Tamil Nadu
-
కోడలికి వ్యతిరేకంగా మామ ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. ప్రచార బాట సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
తమిళనాడు విరుధ్నగర్ జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. సత్తూర్ దగ్గర ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. క్షతగాత్రులకు శివకాశి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందుతోంది. కొందరు కార్మికులు లోపలే చిక్కుకుని ఉన్నారని యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్నన్ అనే వ్యక్తికి చెందిన ఎక్సెల్ బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ఉదయం వరుసగా నాలుగుసార్లు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ శబ్దం సుమారు 6 కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వణికిపోయారు. భారీగా మంటలు ఎగసిపడడంతో.. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొందరు కార్మికులు పేలుడుతో దూరంగా ఎగిరిపడగా.. సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఫ్యాక్టరీ, గోదాంలకు చెందిన 10 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో 60 మంది కార్మికులు లోపల ఉన్నారని యాజమాన్యం చెబుతోంది. దీనిని బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. టపాసులు తయారు చేస్తుండగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంత్రి నాగేంద్రన్ శివకాశి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ లైసెన్స్ రెన్యువల్ కాలేదని సమాచారం. సహాయక చర్యలు పూర్తయ్యాకే నష్టం వివరాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. #WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL— ANI (@ANI) April 13, 2026 -
గెలిస్తే.. ఏఐ మంత్రిత్వ శాఖ
సాక్షి, చెన్నై : టీవీకే అధికారంలోకి వస్తే తమిళనాడును దేశానికే ఏఐ రాజధానిగా మారుస్తామని ఆ పార్టీ అధినేత విజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని, అలాగే ఒక ప్రత్యేక ఏఐ నగరాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇక ఒక ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం టీవీకే అధినేత విజయ్ కన్యాకుమారిలో పర్యటించారు. జాతీయ రహదారిలో ప్రజల్ని ఆకర్షించే విధంగా సైకిల్ తొక్కు తూ ముందుకు సాగారు. నా గుండెల్లో.. కన్యాకుమారిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ: ‘నా గుండెల్లో నివసించే కన్యాకుమారి, కారైక్కుడి ప్రజలకు నా నమస్కారాలు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు కారైక్కుడిలో తాను మాట్లాడలేకపోయానని గుర్తు చేశారు. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం చేపట్టబోయే కొన్ని పథకాలను ఇక్కడ ప్రకటిస్తున్నానని వివరించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడితే, పాలనలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు తరహాలోనే తమిళనాడులో ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందిస్తామన్నారు. ఏఐ డేటా సహా యంతో, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారా పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయని వివరించారు. దీని కోసం ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే రకరకాలుగా తిప్పించుకుంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం లంచం. లంచం... అంటూ ఇలా తీసుకునే లంచం కేవలం అధికారులకే కాకుండా, మంత్రుల వరకు వెళ్తోందని ఆరోపించారు. సేవా ధృవీకరణ పథకం టీవీకే అధికారంలోకి రాగానే ‘తమిళనాడు సేవ «ధృవీకరణ పథకం రూపొందిస్తామని ప్రకటించారు. ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని ప్రభుత్వ సేవలను మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వకుండా పొందవచ్చు అని వివరించారు. ప్రస్తుతం బడ్జెట్ అనేది కేవలం ఒక పత్రం లాగే కనిపిస్తున్నదని, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నా యో తెలియడం లేదంటూ, ఇది చిదంబర రహ స్యం లాగా స్టాలిన్ రహస్యంగా ఉంటోందని ఆరోపించారు. ఇక, జాలర్ల భద్రత గురించి ప్రస్తావిస్తూ, నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని ప్రకటించారు. పడవల్ని రక్షించేందుకు రాయబార కార్యాలయం ద్వారా దౌత్య పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, అంత వరకు బ్యాంక్ రుణాల చెల్లింపు, జాలర్ల కుటుంబాలకు సాయం నిమిత్తం పడవ యజమానికి రూ. 5 లక్షల వరకు మధ్యంత నివారణ నిధులు అందజేస్తామని వివరించారు. కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. అలాగే, ఇంధన రక్షణ పథకం ద్వారా నెలకు 1800 లీటర్ల నుంచి 3 వేల లీటర్లుగా కోటాను పెంచుతామని, లీటరకు రూ. 15 సబ్సిడీ పడవ యజామాని బ్యాంక్ఖాతాలో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. -
అన్నాడీఎంకే కూటమికితిరుగులేదు..!
సాక్షి, చైన్నె : Æ>çÙ‰…ÌZ AòÜ…-½Ï G°²MýSÌS {ç³^éÆý‡… gZÆý‡$V> ÝëVýS$-™ø…-¨. {糫§é¯]l ´ëÈ-t±² ¯]l$ÐéÓ ¯ól¯é A¯ól ȆÌZ {ç³^éÆý‡… ÝëW-çÜ$¢-¯é²Æý‡$. ™égêV> G°²-MýSÌZÏ A¯é²yîl-G…MóSే MýS*rÑ$ Ð]lNÅà-Ë$.. àÒ$-ÌSOò³ A¯é²-yîl-G…MóS {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ ç³âýæ-×ìæ-ÝëÓÑ$ çܵ…¨…^éÆý‡$. Ò$yìl-Ķæ*™ø ÑÑ«§ýl A…Ô>-ÌSOò³ BĶæ$¯]l AÀ-{´ë-Ķæ*-ÌS¯]l$ ™ðlÍ-Ķæ$-gôæ-Ô>Æý‡$.. ""2009ÌZ fÇW¯]l †Æý‡$Ð]l$…VýS-âýæ…ÌZ Eç³-G-°²MýS 糯]l$ÌZÏ ™èl¯]l™ø ´ër$V> Mö…§ýlÆý‡$ °Æ>Ó-çßæMýS$-ÌS¯]l$ AÐ]l$à fĶæ$-ÌS-Í™èl ç³…í³…-^éÆý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. JMýSÆøk AÐ]l$à í³Í_, A…§ýl-Ç-±... °Äñæ*-f-MýSÐ]l-Æý‡Y…ÌZ ç³Çíܦ† GÌê E…§ýl° Ayìl-W¯]lr$t õ³ÆöP-¯é²Æý‡$. A…§ýlÆý‡$ ¯ól™èlË$ A§ýl$Â-™èl…, VðSË$ç³# Ð]l$¯]l§ól A° Ç´ùÆŠ‡t CÐ]lÓV>, ™é¯]l$ Ð]l*{™èl… MýSçÙt… A° çÜÐ]l*-«§é¯]l… C^éa¯]l° VýS$Æý‡$¢ ^ólÔ>Æý‡$. D çÜÐ]l$Ķæ$…ÌZ CMýS ç³âýæ×ìæ ÝëÓÑ$ ç³° AƇ$$-´ù-Ƈ$$…§ýl° A…§ýlÆý‡* ¿êÑ…^éÆý‡-°, AƇ$$™ól, ™é¯]l$ ^ðlí³µ¯]l-r$t-V>¯ól çœÍ™èl… Æ>Ð]l-yýl…™ø AÐ]l$à í³Í_ AÀ¯]l…-¨…-^éÆý‡° ™ðlÍ-´ëÆý‡$. °gêÆ‡$$-¡V>, O«§ðlÆý‡Å…V> °gê°² ^ðlí³µ ¯]l…§ýl$MýS$ V>¯]l$ ™èl¯]l Ò$§ýl ¯]lÐ]l$ÃMýS… AÐ]l$ÃMýS$ ò³Ç-W…§ýl° õ³ÆöP¯é²Æý‡$. B °gê-Ƈ$$¡, O«§ðlÆý‡Å… ™égêV> D Ýë¦Æ‡$$MìS ^ólÇa…-§ýl-°'' A¯é²Æý‡$. తమను తీర్చిదిద్దిన పురట్చి తలైవర్ (ఎం.జి.ఆర్) బోధించిన, ‘కష్టపడి పనిచేసేవారే గొప్పవారు’ అనే సిద్ధాంతాన్ని అనుసరించి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 50 ఏళ్లకు పైగా పనిచేసిన ఫలితంగా పార్టీ సహచరులు నాకు ఈ హోదాను బహుమతిగా ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు. ఏదైనా ఒక పార్టీ నాయకత్వం, ఉద్యమం క్రమశిక్షణతో, నియంత్రణతో సాగాలని కోరుకుంటుంది. మా రాజకీయ గురువు అరిజ్ఞర్ అన్నా ’కర్తవ్యం – గౌరవం – క్రమశిక్షణ’ను బోధించారు. ఆయన మార్గంలోనే ఎం.జి.ఆర్, జయలలిత నడిచారు. నేను కూడా వారు చూపిన బాటలోనే పయనిస్తున్నాను. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి ద్రోహం చేసిన వారిపై జనరల్ బాడీ సమావేశంలో చర్యలు తీసుకున్నాము. ఇక్కడ ఉన్నంత కాలం పదవులను అనుభవించి, పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా, స్వలాభం కోసం వారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దాని గురించి మేము ఆందోళన చెందాలా? అని పేర్కొన్నారు. కూటమి అనేది ఎన్నికల పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. 1999లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన అన్నాడీఎంకే, 2004లో మళ్లీ జత కట్టింది. 1999లో బీజేపీతో చేరిన డీఎంకే, 2004లో అక్కడి నుండి విడిపోయి కాంగ్రెస్తో చేరింది. తమిళనాడులోని దుష్టశక్తి అయిన డీఎంకే పాలనను అంతం చేయాలనే ఏకై క లక్ష్యంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఢిల్లీ ఒత్తిడి అనేది ఊహ మాత్రమే. అమ్మ మరణం తర్వాత నిజమైన, విశ్వాసపాత్రులైన కార్యకర్తలు ఒక సామాన్య కార్యకర్తగా, కష్టపడే వ్యక్తిగా ఉన్న నాకు మద్దతు ఇచ్చారు. పార్టీని తాకట్టు పెట్టిన వారిని, ద్రోహం చేసిన వారిని గుర్తించి ‘కలుపు మొక్కలను తొలగించి పార్టీని కాపాడుకున్నాం. శత్రువులతో పోరాడుతున్నాం, క్షేత్రస్థాయిలో విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేశారు. మణిపూర్ విషయంలో మేం సరైన రీతిలో గళం విప్పాం. సీఏఏ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు, ముఖ్యంగా తమిళనాడు ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాను. సీఏఏ వల్ల ముస్లింలకు కలిగే నష్టం ఏంటో ఆధారాలతో చెబితే నేను సమాధానం ఇస్తాను. ఓట్ల కోసం తమను ఆదరించేది ఎవరు, నిజంగా తమ సంక్షేమం కోసం పాటుపడేది ఎవరు అనేది తమిళనాడులోని ముస్లిం సోదరులకు బాగా తెలుసు. ఈ ఎన్నికల్లో వారు పూర్తి ఇష్టంతో అన్నాడీఎంకేకు ఓటు వేస్తారనే నమ్మకం మాకు ఉంది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని సిద్ధాంతకర్తలుగా అంగీకరించి వారికి ఎంకే స్టాలిన్ సలాం కొడుతారేమోగానీ, తమ వరకు ఆదర్శ నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని అభిప్రాయపడ్డారు. రాజకీయంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ విజయ్ టీవీకే వారికీ ఉందంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని స్టాలిన్ కుటుంబం విదేశాలకు విహారయాత్రకు వెళ్లి వచ్చిందని మరో ప్రశ్నకు ఆరోపించారు. ఎస్ఐఆర్తో దొంగ, బోగస్ ఓట్లను తొలగించారని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా విమానాశ్రయం నిర్మించాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తమ విధానం అని పరందూరు విషయంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వాగ్దానాలను ఉచితం అని అనకండి. లేనివారికి, లేని పక్షంలో ఉన్నవారికి కుటుంబ అవసరాలకు కావాల్సినవి వెల లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ప్రాతిపదికన ఫ్రిడ్జ్ ఇస్తామని చెప్పాం. అన్ని కుటుంబ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తామని హామీ ఇచ్చాం. పేద , మధ్యతరగతి ప్రజలు తమకు ఓటు వేయడానికి ఇప్పటికే సిద్ధమైపోయారు. గెలుపు తమదే, అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. జన కెరటం వారికి స్వేచ్చ ఉంది! మైనారిటీలు మా వెన్నంటే.. బీజేపీతో పొత్తుపై.. వ్యక్తిగత విమర్శలు చేయను ఇటీవల ప్రసంగాలలో వ్యక్తిగత విమర్శలు తీవ్రంగా ఉన్నట్టుందే ? అని సూచించగా, తాను ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడటం చూశారా?, ఎవరైనా సరే వారు అని గౌరవంగా సంబోధించడమే నా పద్ధతి అని వ్యాఖ్యలు చేశారు. అయితే, అనవసరంగా గొడవకు దిగితే ఎలా వదలగలను? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అన్నాడీఎంకే, ఊరికే వదిలేస్తే నా గురించి కార్యకర్తలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. కష్ట పడి పనిచేసే వారే గొప్పవారు -
లోక్భవన్లో తరంగిణి పుస్తకావిష్కరణ
ఎం.వెంకయ్యనాయుడు కొరుక్కుపేట: గురువు, స్వర్గీయ పోలూరి హనుమజ్జానకీరామశర్మ కర్తత్వంలో రూపొందిన ఉపదేశామృత తరంగిణి పునర్ముద్రణను చైన్నెలోని లోక్భవన్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆయన గురువు స్మృతికి నివాళులర్పించారు. ప్రముఖ సంస్కృత పండితులు పూర్ణానందశాస్త్రి ,పుస్తక సంపాదకులు తుమాటి సంజీవరావు, పోలూరి హనుమజ్జానకీరామశర్మ కుటుంబసభ్యులు హాజరయ్యారు. కుర్తాళం సిద్ధేశ్వరి పీఠం ప్రథమ పీఠాధిపతులు విమలానందభారతి ఉపన్యాసాలను పోలూరి హనుమజ్జానకీరామశర్మ ప్రజల కోసం పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఏటా ఆయన జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ స్మారక ట్రస్ట్ ద్వారా వారి సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్నారు. చెన్నపురి తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో పునర్ముద్రించిన ఈ పుస్తకాన్ని చైన్నె లోక్భవన్లో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తరంగిణి పుస్తకానికి వారు రూపకల్పన చేసిన తీరు మహోన్నతమైనదని వెంకయ్యనాయుడు అన్నారు. పోలూరి నైపుణ్యం, అనుభవం, ఆధ్యాత్మిక మార్గంలో వారి వైశిష్ట్యానికి ఈ పుస్తకం చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. యువతకు ఈ పుస్తకాన్ని చేరువ చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
వంద శాతం పోలింగ్పై అవగాహన
వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్పై కోరుతూ తిరువణ్ణామలై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎన్నికల అధికారి తర్పగరాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ తిరువణ్ణామలైలోని మాడ వీధుల్లో ప్రారంభమై పలు వీధుల గుండా అవగాహన కరపత్రాలు అందజేస్తూ అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరువణ్ణామలై జిల్లా వందశాతం పోలింగ్ జరగాలని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించామన్నారు. ప్రస్తు తం వైద్య విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రికి వచ్చే రోగులకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో వంద శాతం పోలింగ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అదేవిధంగా అరుణాచలేశ్వరాలయం సమీపంలోని భక్తుల వద్ద వంద శాతం పోలింగ్పై అవగాహన కల్పించడంతో పాటు కరపత్రాలు అందజేశారు. 18 సంవత్సరాలు నిండిన యువత అందరూ వారి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రి సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
త్యాగభూమి మళ్లీ హస్తగతం అయ్యేనా..?
సాక్షి, చైన్నె: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై ప్రదేశం కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్. రాజీవ్ హత్యానంతరం ఈ ప్రాంతాన్ని త్యాగభూమిగా పిలుస్తూ వస్తున్నారు. అందుకే ఇక్కడ డీఎంకే కూటమిలో ప్రతి సారి కాంగ్రెస్ పోటీ చేస్తూ వస్తోంది. మళ్లీ గెలుపు లక్ష్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై దూసుకెళ్తున్నారు. ఆయన్ని ఢీకొట్టే విధంగా అన్నాడీఎంకేకు చెందిన బలమైన అభ్యర్థి కె పళణి మళ్లీ బరిలో దిగారు. ఇక, కొత్త ముఖాలుగా విజయ్ టీవీకే అభ్యర్థిగా తెన్నరసు, సీమాన్ ఎన్టీకే అభ్యర్థిగా సింధు పోటీలో ఉన్నారు. వివరాలు.. కాంచీపురం జిల్లాలో శ్రీపెరంబదూరు ఉన్నప్పటికీ, ఇది గ్రేటర్ చైన్నెలో భాగం అన్నట్టుగా కనిపిస్తుంది. పారిశ్రామిక వాడలకు నిలయంగా ఉన్న ఈ ప్రదేశం పేరిట అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలు రెండూ ఉన్నాయి. అంతే కాదు, శ్రీపెరంబుదూర్ (ఎస్సీ) నియోజకవర్గం ఆధ్యాత్మికతకు మారుపేరుగా, వైష్ణవ తత్వవేత్త శ్రీ రామానుజుల జన్మస్థలం కావడమే కాకుండా, ’దక్షిణాసియా డెట్రాయిట్’గా పిలవబడే సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతాలు ఇక్కడే ఉండటం విశేషం. లోక్సభ ఎన్నికలలో ఇక్కడి డీఎంకే అభ్యర్థిగా టీఆర్బాలు వరుసగా విజయకేతనం ఎగుర వేస్తూ వస్తున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమరం ఇక్కడ వేడెక్కింది. త్యాగ భూమిని మళ్లీ కై వసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెట్టింది. 1952 నుండి ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ 7 సార్లు, డీఎంకే 4 సార్లు, అన్నాడీఎంకే 2 సార్లు విజయం సాధించాయి. 2021లో కాంగ్రెస్ అభ్యర్థి సెల్వ పెరుంతొగై అన్నాడీఎంకే అభ్యర్థి కె పళనిపై 10 వేల 879 ఓట్లతో గెలిచారు. అభ్యర్థుల బలాబలాలు ఇలా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సెల్వ పెరుంతొగై మళ్లీ రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు, కూటమి బలం ఆయనకు అనుకూలం. అదే సమయంలో అన్నాడీఎంకే అభ్యర్థి కె. పళణి బలమైన అభ్యర్థి కావడం గమనార్హం. 2016లో సెల్వ పెరుంతొగైపై విజయకేతనం ఎగుర వేసి అసెంబ్లీలో పళణి అడుగు పెట్టారు. 2021లో 10 వేల పై చిలుకల ఓట్లతో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన్నే అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలోకి దించింది. మాజీ ఎమ్మెల్యేగా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, తాజాగా కలిసి వచ్చిన కూటమి పార్టీల బలం మేళవింపుతో గతంలో కోల్పోయిన విజయాన్ని మళ్లీ సాధించాలనే పట్టుదలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక యువతను ఆకర్షించి ఓట్లను చీల్చే దిశగా సీమాన్ ఎన్టీకే అభ్యర్థి సింధు ఓట్ల వేటలో ఉన్నారు. విజయ్ చరిష్మాతో అభిమానులు, యువత మద్దతపై ఎన్నో ఆశలతో టీవీకే అభ్యర్థి కె తెన్నరసు బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గానికి కొత్త ముఖాలు కావడంతో ఎన్నికలలో ప్రధాన సమరం అన్నది సెల్వ పెరుంతొగై, కె పళని మధ్యే ఉన్నది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ , అన్నాడీఎంకే నెలకొన్న ఈ సమరంలో కొత్త ముఖాలు ఓట్లు భారీగానే చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3,75,921 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో వన్నియర్, మొదలియార్, దళిత , మైనారిటీ, కార్మిక వర్గాల ఓట్లు ఏక పక్షంగా ఎవరికై తే పడుతాయో వారే విజేతలుగా నిలవడం ఖాయం. ప్రధాన డిమాండ్లు ● పూందమల్లి – శ్రీపెరంబుదూర్ మెట్రో పనులను వేగవంతం చేయాలనేది ప్రధాన డిమాండ్. ● సిప్కాట్ కంపెనీలలో స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. – భూగర్భ మురుగునీటి వ్యవస్థ, సరైన తాగునీటి సరఫరా ఇక్కడ పెద్ద సవాలుగా మారాయి. ● పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణ జరుగుతున్న తరుణంలో, మిగిలి ఉన్న వ్యవసాయ భూములనుపరిరక్షించాలన్నది రైతుల నినాదం. ● గ్రామీణ ప్రాంతాలన్నీ పట్టణీకరణగా గ్రేట్ చైన్నెలో కలుస్తుండటంతో అభివృద్ధి వేగం పెంచాల్సిన అవశ్యం ఉంది. -
15, 18 తేదీల్లో పీఎం మోదీ పర్యటన
సాక్షి,చైన్నె : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 15న, 18 తేదీలలో ఈ పర్యటనకు ఏర్పాట్లు కచేపట్టారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం ప్రచార బాట పట్టారు. విరుదునగర్జిల్లా సాత్తూరులో పోటీచేస్తున్న బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్కుమద్దతుగా ఆదివారం నితిన్ నబిన్ రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అవినీతికి, సుపరిపాలనకు మధ్య జరుగుతున్న సమరంగా వ్యాఖ్యలుచేశారు. ఈ పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీవర్గాలలో జోష్ నెలకొంది. ఈనెల 15వ తేదీన కేరళ తిరువనంతపురం నుంచి నాగర్ కోయిల్కు పీఎం మోదీ హెలికాఫ్టర్లో రానున్నారు. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్లో రోడ్షో నిర్వహించనున్నారు. ఈ జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఫ్రచార సభలో ప్రసంగించి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. తదుపరి పర్యటనగా ఏప్రిల్ 18వ తేదిన కోయంబత్తూరు బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టారు. కోయంబత్తూరులోని కొడిస్సీయా మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సైతం పాల్గొనున్నారు. ప్రధాని పర్యటనతో పాటుగా బీజేపీ అభ్యర్థుల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరు ప్రాంతాలలో పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధమైనట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సోమవారం తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్న సమాచారంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను అన్ని చోట్ల బీజేపీ వర్గాలు చేపట్టాయి. -
ఆన్లైన్లో రూ.4.25 కోట్ల నగదు మోసం
తిరువొత్తియూరు: పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారి సహా ముగ్గురి వద్ద రూ.4.25 కోట్ల ఆన్లైన్ ద్వారా మోసం చేసిన కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. తమిళనాడు విద్యుత్ శాఖలో ఉన్నత పదవి నుంచి పదవీ విరమణ పొందిన 70 ఏళ్ల వృద్ధుడు కోయంబత్తూరులో నివసిస్తున్నాడు. అతనితో ఒక పోలీసు అధికారి వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. అప్పుడు, అతనిపై నేరారోపణ వచ్చిందని, డిజిటల్ అరెస్ట్ చేశామని, బ్యాంకు ఖాతాలోని డబ్బు గురించి విచారణ జరపాల్సి ఉన్నందున, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బు పంపాలని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి పంపుతామని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన పదవీ విరమణ పొందిన అధికారి, తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటి 24 లక్షలను 3 వాయిదాలుగా పంపాడు. డబ్బు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అదేవిధంగా, కోయంబత్తూరుకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ ఒకరి నుంచి ఆన్లైన్ షేర్ పెట్టుబడిలో అధిక లాభం ఇస్తామని చెప్పి రూ.1.85 కోట్లు మోసం చేశారు. మరో పారిశ్రామికవేత్త నుంచి రూ.1.44 కోట్లు దోచుకున్నారు. గత మూడు రోజుల్లో కోయంబత్తూరులో మొత్తం రూ.4.53 కోట్ల మోసం జరిగిందని పోలీసులకు పిర్యాదులు వచ్చాయి. దీనిపై సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్నారు. సాక్షి, చైన్నె: నిర్మాణ రంగంలోని పని ఒత్తిడిని తగ్గించి, నిపుణుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆర్కాజ్ నేతృత్వంలో ప్రప్రథమంగా చైన్నె పికిల్బాల్ కోర్టులో ప్రతిష్టాత్మక క్యూ–లీగ్ 2026 టోర్నమెంట్ను నిర్వహించింది. నిర్మాణ రంగ చరిత్రలో ఆర్కిటెక్ట్లు, కాంట్రాక్టర్లు , డిజైనర్ల కోసం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. టోర్నమెంట్ విజేతలు, రన్నర్స్లకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్, ది రియల్ ఉమెన్ గ్లోబల్ కమ్యూనిటీ , రోటరీ క్లబ్ ఆఫ్ అన్నా నగర్ ఆదిత్య వంటి ప్రముఖ సంస్థలు మద్దతు తెలిపాయి. ఆర్కాజ్ గ్లోబల్ వ్యవస్థాపకురాలు శిల్పా సుకుమార్ మాట్లాడుతూ.. నిర్మాణ రంగ నిపుణులకు పికిల్బాల్ క్రీడను పరిచయం చేయడం ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు. ఇతరుల కలల ఇళ్లను నిర్మించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే నిపుణులకు ఈ క్యూ–లీగ్ ఒక గొప్ప ఉపశమనంగా పేర్కొన్నారు. -
రామేశ్వరంలో గ్రాండ్ కాంటినెంట్ సేవలు
సాక్షి, చైన్నె : పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన రామేశ్వరంలో తమ సేవలకు శ్రీకారం చుట్టామని గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ శివ ప్రకటించారు. పాంబన్ దీవులలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ ఫోర్–స్టార్ వెజిటేరియన్ హోటల్, దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక , పర్యాటక రంగాల్లో తన ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు వివరించారు. ఏడాది పొడవునా భక్తులు, పర్యాటకులు వచ్చే తీర్థయాత్ర స్థలాలపై తాము దృష్టి పెట్టామన్నారు. రామేశ్వరం వచ్చే దేశీయ పర్యాటకులు, కుటుంబాలు, ఆధ్యాత్మిక వేత్తలకు సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన , ప్రధాన ఆలయాలకు దగ్గరగా ఉండే బసను అందించడమే ఈ హోటల్ లక్ష్యంగా వివరించారు. ఇది 31వ హోటల్గా పేర్కొంటూ, దక్షిణ భారతదేశం బలమైన వృద్ధితో ముందుకెళ్తున్నామన్నారు. రామేశ్వరం వంటి ప్రాంతాల్లో నాణ్యమైన వసతికి నిరంతరం డిమాండ్ ఉంటోందని పేర్కొంటూ, భవిష్యత్తులో సోమనాథ్, వారణాసి , అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలో కూడా తమ హోటళ్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. -
విజయమే ధ్యేయంగా శ్రమిద్దాం..!
