కెళ్లారు. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్ పుష్ప శనివారం తీర్పును వెలువరించారు. వివరాలు.. దిండివనం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వయస్సు వున్న వివాహిత మహిళ తన భర్తతో కలిసి తిరువళ్లూరు జిల్లా పూందమల్లి అయ్యప్పన్తాంగెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 2022వ సంవత్సరంలో దిండివనంలో జరిగిన ఆలయ ఉత్సవానికి వెళ్లిన మహిళ కారులో తిరుగు ప్రయాణమైంది. పూందమల్లి సమీపంలోని తెల్లియర్ అగరం ప్రాంతానికి సమీపంలో వస్తున్న సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. అనంతరం కారు డ్రైవర్ ఇళంగోవన్పై దాడి చేసి కారులో వున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. కారు డ్రైవర్, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోరూర్ ఎస్ఆర్ఎం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు అయ్యప్పన్ తాంగెల్ ప్రాంతానికి చెందిన వేలు కుమారుడు సూర్య(22), చిన్నయ్య కుమారుడు కరుప్పయ్య(27), అయ్యపాక్కం ప్రాంతానికి చెందిన అన్బళగన్ కుమారుడు దినేష్(28) కారపాక్కం ప్రాంతానికి చెందిన సెందిల్కుమార్ కుమారుడు గణేష్(19), సుందర్ కుమారుడు సంతోష్కుమార్(22) సుధాకర్ కుమారుడు సుభాష్(19)గా గుర్తించి అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాధిత మహిళ షెడ్యూల్ కులానికి చెందినవారు కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. తాజాగా విచారణ పూర్తయిన క్రమంలో ఐదుగురు నిందితులకు జీవితఖైదు శిక్షతో పాటు ఒక్కోక్కరికి రూ.67 వేలు జరిమానాను జడ్జి విధించారు. మరో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ.27 వేలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం నిందితులను పుళల్ జైలుకు తరలించారు. బాధిత మహిళకు ఓ ఎయిడెడ్ పాఠశాలలో ఉద్యోగాన్ని కల్పించారు. -
స్థానిక సంస్థలకు 16 సూత్రాల మార్గదర్శకాలు
సాక్షి,చైన్నె : తమిళనాడు పట్టణ ప్రాంతాలలో, చైన్నె కార్పొరేషన్ పరిధిలో స్థానిక సంస్థల సేవలను మెరుగుపరచడానికి, నగర సుందరీకరణతో పాటుగా ఆదాయ వనరులను పెంచడానికి సీఎం సి. జోసెఫ్ విజయ్ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పురపాలక పరిపాలన, నీటి సరఫరా శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 16 సూత్రాల మార్గదర్శకాలు ● పారిశుధ్య పనులను, వీధుల శుభ్రతను పర్యవేక్షించడానికి కార్పొరేషన్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, , జోనల్ అధికారులు అందరూ ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయికి (ఫీల్డ్ విజిట్) చేరుకోవాలి. ● ప్రజల రాకపోకలు పెరగక ముందే తెల్లవారుజామునే వీధులను శుభ్రం చేయాలి. బహిరంగ మరుగుదొడ్లు నిరంతరం శుభ్రంగా, చెత్తాచెదారం లేకుండా ఉండేలా ఉన్నతాధికారులు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించాలి. ● నగరం సుందరీకరణను పాడుచేసేలా బహిరంగ గోడలపై ఇష్టానుసారంగా పోస్టర్లు అతికించడాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే ప్రకటనలు ప్రదర్శించాలి. ● నగరంలోని వీధి దీపాలను వారానికి ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఎక్కడైనా దీపాలు వెలగకపోతే లేదా పాడైపోతే సమాచారం అంది న 24 గంటలలోపు వాటిని మరమ్మత్తు చేయాలి. ● చైన్నెలోని సుమారు 3.11 లక్షల వీధి కూడళ్ల పరిధిలో ప్రతిరోజూ సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థలను తనిఖీ చేసి, 99.2 శాతం ప్రాంతాలను తక్షణమే క్రిమిరహితం చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ● స్థానిక సంస్థల ఆర్థిక వనరులను బలోపేతం చేయడానికి ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, నీటి పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ప్రజ్ఞానందకు అభినందనలు నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో టైటిల్ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించిన యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందకు సీఎం సి. జోసెఫ్ విజయ్ అభినందనలు తెలిపారు. ఒకే టోర్నమెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను రెండుసార్లు ఓడించడమే కాకుండా, వరుసగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి ప్రజ్ఞానంద అద్భుతమైన రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. -
ప్రైవేట్ ఆమ్నీ బస్సులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చైన్నె: చైన్నె నగరం నుండి నడిచే ప్రైవేట్ ఆమ్ని (ట్రావెల్స్) బస్సులు కచ్చితంగా కిలాంబాక్కం బస్టాండ్ నుండే నడపాలని, నగరంలోకి ప్రవేశించకూడదని రాష్ట్ర రవాణా శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చైన్నె హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. వివరాలు.. చైన్నె నుండి దక్షిణ జిల్లాలకు వెళ్లే అన్ని ప్రైవేట్ ఆమ్ని బస్సులు కిలాంబాక్కం బస్ టెర్మినల్ నుండే కార్యకలాపాలు సాగించాలని, నగర పరిధిలోకి రాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని 2024 జనవరి 22న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఆమ్ని బస్సు యజమానుల సంఘం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు.. పోరూర్, సూరపట్టు ప్రాంతాలలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దించడానికి బస్సులకు అనుమతినిస్తూనే, దక్షిణ జిల్లాలకు వెళ్లే బస్సులు కిలాంబాక్కం బస్టాండ్ లోపలికి వెళ్లి రావాలని తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తుది తీర్పుతో ఊరట ఈ కేసుపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెంచ్ శనివారం తీర్పును వెలువరించారు. తమిళనాడు మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఒక బస్ టెర్మినల్ ఏర్పాటుకు రవాణా శాఖ అనుమతి కోరుతూ చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దరఖాస్తు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేవలం సంబంధిత స్థానిక సంస్థ మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఈదృష్ట్యా కిలాంబాక్కం బస్టాండ్ అనుమతి కోసం కాటాన్ కొళత్తూరు పంచాయతీ యూనియన్ రాష్ట్ర రవాణా కమిషనరేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. ఒక నిర్దిష్ట రూట్లో బస్సును నడపడానికి రూట్ లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత, దానిని అడ్డుకునే హక్కు రవాణా శాఖకు లేదని స్పష్టంచేశారు. ఆమ్ని బస్సులు కిలాంబాక్కం నుండే నడపాలన్న రవాణా శాఖ ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే జనవరిలో రవాణా శాఖ అధికారులు, ఓమ్ని బస్సు యజమానుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కోర్టు ప్రస్తావించింది. పోరూర్ టోల్గేట్, సూరపేడు ప్రాంతాల తరహాలోనే.. మాధవరం రౌండానా సమీపంలోని ప్రాంతాన్ని కూడా ప్రయాణికులను ఎక్కించడానికి, దించడానికి ఉపయోగించుకోవాలని, ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని రవాణా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఆమ్నీ బస్సులు -
వేదికపై నటుడు సత్యరాజ్ ఉద్వేగం
సాక్షి, చైన్నె: డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న ప్రముఖ నటుడు సత్యరాజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, ప్రత్యర్థులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను సాధారణంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడతానని, ప్రతిదానిని హాస్యంగా తీసుకోలేనని, కొందరు తనను ఇన్స్ట్రాగామ్లో రకరకాలుగా తిడుతున్నారని వివరించారు. అయితే తాను వాటి గురించి అస్సలు చింతించనని పేర్కొన్నారు. నటుడు విజయ్ స్థాపించిన పార్టీని ఉద్దేశిస్తూ.. ‘కేవలం పేర్లు మార్చితే సరిపోదు, ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చిందన్నారు. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు అంటూ మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవశ్యం ఉందన్నారు.. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలని సూచించారు. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారని, ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారన్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. కొలత్తూరు యోజకవర్గంలో ఎం.కె. స్టాలిన్ గెలవలేదంటూ వస్తున్న విమర్శలపై సత్యరాజ్ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరు బాలికలకు లైంగిక వేధింపులు – తల్లి రెండో భర్త అరెస్ట్ తిరువొత్తియూరు: సేలం సమీపంలోని అయోధ్యపట్నంకు చెందిన మహిళ (38) తన మొదటి భర్త నుండి విడిపోయి, తన 17 ఏళ్ల, 15 ఏళ్ల కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, ఆమె రమేష్ (36) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా, రమేష్ తన ఇద్దరు సవతి కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులను భరించలేక, ఆ బాలికలు శుక్రవారం అమ్మపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పంకజం నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు, రమేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
ఉద్యమానికి అనూహ్య మద్దతు
సాక్షి, చైన్నె : తమిళనాట భారతీయ జనతా పార్టీలో కలవరం మొదలైంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా ఆ వర్గాలు కదులుతున్నాయి. ఆయన స్థాపించిన వీ ది లీడర్స్ ఉద్యమంలోకి ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా చేరారు. ఇక కోయంబత్తూరు రీజియన్లో ఆయనకు మద్దతుగా వీజేపీ కీలక జిల్లా నేతలు పెద్దఎత్తున పార్టీని వీడారు. వీరంతా అన్నామలై ఉద్యమం వైపు అడుగులు వేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై వీ ది లీడర్స్ రాజకీయ ఉద్యమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా సంబంధిత వెబ్ సైట్లో చేరికలు క్రమంగా పెరిగాయి. ఆయన పిలుపు మేరకు ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా ఉద్యమంలో చేరారు. ఇది బీజేపీ బి–టీమ్ కాదు అన్నామలై తీవ్ర మద్దతుదారుడు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఉత్తమ రామసామి మీడియాతో మాట్లాడుతూ.. తామంతా అన్నామలై ప్రారంభించిన వీ ద లీడర్స్ అనే నూతన సంస్థలో సభ్యులుగా చేరామని, ఇది బీజేపీకి బి–టీమ్ మాత్రం కాదన్నారు. రాబోయే ఉపఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారని ప్రకటించారు. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో కేవలం విజయ్ , అన్నామలై మధ్య మాత్రమే పోటీ అంటూ, వీరిద్దరే ప్రధాన శక్తులుగా బరిలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కోవై దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాటుగా మరో 14 మంది జిల్లాల నేతలు పార్టీని వీడారు. వందలాది మంది కార్యకర్తలు కూడా అన్నామలై బాటలోనే నడిచారు. గత లోక్సభ ఎన్నికల్లో పొల్లాచ్చి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు కె. వసంతరాజన్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కాగా, అన్నామలై అడ్డగా మారిన కొంగునాడు ప్రాంతంలో ఒకేసారి పెద్ద ఎత్తున కీలక నేతలు పార్టీని వీడటం తమిళనాడు బీజేపీలో తీవ్ర కలకలం రేపింది. బీజేపీకి తిరిగి రండి : నైనార్ నాగేంద్రన్ బీజేపీ నుంచి అన్నామలై ఉద్యమంలోకి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు కదులుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్లో చైన్నె పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కేడర్ను రక్షించుకునే దిశగా వ్యూహా రచనలో పడ్డారు. అనంతరం నైనార్ మీడియాతో మాట్లాడుతూ,. తెలిసి తెలియక పార్టీ వీడిన వారు ఎప్పుడైనా సరే తిరిగి రావచ్చు అని, వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమన్నారు. అన్నామలైతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. వీ ద లీడర్స్ అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమేనని, ప్రధాని మోదీ ఆశీస్సులు తమకున్నాయని ఆ ఉద్యమ నేతలు పేర్కొంటుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ లేదా అమిత్ షాల ఆశీస్సులు ఏ ఇతర ఉద్యమానికి లేవు అని స్పష్టం చేశారు. ఆ ఉద్యమంలో ఉంటూనే బీజేపీలోనూ కొనసాగవచ్చని కొందరు చెబుతున్నారని, అది సాధ్యం కాదని, బీజేపీ సిద్ధాంతాలు, దేశభక్తి పునాదులపై నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎక్కడికీ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా పాల్గొన్న ప్రతి వేదికపైనా అన్నామలై ముందుండి కార్యక్రమాలను నడిపారని, అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ పార్టీతో ఏవైనా విభేదాలు ఉంటే ఆయన అప్పుడే చెప్పి ఉండాల్సిందని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ వీడిన కొందరు నేతలు మళ్లీ బీజేపీ గూటికే చేరడం చరిత్రలో చూశామని, తాజాగా తెలిసి తెలియక వెళ్లిన వారంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్నానని,. వారిపై ఎలాంటి చర్యలు ఉండవని బీజేపీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నామలై వైపుగా బీజేపీ నేతల అడుగులు -
అగ్నిప్రమాదాల్లో జాగ్రత్తలపై అవగాహన
తిరుత్తణి: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా తిరుత్తణిలో శనివారం మాక్డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ద్వారా అగ్ని ప్రమాదాలు పట్ల ప్రజలకు అవగహన కల్పించే విధంగా రండి నేర్చకుందాం నినాదంతో రెండు రోజుల పాటూ అగ్రిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవాప్తంగా అగ్ని ప్రమాద శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణిలోని అగ్ని ప్రమాద శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాద అధికారి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన మాక్డ్రిల్ శిబిరంలో పట్టణ ప్రజలతో పాటూ కార్మికులు, విద్యార్ధులు పాల్గొన్నారు. -
చైన్నెలో 570 ఎలక్ట్రిక్ మినీ ఏసీ బస్సులు
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి మహానగర రవాణా సంస్థ ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు పెద్ద బస్సులు వెళ్లలేని ఇరుకై న రోడ్లు, రద్దీ ప్రాంతాలు , శివారు ప్రాంతాలు, మెట్రో రైలు, సబర్బన్ ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్లతో అనుసంధానించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 570 ఎలక్ట్రిక్ మినీ ఏసీ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటికే 300 బస్సులు సిద్ధమై వినియోగంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ లో–ఫ్లోర్ ఏసీ బస్సులు. ఇందులో 13 సీట్లు ఉంటాయి, మరో 10 మంది నిలబడేందుకు వీలుంది. ఈ బస్సుల్లో కండక్టర్ ఉండరు, కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారు. ప్రయాణికులు టిక్కెట్లను చైన్నె రవాణా యాప్ , స్మార్ట్ కార్డ్లు, లేదా నగదు ద్వారా డ్రైవర్ వద్దే చెల్లించి ప్రయాణించవచ్చు. ప్రతి 15 నిమిషాలకు ఒక మినీ బస్సు నడిచేలా టైమ్ టేబుల్ రూపొందించారు. ఈ సేవలు త్వరలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
భక్తులతో అన్నామలైయార్ కిటకిట
వేలూరు: తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు దీరారు. పాఠశాల, కళాశాలలకు వేసవి సెలవులు ఇతర రాష్ట్రాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణలు చేసి మహాదీపారాధన పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. క్యూలు భక్తులు నిండి పోవడంతో ఆలయంలో ఎటుచూసినా భక్తులతోనే కనిపించింది. సామాన్య దర్శనంలో రాజగోపురం, అమ్మనియమ్మన్ ఆలయం దారిలో భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తుల దర్శన సౌకర్యాలను ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, ఆలయ అధికారులు పరిశీలించారు. -
విజయవంతంగా రోబోటిక్ హార్ట్ సర్జరీ
సాక్షి, చైన్నె: వైద్య సంరక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా, సరిహద్దులతో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించే రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ టెలిసర్జరీ (రోబోట్ సహాయంతో సుదూర ప్రాంతం నుండి చేసే గుండె ఆపరేషన్)ను వైద్యులు విజయవంతం చేశారు. పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా కేవలం 4 గంటల 50 నిమిషాలలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా ముగించారు. రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానా రాజధాని జార్జ్టౌన్లోని పబ్లిక్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐ మంత్రాసన టెలి–సర్జన్ కన్సోల్’ (కూర్చుని ఆపరేట్ చేసే కమాండ్ సిస్టమ్)లో కూర్చుని శస్త్రచికిత్సను విజయవంతం చేశారని శనివారం స్థానికంగా ఆ సంస్థ వివరాలను ప్రకటించింది. అలాగే, గయానా నుండి డాక్టర్ సుధీర్ తన చేతులతో చేసిన కదలికలను ఇండోర్లోని రోబోటిక్ చేతులు అత్యంత ఖచ్చితత్వంతో అనుకరిస్తూ రోగికి గుండె ఆపరేషన్ చేశాయని వివరించారు. ఈ శస్త్రచికిత్సకు మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రామ్ శుక్లా, ఐఆర్సీఏడీ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీ నేతృత్వంలోని బృందం సాయం చేసినట్టు పేర్కొన్నారు. -
మన దయాదాక్షిణ్యాల వల్లే..!