‘ప్రతి ఓటూ ఎంతో ముఖ్యం. నా పోలింగ్ బూత్ – విజయపు పోలింగ్ బూత్’ అని నిరూపించుకునేలా ప్రతి కార్యకర్త కష్టపడితే ప్రతి నియోజకవర్గంలోనూ విజయం తథ్యమని డీఎంకే అధ్యక్షుడు , సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇదే ప్రతి కార్యకర్త నుంచి తాను ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆదివారం సామాజిక మాధ్యం వేదికగా డీఎంకే కేడర్కు స్టాలిన్ లేఖ రాశారు. సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పది రోజులు మాత్రమే సమయం ఉందని సీఎం స్టాలిన్ డీఎంకే కేడర్కు గుర్తి చేశారు. తాను ప్రతి చోటా కార్యకర్తల ఉత్సాహాన్ని స్వయంగా చూస్తున్నానని, తమిళనాడు ప్రజల్లో ఆనందాన్ని గమనిస్తున్నానని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రతి పథకం ప్రజలకు అందించిన ప్రయోజనం అని పేర్కొంటూ, రాబోయే ద్రావిడ మోడల్ 2.ఓ పాలనలో చేపట్టబోయే విప్లవాత్మక పథకాలపై ప్రజల్లో ఉన్న అంచనాలు అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. ఎన్నికల క్షేత్రంలో డిఎంకే కార్యకర్తల పనితీరు శత్రువులను సైతం విస్మయానికి గురిచేస్తుందనేది చరిత్ర అని పేర్కొంటూ, గత ఏడాది కాలంగా తమిళనాడులోని 75 వేల పోలింగ్ బూత్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.. ప్రజలతో ఉన్న ఈ బంధం ఎప్పటికీ కొనసాగాలని, ముఖ్యంగా రానున్న ఈ 10 రోజులు కార్యకర్తలు ప్రజల్లో మమేకమై క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను సేకరించడంపై పూర్తి దృష్టి సారించాలని, కూటమి పార్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ’మీలో ఒకడినైన నేనే నిలబడ్డాను’ అనే భావనతో పనిచేసి విజయాన్ని ఖాయం చేయాలని సూచించారు. 92 ఏళ్ల వయసున్న ద్రావిడర్ కళగం అధ్యక్షుడు కి.వీరమణి మండుటెండలోనూ ప్రచారం చేస్తున్నారని, 80 ఏళ్లు దాటిన సోదరులు చిదంబరం, వైకో రాష్ట్రంలోని ప్రతి మూలకూ వెళ్లి ద్రావిడ మోడల్ పాలన మళ్లీ రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారని పేర్కొన్నారు. 87 ఏళ్ల పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మొదలు, 28 ఏళ్ల చిన్న వయసున్న అవినాశి అభ్యర్థి డాక్టర్ కోకిలామణి వరకు బొంగరం వలే తిరుగుతూ పనిచేస్తున్నారన్నారు. అందరూ ఐక్యంగా , సమన్వయంతో పనిచేస్తున్నారన్న సమాచారం తన దృష్టికి వచ్చిందని, అలుపు లేకుండా శ్రమించడంలో డీఎంకే కార్యకర్తలకు సాటి ఎవరూ లేరని పేర్కొంటూ, భారతదేశానికే దిక్సూచిగా నిలిచే ద్రావిడ మోడల్ 2.ఓ పాలన లక్ష్యంగా దివంగత నేత కరుణానిధి సైనికులైన (కార్యకర్తలు) ఈ పదిరోజుల పాటుగా మరింతగా దూసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. జననాయకన్ లీక్పై స్పందించాల్సిన అవసరం లేదు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామనాథపురం జిల్లా పరమకుడిలో స్టాలిన్ పర్యటించారు. ఉదయాన్నే ఆయన వాకింగ్చే స్తూ పరమకుడి రోడ్లుపై తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రామనాథపురం జిల్లాలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థులు కాదర్ బాషా ముత్తురామలింగం (రామనాథపురం), కదిరవన్ (పరమకుడి), రాజకన్నప్పన్ (ముదుకులత్తూరు) , తిరువాడనై కాంగ్రెస్ అభ్యర్థి కరుమాణిక్కంకు మద్దతుగా గంటలకు పరమకుడి ప్రచారసభలో ప్రసంగించారు. అంతకుముందు, శివగంగ జిల్లా తిరుపత్తూరులో ప్రచారాన్ని ముగించుకుని పరమకుడిలోని ఓ ప్రైవేట్ మహల్లో బస చేశారు. ఉదయం పరమకుడిలో వాకింగ్కు వెళ్లిన స్టాలిన్, పరమకుడి గాంధీ విగ్రహం, పెరియ బజార్ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. ఎమనేశ్వరం ప్రాంతంలో ప్రజలతో ముచ్చటించి డిఎంకే అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ప్రజలు ముఖ్యమంత్రితో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ, పుస్తకాలను బహుకరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలను పలకరిస్తున్న స్టాలిన్ పిల్లలతో ముచ్చటిస్తూ... మగ్గంపై స్టాలిన్ విలేకరులతో మాట్లాడుతూ: ‘నేను రోజూ నడవడం కేవలం ఓటర్లను కలవడం కోసం మాత్రమే కాదని, చైన్నెలో ఉన్నా, ఏ ఊరికి వెళ్లినా ఉదయాన్నే నడవడం తనకు అలవాటు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నడక సమయంలో ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నారన్నారు. పళనిస్వామి ఓటమి భయంతో నిరాశలో ఉన్నారని, ఆ విరక్తిలోనే డీఎంకే నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడుకు, ఢిల్లీకి మధ్యే పోటీ అని నేను చెప్పడానికి కారణం.. అన్నాడీఎంకే ముసుగు వేసుకుని రాష్ట్రంలోకి బీజేపీ ప్రవేశిస్తుండటమేనని వివరించారు. విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా లీక్ గురించి ప్రశ్నించగా, స్పందించాల్సిన అవసరం లేదన్నారు. విజయ్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, నో కామెంట్స్ ... సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా రామనాథపురం జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య స భ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు, పరిశ్రమ, వాణిజ్య సంఘాల ప్రతినిదులు స్టాలిన్ను కలిసి తమ మద్దతు తెలియజేశారు. -
ఫీనిక్స్లో ‘హాలిడే ల్యాండ్’
సాక్షి, చైన్నె : చైన్నెలోని ప్రముఖ షాపింగ్, వినోద కేంద్రంగా ఉన్న ఫీనిక్స్ మార్కెట్సిటీలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ ‘హాలిడే ల్యాండ్’ పేరుతో వినూత్న వేడుకను ప్రారంభించారు. మడగాస్కర్ థీమ్తో రూపొందించిన ఈ ఉత్సవం మొత్తం మాల్ను సర్కస్, షాపింగ్ , కుటుంబ వినోదంతో కూడిన ఒక రంగుల ప్రపంచంగా మార్చేసింది. ఈ అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకతో ఫీనిక్స్ మార్కెట్సిటీ సరికొత్తగా మారింది. మాల్లోకి అడుగుపెట్టిన సందర్శకులకు ఆఫ్రో జంగిల్ డ్యాన్స్ ప్రదర్శనలు, శక్తివంతమైన సర్కస్ విన్యాసాలు, మడగాస్కర్ పాత్రల మాస్కట్లు , పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాక్టివిటీ జోన్లు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖ డిజిటల్ క్రియేటర్ వీజే సిద్ధు ప్రత్యేక అతిథిగా హాజరై సందర్శకులను అలరించారు. యువ అభిమానులతో ఆయన ముచ్చటించారు.గ్రాండ్ లాంచ్ సందర్భంగా జరిగిన కౌంట్డౌన్ , లైటింగ్ సెర్మనీతో ‘హాలిడే ల్యాండ్’ ఇన్స్టాలేషన్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ వారాంతంలో ‘సింగ్ అలాంగ్ చైన్నె’ మ్యూజికల్ బ్యాండ్ ప్రదర్శనలు , కొనసాగుతున్న సర్కస్ విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. -
సమగ్రత, సామరస్యంతో సాగుదాం
కొరుక్కుపేట: ఐక్యత, సమగ్రత, సామరస్యంతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని వక్తలు అన్నారు. యూనైటెడ్ ఎకనమిక్ ఫోరమ్ (యూఈఎఫ్) ఆధ్వర్యంలో చైన్నె, రాయపేటలోని అమీర్ మహల్ వేదికగా యూఈఎఫ్ ఈద్ మిలాన్– 2026ను విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. ఆర్కాట్ నవాబ్జాదా ఆసీఫ్ అలీ నేతృత్వంలో సాగిన ఈ వేడుకల్లో యూఈఎఫ్ ప్రెసిడెంట్ అహ్మద్ బుహారి, విష్ణుమోహన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి శ్రీహరిప్రసాద్, రెవరెండ్ ఫాదర్ సుందర్రాజ్ పాల్గొన్నారు. తిరువొత్తియూరు: మామల్లపురం సమీపం కొక్కిలమేడు మత్స్యకార ప్రాంతం వద్ద సముద్రతీరంలో ఉపయోగించని రెండు పైబర్ పడవలు నిలిపి వున్నాయి. ఈ పడవలకు దగ్గరగా చెత్తకుప్పలు పేరుకుపోయింది. ఈ పరిస్థితిలో ఈ చెల్కు అకస్మాతుగా మంటలు అంటుకుంది. దీనిపై సమాచారం మేరకు మామల్లపురం అగ్నిమాపక కేంద్రం అధికారి ఇన్బరాజ్ నేతృత్వంలో ఐదు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి అరగంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. పడవలు తగలబడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. -
కీల్పాక్లో పింక్ పొటాటో ఏర్పాటు
సాక్షి,చైన్నె: ప్రముఖ పాల్సన్ బ్యూటీ అండ్ ఫ్యాషనన్స్ ఆధ్వర్యంలో చైన్నె కీల్పాక్కంలో పింక్ పోటాటోను ఏర్పాటు చేశారు. దీనిని క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సతీమణి ఉత్కర్ష, క్రికెటర్ శ్రేయాస్ గోపాల్ సతీమణి నిఖిత శివ్, సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ రాజీవ్ కుమార్ సతీమణి రెబెకా అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్సన్ బ్యూటీ ఫ్యాషన్న్స్ ఎండీ డాక్టర్ శామ్ పాల్, అశ్విని శామ్ పాల్, ప్రసాద్ బలరామన్ తదితరులు పాల్గొన్నారు. ఈ పింక్ పొటాటో లో నోరూరించే హరా భరా కబాబ్, భేల్ పూరి, పన్నీర్ టిక్కా, బీట్రూట్ సూప్, హమ్మస్ వంటి ఆకర్షణీయమైన స్టార్టర్లు, ప్రధాన వంటకాలను అందిస్తున్నట్టు డాక్టర్ శ్యామ్పాల్ తెలిపారు. -
మణిరత్నం 23వ చిత్రానికి వేళాయె
తమిళసినిమా: ఏస్ డైరెక్టర్గా పేరు గాంచిన దర్శకుడు మణిరత్నం. ఇంతకు ముందు ఈయన పట్టిందల్లా బంగారం అన్నట్టుగా చేసిన చిత్రాలన్నీ సంచలన విజయాలను సాధించాయి. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 1,2 వంటి చారిత్రక కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఇక ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించడంలో మణిరత్నంది ప్రత్యేక శైలి. ఇందుకు చిన్న ఉదాహరణ ముంబాయి, ఓ కణ్మణి వంటి చిత్రాలే. అలాంటి గొప్ప దర్శకుడు ఇటీవల కమలహాసన్, శింబు, త్రిష వంటి ప్రముఖ నటీనటులతో రూపొందించిన థక్ లైఫ్ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో మణిరత్నం తాజాగా ఒక యూత్ ఫుల్ లవ్స్టోరీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతి, నటి సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిండానికి రెడీ అవుతున్నారు. బహుభాషా నటీనటులుగా రాణిస్తున్న ఈ జంట తొలిసారి ఈ చిత్రంలో కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఇండియా టొకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రొడక్షన్స్ నెంబర్ 23 అనే. తాత్కాలిక పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికీ ముమ్మరంగా జరుగుతున్నాయని తాజా సమాచారం. కాగా చిత్ర షూటింగ్ మే నెల 14 వ తేదీన ప్రారంభం కానున్నట్లు తాజా అప్ డేట్.కాగా ఈ క్రేజీ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
క్లుప్తంగా
విజయ్ మంచి నటుడే కానీ.. తిరువళ్లూరు: టివీకే ఽఅధినేత విజయ్ మంచి నటుడని అయితే రాజకీయంగా ఆయన పనికి రారని సినీనటి నళినీ స్పష్టం చేశారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్దిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్కు మద్దతుగా తిరువళ్లూరు పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలతో పాటు అధిగత్తూరు, వెంగత్తూరు, మన వాలనగర్ తదితర ప్రాంతాల్లో నళినీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నళినీ మాట్లా డుతూ టివీకే అధినేత విజయ్ మంచి నటుడని, ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా వుందని స్పష్టం చేశారు. విజయ్కు వున్న క్రేజ్తోనే ఆయననూ చూడడానికి భారీగా జనం తరలివస్తున్నారని వ్యాఖ్యానించిన అయితే సభలకు వచ్చిన జనం ఓటు వేయరన్నారు. ఇంధిర విద్యాసంస్థల అదినేత్రి ఇంధిరరాజేంద్రన్, తిరువళ్లూరు డిఎంకే కార్యదర్శి రవిచంద్రన్, మున్సిపల్ చేర్పర్సన్ ఉధయమలర్ పాల్గొన్నారు. డీఎంకేకు ఓటేస్తే... ఉదయనిధిని సీఎం చేసినట్టే – పీయూష్ ఆసక్తికర వ్యాఖ్య సాక్షి,చైన్నె : డీఎంకేకు ఓటు వేయడం అంటే ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడమే అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు సంస్కృతి గౌర వించని ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంద్దామని పిలుపు నిచ్చారు. డిఎంకేకు ఓటు వేయడం అనేది కేవలం ఉదయనిధిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికే ఉపయోగపడుతుందని, ఒకే కుటుంబం పాలన కొనసాగడానికి ప్రజలు అనుమతించకూడదని వ్యా ఖ్యలు చేశారు. మదురైలో ని తమిళనాడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ఆదివారం పారి శ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అద్వన్నంగా శాంతి భద్రతలు ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ మాట్లాడుతూ తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగాయని, రౌడీల రాజ్యం నడుస్తున్నదని, డ్రగ్స్ మాఫియా రాజ్యమేళుతున్నారని వివరించారు.. శాంతిభద్రతల సమస్య కారణంగా కొత్త పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారని గోయల్ తెలిపారు. డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు తమిళనాడు ప్రభుత్వం కేంద్ర పథకాలను అడ్డు కోవడంలోనే ఆసక్తి చూపుతోందని పీయూష్ గోయల్ విమర్శించారు.డిఎంకే ప్రభుత్వం కేవ లం కరప్షన్ , కమిషన్ , కలెక్షన్ లకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్టాలిన్, ఉదయనిధి, శబరీశన్, కనిమొళి వంటి నాయకుల సంఖ్య పెరగడం వల్లే అవినీతి కూడా పెరిగిందని ఆరోపించారు. దివంగత సీఎం జయలలిత తన హయంలో వేసిన పునాదులు నేడు ఫలాలను ఇస్తున్నాయని, ఇందులో డీఎంకే చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. డాక్టర్ టి.వి. రాజాకు ఎక్సలెన్స్ అవార్డు సాక్షి, చైన్నె: రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ మిడ్–టౌన్ ప్రతిష్టాత్మకమైన వొకేషనల్ ఎక్సలెనన్స్ అవార్డును ప్రముఖ ఆర్థోపెడిక్ ఫుట్ – యాంకిల్ సర్జన్ డాక్టర్ టి.వి. రాజాకు ప్రదానం చేశారు. పాడియాట్రీ (పాదాల వైద్యం) రంగంలో ఆయన సాధించిన విశేష వృత్తిపరమైన విజయాలు, అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్, సర్జికల్ అనుభవం కలిగిన డాక్టర్ టి.వి. రాజా, పాదాలు , చీలమండ శస్త్రచికిత్సలు, డయాబెటిక్ ఫుట్ (మధుమేహ వ్యాధిగ్రస్తుల పాదాల సమస్యలు) మేనేజ్మెంట్, ట్రామా కేర్ , జాయింట్ రీప్లేస్మెంట్ రంగాలలో విశేష కృషి చేశారు.డాక్టర్ టి.వి. రాజా ప్రస్తుతం చైన్నె టి.నగర్లోని వీసా మెడిక్యూర్ మేనేజింగ్ డైరెక్టర్గా కన్సల్టెంట్ ఫుట్ సర్జన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శమైన సర్వీస్ అబోవ్ సెల్ఫ్ (స్వార్థం లేని సేవ)కు నిదర్శనంగా నిలిచినందుకుఈ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆర్.టి.ఎన్. జి. ఎడ్విన్, వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఆర్.టి.ఎన్. వెట్రివేల్ రాజన్, సెక్రటరీ ఆర్.టి.ఎన్. ప్రియ సతీష్, ఆర్.టి.ఎన్. ఎన్.ఎమ్.ఇలంకుమరన్, తదితరులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
కొరుక్కుపేట: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఆయిల్ కంపెనీల (ఐఓసీఎల్, పీబీసీఎల్., హెచ్బీసీఎల్) కో–ఆర్డినేటర్ వి.సి. అశోకన్ జారీ చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అన్ని ప్లాంట్లు, రవాణా సౌకర్యాలు పంపిణీ వ్యవస్థలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఎల్పీజీ సిలిండర్లను క్రమపద్ధతిలో పొందగలుగుతున్నారని. అందువల్ల, మీరు ఆందోళన చెందొద్దని కోరారు. కొరుక్కుపేట: సముద్రంలో సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించినందుకు కారైకల్ జిల్లాకు చెందిన 12 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. కారైకాల్ జిల్లా కొటుచ్చేరిమెట్కు చెందిన వడివేల్కు చెందిన మోటర్బోట్లో తిరుప్పట్టినం, కారైకల్కు చెందిన 12 మంది జాలర్లు కారైకల్ మత్స్య రేవు నుంచి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరు ఆదివారం తెల్లవారుజామున చేపలు పడుతుండగా సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణపై బోట్ను స్వాధీనం చేసుకుని, అందులోని 12 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. ఈ విషయమై మత్స్యకారులు తమ గ్రామ పంచాయతీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం, అరెస్టు అయిన మత్స్యకారులను, పడవను విడుదల చేయాలని వారు పరిపాలనా యంత్రాంగాన్ని , పుదుచ్చేరి జిల్లా ముఖ్యమంత్రిని కోరారు. తిరుత్తణి: తిరుత్తణిలో ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకల్లో మూడువేల మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. వివరాలు.. తిరుత్తణి గాంధీరోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో గతనెల 26న అగ్నిగుండ వేడుకలు ధ్వజారోహణంతో ప్రారంభమైయ్యాయి. 18 రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో రోజూ అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రోజూ పగటి సమయాల్లో మహాభారత ప్రవచనాలు, రాత్రి వేళల్లో వీధి నాటకాలు ప్రదర్శించారు. వేడుకల్లో ప్రదానమైన అగ్నిగుండ వేడుకలు ఆదివారం సందర్భంగా ఉదయం దుర్యోధన వధ నాటక ప్రదర్శనలో వేలాదిమంది పాల్గొన్నారు. సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా ఆలయం ముందు వేలాదిగా పట్టణ ప్రజలు గుమిగూడారు. అగ్నిగుండ ప్రవేశంకు కంకణాలు ధరించిన మూడువేల మంది భక్తులు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండం ముందు ప్రత్యక అలంకరణలో ద్రౌపదీదేవి కొలువుదీరగా అగ్నిగుండంకు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేపట్టి భక్తులు గోవింద నామస్మరణతో అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. రాత్రి అమ్మవారు పట్టణ వీధుల్లో ఊరేగారు. వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అన్నానగర్: లైంగిక వేధింపుల కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాణిపేట జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ చైన్నెలోని అరుంబాక్కంలోని మహిళా హాస్టల్లో ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె అరుంబాక్కంలోని ఒక జిమ్కు వెళ్లడానికి ఎన్.ఎస్.కె నగర్ సిగ్నల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అదే జిమ్లో శిక్షణ పొందుతున్న ఒక యువకుడు బైక్లో వచ్చి ఆమెతో మాట్లాడాడు. ఆ సమయంలో, బైక్ వెనుక కూర్చున్న యువకుడు ఆ యువతిని లైంగికంగా వేధించాడు. అమైందకరై పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిగింది. విచారణలో అరుంబాక్కంలోని తిరువళ్లువర్నగర్కు చెందిన గుణశేఖరన్ అనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు గుణశేఖరన్(41)ను అరెస్టు చేశారు. తిరువొత్తియూరు: మధ్యప్రదేశ్ రాష్ట్రం, గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ఖుషీ జైన్ (24) విద్యార్థిని, చైన్నె విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతున్నారు. పరీక్షలు రాయడానికి చైన్నె కీల్పాకంలో వున్న హోటల్లో వుంటున్నారు. శనివారం రాత్రి ఖుషీ జైన్ గదిలో నిద్రపోయి ఆదివారం ఉదయం లేచి చూసేసరికి గదిలో ఉంచిన ల్యాప్టాప్, సెల్ఫోన్, రూ.1,700 నగదు చోరీ జరిగినట్టు తెలిసింది. దీనిపై ఖుషీ జైన్ కిల్పాక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటన స్థలంలో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో కీల్పాక్కు చెందిన శ్రీధర్ (27), కార్తీక్ (19), సతీష్ (22) అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్టాప్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
అమర్కళం రీ రిలీజ్
తమిళసినిమా: నటుడు అజిత్ కుమార్ హీరోగా నటించిన కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రం అమర్కళం. ఇప్పుడు ఆదర్శ దంపతులుగా జీవిస్తున్న అజిత్ కుమార్ శాలిని హీరో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ఇది. అదేవిధంగా అజిత్ కుమార్ హీరో నటించిన 25వ చిత్రంగా గుర్తింపు పొందింది. అప్పటివరకు ప్రేమ కథ చిత్రంలో నటించిన అజిత్ కుమార్ యాక్షన్ హీరోగా అవతారమెత్తిన చిత్రం కూడా ఇదే. చరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1999లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రేమ, సెంటిమెంట్ ,యాక్షన్ వంటి అంశాలతో కూడిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే నటుడు అజిత్ కుమార్ ఆసక్తికరమైన నటన, నటి శాలిని మనసులను కదిలించే నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. కాగా సుమారు 26 ఏళ్ల తర్వాత అమర్కళం చిత్రం డిజిటల్ ఫార్మేట్లో రీ రిలీజ్ కావడానికి సిద్ధమైంది. స్వేరో సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని కార్తీక్ వెంకటేశన్ ఆధునిక హంగులతో రూపొందించి రీ రిలీజ్ చేస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని అజిత్ కుమార్ , శాలినిల పెళ్లిరోజు అయిన ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రీరిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
బ్రేక్ ఫాస్ట్ చిత్ర టీజర్కు విశేష ఆదరణ
తమిళసినిమా: మండే ఎండల్లో గుండెలను తాకే చల్లదనంలా ,ప్రేమ, సంతోషం, మనసులను పిండే భావోద్వేగ సన్నివేశాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ చిత్ర టీజర్ ప్రేక్షకులను రొమాంటిక్ అనుభవాన్ని కలగజేస్తోందని ఆ చెత్త యూనిట్ పేర్కొన్నారు. చెల్లమే వంటి మంచి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ఏఆర్ గాంధీకృష్ణ చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన తాజా చిత్రం బ్రేక్ ఫాస్ట్. యాక్సెప్ట్ ది రియాలిటీ అనే ట్యాగ్ తో నువ్వు పొందిన ఈ చిత్రంలో బిగ్బాస్ ఫేమ్ రాణవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నటి రోస్మిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం టీజర్ను ఇటీవల నటి రీమాసేన్ విడుదల చేశారు. ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్న ఆనందాన్ని చిత్ర యూనిట్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వ్యక్తం చేశారు. నటుడు సంపత్ కుమార్, నటి కస్తూరి, అర్చన, కృతిక మోహన్, అమిత రంగనాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రేమ్ క్లాసిక్ పిక్చర్స్ ప్రతాపంపై గిరిజ వరదరాజ్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని ఎంవీ పన్నీర్ సెల్వం చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ తరం ప్రేమ బ్రేకప్ వంటి అంశాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా టైలర్, చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ నమోదుపై ఫిర్యాదు
వేలూరు: వేలూరు జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించింది. దీంతో వేలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లు సేకరించేందుకు మొత్తం 51 బృందాలను నియమించింది. దీంతో గత శనివారం నుంచి మూడు రోజుల వరకు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలట్ను తీసుకునే పనులు జరుగుతున్నాయి. అయితే అనకట్టు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకునే సమయంలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కలైఅరసన్, న్యాయవాది గోవిందస్వామి జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అందులో అనకట్టు నియోజకవర్గంలో పుత్తూరు పంచాయతీ ఊచంగాడు గ్రామానికి చెందిన 85 ఏళ్ల వృద్దుడి వద్ద పోస్టల్ ఓటు సేకరించేందుకు వెల్లిన ఒక బృందం ఎన్నికల అధికారుల అనుమతి తీసుకోకుండా డీఎంకే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు వృద్ధుని బార్య వద్ద సంతకాలు తీసుకొని కొంత నగదును అందజేసి ఓటు వేసుకున్నట్లు తెలిసింది. నియోజకవర్గం పూర్తిగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని అధికారులు నేరుగా వెల్లి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవడం లేదని అంగన్వాడీ టీచర్, డీఎంకే పార్టీ ప్రతినిధులు తీసుకుంటున్నారని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు తీసుకున్న అధికారి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
బదిలీల వెనుక కుట్ర ..!
– ప్రేమలత విజయకాంత్ ఆరోపణ సేలం: తమిళనాడులో ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా విజయకాంత్ ఆరోపించారు. సేలంలో విలేకరులతో ఆదివారం ఆమె మాట్లాడుతూ, తమిళనాడు అంతటా డీఎండీకే దాని మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా తాను ప్రచారం చేస్తున్నానని, ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్టు వివరించారు. తమ కూటమి 200లకు పైగా స్థానాలలో గెలవడం తథ్యమన్నారు.సీఎం స్టాలిన్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైందన్నారు. తిరుమావళవర్తో వివాదంపై స్పష్టత కడలూరులో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అభ్యర్థుల ప్రకటన సమయంలో తలెత్తిన చిన్న విషయాన్ని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోద రుడు తిరుమావళవన్ ఇప్పటికే దీనిపై వివ రణ ఇచ్చారన్నారు. తామిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని, విజయకాంత్, తిరుమావళవన్ సోద రుల తరహాలో ఉండేవారన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాను పోటీ చేస్తున్న విరుదాచలం నియోజకవర్గంలో ఆయన ప్రచారానికి రానున్నారన్నారు. అధికారుల బదిలీలపై కుట్ర ఆరోపణ ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు సహజమే అయినా, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత పలువురు ఉన్నతాధికారులను మార్చడం వెనుక అంతర్గత రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. వీటన్నింటికీ మే 4వ తేదీన వెలువడే ఫలితాలే సమాధానం చెబుతాయని అన్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడంపై స్పందిస్తూ, అది ఆయన ఇష్టమని, గతంలో కూడా చాలా మంది ఇలాగే పోటీ చేశారని, ఇందులో కొత్తేమీ లేదని అన్నారు. -
భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన భక్తే..!
గోవిందం ప్రవచనం కొరుక్కుపేట: భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదని స్వచ్ఛమైన భక్తి మాత్రమేనని హైదరాబాద్కు చెందిన ఆధ్యాత్మిక వేత్త పాణ్యం దత్తశర్మ వ్యాఖ్యానించారు. ఈ మేరకు దుర్గా స్రవంతి దుర్గాబాయ్ దేశముఖ్ మహిళా సభ (చైన్నె), తెలుగు తరుణి (చైన్నె) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె మైలాపూరులోని ఆంధ్ర మహిళా సభలో శనివారం రాత్ర సుదామ గోవిందం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వక్తగా పాల్గొన్న పాణ్యం దత్తశర్మ సుదీర్ఘంగా ప్రవచనం చేశారు. భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదని, స్వచ్ఛమైన భక్తి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తెలుగు తరుణి అధ్యక్షురాలు రమణి మాట్లాడుతూ తెలుగు తరుణి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా దత్తశర్మని మణిమాలరావు, తరుణి సభ్యురాలు శాలువాతో సన్మానం చేశారు. తెలుగు తరుణి కోశాధికారి మాజెటి అపర్ణ, తెలుగు తరుణి కి చెందిన అంజని, రాజేశ్వరి, వసంత, ప్రభావతి, దేవసేన, దుర్గా స్రవంతి నిర్వాహకులు ఆంధ్ర మహిళా సభ లైఫ్ మెంబర్లు జయశ్రీ, పద్మావతి, భానుమతి, ఆచార్యులు విస్తాలి శంకరరావు, బిట్రా గజగౌరి, గాయనిలు అరుణ, ఎస్పీ వసంతలక్ష్మీ, రచయిత్రి ఆముక్తమాల్యద పాల్గొన్నారు. -
జననాయకన్ చిత్ర నాయికల స్పందన
తమిళసినిమా : నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా, చివరి చిత్రం జన నాయకన్. పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్ పిక్చర్స్ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిందే అయితే సెన్సార్ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్లో లీక్ కావడం యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర కథానాయకుడు విజయ్ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. అయితే చిత్ర కథానాయకి పూజహెగ్డే, మమిత బైజు జననాయకన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్ అయిన ఘటన గురించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూజా హెగ్డే సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ శ్ఙ్రీ ప్రియమైన అభిమానులారా ఒక చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమ. ధైర్యంతో కూడిన ప్రయత్నాలు, వ్యక్తిగత త్యాగాలు. అదే విధంగా మీకు మంచి అనుభవాన్ని అందించాలన్న నమ్మకంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా షూటింగ్లో పాల్గొనే యూనిట్ సభ్యుల సమష్టి ప్రయత్న ఫలితం. అలాంటి మా జననాయక్ చిత్రం ఇంటర్నెట్లో రావడం నాకు మాత్రమే కాకుండా ఈ చిత్రంలో పనిచేసిన యూనిట్ సభ్యులు అందరికీ తీవ్ర మనోవేదనను కలిగించింది. ఈ చిత్రాన్ని మనందరం థియేటర్లో చూడటానికి కొంచెం వేచి చూద్దాం. జననాయకన్ చిత్రం కచ్చితంగా థియేటర్లో సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ఎప్పటికీ ప్రోత్సహించవద్దు ‘‘ అని పేర్కొన్నారు. నటి మమిత బైజు కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేశారు. ’’ పలువురి శ్రమ, కృషితో రూపొందిన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా చూడటం వేదనను కలిగిస్తోంది. కాబట్టి జననాయకన్ చిత్రాన్ని అధికారిక పూర్వంగా విడుదలయ్యే వరకు వేచి చూద్దాం శ్ఙ్రీ అని నటి మమిత బైజు పేర్కొన్నారు. కాగా మరో జననాయకన్ చిత్రం ఇంటర్నెట్లో లీక్ కావడానికి సెన్సార్ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారులు తీవ్రం విచారణను చేపట్టారు. మమితా బైజు -
ఇంటింటికీ బూత్ స్లిప్పుల పంపిణీకి శ్రీకారం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నది. ఓటర్ల కోసం ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతంచేసింది. ఇందులో భాగంగా బూత్ స్లిప్పుల పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభించారు. పదో తేదీ నుంచి బూత్ స్లిప్పులను బీఎల్ఓలకు తరలించారు. వీటిని ఉదయం నుంచి ఇంటింటా బీఎల్లోలు పంపిణి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో తమ తమ పరిధిలోని జనం ఇళ్లల్లోనే ఉండటంతో తొలి రోజు పెద్ద సంఖ్యలో బూత్ స్లిప్పుల పంపిణి జరిగింది. ఐదు రోజులలో ఈ ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో 5.73 కోట్ల మంది ఓటర్లకు ఈ స్లిప్పులు అందజేయనున్నారు. ఈ ఏడాది బూత్ స్లిప్పులను మరింత స్పష్టంగా రూపొందించారు. సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలను పెద్ద అక్షరాలతో ముద్రించారు. అలాగే, కొత్తగా క్యూ ఆర్ కోడ్ను సైతం పొందు పరిచారు. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఎన్నికల అధికారుల సమీక్ష తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఆరుగురు జిల్లా కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలపై అభ్యర్థుల గుర్తుల ముద్రణ ,పోలింగ్ సిబ్బందికి శిక్షణపై ఆమె దిశానిర్దేశం చేశారు.చైన్నెలో ఈ పనులను కార్పొరేషన్ కమిషనర్ కుమారగురుబరన్ పర్యవేక్షిస్తున్నారు. 17 నుంచి కమల్ ప్రచార బాట సాక్షి, చైన్నె : డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఈనెల 17 నుంచి నటుడు, మక్కల్నీది మయ్యంనేత కమలహాసన్ ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికలలో కమల్ పార్టీ పోటీ చేయడం లేదన్న విషయం తెలిసిందే. తమ మద్దతును డీఎంకేకు ప్రకటించారు. దీంతో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి కమల్ సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదిన చైన్నె హార్బర్, పెరంబూరు, కొలత్తూరు, విల్లివాక్కం నియోజకవర్గాలలో, 18వ తేదిన టీ నగర్, మైలాపూర్, వేళచ్చేరి,చేపాక్కం–ట్రిప్లికేన్లలో పర్యటించనున్నారు. 19వ తేదిన అవినాశి, కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గాలలో 20వ తేదిన తిరుచ్చి ఈస్ట్, శ్రీరంగం, లాల్గుడి నియోజకవర్గాల్లో రోడ్ షో, ప్రచార సభల రూపంలో కమల్ పర్యటన సాగనుంది. విజిలెన్స్ డైరెక్టర్గా దురై కుమార్ సాక్షి, చైన్నె: డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్, యాంటీ కరెప్షన్ విభాగం డైరెక్టర్గా ఏటీ దురై కుమార్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆది వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఉన్న డేవిడ్సన్ దేవాశీర్వా దంను ఎన్నికల కమిషన్ తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సందీప్మిట్టల్ను నియమించారు.అయితే, ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ సానుభూతి పరుడుగా ఆధారాలతో డీఎంకే ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించారు. తాజాగా ఈ పోస్టుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏటీ దురై కుమార్ను నియమించారు. నర్సింగ్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య పళ్లిపట్టు: నర్సింగ్ కళాశాల విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శోకాన్ని నింపింది. పళ్లిపట్టు సమీపం రామాపురం గ్రామానికి చెందిన ఆనందన్ కుమార్తె శిరీష(19) ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో డిప్లమ నర్సింగ్ కళాశాలలో తొలి సంవత్సరం చదువుకునేవారు. కళాశాలలో చదువుకోవడంకు ఇష్టం లేక మూడు నెలలుగా ఇంట్లో వుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులు శిరీషకు వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం శిరిష ఇంటరిగా ఉంటున్న సమయంలో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు మృతదేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ఆసుపత్రికి తరలించి పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విజయ్ జననాయగన్ లీక్ సీన్స్ కలకలం
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన భారీ చిత్రం 'జననాయగన్' పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి దాదాపు గంటకు పైగా కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమానే లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి. కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
ప్రాణం ఉన్నంత కాలం రాజీకి చోటు లేదు
సాక్షి, చైన్నె : తనలో ‘ప్రాణం ఉన్నంత వరకు అన్బుమణితో రాజీ ప్రసక్తే లేదని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ పీఎంకేలో పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాను బ్రతికి ఉన్నంత కాలం అన్బుమణితో రాజీ పడే ప్రసక్తే లేదని, చర్చలకు తావులేదని రామదాస్ తాజాగా ప్రకటించడం చర్చకు దారి తీసింది. కుమార్తెకు పార్టీ పగ్గాలు తన తర్వాత పార్టీని తన కుమార్తె శ్రీగాంధీ నడిపిస్తారని శనివారం రాందాస్ ప్రకటించారు. గతంలో తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రా రని చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు అందరూ రాజకీయాల్లోకి రావడం తాను చేసిన అతిపెద్ద తప్పిదమని, ఆ తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్బుమణిపై ఆరోపణలు డబ్బు ప్రభావంతో అన్బుమణి చాలా మందిని కొనుగోలు చేస్తున్నారని రాందాస్ ఆరోపించారు. తన వర్గం 37 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, అన్బుమణి వర్గం పోటీ చేస్తున్న స్థానాల్లో తాను 12 మంది అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. అయితే అన్బుమణి ఒత్తిడి వల్ల కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో తప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ చిహ్నమైన ‘మామిడి పండు’ గుర్తు తమదేనని, దాని కోసం న్యాయపోరాటం చేస్తామ ని రాందాస్ తెలిపారు. కష్టపడి నిర్మించుకున్న పార్టీ ఇలా విచ్ఛిన్నం కావడం తనను ఎంతగానో బాధించిందన్నారు. రాజకీయ పొత్తులు డీఎంకేతో జరిగిన పొత్తు ప్రయత్నాల గురించి మాట్లాడుతూ, మమ్మల్ని వదిలేసింది తన వాళ్లే ననిపేర్కొంటూ, డీఎంకే మనసులో తాము ఎవరూ లేమని వ్యాఖ్యానించారు. సీనియర్ నాయకుడైనప్పటికీ ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడం కష్టమని చెప్పారు. -
మహిళా కాంగ్రెస్కు షాక్
సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంగా శనివారం హసీనా సయ్యద్మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు. నాయకత్వంపై ధ్వజం ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మకై ్క అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని,అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
వేలూరు: పోలింగ్ కేంద్రాల్లో పార్టీలకు అతీతంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ శివరామన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 23న జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు సలహాలు, సూచలను ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల రోజున ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుందని అందులో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ బందోబస్తుపై ఇప్పటికే అధికారులతో సమీక్షించామన్నారు. ఇప్పటికే జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సీసీ కెమెరాలో నమోదు చేసే విధంగా వాటిని ఆన్లైన్ ద్వారా జిల్లా కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 1,427 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో 149 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. ఎన్నికల రోజున పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, చేయాల్సిన పనులపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పళని, అన్నాదురై, ఎన్నికల విభాగం సీఐ రజనీ, పోలీసులు పాల్గొన్నారు. -
రాజకీయ నేపథ్యంగా టీఎన్–26
తమిళసినిమా: సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రాలు తమిళంలో అరుదుగానే వచ్చాయని చెప్పాలి. నిజానికి ఈ తరహా రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో కూడిన కథా చిత్రాలను చేయడం సాహసమే అవుతుంది. అలాంటిది రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఈ తరహా చిత్రాలు విడుదల కావడం చర్చనీయాంశమే అవుతుంది. కరెక్ట్గా అలాంటి ఇతివృత్తంతో రూపొందిన తాజా చిత్రం టీఎన్–26. రంబిరామయ్య కథను అందించి, ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం ద్వారా ఆయన వారసుడు ఉమాపతి రామయ్య దర్శకుడిగా పరిచయమయ్యారు. నట్టి కథానాయకుడిగా నటించారు. కన్నన్ గ్రూప్ పతాకంపై కన్నన్ రవి నిర్మించిన ఈ చిత్రం టీజర్ విడుదల సమయంలోనే వివాదానికి దారి తీసింది. చిత్రంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ను కించపరచే విధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకుడు అధవ్ అర్జున ఆరోపణలు గుప్పించారు. దీంతో టీఎన్–26 చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఒక దశలో చిత్రం విడుదల అవుతుందా అనే చర్చ జరిగింది. ఎలాంటి సినీ నేపద్యం లేని ఒక యువకుడు నటుడిగా రంగప్రవేశం చేస్తాడు. అతను నటించిన ఒక చిత్రంలోని సంభాషణలు నటుడు ఎంజీఆర్ వీరాభిమాని అయిన వెయ్యి ఎకరాల ఆస్తిపరుడిని ఆకట్టుకుంటాయి. అతను ఎంజీఆర్ స్థాయిలో రాణిస్తారని నమ్మిన ఆ ధనవంతుడు ఆ నటుడిని ఆదరిస్తాడు. ఆయన అండతో అంచెలంచెలుగా ఎదిగిన ఆ నటుడు ఒక దశలో రాజకీయ రంగప్రవేశం చేస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర కథ. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం వివాదాస్పదాలను పక్కన పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం
వేలూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 23వ తేదీన జరగనున్న నేపథ్యంలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు తమ స్వచ్ఛంద నిర్ణయం ప్రకారం ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో వేలూరు జిల్లాలోని వేలూరు, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం, కేవీ కుప్పం వంటి ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి 85 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు 7,118 మంది, దివ్యాంగ ఓటర్లు 9,198 మంది ఉన్నారని గుర్తించారు. వీరు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఫారం 12డీని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వీరిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 2,224 మంది, దివ్యాంగులు 1,125 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈనెల 11,12,13వ తేదీల్లో ధరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి అధికారులు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ను సేకరించి సీల్ వేసిన బాక్సులో వేసేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో వేలూరు జిల్లా అధికారి సుబ్బలక్ష్మి ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ ఓట్లు సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి సెంథిల్కుమార్, సహాయ అధికారి పళణి పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన...?
సాక్షి, చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ ఉమనాథ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. బీజేపీకి చెందిన న్యాయవాది ఎ. మోహనన్దాస్ దాఖలు చేసిన పిటిషనన్లో ఉమానాథ్పై కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఉమనాథ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తన పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆయన నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇది ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తుందని ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. కోర్టు విచారణ ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సదరు అధికారికి, ఎన్నికల విధులకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న న్యాయమూర్తులు, ఈ ఆరోపణలపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ను ఏప్రిల్ 17 లోగా దాఖలు చేయాలని ఎన్నికల కమిషనన్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
సీఎస్ మార్పుపై డీఎంకే సీరియస్
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం బదిలీని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. తమిళనాడు చరిత్రలో ప్రపథమంగా జరిగిన ఈ పరిణామంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు డీఎంకే కోశాధికారి, ఎంపీ టీఆర్ బాలు శనివారం లేఖ రాశారు. అదే సమయంలో హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ను బదిలీ చేస్తూ, మణివాసన్ను ఆ స్థానంలో ఎన్నికల కమిషన్ నియమించడం చర్చకు దారి తీసింది. వివరాలు.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక జిల్లాల ఎస్పీలు, ఐఏఎస్లు, నగర కమిషనర్లను ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డీజీపీ వెంకట్రామన్ను తప్పించి ఆయన స్థానంలో సందీప్మిట్టల్ను, సీఎస్ మురుగానందంను తప్పించి సాయికుమార్ను నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్, ఏసీబీ డైరెక్టర్లు వంటి అధికారులను సైతం బదిలీ చేశారు. చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ను బదిలీ చేసి ఆయన స్థానంలో అభిన్ దినేష్ మోథక్ నియమితులయ్యారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి దీరజ్కుమార్ను సైతం శనివారం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కొత్త హోంశాఖ కార్యదర్శిగా మణివాసన్ నియమితులయ్యారు. ఈ బదిలీల పర్వం మరింత వేగవం పుంజుకోనున్నట్టు, కీలక అధికారులందర్నీ తప్పించే దిశగా ఎన్నికల కమిషన్ చర్యలు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో సీఎస్ బదిలీని తీవ్రంగా పరిగణించిన డీఎంకే కోశాధికారి ఎన్నికలకమిషన్కు లేఖ రాశారు. సీఎస్ బదిలీ అన్యాయం తమిళనాడు సీఎస్గా ఉన్న ఎన్. మురుగానందాన్ని తొలగించి, ఆయన స్థానంలో సాయి కుమార్ను నియమించడం ఏకపక్ష నిర్ణయమని ఆ లేఖలో టీఆర్ బాలు విమర్శించారు. మురుగానందంపై ఏ రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయలేదని, ఆయనను మార్చడానికి సరైన కారణాలు లేవని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పారదర్శకత కోసం ఆయననే తిరిగి సీఎస్గా నియమించాలని డిమాండ్ చేశారు. సందీప్ మిట్టల్ వెనక్కి.. ఈ లేఖ నేపథ్యంలో సందీప్ మిట్టల్ను మళ్లీ వెనక్క పంపించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్గా ఉన్న డేవిడ్సన్ దేవాశీర్వాదం ఆ పదవిలోనే కొనసాగే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ పదవిలో నియమించ బడ్డ సందీప్ మిట్టల్ను గతంలో ఉన్న సాయుధ బలగాల విభాగానికే పంపించేశారు. సందీప్ మిట్టల్ నియామకంపై అభ్యంతరం సీఈసీకి టీఆర్బాలు లేఖ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్గా డాక్టర్ సందీప్ మిట్టల్ను నియమించడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. సందీప్ మిట్టల్ బహిరంగంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి మద్దతు తెలుపుతున్నా అధికారి అని, ఆయన సోషల్ మీడియా పోస్టులే ఇందుకు నిదర్శనమని లేఖలో వివరించారు. సందీప్ మిట్టల్ గతంలో ముస్లింలు, వామపక్ష భావజాలంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని బాలు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయన నియామకం ఎన్డీఏ కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్, బీజేపీకి ఏజెంట్లా పనిచేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ బదిలీలు, నియామకాలను రద్దు చేసి పాత స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
క్లుప్తంగా
కిడ్స్ కోసం సమ్మర్ స్లామ్ సాక్షి, చైన్నె: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభమైన వేళ, చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా రెండు సరికొత్త స్టోర్ ఫ్రంట్లను ప్రారంభించింది. కిడ్స్ సమ్మర్ స్లామ్, సమ్మర్ టాయ్స్ లిస్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ విభాగాల్లో ఆట వస్తువులు, అవుట్డోర్ గేర్, ఇతర సమ్మర్ ఎసెన్షియల్స్పై భారీ ఆఫర్లను ప్రకటించారు. ఆన్లైన్ వేదికగా పూర్తి స్థాయిలో పిల్లల ఆట వస్తువులను కొలువు దీర్చుతూ, ఈనెల 13 నుంచి 15 తేదీల వరకు భారీ తగ్గింపుతో పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా వేలూరు: అనకట్టు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, అనకట్టు అసెంబ్లీ డీఎంకే అభ్యర్థి నందకుమార్ అన్నారు. నియోజక వర్గం పరిధిలోని వేలూరు యూనియన్ పరిధిలోని తెల్లూరు, పులిమేడు, పుదూరు, ఊసూరు, అత్తివూరు గ్రామ పంచాయతీలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఊసూరు గ్రామ పంచాయతీలో ఆ పార్టీ కార్యకర్తలు క్రేన్తో పూలమాలను ఏర్పాటు చేసిన ఆయనకు మంగళ హారతులు పట్టి మాలను వేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అనకట్టు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించానని మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు తనను ఆదరించాలని కోరారు. యూనియన్ కార్యదర్శి జ్ఞానశేఖరన్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైలు ఢీకొని ఉద్యోగి మృతి అన్నానగర్: తిరువొత్తియూర్ సమీపంలో తండ్రి లాగే కుమారుడు కూడా రైలు ఢీకొని మరణించిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. తిరువొత్తియూర్ సమీపంలో కాలడిపేటలోని తిలక్ నగర్కు చెందిన కిషోర్కుమార్ (23), తిరువళ్లూరులో రైల్వేలో ఎలక్ట్రీషియన్. శుక్రవారం సాయంత్రం విధులకు వెళ్తుండగా, అతను తిరువొత్తియూర్ వీఓసీ రైల్వేస్టేషన్ మధ్య ఉన్న రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో చైన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న చర్లపల్లి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో కిషోర్కుమార్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కిషోర్కుమార్ తండ్రి వేణుగోపాల్ కూడా రైల్వే ఉద్యోగి. ఆయన కూడా రైలు ఢీకొని మృతిచెందాడు. తండ్రి మృతిచెందడంతో కిషోర్కుమార్కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. తండ్రిలాగే కుమారుడు కూడా రైలు ప్రమాదంలో మరణించడం అతని కుటుంబాన్ని, ఆ ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. జాలరి హత్య తిరువొత్తియూరు: చైన్నె, కొత్తచాకలిపేటలో జాలరి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి పోలీసులు విచారణ జరుపుతున్నారు. తండయార్పేట వీఓసీ నగర్, 11వ కనెక్టింగ్ రోడ్డుకు చెందిన నరేష్కుమార్ (28) జాలరి. ఇతను శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తన ఇంటి తలుపును బలంగా కొట్టాడు. తలుపు తెరిచిన అతని తండ్రి వెంకటేశన్, నరేష్కుమార్ మెడ, నడుము, ఛాతి భాగాల్లో కత్తిగాయాలతో రక్తపు గాయాలతో ఉండడంచూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే అతన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు, నరేష్కుమార్ అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలిసి కొత్తచాకలిపేట పోలీసులు నరేష్కుమార్ స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. లంచం కేసులో వీఏఓ అరెస్ట్ అన్నానగర్: లంచం తీసుకున్న కేసులో ఓ వీఏఓ అరెస్టయ్యాడు. విల్లుపురం జిల్లాలోని సెంజి సమీపంలో ఉన్న నడునెల్లిమలై గ్రామానికి చెందిన రైతు రంగనాథన్. తన అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి పట్టా బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం పడిపల్లం గ్రామ పరిపాలనాధికారి సింగారవడివేల్ రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని రంగనాథన్, ఈ విషయమై ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు శనివారం రసాయనాలు పూసిన నగదును రంగనాథన్ ఇస్తుండగా ఏసీబీ పోలీసులు సింగారవడివేల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. రెట్టింపు లాభం పేరుతో మోసం దంపతుల అరెస్ట్ అన్నానగర్: రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మించి క్లయింట్ను రూ.25 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని విల్లివాక్కం దాడంగుప్పం ప్రాంతానికి చెందిన శివకుమార్ (49). ఇతను మద్రాస్ హైకోర్టులో న్యాయవాది. ఇతని స్నేహితుడు వెంకటాచలం టి. నగర్ ప్రాంతానికి చెందిన కోనేశ్వరన్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుంది‘ అని చెప్పాడు. ఇది నమ్మి శివకుమార్ 2022లో రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఎలాంటి లాభం రాకపోవడంతో, డబ్బును తిరిగి ఇవ్వాలని శివకుమార్ అడిగాడు. కానీ, కోనేశ్వరన్ డబ్బు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలిసింది. శివకుమార్ ఫిర్యాదు ఆధారంగా, రాజమంగళం క్రైమ్ పోలీసులు కోనేశ్వరన్, భార్య శుభాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
కాహోకాన్ ఆరోగ్య సదస్సు ప్రారంభం
సాక్షి, చైన్నె : నందంబాక్కం వర్తక కేంద్రం వేదికగా కాహోకాన్ అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ సదస్సు శనివారం ప్రారంభమైంది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల ఈ సదస్సులో వైద్య సేవలకు గుర్తింపుగా కాహో అవార్డులను ప్రదానం చేయనున్నారు. కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటుగా ఈ సదస్సు జరగనుంది. వైద్య రంగంలో మార్పులు రావాలి ఈసదస్సులో ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వైద్యం కోసం ప్రజలు తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావడం ఆందోళనకరమన్నారు, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చనని సూచించారు. వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, నివారణా వైద్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి , అంతర్జాతీయ ఆరోగ్య నాణ్యత నిపుణుడు డాక్టర్ ఎజెకియల్ గార్సియా ఎలోరియోలు సదస్సులో ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకు 200 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు సుమారు 2,500 మంది ఆరోగ్య రంగ నిపుణులు హాజరయ్యారు. 150కి పైగా స్టాళ్లతో కూడిన ఎగ్జిబిషన్లో నూతన వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ను ప్రదర్శించారు. వైద్య రంగంలో మేనేజ్మెంట్ విధానాలను ప్రోత్సహించడానికి ఐఐఎం జమ్మూతో కాహో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఫార్మసీ, రిహాబిలిటేషన్, పేషెంట్–ఫ్రెండ్లీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో కొత్త ప్రమాణాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కాహో అధ్యక్షుడు డాక్టర్ విజయ్ అగర్వాల్, సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లు జోసెఫ్, ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ నల్ల జి పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు. కాగా, నాణ్యమైన వైద్య సేవలు అందించిన సంస్థలకు ఈ వేదికపై ’కాహో అవార్డులు’ ప్రదానం చేయనున్నారు. -
కారైకుడిలో సీమాన్కు పట్టం కట్టేనా!
కారైకుడి పేరు వింటే అందరికీ గుర్తుకు వచ్చేది చెట్టినాడు వంటకాల స్పెషల్స్. రుచికరమైన వంటకాలు, మసాలాల ఘాటుకు పేరుగడించిన కారైకుడిలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. సొంత గడ్డలో ప్రపథమంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ ఎన్నికల రేసులో నిలబడ్డారు. తన వాళ్లు ఆదరిస్తారన్న నమ్మకంతో ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. మళ్లీ గెలుపు తనదే అన్న ధీమాతో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థి మాంగుడి పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అభ్యర్థిగా వీ పాండి, తమిళగ వెట్రికళగం (టీవీకే) తరపున ప్రభు రేసులో ఉన్నారు. సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో తాజాగా అందరి దృష్టి కారైకుడి వైపుగా ఉంది. స్టార్ నియోజకవర్గం జాబితాలోకి ఈ కారైకుడి చేరింది. శివగంగ జిల్లాలోని కారైకుడి వర్తకం, వ్యవసాయానికి కీలకం ఉంటున్నది. తమిళ తల్లికి ఇక్కడే ఆలయం కూడా ఉంది. అంతే కాదు పురాతన కొప్పుడయ నాయకీ అమ్మన్ ఆలయం కూడా ఇక్కడే ఉంది. పర్యాటకంగా, షూటింగ్లకు నెలవుగా ఇక్కడే చెట్టి నాడు ప్యాలెస్ కూడా ఉండటం విశేషం. ఇక ఈ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం గడ్డ. ఇక్కడ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు అందరి దృష్టి అన్న కారైకుడి వైపుగా మరలేందుకు కారణం సీమాన్. సినీ నటుడిగా, దర్శకుడిగా తమిళ నినాదంతో నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) వేదికగా రెండుదశాబ్దాలుగా ఒంటరి రాజకీయ ప్రయాణాన్ని సీమాన్ కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేస్తూ క్రమంగా తన సత్తాను చాటుకుంటున్నారు. ప్రతి ఎన్నికలలో మహిళలకు యాభై శాతం సీట్లుతో పాటూ ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తూ వస్తున్న సీమాన్ 2024 ఎన్నికలతో తమిళనాట ఓ శక్తిగా అవతరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం దక్కించుకునే రీతిలో 8 శాతానికి పైగా ఓట్లు సాధించారు. పట్టం కట్టేనా.. రెండు దశాబాద్దాల పాటూ రాజకీయ ప్రయాణంలో ఎన్నో వివాదాలు, ఒడి దొడుగులు, కేసులు, అరెస్టులు, జైలు జీవితం అంటూ ముందుకు సాగిన సీమాన్ తాజా ఎన్నికలలో ప్రపథమంగా స్వయంగా పోటీకి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన అభ్యర్థుల కోసం ఇన్నాళ్లు ప్రయాణం చేసిన సీమాన్ తాజాగా అసెంబ్లీలో అడుగు పెట్టడం లక్ష్యంగా కారైకుడిని ఎంపిక చేసుకున్నారు. తన సొంత జిల్లా అయిన శివగంగలోని కారైకుడి నుంచి పోటీ చేసే అవకాశాలు కలిసి వస్తాయన్న ధీమాతో సీమాన్ పోటీలో ఉన్నారు. గత ఏడాది కాలంగా ఆయన కారైకుడిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు దక్కిన నేపథ్యంలో పార్టీ గుర్తును క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సఫలీకృతుడయ్యారు. అయితే కూటమి బలం అన్నది కరువై ఒంటరిగా సీమాన్ ఎదురీతతో విజయ ఢంకా మోగించేనా అన్న ఎదురు చూపులు తాజాగా పెరిగాయి. పార్టీకి చెందిన కార్యకర్తలు, మహిళలు నిరంతరం ఓట్ల వేటలో సీమాన్కు మద్దతుగా ఉరకలు తీస్తుండడం విశేషం. వాస్తవానికి కారైకుడి కాంగ్రెస్ కంచుకోట. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికలలో డీఎంకే మూడుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు గెలిచాయి. డీఎంకే కూటమి బలం, చిదంబరం చరిస్మాను సీమాన్ తట్టుకునే అసెంబ్లీలో అడుగు పెట్టేనా అన్నది వేచి చూడాల్సిందే. ఓట్ల వ్యూహంలో ఏఎంఎంకే అన్నాడీఎంకే కూటమిలో ఈ సీటును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు అప్పగించారు. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు తనకు లభించిన ఓట్లకు తాజాగా కూటమి బలం తోడవుతుండటంతో గెలుపు తనదే అన్న ధీమాతో అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు అభ్యర్థిగా తేర్పొగి వీ పాండి ఉన్నారు. గత ఎన్నికలలో విడి విడిగా పోటీ చేసిన నేపథ్యంలో తాజాగా కూటమిలో ఉన్న పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కంటే ఎ క్కవేనని పాండి ధీమాతో ఉన్నారు. ఇక, గతంలో ఇక్కడ అన్నాడీఎంకే మూడు సార్లు గెలిచి ఉండటం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. టీవీకేలో డాక్టర్ ప్రభు కరైక్కుడిలో స్థానికుడైన డాక్టర్ ప్రభు విజయ్ టీవీకే తరపున పోటీ చేస్తున్నారు. స్థానికంగా వైద్యుడిగా ప్రభుకు మంచి పేరు, గుర్తింపు ఉండటంతో పాటుగా విజయ్ సినీ ఫాలోయింగ్, అభిమాన లోకం తన వెన్నంటే ఉంటుందన్న ధీమాతో ఈ అభ్యర్థి ఉన్నారు. విజయ్ ప్రచార పర్యటనకు ఇక్కడ అనూహ్య స్పందన రావడంతో ఓట్ల వేటలో మరింత వేగంగా ప్రభు ఉరకలు తీస్తున్నారు. అదృష్టం ఎవరిని వరించేనో.. 3.03,371 మంది ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో చెట్టియార్, వెల్లాలర్, మొదలియార్ సామాజిక వర్గం ఓట్లు మరీ ఎక్కువే. రైతులు,రైతు కూలీ లు సైతం అధికంగానే ఉన్నారు.ఒంటరిగా తమిళ నినాదంతో ఒక్క ఛాన్స్ కోసం సీమాన్, అభివృద్ధి మంత్రం , కూటమి బలంతో మాంగుడి , ఓట్ల లెక్కలతో పాండిలు ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. అదే సమయంలో స్థానిక నినాదంతో టీవీకే తరపున ప్రభు దూసుకెళ్తున్నారు. ఈ చతుర్ముఖ సమరం కారైకుడిలో హోరాహోరీగా మారి ఉంది. నాలుగు ప్రధా న శక్తులు తలపడుతుండడంతో ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం ఉంది. దీంతో కారైకుడి అసెంబ్లీ పీ ఠాన్ని అధిరోహించేది ఎవరో ఉత్కంఠగా మారింది. రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా సీమాన్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాంగుడికి ఢీ కొడుతున్నారు.మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఎంపీ కార్తీ చిదంబరం అండదండలు పుష్కలంగా మాంగుడికి ఉన్నాయి. గత ఐదేళ్లలో లా కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, టైడల్ పార్క్ వంటి అభివృద్ధి పనులు ఇక్కడ జరగడంతో అన్నీ తనకు సానుకూలం అన్న ధీమాతో మాంగుడి ఉన్నారు. అదే సమయంలో సిట్టింగ్ను పక్కన పెట్టాలని ,కాంగ్రెస్ వాదులు నినాదించినా, అధిష్టానం మాంగుడి వైపే మొగ్గు చూపింది. ఈ అంతృప్తి కాస్త మాంగుడికి గెలుపును దరిచేర్చేనా అన్నది వేచి చూడాల్సిందే. -
క్లుప్తంగా
డిమాండ్లు నెరవేర్చకుంటే ఎన్నికలు బరిష్కరిస్తాం కొరుక్కుపేట: చెంగల్పట్టు జిల్లాలోని కల్పాక్కం సమీపంలో పుదుపట్టినం చేపల వేట ప్రాంతం, వయలూర్ ఉయలికుప్పం చేపల వేట ప్రాంతం, ఒక దాని కొకటి ఆనుకుని ఉన్నాయి. ఏ జాలర్లు ఏ చేపల వేట ప్రాంతానికి చెందిన వారు అనే సమస్య తలెత్తుతోంది. రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఫిబ్రవరి 15న మయానా ఉత్సవాన్ని నిలిపి వేశారు. ఈ ఘటనలో ఇరువైపులా వున్న మత్స్యకారులను అరెస్టు చేయగా, మరిన్ని అరెస్టు భయంతో వారు గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో అరెస్టు అయిన మత్స్యకారులను ఇప్పుడు బెయిల్పై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తమ పరిధి ఎంత వరకు విస్తరించి ఉందో లెక్కించి ఒక నేమ్ప్లేట్ను ఏర్పాటు చేయాలని మత్స్యకారులు అధికారులను కోరారు. ఈ విషయాన్ని నొక్కి చెపుతూ ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలని శనివారం ఉదయం పుదుపట్టినం మత్స్యకారులు శనివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లలేదు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని మత్స్యకారులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పెళ్లి పేరిట అత్యాచారం కేసులో.. అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని పెరియశేవల్కు చెందిన లాయర్ శివ రాజ్ (33) ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలుందూరుపేట మహిళా పోలీసులు శివరాజ్ను అరెస్టు చేశారు. ఈ కేసును శుక్రవారం విచారించిన విల్లుపురం మహిళా కోర్టు న్యాయమూర్తి వినోద, శివరాజ్కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటూ రూ. 25,000 జరిమానా విధించారు. బాధితురాలికు రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం శివరాజ్ను కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సహకార బ్యాంకులో రూ. 71 లక్షలు గోల్మాల్ కొరుక్కుపేట: కల్లకురిచ్చి జిల్లా, చిన్నసాలెంలో పనిచేస్తున్న విల్లుపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆడిట్ నిర్వహించారు. 37 డిపాజిట్ రసీదుల ద్వారా బ్యాంకు నుండి రూ. 71,19,654 బదిలీ అయినట్లు గుర్తి్ంచారు. తప్పిదాలకు పాల్పడిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శరవణన్తో సహా నలుగురిపై మోసంతో సహా 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. శరవణన్ను శనివారం అరెస్టు చేశారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయించిన 10 మందికి జరిమానా తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలు గురువారం ముగిశాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల మే 4న జరుగుతుంది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల శాఖ వివిధ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత 7వ తేదీ నుండి గురువారం వరకు 3 రోజులు పుదుచ్చేరి రాష్ట్రంలోని అన్ని మద్యం, సారా దుకాణాలు మూసివేయబడ్డాయి. దీని ప్రకారం పుదుచ్చేరిలోని 443 మద్యం దుకాణాలు, 83 మద్యం సారా దుకాణాలు, 37 గోదాములు మూసివేయబడ్డాయి. అదేవిధంగా కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు, సారా దుకాణాలు కూడా మూసివేశారు. అదే సమయంలో పుదుచ్చేరిలో గత 3 రోజుల్లో కల్తీ మద్యం విక్రయించిన 10 మందికి ఎకై ్సజ్ శాఖ పోలీసులు రూ.45 వేల జరిమానా విధించారు. వారి నుంచి 114 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల తర్వాత శుక్రవారం పుదుచ్చేరిలో మళ్లీ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అక్కడ మద్యం ప్రియులు పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించింది. ఆకట్టుకుంటున్న వైల్డ్ మిలాన్ ప్రదర్శన సాక్షి, చైన్నె: చైన్నె రాయపేటలోని ది ఫాలీ అమెథిస్ట్లో ‘సమ్మర్ సోయిరీ ఎడిట్’ పేరుతో ఏర్పాటు అయిన వైల్డ్ మిలాన్ ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంటుంది.మహిళా పారిశ్రామికవేత్తలు, స్వదేశీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి సిరి చందనా రెడ్డి స్థాపించి, నిర్వహిస్తున్న వైల్డ్ మిలన్ ఎగ్జిబిషనన్స్ గత నాలుగు సంవత్సరాలుగా అందరి మన్ననలు అందుకుంటుంది చిన్న , వర్ధమాన వ్యాపారాలకు, ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సంస్థలకు గుర్తింపు , వృద్ధి అవకాశాలను అందించాలనే దార్శనికతతో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చైన్నె రాయపేటలోని ది ఫాలీ అమెథిస్ట్లో ‘‘సమ్మర్ సోయిరీ ఎడిట్’’ పేరుతో ఏర్పాటు చేసిన వైల్డ్ మిలాన్ ప్రదర్శనను ప్రముఖ కళాకారులు అశ్విని విశ్వనాథన్, ప్రముఖులు సిరి చందనా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. -
చైన్నె ఎన్నికల బరిలో 419 మంది అభ్యర్థులు
సాక్షి, చైన్నె : చైన్నె జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఈసారి భారీ సంఖ్యలో 419 మంది అభ్యర్థులు పోటీపడుతుండటంతో, ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ భారీగా అదనపు ఈవీఎంలనుచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీగా పెరిగిన ఈవీఎంల సంఖ్య చైన్నె జిల్లాలో ఇప్పటికే 4,889 ఓటింగ్ యంత్రాలు ఉండగా, అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మరో 5,554 అదనపు యంత్రాలను కేటాయించారు. దీంతో మొత్తం ఈవీఎంల సంఖ్య 10,443కు చేరుకుంది. వీటిలో 20 శాతం యంత్రాలను అత్యవసర పరిస్థితి కోసం రిజర్వ్లో ఉంచారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు: ఆర్కే నగర్, పెరంబూర్, కొలత్తూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మరో 12 నియోజకవర్గాల్లో రెండేసి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సైదాపేటలో మాత్రం 15 మంది అభ్యర్థులు మాత్రమే ఉండటంతో ఒకే యంత్రాన్ని వాడనున్నారు. అభ్యర్థుల ఫొటోలతో బ్యాలెట్ పేపర్ ఈసారి ఓటర్లు ఎవరికి ఓటు వేస్తున్నారో సులభంగా గుర్తించేందుకు బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు వారి రంగు ఫొటోను కూడా ముద్రించనున్నారు. ఈ ఫోటోలను గుర్తులతో సరిపోల్చే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లా రిటర్నింగ్ అధికారి కుమార గురుబరన్ పర్యవేక్షణలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఎంపిక ప్రక్రియ శనివారంతో పూర్తయింది. వీటిని ప్రస్తుతం నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు.అత్యధికంగా పెరంబూర్ నియోజకవర్గంలో 1071 ఈవీ ఎంలు, కొలత్తూరు: 1029, ఆర్కే నగర్– 886, వేళచ్చేరి– 754, విరుగంబాక్కం– 746 ఉయోగిస్తున్నారు.ఇదిలా ఉండగా, చైన్నె సముద్ర తీరాలలో సైతం భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. ఈ క్రమంలోనే దేవదేవేరులకు కనులపండువగా కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు. -
అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ
తిరువళ్లూరు: అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఐదేళ్లలో డీఎంకే చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం ఎడపాడి పళణిస్వామి అన్నారు. పట్టణంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. సభకు తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి రమణ, తిరుత్తణి హరి, గుమ్మిడిపూండి సుధాకర్, పొన్నేరి శిరునియం బలరామన్, మధురవాయల్ బెంజిమిన్, తిరువొత్తియూర్ కుప్పన్తో పాటు కూటమి అభ్యర్థులైన అంబత్తూరు కేఎన్ శేఖర్(పీఎంకే), ఆవడి అశ్విన్కుమార్ (బీజేపీ), పూందమల్లి టీఏ ఏలుమలై(ఏఎంఎంకే) మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎడపాడి మాట్లాడుతూ ఐదేళ్లలో డీఎంకే నేతలు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, మైన్స్, జలవనరులశాఖలో విచ్చలవిడిగా అవినీతి చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీంతో పాటు నిరాదరణకు గురైన అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్ దుకాణాలు, తాళికి బంగారం, ఉచిత ల్యాప్టాప్లు సహా వేర్వేరు పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న విజయ్ రాజకీయంపై విమర్శలు సంధించారు. కరూర్ సంఘటన తరువాత విజయ్ బయపడి 72 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారని గుర్తు చేసిన ఆయన, నటుడు విజయ్ను ఎంజీఆర్తో పోల్చడం సరికాదన్నారు. -
భారీగా కీచైన్లు, కూపన్లు స్వాధీనం
తిరువళ్లూరు: డీఎంకే తరఫున ఓటర్లకు పంచడానికి కంటైనర్ లారీలో తరలిస్తున్న కూపన్లు, కీచైన్, క్యాలెండర్లు, ముఖ్యమంత్రి ఫొటోతో కూడిన గిఫ్ట్బాక్సులను స్పెషల్టీమ్ స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టడాన్ని నిరోధించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పట్రపెరంబదూరు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆసమయంలో చైన్నెలో కంటైనర్లో తరలిస్తున్న గిఫ్ట్బాక్సులు, కూపన్లు, కీచైన్లు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని తాలుకా కార్యాలయానికి తరలించారు. కాగా బాక్సులోని వస్తువులను తెరిచి చూపించాలని అన్నాడీఎంకే నేతలు కోరడంతో డీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొనడంతో తాలుకా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లోనూ డీఎంకే కూటమి విజయ కేతనం ఎగుర వేయడం ఖాయం అని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. క్లీన్ స్వీప్ చేయబోతున్నామని, ఇందుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణే సాక్షి వ్యాఖ్యానించారు.