సాక్షి, చైన్నె: ‘‘మన కూటమిలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాల వల్లే తమిళనాడులో తాజాగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నడుస్తోంది’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని డీఎంకే ప్రదాన కార్యాలయం అన్నా అరివాలయం జరిగిన రాజకీయ కార్యక్రమంలో.. చెంగల్పట్టు అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, కాటాంకొళత్తూర్ నార్త్ యూనియన్ సెక్రటరీ గజేంద్రన్ నేతృత్వంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు డిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా ఒక పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లేటప్పుడు.. ఏదో ఒక లాభాన్ని, సదుపాయాలను ఆశించి అధికార పార్టీ వైపు వెళ్తుంటారన్నారు. అయితే తాజాగా డీఎంకే అధికారంలో లేదని, . అధికార పీఠం కోల్పోయి ప్రతిపక్ష స్థానంలో ఉందన్నారు. ఈ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలోకి వచ్చారంటే పదవుల కోసం కాకుండా , ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, తమిళ సమాజం కోసం పని చేయాలనే పట్టుదలతో రావడం ఆనందంగా ఉందన్నారు. ఓటమితో కుంగిపోం రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అవి మారుతూ ఉంటాయన్నారు.. గెలిచినప్పుడు విరవ్రీగడం, ఓడినప్పుడు కుంగిపోవడం డీఎంకే డిక్షనరీలోనే లేదున్నారు. అధికారం కోల్పోయినా సరే.. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేవాడే నిజమైన డీఎంకే కార్యకర్త అని ధీమా వ్యక్తం చేశారు. మన అనుమతితోనే వారు వెళ్లారు.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నదే మన దయ వల్ల అనే విషయాన్ని ఎవ్వరూ మరచిపోకూడదన్నారు. డీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగామన్నారు. అయితే, కూటమిలో ఉండి, ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆయా పార్టీల నేతలే స్వయంగా ఒక విషయం చెప్పారన్నారు. తాము వెళ్లేటప్పుడు డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్కు చెప్పే వచ్చామని వారు బహిరంగంగానే పేర్కొనడాన్ని గమనించాలన్నారు. ఆ పార్టీల నేతలు తనను కలిసి వారి నిర్ణయాన్ని చెప్పినప్పుడు.. తాను మీ ఇష్టం, అది మీ ప్రజాస్వామ్య హక్కు, నేను అడ్డుకోను.. అని చెప్పి పంపానని వివరించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకూడదు, దాని ద్వారా బీజేపీ ఇక్కడ అధికారం చలాయించకూడదనే ఉద్దేశంతోనే తాను వారిని పంపానని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, మన దయతో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే ముగింపు పలకాలని ఈ వేదికగా శపథం చేద్దామని పిలుపు నిచ్చారు. -
కేవీబీ నెట్ వర్క్ విస్తరణ
సాక్షి, చైన్నె: కరూర్ వైశ్యా బ్యాంక్ తమిళనాడులో తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తూ చైన్నెలోని విల్లివాక్కంలో సరికొత్త శాఖను ప్రారంభించింది.దేశవ్యాప్తంగా కరూర్ వైశ్యా బ్యాంకుకు ఇది 903వ బ్రాంచ్ కావడం విశేషం. తమిళనాడు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ డాక్టర్ ఎం.ఎస్. షణ్ముగంఈ కొత్త శాఖను ప్రారంభించారు. కేఆర్ఎమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ట్రస్టీ డాక్టర్ వసంత గౌరి సాంప్రదాయబద్ధంగా గాయత్రీ జ్యోతిని వెలిగించారు. బ్యాంక్ ఎండీ రమేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తర చైన్నె పరిధిలోని నివాస ప్రాంతమైన విల్లివాక్కం ప్రజలకు, వ్యాపారులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే ఈ బ్రాంచ్ లక్ష్యంగా వివరివంచారు.స్థానిక నివాసితులు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలు, వర్తకులకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, ట్రేడ్ ఫైనాన్స్, డిజిటల్ పేమెంట్ టూల్స్ అందించడానికి కేవీబీ కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్తో కూడిన సమగ్ర డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
అందులోనే నిజమైన ఆనందం
తమిళసినిమా: మానవ సేవే మాధవ సేవ అంటారు. దీన్ని ఎంత మంది పాటిస్తారో తెలియదు కానీ మానవత్వం ఉన్న ప్రతిమనిషి చేతనైనా సాయం చేస్తుంటారు. అలాంటి సేవా భావం గురించి, అందులో కలిగే ఆనందం గురించి మృణాల్ఠాకూర్ ఇప్పుడే తెలుసుకున్నారట. ఈ ఉత్తరాది భామ బాలీవుడ్లో కంటే దక్షిణాదిలోనే నేమ్, ఫేమ్ తెచ్చుకున్నారు అని చెప్పవచ్చు. సీతారామం అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఆ ఒక్క చిత్రంతోనే కావలసిన దానికంటే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆ తరువాత నటించిన హాయ్నాన్నా వంటి చిత్రాలు మృణాల్ఠాకూర్ కెరీర్కు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ భామను కోలీవుడ్ ఎంట్రీకి ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. వాస్తవానికి ఇంతకుముందే శివకార్తికేయన్తో జత కట్టే అవకాశం వరించింది. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయారు. తాజాగా ధనుష్ చిత్రంతో దిగుమతి అవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక కార్యక్రమంలో జీవితంలో నిజమైన ఆనందం గురించి పేర్కొంటూ నేను ఇప్పటివరకు ఏదేదో ఆనందాన్ని ఇస్తుంది అని అనుకున్నాను.అయితే ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడంలోనే అసలైన సంతోషం కలుగుతుంది అని తెలుసుకున్నాను. పెద్ద మొత్తంలో కాకపోయినా ఉన్నదానితో కొంత లేనివారికి సాయం చేయాలి. కర్మపై నాకు చాలా నమ్మకం ఉంది. అయితే చేసిన సాయానికి ప్రతిఫలం ఉంటుందా అన్నదాని గురించి ఎదురు చూడను. అయితే చేసిన సాయం వల్ల ఎవరైనా సంతోష పెడితే చాలు అని మృణాల్ఠాకూర్ అన్నారు. మృణాల్ఠాగూర్ -
టార్గెట్.. సెంథిల్ బాలాజీ
సాక్షి, చైన్నె : రవాణా శాఖలో ఉద్యోగాల స్కాం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మా జీ మంత్రి సెంథిల్ బాలాజీపై తదుపరి దర్యాప్తు జరిపేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమ తి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్.వి. అర్లేకర్కు అధికారికంగా ఫైలును సమర్పించి ఉండటం శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 2011 నుండి 2016 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో డ్రైవర్, కండక్టర్, ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కోట్ల రూపాయల లంచాలు తీసుకుని మోసం చేశారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఆ తదుపరి ఆయన డీఎంకేలో చేరడం, మంత్రి కావడం జరిగాయి. ఈ కేసులో 2023 జూన్లో ఈడీ ఆయనను అరెస్ట్ చేయగా, సుదీర్ఘ జైలు శిక్ష తర్వాత 2024 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో మంత్రి పదవిని సైతం కోల్పోయారు. ప్రభుత్వ అనుమతి.. సెంథిల్ బాలాజీ ఆరోపణల సమయంలో మంత్రిగా ఉన్నందున, పీఎంఎల్ఏ చట్టం కింద విచారణను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరమని గత డీఎంకే ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో, ఈడీ అధికారులు పిటిషన్ కాపీలు, రహస్య పత్రాలు , పెన్ డ్రైవ్ ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించడం గమనార్హం. సీఎం విజయ్ ఆమోదం – గవర్నర్కు ఫైల్ ఈ కేసును పునః దర్యాప్తు చేయడానికి కొత్త సీఎం సి. జోసెఫ్ విజయ్ ఇప్పటికే తన ఆమోదాన్ని తెలపడంతో, దర్యాప్తు అనుమతికి సంబంధించిన ఫైలును లోక్ భవన్కు పంపించి ఉండటం శనివారం వెలుగులోకి వచ్చింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మంత్రులు, మాజీ మంత్రులపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం చట్టరీత్యా గవర్నర్కు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని, ఆయన సంతకం చేసిన వెంటనే అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కానున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. -
అన్నామలై.. మరో టాలెంట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై సరికొత్త రాజకీయయాత్ర అరంభించారు. మారుదాం.. మార్చుదాం ఉద్యమ నినాదంతో ఇకపై కొత్త పథంలో ముందుకు సాగుతానని ఆయన శుక్రవారం ప్రకటించారు. తనతో పాటు కలిసి ప్రయాణించేందుకు రావాలని తమిళ ప్రజలను ఆహ్వనించారు. ఇందుకోసం విత్ ద లీడర్ పేరుతో వైబ్సైట్ కూడా ప్రారంభించారు. ఇదిలావుంచితే అన్నామలైకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.రాజకీయాల్లోకి రాకముందు అన్నామలై ఒక కన్నడ సినిమాలో నటించిన సంగతి వెల్లడైంది. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన రోజుల్లో "కర్ణాటక సింగం"గా గుర్తింపు పొందిన ఆయన వెండి తెరపైనా సందడి చేశారు. స్ఫూర్తిదాయక క్రీడా శిక్షకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అన్నామలై సరికొత్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.రూ.1కే నటించిన అన్నామలైభారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘అరబ్బీ’లో అన్నామలై స్విమ్మింగ్ కోచ్ పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం ఆయన కేవలం ఒక రూపాయి మాత్రమే పారితోషికం తీసుకోవడం విశేషం. ఈ సినిమా దర్శకుడు రాజ్కుమార్.. మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనామలైను కలిసినప్పుడు ఈ పాత్ర గురించి చెప్పారు. కథ నచ్చడంతో ఆయన తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు.ఒకటిన్నర రోజులో షూటింగ్ ఒక పాటతో పాటు అన్నామలైకు సంబంధించిన అన్ని సన్నివేశాలను కేవలం ఒకటిన్నర రోజులో చిత్రీకరించారు. మొట్ట మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినా చిత్రబృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ పూర్తి చేశారాయన. అనువజ్ఞులైన నటులకు ఏమాత్రం తీసిపోకుండా ఆయన వెండితెరపై నటన కనబరిచి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. స్విమ్మింగ్ కోచ్ పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. సినిమాలోని ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రజలకు స్ఫూర్తినిచ్చే కథను విస్తృతంగా చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘అరబ్బీ’ సినిమాలో నటించారని అన్నామలై సన్నిహితులు పేర్కొన్నారు. మొదటి నుంచి ఆయనకు సామాజిక అంశాల పట్ల అవగాహన ఉందని గుర్తు చేసుకుంటున్నారు.స్ఫూర్తి గాథభారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవితకథ ఆధారంగా ‘అరబ్బీ’ సినిమా తీశారు. ఇందులో విశ్వాస్ తన పాత్రను తానే పోషించడం విశేషం. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులతో పాటు తండ్రిని కోల్పోయిన ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని పారా స్విమ్మర్గా ఎదిగారు. 2016లో అంతర్జాతీయ స్థాయికి చేరుకుని, భారత్ తరఫున కాన్-యామ్ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించారు. కుంగ్ఫూ, నృత్యంలోనూ ఆయన ప్రవేశం ఉంది. ‘అరబ్బీ’ చిత్రం కేవలం బయోపిక్ కాదని, తన జీవిత ప్రయాణాన్ని నిజాయితీగా ఆవిష్కరించిన కథ అని విశ్వాస్ పేర్కొన్నారు. తనలా కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి: ప్రజావేదిక ప్రారంభించిన రజనీకాంత్ భార్య -
అలా చేయకపోతే.. అదే జరిగేది: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. -
10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత!
సాక్షి, చైన్నె : రాధాపురం ఎన్నికల కేసులో హైకోర్టు పదేళ్లకు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై విజయం చెల్లదని బుధవారం ప్రకటించింది. రీకౌంటింగ్ అనంతరం అక్కడ డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం సాధించినట్టు తీర్పు వెలువరించారు. వివరాలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ఇన్బ బదురై, డీఎంకే తరఫున అప్పావు పోటీ చేశారు. అప్పట్లో కేవలం 104 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బబదురై గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ అప్పావు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై 6 నెలల్లోపు తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో సుదీర్ఘ కాలయాపన జరిగింది. ఎట్టకేలకు వివాదాస్పద పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించగా.. అప్పావు ఆధిక్యం సాధించినట్లు తేలింది. దీంతో హైకోర్టు ఇన్బదురై విజయాన్ని తాజాగా రద్దు చేస్తూ, అప్పావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.మాజీ ఎమ్మెల్యే హోదా, జీతభత్యాలు రద్దుపదవీకాలం (2016–2021) ముగిసిపోయిన తర్వా త ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఇన్బదురైకు షాక్ తప్ప లేదు. 2016 నుండి 2021 వరకు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఇన్బదురై పొందిన జీతం, రోజువారీ భత్యా లు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా జీవితాంతం వచ్చే మాజీ ఎమ్మెల్యే పెన్షన్, ఉచిత వైద్య బీమా సదుపాయాలు పూర్తిగా రద్దవుతాయి. 2016–2021 కాలంలో రాధాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ, అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడెక్కడైతే అన్బదురై పేరు ఉందో.. వాటన్నింటినీ తొలగించి ‘అప్పావు’ పేరు పొందు పరిచే విధంగా హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇన్బదురై ప్రస్తుతం అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ఆలస్యమైనా న్యాయం గెలిచిందితీర్పు రావడంలో చాలా కాలయాపన జరిగినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ స్పీకర్ అప్పావు సంతోషం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 135 సీట్లతో అధికారాన్ని దక్కించుకోగా, డీఎంకే ఈ ఒక్క స్థానాన్ని కోల్పోవడంతో అప్పట్లో 89 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. -
ఓటమి గుణపాఠం.. స్టాలిన్ సంచలన నిర్ణయం
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన డీఎంకే పార్టీలో అంతర్గత పునర్వ్యవస్థీకరణకు కసరత్తులు చేపట్టింది. పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను ఫలితాలు డీలా పడేలా చేశాయి. తాను సైతం కొళత్తూరులో ఓడినా, ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే నిలవడం కాస్త ఊరటగా మారింది. దీంతో స్టాలిన్ పార్టీలో సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.30 మంది సభ్యుల కమిటీ విచారణనియోజకవర్గాల వారీగా ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి డీఎంకే అధినాయకత్వం 30 మంది సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే, పార్టీ వలంటీర్లు, సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవడానికి ‘ఉడన్ పెరప్పే’ అనే ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదికను జూన్ 10వ తేదీలోగా పార్టీ అధ్యక్షుడికి సమర్పించాల్సి ఉంది.జిల్లా కమిటీల విభజనపార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న 78 జిల్లాల కార్యదర్శుల సంఖ్యను 115కు పెంచనున్నారు. తద్వారా నియోజకవర్గాల వారీగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నారు. యువజనులకు అత్యధికంగా జిల్లాల కార్యదర్శుల పదవులు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతలలో కె.ఎన్. నెహ్రూ, వేలు మాత్రం ప్రస్తుతానికి తమ పదవుల్లోనే కొనసాగుతారని సమాచారం.యువతకు చాన్స్ఎన్నికల నివేదికల ఆధారంగా జూన్ 10 తర్వాత డీఎంకే బైలాస్ (రాజ్యాంగం)ను సవరించి భారీ మార్పులు చేయనున్నారు. పార్టీలో సుదీర్ఘకాలంగా సీనియర్ నాయకుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్న దురైమురుగన్న్ను ఆ పదవి నుంచి తప్పించాలని ఎం.కె. స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. వయసు పైబడడంతో ఆయన్ను తప్పించి యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనను కేవలం ఒక ఉప–కార్యదర్శి పదవికి పరిమితం చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మరి కొందరు సీనియర్లను తప్పించనున్నట్టు తెలిసింది. దీంతో, తమిళనాడులో డీఎంకే రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
తమిళ రాజకీయం.. లతా రజినీకాంత్ ‘మక్కల్ మేడై’ ప్రారంభం
సాక్షి, చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ సతీమణి, సామాజిక కార్యకర్త లతా రజనీకాంత్ సరికొత్త పంథాలో ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. ‘తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు– అభివృద్ధి కోసం’ నినాదంతో ‘మక్కల్ మేడై’(ప్రజా వేదిక) పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని, సంఘాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సందేశంలో ఈ వేదిక లక్ష్యాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు.తమిళనాడు రాష్ట్రంపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరూ, సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న వారు ఈ వేదికపైకి రావాలని లతా రజనీకాంత్ పిలుపునిచ్చారు. తమ ‘మక్కల్ మేడై’ ఉద్యమంలో సామాన్యులంతా భాగస్వాములు కావచ్చన్నారు. మంచి ఆలోచనలు, దేశం కోసం శ్రమించే గుణం ఉన్న ఎవరైనా తమను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. సమాజంలో విభిన్న రంగాల్లో రాణించిన, అనుభవజ్ఞులైన సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు విలువైన అనుభవాలను, సలహాలను అందించాలని ఆమె కోరారు.తమిళనాడు శ్రేయస్సు కోసం, సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పని చేయవచ్చని సూచించారు. రాష్ట్రం కోసం అంకితభావంతో పనిచేసే సమర్థులైన స్థానిక నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో లతా రజనీకాంత్ స్థాపించిన ఈ సరికొత్త సామాజిక వేదిక ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లోనే లత ఈ వేదికను ప్రకటించడం గమనార్హం. అంతకుముందు, రజనీకాంత్తో అన్నామలై సమావేశమవడం కూడా తమిళనాట ఆసక్తికరంగా మారింది. -
మారుదాం... మార్చుదాం..!
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై శుక్రవారం తన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. ‘మారుదాం... మార్చుదాం’అనే నినాదంతో ఇకపై నూతన రాజకీయయాత్రను ఆరంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. బీజేపీ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం ఒప్పుకుందని, తన రాజీనామాను బీజేపీ అగ్రనాయకత్వం శుక్రవారం అంగీకరించిందని అన్నామలై వెల్లడించారు. తన రాజీనామా, కొత్త రాజకీయ ఉద్యమాల వివరాలను ఫేస్బుక్ లైవ్స్ట్రీమింగ్ ద్వారా అన్నామలై వెల్లడించారు. ‘‘నా మార్గం వేరు. నా లక్ష్యాలు చాలా పెద్దవి. రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, సమున్నతమైన మార్పును తీసుకురావాలన్నదే నా ఆశయం. రాష్ట్రంలో కొత్త రాజకీయ ఉద్యమం అత్యావశ్యకమైంది. ఇది పేరుకు సంబంధించినది కాదు ఒక ఆలోచనకు సంబంధించినది. మనల్ని మనం ముందుకుగా మార్చుకుందాం. తర్వాత సమాజంలో మార్పు దానంతట అదే వస్తుంది. మన ఉద్యమానికి పునాది మనం మారుదాం. అంతా మార్చేద్దాం. ఫక్తు రాజకీయాలను మనం తుదముట్టిద్దాం. సామాన్యుడి రాజకీయాలు చేద్దాం. ప్రజావసరాలే మనకు పరమావధిగా ఉండాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలతో మనకు పోటీలేదు. ఎవరితోనూ పోటీపడేందుకు మనం లేం. అధికార పార్టీని, విపక్షాలను వాళ్ల రాజకీయాలు వాళ్లను చేసుకోనిద్దాం. మన సమయం వచ్చినప్పుడు మనం రాజకీయాలు చేద్దాం. మొదట రాజకీయ ఉద్యమాన్ని మొదలెడదాం. ఇందులో ఆసక్తి ఉన్నవాళ్లు wetheleader. org పోర్టల్ ద్వారా వలంటీర్లుగా సభ్యత్వం తీసుకోండి. మీకు రాజకీయాలు నేరి్పస్తా. త్వరలో కోయంబత్తూర్లో ఏపీజే అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంస్థను ఆరంభించి శిక్షణనిస్తా. నేటి నుంచి కొత్త పథం. కొత్త ఉద్యమం. కొత్త రాజకీయపోరాటం’’అని వ్యాఖ్యానించారు. wetheleader. org పోర్టల్కు అనూహ్య స్పందన మొదలైంది. గంటల వ్యవధిలోనే 10లక్షలకుపైగా సభ్యత్వం తీసుకోవడం విశేషం. మనకు అన్ని పార్టీలూ ఒక్కటే.. ‘‘వ్యతిరేకించడం మన రాజకీయ వైఖరి కాదు. డీఎంకే, అన్నాడీఎంకే, ఎన్టీకే, సీమన్, పీఎంకే నేత అన్బుమణి, టీఎంసీ మూపనార్ జీకే వాసన్, ఏసీ షణ్ముగం, పారివేంద్రన్, జాన్ పాండియన్, కృష్ణస్వామి, వైగో, ప్రేమలతలను ఎలాగైతే ఇప్పుడు వ్యతిరేకిస్తానో ఇకపై బీజేపీనీ అలాగే వ్యతిరేకిస్తా. పార్టీని వీడేటప్పుడు తమిళనాడు పద్ధతి ప్రకారం గౌరవప్రదంగా కలిసి వివరించి బీజేపీ నుంచి ని్రష్కమించా. కేంద్ర మంత్రి అమిత్ షా సహా అగ్రనేతలను కలిసి పార్టీ వీడుతున్నట్లు స్పష్టంగా చెప్పా. 18 నెలల క్రితమే 2024 డిసెంబర్ 4న పార్టీకి తొలిసారి వివరించా. వద్దు అని వారించారు. మే చివరిదాకా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని నన్ను ఆపేశారు. తమిళునిగా కొనసాగుతూ బీజేపీ నేతగా ఉండటం కష్టమైన పని’’అని అన్నారు. ఉక్కు వ్యవస్థను తీసుకొస్తా ‘‘పార్టీని పటిష్టమైన ఉక్కులాంటి వ్యవస్థను తీర్చిదిద్దుతా. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం మొదలు 30,000 స్థానిక సంస్థల్లోని ప్రతినిధుల దాకా ప్రతి ఒక్కరికీ పదవీకాలంపై పరిమితి విధిస్తా. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిసార్లు పోటీచేయొచ్చనే దానిపై పరిమితి తీసుకొస్తా. ఉద్యమం విజయవంతమయ్యాక రాజకీయ పార్టీగా మారి రాజకీయ ప్రస్థానం ఆరంభిస్తా. అధికార కుర్చీ ఎవరికీ శాశ్వతంకాదు. చివరకు నాక్కూడా. భారతీయునిగా కొనసాగుతూ తమిళుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తా. నా అభిమానులు, వారియర్లు ఆన్లైన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లే పనులు పెట్టుకోకండి. హద్దు మీరు వివాదాస్పద వ్యాఖ్యలు ఆన్లైన్లో చేయకండి’’అని అన్నామలై తన మద్దతుదారులకు సూచించారు. మాకు ఎలాంటి నష్టంలేదు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నామలై ని్రష్కమణతో పార్టీకి ఎలాంటి నష్టంలేదని బీజేపీ తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ అన్నారు. ‘‘ఆయన రాజీనామాచేసినా పార్టీకి ఎలాంటి నష్టంలేదు. బీజేపీ ఏ విధంగానూ ఇబ్బందిపడబోదు. బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ. సిద్ధాంతంపరంగా పార్టీ దృఢంగా ముందుకుసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు’’అని అన్నారు. బీజేపీ నుంచి అన్నామలై వెళ్లిపోవడాన్ని ఎండీఎంకే చీఫ్ దురై వైగో, కాంగ్రెస్ నేతలు, వీసీకే చీఫ్ థోల్ తిరుమావళవన్ స్వాగతించారు. -
ప్రవీణ్ కూటమి అలజడి
సాక్షి, చైన్నె : రాజ్యసభ పదవి దక్కబోతున్న ఆనందంలో కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన తమిళనాట రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమిళనాడు సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమి( తమిళనాడు సోషియల్ జస్టిస్ ప్రోగ్రెసీవ అలయన్స్) పేరుతో ఒక సరికొత్త కూటమి ఏర్పడిందని, అందులో లెఫ్ట్ పార్టీలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయని ఆయన పేర్కొనడం ఈ వివాదానికి కారణమైంది. దీనిని కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. వివాదాస్పద పోస్టు తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికై న ప్రవీణ్ చక్రవర్తి ఆనందంతో ఎక్స్ పేజీలో ఓ ట్వీట్ చేశారు. తమిళనాడులో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ కూటమికి ఆయన ఓ పేరు కూడా పెట్టేశారు. టీవీకే, కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం భాగస్వామ్యంతో కూడిన ‘తమిళనాడు సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమి’ మొదటి ఎంపీ అభ్యర్థిగా ఎంపికవడం గర్వంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. నాపై నమ్మకం ఉంచిన రాహుల్గాంధీ, సీఎం విజయ్లకు ధన్యవాదాలు అంటూ ప్రవీణ్ చక్రవర్తి చేసిన ఈ పోస్టును వామపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి ఆయనకు అతి తెలివి ఎక్కువ: సీపీఎం ఆగ్రహం ప్రవీణ్ చక్రవర్తి పోస్ట్పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఎక్స్ వేదికగానే అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొత్త కూటమి తరఫున తాను రాజ్యసభ అభ్యర్థిగా నిలబడ్డానని, ఇందులో సీపీఎం కూడా ఉందని చెప్పడం పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. ఇలాంటి కూటమి ఏర్పాటుపై గానీ, ఈ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై గానీ తమను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రవీణ్ చక్రవర్తి పెట్టిన ఈ పోస్ట్ను అతి తెలివి ప్రదర్శించడంతో సమానం అని మండిపడ్డారు. కూటమి గురించి మాకేం తెలియదు: సీపీఐ మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీర పాండియన్ సైతం తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ చక్రవర్తి ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ప్రవీణ్ చక్రవర్తి పేర్కొన్న సామాజిక న్యాయ ప్రగతిశీల కూటమిలో తాము లేమని, అసలు అలాంటి కూటమి ఒకటుందనే విషయమే సీపీఐకి తెలియదని ఆయన తేల్చి చెప్పారు.టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు తాము మద్దతు ఇచ్చింది వాస్తవేమన్నారు. అయితే, అది కేవలం తమిళనాడులో గవర్నర్ పాలన రాకూడదని, కేంద్రంలోని బీజేపీ పరోక్షంగా ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోమాత్రమేనన్నారు. అంతేకానీ, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి కాదని వీరపాండ్యన్ స్పష్టం చేశారు. రెండు పార్టీల వద్దకు పరుగులు కూటమి పేరు రచ్చకెక్కిన నేపథ్యంలో సీఎం విజయ్ సమక్షంలో అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి తేన్మొళికి నామినేషన్ను ప్రవీణ్ చక్రవర్తి సమర్పించారు. అనంతరం తమ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్, రాజేష్కుమార్తో పాటుగా ముఖ్యనేతలతో కలిసి సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు ప్రవీణ్ చక్రవర్తి వెళ్లారు. రాజ్యసభ ఎన్నికలలో తనను ఆదరించాలని విన్నవించారు. -
విజయ్ పంచ సూత్రాలు
సాక్షి,చైన్నె: తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గం శుక్రవారం నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలో సరికొత్త నిర్ణయాలను తీసుకున్నారు. సచివాలయంలో ‘వెట్రి తమిళగం’( విజయవంతమైన తమిళనాడు) పేరుతో జరిగిన ఈ తొలి కేబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర మంత్రి సి.టి.ఆర్.నిర్మల్కుమార్ ప్రకటించారు. గత నెల సీఎం విజయ్తోపాటు తొమ్మిది మంది మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కూటమిలోని కాంగ్రెస్తోపాటు టీవీకే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూటమిలోని ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. మూడు సార్లు సాగిన మంత్రి వర్గ కూర్పుతో విజయ్ కేబినెట్లో మొత్తం సంఖ్య 35కు చేరింది. ఇందులో సీఎం విజయ్ ఒకరు కాగా, మిగిలిన వారు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా గుర్తింపు పొందారు. అధికార పగ్గాలు చేపట్టినానంతరం తొలి మంత్రి వర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఇందులో ఎన్నికల వాగ్దానాల అమలు, సరికొత్త పాలన దిశగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పంచ సూత్రాలు అన్నట్టుగా ఐదు కీలక రంగాలకు ప్రాధాన్యతను ఇవ్వడానికి నిర్ణయించారు. 436 అంశాలతో ప్రతిష్టాత్మక ముందడుగు కేబినెట్ భేటీగురించి మంత్రి నిర్మల్కుమార్ మీడియాకు వివరిస్తూ ఎన్నికల హామీలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన 436 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, అంశాలతో ముందడుగు దిశగా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు. ప్రతి శాఖకూ టార్గెట్లు సీఎం విజయ్ తన మదిలోని విజన్ మేరకు కీలక ఆదేశాలతో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నడిపించారని మంత్రి నిర్మల్కుమార్ తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖకూ సీఎం విజయ్ కొన్ని ప్రత్యేకమైన, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారన్నారు. ఆయా శాఖల మంత్రులు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో కలిసి ఈ లక్ష్యాలను సాధించేందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారని వివరించారు. 436 ప్రాజెక్టులపై కసరత్తు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలతో పాటు, తమిళనాడు భవిష్యత్తును మార్చే మరో 436 సరికొత్త వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ తొలి కేబినెట్ భేటీలోనే ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. వీటిని త్వరితగతిన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేఘదాతు డ్యామ్ వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని కేబినెట్ స్పష్టం చేసినట్టు ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్ 5 కీలక రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో యువత అభ్యున్నతి– ఉపాధి నినాదంతో యువత నైపుణ్యాలను పెంపొందించి, వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తర్వాత మహిళా సాధికారత నినాదంతో రాష్ట్రంలోని మహిళల సామాజిక, ఆర్థికవృద్ధికి అవసరమైన ప్రత్యేక పథకాల అమలుకు నిర్ణయించామన్నారు. రైతులు– మత్స్యకారుల సంక్షేమం పేరిట ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి విప్లవాత్మక ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు. అవినీతి రహిత సుపరిపాలన లక్ష్యంగా లంచం అనేదే లేని, పారదర్శకమైన ప్రజా పరిపాలనను అందించడం గురించి కీలకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు. డ్రగ్స్ రహిత తమిళనాడు నినాదంతో రాష్ట్రంలో గుట్కా, గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాల విక్రయాలను, రవాణాను పూర్తిగా నిర్మూలించడం తక్షణ కర్తవ్యంగా చర్యలు చేపట్టామన్నారు. -
లైంగికదాడి కేసులో జైలు శిక్ష
తిరువళ్లూరు: ఒంటరిగా వున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన వడ్డీ వ్యాపారికి 9 ఏళ్ల జైలు శిక్షను విధి స్తూ తిరువళ్లూరు కోర్టు తీర్పును విధించింది. తిరు వళ్లూరు జిల్లా చోళ వరం యూనియన్ నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన సురేష్ ఆంథోనిరాజ్(37). ఇతను స్థానికంగా నివాసం వుంటూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు కొందరికి డబ్బులు ఇచ్చి దినసరి వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత 2023వ సంవత్సరంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బయటకు విషయాన్ని చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్ళి సా యంత్రం ఇంటికి రావడంతో విషయాన్ని బాలి క తల్లిదండ్రులకు వివరించింది. బాధిత తల్లిదండ్రులు పుళల్ మహిళా పోలీసులకు పిర్యాదు చేశారు. సురేష్ఆంఽథోనిరాజ్ను పుళల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం బెయిల్పై విడుదలైన క్రమంలో కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ ముగిసిన క్రమంలో నిందితుడికి 9 ఏల్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. అనంతరం నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. -
జమాబందీలో సర్టిఫికెట్ల పంపిణీ
పళ్లిపట్టు: పళ్లిపట్టులో శుక్రవారం జమాబందీ ము గింపు కార్యక్రమంలో 92 మంది అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వ సహాయకాలు పొందేందుకు వీలుగా సర్టిఫికెట్లను ఎమ్మెల్యే హరి పంపిణీ చేశా రు. పళ్లిపట్టు తాలూకాలో మంగళవానం జమాబందీ శిబి రం ప్రారంభమైంది. తిరుత్తణి ఆర్డీఓ కనిమొళి అధ్యక్షతన నిర్వహించిన శిబిరంలో గ్రామీణులు పాల్గొని అర్జీలు అందజేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే హరి పాల్గొన్నారు. మొత్తం 367 మంది అర్జీలు సమర్పించగా, పరిశీలించి 92 మందిని అర్హు లుగా ఎంపిక చేశారు. వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే హరి అందజేశారు. తక్కిన 275 అర్జీల పట్ల 30 రోజుల్లో విచారణపూర్తి చేసి న్యాయం చేస్తామని ఆర్డీఓ తెలిపారు. తహసీల్దారు భారతి, టీఎస్ఓ రీటా, అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శులు కృష్ణమనాయుడు, టీడీ.శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
నైరుతి అలర్ట్
సాక్షి, చైన్నె: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో తమిళనాడు విపత్తు నిర్వహణ బృందం, అధికారులను సీఎం విజయ్ అప్రమత్తం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆ విభాగం వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో వర్షాలు, విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 80 శాతం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సీఎం విజయ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలర్ట్: ఏదేని విపత్తులు ఎదురైనపక్షంలో ప్రాణనష్ట నివారణే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. విపత్తు కాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, జిల్లా అత్యవసర కార్యాచరణ కేంద్రాలు 24 గంటలు పనిచేయాలని, సహాయక ఉపకరణాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సహా అన్ని జిల్లాల్లో రోడ్లపై నీరు నిలవకుండా, చెట్లు విరిగిపడితే తక్షణమే తొలగించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నైరుతి తర్వాత ఈశాన్య రుతు పవనాల సీజన్ మొదలు కానుండడంతో ఈ నాలుగు నెలలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించారు. మంత్రులు కె.ఎ. సెంగోట్టయన్ , సీఎస్ సాయికుమార్, ఇతర కీలక విభాగాల కార్యదర్శులు, అధికారులు ఎన్.మురుగానందం, డాక్టర్ జె.రాధాకృష్ణన్, డాక్టర్ కె. మణివాసన్, ఎమ్.ఎ. సిద్ధిఖ్, సత్యబ్రత సాహు, థామస్ వైద్యన్, కేఎస్.పళణిస్వామి, సమీరన్, డీజీపీ మహేష్కుమార్ అగర్వాల్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ సీమా అగర్వాల్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు హాజరయ్యారు. -
తొలి సభకు సన్నద్ధం
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి వేదిక సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ మొదటి శాసనసభ సమావేశాల తేదీ అధికారికంగా ఖరారైంది. జూన్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు శాసనసభ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. సీఎం విజయ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన గంటలో అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించారు. ఇదివరకు గత నెల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్ష నిమిత్తం అసెంబ్లీ సమావేశమైన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం పూర్తి స్థాయిలో ప్రభుత్వం, మంత్రి వర్గం ఏర్పాటుతో కొత్త ప్రభుత్వంలో తమిళనాడు తొలి శాసనసభ సమావేశాలు జూన్ 18 ఉదయం 10గంటలకు చైన్నె సచివాలయంలోని అసెంబ్లీ హాల్లో ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. సంప్రదాయం ప్రకారం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కావడంతో తొలిరోజు తమిళనాడు గవర్నర్ ప్రసంగంతో సభలు మొదలవుతాయని వివరించారు. గవర్నర్ ప్రసంగంలో సీఎం విజయ్ ప్రభుత్వ రాబోయే ఐదేళ్ల ప్రణాళికలు ప్రకటించనుంది. తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన తొలి అసెంబ్లీ సెషన్ ఇదే కావడం విశేషం. ఈ సమావేశాల్లోనే విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించే పలు కీలక బిల్లులు, సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రూపకల్పన చేయనున్నారని సమాచారం. స్పీకర్గా జేసీడీ ప్రభాకర్ పగ్గాలు చేపట్టినానంతరం పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు తాజా సెషన్స్లో నడిపించనున్నారు. -
కులగణనపై అఖిలపక్ష భేటీ
సాక్షి, చైన్నె : తమిళనాడులో తక్షణమే కులాల వారీగా జనాభా గణన (సామాజిక న్యాయ గణన) నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పీఎంకే నేతృత్వంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. టీనగర్లోని ఓ హోటల్లో పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ నేతృత్వంలో సమావేశం జరిగింది. 69 శాతం రిజర్వేషన్ల పరిరక్షణ తమిళనాడులో ప్రస్తుతం అమల్లో ఉన్న 69 శాతం రిజర్వేషన్ల విధానానికి న్యాయస్థానాల ద్వారా కొన్ని శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని పీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్లపై కోర్టుల్లో ఉన్న కేసులను బలంగా ఎదుర్కోవాలంటే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కచ్చితమైన కులాల వారీ గణాంకాలు ప్రభుత్వ సర్వే ద్వారా సేకరించడం అత్యంత అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించేలా సమగ్ర డేటాను సేకరించాలని, దీనిపై తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. 42 పార్టీల మద్దతు..డీఎంకే దూరం పీఎంకే ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని అందుకుని రాష్ట్రంలోని 42 రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు. సమావేశంలో అధికార పక్షమైన తమిళనాడు వెట్రి కళగం, కాంగ్రెస్, బీజేపీ, నామ్ తమిళర్ కచ్చి ,వీసీకే, అన్నాడీఎంకే పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, అధికార పక్ష వ్యూహాలతో విభేదిస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం బహిష్కరించింది. -
సిగ్మా ప్రోమోలో జసన్ సంజయ్
తమిళసినిమా: ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సిగ్మా. లండన్లో సినిమా విద్యను చదివిన ఈయన హీరోగా రంగప్రవేశం చేస్తారని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా తను మెగాఫోన్ పట్టి సిగ్మా అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్సేతుపతి, ప్రముఖు నటుల్లో ఒకరు నటిస్తారనే ప్రచారం జరిగింది. చివరికి సందీప్కిషన్ హీరోగా నటిస్తున్నారు. నటి ఫరియఅబ్దుల్ నాయకిగా నటించారు. లైకా ప్రొడక్షన్న్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న తెరపైకి రానుంది. ఇప్పటికే చిత్ర టైటిల్, టీజర్ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా సిగ్మా చిత్ర ప్రోమోను విడుదల చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందుకు కారణం ఈ ప్రోమోలో దర్శకుడు జసన్సంజయ్ కూడా నటించడమే. ఆయన చిత్ర ప్రోమోలోనే కనిపిస్తారా? లేక చిత్రంలోనూ కీలక పాత్రను పోషించారా అనేఆసక్తి నెలకొంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ పాల్గొంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద సిగ్మా టాక్ ఆఫ్ ద సినిమాగా మారింది. ఇక చిత్రం రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. -
క్లుప్తంగా
1,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహనాల కోసం 1000 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ముందడగు వేశామని జేఎస్డబ్ల్యూఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జేఎస్డబ్ల్యూ మోటార్ ఇండియా సరికొత్త రికార్డును ప్రకటించింది. తమ ప్రతిష్టాత్మక ఈవీ చార్జ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 470కి పైగా ప్రాంతాల్లో 1,000 కమ్యూనిటీ ఈవీ చార్జర్లను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ స్థాయిలో పబ్లిక్, కమ్యూనిటీ ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను నిర్మించిన తొలి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్గా తాము నిలిచామని వివరించారు. చార్జర్లను ప్రధానంగా రెసిడెన్షియల్ సొసైటీలు, అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల క్యాంపస్లు, హోటళ్లు, పారిశ్రామిక పార్కులలో ఏర్పాటు చేశామన్నారు. అంబత్తూరులో విద్యుత్ కోత – కార్యాలయం ముట్టడి తిరువొత్తియూరు: అంబత్తూరులో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంబత్తూరు పరిసర ప్రాంతాలైన ఎస్.వి.నగర్, కళ్లికుప్పం, భానునగర్, పుదూర్లలో కొన్ని రోజులుగా రాత్రి సమ యాల్లో తీవ్రమైన విద్యుత్ కోతలు విధిస్తు న్నారు. గురువారం రాత్రి 5 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, విసిగిపోయిన స్థానికులు కళ్లికుప్పంలోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫోన్ చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. కార్యాలయంలో ఉన్న విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. అనంతరం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. చెంగల్పట్టు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాగే ముందస్తు సమాచారం లేకుండా రోజుకు 4 సార్లు విద్యుత్ కోత లు విధిస్తున్నారని, దీనివల్ల రాత్రిపూట నిద్రలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎంపీసీలో అడ్మిషన్కు నిరాకరణ పళ్లిపట్టు: ప్లస్–1లో ఎంపీసీ గ్రూపులో చేరి చదువు కోవాలన్న విద్యార్ధిని ఆశయానికి ఉపాధ్యా యులు తూట్లు పొడవడంతో నిరాశ చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అమ్మయార్కుప్పంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్కే పేట సమీపంలోని నారాయణపురం కీళ్ మోసూరు గ్రామానికి చెందిన తనికాచళం కారు డ్రైవర్. ఇతని కూతురు తమిళరసి(15) అమ్మయార్కుప్పంలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 324 మార్కులు సాధించారు. ఆమె అదే పాఠశాలలో ప్లస్–1లో ఎంపీపీ గ్రూపులో చేరి చదువుకోవాలని ఆసక్తి చూపింది. ఇందుకోసం పాఠశాలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మార్కులు తక్కువగా వున్నాయని ఉపాధ్యాయులు హేళనగా మాట్లాడి పంపినట్లు, ఈవిషయాన్ని బాలిక తల్లి అనుసూయ వద్ద చెప్పి వాపోయినట్లు తెలిసింది. మనస్తాపం చెందిన తమిళరసి ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుసూయ వాపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకునేందత వరకు మృతదేహం తీసుకోమని మృతురాలి బంధువులు తెలిపారు. ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఆత్మహత్య తిరువొత్తియూరు: ప్రియురాలి ఇంట్లో ప్రియు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా కావేరిపాక్కం ప్రాంతానికి చెందిన దీపక్ (26), శ్రీపెరంబుదూర్లోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో ఉద్యోగి. ఇతనికి ఆవడి సమీపంలోని అయపాక్కం తమిళనాడు హౌసింగ్ బోర్డ్ నివాసానికి చెందిన ఒక యువతితో ఇన్న్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లి గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటున్న తరుణంలో, పెళ్లి ఆలస్యం అవుతుండడంతో త్వరగా ఏర్పాటు చేయాలని దీపక్ కోరుతూ వచ్చాడు. అయితే వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారని తెలిసింది.ఈ క్రమంలో, గురువారం సాయంత్రం అయపాక్కంలోని తన ఇంటికి దీపక్ను సదరు యువతి పిలిచింది. ఇంట్లోని గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన దీపక్, పక్క గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీకి ఎలాంటి నష్టం లేదు
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. కే. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించిన నేపథ్యంలో, ఆయన నిష్క్రమణపై నైనార్ నాగేంద్రన్ మీడియా వేదికగా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నామలై వైదొలగడం వలన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాల పార్టీ అన్నామలై రాజీనామాపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు నైనార్ నాగేంద్రన్ బదులిస్తూ బీజేపీ ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీ కాదని గుర్తుచేశారు. అన్నామలై పార్టీని వీడడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం అన్నది లేదన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక బలమైన సిద్ధాంత ప్రాతిపదికన నడిచే పార్టీ అని, ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ఉద్యమాన్ని లేదా రాజకీయ పార్టీని ప్రారంభించే హక్కు ఎవరికై నా ఉంటుందన్నారు. తమిళనాడుపై ప్రధాని మోదీకి ప్రత్యేక ప్రేమ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని నైనార్ నాగేంద్రన్ ఈ సందర్భంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ వేదికపై మాట్లాడినా తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళ ప్రజల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. ఇటీవల కాలంలో మన ప్రాచీన తమిళ రాగి శాసనాలను కూడా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పునరుద్ధరించి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తమిళనాడులో మౌలిక వసతుల కల్పనకు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అందుతున్న రేషన్ సరుకులను కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నదని గుర్తు చేశారు. అన్నామలై సొంత పార్టీనో లేదా ఉద్యమాన్నో తెరపైకి తెస్తున్నప్పటికీ తమిళనాడులో బీజేపీ క్యాడర్ బలంగానే ఉందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను ప్రజల్లో ముందుంచుతాయని నైనార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు. -
ఆ రెండు పెద్ద విషయం కాదు!