భారీ విజయం తథ్యం ప్రజల్ని పలకరిస్తూ ముందుకెళ్తున్న స్టాలిన్ సాక్షి, చైన్నె : సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన నగరాలలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని పలకరించడం జరుగుతున్నది. ఈ పరిస్థితులో శనివారం పుదుక్కోట్టైలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం స్టాలిన్ ఇలుప్పూర్ ప్రాంతంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. మార్గమధ్యలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించి ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు. కొందరు తమ విజ్ఞప్తులను వినతి పత్రాల రూపంలో స్టాలిన్కు అందజేశారు. సాధారణంగా వాకింగ్ సమయంలో ప్రజలతో మమేకమయ్యే విధంగా ముందుకు సాగా స్టాలిన్ తాజాగా విలేకరులతో మాట్లాడటం, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 200 కాదు.. 234 స్థానాలు మావే ఎన్నికల్లో డీఎంకే కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సీఎం ఎం.కె. స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇది వరకు 200 స్థానాల్లో గెలుస్తామని తాను చెబుతూ వచ్చానని, అయితే ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తమ కూటమి విజయకేతనం ఎగురవేస్తుందన్న నమ్మకం కలిగిందని వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని అందరు అభ్యర్థుల గెలుపు అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రత్యర్థులు ఎంతమంది ఏకమైనా తమ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. వారిలో ఓటమి భయం పెరిగింది అన్నాడీఎంకే నేతలు వారి పార్టీని ఢిల్లీకి తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే అధికారులు, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ద్రవిడ పార్టీ అయిన అన్నాడీఎంకే ఢిల్లీకి బానిసగా మారడం బాధా కల్గిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల వేళ సీఎస్ సహా అధికారులను మార్చడం వంటి చర్యల గురించి తాము ఆందోళన చెందడం లేదని, తమ వైపు ప్రజలు ఉన్నారని చెప్పారు. సినీ నటుల రాజకీయ ప్రవేశం గురించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. కొందరు నటుల వెనుక వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న యువత త్వరలోనే వాస్తవాలను గ్రహించి మారుతారని ఆశిస్తున్నట్టు పరోక్షంగా విజయ్ ప్రచారంలో జరుగుతున్న ఘటనలపై వ్యాఖ్యలు చేశారు. ఇక, సాయంత్రం పుదుక్కోట్టైలో భారీ బహిరంగ సభలో డీఎంకే అభ్యర్థులు ఎస్.రఘుపతి, మెయ్యనాథన్, ముత్తురాజా, చెల్లపాండియన్, మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్ ప్రచారం నిర్వహించనున్నారు. ఓటర్లను ఆకర్షించే ప్రసంగంతో అన్నాడీఎంకే, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఉత్తర అమెరికాలో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత కచ్చేరిలు
తమిళసినిమా: 15 వందలకు పైగా చిత్రాలు, 9 వేలకు పైగా పాటలకు సంగీతాన్ని సమకూర్చిన సంగీతజ్ఞాని ఇళయరాజా. ఈయన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. ఇళయరాజానే పలు మార్లు విదేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. కాగా ఈయన 50 ఏళ్ల సంగీత పయనాన్ని వేడుకగా జరుపుకునే విధంగా సరిగమ లైవ్,మెర్కూరి సంస్థలు ఉత్తర అమెరికాలో సంగీత కచ్చేరిలను నిర్వహించనున్నారు. ఆగస్ట్ నెలలో అమెరికా, కెనడా మొదలగు 10 ప్రధాన నగరాల్లో సంగీత కచ్చేరీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా లాస్ఏంజల్స్లోని డాల్ఫి థియేటర్లలోనూ, బే ఏరియాలో ఉన్న ఒక్లాండ్ ఏరియాలోని ముఖ్య వేదికలపై ఇళయరాజా ఐకాన్ సంగీతం మారుమోగనుందని పేర్కొన్నారు. ఈ కచ్చేరీలు పూర్తి ఆర్కెస్ట్రాతో రూపొందించినట్లు తెలిపారు.ఇళయరాజా -
థియేటర్ కూట్టం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్
తమిళసినిమా: నటి సాక్షీ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం థియేటర్ కూట్టం. రూల్ బ్రేకర్స్ ప్రొడక్షన్, దియా సినీ క్రియేషన్స్ అధినేతలు జగన్ నారాయణన్, శక్తివేల్, వీరమణి, కన్నన్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. డేనియల్ అణిపోప్, వైయాపురి, శ్యామ్స్, వసంతి, జస్పర్, సత్య, సంయుక్త తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శక్తివేల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇసైపేట్టై సంగీతాన్ని, ప్రశాంత్ ఎఫ్టీ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ప్రముఖ సంగీతదర్శకుడు దేవా ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ క్రైమ్, థ్రిల్లర్ జానర్లో సాగే ఈ చిత్ర కథ ఒక్క రోజులో జరిగేదిగా ఉంటుదన్నారు. ఒక ఇంటిలో జరిగిన హత్యలో చిక్కుకున్న ముగ్గురు యువకులు ఎదుర్కొనే సమస్యలు, అందులోంచి వారు ఎలా బయట పడ్డారు ? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే క్రైమ్,థ్రిల్లర్ కథా చిత్రంగా థియేటర్ కూట్టం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను వరుసగా వెల్లడిస్తామని చెప్పారు. -
డమ్మీ ఈవీఎంల కలకలం
– సీజ్ చేసిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ చైన్నెలో భారీగా డమ్మీ ఓటింగ్ యంత్రాలు పట్టుబడటం కలకలం సృష్టించింది. తనిఖీల్లో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. అన్నానగర్ నియోజకవర్గ పరిధిలోని అరుంబాక్కం 100 అడుగుల రోడ్డులో అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక లోడింగ్ ఆటో పట్టుబడింది. ఆ వాహనాన్ని సోదా చేయగా అందులో 100 డమ్మీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లభ్యమయ్యాయి. వీటితో పాటూ ఒరత్తనాడు డీఎంకే అభ్యర్థి ౖవైద్యలింగం ఫొటోతో కూడిన విజిటింగ్ కార్డులు ఉన్న 5 పార్శిళ్లను కూడా అధికారులు గుర్తించారు. ఈ పార్శిళ్లను సేలంకు చెందిన సెల్వం అనే వ్యక్తి తరలిస్తుండగా, ఆటోను అన్నానగర్కు చెందిన గణేశన్ నడుపుతున్నట్లు విచారణలో తెలిసింది. ఈ డమ్మీ ఈవీఎంలను ఒక ప్రైవేట్ బస్సు ద్వారా ఒరత్తనాడు నియోజకవర్గానికి పంపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు ఓటు ఎలా వేయాలో వివరించడానికి, అభ్యర్థి గుర్తును ప్రదర్శించడానికి ఈ యంత్రాలను ఉపయోగించాలని భావించినట్లు తేలింది. ఈ డమ్మీ ఈవీఎంలు , ప్రచార సామాగ్రిని అన్నానగర్ ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారం ఒరత్తనాడు నియోజకవర్గానికి సంబంధించింది కావడంతో, తదుపరి చర్యల నిమిత్తం అక్కడి ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద ఈ కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ విచారణకు సిద్ధమా..? – బీజేపీ సవాల్ సాక్షి, చైన్నె: నటుడు విజయ్ నటించిన జననాయకన్ సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలను తమిళనాడు బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు కోరే ధైర్యం విజయ్కు ఉందా అని బీజేపీ సవాల్ విసిరింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏ.ఎన్.ఎస్. ప్రసాద్ లు ప్రకటన విడుదల చేశారు. విజయ్ రాజకీయ నాటకం జననాయకన్ సినిమా లీక్ అవ్వడం వల్ల నిర్మాత కు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ, ప్రజల సానుభూతి ఓట్లను పొందేందుకు విజయ్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ లీక్కు కేంద్ర మంత్రి ఎల్. మురుగన్కు సంబంధం ఉంద ని టీవీకే నేత ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని మండిపడ్డారు.ఒక నిజాయితీ గల దళి త నేతను అవమానిస్తూ, మరోవైపు అంబేడ్కర్ సిద్ధాంతకర్త అని చెప్పుకోవడానికి విజయ్ సిగ్గుప డాలని ధ్వజమెత్తారు. సినిమా ఇంటర్నెట్లో లీక్ అయితే ఇప్పటి వరకు తమిళనాడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సెన్సార్ బోర్డును ఎందుకు సంప్రదించలేదు? ప్రశ్నించారు. కాగా ఈ లీక్ వ్యవహారంపై చైన్నె సైబర్ క్రైం విచారణ మొదలెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డ్రైవర్కు గుండెపోటు తిరువొత్తియూరు: వెళ్తున్న బస్సులో డ్రైవర్కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నచెట్లును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. వివరాలు.. కోయంబత్తూరు నుండి గోపికి సుమారు 50 మంది ప్రయాణికులతో ప్రభుత్వ బస్సు వెళ్తోంది. కూగలూరుకు చెందిన ముత్తుసామి (46) బస్సు డ్రైవర్గా ఉన్నాడు. కసిపాళయానికి చెందిన కరుప్పుసామి (43) కండక్టర్గా వున్నారు .వేట్టైక్కారన్ కోవిల్లో ప్రయాణికులను దించి బస్సు గోపి వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ ముత్తుస్వామికి స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముత్తుసామి, నంజగౌండన్పాళయానికి చెందిన కాళియప్పన్ (65), అతని భార్య నిర్మలాదేవి (53), కోడలు, కళ్లిపట్టి సెంథిల్కుమార్, గోపి శక్తి శాంతి నగర్కు చెందిన తారిణి సహా పది మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వాహన డ్రైవర్లు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం గోపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. పొలం పనుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సేలం:నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయసూర్యన్ గుర్తుపై పోటీ చేస్తున్న కేఎండీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ పొలం పనుల్లో బిజీగా ఉంటూ ఓట్ల వేట సాగిస్తున్నారు. తాను రైతు అని చాటే దిశగా ఆయన దూసుకెళ్తున్నారు. మల్లసముద్రం యూనియన్ పరిధిలోని మెల్ముగం పనంగత్తూరు, సూర్య కౌండంపాలయం తదితర ప్రాంతాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రచారం చేశారు. రైతులకు ఉచితంగా అందిస్తున్న సేవలను గుర్తు చేస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముందు, నాగలికి ట్రాక్టర్ను కట్టి వ్యవసాయ భూమిలో విత్తనాలు నాటడం ద్వారా ప్రచారం నిర్వహించారు. -
దుర్గా స్టాలిన్ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్
సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఏ అభ్యర్థి తరపున నేరుగా ఓట్లు అడగని సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తొలిసారిగా శీర్గాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థిగా సెంథిల్ సెల్వన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ ‘ఉదయ సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రప్రథమంగా..సాధారణంగా దుర్గా స్టాలిన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆలయ సందర్శనలకే పరిమితం అవుతుంటారు. గతంలో ఓ మారు కొళత్తూరులో తన భర్త స్టాలిన్ తరపున మహిళా ఓటర్లను కలిశారు. ఈ పరిస్థితులలో తాజాగా ఆమె నేరుగా ప్రచార రంగంలోకి దిగడం గమనార్హం.శీర్గాలి సెంటిమెంట్తమిళనాడు రాజకీయాల్లో శీర్గాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందే, ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బలమైన నమ్మకం. దీనిని ‘దీర్ఘదర్శి నియోజకవర్గం’ అని కూడా పిలుస్తారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈ నియోజకవర్గ ఫలితం ముందుగానే చెబుతుందని అర్థం.ఎండీఎంకే అభ్యర్థి.. డీఎంకే గుర్తువాస్తవానికి ఈ సీటు కూటమిలో ఎండీఎంకే పార్టీకి దక్కింది. వారు సొంత గుర్తుపై పోటీ చేస్తామని తొలుత ప్రకటించినా, చివరకు సెంటిమెంట్ దృష్ట్యా, డీఎంకే గుర్తు అయిన ‘ఉదయ సూర్యుడు’ పైనే అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ గెలిస్తేనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో స్టాలిన్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కూడా నాగపట్నంలో జరగాల్సిన సభను రద్దు చేసుకుని మరీ శీర్గాళిలో బహిరంగ సభ నిర్వహించారు. ‘నేను ఈ ఊరి అల్లుడిగా ఓటు అడగడానికి వచ్చాను’ అని స్టాలిన్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. దుర్గా స్టాలిన్ తన స్వగ్రామం తిరువెంకాడు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో, తాను ఈ ఊరి కోడలినని, తన ఊరి ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించాలని కోరడం విశేషం. సెంటిమెంట్ను బలంగా నమ్మే దుర్గా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈసారి శీర్గాళి సెంటిమెంట్ పలికి మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
మిస్టర్ ఎక్స్ను ధురంధర్తో పోల్చొద్దు
మిస్టర్ ఎక్స్లో ఆర్య, గౌతమ్రామ్కార్తీక్, శరత్కుమార్, మంజు వారియర్, యూనిట్ సభ్యులు తమిళసినిమా: ఇంతకుముందు సర్ధార్, లబ్బర్ బంతు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రిన్న్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్, మెమరిక్ మూవీస్ అధినేత వినీత్జైన్ కలసి నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. ఆర్య హీరోగా నటించిన ఇందులో కార్తీక్ గౌతమ్రామ్కార్తీక్, శరత్కుమార్, మంజువారియర్ ప్రధా న పాత్రలు పోషించారు. నటి అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఎఫ్ఐఆర్ చిత్రం ఫేమ్ మను ఆనంద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి దిపు నినన్ థామస్ సంగీతాన్ని, అరుళ్ విన్సెంట్ చాయాగ్రహణం అందించిన మిస్టర్ ఎక్స్ ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. చిత్ర యూనిట్ గురువారం చైన్నెలోని పలోజో థియేటర్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంజువారియర్ మాట్లాడుతూ స్పై థ్రిల్లర్ కథా చిత్రాలు ఇంతకుముందు చాలా వచ్చాయని, అలాంటి చిత్రంలో తాను నటించ డం తన అదష్టమని అని అన్నారు. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన కథా చిత్రం అని గౌతమ్ రామ్ కార్తీక్ చెప్పారు. ఆర్య మాట్లాడుతూ దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పేర్కొన్నారు. దర్శకుడు మనుఆనంద్ మాట్లాడుతూ ఈచిత్రం ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. హిందీ చిత్రం ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా, ఆ చిత్రాన్ని మిస్టర్ఎక్స్తో పోల్చరాదని దర్శకుడు చెప్పారు. హిట్ కాంబోలో ఇరండు వానం తమిళసినిమా: సినీ రంగంలో హీరోయిన్ల కాలపరిమితి చాలా తక్కువ అనే టాక్ ఉంది. ఒక్క దశాబ్దంపాటు లైమ్లైన్లో ఉండడమే కష్టం అంటారు. ఇది ఒక రకంగా నిజమే కావచ్చు. చాలా మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే దశాబ్దాల పాటు తమ హవాను కొనసాగిస్తుంటారు. అలాంటి వారి పట్టికలో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది. కారణం రెండు దశాబ్దాల కాలాన్ని అధిగమించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారీ బ్యూటీ. 2005లో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ల్లో టాప్ హీరోయిన్గా ఎదిగారు. మొదట్లో తనదైన మేనందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టినా, ఆ తరువాత తనలోని నటనకు పదును పెట్టి మంచి నటిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రత్యేక పాటల్లో తమన్నాది అందవేసిన చెయ్యి అని చెప్పకతప్పదు. పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న తమన్నా సినిమా వయసు 21 ఏళ్లు. ఇప్పుటికీ తరగని అందాలతో ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. ఒక్క ఐటమ్ సాంగ్కు రూ.6 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి తమన్నా ఇటీవల ఒక వేదికపై గర్వంగా చెప్పారు. నేను చిత్ర రంగప్రవేశం చేసి 21 ఏళ్లు అవుతోంది. ప్రతిసారి మళ్లీ కొత్తగా ప్రారంభిస్తున్నట్లే భావన కలుగుతోంది. దక్షిణాది సినీ ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను అభిమానిస్తున్నారు. అదే విధంగా ఇండియాలోని ఇతర భాషా ప్రేక్షకులు అభిమానించడం ఆనందంగా ఉంది. అలాంటి వారి అభిమానానికి తిరిగి నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నానని తమన్నా పేర్కొన్నారు. ఇరండు వానం ఫస్ట్లుక్ పోస్టర్ వారికి ఏమి చేయాలని ఆలోచిస్తున్నా! తమిళసినిమా: ముండాచు పట్టి, రాక్షసన్ వంటి సూపర్ హిట్ చిత్రాల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఇరండు వానం. హీరో విష్ణువిశాల్, దర్శకుడు రామ్కుమార్ల కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇందులో మమితబైజు నాయకిగా నటిస్తున్నారు. విష్ణు విశాల్, మమితా బైజు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. కాగా సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను పూర్తి చేసేలా ఇరండు వానం ఉంటుందని యూని ట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బలమైన కథ, ప్రముఖ సాంకేతిక వర్గం చేస్తున్న చిత్రం కావడంతో విడుదలకు ముందే ప్రాధాన్యతను సంతరించుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దిపునినన్ థామస్ సంగీతాన్ని, దినేష్ కే.బాబు చాయాగ్రహణం అందించారు. -
క్లుప్తంగా
ఎంజీ మేజెస్టర్ రికార్డు సాక్షి, చైన్నె: ఎంజీ మేజెస్టర్ కొత్త రికార్డును నమోదు చేసినట్టుగా జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ఎండీ అనురాగ్ మెల్హోత్ర తెలిపారు. ఈ రికార్డు గురించి స్థానికంగా శుక్రవారం ప్రకటించారు. భారత దేశంలోనే తొలి ఈ ప్లస్ ఎంజీ మేజెస్టర్ అత్యంత బరువైన రైలును లాగి గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నట్టు తెలిపారు. 406.4 టన్నుల బరువున్న రైలు (లోకోమోటివ్ , కోచ్లు కలిపి) 300 అడుగుల దూరం వరకు మేజెస్టర్ విజయవంతంగా లాగిందని తెలిపారు. ఈప్రయోగాన్ని జమ్ముకశ్మీర్లోని కాకాపోరా–అవంతిపోరా రైల్వేస్టేషన్ల మధ్య నిర్వహించామన్నారు. 400 టన్నులు, 100 అడుగుల లక్ష్యాన్ని మేజెస్టర్ అధిగమించిందన్నారు. వినియోగదారుల రక్షణకు సీసీయూ సాక్షి, చైన్నె : వినియోగదారుల రక్షణ లక్ష్యంగా కౌంటర్ ఫీట్ క్రైమ్స్ యూనిట్(సీసీయూ)ను ప్రారంభించామని అమెజాన్ సీసీయూ డైరెక్టర్ కెమ్హ్రూ స్మిత్ తెలిపారు. ఈ కొత్త యూనిట్ గురించి ఆయన స్థానికంగా వివరిస్తూ వినియోగదారులను, బ్రాండ్లను నకిలీ వస్తువుల నుంచి రక్షించడానికి ఈ యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగంలో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టడం , కస్టమర్ల నమ్మకాన్ని కాపాడడం ఈ విభాగం యొక్క ప్రధాన లక్ష్యంగా వివరించారు. అధునాతన టెక్నాలజీ ద్వారా నకిలీ వస్తువులను గుర్తించి, వాటిని వెబ్సైట్ నుంచి తొలగించడంతో పాటు, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. 2030 నాటికి భారతదేశంలో అమెజాన్ సుమారు 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఘనంగా ఎస్ఆర్ఎం వార్షికోత్సవం సాక్షి,చైన్నె: ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్న్స్ అండ్ టెక్నాలజీ– వడపళని క్యాంపస్ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమానికి జోహో కార్పొరేషన్ డైరెక్టర్,జోహో స్కూల్ ఆఫ్ లర్నింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రన్ దండపాణి హాజరయ్యారు. ఎస్ఆర్ఎం వడపళని క్యాంపస్ డీన్ సీవీ జయకుమార్ వార్షికోత్సవ నివేదికను సమర్పించి క్యాంపస్ సాధించిన పురోగతిని వివరించారు. సంస్థ డైరెక్టర్ హరిణి వేడుకలను ప్రారంభించి విద్యతోపాటు పాఠ్యేతర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. రాజేంద్రన్ దండపాణి వార్షికోత్సవ ప్రసంగిస్తూ విద్యాపరమైన విజయాలపై దృష్టి పెట్టకుండా, వాస్తవ ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా మారడంపై అవగాహన పెంచారు. అనంతరం బహుమతులు, పురస్కారాలు ప్రదానం చేశారు. వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ సి.గోమతి పాల్గొన్నారు. ప్రారంభానికి నోచుకోని డీబీసీ కేంద్రం – కృష్ణసముద్రం ప్రాంత రైతులు ఆందోళనకు నిర్ణయం తిరుత్తణి: డీబీపీ కేంద్రంకు వరి తరలించేందుకు దారి లేకపోవడంతో పది రోజులుగా ప్రారంభంకు నోచుకోక తిరుత్తణి ప్రాంతం రైతులు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తున్నారు.అయతే తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రంలో వరి కొనుగోలు కేంద్రంకు జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆదశించారు.అయితే రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించిన గిడ్డంగికి ట్రాక్టర్లు, లారీలకు దారి లేకపోవడంతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఎలాంటి దారిలేని ప్రాంతంలో రూ. 35 లక్షలతో ప్రభుత్వ వరి గిడ్డంగి ఎందురు నిర్మించాలని రైతులు ప్రశ్నించారు. పది రోజులుగా కృష్ణసముద్రం, సూర్యనగరం, బుచ్చిరెడ్డిపల్లె, చిరుగుమి, పరిసర ప్రాంతాల్లోని గ్రామీణులు వరిపంట దిగుబడి చేసి వరి కొనుగోలు కేంద్రంకు తరలించేందుకు వీలులేక పంట పొలాల్లో దాదాపు 1000 టన్నుల వరి నిల్వ వుంచినట్లు, వేసవి వర్షాలు కురుస్తున్న క్రమంలో దిగుబడి చేసిన వరి తడిచి నిరుపయోగంగా మారే అవకాశం వున్నందున రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే ప్రత్యామ్నాయ మార్గంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోతే పోరాటం చేపట్టనున్నట్లు రైతులు తెలిపారు. -
రామన్న విన్నపం తిరస్కరణ
సాక్షి, చైన్నె: మామిడి పండు గుర్తు వివాదంలో అన్బుమణికి ‘కామన్ సింబల్’ ఇవ్వాలన్న రామ దాస్ విన్నపాన్ని మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. పీఎంకేలో తలెత్తిన అంతర్గత విభేదాల నేపథ్యంలో మామిడి పండు గుర్తు విషయంలో దాఖలైన పిటిషన్న్పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్బుమణి రామదాస్ వర్గానికి మామిడి పండు గుర్తుకు బదులుగా వేరే ఏదైనా సాధారణ గుర్తు కేటాయించాలన్న డాక్టర్ రామదాస్ తరఫు వాదనను కోర్టు పరిగణించలేదు. రాందాస్ వర్గం వాదన అన్బుమణిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని, ఆయన తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల కమిషన్ వద్ద మామిడి పండు గుర్తును పొందారని రామదాస్ తరఫు న్యాయవాదులు వాదించారు. పార్టీ ఎవరికి చెందుతుందనే వివాదం తేలే వరకు ఆ గుర్తును ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేయాలని కోరారు. అదే సమయంలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉందని, నామినేషన్ల పరిశీలన కూడా ముగిసిందని జస్టిస్ టి.వి.తమిళసెల్వి పేర్కొన్నారు. ఈ తరుణంలో గుర్తును నిలిపివేస్తే అది పీఎంకే పార్టీకే నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ వివరణ పీఎంకే ప్రస్తుతం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమేనని, గుర్తింపు పొందిన పార్టీ కాదని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. మామిడి పండు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉందని, గతంలో ఆ పార్టీకి ఆ గుర్తు ఉన్నందున ప్రాధాన్యత క్రమంలో దానిని కేటాయించామని వివరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. అదే సమయంలో అన్బుమణి వర్గం వాదనలో ఎన్నికల ప్రక్రియ సగం ముగిసిందని, బస్సు ఎప్పుడో బయలుదేరిందని, ఇప్పుడు దానిని ఆపడం సాధ్యం కాదని వివరించారు. అన్బుమణి రామదాస్ వర్గానికి మామిడి పండు గుర్తును కేటాయించవద్దని ఎన్నికల కమిషన్న్ను ఆదేశించాలని రామదాస్ తరఫు న్యాయవాదులు పట్టుబట్టినప్పటికీ, అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. రెండు రోజుల పాటు సాగిన విచారణలో చివరకు రామదాసు విజ్ఞప్తిని తిరస్కరిస్తూ , ఆయన పిటిషన్ను తోసిపుచ్చారు. దీంతో ప్రస్తుతానికి అన్బుమణి వర్గం పోటీ చేసే స్థానాల్లో ‘మామిడి పండు’ గుర్తు వాకునేందుకు అడ్డంకులు తొలగినట్లైంది. -
మా సినిమాను ధురంధర్తో పోల్చకండి: దర్శకుడు
ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్ఐఆర్ ఫేమ్ మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ గురువారం (ఏప్రిల్ 9న) ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా మంజు వారియర్ మాట్లాడుతూ.. స్పై థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడం తన అదృష్టమని పేర్కొంది. గౌతమ్ రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన సినిమా అన్నారు. దర్శకుడు మను ఆనంద్.. ఈ మూవీ ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా అని తెలిపారు. హిందీ మూవీ ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా.. ఆ చిత్రాన్ని మిస్టర్ ఎక్స్తో పోల్చరాదని పేర్కొన్నారు. -
ఉన్నత విద్యకు నిధులు కేటాయించాలి
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని అందరికీ ఉన్నత విద్యా పథకం కింద నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. గోల్డన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ పరిపాలన డైరెక్టర్ మణికంఠన్ జీ మేనన్ హాజరై విద్యార్థులకు చెక్కులను అందజేశారు. విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ సాయం లేకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 2012వ సంవత్సరంలో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 856 మంది విద్యార్థులకు రూ.కోటి 18 లక్షల స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు 28 శాతం మంది మాత్రమే వెలుతున్నారని అన్నారు. విద్యలో తమిళనాడు మొదటి రాష్ట్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోటీ పడాలన్నారు. ట్రస్ట్ సభ్యులు మయిలాంబిగై, కార్యదర్శి లక్ష్మణన్, కోశాధికారి జౌరీలాల్ జైన్, వెంకటసుబ్బు, దేవరాజ్, రచయిత పదుమనార్, కేఎంజీ రాజేంద్రన్, డాక్టర్ నర్మద, అంజు శక్తివేల్ పాల్గొన్నారు. -
ఎన్నికల్లో అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలి
పళ్లిపట్టు: మతతత్వ బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకేకు ఎన్నికల్లో ముస్లిం, క్రైస్తవులు బుద్ధి చెప్పాలని డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. తిరుత్తణి డీఎండీకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణమూర్తి శుక్రవారం పళ్లిపట్టులోని జమ్మా మసీదులో ప్రార్థనలు చేసి వెలుపలికి వచ్చిన ముస్లింల వద్ద ఓట్లు అభ్యర్థించారు. మైనార్టీలకు నిత్యం అండగా వుంటున్న డీఎంకే–కాంగ్రెస్ కూటమిని ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మతం పేరిట ప్రజలను చీల్చి రాజకీయ లబ్ధి పొందుతున్న బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకేకు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మండల డీఎంకే కార్యదర్శి సీజే.శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్కుమార్, కాంగ్రెస్ పట్ణణ అధ్యక్షుడు శివకుమార్ సహా అనేక మంది పాల్గొన్నారు. -
మక్కళ్ తలైవా ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న విషయం తెలిసిందే. అధికారం చేపట్టడానికి ఓట్ల వేటలో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో సామాజిక రాజకీయాలకు అద్దం పట్టే విధంగా మక్కళ్ తలైవా అనే చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి ఫర్ సేల్ అనే ట్యాగ్లైన్ పెట్టడం విశేషం. రవిమరియా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. రాధారవి, అక్షర విజయ్, పళ కరుప్పయ్య, నాంజల్ సంపత్, దర్శకుడు పేరరసు, గంజాకరుప్పు, పైల్వాన్ రంగనాథన్, దర్శకుడు రంగనాథన్, కవితాలయా శరవణన్, అగ్ని ఎస్.వరుణ్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి రామ్దేవ్ దర్శక త్వం వహించారు. కార్తీక్ కేఎస్.నాయర్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ద్వారా తులసిరామన్ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ కల్పిత కథతో సమకాలీన రాజకీయాలను వినోదంతో కలిపి రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను దివంగత రాజకీయనాయకుడు కామరాజర్ శిష్యుడు తమిళరువి మణియన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. -
రాణిపేటలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, చైన్నె: రాణిపేట జిల్లా సిప్కాట్ ఫేజ్–3లో ఉన్న ఒక ప్రైవేట్ వ్యర్థాల రీసైక్లింగ్ కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమ నుండి భారీగా నల్లటి పొగ వెలువడడంతో ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొన్నాయి. రాణిపేట పరిసరాల్లోని వివిధ కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థాలను సేకరించి, వాటిని వేరు చేసి రీసైక్లింగ్ చేసే ఒక ప్రైవేట్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో వ్యర్థాలను నిల్వ ఉంచిన చోట అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కార్మికులు మంటలను గమనించి ఆర్పేలోపే, అవి వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. నల్లటి పొగ ఆకాశాన్ని చుట్టేయడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సిప్కాట్, రాణిపేట అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీరికి తోడుగా భెల్ సంస్థకు చెందిన అగ్నిమాపక వాహనాలు కూడా రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది సుదీర్ఘంగా పోరాడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మంటలకు ఆహుతైనవన్నీ కర్మాగార వ్యర్థాలేనని ప్రాథమికంగా తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిందో తేలనున్నది. ఎగసి పడుతున్న మంటలు -
ఎడపాడి సీఎం అయ్యేలా ప్రచారం
తిరుత్తణి: ఎడపాడి పళనిస్వామి సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు కలసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థి హరి పార్టీ శ్రేణులకు సూచించారు. తిరుత్తణి తూర్పు మండల అన్నాడీఎంకే ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని వెంకటాపురం వద్ద ప్రారంభించారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి వేలంజేరి కవిచంద్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి, తిరుత్తణి అభ్యర్థి హరి నూతన కార్యాలయం ప్రారంభించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సీఎం కావాలనే లక్ష్యంతో కార్యకర్తలు కూటమి పార్టీల కార్యకర్తలను కలుపుకుని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టాలన్నారు. డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలకు భద్రత కరువైందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే అనేక పథకాలు అమలవుతాయని మహిళలకు మేలు జరుగుతుందని చెప్పి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. -
వందశాతం ఓటింగ్పై అవగాహన
పళ్లిపట్టు: వంద శాతం ఓటింగ్పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పళ్లిపట్టులో అంగన్వాడీ సిబ్బంది శుక్రవారం అవగాహన శిబిరం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ను ప్రోత్సహించే విధంగా జిల్లా యంత్రాంగం ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టులో చిన్నారుల సంరక్షణ పథకం ద్వారా మండల చిన్నారుల సంక్షేమ అధికారి దానియ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొని వందశాతం ఓటింగ్కు సంబంధించి ముగ్గులు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య బాధ్యతలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బీడీఓ కార్యాలయం ప్రాంతంలో వందకు పైగా అంగన్వాడీ సిబ్బంది ప్లకార్డులు చేతబట్టి ప్రజలకు వందశాతం ఓటింగ్లో పాల్గొనడంపై అవగాహన కల్పించారు. చివరగా ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించడంపై ప్రతిజ్ఞ చేశారు. -
అవినాశి ఆదుకునేనా?
స్థానిక సమస్యలు అవినాశి లింగేశ్వరాలయం సాక్షి, చైన్నె : వరుస ఓటములను ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ను ఈసారి అవినాశి నియోజకవర్గం ఓటర్లు ఆదుకునేనా అనే ఎదురుచూపులు పెరిగాయి. ఆయన్న ఢీకొట్టేందుకు ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా కోకిలామణి, టీవీకే అభ్యర్థిగా కమలి, ఎన్టీకే అభ్యర్థిగా మేనక పోటీ చేస్తున్నారు. ఈ రిజర్వుడ్ స్థానంలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. కొంగు మండలం(పశ్చిమ తమిళనాడు)లో కీలకంగా తిరుపూర్ జిల్లాలో అవినాశి నియోజకవర్గం ఉంది. ప్రసిద్ధ అవినాశిలింగేశ్వర ఆలయం, తిరుమురుగన్ పూండి ఆలయాలకు నెలవైన ఈ ఆధ్యాత్మిక గడ్డలో తాజాగా రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇది ముమ్మాటికి అన్నాడీఎంకే కంచుకోట. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే తలా ఓ సారి గెలిచాయి. అన్నాడీఎంకే 8 సార్లు విజయ కేతనం ఎగుర వేసింది. వరుసగా ఐదు ఎన్నికలలో అన్నాడీఎంకే తిరుగులేని మెజారిటీతో నియోజకవర్గాన్ని కై వశం చేసుకుంటూ వచ్చింది. 2016లో ఇక్కడి నుంచి గెలిచిన వెనుకబడిన సామాజిక వర్గంకు చెందిన పీ ధనపాల్ను అసెంబ్లీ స్పీకర్ను చేసిన ఘనత అన్నాడీఎంకే దక్కించుకుంది. ఇక్కడ మొత్తం ఓటర్లు– 2,50,346 ఉన్నారు. ఓటర్లలో ఆది ద్రావిడ, కొంగు వేలాళర్, నాయకర్ , శెట్టియార్ సామాజిక వర్గాలు ఇక్కడ బలంగా ఉండడం గమనార్హం. మురుగన్ అనుగ్రహం దక్కేనా? తాజా ఎన్నికలలో పి.ధనపాల్ను అన్నాడీఎంకే పక్కన పెట్టింది. అధిష్టానం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా రెండు సార్లు ధనపాల్ గెలిచినా, ఆయన్ను పక్కన పెట్టి ఈ సారి సీటును బీజేపీకి అప్పగించడం అన్నాడీఎంకే వర్గాలే జీర్ణించుకోవడం లేదు. ధనపాల్, స్థానిక అన్నాడీఎంకే నాయకులు అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని బీజేపీ దక్కించుకుని, ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఆధారంగా ఈ సారి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ను అసెంబ్లీకి పంపించాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదును పెట్టారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ధనపాల్ రూపంలో అసమ్మతి సెగ తగిలే అవకాశాలు ఎక్కువే. ధనపాల్ తనయుడు తమిళ్ సెల్వన్ విజయ్ టీవీకేలో చేరడం గమనార్హం. ప్రత్యర్థులుగా ముగ్గురు నారీ మణులు కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముగ్గురు మహిళా శక్తిని ఎన్నికలలో ఎదుర్కొంటున్నారు. డీఎంకే అభ్యర్థిగా యువ వైద్యురాలు వి. కోకిలామణిని రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా, రెండాకుల చిహ్నం నియోజకవర్గంలో ఉపయోగించే ఈవీఎంలలో కనిపించే అవకాశం లేని దృష్ట్యా, ఉదయ సూర్యుడికి ఓటర్లు పట్టం కట్టి తనను గెలిపిస్తారన్న ధీమాతో కోకిలా మణి ప్రచారం చేస్త్తున్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా వి. మేనక పోటీ చేస్తున్నారు.తమిళగ వెట్రి కళగం(టీవీకే ) తరఫున ఎస్ కమలి పోటీలో ఉన్నారు. -
చైన్నెలో ఘంటసాల మహాసభలు
– సన్నాహక సమావేశంలో కోట వెంకటేశ్వరరెడ్డి వెల్లడి కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రం చైన్నెలో ఆలిండియా ఘంటసాల చైతన్యవేదిక 16వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ వేదిక అధ్యక్షుడే కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈమేరకు చైన్నెనగరం, పెరియమెట్లోని తిరువేంగడం మొదటి వీధిలో ఉన్న శ్రీతిరుమల లాడ్జి ఆవరణలో ఆలిండియా చైతన్య వేదిక 16వ జాతీయ మహాసభల సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ప్రముఖ గాయకులు, ఘంటసాల అభిమాని ఎంఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్తోపాటు, చైన్నెలోని ఘంటసాల గాయకులు, అభిమానులతో పరిచయ కార్యక్రమాలు చేపట్టారు. కోట వెంకటేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రధాన ప్రసంగం చేశారు. మహాసభలను చైన్నె వేదికగా నిర్వహించనున్నట్టు ఈ సన్నాహక సమావేశం నిర్ణయించిందని అన్నారు. రానున్న మే నెలలో మరొక విస్తృత సన్నాహక సమావేశం జరుగుతుందన్నారు. మధురగాయకులు ఘంటసాల అభిమానులు ఇందులో పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ప్రత్యేకించి ఘంటసాల అభిమాని, జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తమ ప్రోత్సాహం ఉంటుందని తెలియజేశారని, వారికి తమ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
ద్విముఖ సమరమే!
సాక్షి,చైన్నె : రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే), సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలు పోటీలో ఉన్నా, ప్రధాన సమరం మాత్రం ద్విముఖమే అని బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేశారు. ఈ ద్విముఖ సమరం రెండు ప్రదాన కూటముల మధ్య మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. నీలగిరి జిల్లా ఊటీలో బీజేపీ అభ్యర్థి ఎం భోజరాజన్ తరఫున శుక్రవారం అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో అన్నామలై ఊటీకి రావడం గమనార్హం. ఆయన హెలికాప్టర్ను ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ద్విముఖ పోరు ఎన్నికల క్షేత్రంలో అనేక పార్టీలు ఉన్నా, చివరకు పోటీ అధికార డీఎంకే, ప్రదాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మధ్య మాత్రమే ఉంటుందని తన ప్రసంగంలో అన్నామలై స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఊటీలో విజయాన్ని కోల్పోయామని, ఈ ఐదేళ్లలో తాము చేసిన కృషి, సహకారం, అన్నాడీఎంకే మద్దతుతో ఈసారి భోజరాజన్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనుకూల పవనాలు పుదుచ్చేరిలో 90 శాతం మేరకు పోలింగ్ నమోదు కావడంతో అధికార ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు ఉన్నాయన్నది స్పష్టం అవుతోందన్నారు. తమిళనాడు విషయానికి వస్తే మే 4 తర్వాత కొత్త మార్పు జరగబోతోందన్నారు. ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో తమిళనాడులో సరికొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. కేంద్ర మంత్రి పీయూష్గోయల్, ఇతర ముఖ్యనేతలు ఊటీలో ప్రచారానికి సిద్ధమయ్యారు. -
కుటుంబ ఆధిపత్యం కోసం డీఎంకే ప్రయత్నం
●బీజేపీ విమర్శలు సాక్షి, చైన్నె: డీఎంకే పార్టీలో తండ్రి, చెల్లి, కుమారుడు తర్వాత ఇప్పుడు అల్లుడిని కూడా ఎంపీని చేసి, ఒకే కుటుంబ ఆధిపత్యాన్ని శాశ్వతం చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ రాజకీయాలపై ధ్వజమెత్తారు. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. సాధారణ ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా, కుల ధ్రువీకరణ పత్రం పొందాలన్నా కౌన్సిలర్లకు లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. సీఎం స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇప్పుడు బహిరంగంగానే రాజకీయాల్లోకి వచ్చారని, స్టాలిన్ ముఖ్యమంత్రిగా, ఆయన సోదరి ఎంపీగా, కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ క్రమంలో అల్లుడిని కూడా ఎంపీని చేయాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి పాలన నుంచి తమిళనాడును రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రసాద్ ఈసందర్భంగా పిలుపునిచ్చారు. శశికళ వ్యాఖ్యలపై చర్చ సాక్షి,చైన్నె : చిన్నమ్మ వీకే శశికళ చేసిన వ్యాఖ్యలు తాజాగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. శివగంగలో ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె పరోక్షంగా ఎడపాడి పళనిస్వామిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన వ్యక్తి (ఎడపాడి) నుంచే ఇప్పుడు తన ప్రాణాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక నిరంకుశుడిలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. తాను జైలుకు వెళ్లినప్పటి నుంచి పార్టీలో (అన్నాడీఎంకే) అనేక సమస్యలు తలెత్తాయని, ఆ విషయాలన్నీ ప్రజలకు తెలుసని ఆమె పేర్కొన్నారు. తాను తిరిగి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదని అన్నారు. తాను వీరమరణం పొందిన రాణి వేలు నాచియార్ను స్ఫూర్తిగా తీసుకుంటానని, తమిళనాడు ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందని శశికళ తెలిపారు. చైన్నె పోలీస్ కమిషనర్ బదిలీ సాక్షి, చైన్నె: గ్రేటర్ చైన్నె పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. కొత్త కమిషనర్గా అభిన్దినేష్మోదక్ను నియమించారు. డీఎంకేకు అనుకూలంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్టుగా ఆరోపణలను ప్రతిపక్షాలు వెల్లువెత్తిస్తున్న విషయం తెలిసిందే. టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీల ప్రతినిధులు పదే పదే ఎన్నికల కమిషన్ను సంప్రదిస్తూ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పలు జిల్లాల ఎస్పీలు, నగరాల కమిషనర్లు, కలెక్టర్లను ఇప్పటికే ఎన్నికల విధుల నుంచి తప్పించి, వారి స్థానంలో కొత్త వాళ్లను నియమించారు. అలాగే, డీజీపీ(ఇన్చార్జ్) వెంకట్రామన్ను తప్పించి సందీప్ రాయ్రాథోర్ను నియమించారు. ఇక, రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంను సైతం తప్పించారు. ఆయన స్థానంలో ఎన్నికల కొత్త సీఎస్గా సాయికుమార్ నియమితులయ్యారు. ఈ పరిస్థితులలో గ్రేటర్ చైన్నె కమిషనర్ అరుణ్ను తప్పిస్తూ శుక్రవారం రాత్రి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అదనపు డీజీపీ హోదాలో ఉన్న అభిన్దినేష్మోదక్ను శనివారం చైన్నె కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రూ.9కోట్ల బంగారం స్వాధీనం తిరువళ్లూరు: చైన్నె, గిండి నుంచి తిరుత్తణి వైపు బొలెరో వాహనంలో వెళుతున్న రూ.9 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, కడ్డీలను ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు ఆర్వోకు అప్పగించారు. తిరువళ్లూరు జిల్లాలో లక్ష్మాపురం వద్ద ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో ఎలాంటి భద్రత లేకుండా తీసుకెళుతున్న రూ.9కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, కడ్డీలు, వెండి వస్తువులు, రూ.71 లక్షలు విలువ చేసే వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బంగారు నగలకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడంతో వాటిని తిరువళ్లూరు ఆర్వోకు అప్పగించారు. కాగా అధికారుల విచారణలో బంగారు నగలను ప్రయివేటు దుకాణానికి తీసుకెళుతున్నట్టు నిర్ధారించి స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. -
స్టైలిష్ సీఎం
సాక్షి, చైన్నె: ఫార్మల్ షర్ట్, ఫ్యాంట్, కళ్లజోడుతో స్టైలిష్గా సీఎం స్టాలిన్ శుక్రవారం చైన్నె మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా సాధారణ ప్రయాణికులతో కలసి ముచ్చటించిన ఆయన, మెట్రో ప్రాజెక్టు రూపకల్పనలో తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఉదయాన్నే చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్లో స్టైలిష్గా ఓ వ్యక్తి క్యూలో నిలబడి టికెట్ తీసుకున్నారు. ఎలాంటి భద్రతా హంగామా లేకుండా ఆ వ్యక్తి టికెట్ తీసుకుని అన్నా సాలైమీదుగా వెళ్లే మెట్రో రైలులో ఎక్కారు. ఆయన వెన్నంటి తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి మాత్రం ఉన్నారు. స్టైలిష్గా ఉన్న ఆయన్ను గుర్తు పట్టిన ప్రయాణికులు నివ్వెరపోయారు. ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆయన ఎవరో కాదు...మన సీఎం స్టాలిన్. ఆయన వెన్నంటి ఉన్నది ఎమ్మెల్యే ఎలిళన్ నాగనాథన్. స్టాలిన్ మెట్రో రైలులో ఉన్న సమాచారంతో ఒక్క సారిగా అందులో ప్రయాణించే వారంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కొందరు అయితే, ఆయనతో సెల్ఫీలు దిగారు. మరి కొందరు కుశల ప్రశ్నలు వేశారు. ఈసందర్భంగా స్టాలిన్ తనతో పాటు ప్రయాణించిన వారితో ముచ్చటిస్తూ డీఎంఎస్ వరకు ప్రయాణించారు. డీఎంకేను ఆదరించాలని కోరారు. తేనాంపేట వద్ద దిగేసి తన ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం తన జ్ఞాపకాలతో ట్వీట్ చేశారు. గత జ్ఞాపకాలు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జపాన్ దేశ పర్యటనకు వెళ్లి, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ నుంచి నిధుల సహాయం పొంది, ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే, విమ్కోనగర్ నుంచి విమానాశ్రయం వరకు, సెంట్రల్ నుంచి సెయింట్థామస్ మౌంట్ వరకు కొనసాగుతున్న మొదటి దశ మెట్రో సేవలను ఇప్పటికే కోట్ల మంది ప్రజలు వినియోగించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
కారైకుడిలో విజయ్ మౌన ప్రచారం
సాక్షి, చైన్నె : శివగంగ జిల్లా కారైకుడిలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రసంగానికి ఆలస్యం బ్రేక్ వేసింది. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రావడంతో ఆయన ప్రచారానికి పోలీసులు చెక్ పెట్టారు. దీంతో రోడ్ షో రూపంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ శుక్రవారం విజయ్ ముందుకుసాగారు. శివగంగ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు విజయ్ శుక్రవారం ఉదయం చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కారైకుడికి బయలుదేరారు. జన కెరటం విజయ్ను చూసేందుకు ఉదయం తొమ్మిది గంటల నుంచే ఆ పరిసరాలకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కేడర్, విజయ్ను చూడాలన్న ఆశతో సాధారణ ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆ పరిసరాలన్నీ ఇసుక వేస్తే రాలనంతగా పరిస్థితి నెలకొంది. జనసందోహం దృష్ట్యా, బస్టాండ్ను సైతం సాయంత్రం వరకు మూసి వేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. విజయ్ రాక ఆలస్యమయ్యే కొద్ది టెన్షన్ బయలు దేరింది. ఓ వైపు భానుడు భగ భగమని ప్రతాపం చూపిస్తున్నా, విజయ్ రాక కోసం అభిమానులు నిరీక్షించారు. నిర్ణయించిన సమయానికి కంటే ఆలస్యంగా ఆయన కారైక్కుడి ప్రచార సభా పరిసరాలకు చేరుకున్నారు. దీంతో పోలీసులు మైక్ సెట్ ఉపయోగించేందుకు వీలులేదని స్పష్టం చేశారు. దీంతో విజయ్ ఓపెన్ టాప్ వాహనం పైకి ఎక్కి అభిమానులు, జనానికి అభివాదం తెలుపుతూ రోడ్షో రూపంలో ముందుకు సాగారు. విజయ్ను చూసిన ఆనందంలో జనం కేరింతలు కొట్టారు. అయితే, ఆయన ప్రసంగాన్ని వినలేకపోయామన్న నిరాశ తప్పలేదు. అయితే, అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా నలుగురు అభ్యర్థును పరిచయంచేస్తూ కారైకుడిలో రోడ్ షో నిర్వహించిన విజయ్, టీవీకే అభ్యర్థులకు ఓట్లు వేయాలని కేవలం చేతి సైగలతోనే ప్రజలను కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ ద్విచక్ర వాహనాల్లో కిలోమీటర్ల కొద్దీ అభిమానులు దూసుకొచ్చారు. కొన్ని చోట్ల ఒకర్ని మరొకరు ఢీకొట్టుకుని కింద పడి ఆస్పత్రి పాలయ్యారు. కారైకుడి వైపుగా దూసుకెళ్తున్న విజయ్ కాన్వాయ్ని తిరుపత్తూరు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపేసింది. ఆయన వాహనాన్ని, వెన్నంటి వచ్చిన వాహనాన్ని తనిఖీల అనంతరం అనుమతించారు. సైకిల్ యాత్రతో జాప్యం మదురై నుంచి కారైకుడి వచ్చే మార్గమధ్యంలో అభిమానులు భారీగా తరలిరావడంతో వాహనం నెమ్మదిగా సాగింది. ఈ క్రమంలో విజయ్ అకస్మాత్తుగా తన ప్రచార వాహనం దిగి, సిద్ధంగా ఉన్న సైకిల్పై ప్రయాణం ప్రారంభించారు. మదురై – కారైకుడి మధ్య ఉన్న 90 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి విజయ్కు 4 గంటలు సమయం పట్టింది. కారైకుడిలో మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే కొత్త బస్టాండ్ పరిసరాలలో విజయ్ ప్రచార సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, విజయ్ మధ్యాహ్నం 2.30 తర్వాత ప్రచార ప్రాంతానికి చేరుకున్నారు. -
ఎంతమంది వచ్చినా గెలుపు మాదే!
సాక్షి, చైన్నె : న్యూఢిల్లీ నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా లేదా సేలం నుంచి వచ్చినా ఇక్కడ గెలిచేది మాత్రం డీఎంకేయే అని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అన్నారు. కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలోని శుక్ర వారం డీఎంకే నేతృత్వంలో కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశానికి డీఎంకే పశ్చిమ మండల ఇన్న్చార్జ్ , మాజీ మంత్రి వి.సెంథిల్బాలాజీతోపాటు మెట్టుపాళయం నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి కవిత పాల్గొన్నారు. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఢిల్లీ, గుజరాత్ల నుంచే కాదు, సేలం నుంచి ఎందరు వచ్చినా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. మెట్టుపాళయం నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీ చేస్తున్న కవితను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాన్నారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఈసందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. -
స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ స్ట్రాంగ్ రూములకు చేరాయి. ఆ పరిసరాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. మొత్తం ఓటింగ్ శాతం 91.23 శాతంగా నమోదైంది. దీంతో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో జోష్ పెరిగినట్టైంది. అదే సమయంలో పెద్ద ఎత్తున యువత ఈ ఎన్నికలలో ఓటు వేసిన దృష్ట్యా, అవి ఎవరి ఖాతాలో పడ్డాయో అనే చర్చ ఊపందుకుంది. ఇందుకుకారణం పుదుచ్చేరిలోనూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పోటీలో ఉండడం గమనార్హం. ఓ యువ డాక్టర్ విజయ్ కోసం తాను రూ. 32 వేలు ఖర్చు పెట్టి సింగపూర్ నుంచి ఓటు వేయడానికి వచ్చినట్టు పేర్కొనడం గమనార్హం. యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం బట్టి చూస్తే, ప్రధాన పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ ఇండియా కూటమి, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఎన్డీఏ కూటములలోని కొందరు అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది. స్ట్రాంగ్ రూములకు భద్రత ఓటింగ్లో ఉపయోగించిన 1,099 ఈవీఎంలు, వీవీ ప్యాడ్, కంట్రోల్ పానల్స్ను ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి పుదుచ్చేరిలోని ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీ, మోతీలాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీకి చేర్చారు. ఇక్కడి స్ట్రాంగ్ రూములలో నియోజకవర్గాల వారీగా వాటిని ఉంచారు. ఈవీఎంలు అన్నీ పూర్తిగా నిఘా నీడలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసరాలలో మూడు అంచెలతో కూడిన భద్రతను కల్పించారు. రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ -
మోదీ, రాహుల్ ప్రచార బాట
సాక్షి,చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం వేగం పుంజుకుంటున్నది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 15న కన్యాకుమారి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వడస్సేరి నుంచి రోడ్షో నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు ఎం.ఆర్. గాంధీ, విజయధరణి, తామరై సోమన్, అన్నాడీఎంకే అభ్యర్థి దళవాయి సుందరానికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన దష్ట్యా నాగర్కోయిల్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్గాంధీ ప్రచార షెడ్యూల్ కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఏప్రిల్ 12న తమిళనాడుకు రానున్నారు. శ్రీపెరంబుదూర్లో తొలుత తన తండ్రి రాజీవ్గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి, అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి సెల్వపెరుంతగై తరఫున ప్రచారం ప్రారంభిస్తారు. తూత్తుకుడిలో జరగనున్న భారీ బహిరంగ సభలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, రాహుల్గాంధీ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పర్యటనగా ఏప్రిల్ 15, 16 తేదీల్లో రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కూడా కోయంబత్తూరు, సేలం, మదురై ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
భద్రతపై డీజీపీ దృష్టి
సాక్షి, చైన్నె : నామినేషన్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముగిశాయి. ఎన్నికల రేసులో ఉన్న తుది అభ్యర్థుల జాబితా వెలువడింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఎన్నికలను ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతం చేయడం లక్ష్యంగా డీజీపీ సందీప్ రాయ్ రాథోర్ దృష్టిపెట్టారు. శుక్రవారం అధికారులు, పోలీసుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో 4,613 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల కమిషన్ అధికారిక జాబితాను శుక్రవారం ఉదయం తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇందులో చైన్నెలోని 16 నియోజకవర్గాలలో 619 మంది పోటీ చేస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరులో అత్యధికంగా 47 మంది పోటీలో ఉన్నారు. వీరిలో పది మంది విజయ్, జోషఫ్ ఉండడం గమనార్హం. అలాగే, సీఎం స్టాలిన్ పోటీ చేస్తున్న కొళత్తూరులోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉండడం గమనార్హం. భద్రతపై సమీక్ష పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సందీప్రాయ్ రాథోర్ , చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్ సమావేశమయ్యారు. చైన్నెలో పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు నగదు, బహుమతులు పంపిణీ చేయకుండా నిరోధించేందుకు నియోజకవర్గాల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్న్స్ టీమ్ల తనిఖీలను ముమ్మరం చేస్తూ చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు, ఒకవేళ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడానికి వీలుగా ప్రచార కార్యక్రమాలను వీడియో రికార్డింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆదేశించారు. భద్రతా సమీక్షకు ముందు డీజీపీ సందీప్రాయ్రాథోర్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదిలాఉండగా, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, అధికారులకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతాపరమైన చర్యలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రత్యేక కార్యాచరణతో విజయవంతం చేద్దామని సూచించారు. తమకు పట్టుబడ్డ నగదులో సరైన పత్రాలు చూపడంతో రూ.1.66 కోట్లు వెనక్కి ఇచ్చినట్టు చైన్నె ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
Elections: తమిళనాడు తెలుగు యువశక్తి కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల హక్కులు, గౌరవం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా తమిళనాడులో తెలుగు ప్రజల సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, తాను తాళి నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా.. ప్రజా ప్రయోజనాల కోసం, సమాన హక్కుల కోసం మరింత బలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.‘‘తమిళనాడులో సుమారు 70–80 లక్షల తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాల్లో అధిక ప్రభావం ఉంది. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, తిరువన్నామలై, వెల్లూర్, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, మధురై, తిరుచ్చి, తంజావూరు, చెంగల్పట్టు ఈ ప్రాంతాలు అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిగా ఉన్నాయి...సీఎం స్టాలిన్ నాయకత్వంలో తెలుగు సంతతికి చెందిన నాయకులకు గౌరవప్రదమైన స్థానం లభించింది. సుమారు నలుగురు తెలుగు మంత్రులు మంత్రివర్గంలో ఉన్నారు. దాదాపు 20–25 మంది ఎమ్మెల్యేలు తెలుగు ప్రజలను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది తెలుగు ప్రజలకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించే సమగ్ర పాలనకు నిదర్శనం’’అని కేతిరెడ్డి పేర్కొన్నారు.సినీ నటి కస్తూరి... తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించి.. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంది. ఈ సంఘటన ద్వారా తెలుగు ప్రజల గౌరవం, స్వాభిమానం కాపాడటంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో స్పష్టమవుతుంది. తమిళనాడు తెలుగు యువశక్తి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. తెలుగు ఓటర్లను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. డీఎంకే, ఆ పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి కట్టుబడి పనిచేస్తుంది. తమిళనాడులో తెలుగు ప్రజల భద్రత, గౌరవం, ప్రాతినిధ్యం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం డీఎంకే మాత్రమే. ఈ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయం’’ అని కేతిరెడ్డి పేర్కొన్నారు. -
షూటింగ్ దశలో కోహినూర్
తమిళసినిమా: వజ్రాలలో రాణి కోహినూర్ అంటారు. అలాంటి కోహినూర్ ప్రత్యేకతను ఆవిష్కరించే విధంగా పలు కల్పిత అంశాలతో తెరకెక్కుతున్న తాజా చిత్రం కోహినూర్. ఇంతకు ముందు అలైయోడు విలైయాడు వంటి జనరంజక కథా చిత్రాన్ని నిర్మించిన భగవాన్ పావేందర్ ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. దీన్ని రాజమ్ ఆర్ఈ. రాజేంద్ర కథ, మాటలను అందించి ఎస్పీజీ సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. నటుడు జీవా, నవీనా, హిమా, తను ప్రసాద్, భావన రుద్రరాజ్, మాదవ్, మహాలక్ష్మీ,ఽ దీరన్ త్యాగరాజన్, రవి తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి రాజా శివశంకర్ ఛాయాగ్రహణంను, టీఎస్.దివాకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్రం పలు ఆసక్తికరమైన అంశాలతో సాగుతుందన్నారు. ముఖ్యంగా కోహినూర్ వజ్రం ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఇందులో 5 పాటలు,మూడు ఫైట్స్ చోటు చేసుకుంటాయని చెప్పారు. కాగా తాను రాసిన కోహినూరు కోహినూరు అదిశయమే అంటూ సాగే పాట ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిత్ర షూటింగ్ను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటూ ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. -
సీఎస్కేతో సీయూబీ భాగస్వామ్యం
సాక్షి, చైన్నె : సిటీ యూనియన్ బ్యాంక్, ఐపీఎల్ దిగ్గజం చైన్నె సూపర్ కింగ్స్ మధ్య భాగస్వామ్యాన్ని వేడుకగా జరుపుకుంటూ అధికారిక గీతం ఆవిష్కరించారు. పట్టుదల, జట్టు కృషి , అభిరుచి వంటి ఉమ్మడి విలువలను ప్రతిబింబించేలా ఈ గీతాన్ని రూపొందించారు. ఈ గీతం బ్యాంక్ కస్టమర్లను క్రికెట్ అభిమానులను ఏకం చేసేలా తీర్చిదిద్దారు. అలాగే ఈ సహకారం ద్వారా సీఎస్కే నమ్మకమైన క్రెడిట్ కార్డ్ పార్ట్నర్గా సీయూబీ తన పాత్రను చాటుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.అ న్ని డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈ గీతాన్ని ప్రమోట్ చేయనున్నారు. అభిమానులు కూడా ఈ గీతంపై తమ సొంత వెర్షన్లను షేర్ చేయాలని బ్యాంక్ పిలుపు నిచ్చింది. గురువారం సాయంత్రం చైన్నెలో జరిగిన ఈ గీతాన్ని, క్రెడిట్ కార్డును సినీ నటుడు శివ ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా సీయూబీ, సీఎస్కే జట్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిఘానీడలో.. పుదుచ్చేరి ఓటింగ్
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓటింగ్ గురువారం నిఘా నీడలో జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత పూరిత వాతావరణంలో పోలింగ్ను అధికారులు విజయవంతం చేశారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన తమ ప్రాధమిక హక్కును వినియోగించుకున్నారు. సాక్షి, చైన్నె : 30 అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య సమరం నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఇక్కడ విజయ్ టీవీకే, సీమాన్ ఎన్టీకే అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో మొత్తం 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పుదుచ్చేరిలో మొత్తం 9,50,311 మంది ఓటర్లలో 5.03 లక్షల మంది మహిళలు, 4.4 లక్షల మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,099 ఈవీఎంలను ఉపయోగించారు.అదనంగా 364 ఈవీఎంలను ముందు జాగ్రత్తగా సిద్ధం చేసి ఉంచారు. ఈ పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 7 గంటలకు అన్నిపార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం బాక్సులకు ఉన్న సీల్స్ను తొలగించి ఎన్నికల ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి ఓటింగ్లో మహిళలు,యువత పెద్దసంఖ్యలో ఉత్సాహంగా తరలి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకు 37 శాతం, మధ్యాహ్నానికి 50 శాతం ఓటింగ్ దాటడం గమనార్హం. 3 గంటలకు 70 శాతం చేరు కోగా, సాయంత్రం 5 గంటలకు 86 శాతంగా నమోదు కావడంతో 90 శాతంకు పైగా నమోదు కావచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. కారైక్కాల్ దక్షిణం నియోజకవర్గంలో వీవీ ప్యాట్ నుంచి శబ్దం, పొగ రావడంతో కలకలం బయలు దేరింది. వెంటానే దానిని మార్చేశారు. అలాగే, రాజ్ భవన్ నియోజకవర్గంలో ఓటర్లకు సరైన ఏర్పాట్లు చేయలేదని ఎన్నికల కమిషన్పై బీజేపీ అభ్యర్థి రామలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్– ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పని పెట్టారు. నిఘా నీడలో , చెదురుముదురు ఘటనల మినహా ఎన్నికలను విజయవంతం చేశారు.నాలుగు వేల మంది ఎన్నికల సిబ్బంది, పది వేలకు పైగా పోలీసులు భద్రతా విధులను నిర్వర్తించారు. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్ అనేక పోలింగ్ బూత్లలోముగిశాయి. కొన్ని చోట్ల ఆరు గంటలలోపు వచ్చిన వారికి టోకెన్లు అందజేసి ఓటింగ్కుఅ వకాశం కల్పించారు. మొత్తానికి...... శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఓ యువకుడు తాను ఎవరికి ఓటు వేశానోనని ఫొటో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేయడం చర్చకు దారి తీసింది.ఆకట్టుకున్న ’మోడల్’ పోలింగ్ కేంద్రాలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేసింది. పుదుచ్చేరి, కారైకాల్లలో మూడు ’ప్రత్యేక గుర్తింపు’ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.వీఓసీ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చే వారికి నీల పేరిట ఓ రోబో పూలు ఇచ్చి స్వాగతం పలికే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఈ కేంద్రాలను అరటి చెట్లు, తోరణాలు , కొబ్బరి ఆకులతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఓటర్లకు మజ్జి, మందార టీ అందిస్తూ, పన్నీరు చల్లి మరీ గౌరవించారు. ఓట్లు వేసిన ప్రముఖులు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటు వేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్నాథన్ తన సతీమణితో కలిసి ఆరోగ్య శాఖడైరెక్టరేట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ముందుగా ఆయన సతీమణికి ఎన్నికల సిబ్బంది సిరా పెట్టడం మరిచినట్టు, తేరుకుని ఆ తర్వాత వేలికి సిరా పెట్టినట్టుగా ప్రచారం ఊపందుకుంది. పుదుచ్చేరి పౌరులందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ కోరారు. మిషన్ స్ట్రీట్లోని పాఠశాలలో మాజీ సీఎం నారాయణ స్వామి ఓటు వేసినానంతరం మాట్లాడుతూ, పుదుచ్చేరిలో కాంగ్రెస్–డీఎంకే కూటమికి ప్రజల మద్దతు విపరీతంగా ఉందని చెప్పారు. స్టాలిన్, రాహుల్ గాంధీ ప్రచారం ప్రజల్లో మార్పు తెచ్చిందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విల్లియనూరులో ప్రతిపక్ష నేత, డీఎంకే అభ్యర్థి శివ ఓటు వేసినానంతరం మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, స్టాలిన్ ప్రచారం పెద్దఎత్తున ప్రభావం చూపిందని వ్యాఖ్యలు చేశారు. మనవెలి బీజేపీ అభ్యర్థిగా ఉన్న స్పీకర్ ఎన్బళం సెల్వం తవళకుప్పంలో ఓటు వేశారు.రెడ్డియార్ పాళయంలో లక్ష్య జననాయగ కట్చినేత జోస్ చార్లెస్ మార్టిన్ ఓటు వేశారు. కాగా, పుదుచ్చేరి ఓటర్లను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. -
క్లుప్తంగా
రమణను గెలిపిస్తే మంత్రిని చేస్తాం తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి రమణను ఆదరిస్తే, మంత్రిగా చేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి వైగై సెల్వం అన్నారు. తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి రమణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రమణ మాట్లాడుతూ రమణను ఆదరిస్తే మంత్రిని చేస్తామని అన్నారు. ఐదేళ్ల డీఎంకే హయాంలో నిరుపేదలకు పావలా పంచి రెండింతలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచారని వాపోయారు. అన్నాడీఎంకేను విమర్శించే స్తాయి అర్హత ఉధయనిధి, కనిమెళికి లేదన్నారు. పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై టీవీకే అభ్యర్థి ప్రచారం తిరువళ్లూరు: నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, నర్సులతోపాటు మందుల కొరత లేకుండా పనిచేస్తానని టీవీకే అభ్యర్థి డాక్టర్ అరుణ్కుమార్ హామీ ఇచ్చారు. తిరువళ్లూరు నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో టీవీకే అభ్యర్థి డాక్టర్ అరుణ్కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యా స్ ధరల పెరుగుదలకు నిరసనగా గ్రామాలకు ఎడ్లబండిలో వెళ్లి ప్రచారం నిర్వహించారు. అరుణ్కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఆర్ట్స్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ వైద్యశాలలో మందు లు, డాక్టర్లు, నర్సుల కొరత లేకుండా చూడ డంతో పాటు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. నియోజకవర్గంలో అర్హత వున్న పాఠశాలలను గుర్తించి అప్గ్రేడ్ చేస్తామని, ప్రతి యూనియన్లోనూ ఫుల్టైమ్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీ నేతలు ఎండీ. మణి, ఆనంద్రాజ్, వెంకటేషన్, సుందర్ పాల్గొన్నారు. అదేవిధంగా పూండి యూనియన్లోని తిరుప్పాచ్చూర్, శిరువానూర్, కై వండూరు, కొశవన్పాళ్యం, పట్రపెరంబదూరుతోపాటు పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వన్ ప్లస్ నుంచి నార్డ్ 6 ఆవిష్కరణ సాక్షి, చైన్నె : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ తన నార్డ్ సిరీస్లో అత్యంత శక్తివంతమైన మోడల్గా వన్ ప్లస్ నార్డ్ 6 గురువారం స్థానికంగా ఆవిష్కరించింది. యువత, గేమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక ఏఐ ఫీచర్లు , తిరుగులేని బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ను రూపొందించారు. ఈ ఫోన్లో ప్రధానంగా 9 వేలు ఎంఏహెచ్ ఎస్ఐ కార్బన్ బ్యాటరీని పొందుపరిచారు. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వన్ప్లస్ నార్డ్ 6 క్విక్ సిల్వర్, ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్ రంగులలో విడుదల చేశారు. టీవీకే అభ్యర్థి బంధువు ఇంటిపై ఐటీ దాడులు కొరుక్కుపేట: తమిళనాడులో శాసనసభ ఎన్నికలు 23వ తేదీన జరగనున్నాయి. తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున జిల్లా కార్యదర్శి రాజ్కుమార్ కడలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య, సరళాదేవి సోదరుడు అయిన పుగళేంది ఇల్లు కడలూరు ఎస్ఎన్ చావడి మెట్టు వీధిలో ఉంది. అతను ఆదాయం కంటే ఎక్కువ డబ్బును అతని ఇంట్లో దాచిపెడుతున్నారని ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు అందింది. అదేవిధంగా, ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచడానికి డబ్బును దాచిపెడుతున్నారని ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కు రహస్య సమాచారం అందింది. బుధవారం రాత్రి సుమారు 7 గంటలకు, కడలూరు రెవెన్యూ కమిషనర్ శరవణన్, ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ , ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల బృందం నేతృత్వంలోని ఒక బృందం పుగళేంది ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత, వారు తలుపుకు తాళం వేసి ఇల్లంతా సోదా చేశారు. ఇంటిలోని ప్రతి అంగుళాన్ని వారు వెతికారు. అదేవిధంగా, ఆదాయపు పన్ను శాఖ అధికారులు కడలూరు బస్టాండ్ వద్ద ఉన్న పుగళేందికి చెందిన కన్వీనియన్ర్ స్టోర్లో కూడా సోదా చేశారు. ఈ సోదా రాత్రి 12.30 గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ పరిస్థితిలో, ఆదాయపు పన్ను అధికారులు గురువారం రెండో రోజు కూడా పుగళేంది ఇంటిపై సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చోరీ కేసులో ఐదుగురి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె, మనలి, బలరాం వీధి కి చెందిన జయచిత్ర (39). ఈమె ఇంటి వెను కవైపు తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న వంటగ్యాస్ సిలిండ ర్లు, మోటార్ చోరీ చేశారు. దీనిపై జయచిత్ర, ఆర్.కే నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కొరుక్కుపేట మీనాంబళ్ నగర్కు చెందిన షణ్ముగం (22), స్టీఫెన్ అలియాస్ వెంకటేశన్ (19) రాయపురం గ్రేస్ గార్డెన్ ప్రాంతానికి చెందిన జగన్ (19) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా, ఈ దొంగతనంలో సంబంధం ఉన్న 16 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు మైనర్లను కూడా పట్టుకుని విచారణ జరిపారు. వారి నుండి మోటార్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేయబడిన షణ్ముగం, స్టీఫెన్, జగన్ అనే ముగ్గురిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఇద్దరు మైనర్ల ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. -
పునర్విభజనపై తొందర పాటు ఎందుకో..?