తమిళసినిమా: అగ్రకథానాయికిగా రాణిస్తున్న నయనతార నటించిన ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో అరమ్ ఒకటి. సామాజికపరమైన సమస్యలు, నీటి సమస్యలు, బావిలో పడ్డ చిన్నారిని రక్షించడానికి చేసే ప్రయత్నాలు వంటి పలు అంశాలను తెరపై ఆవిష్కరించిన కథా చిత్రం ఇది. నయనతార జిల్లా కలెక్టర్గా ప్రజల పక్షాన నిలిసి పోరాటం చేసిన పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రాన్ని కేజేఆర్ స్టూడియోస్ పతాకంపై గోపి నయినార్ కేజేఆర్ నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నయనతార నటించిన అతికొద్ది ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు రూపొందుతుందా అని ఎదురుచూస్తున్న నయనతార అభిమానులను ఖుషీ పరిచే వార్త ఇప్పుడు వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ కథ పూర్తిగా రెడీ అయిందని నిర్మాత కేజేర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈయన హీరోగా నటించిన తొలి చిత్రం అంగీకారం. అథ్లెటిక్స్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈయన అరమ్–2 చిత్రానికి సంబంధించిన వివరాలను తెలిపారు. ఇందులో నయనతారనే ప్రధాన పాత్రను పోషిస్తారా? లేక మరెవరైనా నటిస్తారా అనే పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం నయనతార సల్మాన్ఖాన్తో హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళసినిమా: ఈ తరం హీరోయిన్ల ఆలోచనా ధోరణియే వేరు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారనే చెప్పాలి. ప్రేమ, పెళ్లి విషయం ఎత్తితేనే అందుకు చాలా సమయం ఉందంటున్నారు. యువ నటి నికిలావిమల్ ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో బాల నటిగా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో కథానాయికిగా నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి శ్రమిస్తున్నారు. తమిళంలో వెట్రివేల్, కిడారి, పంచుమిట్టాయి, తంబి, పోర్ తొళిల్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన వాళై చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళం తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నికిలా విమల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులో ఇప్పటివరకూ ఎవరూ లేరని, తానెవరినీ ప్రేమించడం లేదని తెలిపారు. పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు. ప్రేమ, పెళ్లి వంటివి పెద్ద విషయం కాదు అని, అలాంటి ఆలోచన వచ్చినప్పుడు చూసుకో వచ్చునని అన్నారు. ఇప్పుడు తన ఆలోచనలు అంతా సినిమా చుట్టూనే అని నికిలా విమల్ చెప్పారు. నికిలా విమల్ అరమ్–2కు కథ రెడీ! -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ వీఎస్ లీల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవా న్ని పురస్కరించుకొని శుక్రవారం వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీలో ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలను నాటడం వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్యకరమైన గాలి పీల్చేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల టీచర్లు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులందరూ విధిగా ఒక మొక్కను నాటాలనే ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలతోపాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వల్ల రానున్న తరానికి ఆరోగ్యకరమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటికి అటవీశాఖ, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సంయుక్తంగా కంకణం కట్టుకోవాలన్నారు. అటవీశాఖలో ఒక చెట్టు కూలితే పది చెట్లను నాటాలనే లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే వేలయగన్, సర్పంచ్ వెంకటేశన్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సేవూరు గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
సీఎం ఫొటో ఏర్పాటు చేయాలి
తిరువళ్లూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం ఫొటోను ఏర్పాటు చేయాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే అరుణ్కుమార్, పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి మున్సిపల్ కమిషనర్ దామోదరన్కు సూచించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం చైర్పర్సన్ ఉదయమలర్ అద్యక్షత జరిగింది. సమావేశంలో ఉపాధ్యక్షుడు రవి, కమిషనర్ దామోదరన్, శానిటరీ అధికారి మోహన్, కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్యం, తాగునీటి ఎద్దడికి పరిష్కారం, తరచూ ఏర్పడుతున్న విద్యుత్ కోతలు, వీది దీపాల ఏర్పాటుకు నిధుల కొరతపై చర్చలు జరిపారు. తమ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అత్యవసర పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చైర్ పర్సన్ హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు. అయితే కౌన్సిల్ సమావేశంలో మాజీ సిఎం స్టాలిన్ ఫొటో మాత్రమే వున్న విషయం టీవీకే ఎమ్మేల్యేలకు చేరింది. వెంటనే కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు కౌన్సిల్ సమావేశంలో సీఎం ఫోటో ఏర్పాటుపై చర్చించారు. మాజీ సిఎం ఫోటో వున్న క్రమంలో ప్రస్తుత సిఎం ఫొటోను ఎందుకు పెట్టలేదని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సీఎం విజయ్ ఫొటోను ఏర్పాటు చేశామని, కౌన్సిల్ హాలులో మాత్రం తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదం పొందిన తరువాత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు స్పందిస్తూ, తీర్మానం చేసినా, చేయకపోయినా వచ్చే సమావేశం నాటికి సీఎం ఫొటోను ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానలా మారి, ఒకరు ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది. వినోద్ ఆకాష్ (23), ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. మణికంఠన్ (30). గురువారం సాయంత్రం వీరిద్దరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన మణికంఠన్ రాయితో వినోద్ తలపై బలంగా కొట్టాడు. వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. కొరుక్కుపేట: అన్నమయ్య కీర్తనలతో నగరానికి చెందిన తెలుగు గాయని అరుణ ఆధ్యంతం అలరించింది. వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతా కల్యాణ వైభవం పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చైన్నె పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా గురు వారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం రాత్రి గాయని అరుణ సంగీత కచ్చేరి ఇచ్చారు. కీ బోర్డుపై ఎన్ వి బాబు, తబలాపై రమేష్ వాయిద్య సహకారం అందించారు. గాయకుడు ఎం ఆర్ సుబ్రహ్మణ్యం అన్నమాచార్య కీర్తనలను అలపించి అలరించారు. కళాకారులను తమ్మినేనిబాబు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుడిమెట్ల చెన్నయ్య, విజయలక్ష్మి, శ్రీనాథ్ పాల్గొన్నారు. కొరుక్కుపేట: తాంబరం, పరంతూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిగ్నల్ సిస్టం వైఫల్యం చెందింది. దీంతో ట్రాక్పై ఉన్న సిగ్నల్ బాక్సులు పనిచేయలేదు. ఫలితంగా చెంగల్పట్టు మార్గం నుంచి తాంబరం వైపు వచ్చే ఎలక్ట్రిక్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లకు సిగ్నలింగ్ ఇవ్వడం కుదరలేదు. ఈ వైపు నుంచి రైళ్లన్నింటినీ కొన్నిచోట్ల నిలిపివేశారు. అలాగే, తాంబరం నుంచి చైన్నె వెళ్లే రైళ్లను కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లలో చిక్కుకుపోయారు. పాఠశాలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు పైగా రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు తాంబరం రైల్వేస్టేషన్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆ తర్వాత 9.30 గంటల తర్వాత సిగ్నల్ సమస్యను సరిదిద్దారు. ఆ తర్వాత, అన్ని రైళ్లు యథావిధిగా నడిచాయి. వేలూరు: గ్రామసభలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేలూరు ఎంపీ కదిర్ఆనంద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని వంజూరు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభ సమావేశంలో ఎంపీ కదిర్ఆనంద్ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించారు. వేలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ వీఎస్ లీల పాల్గొన్నారు. -
కాయిదే మిల్లత్కు ఘన నివాళి
సాక్షి, చైన్నె: ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ వ్యవస్థాపకుడు కాయిదే మిల్లత్ మహ్మద్ ఇస్మాయిల్ 131వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు ఆవరణలోని ఆయన సమాధి వద్దకు వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. సీఎం విజయ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అధికారిక నివాళులర్పిస్తూ సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు వద్దకు పెద్ద ఎత్తున ముస్లీం సంఘాల నేతలు, రాజకీయ పార్టీ నాయకులు తరలి రావడంతో ఆ పరిసరాలు క్రిక్కిరిశాయి. ముస్లీం మత పెద్దలు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా ట్రిప్లికేన్ పెద్ద మసీదు వద్దకు సీఎం విజయ్, స్పీకర్ జేసీడీ ప్రభాకర్, మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవఅర్జున, వెంకటరమణన్, ఎ.ఎమ్. షాజహాన్, మహ్మద్ పర్వేజ్ , ఎన్. మరియ విల్సన్ వచ్చారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.కె. కుంజాలికుట్టి , ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.ఎమ్.ఖాదర్ మొహిద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్వి మహ్మద్ అబుబకర్ , ఎంపీ నవాజ్ ఖని, సమాచార శాఖ కార్యదర్శి రాజారామన్ డైరెక్టర్ డాక్టర్ అ.అరుణ్ తంబురాజ్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొని కాయిదే మిల్లత్ స్మారకానికి నివాళులర్పించారు. సీఎం విజయ్ చాదర్ను సమర్పించారు. డీఎంకే వర్సెస్ కాంగ్రెస్ తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే – కాంగ్రెస్ సుదీర్ఘ బంధానికి తెరపడిన తర్వాత ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇందుకు చైన్నెలోని కాయిదే మిల్లత్ 131వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన స్మారకం వద్ద పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం విజయ్ వచ్చి వెళ్లినానంతరం మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అక్కడ ఛాదర్ సమర్పించేందుకు నిర్ణయించారు. ఆయన నివాళుర్పించి అటు వెళ్లగానే అదే సమయంలో అక్కడకు టీఎన్సీసీ అద్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటు ఆ పార్టీ వర్గాలు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న డీఎంకే కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. చివరకు అక్కడున్న వారు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వ్యవహారంపై సెల్వపెరుంతొగై స్పందిస్తూ సుదీర్ఘ బంధం తెగిపోతే ఆ బాధ ఉంటుందని, ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దన్నారు. తమిళనాడులో డీఎంకే నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చేసిందని, ఇండియా కూటమి విషయంలో జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీల తరఫున నేతుల సమాధి వద్ద అంజలి ఘటించారు. -
నెహ్రూ మెడకు కేసు ఉచ్చు
సాక్షి, చైన్నె: డీఎంకే మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ ఉద్యోగాలకు లంచం వ్యవహారం కేసు ఉచ్చుగా మారింది. ఆయనపై కేసు నమోదు చేసినట్టు టీవీకే ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు వివరించింది. అదే సమయంలో కోర్టు ఆదేశాలు పెండింగ్లో ఉండగా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 2,538 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. ఈ నియామకాల్లో రూ.634 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఈడీ ఒక లేఖ రాసింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే నేత ఇన్బదురై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు, వెంటనే కేసు నమోదు చేయాలని గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయకపోవడంతో ఇన్బదురై కోర్టు దిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు, ఈ కేసు నమోదు ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ గత డీఎంకే ప్రభుత్వం, అప్పటి మంత్రి కేఎన్ నెహ్రూ తరఫున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులన్నింటి విచారణను హైకోర్టు జూన్ 23వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టులో వాదనల జోరు కోర్టు ధిక్కార కేసు పెండింగ్లో ఉన్న తరుణంలో, ఈ వివాదంపై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని మాజీ మంత్రి నెహ్రూ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ పాండియన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కూడా ఈ విషయాన్ని కోర్టుకు ధృవీకరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుల విచారణ ఈ నెలాఖరున జరగాల్సి ఉందని, తర్వాత విచారణ జరిగే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోమని ఇది వరకటి అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. అటువంటప్పుడు కోర్టు విచారణ పూర్తి కాకముందే కేసు ఎలా నమోదు చేస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమగ్రమైన ఉత్తర్వులు జారీ చేస్తామని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది. -
అన్నాడీఎంకే వివాదాల కేసులకు తెర
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పార్టీలో గత కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత అధికార పోరాటం, చట్టపరమైన వివాదాలు మద్రాసు హైకోర్టులో పూర్తిగా ముగిశాయి. గతంలో పార్టీలో జరిగిన పరిణామాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని సివిల్ కేసులను పిటిషనర్లు వెనక్కి తీసుకోవడంతో, న్యాయస్థానం ఆయా కేసులను కొట్టివేస్తూ విచారణను ముగించింది. 2022, జూలై 11న అన్నాడీఎంకే పార్టీ నిర్వహించిన వివాదాస్పద జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని, అందులో ఆమోదించిన తీర్మానాలను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం, ఆయన మద్దతుదారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్ సివిల్ దావాలు దాఖలు చేశారు. మారిన పార్టీలు..వ్యూహాలు ఈ కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగానే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరో సీనియర్ నేత జేసీడీ ప్రభాకర్ విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరి తాజాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తాజాగా ఇతర పార్టీలలో తాము ఉండడంతో పాత అన్నాడీఎంకే వివాదాల కేసులను కొనసాగించడంలో అర్థం లేదని భావించి, ఆయా పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోర్టును కోరారు. దీనిని పరిశీలించిన జస్టిస్ కె. కుమరేష్ బాబు నేతృత్వంలోని బెంచ్, పన్నీరు, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు, అన్నాడీఎంకే పార్టీ పేరు, జెండా, రెండాకులు చిహ్నం ఉపయోగించకుండా పన్నీరు వర్గానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళనిస్వామి గతంలో వేసిన కేసును కూడా వెనక్కి తీసుకోవడానికి అనుమతించవలసిందిగా ఆయన తరఫున పిటిషన్ దాఖలైంది. ఈ అభ్యర్థనను సైతం అంగీకరించిన న్యాయమూర్తి, ఈ వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అధికారికంగా ముగించారు. దీంతో, గత నాలుగేళ్లుగా తమిళనాడు రాజకీయాలను ఊపేసిన అన్నాడీఎంకే వివాదాల కోర్టు పోరాటానికి తెరపడింది. -
మారుదాం.. మార్చుదాం
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించిన కొద్ది గంటల్లోనే, సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు. తమిళనాడులో మరింత మంది ప్రజలను అనుసంధానించేలా ‘మారుదాం.. మార్చుదాం’ అనే నినాదంతో ఒక సరికొత్త రాజకీయ విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారు. తమిళనాడు బిజేపీ బలోపేతంలో మాజీ ఐపీఎస్ అధికారి పాత్ర కీలకం అన్నది జగమెరిగిన సత్యం. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు ఆయన్ను బీజేపీ అధిష్టానం తప్పించి నైనార్ నాగేంద్రన్కు పగ్గాలు అప్పగించింది. అయినా, పార్టీకి సేవలు అందిస్తూ వచ్చిన అన్నామలైకు అధిష్టానం రూపంలో ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో రెండు రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసిన అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆ పార్టీ ఆమోదించిన కొన్ని గంటలలో శుక్రవారం మధ్యాహ్నం అన్నామలై సోషల్ మీడియా వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. బీజేపీకి రాజీనామా ఎందుకు? 2020 ఆగస్టులో బీజేపీలో చేరిన తాను తమిళనాడులో పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించానని గుర్తు చేశారు. అయితే, గత 18 నెలలుగా పార్టీ జాతీయ నాయకత్వంతో తమిళనాడు రాజకీయ వ్యూహాలు, కూటములపై తనకు కొన్ని భేదాభిప్రాయాలు (ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో) ఉన్నాయని ఆయన వివరించారు. నా మార్గం వేరు, నా లక్ష్యాలు చాలా పెద్దవి : తమిళనాడులో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, మూలాల నుంచి మార్పును తీసుకురావాలన్నదే తన ఆశయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఎంతో మర్యాదపూర్వకంగా వివరించి, పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు. సరికొత్త రాజకీయ ఉద్యమం– వీ ది లీడర్ అన్నామలై తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఒక పార్టీగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక పెద్ద ఉద్యమంగా అభివర్ణించారు. వీ ది లీడర్ పేరిట ఈ ఉద్యమం సాగుతుందని ప్రకటించారు. ఈ ఉద్యమం త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. డిజిటల్ ప్లాట్ఫారమ్ యువత, ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించామని ప్రకటించారు. రాజకీయాల్లో నైతికతను పెంపొందించడానికి కోయంబత్తూరులో అబ్దుల్ కలాం పేరిట సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా కొత్త నాయకులకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు. అన్నామలై ఉద్యమంలో ముఖ్యాంశాలు ఈ కొత్త ఉద్యమంలోని విధానం, పరిమితుల మేరకు పార్టీలో శాశ్వత ఎమ్మెల్యేలు, శాశ్వత ఎంపీలు అనే సంస్క్కృతిని బద్దలు కొడతామని, పదవీ కాలానికి ఖచ్చితమైన పరిమితులు ఉంటాయని, సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్న తమిళ సాంకేతిక నిపుణులను రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నైతికత సోషల్ మీడియాలో తన మద్దతుదారులు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరారు. ఇతర పార్టీలపై కొత్త వైఖరి ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉంటుందని అన్నామలై స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు రాజకీయ క్షేత్రంలో తాము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, పీఎంకే, ఎన్టీకే, డీఎండీకే వంటి పార్టీలను ఏ విధంగా చూస్తానో, ఇకపై బీజేపీని కూడా అలాగే చూస్తానని స్పష్టం చేశారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని, ప్రజలే తమ నాణ్యతను చూసి ఎన్నుకుంటారని అని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ఏకై క లక్ష్యమని, ఇందుకోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు. -
కత్తులతో హల్చల్ : అన్నదమ్ముల అరెస్ట్
తిరువళ్లూరు: తాము రౌడీలమంటూ రోడ్డులో కత్తులతో హల్చల్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం సమీపంలో గురువారం రాత్రి సబ్ ఇన్స్పెక్టర్ ఇళంగో నేతృత్వంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో రోడ్డులో కత్తులతో హల్చల్ చేస్తూ ప్రజలపై వీరంగం చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకులను పోలీసులపై తిరగబడ్డారు. అంతుచూస్తామని బెదిరించారు. వారిని బలప్రయోగంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రాధమిక విచారణలో వారిద్దరూ రామతండలం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన తెన్నరసు(23), అశ్వంత్(21)అని, వీరిపై పలు పోలీసుస్టేషన్లో కేసులు ఉన్నట్లు తేలింది. అనంతరం వీరిని కోర్టుకో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. -
ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్
– ఆరుగురికి గోల్డెన్ వింగ్స్ సాక్షి, చైన్నె: తమిళనాడు అరక్కోణంలోని ప్రతిష్టాత్మక హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఐఎన్ఎస్ రాజాళి లో ఆరుగురు భారత నౌకాదళ పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. 106వ బ్యాచ్కి చెందిన హెలికాప్టర్ కన్వర్షన్ కోర్స్లో కఠినమైన విమానయాన, గ్రౌండ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఆరుగురు యువ ఆఫీసర్లకు తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్మీనన్ ప్రతిష్టాత్మక శ్రీగోల్డెన్ వింగ్స్శ్రీ ను బహూకరించారు. ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ –561 పరిధిలో సుదీర్ఘంగా 22 వారాల పాటు సాగిన ఈ అత్యంత కఠినమైన శిక్షణ ముగింపు, యువ బృందాన్ని సంపూర్ణ యుద్ధ సన్నద్ధత కలిగిన ఏవియేటర్లుగా తీర్చిదిద్దింది. శిక్షణ కాలంలో అసాధారణ ప్రతిభ, అంకితభావం కనబరిచిన ముగ్గురు అధికారులకు ప్రత్యేక ట్రోఫీలను అందజేశారు. ఫ్లయింగ్లో ప్రథమ స్థానం: ఫ్లయింగ్ విభాగంలో మెరిట్ ఆర్డర్లో ప్రథమ స్థానంలో నిలిచిన సబ్ లెఫ్టినెంట్ అహోనా మజుందార్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ రోలింగ్ ట్రోఫీ , గ్రౌండ్ సబ్జెక్టులలో ప్రథమ స్థానంలో నిలిచిన లెఫ్టినెంట్ శివమ్ సింగ్కు సబ్ లెఫ్టినెంట్ కుంటే మెమోరియల్ బుక్ ప్రైజ్ దక్కింది. అన్ని విభాగాల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన లెఫ్టినెంట్ అరుణ్ కుమార్కు ప్రతిష్టాత్మక కేరళ గవర్నర్ రోలింగ్ ట్రోఫీ లభించింది. ఈ శిక్షణ కేంద్రంలో 900 మందికి పైగా పైలట్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెలికాప్టర్ ఫ్లయింగ్ శిక్షణ ఇక్కడ పొందారు. తాజాగా పట్టభద్రులైన ఈ ఆరుగురు భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్లైన్ యూనిట్లలో, సముద్ర తీరాలలో నిఘా, శోధన–సహాయక చర్యల్లో నిమగ్నం కానున్నారు. -
బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడులో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీతో తన అనుబంధాన్ని ముగించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 18 నెలలుగా పార్టీ హైకమాండ్తో పలు అంశాలపై తనకు విభేదాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీపై గౌరవం ఉంది కానీ.. అభిప్రాయ బేధాల కారణంగానే తాను బీజేపీకి రాజీనామా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను కొత్త రాజకీయ ఉద్యమం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఒంటరిగా తన దారి తాను ఏర్పరచుకుంటానని స్పష్టం చేశారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాని అన్నారు. దీంతో, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మరాయి. తాజాగా అన్నామలై రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నామలై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మార్పు కోసం బీజేపీలో చేరాను. బీజేపీ భవిష్యత్ కోసం ఎంతో కృషి చేశాను. సమాజంలో మార్పు తేవాలని భావించాను. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్నాను. కానీ అలా జరగలేదు. అభిప్రాయ బేధాల కారణంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాను. 2025 డిసెంబర్లోనే పార్టీ నుంచి వెళ్లిపోతానని చెప్పాను. ఎన్నికల తర్వాత వెళ్లాలని బీజేపీ అధిష్టానం చెప్పింది. గత 18 నెలలుగా పార్టీ అగ్రనేతృత్వంతో అనేకసార్లు చర్చలు జరిపాను. నా అభిప్రాయ భేదాలను స్పష్టంగా వివరించాను. అయితే తమిళనాడులో పార్టీ భవిష్యత్ దిశపై మా అభిప్రాయాలు ఒకేలా లేవని చివరకు అర్థమైంది. తమిళనాడు ప్రజలు అర్థం చేసుకునే భాషలో జాతీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, ప్రాంతీయ ఆకాంక్షలు, స్థానిక రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అభివృద్ధి కేంద్రిత, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించే రాజకీయాల అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచనలు చేస్తాను. అందులో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. సామాన్యులకి నా పార్టీలో ప్రాధాన్యం ఇస్తాను. రాజకీయాల్లో కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదు. After resigning from the BJP, K Annamalai says, "Today, we are going to start a movement. Our political party will contest in the next assembly election in Tamil Nadu." pic.twitter.com/RtWoJQ5LUQ— ANI (@ANI) June 5, 2026రాజకీయాల్లోకి వచ్చే ముందు రజినీకాంత్ సలహాలు తీసుకున్నాను. రజినీకాంత్ను నాతో కలిసి రావాలని కోరాను. ఇక రాజకీయ ఉద్యమం మొదలుపెడుతున్నాను. ఒంటరిగా నా దారి నేను ఏర్పరచుకుంటాను. తమిళనాడు అస్తిత్వాన్ని వదులుకోలేను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. తమిళనాడు అభివృద్ధే నా ప్రధాన లక్క్ష్యం. భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నాను’ అని తెలిపారు. దీంతో, అన్నామలై వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ రాష్ట్ర రాజకీయ వ్యూహంపై, అలాగే దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సస్పెన్స్కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.అలా మొదలైంది.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. నొచ్చుకుని..రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రాపిడో బైక్ ప్రమాదం.. మహిళా ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: రాపిడోలో వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఇంజినీర్ మృతి చెందారు. ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెందిన గోమతి (30) అనే మహిళ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఈమె రామాపురం ప్రాంతంలోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగి. గురువారం ఉదయం ఆమె యధావిధిగా కార్యాలయానికి వెళ్లేందుకు రాపిడో (బైక్ టాక్సీ) బుక్ చేసుకున్నారు. కొద్దిసేపటికే వచ్చిన రాపిడో బైక్ డ్రైవర్, గోమతిని ఎక్కించుకుని మదురవాయల్ బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. పోరూర్ టోల్ ప్లాజా సమీపంలో వెళ్తుండగా, ముందు వెళ్తున్న కారును మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఇందులో నియంత్రణ కోల్పోయిన గోమతి, రాపిడో డ్రైవర్ ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గోమతి తలకి తీవ్ర గాయాలవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోమతి వద్ద హెల్మెట్ ఉన్నప్పటికీ, ఆమె దానిని ధరించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రాపిడో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న మదురవాయల్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఇన్స్పెక్టర్ విజయకుమార్, గోమతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని సేకరించి, ప్రమాదానికి కారణమై పరారైన వాహనం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
తమిళ రాజకీయం.. టీవీకే ఎమ్మెల్యే Vs మేయర్