సాక్షి, చైన్నె : నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘అనవసర తొందరపాటు‘పై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కేంద్రం ఎందుకు మాట మారుస్తోందని, దీనివల్ల అసలైన ప్రయోజనం ఎవరికి కలుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తన ’ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై గురువారం ఘాటు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యానికే విఘాతం ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని స్టాలిన్ ఆరోపించారు. చర్చలకు, జవాబుదారీతనానికి వేదికగా ఉండాల్సిన పార్లమెంటు, సభ్యుల గొంతు నొక్కేసే కేవలం ఒక ‘అలంకారప్రాయమైన సభ‘గా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తక్కువ ప్రభుత్వం – ఎక్కువ పరిపాలన‘ అని నినదించే వారే, నియోజకవర్గాల సంఖ్యను పెంచి ప్రజల పన్నుల డబ్బును వృథా చేయడమే కాకుండా పార్లమెంటు నాణ్యతను తగ్గిస్తున్నారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 24 శాతానికే పరిమితం కానుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం శిక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళనలు ముమ్మాటికీ నిజమని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై స్పష్టత: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే ప్రస్తుతమున్న నియోజకవర్గాల పరిమితిలోనే దీనిని అమలు చేయవచ్చని స్టాలిన్ సూచించారు. పునర్విభజన పేరుతో దక్షిణాది గొంతు నొక్కాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా పునర్విభజనకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారా లేక 2021 లెక్కలనా అనే విషయంలో కేంద్రానికి స్పష్టత లేదన్నారు. అలాగే ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. 2027లో జరగనున్న కుల గణన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా తొందరపడటం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యనించారు. -
‘తాంబరం’లో పాగా వేసేదెవరో..?
సాక్షి, చైన్నె : తాంబరం నియోజవర్గం డీఎంకేకు కంచుకోట.ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఏడు సార్లు విజయ ఢంకా మోగించింది. అన్నాడీఎంకే మూడు సార్లు, కాంగ్రెస్ ఓ సారి గెలిచింది. ఇక్కడ గతంలో ఎంఏ వైద్యలింగం డీఎంకే నుంచి మూడు సార్లు అసెంబ్లీకి వెళ్లారు. ఆ తదుపరి అదే పార్టీకి చెందిన ఎస్ఆర్ రాజ మూడు సార్లు అసెంబ్లీలో అడుగు పెట్టారు. నాలుగో సారిగా తనకే సీటు అన్న ధీమాతో ఉన్న ఎస్ఆర్ రాజాకు డీఎంకే అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో డాక్టర్ ఆర్ఎస్ కృత్రిక దేవిని పోటీలో పెట్టారు. ఇది ఎస్ఆర్ రాజ వర్గీయులకు మింగుడు పడటం లేదు. డీఎంకే అభ్యర్థిగా ఆ వర్గం అంతా దూరంగా ఉండటంతో వీరిని బుజ్జగించే విధంగా ఎంపీలు టీఆర్బాలు, ఏ రాజా కుస్తీలు పడుతూ వస్తున్నారు. డీఎంకేలో అసమ్మతి సెగ ఈపార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్ఆర్ రాజాకు ఈ పరిసరాలలో బలం ఎక్కువే. అయితే, ఆయనకు సీటు నిరాకరించడంతో డీఎంకేపై అంతృప్తి సెగ రాజుకుని ఉంది. కొత్త ముఖమైన డాక్టర్ కృతికా దేవి పూర్తి స్థాయిలో చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడున్న డీఎంకే బలమైన నిర్మాణం, ముస్లీం ఓట్లు కొత్త అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా ఉన్నప్పటికీ ఎస్ఆర్ రాజ రూపంలో చిక్కులు తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడున్న యువత, మధ్యతరగతి ఓటర్లను గురి పెట్టి విజయ్ టీవీకే దూసుకెళ్తుండటం గమనార్హం. చిట్లపాక్కంలో ధీమా ఈ నియోజకవర్గానికి సుపరిచితుడైన చిట్లపాక్కం రాజేంద్రన్ను అన్నాడీఎంకే అభ్యర్థిగా నిలబెట్టింది. చెంగల్పట్టు పశ్చిమ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్న రాజకీయ అనుభవజ్ఞుడు చిట్ల పాక్కం రాజేంద్రన్ డీఎంకేలోని అంతృప్తిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి చిన్నయ్య వర్గీయులు అంతా చిట్లపాక్కం వైపు చేరి ఉన్నారు. అంతే కాదు, ఇక్కడ కోకొల్లలుగా ఉన్న సమస్యలను అస్త్రంగా చేసుకుని కూటమిలోని బీజేపీ, పీఎంకే బలాన్ని కలుపుకుని ఓట్ల వేటలో గెలుపు ధీమాతో దూసుకెళ్తున్నారు. ఓట్ల చీలిక తథ్యం ఇక్కడ డీఎంకే , అన్నాడీఎంకేల మధ్య ప్రధాన సమరం నెలకొని ఉన్నప్పటికీ విజయ్ టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న శరత్కుమార్ ఓట్లను చీల్చడం ఖాయం. ఇక్కడి యువత, మధ్య తరగతి వర్గాలు, ఇతర సామాజిక వర్గం ఓట్లను గురి పెట్టి వారిని ప్రసన్నతం చేసుకోవడంలో ఉరకలు తీస్తున్నారు. ఇక నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా మహిళా ప్రొఫెసర్ ఎస్ తమిళ్ సెల్వి పోటీలో ఉన్నారు. విద్యా వంతుల ఓట్లు కలిసి వస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా ఎం. రాజా పోటీలో ఉన్నారు. వీరి రూపంలో డీఎంకే, అన్నాడీఎంకే ఓటకు భారీగానే గండిపడే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా తాజా ఎన్నికలలో ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోగట్టెక్కాల్సిందే.రాజధాని నగరం చైన్నెకు దక్షిణం దిక్కున ముఖ ద్వారంగా తాంబరం నియోజకవర్గం ఉంది. తెలుగు, తమిళం, ఇతర భాషల వారే కాదు, వివిధ సామాజిక వర్గాల సమూహంతో నిండిన తాంబరంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. డీఎంకే అభ్యర్థిగా కొత్త ముఖం డాక్టర్ ఆర్ఎస్ కృతికా దేవిని రంగంలోకి దించారు. ఇది తనకు కలిసి వచ్చిన అంశంగా అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ ఎంపీ చిట్ల పాక్కం రాజేంద్రన్ ధీమాతో ఉన్నారు. ఇక, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అభ్యర్థిగా డి శరత్కుమార్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే ) అభ్యర్థిగా తమిళ్ సెల్వి పోటీలో ఉన్నారు. సమస్యల హారం..! తాంబరంలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. ఇరుకై న రోడ్లు, అడ్డ దిడ్డంగా ఉండే పార్కింగ్ ప్రదేశాలు, మార్కెట్, రైల్వే స్టేషన్ పరిసరాలలో పాదచారుల,వాహనదారులు నిత్యం పద్మ వ్యూహాన్ని చేదించాల్సిందే. తాగు నీటి సమస్య, మురునీటి తొలగింపు అన్నది సవాలుగా ఉంటున్నది. వర్షాకాలంలో మురుగునీరు నిలిచిపోవడం, తాగునీటి పైపుల లీకేజీలు వంటి సమస్యలపై ప్రజల్లో అసహనం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపుల్లో మురుగునీరు కలుస్తున్నట్టుగా నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఫుట్పాత్లన్నీ ఆక్రమణల్లోనే ఉంటాయి. పాదచారుల నడక గగనమే. తాంబరం మున్సిపల్ కార్పొరేషన్గా మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. జీఎస్టీ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 1976లో ప్రారంభించిన ’ఈస్టర్న్ బైపాస్’ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ముడిచ్చూర్ రోడ్డు, వేళచ్చేరి రోడ్డు,,సేలయూర్ – క్యాంప్ రోడ్ మార్గాలను వెడల్పు చేయాలన్న 20 ఏళ్ల నాటి డిమాండ్ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కార్పొరేషన్గా మారిన తర్వాత పెరిగిన వ్యర్థాల నిర్వహణ , చెత్త కుప్పల తొలగింపు మున్సిపల్ యంత్రాంగానికి పెద్ద సవాలుగా మారింది.ఓటరు ఎటువైపో.. తాంబరం నియోజకవర్గంలో మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. చైన్నెకు ముఖ ద్వారంగా ఉన్న ఈ నియోజకవర్గం అతి పెద్దది. ఇక్కడ అభివృద్ధి వేగం పెరిగింది. చైన్నె మహా మహానగరం విస్తీర్ణం పెరగడంతో తాంబరం పరిసరాలు కీలకంగా మారాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 3,23,677. ఇందులో పురుషులు 1,57,580, మహిళలలు 1,66,046, ఇతరులు 51 మంది ఉన్నారు. యువత, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువగానే ఉండటంతో వీరిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, ఇతర రాష్ట్రాల వారు గణనీయంగా ఉన్నారు. -
అజిత్ కొత్త అవతారం?
తమిళసినిమా: సినిమాలో ఏదైనా జరగవచ్చు. ఎవరి ప్రయత్నం వారిది. అందులో విజయం సాధించిన వారు ఉన్నారు. దాని కోసం పోరాడుతున్న వారు ఉన్నారు. ఇక నటుడు అజిత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ స్టార్ నటుడు 63 చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఈయన ఇటీవల వరకూ నటనపైనే దృష్టి సారించారు. అలాంటిది ఇటీవల కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ ప్రపంచ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఇకపోతే ఈయన చివరిగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం కమర్శియల్గా మంచి విజయాన్ని సాధించింది. అయితే తదుపరి చిత్రం కోసం అజిత్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇందుకు కారణం ఆయన కార్ రేస్ పోటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే. కాగా అజిత్ నటించనున్న తదుపరి చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్నే దర్శకత్వం వహించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది ఎదరన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అజిత్ హీరోగా టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇంతకు ముందు విశ్వాసం చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్, అదే విధంగా అజిత్తో ఎలాగైనా చిత్రాన్ని చేయాలని చాలా కాలంగా ఆశిస్తున్న వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ లైన్లో ఉన్నాయని సమాచారం. అయితే అజిత్ పారితోషికం, చిత్ర బడ్జట్ వంటి విషయాల్లోనే ఈ సంస్ధలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో నటుడు అజిత్నే నిర్మాతగా రంగంలోకి దిగడానికి సిద్దం అవుతున్నట్లు కోలీవుడ్లో తాజాగా వైరల్ అవుతున్న ప్రచారం. ఈయన ఇప్పుటికే తాను కారు రేసుల్లో పాల్గొంటున్న దృశ్యాలతో ఒక లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తదుపరి తాను హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలవడాల్సి ఉందన్నది గమనార్హం. నటుడు అజిత్ -
నాకు నితీష్ కుమార్ పరిస్థితి పట్టదు..!
సాక్షి,చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్. రంగసామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా తనకు బిహార్ సీఎం నితీష్ కుమార్ పరిస్థితి (మిత్రపక్షాల ఒత్తిడి లేదా రాజకీయ అనిశ్చితి) ఎదురయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా తన నిరాడంబరతను మరోమారు చాటుకుంటూ.. లాజ్పేటలోని తన నివాసం నుండి పోలింగ్ కేంద్రానికి ఆయన తన పాత ద్విచక్ర వాహనం (యమహా బైక్) పై వచ్చి ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు ఆయన సేలంలోని అప్పా పైత్యం స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష ఓటు వేసిన అనంతరం మంగళం నియోజకవర్గంలోని ఓ టీకొట్టు వద్ద ప్రజలతో సరదాగా ముచ్చటించిన సీఎం రంగస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని వివరించారు. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించారని ధీమా వ్యక్తంచేశారు. ప్రచార సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తనను నిలదీయడంపై స్పందిస్తూ.. ‘తాను పనులు చేస్తాను కాబట్టే ప్రజలు ప్రశ్నిస్తున్నారని, నిలదీస్తున్నారని, అడిగేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రేషన్ దుకాణాలు తెరిచి బియ్యం, గోధుమలు ఇవ్వాలని కోరారని, అది అమల్లోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా వారి అవసరాలను దృష్టికి తెచ్చారని, కచ్చితంగా వాటిని నెరవేరుస్తాననిని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల విమర్శలపై కౌంటర్ ప్రతిపక్షాలు చేస్తున్న ‘నితీష్ కుమార్ పరిస్థితి‘ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. అలాంటి పరిస్థితి తనకు రాదని, తన నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ఉంటూ పుదుచ్చేరి అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేశామని సమాధానమిచ్చారు. మిత్ర పక్షాల నియోజకవర్గాల్లో ప్రచారం చేయకపోవడంపై స్పందిస్తూ.. సమయం తక్కువగా ఉండటం వల్లే తన సొంత పార్టీ అభ్యర్థులపై దృష్టి పెట్టానని, కూటమిలోని పెద్ద నాయకులు ఇతర చోట్ల ప్రచారం చేశారని ఆయన వివరించారు. భిన్నంగా నమశ్శివాయం వ్యాఖ్యలు రంగస్వామి వ్యాఖ్యలకు భిన్నంగా బీజేపీ నేత, హోం మంత్రి నమశ్శివాయం వ్యాఖ్యలు చేశారు. మాన్నడి పట్టులో ఓటు వేసినానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పుదుచ్చేరిలో బీజేపీ అత్యధిక స్థానాలలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధిక స్థానాలను చేజిక్కించుకున్న పక్షంలో పుదుచ్చేరికీ సీఎం ఎవరన్నది ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త పుదుచ్చేరిలో హాట్ టాపిక్గా మారాయి. -
సీఎస్గా సాయికుమార్ బాధ్యల స్వీకరణ
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ సాయికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన తన విధులపై దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందాన్ని తప్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాయికుమార్ను నియమించారు. దీంతో సచివాలయంలోని చాంబర్లో ఆయన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సాక్షి, చైన్నె : తమిళనాట నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.పార్టీలకు , స్వతంత్ర అభ్యర్థులకు చిహ్నాల కేటాయింపు పొద్దుపోయే వరకు సాగడంతో తుది జాబితాలో జాప్యం తప్పలేదు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 30 నుంచి ఈనెల 6వ తేది వరకు నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు మొత్తంగా 7,599 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 6216, మహిళలు 1380 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. పరిశీలనలో 2460 నామినేషన్లు తిరస్కరించారు. 417 నామినేషన్లు ఉపసంహరించారు. మిగిలిన 4722 మంది ఎన్నికలలో పోటీ చేయనున్నారు. అయితే తుది జాబితా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు వివిధ చిహ్నాలను కేటాయించారు. ఈ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఇంటింటా బూత్ స్లిప్పుల పంపిణికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం బీఎల్ఓల నేతృత్వంలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. గ్రీన్ పోలింగ్స్టేషన్లు, ప్రత్యేక పోలింగ్స్టేషన్ల ఏర్పాటుపై కసరత్తులు మొదలయ్యాయి. మాదిరి పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేసి, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. టీఎన్సీసీ మేనిఫెస్టో విడుదల సాక్షి, చైన్నె : తమిళనాడు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారు. ఎంపీ కార్తీ చిదంబరం నేతృత్వంలోని కమిటీ రూపకల్పన చేసిన ఈ మేనిఫెస్టోను గురువారం చైన్నెలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ , టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తదితరుల ఆవిష్కరించారు. ఇందులో డీఎంకే పేర్కొన్న అనేక అంశాలు ఉన్నప్పటికీ ,ప్రత్యేకంగా ట్యూషన్ అక్క పేరిట విద్యార్థుల కోసం ప్రత్యేక పథకం రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, విజయ్కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వెన్నంటీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు లేదని వ్యాఖ్యలు చేశారు. నేడు కారైక్కుడికి విజయ్ సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ కడలూరు ప్రచారం పుదుచ్చేరి ఎన్నికల దృష్ట్యా రద్దు చేసుకోవాల్సివ చ్చింది. దీంతో శుక్రవారం ఆయన శివగంగ జిల్లా కారైక్కుడి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కారైక్కుడిలో విజయ్ రాకతో అభిమానులు అత్యుత్సాహంతో చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తదితర వాటిపైకి ఎక్కకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. విజయ్ పర్యటించే ప్రాంతాలలో ఉన్న పై వాటికి చుట్టు రేకులతో కవచాలను ఏర్పాటు చేశారు. ఇక విజయ్ తమను అభ్యర్థిగా నిలబెట్టినా, ఎన్నికల ఖర్చుకోసం ఎదురు చూడాల్సి ఉందంటూ అనేక మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఓ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారి తీశాయి. తమ వద్ద ఖర్చులకు సైతం డబ్బులు లేవని, తమను బలవంతంగా ప్రధానకార్యదర్శిభుస్సీ ఆనంద్ ఎన్నికలలో నిలబెట్టేశారని, అయితే, ఇంత వరకు ఖర్చులకు డబ్బులు రాలేదని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జోరందుకుంది. ఖర్చులకు డబ్బులు లేని కారణంగా ఎడపాడిలో పోటీచేసిన అభ్యర్థి తాజాగా నామినేషన్ తిరస్కరణకుతో పత్తా లేకుండా పోయినట్టుగా అక్కడి టీవీకే వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,017 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,863 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. -
బై..బై స్టాలిన్, ఉదయనిధి!
సాక్షి, చైన్నె : శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి గురువారం చైన్నెలోని చేపాక్కం–ట్రిప్లికేన్, థౌజండ్ లైట్స్ తదితర నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే ప్రభుత్వం రాజకీయ కక్షతో పేదల ఆకలి తీర్చే అమ్మ క్యాంటీన్లను నిర్వీర్యం చేసిందన్నారు. పదార్థాల నాణ్యతను తగ్గించి, సిబ్బందిని తొలగించిందన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే, అమ్మ క్యాంటీన్లను బలోపేతం చేస్తామన్నారు. పేదలకు మళ్లీ నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు. డీఎంకేపై ఘాటు విమర్శలు చేపాక్కం– ట్రిప్లికేన్లో ఇక్కడి డీఎంకే అభ్యర్థి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీఎం స్టాలిన్లను పళనిస్వామి టార్గెట్ చేశారు.నీట్ రద్దు చేస్తామని, రహస్యం ఉందని చెప్పి డీఎంకే యువతను ఉదయ నిధి మోసం చేశారని విమర్శించారు. తమిళనాడులో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, డీఎంకే నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.గత అన్నాడీఎంకే పాలనతో పోలిస్తే తాజాగా నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరిగాయని పళనిస్వామి పేర్కొన్నారు.ఈ సందర్భంగా తమ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావించారు. చైన్నె అన్నాడీఎంకే కంచుకోట అని ఈసారి అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను సీఎం స్టాలిన్ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం మార్పిడి కోసం కాదు.. స్టాలిన్ కుటుంబ పాలనకు ముగింపు పలికేందుకు వచ్చిన అవకాశం అని వివరించారు.. బై బై స్టాలిన్.. బై బై ఉదయనిధి అని చెప్పే సమయం వచ్చేసిందంటూ, ప్రజల చేత ఈ నినాదాన్ని పదే పదే చెప్పించి తన ప్రసంగాన్ని ముగించారు. థౌజండ్ లైట్స్ అభ్యర్థి వలర్మతికి మద్దతుగా పళణిస్వామి ప్రచారం, చేపాక్కం,ట్రిప్లికేన్ అభ్యర్థి ఆదిరాజారామ్కు మద్దతుగా పళణి ప్రచారం -
డాక్టరేట్ ఇవ్వాలని సిఫారసు చేశా!
వేలూరు: కలైంజ్ఞర్ ఆదేశాల మేరకు ఎంజీ రామచంద్రన్కు డాక్టరేట్ అందజేసేందుకు తాను సిఫారసు చేశానని రాష్ట్ర మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని కరసమంగలంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కు ఆయన అభిమాని ఒకరు ఆలయాన్ని కట్టారు. అందులో ఎంజీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయానికి కుంభాభిషేకం చేశారు. దీంతో బుధవారం కాట్పాడి డీఎంకే అభ్యర్థి, మంత్రి దురైమురుగన్ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంజీఎర్ నన్ను చదివించడంతోపాటు తనను పెంచి పోషించారన్నారు. దీంతో అసెంబ్లీలోనూ తనను ఆయనతోపాటు పార్టీకి రావాలని మంత్రి పదవి కూడా ఇస్తానని తెలిపారు. అయినప్పటికీ తాను డీఎంకే పార్టీని వదిలి రాలేనని తేల్చి చెప్పానని చెప్పారు. ఇందుకు తనను ఆయన భుజంపై తట్టి అభినందించారన్నారు. చైన్నె యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంజీఆర్కు గౌరవ డాక్టరేట్ అందజేసేందుకు నిర్ణయించారని, తనతోపాటు డీఎంకే నిర్వాహకులు కలైంజ్ఞర్ను సంప్రదించామన్నారు. కలైంజ్ఞర్ సూచన మేరకు యూనివర్సిటీ సిండికేట్ సమావేశంలో తాను తీర్మానం పెట్టానని తెలుసుకున్న ఎంజీఆర్ తనను నేరుగా కలసి చాలా సంతోషించారన్నారు. -
హిప్హాప్ తమిళా కొత్త చిత్రం
మీసై మురుక్కు– 2 చిత్రంలో హిప్హాప్ తమిళా తమిళసినిమా: ప్రైవేట్ ఆల్బమ్ల ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయిన హిప్హాప్ తమిళా ఆ తరువాత సంగీతదర్శకుడిగా చిత్ర రంగప్రవేశం చేసి పేరు తెచ్చుకున్నారు. ఆపై హీరోగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఈయన హీరోగా నటించిన మీసై మురుక్కు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా మీసై మురుక్కు చిత్రానికి సీక్కెల్ను రూపొందిస్తున్నారు. ఇందులోనూ హిప్హాప్ తమిళా హీరోగా నటిస్తూ, కథ, కథనం, దర్శకత్వం, సంగీతం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. బ్రెన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏసీఎస్ అరుణ్కుమార్, నటి కుష్భూ సుందర్కు చెందిన అవ్నీ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో నటి కూతిక శర్మ, చైత్ర జే.ఆచార్, యోగిబాబు, కరుణాస్, హర్షద్ఖాన్, ఆడుగళం నరేన్, నాజర్, ర మ్య రంగనాథన్, షారా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. అదే విధంగా ఆరా పత్తుకు పత్తు అనే పల్లవితో సాగే పాటను విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. కాగా తాజాగా పప్పాళి పళమే అనే పల్లవితో సాగే పాటను బుధవారం విడుదల చేసినట్లు చెప్పారు. గానా వినోద్, గానా తరణి,హిప్హాప్ తమిళా కలిసి పాడిన ఈ పాట గానా స్టైల్లో సాగే ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోందన్నారు. కాగా మీసైమురుక్కు –2 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. -
డిజైనర్లతో ది బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చైన్నె చాప్టర్ నేతృత్వంలో 2026–27 సంవత్సరానికి గాన చైర్పర్సన్ గా ఎంపికై న డాక్టర్ అముల్యా రావు నేతృత్వంలో ‘ది బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై ప్రముఖ భారతీయ లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. మారుతున్న పోకడలు, బ్రాండ్ బిల్డింగ్, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఫ్యాషన్ భవిష్యత్తు గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జయంతి రెడ్డి తన ప్రసంగంలో సంప్రదాయ చేనేత కళను ఆధునిక హంగులతో మేళవించి లగ్జరీ ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర , ప్రయాణంలోని ఒడిదుడుకులను వివరించారు. నమ్మకం ఉంటే, ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. చైర్పర్సన్ డాక్టర్ అముల్య రావు మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ ఏడాది తమ లక్ష్యమని, ‘ఇన్స్పైర్, ఇన్నోవేట్, ఇంపాక్ట్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. జూలై 24, 25 తేదీలలో నయనం పేరుతో ఫిక్కీ ఎఫ్ఎల్ఓ బజార్ను నిర్వహించనుమన్నారు. ఐఐటీ మద్రాస్, అన్నా యూనివర్సిటీ వంటి సంస్థలతో కలిసి తయారీ రంగం, ఈవీ టెక్నాలజీలో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నామని ప్రకటించారు. -
డీఎంకే గెలుపునకు అధికారుల యత్నం
సాక్షి, చైన్నె: డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్నాగేంద్రన్ ఆరోపించారు. తిరునెల్వేలి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి గణేష్ రాజాకు మద్దతుగా గురువారం జరిగిన ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాలలో చర్చకు దారి తీశాయి. అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని డీఎంకే దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమిళనాడులో రెవెన్యూ, పోలీసు శాఖలు డీఎంకేకు అనుకూలంగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కుమ్మకై ్క డీఎంకేను గెలిపించడానికి విస్తృతంగా చర్యలు, ప్రయత్నాలు చేపట్టి ఉన్నాయన్నారు. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు అధికార పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారి పప్పులు ఉడకనివ్వరని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో కనిపిస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించబడ్డవేనని వివరించారు. గత ఐదేళ్లలో తమిళనాడు ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదని, ఒకవేళ అభివృద్ధి ఉంటే అది కేవలం గంజాయి విక్రయాల్లో మాత్రమే కనిపిస్తోందని ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కాగా, తిరునల్వేలిలో విజయ్ ప్రచారానికి భారీగా జనం తరలిరావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. తాను ఆ దృశ్యాలను చూడలేదని దాటవేశారు.డీఎంకేకు సొంతంగా పథకాలు లేవని, అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొడుతూ కాలం నెట్టుకు వచ్చిందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. -
అసత్యాలు ప్రచారం చేయకండి
తమిళసినిమా: మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయి ఈ మధ్యనే బెయిల్పై విడుదల అయిన సినీ నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఈ నెల 6వ తేదిన ఐటీ అధికారులు ఎన్నికల స్క్వాడ్ అధికారులు చైన్నెలోని నిర్మాత జాఫర్ సాధిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాఫర్ సాదిక్ ఐటీ అధికారులు, ఎన్నికల స్వ్కాడ్ అధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేది ఉదయం ఆరు గంటల నుంచి వేకువ జామున 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, అయితే ఎలాంటి అనధికార డబ్బు గానీ, ఇతర డాక్యుమెంట్స్ గాని లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్ళిపోయారన్నారు. తాను ఇంటిలో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదే విధంగా ఇంతకు ముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే విధంగా తాను నిర్మిస్తున్న చిత్రాల విడుదల కార్యక్రమంలో నిమగ్నమైనట్లు నిర్మాత జాఫర్ సాధిక్ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
నేడు టెట్ దరఖాస్తుకు చివరి రోజు తిరువొత్తియూరు: టెట్ దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. టెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 18న ఉపాధ్యాయ నియామక మండలి వెబ్సైట్లో ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగుస్తుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్తులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యా శాఖ అధికారులు సూచించారు. టెట్ అర్హత పరీక్ష జూలై 4, 5 తేదీల్లో జరగనుంది. నీటితొట్టెలో పడి చిన్నారి మృతి తిరువళ్లూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన తొయుదవాక్కంలో జరిగింది తిరువళ్లూరు జిల్లా తొయుధవాక్కం గ్రామానికి చెందిన సుమతి(27). ఈమెకు అదే ప్రాంతానికి చెందిన సతీష్తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరు మనస్పర్థల కారణంగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి జెస్సీకా(02) అనే కుమార్తె ఉంది. సుమతి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది. దీంతో జెస్సీకా అమ్మమ్మ వద్ద వుంటుంది. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి జెస్సిక ఆడుకుంటూ పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటితొట్టెలో పడిపోయింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు నీటితొట్టెలో పడివున్న చిన్నారిని బయటకు తీసి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అవయవదానం అన్నానగర్: ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంసభ్యులు దానం చేశారు. విల్లుపురం జిల్లాకు చెందిన సెల్వకుమార్ (23). ఇతను చైన్నెలోని కొడుంగైయూర్లో మెకానిక్. బైక్లో తన స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బుధవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అతని అవయవాలను దానం చేయడానికి కుటుంబంసభ్యులు అంగీకరించారు. బుధవారం సెల్వకుమార్ మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వేర్వేరుగా తీసుకుని, అవసరమైన వివిధ ఆస్పత్రులకు పంపించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పిడుగుపడి యువకుడి మృతి అన్నానగర్: పిడుగుపడి ఓ బాలుడు మృతిచెందాడు. కాంచీపురం తాలూకా, ఉవేరి చత్రం పంచాయతీ, పుతేరి గ్రామం, వినాయగర్ కోవిల్ వీధికి చెందిన గోపాలకష్ణన్. ఇతని కుమారుడు విశ్వనాథన్ కాంచీపురంలోని ఆండ్రసన్ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 12వ తరగతి పరీక్షలు రాశాడు. విశ్వనాథన్ బుధ వారం సాయంత్రం పొలంలో గడ్డిని సేక రించడానికి వెళ్లాడు. ఆసమయంలో ఆకా శం మేఘావృతమై వర్షం పడుతోంది. ఆసమయంలో పొలంలో గడ్డి సేకరిస్తున్న విశ్వనాథన్న్పై పిడుగు పడింది. ఈఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చుట్టుపక్కల ఉన్న వారు అతన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.55 లక్షల మోసం అన్నానగర్: రిటైర్డ్ సైనికుడి వద్ద రూ.55 లక్షలు మోసం చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. అవడి సమీపంలోని నిరంజన్నగర్కు చెందిన లక్ష్మీనరసింహన్ (60) రిటైర్డ్ ఆర్మీ సైనికుడు. ఇతను, రాణిపేట జిల్లాలోని అరక్కోణం సమీపంలో ఉన్న ఓచలం ప్రాంతంలో కొబ్బరితోటతో కూడిన 76,800 చదరపు అడుగుల భూమి అమ్మకానికి ఉందని 2023లో ఒక ప్రకటన చూశాడు. తను ప్రకటనలోని సెల్ నంబర్కు ఫోన్ చేశాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి, తన పేరు భాస్కరన్ (52), తాను మాంగాడులోని అడిసన్నగర్కు చెందినవాడినని, కుమనన్చావడి ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని నడుపుతున్నానని, చెప్పాడు. తర్వాత భాస్కర్కు రూ.55లక్షలు ఇచ్చాడు. భూమి దస్తావేజును లక్ష్మీనరసింహన్ పేరు మీద రిజిస్టర్ చేయకుండా అతడిని మోసం చేశాడు. భాస్కర్ నగదు ఇవ్వకపోవడంతో లక్ష్మీనరసింహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భాస్కర్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చైన్నె సచివాలయంలో కలకలం తిరువొత్తియూరు: చికిత్సలో నిర్లక్ష్యంగా కారణంగా తన కుమార్తెకు పాదం తొలగించడంతో మనస్తాపానికి గురైన తండ్రి చైన్నె సచివాలయంలో డీఎంకే పార్టీ జెండాకు నిప్పు పెట్టి ఆందోళన చేశాడు. వివరాలు.. చైన్నె ఆవడి పోలీసు క్వార్టర్స్కు చెందిన కోదండపాణి. చైన్నె ఓట్టేరి పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. 2021లో తన కూతురికి కిడ్నీ సమస్య రావడంతో ఎగ్మూర్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేర్చారు. అప్పుడు డాక్టర్లు నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో బాలిక పాదం తొలగించారని ఆరోపిస్తూ నాలుగేళ్లుగా కోదండపాణి వివిధ చోట్ల ఆందోళన చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై ఓట్టేరి పోలీసుస్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో తన కూతురికి న్యాయం కావాలని కోరుతూ కోదండపాణి యూనిఫాంలో సచివాలయానికి వెళ్లి డీఎంకే జెండాను కాల్చి నినాదాలు చేస్తూ నిరసన చేశారు. అక్కడున్న పోలీసులు జెండాను లాక్కున్నారు. -
దేశంలో వేరే సమస్యలే లేవా..?
సాక్షి, చైన్నె : మదురై తిరుప్పరంకుండ్రం కొండపై హిందూ భక్తులను అనుమతించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు సతీష్కుమార్, జ్యోతి రామన్ ధర్మాసనం పిటిషనర్కు రూ. 50వేలు జరిమానా విధిస్తూ కేసును కొట్టివేసింది. పిటిషన్లోని వివరాలు మదురైకి చెందిన కె.కె. రమేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించి పూజలు చేయడానికి హిందువులను అధికారులు అనుమతించడం లేదన్నారు. అయితే రంజాన్ సమయంలో ముస్లింలను కొండపైకి అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ఇది వివక్షేఅని పేర్కొంటూ, హిందువులకు కూడా అనుమతి ఇచ్చేలా అధికారులను ఆదేశించాలి కోరారు. కోర్టు ఆగ్రహం ఈ కేసు విచారణకు రాగానే న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో తిరుప్పరంకుండ్రం తప్ప వేరే సమస్యలేమీ లేవా? ఈ ఒక్క అంశంపైనే ఎన్ని కేసులు వేస్తారు? అని ప్రశ్నించారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందుకు తొలుత రూ. 10 లక్షలు ఆలయ ఖాతాలో డిపాజిట్ చేస్తేనే విచారణ జరుపుతామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదన కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గోవిందరాజన్ వాదిస్తూ.. పిటిషనర్ నిరంతరం ఇవే పనులు చేస్తున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి, కోర్టుకు భారీ నష్టం కలుగుతోందన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల ఫీజుల రూపంలో లక్షల రూపాయల ప్రజల డబ్బు వృథా అవుతోందని పేర్కొ న్నారు. ఈదృష్ట్యా, గరిష్ట స్థాయిలో జరిమానా విధించాలని కోరారు. తమిళనాడు అదనపు అడ్వకేట్ జనరల్ రవీంద్రన్ కూడా ఇదే విషయాన్ని సమర్థించారు. జరిమానా తొలుత రూ. 5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది అంత డబ్బు చెల్లించలేమని, భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు వేయబోమని ప్రాధేయపడటంతో జరిమానా మొత్తాన్ని రూ.50వేలకు తగ్గించి న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మతపరమైన సున్నితమైన అంశాలను పదే పదే కోర్టుకు తీసుకొస్తూ, న్యాయవ్యవస్థ సమ యాన్ని వృథా చేసే వారిని కట్టడి చేసేందుకే కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఆంధ్రా వాహనాలను తనిఖీ చేయాలి
వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తప్పక తనిఖీ చేసి ప్రతిరోజూ వచ్చే వాహనాల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఎన్నికల ప్రత్యేక అధికారి ప్రతాప్కుమార్సింగ్ పోలీసులను ఆదేశించారు. బుధవారం రాత్రి వేలూరు జిల్లా గుడియాత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన పరదరామి చెక్పోస్టు వద్ద ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు నుంచి నగదు, బహుమతులు తీసుకొచ్చి ఓటర్లుకు పంచే అవకాశం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనంతరం కేవీ కుప్పం, తందైపెరియార్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచే ప్రాంతాలను పరిశీలించారు. తహసీల్దార్లు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు షాక్
సాక్షి, చైన్నె : అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి గా షాక్ ఇచ్చే రీతిలో మదురై జిల్లా మేలూరుకు చెంది న కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్ పార్టీకి రాజీనామా చేసి, కొత్త రాజకీయ పార్టీని గురువారం ప్రకటించారు. డీఎంకే కూటమిలో మేలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు శ్రీనివాసన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టా నం ఆయనను కాదని కాంచీపురంకు చెందిన మాజీ ఎంపీ విశ్వనాథన్ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీనివాసన్, తొలుత తి రుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ, పార్టీ నుండి అధికారిక పత్రాలు (బి–ఫామ్) లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి న శ్రీనివాసన్’ మతతత్వ వ్యతిరేక సోషలిస్ట్ కాంగ్రెస్’(ఎంఎస్ కాంగ్రెస్) అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో పార్టీ జెండాను, గుర్తును ఆయన ఆవిష్కరించారు. మాణిక్యం ఠాగూర్పై విమర్శలు కొత్త పార్టీని ప్రకటించిన అనంతరం శ్రీనివాసన్ విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ మాణిక్యం ఠాగూర్పై విమర్శలు గుప్పించారు: మేలూరు నియోజకవర్గానికి కనీసం దరఖాస్తు కూడా చేసుకోని బయటి వ్యక్తికి మాణిక్యం ఠాగూర్ టికెట్ ఇప్పించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం ఖాయమని, మాణిక్యం ఠాగూర్ కూడా అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ఓడించడం ద్వారా సీనియర్ నేత పి. చిదంబరంను ఇబ్బంది పెట్టాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో తమిళ వెట్రి కళగం పార్టీతో కూటమి కట్టాలనేది మాణిక్యం ఠాగూర్ వ్యూహం అని శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు మద్దతు ప్రస్తుత ఎన్నికల్లో తాము అన్నాడీఎంకే అభ్యర్థి పెరియపుల్లాన్ కు మద్దతు ఇస్తున్నట్లు శ్రీనివాసన్ ప్రకటించారు. మేలూరులో కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా అన్నాడీఎంకే విజయానికి సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్ సాదిక్. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్ మిగ పెరియవన్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులు చెన్నైలో జాఫర్ సాదిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్ స్పందించారు.ఆ ప్రచారంలో నిజం లేదుఅధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.ఇంట్లో అంతే ఉందితన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. -
ఎన్టీకే అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ రోహిణి
విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి ఆధవ్ను ఆదరించేనా.. విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు. విజయకుమార్ ఎదురీత అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్ఎస్ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.హోరాహోరీ సమరం... విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.ఓటరు ఎటో ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
లీమా రోజ్ ఆస్తి రూ.1000 కోట్లు
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత ధనికులుగా కొందరు జాబితాలో చేరారు. వీరిలో నంబర్ ఒన్ కోటీశ్వరరాలుగా లీమా రోజ్ ముందంజలో ఉన్నారు. ఆమె ఆస్తి రూ. 1049 కోట్లుగా తేలింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లోని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కోటీశ్వరుల వివరాలు కొందరివి బయట పడ్డాయి. ఇందులో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో తొలి స్థానాన్ని లాల్గుడిలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ దక్కించుకున్నారు. ఆమె ఆస్తి రూ. 1,049 కోట్లు. లాటరీ కింగ్ఙ్గా పిలవబడే శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ కావడం గమనార్హం. ఈమె కేవలం 6వ తరగతి వరకే చదువుకున్నట్టు సమాచారం. ఇందులో రూ. 909 కోట్లు స్థిరాస్తులుగా ఉన్నాయి. కుటుంబ ఆస్తి అయితే, ఆమె భర్త శాంటియాగో మార్టిన్ ఆస్తుల విలువ సుమారు రూ. 4,149 కోట్లుగా పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో విజయ్ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రంలోనే భారీ ఆస్తులను ప్రకటించారు. ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి రూ. 603.20 కోట్లుగా తేలింది. వివిధ బ్యాంకుల్లో రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ7, టయోటా వెల్ఫైర్, లెక్సస్ వంటి అత్యాధునిక విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఆతదుపరి టీవీకేకు చెందిన ఆధవ్ అర్జున ఉన్నారు. ఆయన ఆస్థి రూ. 197 కోట్లు. జాబితాలో తొలి స్థానంలో ఉన్న లీమా రోజ్ కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ ఆధవ్ అర్జున కావడం గమనార్హం. ఆయన విల్లివాక్కంలో పోటీ చేస్తున్నారు. ఇక, డిప్యూటీ సీఎం ఉదయ నిధికి రూ. 20.64 కోట్లు ఆస్తులు ఉండటం విశేషం. ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కంటే ఉదయ నిధి ఆస్తులు సుమారు మూడు రెట్లు ఎక్కువ ఉండటం ఆలోచించదగిన విషయమే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆస్తి రూ. 10 కోట్లు కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆస్తి రూ. 34 కోట్లుగా పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులు కిలోల కొద్దీ వెండి, కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కన్యాకుమారి, దక్షిణ తమిళనాడు అభ్యర్థులు అనేక మంది వద్ద తమ వద్ద వందల సవరల బంగారం ఉన్నట్లు ప్రకటించి ఉండడం గమనార్హం. -
తిరుప్పరంకుండ్రం దీపం రచ్చ
సాక్షి, చైన్నె: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు సంబంధించిన దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సింగిల్ జడ్జి విచాకరణకు స్టే విధిస్తూ జస్టిస్ సతీష్ కుమార్, జస్టిస్ జ్యోతిరామన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. కేసు నేపథ్యం ఇదీ.. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ , ఆలయ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. ఈ కేసును విచారిస్తున్న సింగిల్ జడ్జి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మాసనం అభ్యంతరాలు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని సూచించారు. ఇది ఒక చిన్న సమస్య, అయితే, దీనిని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అప్పీల్ పిటిషన్పై డివిజన్ బెంచ్ ఇప్పటికే స్టే విధించిన తర్వాత, అదే అంశంపై సింగిల్ జడ్జి విచారణ కొనసాగించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్గా తరపు న్యాయవాదులు వాదిస్తూ, సదరు సింగిల్ జడ్జి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని నమూనా దీపస్తంభంపై దీపం వెలిగించారని, కాబట్టి ఆయన ఈ కేసును విచారించడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు తీర్పు కోర్టులో గధమాయించే విధంగా వ్యవహరిస్తూ న్యాయస్థానాన్ని భయపెట్టేలా ఎవ్వరూ మాట్లాడకూడదంటూ.. ఈ కేసులో చట్టప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన అన్ని ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు. -
పళణి సుడిగాలి ప్రచారం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి బుధవారం చైన్నెలో ఆగమేఘాలపై ప్రచారంలో దూసుకెళ్లారు. టీనగర్, సైదా పేట,విరుగంబాక్కం, అన్నానగర్, విల్లివాక్కం, తదితర నియోజకవర్గాలలో విస్తృతంగాపర్యటించారు. తమ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రజల్ని కలిసి ఓట్ల వేటలో పడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో దూసుకెళ్లిన ఆయన అక్కడక్కడ కూడళ్లలో ప్రసంగించారు. డీఎంకేపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అవినీతికుటుంబ పాలన అంతం లక్ష్యంగా అన్నాడీఎంకే అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అలాగే,సైదా పేటలో మిత్ర పక్షం అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థి సెంతమిళన్కు మద్దతుగా కుక్కర్ చిహ్నంలో ఓటు వేయాలని కోరారు. మిగిలిన చోట్ల తమ అభ్యర్థులకు రెండాకు చిహ్నంలో ఓట్లు వేసి గెలిపించాలని విన్నవించారు. -
క్లుప్తంగా
పేరు మార్పు తథ్యం అధికారుల తనిఖీలు కొరుక్కుపేట: తమిళనాడులో 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకుల ప్రచారం ముమ్మరం అయ్యింది. ఈ పరిస్థితిలో ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతోందా? లేదా? అని పర్యవేక్షించడానికి తమిళనాడు వ్యాప్తంగా ప్రత్యేక ముమ్మర నిఘా కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయి. నెల్లై జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ప్లయింగ్ స్వ్కాడ్లు, స్థిర నిఘా బృందాలు 24 గంటల పాటు రొటేటింగ్ పద్ధతిలో ముమ్మర నిఘా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంలో పాళయం కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పెరుమాల్ పురంలోని ఒక ప్రైవేటు అపార్టుమెంట్లో రూ.200 కోట్లు దాచి పెట్టారని బుధవారం ఉదయం ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. అనంతరం నెల్లై, మదురైకి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ప్లయింగ్ స్వ్కాడ్లు అధికారులతో కలిసి ఆ ప్రైవేటు అపార్టుమెంట్లో సోదాలు చేయడం గందరగోళం చెలరేగింది. కొరుక్కుపేట: మహాబలిపురంలో పురావస్తు ప్రదేశాలను సందర్శించేందుకు వేలాదిమంది తరలి వస్తున్నారు. ఈక్రమంలో అక్కడ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆ ప్రాంతంలో ప్రైవేటు గార్డులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. కొందరు పరావస్తు శాఖ అనుమతి లేకుండా, పురాతన కట్టడాల నేపథ్యంలో ఫొటో షూట్ రీళ్లు, ఆల్భమ్ల వంటి వాణిజ్య డిజిటల్ షూటింగ్లను నిర్వహించడానికి కెమెరాలను, లైట్లను రహస్యంగా తరలిస్తున్నారు. డిజిటల్ పరికరాలు, పేలుడు పదార్థాలను తీసుకు వెళ్లడాన్ని నివారించడానికి పురావస్తుశాఖ బీచ్ ఆలయ ప్రవేశ మార్గంలో ప్రాథమిక తనిఖీ నిర్వహిస్తోంది. భద్రత కోసం మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేశామని, అదనపు బద్రత, నిఘాను కూడా పెంచామని అధికారులు తెలిపారు. సాక్షి,చైన్నె: త్వరలో అన్నాడీఎంకే పేరును అమిత్ షా డీఎంకేగా మార్చడం తథ్యమని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత కనిమొళి ఎద్దేవా చేశారు. బుధవారం తిరువణ్ణామలై, వేలూరు పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలో ఆమె ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించి ప్రజలతో మమేకం అయ్యే విధంగా ముందుకెళ్లారు.ఈసందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. అన్నా డీఎంకే తన అస్తిత్వాన్ని కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ తాజాగా అమిత్ షా డీఎంకేగా మారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. త్వరలో ఆపార్టీ పేరును పూర్తిగా మార్చేడం ఖాయం అని చమత్కారాలు సందించారు. తిరువొత్తియూరు: నెల్లై జిల్లా వీరనల్లూరు బజార్లో వీరవ నల్లూరుకు చెందిన అసనార్ (63) నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఎప్పటి లాగే దుకాణం ఉద్యోగులు దుకాణాన్ని మూసివేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం దుకాణాన్ని తెరచి చూడగా బంగారం, వెండి నగలు కిలో కొద్దీ చోరీ జరిగి ఉన్నట్టు తెలిసింది. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు వెళ్లి చూడగా దుకాణం వెనుక గోడలో రంధ్రం వేయబడి ఉంది. దొంగల ముఠాను పట్టుకోవడానికి వీరవ నల్లూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు అర కిలో బంగారం, 3 కిలోల వెండి నగలు దోచుకెళ్లారు. వీటి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్య అన్నానగర్: ఇంట్లో ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైన్నెలోని మూర్తింగర్నగర్, వ్యాసార్పాడిలోని ప్రభుత్వ అపార్టుమెంట్ కాంప్లెక్స్లో నివసిస్తున్న దేవి (38). ఈమె తన భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె పెద్ద కుమారుడు మోనిష్రాజ్ (20). చైన్నెలోని ఒక పాలిటెక్నిక్ కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం దేవి ఎప్పటిలాగే పనికి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపు లోపలి నుంచి తాళం వేసి ఉంది. చాలాసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో మోనిష్రాజ్ తన గదిలో చీరతో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చైన్నెలోని స్టాన్లీ ఆస్పత్రిలో అతడిని పరీక్షించిన వైద్యులు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. ఎంకేపీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
నిజమైన కాంగ్రెస్వాదులు నా వెంటే!
సాక్షి, చైన్నె : నిజమైన కాంగ్రెస్ వాదులు, నాయకు లు తన వెన్నంటే ఉన్నారని టీవీకే అధినేత విజయ్ వ్యాఖ్యానించారు. డీఎంకే, బీజేపీకి తనపై ఎందుకు అంత కసీ, కోపం అన్నది అర్థం కావడం లేదన్నారు. కాగా తిరునల్వేలిలో బుధవారం విజయ్ రోడ్ షోకు అపూర్వ ఆదరణ లభించింది. అడుగడుగున అభిమానులు దళపతి ..దళపతి, సీఎం...సీఎం అన్న నినాదాలు మార్మోగిస్తూ బ్రహ్మరథం పట్టారు. వివరాలు.. తిరునల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాలోని నియోజకవర్గాలలో పోటీచేస్తున్న తన అభ్యర్థులకు మద్దతుగా టీవీకే అధినేత విజయ్ బుధవారం పర్యటించారు. తిరునల్వేలిలో తొలుత ఆయన రోడ్ షోకు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. అభిమానులు నీరాజనాలు పలుకుతూబ్రహ్మరథం పట్టారు. విజయ్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయన కాన్వాయ్ వెంబడి ద్విచక్ర వాహనాలలో దూసుకొచ్చారు. ఈ సమయంలో చోటు చేసుకున్న ప్రమాదాలలో 18 మంది వేర్వేరు చోట్ల గాయపడ్డారు. వీరికి ఆయా ప్రాంతాలలోని ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు నా వెంటే రోడ్ షో అనంతరం జరిగిన ప్రచార బహిరంగ సభలో విజయ్ ప్రసంగిస్తూ కొందరు కోట్లు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ను తమ జేబుల్లో పెట్టుకుని ఉన్నారని,అ యితే, నిజమైన , సిద్ధాంత పరమైన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ వాదులు, కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ చేతిలో పూర్తి అధికారం లేదని, ఒకవేళ ఆయనకు పూర్తి పవర్ ఉండి ఉంటే తన సభ జరగకుండా ఏదో ఒక అడ్డంకులు సృష్టించిఉండే వారని ధ్వజమెత్తారు. అధికారం లేని ముఖ్యమంత్రిగా ఉన్నందు వల్లే తాను సులభంగా ప్రజల వద్దకు రాగలిగానని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే – బీజేపీ బంధం డీఎంకే, బీజేపీ కూటములు బయటకి విడివిడిగా ఉన్నట్లు కనిపించినా, లోపల మాత్రం ఆ రెండు ఒక్కటే అని ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి రాకూడదని, ప్రజలకు మంచి చేయకూడదనేది వారిద్దరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి డీఎంకే ప్రభుత్వ అవినీతి చిట్టాను బయటపెడుతున్నానని, అందుకే తనపై వారు తీవ్ర కోపంతో ఉన్నారని విజయ్ తెలిపారు. ప్రజలు ఇప్పటికే మార్పు కోరుకుంటున్నారని, రాబోయే కాలంలో డీఎంకే అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజల ముందు ఉంచుతున్నానంటూ తీవ్ర ఉద్వేగంతో ఇటీవల కాలంగా జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. ప్రజలే నా బలం 30–33 ఏళ్లుగా తాను ప్రతి ఇంటిలో ఒకడిగా మారినట్టు పేర్కొన్నారు. పార్టీ పెట్టిన తర్వాత తాను ప్రజల వద్దకు వెళ్లలేదని పేర్కొంటూ, ప్రతి ఇంటి గడప తొక్కిన తర్వాతే తాను పార్టీ పెట్టానన్న విషయాన్ని వ్యతిరేక శక్తులు గుర్తించాలని హితవు పలికారు. ప్రజలతో తనది రాజకీయ బంధం కాదని, జన్మజన్మల బంధం అని ఉగ్వేగంగా వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థులు ఎవరూ అంబానీలు, అదానీలు కాదని.. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారని విజయ్ తెలిపారు. 234 నియోజకవర్గాల్లోనూ ఈ విజయ్నే అభ్యర్థి అని భావించాలని పిలుపునిచ్చారు. అధికారం అప్పగిస్తే ప్రజల సొమ్ము నుంచి ఒక్క పైసా కూడా నేను ముట్టుకోనని, ప్రజలకు అన్యాయం జరగనివ్వననంటూ ఆమేరకు అద్బుత పాలన అందిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఐదేళ్ల మార్పు కోసం కాదని, 50 ఏళ్లకోసారి వచ్చే అద్భుతమైన అవకాశమని, దీనిని వదులుకోవద్దని విజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీవీకే అధికారంలోకి వస్తే మహిళలు, యువత, రైతులు , మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తూత్తుకుడి,కన్యాకుమారి జిల్లాలో విజయ్ పర్యటన అభిమాన జన సాగరం నడుమ జరిగింది. ఇక, శుక్రవారం విజయ్ కడలూరులో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ప్రచార ఏర్పాట్లకు పోలీసులు 16 షరతులను విధించారు. సభకు తరలి వచ్చిన అభిమాన లోకం రోడ్ షోలో విజయ్కు బ్రహ్మరథం గల్లా పెట్టె కూటమి డీఎంకేది కకా వికలమైన గల్లా పెట్టే కూటమి (డబ్బుల పెట్టే) కూటమి అని పేర్కొంటూ, కొల్ల గొట్టిన సొమ్ముతో ఏర్పడిన ఈ కూటమి తాజాగా ముక్కలై పోయి ఉందన్నారు. ఈ కూటమిలోని పార్టీలు ఒకరికొకరు ఓట్లు వేసుకునే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. డీఎంకే, బీజేపీలకు తనపై ఎందుకంత కసి? దానికి కారణం వారి ఇంట్లోనే ఇప్పుడు ’విజిల్’ శబ్ధం బలంగా వినిపిస్తుండటమే అని విజయ్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ కొన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ను తన జేబులో వేసుకున్నారని, కానీ నిజమైన కాంగ్రెస్ వాదులు తన పక్కనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తనను దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని విజయ్ ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలని అడ్డుకోవడానికి ’జననాయగన్న్’ సినిమాను ముంచేయాలని చూశారని మండిపడ్డారు. ప్రచారం విషయంలో తన కోసం మాత్రమే ప్రత్యేక నిబంధనలు పెట్టి, ప్రజలను కలవకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు సరిగ్గా 30 రోజుల ముందు తన చుట్టూ ఉన్నవారిపై తప్పుడు ప్రచారాలు చూస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆదరించండి.. మరింత అబివృద్ధి చేస్తాం..!
తిరువళ్లూరు: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన డీఎంకే ప్రభుత్వాన్ని రెండవ సారి ఆదరిస్తే ప్రతి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉధయనిధిస్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్, ఆవడి అభ్యర్థి మంత్రి నాజర్, పూందమల్లి అభ్యర్థి కృష్ణస్వామికి మద్దతుగా ఉధయనిధి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉధయనిది మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు వివరించారు. ప్రజల ధీవెనలతో మళ్లీ అధికారంలోకి వస్తే వున్న పథకాలను కొనసాగించడంతో పాటూ మరిన్ని పఽథకాలను అమలు చేస్తామన్నారు. ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే వున్న క్రమంలో డీఎంకే కూటమి నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ఓట్లును సేకరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ద్వారా రోజుకు 20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసిన ఆయన, 31 లక్షల మంది మహిళల ఖాతాలో ప్రతి నెలా వెయ్యి రూపాయలను జమ చేస్తున్నట్టు వివరించారు. రానున్న ఎన్నికలు తమిళనాడు జట్టుకు ఢిల్లీ జట్టు మద్య జరుగుతున్న పోరుగా ఆయన వివరించారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలోని మైనారీటి అభద్రతభావానికి గురి కావడంతో పాటూ జాతీయ ఉపాధీ హమీ పనులు సైతం రద్దు అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దినకరన్ ప్రచారం గత ఎన్నికల్లో దొంగ ఓట్లుతోనే డీఎంకే గెలించిదని అందువల్లే ఎస్ఐఆర్ సవరణకు డీఎంకే అడ్డుపడిందని ఎఎంఎంకే అధినేత టిటివీ ధినకరన్ ఆరోపించారు. పూందమల్లి అన్నాడిఎంకే కూటమి అభ్యర్ది ఏలుమలైకు మద్దతుగా పూందమల్లి, తిరుమళిసై, సెవ్వాపేట, తామరపాక్కం తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. -
చైన్నెలో 5జీ సేవలకు శ్రీకారం
సాక్షి, చైన్నె: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘వి’ (వోడాఫోన్ ఐడియా) చైన్నెలో తన హై–స్పీడ్ 5జీ సేవలకు బుధవారం అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఈమేరకు చైన్నెలో జరిగిన తమిళనాడు రీజియన్ బిజినెస్ హెడ్ సాయి వెంకట్రామన్ 5జీ సేవలకు ప్రారంభించారు. అలాగే, చైన్నె సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ అనుభూతిని అందించే లక్ష్యంతో, ఇప్పటికే ఉన్న 50 నగరాలకు అదనంగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చైన్నె వంటి మెట్రో నగరాలలో తాజాగా 5జీ సేవ లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా మే నెల తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుచ్చి, సేలం, తిరుపూర్, వేలూరు పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని వివరించారు. అలాగే, తమిళనాడు వినియోగదారులను ఆకట్టుకునేందు కు, చైన్నె సూపర్ కింగ్స్ జట్టుకు రాబోయే మూడు సీజన్లకు అధికారిక కమ్యూనికేషన్ పార్టనర్గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి అంతటా 5జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే మదురైలో తమ సేవలు అందుబాటు లో ఉండగా, తాజాగా చైన్నెలో ప్రారంభించామన్నారు. అన్లిమిటెడ్ డేటా ప్లాన్లతో విని యోగ దారులకు సరికొత్త అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. -
రైలు కిందపడి యువతి ఆత్మహత్య
–రక్షించే ప్రయత్నంలో మరో వ్యక్తి దుర్మరణం అన్నానగర్: రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన యువతిని రక్షించే క్రమంలో ఓ వ్యక్తి, యువతి ఇద్దరు దుర్మరణం చెందారు. మరైమలై నగర్లోని సింగపెరుమాల్ ఆలయం సమీపంలో ఉన్న తాలి మంగళం గ్రామానికి చెందిన ఇళంగోవన్ (53). ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను బుధవారం ఉదయం మరైమలై నగర్ రైల్వేస్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో 30 ఏళ్ల ఓ యువతి రైలు పట్టాల దగ్గర నిలబడి ఉంది. చైన్నె–ఎగ్మూర్ వైపు వెళుతున్న తిరుచెందూరు ఎక్స్ప్రెస్ రైలుకు ఎదురుగా పరుగులు తీసింది. ఇది చూసిన ఇళంగోవన్, ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె వద్దకు పరుగులు తీశాడు. రైలు వారిద్దరినీ ఢీకొంది. వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న తాంబరం రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో మృతులిద్దరికీ ఒకరి కొకరు పరిచయం లేదని తెలిసింది. యువతి రైలు ఎదురుగా వెళ్లడం చూసి ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి కూడా మృతిచెందాడు. తిరువళ్లూరు: చెరుకు రైతులకు ప్రధాన ఆధారంగా వున్న తిరువేలాంగాడు షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నాడీఎంకే తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ స్థానిక రైతులకు హమీ ఇచ్చారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో తిరువేలాంగాడు, వ్యాసాపురం, పళయనూర్తో పాటూ పలు గ్రామాల్లో రమణ విసృతంగా ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో పాటూ రైతులకు అండగా వుంటానని హమీ ఇచ్చారు. తిరువేలాంగాడు షుగర్ ప్యాక్టరి ఆధునీకరణకు కృషి చేయడంతో పాటూ వరి రైతులను కోసం అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామనీ హమీ ఇచ్చారు. యువతకు శిక్షణతో కూడిన ఉపాధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. విల్లివాక్కంలో గొరిల్లా సాక్షి, చైన్నె : చైన్నెలోని విల్లివాక్కం నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా సాగింది. ఓటర్లను ఆకర్షించడానికి ఒక కార్యకర్త గొరిల్లా వేషం వేసుకుని రోడ్లపై పరుగులు తీస్తూ, ప్రజల వద్దకు వెళ్తూ ఓట్లు అభ్యర్థించాడు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఈ వింత వేషధారణను చూసి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. బైక్లపై వెళ్లేవారిని ఆపి మరీ ఆయన చేసిన చేష్టలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
డిజిటల్ నైపుణ్యాలతో ఉపాధి బాట
– 5 వేల మందికి శిక్షణ సాక్షి, చైన్నె: శామ్సంగ్ ఇన్నోవేషన్ క్యాంపస్లో 5 వేల మంది విద్యార్థులకు విజయవంతంగా సాంకేతిక శిక్ష ణ అందించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శామ్సంగ్ సౌత్వెస్ట్ ఆసియా సీఎస్ఆర్ హెడ్ శుభమ్ ముఖర్జీ వివరించారు. అత్యధిక డిమాండ్ ఉన్న భవిష్యత్తు సాంకేతికతలపై విద్యార్థుల కు శిక్షణ ఇచ్చారు. ఈ మేరకుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో2,200 మందికి, కోడింగ్, ప్రోగ్రామింగ్లో 1,700 మంది, బిగ్ డేటాలో 600 మందికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో 500 మంది విజయవంతంగా శిక్షణ పూ ర్తి చేసి బుధవారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.సాంకేతిక నైపుణ్యాలతో పాటూ విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, కార్యాల య సంసిద్ధతను పెంపొందించేందుకు సాఫ్ట్ స్కిల్స్ మాడ్యూల్స్పై కూడా దృష్టి సారించారు. తమిళనాడు లో ఈ శిక్షణ పొందిన వారిలో 71శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని సూచిస్తోంది. మద్రాస్ యూనివర్సి టీ, అన్నా యూనివర్సిటీ, క్వీన్ మేరీస్ కాలేజ్, మ హ్మద్ సతక్ ఏజే ఇంజినీరింగ్ కాలేజ్ , కోయంబత్తూరులోని కెపిఆర్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేశామన్నారు. -
‘సీఎస్’పై వేటు!