సాక్షి, చైన్నె: ‘ మీరా? నేనా? చైన్నెలో అంటూ మేయర్ ప్రియ, టీవీకే ఎమ్మెల్యే పల్లవి మధ్య ప్రోటోకాల్ అధికార పోరు గురువారం చోటు చేసుకుంది. తమిళనాడులో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె కార్పొరేషన్లో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య తీవ్రమైన ఈగో క్లాష్ (అధికార పోరు) మొదలైంది. తిరు.వి.కె. నగర్ నియోజకవర్గ పరిధిలోని పులియంతోపులో కొత్తగా నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవంలో చైన్నె మేయర్ ప్రియ (డీఎంకే), స్థానిక మహిళా ఎమ్మెల్యే పల్లవి (టీవీకే) ల మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో డీఎంకే అధికారం కోల్పోయినప్పటి నుండి మేయర్ ప్రియ బహిరంగ కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో పులియంతోపు స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే పల్లవి ట్రాఫిక్ జామ్ కారణంగా కొద్దిగా ఆలస్యంగా రావడం వివాదానికి కారణమైంది. ఎమ్మెల్యే పల్లవి లోపలికి వచ్చే సమయానికి మేయర్ ప్రియ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒంటరిగా తానే రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే పల్లవి ముఖం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ తర్వాత లోపల సాంప్రదాయ కుతువిళక్కు (జ్యోతి ప్రజ్వలన) వెలిగించే సమయంలో, మేయర్ ప్రియ మొదటి దీపం వెలిగించారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పల్లవికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వ కుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. விளக்கேற்ற மெழுகுவர்த்தியை கொடுக்காத மேயர் பிரியா.. கோபப்பட்டு வெளியே சென்ற தவெக எம்எல்ஏ பல்லவி#MayorPriya | #MLAPallavi | #Chennai | #TVK | #DMK pic.twitter.com/XuJsKUQL6H— PttvOnlinenews (@PttvNewsX) June 4, 2026పల్లవి దీపం వెలిగించడానికి కొద్దిగా కదలగా, అక్కడి అధికారి ఆమెను వెనక్కి జరగమన్నట్లు మాట్లాడటంతో పల్లవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ఎమ్మెల్యే పల్లవి కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన 75వ వార్డు చిన్నబాబు వీధి పాఠశాల ప్రారంభోత్సవంలో కూడా ఆమె మేయర్తో కలిసి దీపం వెలిగించడానికి నిరాకరించి, ‘మీరే వెలిగించుకోండి‘ అని ఖరాఖండీగా చెప్పేశారు.అవమానించారు: ఎమ్మెల్యే పల్లవి ఆవేదనఈ ఘటనపై ఎమ్మెల్యే పల్లవి స్పందిస్తూ.. ‘తాను బిడ్డకు జన్మనిచ్చి కేవలం 10 రోజులే అయిందన్నారు. కనీసం మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని, అయినా ప్రజా సమస్యల కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం అని వచ్చాననని, అయితే, ఈ విధంగా అవమానించడం దారుణం అని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే మేయర్ ప్రియ స్పందిస్తూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ, వివాదం సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు. -
రొమాంటిక్ థ్రిల్లర్గా అందరన్
తమిళసినిమా: గిరీష్ పిక్చర్స్ పతాకంపై ఎంకే.సాంబశివం నిర్మించిన చిత్రం అందరన్. సంతోష్రావణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు ప్రజన్, ఇవానా వరుణ్ హీరోహీరోయిన్గా నటించారు. అనుపమకుమార్, ఆదిరన్ పద్మన్, అరువిబాలా, ఎంకే.సాంబశివం, రమేష్బాబు, అర్జున్దేవ్, ప్రియాంకసెల్వి, ఐశ్వర్య కన్నన్, వీజే. రాజు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. స్థానిక సాలిగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు సంతోష్ రావణన్ మాట్లాడుతూ అందరన్ అంటే హంటర్ అని అర్థం అన్నారు. ఒక సీరియస్ కథాంశంతో రూపొందించిన కథా చిత్రం అందరన్ అని చెప్పారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఒక సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ విషయాన్ని తాను ఇప్పటివరకు నిర్మాతకు కూడా చెప్పలేదన్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రం కై ్లమాక్స్లో ఒక ప్రత్యేక విషయం ఉంటుందని చెప్పారు. చిత్ర నిర్మాత సాంబశివం మాట్లాడుతూ తాను ఇంతకుముందు అడవి, మనిదర్గళ్ చిత్రాలను నిర్మించానని, ఆ రెండు చిత్రాలతో ఈ చిత్రానికి మంచి కనెక్ట్ ఉందని పేర్కొన్నారు. ఇందులో సమాజానికి అవసరమైన ఒక విషయాన్ని చెప్పామన్నారు. దాన్ని క్రైమ్ థ్రిల్లర్ రూపంలో చెప్పామని నిర్మాత పేర్కొన్నారు. -
చైన్నెలో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఏవీయేషన్ కేంద్రం
సాక్షి, చైన్నె: భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సంస్థలలో ఒకటైన ’గ్లోబల్ ఫ్లైట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ చైన్నెలో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ క్యాంపస్లో సరికొత్తగా విస్తరించిన శిక్షణ మౌలిక సదుపాయాల కేంద్రాన్ని నెలకొల్పింది. యూడీఎస్ గ్రూప్లో భాగమైన ఈ సంస్థ ఏర్పాటు చేసిన కొత్త కేంద్రాన్ని తమిళనాడు రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కే.ఏ. సెంగోట్టయన్ ప్రారంభించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్, సీఐఎస్ఎఫ్ డీఐజీ, పొన్ని ఐపీఎస్, బీసీఏఎస్ , ఏఏఐ సంస్థల ఉన్నతాధికారులతో పాటు జీఎఫ్హెచ్ఎస్, జీఎస్ఏ, ఏఎస్డీఐ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎఫ్హెచ్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సరితా కుమారి మాట్లాడుతూ.. అద్భుతమైన సేవలు, నిబంధనల అమలు, నైపుణ్యాభివృద్ధి అనే సూత్రాలకు కట్టుబడి తమ సంస్థ పనిచేస్తున్నట్టు వివరించారు. విమానయాన రంగ అభివృద్ది ప్రయాణంలో నమ్మకమైన భాగస్వామిగా జీఎఫ్హెచ్ఎస్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్టు వివరించారు .యూజీసీ గుర్తింపు పొందిన బీబీఏ , బీఎస్సీ ఏవియేషన్ వంటి డిగ్రీలతో పాటు పలు సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్టు ప్రకటించారు. అమెట్ విశ్వవిద్యాలయంతో కలిసి ప్రత్యేకమైన మూడేళ్ల బీబీఏ , బీఎస్సీ ఏవియేషన్ కోర్సులను అందిస్తున్నట్టు గుర్తు చేస్తూ, ఈ ఉమ్మడి ప్రోగ్రామ్ కింద ఎంపికై న అర్హులైన విద్యార్థులకు, కోర్సులో చేరిన తొలి రోజునే ఉద్యోగ నియామక పత్రం అందజేయడం జరిగిందన్నారు. విమానయాన విద్యా రంగంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగుగా పేర్కొన్నారు. -
మెగాఫోన్ పట్టనున్న మరో వారసురాలు
తమిళసినిమా: రాఘవ లారెన్న్స్ పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చేది డాన్న్స్. తాను నృత్య దర్శకత్వంలో చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్ వంటి స్టార్స్ను ఆడించారు. ఇకపోతే ఈయన పేరు చెబితే గుర్తుకు వచ్చే మరో విషయం హారర్ థ్రిల్లర్ కథా చిత్రాలు. ముని చిత్రం నుంచి కాంచన 3 వరకు హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రాలు చేసి సక్సెస్ను సాధించారు. ప్రస్తుతం కాంచన 4 చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా ఇతర దర్శకుడితో బెంచ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలా నృత్య దర్శకుడు, కథానాయకుడు, నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను సాధిస్తున్న రాఘవ త్వరలో తన వారసురాలిని రంగంలోకి దింపబోతున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లారెన్న్స్ రాఘవేంద్రస్వామి భక్తుడు అన్నది తెలిసిందే. ఈయన కూతురికి రాఘవి అనే నామకరణం చేశారు. ఈమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్యను చదువుతున్నారట. త్వరలోనే చైన్నెకి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆమె త్వరలోనే మెగాఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
పుస్తకాల పంపిణీ ప్రారంభం
2026–27 విద్యా సంవత్సరానికి కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నోట్స్, ఇతర సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ ప్రక్రియ మీద విద్యా శాఖ దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా విద్యా మంత్రి రాజ్ మోహన్ ప్రారంభించారు. ఉదయం అరుంబాక్కం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న అల్పాహార పథకం, అభ్యాస సామర్థ్యం, విద్య పరంగా కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పించిన మౌళిక సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు, నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు, పాదరక్షలు, తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పుస్తకాల పంపిణీలో నిమగ్నమయ్యారు. కాగా, గత డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన అల్పాహార పథకాన్ని టీవీకే ప్రభుత్వం కూడా అమలు చేస్తూ చర్యలు తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం విద్యార్థులకు అందజేశారు. అన్ని చోట్ల అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకం అమలును పర్యవేక్షించారు. చైన్నె అన్నానగర్లో సాంఘీక సంక్షేమ శాఖమంత్రి జగదీశ్వరి పిల్లలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. సాక్షి, చైన్నె: గతంతో పొల్చితే ఈ సారి వేసవి సెలవులు తక్కువే. పది, ప్లస్ ఒన్, ప్లస్టూ పబ్లిక్ పరీక్షల సమయంలో ఎన్నికలు సైతం రావడంతో ఓట్ల ప్రచార సందడి హోరెత్తింది. ఎన్నికల అనంతరం ఓట్ల ఫలితాలు వెలువడ్డ నాలుగో రోజు నుంచే ముందుగా నిర్ణయించిన మేరకు ప్లస్టూ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్లస్టూ ముగించిన విద్యార్థులు ఉన్నత చదువుల మీద దృష్టి పెడుతూ, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో వివిధ కోర్సుల ఎంపిక నిమిత్తం దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో మే నెలలో ఓ వైపు రాష్ట్రంలో అధికార మార్పు తదుపరి హాట్..హాట్గా పరిగణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో భానుడు సైతం మరింత భగ ..భగ మండటంతో వేసవి కష్టాలు ఎక్కువే. జూన్ 1వ తేది నుంచి పాఠశాలలు తెరిచేందుకు ముందుగా నిర్ణయించినా, భానుడి సెగ కారణంగా మూడు రోజులు వాయిదా వేశారు. ఎట్టకేలకు గురువారం నుంచి బడి బాటను విద్యార్థులు పట్టక తప్పలేదు. ఉదయాన్నే.. గురువారం ఉదయాన్నే పిల్లలను రెడి చేసి బడులకు పంపించే ఏర్పాట్లలో తల్లిదండ్రులు మునిగారు. సెలవులు ముగియడంతో 2026–27 విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలు, సీబీఎస్ఈ బడులలో 1 నుంచి 12 తరగతులను ప్రారంభమయ్యాయి. అన్ని పాఠశాలల్లో ముందుగానే మౌళిక సదుపాయాల కల్పన, మరమ్మతులు వంటి ప్రక్రియల్ని ముగించారు. పాఠశాలల పునర్ ప్రారంభంతో ఉదయాన్నే విద్యార్థులు బడి బాట పట్టారు. అనేక పాఠశాలల వద్ద విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. రోజా పువ్వులు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. ఇక, విద్యార్ధుల్ని తీసుకెళ్లే వాహనాల్లో ఓవర్ లోడింగ్లకు ఆస్కారం ఇవ్వని రీతిలో అధికారులు నిఘాతో వ్యవహరించారు. అల్పాహార పథకం అమలులలో పిల్లలతో మంత్రి జగదీశ్వరివిద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని ఈ పోస్టు పెట్టారు. ‘కొత్త ఆశలు, ఆశయాలతో ఈ విద్యా సంవత్సరం మొదటి రోజున పాఠశాలలకు వెళ్తున్న నా ప్రియమైన విద్యార్థి లోకానికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యలు చేశారు. మీ భవిష్యత్తును వెలుగుమయం చేయగల ఏకై క శక్తి ఒక్క ’విద్య’కు మాత్రమే ఉందని, ఉన్నతమైన కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి చదవండి. మీరు పాఠశాలకు వెళ్లే ప్రతి రోజూ మీ జీవిత పురోభివృద్ధికి ఒక బాట కావాలి. ఎల్లప్పుడూ సంతోషంగా చదువుకోండి, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది!’ అని ఆకాంక్షించారు. తమిళనాట పాఠశాలలు పునఃప్రారంభం -
టెస్ట్ షూట్లోనే ప్రశంసలు
ఎల్ఐసీ రిజల్ట్ను జీర్ణించుకోలేకపోతున్నా! తమిళసినిమా: విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వారి అంచనాలు రీచ్ కాకపోతే చాలా నిరాశకు గురవుతున్నారు. అలాంటి నిరుత్సాహం నుంచి దర్శకుడు విఘ్నేష్శివన్ ఇంకా బయట పడలేదు. నయనతార భర్త అయిన ఈయన తాజాగా రౌడీ పిక్చర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం లవ్ ఇన్సూరెన్న్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంలో ఎస్జే సూర్య, దర్శకుడు అమీర్ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత నెలలో తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పెద్దగా పొందలేకపోయింది. ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నీ రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి.ఈ చిత్రం మాత్రం ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. దీనిపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేశారు. అందులో కొన్ని చిత్రాలు నెగెటివ్ టాక్ను అధిగమించి విజయం సాధిస్తాయి. అయితే కొన్ని చిత్రాల పరిస్థితి అలా లేదు. సినిమా రంగంలో ఆదరణ లేని కొన్ని చిత్రాల తలరాత ఇలానే ఉంటుంది. విమర్శలు రాసి తమ తెలివి, ఆధిక్యతను చాటుతున్నారు. ఆ చిత్రాన్ని చూడవద్దు అంటూ దర్శకుని కలలను నలిపేస్తున్నారు. లవ్ ఇన్సూరెన్న్స్ కంపెనీ చిత్ర బాక్సాఫీస్ రిజల్ట్ను నేను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను. ఈ చిత్రానికి మొదటి వారం ఆదరణ బాగానే ఉంది. ఆ తరువాత మారిపోవడం చాలా బాధ అనిపించింది. ఇటీవల ఒక దర్శకుడు ఇలా అన్నారు. ఒక చిత్రం విజయం అందులో ఉన్న దానికంటే బయట అధికంగా ఉంటుంది అని అన్నారని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ తమిళసినిమా: ఎవరికై నా ప్రశంసలు అంత సులభంగా రావు. కొందరు ముఖస్తుతి కోసం ప్రశంసలు కురిపించినా, నిజమైన ప్రశంసలు ప్రతిభతోనే వస్తాయి. అలా నటి కయదులోహర్ టెస్ట్ షూట్లోనే దర్శకుడు మారిసెల్వరాజ్ ప్రశంసలు అందుకున్నారు. బైసన్ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత మారిసెల్వరాజ్ ధనుష్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి మరి కొంత సమయం పడుతుండడంతో మారి ఈ మధ్యలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మంజనధి అని టైటిల్ను నిర్ణయించారు. ఇందులో తన తొలి చిత్రం పరియేరుమ్ పెరుమాళ్లో నటించిన కదిర్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. అందులో కయదులోహర్, ప్రియాంకమోహన్ ఇప్పటికే ఎంపికయ్యారు. ఇందులోని ఒక కథానాయకి పాత్రకు నటి కయదులోహర్ సరిగా నప్పుతారా అన్న సందేహం దర్శకుడు మారికి కలిగిందట. దీంతో ఆమెకు మాత్రం టెస్ట్ షూట్ నిర్వహించారట. అందులో ఆమె నటన చూసి దర్శ కుడు ఫిదా అయినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ చిత్రం తరువాత కయదులోహర్ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటిని మరిచిపోయారని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అలా టెస్ట్ షూట్లోనే దర్శకుడు ప్రశంసలు అందుకోవడం ఆమెకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఈచిత్రంలో మరో కథానాయికి కూడా ఉంటుందని సమాచారం. ఇకపోతే దర్శకుడు మారినే నిర్మాతగా వ్యవహరిసు న్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు
1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం సాక్షి, చైన్నె : అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా తమిళనాడు పారిశ్రామిక రంగంలో సరికొత్త శకానికి సీఎం జోసెఫ్ విజయ్ నాంది పలికారు. రాష్ట్రంలో ఏకంగా రూ.18,600 కోట్ల భారీ పెట్టుబడులతో మూడు మెగా ప్రాజెక్టులను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో ( ఎల్ అండ్ టీ) ముందుకు వచ్చింది. దీని ద్వారా సుమారు 8,200 మందికి ఉపాధి లభించనుంది. సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశ్రమల శాఖలో జరిగిన మొట్టమొదటి అవగాహన ఒప్పందం గురువారం జరిగింది. ఈమేరకు చైన్నెలోని సచివాలయంలో సీఎం విజయ్ సమక్షంలో ఎల్అండ్టీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఈ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తమిళనాడులో ఎల్అండ్టీ గ్రూప్ మరిన్ని పెట్టుబడులతో తన ఉనికిని చాటుకోవడాన్ని సీఎం అభినందించారు. రాష్ట్రంలో ఆ సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేర్వేరు రంగాల్లో ఈ మూడు ప్రాజెక్టులను ఎల్అండ్టీ చేపట్టనుంది. 2036 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే సీఎం జోసెఫ్ విజయ్ ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఈ మల్టీ–సెక్టార్ పెట్టుబడులు ఒక మైలురాయిగా నిలవనున్నాయని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారాా రాష్ట్రంలో డిజిల్ మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు మరింత బలోపేతం అవుతాయన్నా. అలాగే కాట్టుపల్లి షిప్యార్డ్ విస్తరణ ద్వారా కోస్టల్ విండ్ పవర్ (సముద్ర తీర పవన విద్యుత్) రంగానికి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు సమకూరుతాయని పేర్కొన్నారు. ముందుగా సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టుల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయికుమార్, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయకుమార్ , గైడెన్స్ తమిళనాడు ఎండీ డాక్టర్ అలర్మేల్మంగై , ఎల్అండ్టీ ప్రతినిధి కె.జి. సత్యనారాయణన్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరిధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాల్లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇందు లో భాగంగా తిరుత్తణి యూనియన్లోని కేజీ.కండ్రిగ లో ప్రభుత్వం లెక్కల ప్రకారం వరి కొనుగోలు పూర్తి చేసినట్లు పేర్కొంటూ కొత్తగా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు వీలుకాదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి విక్రయంకు పేర్లు నమోదు చేసుకున్న 82 మంది రైతులు పంట దిగుబడి చేసి ట్రాక్టర్ల ద్వారా వరి కొనుగోలు కేంద్రంకు తీసుకొచ్చి పది రోజులుగా ఎదురుచూస్తున్న అధికారులు కొనుగోలుకు మొగ్గు చూపలేదు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు తమిళనాడు రైతుల సంఘం ద్వారా గురువారం కేజీ,కండ్రిగలో ధర్నా చేపట్టేందుకు వంద మంది రైతులు ఏకమైయ్యారు. వారితో చర్చలు జరిపేందుకు అధికారులు ఆహ్వోనించడంతో ఆర్ఐ కార్యాలయం వద్ద రైతులు ఽఊరేగింపుగా వెళ్లారు. రైతులతో తహసీల్దారు కుమార్ చర్చలు జరిపారు. తర్వాత వరి కొనుగోలు కేంద్రంలో పేర్లు నమోదు చేసిన రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. -
విద్యుత్ బోర్డులో హార్డ్ డిస్క్ల మాయం
సాక్షి ,చైన్నె: తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో అత్యంత కీలకమైన డేటా ఉన్న హార్డ్ డిస్క్లు మాయమవడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని, ఇందులో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే.. ఎవ్వరూ తప్పించుకోలేరని ఆ శాఖ మంత్రి నిర్మల్కుమార్ స్పష్టం చేశారు. వివరాలు.. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ బోర్డులో భారీ స్కాం జరిగినట్టుగా గుర్తించి, పలువురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కార్యాలయంలో కీలక హార్డ్ డిస్క్లు మాయం కావడం తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ. 397 కోట్ల ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు, ఇతర టెండర్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశాలు ఉన్న ఈ హార్డ్ డిస్క్లు గత నెల 16,17 తేదీలలో మాయమైనట్టు గుర్తించారు. మాయమైన ఐదేళ్ల అవినీతి రికార్డులు ఈ వ్యవహారంపై మంత్రి నిర్మల్కుమార్ మాట్లాడుతూ, కీలకమైన విభాగాల నుండి కొన్ని హార్డ్ డిస్క్లు చోరికి గురైనట్టు, గత ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలు, ఇతర డాక్యుమెంట్లు , ఉద్యోగ నియమాకాలు తదితర అంశాలకు సంబంధించి ఈ హార్డ్ డిస్క్లలో వివరాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆడిట్ నిర్వహిస్తున్నారని, పూర్తి నివేదిక వచ్చాకే ఎన్ని హార్డ్ డిస్క్లు మాయమైనట్టో అన్న కచ్చితమైన సంఖ్య తెలుస్తుందన్నారు. గత నెలలో శాఖకు చెందిన కొందరు అధికారులను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశామని గుర్తు చేస్తూ, ఆతర్వాత ఈ చోరీ జరగడంతో వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సెంథిల్ బాలాజీ మంత్రిగా ఉన్న కాలంలోనే విద్యుత్ శాఖలో భారీగా ట్రానన్స్ఫార్మర్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ ఆరోపణలను సెంథిల్ బాలాజీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందని, ఈ సమస్యను అధిగమించ లేని పరిస్థితుల్లో డిస్క్లు మాయం అంటూ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్క్లు టీవీకే హయంలో మాయమైందన్న విషయాన్ని అందరు గుర్తెరగాలన్నారు. ఇక, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గత డీఎంకే ప్రభుత్వ అక్రమాలను కప్పిపుచ్చేందుకు టీవీకే ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆరోపించారు. -
కొత్త భవనంలోకి పుదుచ్చేరి లోక్నివాస్
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అధికారిక నివాసం, కార్యాలయం అయిన లోక్ నివాస్(రాజ్ భవన్) గురువారం సరికొత్త భవనంలోకి మారింది. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కుబేర్ వీధిలోని నూతన సముదాయంలో లోక్ నివాస్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త కార్యాలయంలో అడుగుపెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్నాథన్ తన మొదటి రోజు విధుల్లో భాగంగా.. రాష్ట్రంలోని మహిళలు, వృద్ధులకు లబ్ధి చేకూర్చే 3 అత్యంత కీలకమైన ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేసి ఆమోదం ముద్ర వేశారు. ఆమోదం పొందిన 3 కీలక ఫైళ్ల వివరాలు రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 21 నుండి 55 ఏళ్ల లోపు వయసు గల కుటుంబ మహిళా యజమానులకు (కుటుంబ పెద్దలకు) ఇచ్చే నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.2,500కు పెంచుతూ గవర్నర్ మొదటి ఫైలుపై సంతకం చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 64,450 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.16.11 కోట్లను కేటాయించింది. వృద్ధులు, నిరాశ్రయులైన మహిళలకు అందించే నెలవారీ సామాజిక పింఛన్ల నిధుల విడుదలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం 1,96,616 మంది లబ్ధిదారులకు వారి అర్హతను బట్టి రూ.2,500, రూ.3,000 మరియు రూ.4,000 చొప్పున పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కొరకు రూ.56.32 కోట్ల బడ్జెట్కు ఆమోదం లభించింది. పుదుచ్చేరి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ వాటాదారులైన పుదుచ్చేరి ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకుకు డివిడెండ్ వాటా కింద రూ.37.76 లక్షలు , ప్రత్యేక వాటా నిధుల చెల్లింపుల ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు. కార్యాలయ మార్పునకు కారణం భారతి పార్క్ ఎదురుగా ఉన్న పాత లోక్ నివాస్ భవనం చాలా పురాతనమైనది కావడంతో, దానికి త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, పాత డిస్టిలరీ ప్రాంగణంలో అత్యాధునికంగా నిర్మించిన కొత్త భవనంలోకి గవర్నర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించారు. నూతన కార్యాలయంలో తొలిరోజే ప్రజా సంక్షేమ ఫైళ్లకు ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
అగ్రస్థానమే లక్ష్యం
సాక్షి, చైన్నె: ఖనిజ వనరుల నిర్వహణ, అన్వేషణలో తమిళనాడును దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా జియాలజీ అండ్ మైనింగ్ శాఖ పని చేయాలని సీఎం జోసెఫ్ విజయ్ ఆదేశించారు. గురువారం చైన్నె సచివాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన సహజ వనరుల శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పర్యావరణానికి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో ఖనిజాలను వెలికితీయడం , అక్రమ రవాణాను అరికట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో అధికారులు ఖనిజ వనరుల పరిరక్షణకు తీసుకోబోయే పలు ఆధునిక సాంకేతిక విధానాలను సీఎంకు వివరించారు. ప్రకృతి ప్రసాదించిన ఖనిజ వనరులను భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని సుస్థిరాభివృద్ధికి అనుగుణంగా మాత్రమే ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఖనిజ వనరుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఎక్కడా కూడా చట్టవిరుద్ధంగా ఖనిజాల అక్రమ రవాణా జరగకుండా కఠినమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజయ్ స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు ఎన్. ఆనంద్, టి.కె. ప్రభు, మరియ విల్సన్, సీఎస్ సాయికుమార్, ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎమ్.ఏ. సిద్దిఖ్, నీటి వనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సత్యప్రద సాహూ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ రేసులోకి ప్రవీణ్ చక్రవర్తి సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో అధికార పక్షం టీవీకే మద్దతుతో కాంగ్రెస్ నేత ప్రవీణ్చక్రవర్తి ఎంపీ కానున్నారు. ఆయన కోసమే టీవీకే అధినేత, సీఎం విజయ్ ఈ పదవిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరగనుండగా, శుక్రవారం ప్రవీణ్ చక్రవర్తి తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీలో అధికార కూటమికి ఉన్న స్పష్టమైన మెజారిటీ నేపథ్యంలో ప్రవీణ్ చక్రవర్తి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రవీణ్ చక్రవర్తికి కానుక ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుండి కాంగ్రెస్ను బయటకు తీసుకువచ్చి, విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు కుదిర్చడంలో ప్రవీణ్ చక్రవర్తి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ డేటా విభాగా నికి అధిపతిగా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడు. చైన్నెలోనే పుట్టి పెరిగిన ఈయన ఆర్థిక శాస్త్రవేత్తగా, విదేశాలలో ఉన్నత చదువులు చదివిన మేధావిగా గుర్తింపు పొందారు. గతంలో మైలాడుతురై లోక్సభ సీటు విషయంలో రెండుసార్లు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జేజారింది. తమిళనాడులో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు మారాయని, డీఎంకే కంటే విజయ్తో పొత్తు పెట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని రాహుల్ గాంధీకి డేటా ఆధారిత నివేదికలు ఇచ్చింది ప్రవీణే కావడం గమనార్హం.అన్నామలై ట్వీట్! – నేడు 12 గంటలకు కీలక ప్రకటన సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు,కె. అన్నామలై కొత్త పార్టీని స్థాపించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గురువారం పుట్టినరోజు జరుపుకున్న ఆయన సోషల్ మీడి యా వేదికగా చేసిన ఒక ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా ద్వారా మీ అందరినీ కలవడానికి ఎదురుచూస్తున్నాను అని అన్నామలై ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో ఆయన తన సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని సంకేతాలు వెలువడ్డాయి. -
వైద్య చరిత్రలో అరుదైన రికార్డు
సాక్షి, చైన్నె : చైన్నె వడపళనిలోని కావేరి హాస్పిటల్ వైద్యులు వైద్య రంగంలోనే అత్యంత అరుదైన, వినూత్న శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. గత ఎనిమిదేళ్లుగా కోలోవాజినల్ ఫిస్టులా సమస్యతో బాధపడుతున్న 73 ఏళ్ల వృద్ధురాలికి గుండెలోని రంధ్రాలను పూడ్చడానికి ఉపయోగించే కార్డియాక్ అక్లూజన్ డివైస్ను ఉపయోగించి వైద్యులు శాశ్వత పరిష్కారం చూపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణు లు ఉమ్మడిగా కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం వైద్య చరిత్రలో ఒక రికార్డును నమోదు చేశారు. గతంలో ఆమెకు పెద్దపేగును పక్కకు మళ్లించే కొలోస్టమీ సర్జరీతో పాటు మరికొన్ని ప్రధాన శస్త్రచికిత్స లు వేర్వేరు ఆసుపత్రుల్లో జరిగినప్పటికీ.. అస్సలు సమస్య మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే వచ్చింది. ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నడిపించిన డాక్టర్ టి.కె. ఆనంద్ (సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), ప్రొఫెసర్ పి. మనోకర్ (సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్) మాట్లాడుతూ.. గుండె కోసం తయారు చేసిన పరికరాన్ని మరో అనాటమికల్ భాగంలో అమర్చడం సాంకేతికంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని, అయితే సరైన ప్రణాళిక, సమన్వయంతో రోగికి పునర్జన్మను ప్రసాదించగలిగామని తెలిపారు. కావేరి హాస్పిటల్స్ కో–ఫౌండర్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ.. సంప్రదాయ వైద్య విధానాలు విఫలమైన చోట, వినూత్న ఆలోచనలు , విభాగాల మధ్య సమన్వయం ద్వారా రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నామన్నారు. -
టాస్మాక్ ప్రైవేటీకరణ?
సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ’టాస్మాక్’ మద్యం అమ్మకాల వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సంస్క్కృతికి అడ్డుకట్ట వేయాలని, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు గంజాయి, మితిమీరిన మద్యం అమ్మకాలే కారణమని భావిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసు కుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 500 మద్యం దుకాణాలను మూసివేయగా, మిగిలిన నిర్దేశిత దుకాణాలను మూసివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,171 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ప్రైవేటీకరణ దిశగా అడుగులు ఇటీవలి కాలంలో టాస్మాక్ దుకాణాల్లో ప్రతి మ ద్యం బాటిల్పై రూ.10 కొన్ని చోట్ల, మరికొన్ని చో ట్ల రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారనే అంశం సోషల్ మీడియాలో తీవ్ర వివాదంగా మారింది. ప్ర భుత్వ సంస్థే ఇలా అవినీతికి పాల్పడుతోందనే చెడ్డపేరు వస్తుండటంతో సీఎం విజయ్ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పరిశీలనలోని కొత్త విధానాలు పుదుచ్చేరిలో ప్రభుత్వ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా మద్యం విక్రయించడం జరు గుతున్నది. అక్కడ మద్యంపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ, దుకాణాల బాధ్యత ప్రైవేట్ వర్గాలదే ఉంటుంది. ఈ విధానాన్ని తమిళనాడులో అమలు చేస్తే వచ్చే లాభనష్టాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. అలాగే, కేరళలో అనుసరిస్తున్న మద్యం విక్రయ పద్ధతులను పరిశీలించి, ప్రస్తుతం జరుగుతున్న తప్పులను, అవినీతిని అరికట్టవచ్చని అధికారులు సీఎంకు సూచించడం గమనార్హం. ఉద్యోగుల భద్రతపై దృష్టి ఒకవేళ మద్యం విక్రయాలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే, ప్రస్తుతం టాస్మాక్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలనే దానిపై కూడాచర్చించడం గమనార్హం. ప్రభుత్వ కొనుగోలు, పంపిణీ వ్యవస్థను తన వద్దే ఉంచుకుని, అమ్మకాలను ప్రైవేటీకరించే ఈ సరికొత్త పద్ధతి రాబోయే రెండు నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి టాస్మాక్ ద్వారా సుమారు 40 వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుండటం గమనార్హం. -
టాస్మాక్ దుకాణాన్ని పునఃప్రారంభించాలని వినతి
తిరువళ్లూరు: జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్మాక్ దుకాణాలను మూసివేయడంతో ఆంధ్రకు వెళ్లి కల్తీ మద్యం తాగుతూ అనారోగ్యానికి గురవుతున్నారని వా పోయిన మహిళలు మూసేసిన టాస్మాక్ దుకాణాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరారు. కలెక్టర్ కవితను కలిసి గురువారం వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని పళ్లవాడలో తమిళనాడు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల క్రితం టాస్మాక్ దుకాణ ం ఏర్పాటు చేసింది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 717 దుకాణాలను తొలగించాలని జీఓ ఇచ్చిన నేపథ్యంలో పల్లవాడలో దుకాణాలను తొలగించారు. దీంతో పలు గ్రామాలకు చెందిన మద్యం ప్రియలు సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సత్యవేడు, ఆరూరు, తడ ప్రాంతాలకు వెళ్లి అక్కడ విక్రయించే నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి గురువుతున్నారని వాపోయారు. అదే విధంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చే సమయంలో ఆంధ్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేస్తున్నారు, ప్రమాదాలు సైతం జరుగుతున్నాయని కలెక్టర్ కవిత వద్ద వాపోయారు. తమ గ్రామంలో మూసేసిన టాస్మాక్ దుకాణాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. మహిళ నుంచి వచ్చిన వినతిపై కలెక్టర్ కవిత నవ్వుతూ, మహిళలు ఇంతక ముందు మద్యం దుకాణాలను మూసేయాలని కోరేవారని, ప్రస్తుతం దుకాణాలు కావాలని కోరడం ఆశ్చర్యంగా వుందన్నారు. తొలగించిన మద్యం దుకాణాలను మళ్లీతెరిచే అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
పెద్దకుప్పంలో ఎస్పీ తనిఖీలు
తిరువళ్లూరు: నిత్యం రద్దీగా వుండే పెద్దకుప్పం ప్రాంతంలో చైన్ స్నాచింగ్ జరిగిన నేపథ్యంలో ఎస్పీ వివేకనందశుక్లా గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తిరువళ్లూరులోని రైల్వేస్టేషన్ ప్రాంతం నిత్యం రద్దీగా వుంటుంది. ఇక్కడ ప్రయాణికులతోపాటు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం రద్దీగా వుండే పెద్దకుప్పం ప్రాంతంలో రెండు రోజుల క్రితం యువతి వద్ద చైన్ స్నాచింగ్ చేయడానికి కొందరు యత్నించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన క్రమంలో ఎస్పీ వివేకానందశుక్లా గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. పెద్దకుప్పం ప్రాంతంలో ఇకపై పోలీసుల పికెటింగ్ చేయాలని గస్తీని పెంచాలని పోలీసులను ఆదేశించారు. రద్దీగా వున్న సమయంలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను పునరుద్ధరించాలని సూచించారు. -
పాఠశాలలు పునఃప్రారంభం
తిరువళ్లూరు: వేసవి సెలవులు ముగిసిన క్రమంలో జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు గురువారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండల తీవ్రత కారణంగా పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వచ్చిన వినతుల్లో భాగంగా జూన్ 4 నుంచి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. పాఠశాల పునఃప్రారంభం రోజున పుస్తకాలు, యూనిఫాం అందించాలని ఆదేశించిన క్రమంలో జిల్లా కేంద్రాలకు తరలించిన పుస్తకాలను పాఠశాలలకు చేరవేశారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రకటించిన విధంగా గురువారం యథావిధిగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థుల రాకతో సందడి నెలకొంది. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు, మొక్కలు, చాక్లెట్లు ఇచ్చి ఆహ్వానించారు. తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.6కోట్లతో నిర్మించిన పాఠశాలలో టీచర్లు మైక్రోమైక్ ద్వారా పాఠాలను బోధించారు. వెళ్లియూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కవిత తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. ఉత్సాహంగా.. ఉల్లాసంగా పళ్లిపట్టు: వేసవి సెలవుల తరువాత గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడికి చేరుకున్నారు. తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సహా విద్యా సామగ్రిని ఉపాధ్యాయులు అందజేశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు ఇచ్చి స్వాగతం పలికారు. తొలిరోజే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగు, పాదరక్షలు, యూనిపాం అందజేశారు. ఆర్కేపేట యూనియన్లోని ఎస్వీజీ.పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. మండల విద్యాశాఖ అధికారులు మోహన్, అరసు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. -
తిరుత్తణి ఆలయంలో మంత్రి గాంధీరాజన్
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంత్రి గాంధీరాజన్ గురువారం సాయంత్రం స్వామి దర్శనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరించారు. ఆపార్టీ అభ్యర్థిగా అరక్కోణం నుంచి గెలుపొందిన గాంధీరాజన్ సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో గురువారం మంత్రి గాంధీరాజన్ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబసమేతంగా మురుగన్ దర్శనానికి విచ్చేవారు. మంత్రికి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో అధికారులు స్వాగతం పలికారు. ముందుగా వినాయకుడు, షణ్ముఖర్, మూలవర్లు., వళ్లి దేవసేనలను దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవర్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి ప్రసాదాలను అందజేశారు. వృద్ధురాలి నుంచి నగలు అపహరించిన బీజేపీ కార్యకర్త తిరువొత్తియూరు: కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపం పాత నెల్లికుప్పానికి చెందిన జయరామన్ భార్య సరసు (80). గత 29వ తేదీ రాత్రి బస్టాండ్ సమీపంలోని దుకాణంలో ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కుని నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆమెను ఇంటి దగ్గర దించుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నాడు. తర్వాత ఆమె నగలను లాక్కని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు నెల్లికుప్పం వాలజపట్టు మెయిన్ రోడ్డుకు చెందిన గోవిందరాజ్ కుమారుడు అరుణ్మొళిదేవన్ (35) అని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో అతడు బీజేపీ కార్యకర్త అని తేలింది. ప్రభుత్వ టీచర్ హత్య కొరుక్కుపేట: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి ఇలంగోవన్పై దాడి, హత్యా సంఘటన విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. విల్లుపురం జిల్లాలోని వలదతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మకుళం గ్రామానికి చెందిన ఇలంగోవన్, మెల్లక్కూర్ ప్రభుత్వ ఉన్నత సెకండరీ పాఠశాలలో సైనన్స్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య విడిపోవడంతో, ఇలంగోవన్ తన తల్లి రాజమ్మల్తో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను బోధనతో పాటు, పాత ఇనుప వస్తువులను కొని అమ్మి, వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ఈలోగా, రాజమ్మల్ గత వారం చైన్నెలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఇలంగోవన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పక్క గ్రామంలో నివసించే అతని తల్లి, సోదరి తమ సెల్ ఫోన్ల ద్వారా అతనికి చాలాసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అతను ఫోన్ ఎత్తలేదు.తల్లికి అనుమానం రావడంతో, ఆమె అక్క కూతురును ఇలంగోవన్ ఇంటికి పంపింది. ఆ సమయంలో, ఇంటి ఒక వైపు తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది, అటు నుండి వస్తున్న దుర్వాసన చూసి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఆమె వెంటనే తన బంధువులకు విషయం చెప్పింది. అక్కడికి వచ్చిన బంధువులు వెనుక వైపు తెరిచి ఉన్న తలుపు గుండా ఇంట్లోకి ప్రవేశించగా, ఒక చిన్న గదిలో సోఫాపై వికృతంగా, కుళ్లిపోయిన స్థితిలో ఇలంగోవన్ మృతదేహం పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైంది. పోలీసులు ఇలంగోవన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నామలై రాజీనామా లేఖ నాకు రాలేదు
సాక్షి, చైన్నె: బీజేపీలో తీవ్ర సంచలనం రేపుతున్న అన్నామలై పార్టీ వ్యవహారంపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎలాంటి రాజీనామా లేఖ తనకు అందలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నైనార్ నాగేంద్రన్ గురువారం తిరునెల్వేలిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పార్టీ అంతర్గత పరిణామాలు , ప్రస్తుత టీవీకే ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియతమ సోదరుడు అన్నామలైకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని, ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఎవరితోనూ చెప్పలేదన్నారు. తాము కూడా ఆయనతో దీనిపై చర్చించలేదన్నారు. సాధారణంగా ఎప్పటిలాగే పార్టీ విషయాలపై మాట్లాడుకుంటున్నామని, . చిన్న విషయాన్ని కూడా మీడియానే పెద్దదిగా చూపిస్తోందన్నారు. రాజీనామా అంశంపై రెండు రోజుల్లో మాట్లాడతానని అన్నామలై అనడం గురించి ప్రశ్నించగా.. ఆ ప్రశ్నను ఆయననే అడగాలని బదులిచ్చారు. ఎన్నికల సమయంలో అన్నామలై హెలికాప్టర్ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పదువుల గురించి తెలియదు తాను ఢిల్లీ వెళ్లి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిని కలిసి వచ్చానని, అయితే కేంద్ర మంత్రి పదవి గురించి తనకెలాంటి సమాచారం రాలేదని, కేవలం మీడియాలోనే ఇలాంటి వార్తలు వస్తున్నాయని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా అన్నామలై గురువారం మీడియా ముందుకు వస్తారని సర్వత్రా భావించారు. ఇందుకు కారణం ఆయన బర్త్డే రోజుకావడమే. అయితే, ఆయన ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. పీఎం మోదీతో ఆయన భేటీ కానున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వారికీ..వీరికీ తేడా లేదు డీఎంకే ప్రభుత్వానికి, టీవీకే ప్రభుత్వానికి తేడా లేదని, గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని నాగేంద్రన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మద్యం బాటిల్పై 10 రూపాయల అదనపు వసూళ్ల గురించి మాట్లాడిన విజయ్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా టాస్మాక్ దుకాణాలలో అదే మామూళ్ల పర్వం కొనసాగుతోందని విమర్శించారు. చైన్నె అన్నాసాలైలోని విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయం నుండి హార్డ్ డిస్క్లు మాయమవడం, టెండర్లలో రూ.400 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఇప్పుడు అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎంపీ స్థానాన్ని టీవీకే పార్టీ కాంగ్రెస్కు కేటాయించడంపై నాగేంద్రన్ తీవ్రంగా స్పందించారు. టీవీకే పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒక బినామీలా వ్యవహరిస్తోందన్నారు. సీఎం విజయ్ ప్రమాణ స్వీకార ఉత్సవంలోనూ, మంత్రుల గ్రూప్ ఫొటోలోనూ రాహుల్ గాంధీ స్పష్టంగా కనిపించారని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇది మరో రూపం అని స్పష్టమవుతోందన్నారు. -
క్లుప్తంగా
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కలెక్టర్ లీల తెలిపారు. గురువారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభించడంతో వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల ఉపాద్యాయులు విద్యార్థులతో పాఠశాలల్లో చేరాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేలూరు చిన్నఅల్లాపురం యూనియన్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉదయం బడిబాట కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వేలూరు కొనవట్టంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ లీల పూలమాల వేసి స్వాగతం పలికారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందజేశారు. తోటపాళ్యం ప్రభుత్వ పాఠశాల బాలికలకు టీచర్లు కర్పూర హారతి పట్టి స్వాగతం పలికారు. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని రామసానికుప్పం గ్రామంలో విద్యార్థులకు పూలమాలలు వేసి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అర్ధకేజీ బంగారం చోరీ తిరువొత్తియూరు: చైన్నె త్యాగరాయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ లో నివసిస్తున్న సుజాత, అదే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ సంస్థలో మేనేజర్. గురువారం ఉదయం ఆమె ఇంటికి తాళం వేసి కార్యాలయానికి వెళ్లారు. ఆమె భర్త గత 4 రోజుల క్రితమే నెల్లూరు వెళ్లారు. సుజాత భర్త తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురై లోపలికి వెళ్లి చూశారు. బీరువా పగులగొట్టి అందులోని అర్ధకిలో బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. పాండి బజార్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ల ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. కారు ఢీకొని మహిళ మృతి తిరువొత్తియూరు: స్కూల్ టీచర్ నడిపిన కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం ఉదయం రాణిపేట సమీపంలోని కావేరిపాక్కం వద్ద బెంగళూరు నుంచి చైన్నెకి కారు వెళుతోంది. ఈ కారును ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ (సన్మతి–31) నడుపుతోంది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీలా (47) మృతిచెందింది. గుణ (55), జ్యోతి (45) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 10 ఐఐటీ కేంద్రాల్లో 500 ఇంధన ఆడిట్లు కొరుక్కుపేట: దేశంలోని 10 ఐఐటీ కేంద్రాల్లో సేవ్ ఎనర్జీ మిషన్లో భాగంగా 500 ఇంధన ఆడిట్లను అధిగమించిందని కిసెమ్ జాతీయ సహ సమన్వయకర్త ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల తెలిపారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ కోటక్ బ్యాంకు వారు పర్యావరణ, సుస్థిర అభివృద్ది కార్యక్రమం కింద ఒక సీఎస్ఆర్ చొరవగా 2022లో కొటక్ ఇండియా ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు సేవ్ ఎనర్జీ మిషన్ (కిసెమ్) ప్రారంభించారని అన్నారు. ఇప్పటివరకు 30 పారిశ్రామిక రంగాలలో 509కిగా ఎనర్జీ ఆడిట్లను పూర్తి చేసిందన్నారు. ఐఐటీ మద్రాసు కేంద్రంగా చేసుకుని 10 ఐఐటీ కేంద్రాల్లో ప్రారంభించిన కార్యకలాపాల్లో కేవలం ఒక సంవత్సరంలోనే కిసిమ్ నెట్వర్క్ సమష్టిగా 500లకు పైగా పారిశ్రామిక ఆడిట్లను పూర్తి చేసిందని వెల్లడించారు. విద్యుత్ తీగ తెగి పడి విద్యార్థి మృతి వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని సోలూరు గ్రామానికి చెందిన కుమరేషన్, మహేశ్వరి దంపతులకు మహేంద్రన్, నరేష్ (16) అనే ఇద్దరు కుమారులున్నారు. నరేష్ పెరి యాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్–2 వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో తమ వ్యవసాయ భూమిలో పశువులను మేతకు తీసుకెళ్లి సాయంత్రం పశువును ఇంటికి తీసుకెళుతున్నాడు. ఆ సమయంలో పెను గాలులతో కూడిన వర్షాలు కురిసింది. విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. నరేష్ పట్టుకొస్తున్న పశువు విద్యుత్ తీగను తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నరేష్కు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కుమార్తె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన తండ్రి అరెస్ట్ తిరువొత్తియూరు: నైల్లె జిల్లా మూలైక్కరైపట్టి సమీపంలోని కరుణై గ్రామానికి చెందిన ముత్తుకుమార్ (22), అదే గ్రామానికి చెందిన వంట మాస్టర్ మురుగన్ కుమార్తె విద్య (20) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను తండ్రి మురుగన్ వ్యతిరేకించాడు. గత నెల 20న విద్య, ముత్తుకుమార్ పెద్దలకు తెలియకుంఆ వివాహం చేసుకుని కరుణై గ్రామంలోని ముత్తుకుమార్ ఇంట్లో ఉంటు న్నారు. బుధవారం రాత్రి ఈ దంపతులు తమ కొత్త ఇంటి నిర్మాణ పనులను చూడడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఉన్న విద్య తండ్రి మురుగన్, ముత్తుకుమార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మరింత కోపానికి గురైన ఆయన, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇంటి తలుపులను ఇష్టానుసారంగా నరికాడు. అనంతరం ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టి, లోపలికి పెట్రోల్ బాంబు విసిరాడు. దీంతో ఇల్లు తగలబడడం ప్రారంభమైంది. చుట్టుపక్కల వారు వెంటనే నీళ్లు పోసి మంటలను ఆర్పేశారు. మురుగన్ను స్థానికులు పట్టుకుని మూలైక్కరైపట్టి పోలీసులకు అప్పగించారు. -
‘ఇండియా’ కూటమికి బీటలు
సాక్షి, చెన్నై: కేంద్రంలో అధికార ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’కూటమి క్రమంగా విచ్చిన్నమవుతోంది. కూటమి నుంచి కీలక పార్టీ డీఎంకే దూరం జరుగుతోంది. ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే కూటమి కీలక సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని గురువారం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ సమావేశంలోనూ డీఎంకే భాగస్వామి కాబోదని తేల్చిచెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ తమకు చేసిన నమ్మక ద్రోహం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధిష్టానం తేల్చిచెప్పింది. ఈ మేరకు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జూన్ 8న జరగనున్న విపక్షాల సమావేశానికి తమకు ఆహా్వనం అందినట్టు వెల్లడించింది. అయితే, ఆ భేటీకి హాజరయ్యే ఆలోచన లేదని పేర్కొంది. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు దేశ శ్రేయస్సు కోసం లేవనెత్తే సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటామని ప్రకటించింది. విపక్ష కూటమి ఏర్పడిన నాటి నుంచి దానికి కేంద్ర బిందువుగా డీఎంకే పని చేసినట్లు గుర్తుచేసింది. లోక్సభలో ఇక వేర్వేరుగానే... లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల నుంచి విడిగా కూర్చోవడానికి డీఎంకే ఎంపీలకు బుధవారం అనుమతి లభించింది. కాంగ్రెస్తో తమ పొత్తు ముగిసిందని, తమ సభ్యులు కాంగ్రెస్ సభ్యులతో కలిసి కూర్చోలేరని డీఎంకే గత నెలలో తేల్చిచెప్పింది. లోక్సభలో తమ ఎంపీల సీటింగ్ ఆరేంజ్మెంట్లో మార్పు చేయాలని కోరింది. కాంగ్రెస్ సభ్యులకు దూరంగా తమకు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై లోక్సభ సెక్రెటేరియట్ సానుకూలంగా స్పందించి, అనుమతి ఇచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకే కూటమికి దూరం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెల్చుకుంది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. విజయ్ ప్రభుత్వ మంత్రివర్గంలోనూ చేరింది. ఎన్నికల ప్రచార సమయంలోనే డీఎంకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. డీఎంకే అధినేత స్టాలిన్తో ఒకే వేదికను పంచుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొన్నారు. దీంతో డీఎంకే, కాంగ్రెస్ బంధం పూర్తిగా తెగిపోయినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఆ కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉండేది. తమ కూటమి తరఫున ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అభ్యరి్థత్వాన్ని స్టాలిన్ ప్రతిపాదించారు. -
త్రిషతో వివాదం.. సీఎం విజయ్కి పార్తీబన్ కానుక!
తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.ఇక సీఎం విజయ్ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్ను విజయ్కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
సీఎం విజయ్ త్యాగం.. కాంగ్రెస్కు గుడ్న్యూస్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్కు విజయావకాశాలున్నాయి.కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు. -
తమిళనాట భారీ ట్విస్ట్.. విజయ్, పళనిస్వామి భేటీపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామిని కలవడానికి తమిళనాడు సీఎం విజయ్ ఎప్పుడూ సమయం కోరలేదని ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుసామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిగా ఖండించారు. బుధవారం హోసూరులో మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. మంత్రి నిర్మల్ కుమార్ ప్రెస్మీట్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. సీఎం విజయ్ ఇప్పటివరకు పళణి స్వామిని కలవడానికి అనుమతి అడిగింది లేదన్నారు. తాము నిరాకరించింది లేదని ఆయన తేల్చి చెప్పారు.సీఎం విజయ్పై ఘాటు వ్యాఖ్యలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ రాజకీయ శైలిపై కేపీ మునుసామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం విజయ్ కష్టపడి ఈ స్థాయికి రాలేదని, సినిమా పరిశ్రమలో ఒక మాయను సృష్టించి, ఆ మాయా రూపాన్ని ఇన్స్ట్రాగామ్, రీల్స్లో చూపించారని ఎద్దేవా చేశారు. యువత నమ్మి ఓటేశారని పేర్కొంటూ, తిరుచ్చిలో జరిగిన కృతజ్ఞత సభలో సినిమాలో డైలాగులు చెప్పినట్లే కేవలం 15 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను ఆయన చదివారు అంతే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.సొంత ఆలోచన లేదుప్రజలు మనకెందుకు ఓటేశారని, మనం ఇచ్చిన హామీలు ఏంటి అని, వాటి కోసం ఎలాంటి పథకాలు తీసుకురావాలనే విషయాలపై సీఎం విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం రోజే మాట్లాడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అక్కడ ఆయన మౌనంగా ఉండిపోయారని, ప్రధాని మోదీతో కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేశారని, ఇందులో ఓ ఐదు నిమిషాలు కుశల ప్రశ్నలకు, మరో ఐదు నిమిషాలు రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు సమయం ఉంటుందా..? అని ప్రశ్నించారు. సీఎం విజయ్కు సొంత ఆలోచనలు లేవని, ఆయన విషయం లేని సీఎం అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతరించిపోదని, ఒకే ఒక్క కార్యకర్త ఉన్నా ఆ పార్టీ బతికే ఉంటుందని మునుసామి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు వందేళ్లుగా అధికారంలోకి రాకపోయినా సిద్ధాంతం కోసం పోరాడుతున్నారని, అన్నాడీఎంకే కూడా అలాంటి బలమైన సిద్ధాంతం కలిగిన పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు సీఎం విజయ్కు తెలియవని , ఒకవేళ విజయ్ నిజంగానే ఎంజీఆర్, జయలలితను విమర్శించకూడదు అనుకుంటే.. ఆయన మొదట కలవాల్సింది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామినే అని స్పష్టం చేశారు. -
నేరాల అదుపునకు పటిష్ట చర్యలు
సాక్షి, చైన్నె: మహిళలు, పిల్లలపై నేరాల అదుపునకు పటిష్ట చర్యలు తీసుకుంటానని తమిళనాడు కొత్త డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ స్పష్టం చేశారు. తమిళనాడు శాంతిభద్రతల డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను అరికట్టడంతో పాటు మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు కీలక అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ఆ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.దీంతో తొమ్మిది నెలల అనంతరం పూర్తి స్థాయి లో శాంతి భద్రతల విభాగం డీజీపీ నియామకానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకు యూపీఎస్సీ సిఫారసుల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ కుమార్ అగర్వాల్ను తమిళనాడు శాంతిభద్రతల డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైళ్ల శాఖకు సందీప్ రాయ్ రాథోడ్ తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అప్పటివరకు ఉన్న ఇన్చార్జ్ డీజీపీ వెంకట్రామన్ను బదిలీ చేసి,ఆయన స్థానంలో సందీప్ రాయ్ రాథోడ్ను డీజీపీగా ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆయనను బదిలీ చేశారు. సందీప్ రాయ్ రాథోడ్ను జైళ్ల శాఖ డీజీపీగా నియమించారు. ఇది వరకు జైళ్ల శాఖ అదనపు డీజీపీగా ఉన్న శంకర్ను అత్యంత కీలకమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏడీజీపీగా పంపించారు.బాధ్యతల స్వీకరణ బుధవారం మెరీనా తీరంలోని హెడ్ క్వార్టర్స్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ అగర్వాల్కు పలువురు ఉన్నతాధికారులు పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేష్ కుమార్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం విజయ్కు, తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కు, నేరాల నియంత్రణకు ప్రజలందరూ తమిళనాడు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరా రు. పటిష్ట చర్యలతో ముందుకెళ్తామని, నేరగాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న డీజీపీ సీఎం విజయ్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయనకు సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులు
– సీనియర్లకు రెండేసి జిల్లాలు సాక్షి, చైన్నె:తమిళనాడులో జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం జాబితాను సీఎం విజయ్ బుధవారం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు వీలుగా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 38 జిల్లాలో పది జిల్లాలో టీవీకేకు ఒక్కరంటై ఒక్క ఎమ్మెల్యేలు లేరు. 34 మందిమంత్రులలో పలువురు సీనియర్ మంత్రులకు రెండేసి జిల్లాలను అప్పగించారు. మంత్రి ఆనంద్కు విల్లుపురం, కడలూరు, ఆధవ్ అర్జునకు చైన్నె, తిరువణ్ణామలై, వెంకటరమణన్కు మైలాడుతురై, కుమార్కు తిరువళ్లూరు, మరియ విల్సన్కు తిరునల్వేలి, తెన్నరసుకు కాంచీపురం, రాజ్ మోహన్కు పెరంబలూరు, శరత్కుమార్కు చెంగల్పట్టు, రంజిత్కుమార్కు తిరుపత్తూరు, వీసీకే వన్నియరసుకు కళ్లకురిచ్చి, గాంధి రాజ్కు రాణి పేట, రాజ్కుమార్కు ధర్మపురి, అరియలూరు జిల్లాలను కేటాయించారు. ఐయూఎంఎల్ షాజహాన్కు నాగపట్నం, వినోద్కు తంజావూరు, విజయలక్ష్మికి కరూర్, లోకేష్కు నామక్కల్, అరుణ్ రాజ్కు తిరుప్పూర్, కమలికి నీలగిరి, విజయ్ బాలాజీకి వేలూరు, సెంగోట్టయ్యన్కు ఈరోడ్, సంపత్కుమార్కు కోయంబత్తూరు, మదురై, తేనిలు నిర్మల్కుమార్కు, పుదుకోట్టై మహ్మద్ పర్వేజ్కు అప్పగించారు. అలాగే, శివగంగై – ప్రభు, కృష్ణగిరి– కీర్తన, విరుదునగర్ – జగదీశ్వరి, తిరువారూర్ – విశ్వనాథన్(కాంగ్రెస్), తూత్తుకుడి – శ్రీనాథ్, రామనాథపురం – మదన్ రాజా, సేలం – విజయ్ తమిళన్ పార్తీబన్, కన్యాకుమారి– రాజేష్కుమార్(కాంగ్రెస్), తెన్కాసీ – రాజీవ్, దిండుగల్– విఘ్నేష్లను ఇన్చార్జ్లుగా నియమించారు. నేటి నుంచి విద్యార్థుల బడిబాట – యూనిఫాం, పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు సాక్షి,చైన్నె: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలో గురువారం పాఠశాలల గేట్లు తెరచుకోన్నాయి. ఇప్పటికే పాఠశాలలో అన్ని రకాల పనులను ముగించిన విద్యాశాఖ అధికారులు ఈ మేరకు సర్వం సిద్ధంచేశారు. విద్యార్థులకు తొలి రోజు నుంచే యూనీఫాం, పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వివరాలు.. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి భానుడు తీవ్ర ప్రభావాన్ని చూపించారు. మార్చిలో ప్లస్ టూ, ప్లస్ఒన్ పరీక్షలు, ఏప్రిల్ మొదటి వారంలో పది పబ్లిక్ పరీక్షలు ముగించారు. ఈ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, అధికార మార్పు జరగడం చోటు చేసుకున్నాయి. అలాగే ఓవైపు భానుడి భగ.. భగతో జూన్ 1న తెరుచుకోవాల్సిన బడులు మూడు రోజులు వాయిదా వేశారు. ప్లస్టూ, పది ఫలితాలన్నీ విడుదలయ్యాయి. ఉన్నత విద్యాకోర్సుల దరఖాస్తుల పర్వం శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ఊపందుకుంది. ఈ పరిస్థితులలో 2026–27 విద్యా సంవత్సరం గురువారం ప్రారంభంకానుంది. ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలోని 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనున్నారు. కాగా విద్యార్థులను ఆహ్వానించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీసీకే 2026 అవార్డుల జాబితా విడుదల సాక్షి, చైన్నె: 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక వీసీకే పురస్కారాల గ్రహీతల జాబితాను ఆ పార్టీ అధినేత తిరుమావళవన్ బుధవారం విడుదల చేశారు. సమాజం, రాజకీయం, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి వివిధ రంగాలలో దేశ, రాష్ట్ర స్థాయిలలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఏటా ఈ అవార్డులను అందించి గౌరవిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. సామాజిక విప్లవకారులు, మహనీయుల స్మారకంగా 2007 నుండి ఏటా వీసీకే ఆధ్వర్యంలో.. అంబేడ్కర్ సుడర్, పెరియార్ ఒలి, కామరాజర్ కదిర్, అయోథిదాసర్ ఆదవన్, కాయిదేమిల్లత్ పిరై, సెమ్మొళి అవార్డులను ప్రధానం చేస్తున్నారు. అలాగే 2022 సంవత్సరం నుండి అదనంగా ’మార్క్స్ మామణి’ అవార్డును కూడా చేర్చారు. అవార్డులకు ఎంపికై ంది వీరే.. ఈ ఏడాది 2026 వీసీకే అవార్డుల విజేతలుగా అంబేడ్కర్ సుడర్ అవార్డు– కె. చొక్కలింగం (మనోన్మణీయం సుందరనార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్లర్), పెరియార్ ఒలి అవార్డు– హెన్రీ తిఫాగ్ నె (మానవ హక్కుల పోరాట యోధుడు), మార్క్స్ మామణి అవార్డు– వీరపాండియన్ (సిపిఐ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి), కామరాజర్ కదిర్ అవార్డు– బాల ప్రజాపతి అడిగళార్, అయోథిదాసర్ ఆదవన్ అవార్డు: రూత్ మనోరమ (సామాజిక కార్యకర్త), కాయిదేమిల్లత్ పిరై అవార్డు: ముహమ్మద్ మునీర్(ఐఎన్టీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు), సెమ్మొళి అవార్డు: వేల్ స్వామి (ప్రముఖ తమిళ పండితుడు) ఎంపికయ్యారు. ఈ పురస్కారాల ప్రధానోత్సవ వేడుకను జూలై 5వ తేదీన చైన్నె తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరుగుతుందని ప్రకటించారు. -
దివంగత డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం కరుణానిధి 103వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలకు , చిత్ర పటాలకు డీఎంకే వర్గాలు ఘన నివాళులర్పించాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. మెరీనా తీరంలోని సమాధి వద్ద సీఎం స్టాలిన్తో పాటుగా పార్టీ
కరుణానిధి సమాధి వద్ద స్టాలిన్ పుష్పాంజలి సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి జయంతిని పురస్కరించుకుని టీవీకే చీఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ నేతృత్వంలో అధికారిక కార్యక్రమంగా నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఓమందూర్ ఎస్టేట్లోని కరుణానిధి విగ్రహానికి మంత్రి రాజ్ మోహన్ అధికారులు నివాళులర్పించారు. గత ఐదు సంవత్సరంగాలు అధికారంలో ఉన్న డీఎంకే తాజాగా ప్రతి పక్షంలో ఉన్నప్పటికీ కరుణానిధి జయంతి విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా వాడవాడలా 103 వ జయంతి కార్యక్రమాలు హోరెత్తాయి. కరుణానిధి చిత్ర పటాలు, విగ్రహాలకు నేతలు నివాళులర్పించారు. ఆయన ప్రసంగాలను హోరెత్తించారు. ఇందులో ప్రదానంగా చివరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం శ్రమిస్తా.. అన్న కరుణానిధి ప్రసంగాల వీడియోలను వైరల్ చేశారు. సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లారు. అన్భగంలో వేడుక డీఎంకే యువజన విభాగం కార్యాలయం అన్భగంకు చాలా కాలం తర్వాత స్టాలిన్ వెళ్లారు. ఇక్కడ అన్నా, కరుణానిధి విగ్రహాలను ఆవిష్కరించారు. 75 అడుగుల స్తూపంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చాలా సేపు గడిపి, యువజన నేతలతో మాట్లాడారు. అనంతరం ఆయన ఎక్స్ పేజిలో కరుణానిధి జయంతి సందర్భంగా కేడర్కు ఓ సందేశాన్ని ఇచ్చారు. చక్రాల కుర్చీలో నుంచే.. ‘నాయకుడి పుట్టినరోజు! చక్రాల కుర్చీలోనే ఉంటూ తమిళ జాతిని నడిపించిన మహోన్నత నాయకుడు జయంతి రోజు ఇది’ అని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. వృద్ధాప్యం పైబడినప్పటికీ, తన చివరి శ్వాస వరకు తమిళ జాతి అభ్యున్నతి కోసం, తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ‘విజయాలూ.. అపజయాలూ మనల్ని ఆపలేవు అని పేర్కొంటూ, ‘ప్రియమైన నాయకుడా.. కళాకారుడా.. విజయాన్ని తలకెక్కించుకోకుండా, అపజయాన్ని హృదయానికి హత్తుకోకుండా, కష్టాల సముద్రాలను అలసట లేకుండా ఈదగల మానసిక బలాన్ని మీరే మాకు అందించారు. ఆ బలం ఇప్పుడు నాలోనూ ఉంది.’ అని వివరించారు. ‘ మీరు మాతో ఉన్నప్పుడు మీ శక్తితో నిరంతర విజయాలు సాధించి, తమిళనాడును చరిత్ర కీర్తించే ప్రగతి పథంలో తీర్చిదిద్దారని, ప్రస్తుతం మనం గెలిచే అవకాశాన్ని కోల్పోయి ఉండవచ్చు. అయినప్పటికీ, తమరు ఇచ్చిన స్ఫూర్తి కేవలం నాతోనే కాదు.. మీరు పెంచి పోషించిన కోట్ల మంది డీఎంకే తోబుట్టువుల గుండెల్లో సజీవంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ‘ఉదయించే సూర్యుడి’ కాంతితో ప్రకాశిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. సమాధి వద్ద అంజలి కలైంజ్ఞర్ కరుణానిధి జయంతి సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ప్రధాన ప్రతి పక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఉదయాన్నే మెరీనా తీరానికి చేరుకున్నారు. కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం తరలి వచ్చిన కరుణానిధి, ఆ పక్కనే ఉన్న అన్నాదురై సమాధి వద్దకూడా నివాళులర్పించారు. అనంతరం ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని కరుణానిధి విగ్రహానికి స్టాలిన్ నివాళులర్పించారు. అక్కడి నుంచి డీఎంకే కార్యాలయం ఆ వరణలోని అన్నా, కరుణానిధి విగ్రహాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ముందుగా గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఆయన చిత్ర పటానికి అంజలి ఘటించారు. అలాగే, ఆళ్వార్ పేట సీఐటీ కాలనీలోని కరుణానిధి మరో సతీమణి రాజాత్తి అమ్మల్ ఇంటికి వెళ్లారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కరుణ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కరుణానిధి జయంతి సందర్భంగా స్టాలిన్ సందేశం ఆయన పాత్ర కీలకం : సీఎం విజయ్ దివంగత కరుణానిధికి నివాళులర్పిస్తూ సీఎం విజయ్ సందేశాన్ని విడుదల చేశారు. తమిళ భాష, సాహిత్యం, సినిమా, రాజకీయాలు, రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కరుణానిధి అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన చేసిన అపారమైన కృషిని, అందించిన భాగస్వామ్యాన్ని స్మరించుకుంటున్నానని పేర్కొన్నారు. -
క్లుప్తంగా
కొరుక్కుపేట: కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి విజయ్ బొమ్మతో వాహనంలో తిరుగుతూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వివరాలు..టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చైన్నెలోని కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం స్టాలిన్ను ఓడించి అఖండ విజయం సాధించారు. దీని అనంతరం ఆయన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇందుకోసం, కొలత్తూరు ఎమ్మెల్యే వి.ఎస్. బాబు మంగళవారం రాత్రి తన వాహనంలో విజయ్ బొమ్మతో వీధి వీధి తిరిగి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ప్రజలు, ఇదంతా ఎన్నికల ప్రచారంఅని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఓట్లు అడిగేటప్పుడు డమ్మీ విజయ్ వచ్చారు. తన పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా, డమ్మీ విజయ్తోనే ధన్యవాదాలు తెలిపారు. అసలైన విజయ్ ఎప్పుడు వస్తారు? అని జనం ప్రశ్నిస్తున్నారు. సాక్షి, చైన్నె: హోమ్ ఎంటర్టెయిన్మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న ప్రముఖ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ లూమియో తమ ఫ్లాగ్షిప్ సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ టీవీలను బుధవారం విడుదల చేసింది. తమ పాపులర్ లైనప్ అయిన లూమియో విజన్ 9, లూమియో విజన్ 7 సిరీస్లలో మోస్ట్ అవేటెడ్ 55–ఇంచ్ వేరియంట్లను స్థానికంగా ప్రకటించారు. ఈ సరికొత్త 2026 ఎడిషన్ స్మార్ట్ టీవీల సేల్స్ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుందని, ఇందులోని సరికొత్త అంశాలను , డిజిటల్ సాంకేతికను గురించి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. వేలూరు: బంగారం, నగదు ఇవ్వకుంటే ఇంటికి దెయ్యాలను పంపిస్తామని బెదిరిస్తున్న మంత్రగాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు వేలూరు ఎస్పీకార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక గ్రీవెన్స్సెల్ జరిగింది. అదనపు ఎస్పీ అన్నాదురై వినతులను స్వీకరించారు. ఇందులో కాట్పాడి సమీపంలోని వీజీరావ్నగర్కు చెందిన సేట్టు ఇచ్చిన ఫిర్యాదులో తన భార్య కళ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం కోసం ముగ్గురు మాంత్రికులను సంప్రదించామని ఆ సమయంలో వారు తన భార్య తల వెంట్రుకలు, కాలు మట్టి, గుడ్డ వంటి వాటిని తీసుకొని ఆరోగ్యం నయం చేసేందుకు గత ఐదు సంవత్సరాలుగా మాంత్రికం చేస్తున్నారు. ఇందుకోసం ముగ్గురూ కలిసి రూ.3లక్షల వరకు నగదు తీసుకున్నారు. అయినప్పటికీ తన భార్య ఆరోగ్యం నయం కాలేదు. అయితే ప్రస్తుతం మరోసారి తన భార్య వద్ద ఉన్న బంగారం, నగదు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. అంగీకరించకపోవడంతో మంత్రాలతో హత్య చేయిస్తామని బెదిరిస్తున్నారని వీటిపై ఇప్పటికే కాట్పాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని రప్పించి రాతత పూర్వకంగా రాసుకొని పంపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం నగదు, బంగారం ఇవ్వకుంటే మీ ఇంటికి రాత్రుల్లో దెయ్యాలను పంపుతామని బెదిరిస్తున్న వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని వారిచ్చిన వినతిలో కోరారు. కొరుక్కుపేట: కిడ్నీ మార్పిడి కోసం కడలూరు యువకుడి నుంచి రూ.11 లక్షలు మోసం చేసిన యువతిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. కడలూరు జిల్లా నల్లూరు ప్రాంతానికి చెందిన గుణశేఖరన్ కుమార్తె పూంగవనం (55), కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ జయకుమార్కు ఫిర్యాదు చేశారు. అందులో, తాను వ్యవసాయ కూలీ అని, తన కొడుకు కుపేంద్రన్ (25)కు రెండు కిడ్నీలు పాడయ్యానని, డయాలసిస్ లేక కిడ్నీ మార్పిడి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో కడలూరు జిల్లా, చేపక్కంకు చెందిన ఆమె బంధువు కడిముత్తు ద్వారా నామక్కల్ జిల్లాకు చెందిన ప్రియ పరిచయమైంది. ఈరోడ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అలాంటి సర్జరీలు చేస్తారని ఆమె నమ్మించి పలు విడతల్లో రూ.26 లక్షలు తీసుకుంది. కానీ కిడ్నీ మార్పిడి జరగకపోవడంతో కుపేంద్రన్ చనిపోయాడు. తరువాత నగదు తిరిగి ఇవ్వలేనని ప్రియ చెప్పి, తాను రూ. 15 లక్షలు, కటిముత్తు రూ.3.50లక్షలు ఇస్తామని ముందుకొచ్చారు.మొత్తం డబ్బు చెల్లిస్తామని ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. అందులో కటిముత్తు మొత్తం డబ్బు ఇచ్చేశాడు. కానీ ప్రియ రూ.4 లక్షలు ఇచ్చి, మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వకుండా ఆమెను మోసం చేస్తూనే ఉన్నారు. అందువల్ల, దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని అతను చెప్పాడు. అనంతరం జిల్లా క్రైమ్ బ్రాంచ్లో కేసు నమోదు చేశారు. పోలీసులు జరిపిన దర్యాప్తులో, నామక్కల్ జిల్లాకు చెందిన కుమారప్ప పల్లిపాలయంకు చెందిన ప్రియ (37)ను అరెస్టు చేశారు. ఆమెను కడలూరు కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలుకు తరలించారు. -
స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్య ఖరారు
సాక్షి, చైన్నె: తమిళనాడులో స్థానిక సంస్థల వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో ఎన్నుకోవాల్సిన కొత్త సభ్యుల (కౌన్సిలర్లు/వార్డు మెంబర్లు) సంఖ్యను ఖరారు చేస్తూ తమిళనాడు సరిహద్దుల పునర్విభజన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేయాలని నిర్ణయించింది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీలిమిటేషన్ కమిషన్ చైర్పర్సన్ పా. జ్యోతి నిర్మలా స్వామి అధ్యక్షతన చైన్నెలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు జిల్లాల్లోని స్థానిక సంస్థల పరిధులు, జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించారు. 11 జిల్లాలు, 40 యూనియన్లపై ప్రత్యేక దృష్టి కీలక సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో వార్డుల సరిహద్దుల పునర్విభజన, కొత్త సభ్యుల సంఖ్యను నిర్ణయించడంపై విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు 11 జిల్లా పరిషత్తులు, 40 పంచాయతీ యూనియన్లు, 177 గ్రామ పంచాయతీలు జాబితాలో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో జనాభా మార్పునకు అనుగుణంగా ఎన్నుకోవాల్సిన కొత్త ప్రతినిధుల సంఖ్యను తుది రూపానికి తెచ్చారు. ఈ నివేదికను త్వరలోనే తదుపరి చర్యల కోసం తమిళనాడు ప్రభుత్వానికి పంపాలని కమిషన్ తీర్మానించింది. ఈ సమీక్షా సమావేశంలో పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అముదవల్లి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి. మధుసూదన్ రెడ్డి, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్తో పాటూ పలువురు ఉన్నతాధికారులు హాజరై సరిహద్దుల గణంకాల లెక్కింపు విషయంగా తమ సూచనలను అందించారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ కొత్త వార్డుల వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. -
2029 నేషనల్ గేమ్స్కు తమిళనాడు సిద్ధం
సాక్షి, చైన్నె : భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ సూపర్ పవర్గా మార్చాలనే లక్ష్యంలో తమిళనాడు తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర క్రీడా మంత్రి ఆధవ్ అర్జున తెలిపారు. 2029 జాతీయ క్రీడల ఆతిథ్యానికి తమ రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. బుధవారం ఢిల్లీలో క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని కలిసిన ఆధవ్ అర్జునా.. రాష్ట్రంలో క్రీడల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరుతూ ఒక వివరణాత్మక వినతిపత్రాన్ని) సమర్పించారు. వీటిని ఆమోదించాలని కోరారు. నిధులతో పాటుగా అనుమతుల మందజూరు విషయంగా చర్చించారు. ఈ సమావేశంలో తమిళనాడు క్రీడాశాఖ కార్యదర్శి సజ్జన్సింగ్ ఆర్. చవాన్ , ఎస్డీఏటీ మెంబర్ సెక్రటరీ జె. మేఘనాథ రెడ్డి పాల్గొన్నారు. -
వైగై, పెరియార్ డ్యాంలో జలకళ
సాక్షి, చైన్నె : గత కొన్ని నెలలుగా తీవ్ర అనావృష్టితో ఎండిపోయిన వైగై, పెరియార్ జలాశయాల పరివాహక ప్రాంతాల్లో ఎట్టకేలకు వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో డ్యామ్లకు నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామం నీటి ఎద్దడితో అల్లాడుతున్న తమిళనాడులోని ఐదు జిల్లాల ప్రజలకు, రైతులకు తీవ్ర ఊరటను ఇస్తోంది. అదే సమయంలో నైరుతీ రుతు పవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉండటంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో ఆశాజనకంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వైగై నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇన్–ఫ్లో పూర్తిగా పడిపోయింది. మరోవైపు తాగునీరు, సాగునీటి అవసరాల కోసం నిరంతరం నీటిని విడుదల చేయడంతో జలాశయంలో నీటిమట్టం అడుగంటింది. మే 20 నుండి మే 29 వరకు డ్యామ్కు నీటి రాక పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల 6,091 మిలియన్ క్యూబిక్ అడుగుల గరిష్ట నిల్వ సామర్థ్యం గల వైగై డ్యామ్లో, మే 29 నాటికి కేవలం 111 మిలియన్ క్యూబిక్ అడుగుల నీరు మాత్రమే మిగిలింది. క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మే 30 నుండి జలాశయాల్లోకి మళ్లీ నీరు రావడం ప్రారంభమైంది. మొదట్లో సెకనుకు 96 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం.. క్రమంగా పెరుగుతూ బుధవారం నాటికి 116 క్యూసెక్కులకు చేరింది. దీంతో వైగై డ్యామ్ నీటి మట్టం 21.75 అడుగులకు (మొత్తం ఎత్తు 71 అడుగులు) పెరిగింది. తేక్కడి పరిసరాలలో 29.4 మి.మీ, పెరియార్ డ్యామ్ పరిసరాలలో 19.2 మి.మీ, వైగై డ్యామ్ పరిసరాలో 13.2 మి.మీ, మంజళారు డ్యామ్ 4 మి.మీ వర్షం గడిచిన 24 గంటలలో పడింది. నైరుతి రుతుపవనాలపైనే ఆశలు ఈ వర్ష సూచనలపై జల వనరుల శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. కేరళలో గురువారం రుతుపవనాలు ప్రవేశిస్తుండడంతో, పెరియార్ డ్యామ్కు నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే తేని, తెన్కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలోని పశ్చిమ కనుమల వెంబడి మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చే శారు. రాబోయే రోజుల్లో జలాశయాల నీటి మట్టం వేగంగా పెరుగుతుందన్నారు. పరివాహక ప్రాంతాలను కేంద్రీకరించి కురుస్తున్న ఈ వర్షాల వల్ల నీటి ఇన్–ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో దక్షిణ తమిళనాడులోని ఐదు జిల్లాల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. రుతు పవనాలు క్రమంగా విస్తరించిన పక్షంలో పశ్చిమ కనుమలలోని నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్లలోనూ భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయి. వైగై డ్యాం -
అముముకలోకి ఇతర పార్టీ నేతలు
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని విరింజిపురం గ్రామంలోని ఇతర పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు బుధవారం ఉదయం అముముక పార్టీలో చేరారు. ముందుగా అముముక పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నాయకత్వంలో వేలూరు జిల్లా కార్యదర్శి పీకేఆర్ సతీష్కుమార్ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అదేవిధంగా కాట్పాడి నియోజక వర్గం పరిధిలోని కుప్పుతామోటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కార్యకర్తలు పార్థిబన్ అధ్యక్షతన పలువురు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలకడంతోపాటు స్వీట్లు పంచి పెట్టారు. పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమలనాథన్, కోశాధికారి సుందరమూర్తి, కాట్పాడి యూనియన్ కార్యదర్శిబాబు, తిరువలం పట్టణ పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్, ఐటీ విభాగం కార్యదర్శి ఏలుమలై, విద్యార్థి విభాగం కార్యదర్శి సత్యరాజ్, చేనేత విభాగం కార్యదర్శి ధనశేఖర్, అనకట్టు యూనియన్ కార్యదర్శి శరవణన్ పాల్గొన్నారు. -
ఒకేసారి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్
సాక్షి, చైన్నె: వైద్య రంగంలో అత్యంత సంక్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను చైన్నె అడయార్లోని ఎంజీఎం హెల్త్కేర్ మలార్ హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు. ఒకే సమయంలో తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ , హార్ట్ ఎటాక్ బారిన పడిన 76 ఏళ్ల వృద్ధురాలికి అత్యాధునిక మినిమల్లీ ఇన్వేసివ్ (శరీరంపై పెద్దగా కోతలు లేని చిన్న రంధ్రం ద్వారా చేసే ప్రక్రియ) పద్ధతిలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తికేయన్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోహర్ నేతృత్వంలోని బృందం బుధవారం ఈ శస్త్ర చికిత్స విజయవంతం గురించి స్థానికంగా వివరించారు. హైపర్టెన్షన్ (రక్తపోటు), మధుమేహం (డయాబెటిస్) ఉన్న సదరు మహిళకు మెదడులోని మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ప్రాంతంలో, అలాగే మెడలోని కరోటిడ్ ఆర్టరీలో తీవ్రమైన బ్లాక్లు ఏర్పడి స్ట్రోక్ వచ్చిందన్నారు. అదే సమయంలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కూడా తీవ్రమైన బ్లాక్లు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి కావడంతో వేర్వేరు విభాగాల వైద్యులు ఒకే బృందంగా ఏర్పడి రంగంలోకి దిగారు. ఒకే సిట్టింగ్లో మూడు క్లిష్టమైన ప్రొసీజర్లతో మల్టీడిసిప్లినరీ వైద్య బృందం ఈ అసాధారణ చికిత్సను విజయవంతంగా నిర్వహించిందని వివరించారు. మొదట మెదడు లోపల తీవ్రంగా కుంచించుకుపోయిన ధమనిని తెరిచేందుకు అత్యంత అధునాతన స్టెంటింగ్ ప్రక్రియతో మెడ భాగంలో ఉన్న తీవ్రమైన బ్లాక్ను తొలగించడానికి ఈ చికిత్స చేశామన్నారు. కరోనరీ యాంజియోప్లాస్టీతో మెదడు ప్రొసీజర్లు ముగిసిన వెంటనే గుండెకు రక్తప్రసరణను పునరుద్ధరించడానికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేశామన్నారు. -
కోలాహలం.. పరదరామి జాతర
వేలూరు: గుడియాత్తం తాలుకా పరదరామిలో తిరుమల తిరుపతి గంగయమ్మన్ ఆలయ జాతరను పురస్కరించుకొని శిరస్సు జాతర బుధవారం కోలాహలంగా జరిగింది. పరదరామి గంగయమ్మన్ జాతరలో భాగంగా ఉదయం గ్రామదేవత ఆలయంలోని అమ్మన్ శిరస్సుకు ప్రత్యేక పూజలు చేసి భక్తుల కోలాహలం మధ్యన శిరస్సును ఊరేగింపుగా తీసుకొచ్చి పాలారు నది ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహానికి అమర్చారు. ఊరేగింపులో భక్తులు వివిధ వేశధారణలు ధరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వేలసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అక్కడక్కడే నీరు, మజ్జిగ, అంబలి,అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆల య నిర్వాహకులు, ఉత్సవ కమిటీ భక్తులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగింపులో రాత్రి బాన వేడుకలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా చిత్తూరు నుంచి యాదమరి మీదుగా వచ్చే వాహనాలను కాట్పాడి మీదుగా మల్లించారు. -
బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: కాకలూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను రెవెన్యూ, పంచాయతీరాజ్శాఖ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ బుధవారం ఉదయం తొలగించారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని డీఎంకే నేత కట్టడాలను నిర్మించాడు. అనంతరం సంబంధిత కట్టడాలను అద్దెకు ఇచ్చినట్టు కలెక్టర్ కవితకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని పంచాయతీరాజ్శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగానే అధికారులు బుధవారం ఉదయం సంబంధిత ప్రాంతంలో సర్వే నిర్వహించారు. సర్వేలో ఆక్రమణలు వున్నట్టు గుర్తించారు. వెంటనే అధికారులు వాటిని జేసీబీ యంత్రం ద్వారా తొలగించడానికి యత్నించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన డీఎంకే యూనియన్ కార్యదర్శి జయశీలన్, కౌన్సిలర్ పూవన్నన్ అధికారులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి డీఎంకే నేతలను పక్కకు తప్పించి ఆక్రమణలు తొలగించారు. ఈ సంఘటనతో గంట పాటు కాకలూరులో ఉద్రిక్తత నెలకొంది. సీఐ విజయకుమార్, ఎస్ఐ గోపికృష్ణన్, బీడీఓ, ఇళంగోవన్, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని పూర్తిచేశారు. -
సిప్కాడ్ ప్రాజెక్టును రద్దు చేయండి
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడిలో సిప్కాడ్ ప్రాజెక్టును రద్దు చేసి రైతుల వ్యవసాయ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరంతాంగల్ శేఖర్ మాట్లాడుతూ కాట్పాడి తాలుకా సమీపంలోని పొన్నై వద్ద సిప్కాడు కోసం రెవెన్యూ అధికారులు రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తరాలుగా ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ప్రస్తుతం ఉన్న ఫలంగా వ్యవసాయ పొలాన్ని సిప్కాడ్కు స్వాధీనం చేస్తే రైతులు వీధిన పడే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి దురైమురుగన్ వద్ద వీటిపై వినతిపత్రం ఇవ్వడంతో ఈ ప్రాజెక్టును నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో మరోసారి సర్వే పనులు చేసి తమ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసి తమ పంట భూములను కాపాడకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ లీల వద్ద వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్, రైతులు పాల్గొన్నారు. -
ఎప్పుడైనా గవర్నర్ను కలవచ్చు
సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో మంత్రివర్గ విస్తరణపై వస్తున్న సంకేతాల గురించి సీఎం ఎన్. రంగస్వామి బుధవారం స్పందించారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి తాను లెఫ్టినెంట్ గవర్నర్ను ఎప్పుడైనా కలవచ్చని స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్రపక్షమైన బీజేపీ నుండి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన తేల్చి చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎం. కరుణానిధి జయంతి వేడుకలను బుధవారం పుదుచ్చేరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రంగస్వామి.. మేరీ హాల్లో అలంకరించి ఉంచిన కరుణానిధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాత్కాలిక స్పీకర్ అన్బళగన్, పలువురు ఎమ్మెల్యేలు, డీఎంకే ప్రతినిధులు పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపే మంత్రివర్గ విస్తరణ? పుదుచ్చేరిలో గురువారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై విలేకరులు ప్రశ్నించగా.. మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని సీఎం రంగస్వామి క్లుప్తంగా సమాధానమిచ్చారు. ఈ విషయమై గవర్నర్ను ఎప్పుడు కలుస్తారు అని అడగ్గా.. గవర్నర్ను ఎప్పుడైనా కలవవచ్చు, దానికి సమయంతో పనేముందన్నారు బీజేపీ ఒత్తిడి ఉందా? మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూటమి భాగస్వామి అయిన బీజేపీ ఏమైనా ఒత్తిడి తెస్తోందా అన్న ప్రశ్నకు సీఎం బదులిస్తూ.. బీజేపీ ఎప్పుడూ, ఎలాంటి ఒత్తిడి తమపై తీసుకురాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎం మాట్లాడుతూ.. ‘షెడ్యూల్ ప్రకారం గురువారం నుండి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించాలా వద్దా అనే అంశంపై జిల్లా కలెక్టర్తో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. -
అవినీతి నిరూపిస్తే ఉరి శిక్షకు సిద్ధం
కార్పొరేటర్ల సవాల్ సాక్షి, చైన్నె: ఆస్తిపన్ను అవినీతిలో మదురై కార్పొరేషన్ కార్పొరేటర్లు రూ.2,000 కోట్లు సంపాదించారని ఆరోపించిన న్యాయశాఖ మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్కు కౌన్సిల్ మీట్ల్లో కార్పొరేటర్లు సవాల్ విసిరారు. తాము అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తమను ఉరితీయండి.. 3 నెలల్లో ఆరోపణలను నిరూపించాలి. లేనిపక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని బుధవారం మదురై కార్పొరేషన్ సమావేశంలో డీఎంకే కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. మదురై కార్పొరేషనల్లోని 100 మంది కౌన్సిలర్లు తలా రూ.10 కోట్ల నుండి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.2,000 కోట్ల వరకు ఆస్తిపన్ను అక్రమాల ద్వారా వెనకేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మదురై కార్పొరేషన్ సమావేశంలో డీఎంకే కౌన్సిలర్ల పెద్దఎత్తున నిరసన చేపట్టారు.డీఎంకే కార్పొరేటర్ జయరామన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీసీకే, కమ్యూనిస్టులు టీవీకే వైపుగా వెళ్లి పోయారని, కాంగ్రెస్ కూడా చెప్పకుండా వెళ్లిపోయి ద్రోహం చేసిందన్నారు. ప్రస్తుతం మదురై కార్పొరేషన్లో డీఎంకే ఒంటరిగా గానే ఉందని, ప్రభుత్వ అధికారాలు కూటమి ప్రభుత్వం చేతిలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వ వేదికలపై ఏం మాట్లాడాలో కూడా మంత్రికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడున్న టీవీకే ఎమ్మెల్యేలు వెళ్లి ఈ విషయాన్ని మంత్రికి చెప్పండని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే కార్పొరేటర్లు అందరూ లేచి నిలబడి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేషన్ హాల్లో పొలిటికల్ హీట్ ఈ రసాభాసపై వివిధ పార్టీల నేతలు భిన్నంగా స్పందించారు టీవీకే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్తికేయన్ మాట్లాడుతూ.. తాము ఎలా మాట్లాడాలో డీఎంకే కార్పొరేటర్లు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అంతా వాస్తవాలు కాబట్టే , ఇక్కడి మేయర్, జోనల్ లీడర్లు రాజీనామా చేశారని, మేయర్ ఇంద్రాణి భర్త పొన్ వసంత్ను ఎందుకు అరెస్ట్ చేశారో? చాలామంది అధికారులను ఎందుకు సస్పెండ్ చేశారో? అని ప్రశ్నించారు. మరో టీవీకే ఎమ్మెల్యే కల్లాణై మాట్లాడుతూ.. ఈ ఆస్తిపన్ను అవినీతిని తాము వదిలిపెట్టబోమని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడి నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తామని హెచ్చరించారు. అన్నాడీఎంకే కార్పొరేషన్ ప్రతిపక్ష నేత సోలైరాజా మాట్లాడుతూ.. తామే ఈ ఆస్తి పన్ను అవినీతిని బయటకు తెచ్చామని, కోర్టులో కేసులు వేసి పోరాటాలు చేశామని, తాము అవినీతి చేశామని ఎవరూ అనలేరని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ నాగరాజన్ మాట్లాడుతూ.. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే డీఎంకే, టీవీకే నేతలు బయటకు వెళ్లి మాట్లాడుకోవాలన్నారు. అయితే, మంత్రి నిర్మల్ కుమార్ కౌన్సిలర్లందరినీ ఒకేలా జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదన్నారు. అధికారులు, కౌన్సిలర్లు ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ నిందించకూడదని, సరైన ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని టీవీకే ఎమ్మెల్యేలు తమ మంత్రికి చెప్పాలని హితవు పలికారు. -
అలా ౖపైపెకి రష్మిక!
తమిళసినిమా: సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇక గుడ్బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్ చిత్రంతో కమర్షియల్గా సూపర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా కేరీర్కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్ఖాన్కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పుడు కాక్–టెయిల్–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్ చేసినట్లే అవుతుంది. -
ఈపీఎస్కు ఊరట
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి చైన్నె హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఆయన తన ఆస్తులు, ఆదాయ వివరాలను దాచారంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎడప్పాడి నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించిన పళనిస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే, ఆయన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని, దీనిపై ఆదాయపన్ను శాఖ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు శక్తివేల్ పెరుమాళ్ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ వాదన పిటిషనర్ తన పిటిషన్లో పళనిస్వామి తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని వివరించారు. 2021, 2026 ఎన్నికల అఫిడవిట్లను నిశితంగా పరిశీలిస్తే ఆస్తుల వివరాల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజాలను ఉద్దేశపూర్వకంగానే దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ సమగ్ర విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు తీర్పు ఈ పిటిషన్ చైన్నె హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ అరుళ్ మురుగన్లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో ఇలాంటి వ్యవహారాలపై కోర్టులు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చాయని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేనిదని పేర్కొన్నారు. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఉంటే ఎన్నికల పిటిషన్ మాత్రమే దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ఐటీ శాఖ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా దాఖలైన ఈ వ్యాజ్యాన్ని పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఊటీలో రజనీకాంత్
– అభిమాన సంఘాల నేతలతో సంప్రదింపులు సాక్షి, చైన్నె: సూపర్ స్టార్ రజనీకాంత్ సైలెంట్గా ఊటీలో ల్యాండ్ అయ్యారు. సూపర్ స్టార్ మంగళవారం మైసూర్ మీదుగా రోడ్డు మార్గంలో ఊటీకి చేరుకున్నారు. ఊటీలోని ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి చెందిన హోటల్లో రజనీకాంత్ బస చేశారు. రజనీకాంత్ ఊటీకి వచ్చారనే విషయం రాత్రి వరకు పోలీసులతో సహా ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే, అర్ధరాత్రి సమయంలో ఈ విషయం రజనీ మక్కల్ మండ్రం (అభిమాన సంఘం) నిర్వాహకులకు, స్థానిక అభిమానులకు తెలియడంతో ఊటీ ఒక్కసారిగా ఊగిపోయింది. ఆయన బస చేసిన హోటల్ ముందర తెల్లవారేసరికి వందలాది మంది అభిమానులు గుమిగూడారు. తలైవాను ఒక్కసారైనా చూడాలనే తపనతో హోటల్ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని అభిమానులు పూర్తిగా ముట్టడించారు. పరిస్థితిని గమనించిన హోటల్ యాజమాన్యం , సెక్యూరిటీ.. రజనీకాంత్ అనుమతితో అభిమాన సంఘంలోని కేవలం ముఖ్యమైన నిర్వాహకులను మాత్రమే లోపలికి అనుమతించారు. త నను కలవడానికి వచ్చిన అభిమాన సంఘం కార్యనిర్వాహకులను రజనీకాంత్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు.