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంపై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంను కూడా మార్చేశారు. మురుగానందం స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయికుమార్ను సీఎస్గా నియమించారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల పర్వం వేగం పుంజుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న వెంకట్రామన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పించింది. ఆయన స్థానంలో డీజీపీగా సందీప్ రాయ్ రాథోర్ నియమితులయ్యారు. టీవీకే విజయ్కు ప్రచారం విషయంలో అనుమతుల మంజూరులో జాప్యం వెనుక సచివాలయం నుంచి లాబీయింగ్ సాగుతున్నట్టుగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేరినట్టు సమాచారం. ఈ పరిస్థితులలో డీజీపీ సందీప్ రాయ్ రాథోర్ ఓ ప్రకటన చేశారు. సంబంధం లేని అధికారులు ఆదేశాలను అనుసరించ వద్దని, ప్రొట్రోకాల్ ప్రకారం అధికారులు ఇచ్చే ఉత్తర్వులు, ఆదేశాలు, సూచనలను అనుసరించాలని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, ఐజీ, డీఐజీలకు హుకుం జారీ చేశారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంను తప్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. కాషాయం ముసుగులో సీఈసీ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీజీపీ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అయితే, ప్రపథమంగా సీఎస్ను మార్చుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం కాషాయం రంగు పూసుకున్నట్టు స్పష్టం అవుతోందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా బిజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నదని, తాజా సుప్రీంకోర్టు ఆదేశాలు, ఉత్తర్వులను ఉల్లంఘించి సైతం సీఎస్ను మార్చడం బట్టి చూస్తే, ఎన్నికల కమిషన్ కేంద్రం పెద్దల గుప్పెట్లో పావుగా మారి ఉందన్నారు. కేంద్రం దర్బారులో ఒకటిగా మారిన ఎన్నికల కమిషన్ ద్వారా తమిళనాడులో అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు పన్నుతున్న వూహాలన్నింటిని ఓటు అనే ఆయుధంతో ప్రజలే చిన్నా భిన్నం చేస్తారన్నారు. సీఎస్గా సాయికుమార్ మురుగానందం స్థానంలో సీనియర్ ఐఏఎస్ సాయికుమార్ను నియమిస్తూ, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాలన్న ఆదేశాలు ఢిల్లీ నుంచి రావడం గమనార్హం. 1990 ఐఎఎస్ బ్యాచ్కు చెందిన సాయికుమార్ రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న డేవిడ్సన్ దేవాశీర్వాదంను సైతం తప్పించారు. ఆయన బాధ్యతలను ఎవ్వరికి అప్పగించక పోగా, ఆర్మ్డ్ పోలీసు, విజిలెన్స్ అండ యాంటీ కరెప్షన్ విభాగం డీజీపీగా సందీప్ మిట్టల్ను నియమించారు. -
అంతర్జాతీయ శిక్షణకు మార్గం సుగుమం
సాక్షి, చైన్నె: విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ మార్గాన్ని సుగమం చేస్తూ మలేషియా వర్సిటీతో చైన్నె అమృత ఏవియేషన్ కాలేజీకి సంబంధించిన కీలక ఒప్పందంచేసుకుంది. బుధవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందాలపై చైన్నె అమృత చైర్మన్ భూమినాథన్, మలేషియా వర్సిటీ డీన్ అబ్దుల్లా అన్వర్లు సంతకాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, మలేషియాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ జరిగిన ఈ ఒప్పందంతో వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు వివరించారు. ఈ ఒప్పందం ద్వారా విమానయాన రంగంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేరుగా తన విద్యార్థులకు అందించే మార్గం సుగమమైనట్టు తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా చైన్నెలో నాలుగు రోజుల అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని గుర్తు చేవారు. ఇందులో ఏవియేషన్ 4.ఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , విమానాశ్రయ నిర్వహణ, అత్యాధునిక సాంకేతికతలపై చర్చించామన్నారు. అలాగే, ఏవియేషన్లో బ్యాచిలర్ డిగ్రీ (3 ఏళ్లు), బీఎస్సీ ఎయిర్ ట్రానన్స్పోర్ట్ , డిప్లొమా ఇన్ ఏవియేషన్ టూరిజం కోర్సులను అందిస్తామని వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం, విద్యార్థులు మొదటి రెండేళ్లు చైన్నె క్యాంపస్లో చదువుతారని, . చివరి సంవత్సరంలో ఆరు నెలల పాటు మలేషియాలో శిక్షణ పొందుతారని ప్రకటించారు.ఏవియేషన్ రంగంలో అత్యంత విలువైన ఐఏటీఏ సర్టిఫికేషన్ కోసం చైన్నె అమృతలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. -
ఆధారాలు లేకుండా కేసు ఎలా?
● సీఎం కార్యదర్శి కేసులో హైకోర్టు ప్రశ్న సాక్షి, చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కార్యదర్శిగా ఉన్న ఉమానాథ్ ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై చైన్నె హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి చెందిన న్యాయవాది మోహన్ దాస్ ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, ఉమానాథ్ కలెక్టర్లకు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు చేసేటప్పుడు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఎలా విచారణకు స్వీకరించగలమని ప్రశ్నించారు. పిటిషనర్ పేర్కొన్న ఉమానాథ్ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చకపోవడాన్ని కూడా న్యాయమూర్తులు తప్పుబట్టారు. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు, ఉమానాథ్ను ప్రతివాదిగా చేర్చడానికి సమయం ఇస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. తమిళ నూతన సంవత్సర సెలవులు తిరువొత్తియూరు: వారాంతపు సెలవులతో పాటూ వచ్చే 14వ తేదీ తమిళ నూతన సంవత్సర సెలవు కూడా వస్తుండడంతో బయటి ఊళ్లకు ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ రవాణా సంస్థల తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సాధారణంగా నడిపే ప్రభుత్వ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేకబస్సులు నడపడానికి ప్రణాళిక రూపొందించారు. కిళాంబాక్కం నుండి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్కోవిల్, కన్యాకుమారి, తూత్తుకుడి, తదితర ప్రదేశాలకు 10 , 11వ తేదీలలో 970 ప్రత్యేకబస్సులు కోయంబేడు నుండి తిరువణ్ణామలై, నాగపట్టిణం, వేలాంకన్ని, హోసూరు, బెంగుళూరు వంటి ప్రదేశాలకు 190 బస్సులు, మాధవరం నుండి 24 బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీకి అన్నామలై! సాక్షి, చైన్నె :ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బుధవారం ఉదయాన్నే హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం నుంచి వచ్చి పిలుపుతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో ఆయన భేటీ అయ్యారు. తమిళనాడులో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో పలువురు అధికారులను బదిలీ చేయించే దిశగా ఓ జాబితాను తమ పెద్దలకు అన్నామలై ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. -
ఫేస్ పెయింటింగ్తో అవగాహన
కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమం శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగింది. విద్యార్థులలో ఓటు హక్కు, ప్రాముఖ్యతను తెలియచేయడానికి వినూత్నమైన, ఆసక్తికరమైన ఫేస్ పెయింటింగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. బుధవారం విద్యార్థినులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఓటు విలువైనదే మీ ఓటు మీ గళం బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండండి వంటి బలమైన సందేశాలను తెలియచేస్తూ తమ ముఖాలపై సృజనాత్మకమైన డిజైన్లను, నినాదాలను చిత్రించుకుని ఆకట్టుకున్నారు. ఎన్నికలలో చురుకై న భాగస్వా మ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనజ తెలిపారు. -
నేడే పోలింగ్
పుదుచ్చేరిలోకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గురువారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్ నిమిత్తం ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు, కంట్రోల్ పానల్స్ ఆయా పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రానికి చేరుకున్నాయి. ఎన్నికల నిమిత్తం అన్ని చోట్లా భద్రతను కట్దుదిట్టం చేశారు.సాక్షి, చైన్నె: ముప్పై అసెంబ్లీ స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల సమరం తారా స్థాయికి చేరింది. ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే, లక్ష్య జననాయగ కట్చిలతో ఎన్డీఏ కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ను గద్దె దించడమే లక్ష్యంగా వైద్యలింగం నేతృత్వంలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకేతో కూడిన ఇండియా కూటమి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. ఇక విజయ్ టీవీకే, సీమాన్ నామ్ తమిళర్ కట్చి వేర్వేరుగా ఎన్నికల్లో నిలిచాయి. చతర్ముఖ సమరంగా ఇక్కడ ఎన్నికల ప్రచార రేసు సాగింది. మంగళవారంతో ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలలో మొత్తం 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో జాతీయ పార్టీల నుండి 34 మంది, ప్రాంతీయ పార్టీల నుండి 63 మంది, రిజిస్టర్డ్ పార్టీల నుండి 80 మంది, 117 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత కట్టుదిట్టం పుదుచ్చేరిలోని ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీ, మోతీలాల్ నెహ్రూ పాలిటెక్నిక్ వంటి ప్రాంతాలలోని స్ట్రాంగ్ రూమ్ల నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు , వీవీప్యాట్ యంత్రాలను అధికారులు ఉదయాన్నే బయటకు తీశారు. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా తుపాకీ పహారా నడుమ ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే పనులు చేపట్టారు. 1,099 పోలింగ్ కేంద్రాలకు ఆ సంఖ్యకు తగినట్టుగా ఈవీఎం, వీవీప్యాట్, కంట్రోల్ పానల్స్ను పంపించారు. అదనంగా అత్యవసర పరిస్థితుల కోసం 364 ఈవీఎంలను సిద్ధంగా ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కెమెరాలను అమర్చి, కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు మూడంచెల భద్రతను చేపట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ వేడిమి దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేసి, వాటి కింద కుర్చీలను ఉంచారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు కట్టుదిట్టమైన కట్టుబాట్లు విధించారు. పాస్లు ఉన్న వారినేలోనికి అనుమతించనున్నారు. ఆయా పార్టీల ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. నగదు బట్వాడాపై నిఘా కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేపట్టారు. నగదు పంచుతున్న ఐదుగుర్ని అరెస్టు చేశారు. కాగా, ఎండ వేడిఅధికంగా ఉన్న దృష్ట్యా,చిన్న పిల్లలను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావద్దు అని ఓటర్లకు ఎన్నికల అధికారులు విన్నవించారు. ఓటింగ్ దృష్ట్యా గురువారం పుదుచ్చేరి, యానాం, మాగే, కారైక్కాలు మాగాణాల సైతం సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రిలో ఓపీ సేవలను రద్దు చేశారు.ఓటింగ్కు సన్నద్దం: పుదుచ్చేరిలో మొత్తం 9,50,311 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.03 లక్షల మంది మహిళలు, 4.4 లక్షల మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనున్నది. ఈ ఓటింగ్ నిమిత్తం ఈవీఎంలు,వీవీ ప్యాడ్, కంట్రోల్ పానల్స్ను ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్కేంద్రాలకు చేర్చారు. అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఎన్నికల విధులలో 4 వేల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. -
పోలింగ్పై అవగాహన పెంచేందుకు క్రీడా పోటీలు
వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్కు కోసం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా వేలూరు జిలాల గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామ సమీపంలో మారథాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ సుబ్బలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 200 మంది కలుసుకున్నారు. అనంతరం మారథాన్ పోటీలు గుడియాత్తం బస్టాండ్ వరకు సుమారు ఐదు కిలో మీటరు దూరం వరకు పోటీలు జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు వేర్వేరుగా కలెక్టర్ బహుమతులను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వందశాతం పోలింగ్ కావాలని ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం క్రీడాపాధికార సంస్థ, మహిళా సమాఖ్య సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించి అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం శిశు సంక్షేమ శాఖ అద్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలచే గుడియాత్తం సమీపంలోని పాక్కం గ్రామం వద్ద వందశాతం పోలింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. -
మంచి సక్సెస్తో మళ్లీ వస్తా..!
తమిళసినిమా: డ్రాగన్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అస్సామీ భామ కయాదు లోహర్. ఆ చిత్రం అనూహ్య విజయంతో ఈమె పేరు సినీ వర్గాల్లో మారుమోగింది. అంతే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. మలయాళం, తెలుగు, కన్నడం, మరాఠి భాషల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగులో నటించిన ఫంకీ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే మలయాళంలో నటించిన పళ్లిచటంబి చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా పలు భాషల్లో చుట్టేస్తున్న కయదు లోహర్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తమిళంలో స్పష్టంగా మాట్లాడటం లేదే అని అడుగుతున్నారనీ, ఇప్పుడే ఒక్కో భాషల్లో చిత్రాలు చేస్తున్నానని, అయితే తాను దక్షిణాదికి చెందిన అమ్మాయిని కాదని అన్నారు. అయినా తనవల్ల అయినంత వరకూ ఒక్కో భాషను నేర్చుకోవడానికి యత్నిస్తున్నానని అన్నారు. ఏ భాషలో నటించినా, ఆ భాషలో మాట్లాడటమే ముఖ్యం అన్నారు. అందుకే ఇతర భాషలను నేర్చుకోవడానికి నూరు శాతం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కొంచెం సమయం ఇవ్వండి తమిళం, మలయాళం తదితర దక్షిణాది భాషల్లో సరళంగా మాట్లాడతానన్నారు. డ్రాగన్ చిత్రం తరువాత కోలీవుడ్లో వరుసగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తాను మంచి కథా చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, మంచి సక్సెస్ఫుల్ చిత్రంతో మళ్లీ వస్తానని చెప్పారు. డ్రాగన్ చిత్రంతో తమిళ ప్రేక్షకులు తనపై చూసిన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ అన్నారు. కాబట్టి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించి వారిని అలరించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా తెలుగులో ఈ అమ్మడు నానికి జంటగా ది పారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ఇంతకు ముందు తమిళంలో నటించిడానికి అంగీకరించిన ఇమ్మార్టల్, ఇదయం మురుళి చిత్రాలు విదుదల కావలసి ఉంది. కాగా నటుడు శింబుకు జంటగా ఆయన 49వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారీ బ్యూటీ. నటి కయాదు లోహర్ -
ఆ చిత్రాన్ని అలా చూశా!
తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్ఐకే. నటి కృతీశెట్టి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్ వివన్ దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ఎస్.లలిత్కుమార్, రౌడీ ఫిక్చర్స్ సంస్త అధినేత నటి నయనతార నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని, రవివర్మన్ ఛాయాగ్రణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకున్న ఎల్ఐకే చిత్రం ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను కాలేజీలో చదువుతున్నప్పుడు నానుమ్ రౌడీదాన్ చిత్రాన్ని తన ఎక్స్తో కలిసి చూశానన్నారు. అప్పుడే తాను దర్శకుడు విఘ్నేశ్ శివన్కు అభిమానిని అయ్యానన్నారు. అలాంటి దర్శకుడు తనతో చిత్రం చేస్తానని చెప్పగానే చాలా సర్పైజ్ అయ్యానన్నారు. తానుకు ఒక ఆశ ఉండేదన్నారు. దర్శకుడిగా ఓ ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని చేయాలని భావించానన్నారు. అందుకోసం కథలను ఆలోచించే పనిలో పడ్డానని చెప్పారు. అలాంటి సమయంలో ఇది ఫ్యూచర్ కథా చిత్రం అని దర్శకుడు విఘ్నేశ్ శివన్ చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయ్యానన్నారు. అలాంటి ప్చూచర్ ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాలు ఇండియాలో చాలా అరుదు అని పేర్కొన్నారు. దర్శకుడు ఆ ఐడియా చెప్పగానే సూపర్ అని అన్నానన్నారు. ఆయన కథను పూర్తిగా చెప్పగానూ ఈ చిత్రాన్ని కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యానన్నారు. ఆ తరువాత ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారని చెప్పగా వేరే లెవల్ సంతోషం కలిగిందన్నారు. నటుడు ఎస్జే.సూర్య గురించి ఒక్క విషయం చెప్పాలన్నారు. తాను కాలేజీ చదువు పూర్తి చేసిన తరువాత ఆయన వద్ద సహాయ దర్శకుడిగా చేరాలని ఆశపడ్డాననీ, అందుకు ఎస్జే.సూర్య కార్యాలయానికి వెళ్లి రెజ్యుమ్ కూడా ఇచ్చి వెళ్లమన్నారన్నారు. ఆ సంఘటన తనకు బాగా గుర్తుందన్నారు. తన గురించి చాలా విషయాలు అడిగి, ప్రపంచ సినిమాలు ఎక్కువగా చూడమని చెప్పారన్నారు. ఆయన అప్పడు అడిగిన ప్రశ్నలే తన జీవితాన్ని మార్చాయని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. -
తిరువణ్ణామలైలో స్టాలిన్ ప్రచారం
వేలూరు: డీఎంకే పార్టీ మేనిఫెస్టో ప్రజల మధ్య సూపర్ స్టార్గా వెలుగొందుతోందని సీఎం స్టాలిన్ అన్నారు. తిరువణ్ణామలై అసెంబ్లీ డీఎంకే అభ్యర్థి ఏవా వేలుకు మద్దతుగా తిరువణ్ణామలై పట్టనంలో కాలి నడకన వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం కార్యకర్తలు, సామాన్య ప్రజలు, మార్కెట్ వద్దకు వెల్లి ప్రజల వద్ద కరపత్రాలు అందజేసి ఓట్లును అభ్యర్థించారు. అనంతరం మాడ వీధుల్లో సుమారు నాలుగు కిలో మీటరు దూరం నడిచి వెళ్లి ఓటర్లను పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలో మైనారిటీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని.. అలాంటిది ప్రస్తుతం ఎన్నికల కోసం మైనారిటీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి చట్టాలకు అన్నాడీఎంకే మద్దతు తెలిపి ప్రస్తుతం ఏమీ తెలియనట్లు కపట నాటకం ఆడుతున్నారన్నారు. బీజేపీ తీసుకొచ్చే పలు చట్టాలను డీఎంకే తరచూ పోరాటాలు చేసిందన్నారు. గతంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్పప్పడు ఎందుకు ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెపుతుందని తాము అధికారానికి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతామన్నారు. అన్నాడీఎంకే ఎన్ని బూటకపు కథలు చెప్పినా మైనారిటీలు డీఎంకేను వదిలి పెట్టరన్నారు. ఇక కాలి నడకన వెళ్తున్న సమయంలో అన్నామలైయార్ ఆలయం సమీపంలోని ఓ టీ దుకాణంలో కూర్చొని ప్రజలతో స్టాలిన్ మాట్లాడారు. -
‘మామిడి’పై వీడని ఉత్కంఠ
సాక్షి,చైన్నె : పీఎంకేలో మామిడి పండు గుర్తు వివాదం ఉత్కంఠ రేపుతోంది. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించడంతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసుకు టెన్షన్ తప్పడం లేదు. పార్టీలో విబేధాల నేపథ్యంలో పార్టీ చిహ్నం మామిడి పండు’ గుర్తును స్తంభింపజేయాలని కోరుతూ రాందాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్ పిటిషనన్ను అత్యవసరంగా విచారించాలన్న రాందాసు తరపు అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. బుధవారం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ ధర్మాసనం ముందు రామదాస్ తరపు న్యాయవాదులు మరోసారి అభ్యర్థన చేశారు. ఈ కేసును మధ్యాహ్నమే అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని కోరారు. అయితే, న్యాయమూర్తులు ఈ అభ్యర్థనను అంగీకరించలేదు. పిటిషన్ ఇంకా నంబరింగ్ ప్రక్రియ పూర్తి కాలేదని, రిజిస్ట్రీ ద్వారా పిటిషన్ నంబర్ కేటాయించే వరకు విచారణకు తీసుకోలేమని స్పష్టం చేశారు. నంబరింగ్ పూర్తయితేనే సాధారణ పద్ధతిలో విచారిస్తామని ఽ హైకోర్టు బెంచ్ స్పష్టం చేయడంతో రాందాసు శిబిరంలో టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ చిహ్నంను అన్బుమణికి అప్పగించింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం, అదే రోజు చిహ్నాల కేటాయింపు జరుగుతుంది. అంతలోపు ఈ పిటిషన్ విచారణకు వచ్చేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. -
విద్యే నిజమైన సంపద
కొరుక్కుపేట: విద్యే నిజమైన సంపదని వీఐటీ చాన్స్లర్ డాక్టర్ విశ్వనాథన్ అన్నారు. వీఐటీ చైన్నెలో వర్సిటీ దినోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ విశ్వనాథన్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీఐటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.సెల్వం పర్యవేక్షణలో సాగిన ఈ వేడుకలకు ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ వినోద్కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, నైపుణ్యాల యుగంలో అనేక అవకాశాలు ఆవిర్భవిస్తున్నాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో విజయం సాధించాలన్నారు. వివిధ విభాగాల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. చైన్నెలోని వీఐటీ అసోసియేట్ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ త్యాగరాజన్, చైన్నె వీఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, అడిసినల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మనోహరన్ పూర్వ విద్యార్థి మేజర్ వైభవ్ చౌరాసియా పాల్గొన్నారు. -
వైద్య రంగంలో సరికొత్త ఒరవడి
● గుజరాత్ నుంచి చైన్నె రోగికి రోబోటిక్ సర్జరీ సాక్షి, చైన్నె: ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ , లాపరోస్కోపిక్ స్పెషాలిటీ హాస్పిటల్ జెమ్లో వైద్య చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి ప్రపథమంగా డ్యూయల్–కన్సోల్ లాంగ్–డిస్టెన్స్ రోబోటిక్ టెలిసర్జరీని విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఈ వైద్య విధానం గురించి ప్రధాన సర్జన్ డాక్టర్ పి. సెంథిల్నాథన్ మీడియాకు వివరించారు. సాధారణంగా టెలిసర్జరీలో ఒక డాక్టర్ మాత్రమే దూరంగా ఉండి ఆపరేషన్ చేస్తారని, అయితే, తాజా సర్జరీలో శ్రీడ్యూయల్–కన్సోల్ఙ్ వ్యవస్థను ఉపయోగించామన్నారు. గుజరాత్ (వాపి) నుంచి ప్రధాన సర్జన్ గా ఉన్న తాను ఆపరేషన్ నిర్వహించగా.. చైన్నెలో రోగి పక్కనే ఉన్న మరో సర్జన్ ఉంటూ ఏకకాలంలో రోబోటిక్ ద్వారా విజయవంతం చేశామన్నారు. ఇద్దరు సర్జన్లు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పక్కపక్కనే ఉండి ఆపరేషన్ చేస్తున్నంత వేగంగా (రియల్ టైమ్) సమన్వయం చేసుకోవడం ఈ సాంకేతికత ప్రత్యేకత అని వివరించారు. తీవ్రమైన వాంతులు మరియు గ్యాస్ట్రో–ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ తో బాధపడుతున్న 23 ఏళ్ల యువకుడికి ఈ శ్రీరోబోటిక్ ఫండోప్లికేషన్ఙ్ సర్జరీ చేశామన్నారు. ఈసందర్భంగా సెంథిల్ నాథన్ బృందాన్ని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ సీ పళణి వేలు అభినందించారు. -
ప్రచారంలో శశికళ ఉద్వేగం
సాక్షి, చైన్నె : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ ప్రచార బాట పట్టారు. తన పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. దక్షిణ తమిళనాడులో ముక్కళత్తోర్ సామాజిక వర్గం అత్యధికంగాఉన్న ప్రాంతాలలో తన ప్రచారంలో శశికళ భావోద్వేగ ప్రసంగం చేస్తున్నారు. జైలు జ్ఞాపకాలు – ఆంక్షల పర్వం గురించి వివరిస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అన్నాడీఎంకే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనను పార్టీ నుండి దూరం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ఆమె గుర్తు చేసుకుంటున్నారు. పార్టీని కాపాడటం కోసం బాధ్యతలు అప్పగిస్తే, తాను జైలుకు వెళ్లిన మూడవ నెలలోనే పార్టీ నుండి బహిష్కరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చినప్పుడు కనీసం పార్టీ జెండాను కూడా వాడనివ్వలేదని, జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్తే.. మరమ్మతుల సాకుతో మండపాన్ని మూసివేసి తనను అడ్డుకున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. కేవలం కార్యకర్తలను, ప్రజలను కాపాడాలని పార్టీ కోరుకుందని, కానీ కొందరు స్వార్థం కోసం తనను అరెస్టు చేయాలని పోలీసులను కూడా ఆదేశించారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ద్రోహుల్ని తరిమి కొడుదామని, కొబ్బరి తోట చిహ్నంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. అన్నాడీఎంకేను మరో పార్టీకి తాకట్టు పెట్టేసి , స్వార్థ ప్రయోజనాల కోసం ఉవ్విళ్లూరుతున్న వారికి గుణపాఠం చెప్పాలంటే, తాను సూచించిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. -
విజయ్కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
టీవీకే అధినేత విజయ్కి ఎన్నికల ముందు ఊహించని షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.ఎడప్పాడీ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ నియామాల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్పై పదిమంది ప్రపోజర్ల సంతకాలు ఉండాలి. అయితే టీవీకే తరుపున పోటీ చేస్తున్న అరుణ్ కుమార్ అనే అభ్యర్థి నామినేషన్ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉండడంతో పత్రాల్ని రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి ప్రత్యామ్నయంగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ పత్రాలు కూడా ఏడుగురు అభ్యర్థుల సంతకాలు ఉండడంతో రిజెక్ట్ అయ్యింది.అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏఐడీఏంకే అధ్యక్షుడు కెె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. అయికే ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్ ప్రస్తుతం అదృశ్యం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరి నామినేషన్ రిజెక్ట్ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా దీంతో ఆయనను ఏవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
ఐఓసీ ఎండీగా అశోకన్
సేలం: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (తమిళనాడు, పుదుచ్చేరి) దక్షిణ జోన్ ఎండీగా వీసీ అశోకన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తమిళనాడు, పుదుచ్చేరిలోని చమురు పరిశ్రమకు రాష్ట్ర స్థాయి కో–ఆర్డినేటర్ (ఎస్ఎల్సీ)గా కూడా పనిచేయనున్నారు. చమురు, గ్యాస్ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా విస్తృతమైన, విభిన్నమైన అనుభవం కలిగిన అశోకన్. అశోకన్ తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ) నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు. ఈయనకు భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన మార్కెటింగ్ అనుభవం ఉంది. తన ప్రస్తుత పదవికి ముందు అశోకన్ ముంబైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా హెడ్ ఆఫ్ రీటైల్గా పని చేశారు. అభ్యర్థుల మధ్య వివాదం కొరుక్కుపేట: సెంజిలో పీఎంకే పార్టీ జెండా విషయంగా రామదాసు, అన్బుమణి అభ్యర్థుల మధ్య వివాదం రాసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం చివరిరోజు కావడంతో సెంజీ అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే , పీఎంకే, అన్బుమణి వర్గం , పీఎంకే రామదాస్ వర్గం, తమిళనాడు వాళువురిమై పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు సహా 15 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు ధాఖలు చేశారు. ఇందులో పీఎంకే అన్బుమణి వర్గానికి చెందిన అభ్యర్థి గణేష్కుమార్, రిటర్నింగ్ అధికారి తమిళరసన్కు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు రామదాస్ వర్గం తరఫున కనల్ పెరుమాల్ తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చినప్పుడు మెడలో పీఎంకే జెండా, బ్యాడ్జ్ ధరించి ఉన్నారు. ఆసమయంలో అన్బుమణి వర్గానికి చెందిన గణేష్కుమార్, రామదాస్ వర్గం అభ్యర్థి కనల్ పెరుమాల్ తో మీరు పీఎంకే జెండా బ్యాడ్జ్ ధరించకూడదని దాన్ని తీసివేయండని అన్నారు. కనల్ పెరుమాల్ దానిని వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు తిరువొత్తియూరు: ప్రైవేటు బస్సు విద్యుత్ స్థంభంను ఢీ కొట్టిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. గర్భిణి సహా 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలోని కురుంబూరు నుండి మంగళవారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరిన ప్రైవేటుబస్సు తూత్తుకుడి మరవన్మడం సమీపంలోకి వస్తుండగా తూత్తుకుడి నెల్లై ప్రధాన రహదారి నుంచి సర్వీస్ రోడ్డులోకి తిరుగుతున్నప్పుడు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బ్రేక్కు బదులుగా ఎక్సిలేటర్ను తొక్కినట్టు తెలిసింది. దీంతో విద్యుత్ స్తంభాన్ని, తాటిచెట్టును బస్సు ఢీకొంది. డ్రైవర్ మణిముత్తు తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మెరుగైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా! కొరుక్కుపేట: వేలచ్చేరి కాంగ్రెస్ అభ్యర్థి ఆసన్ మౌలానా మంగళవారం నియోజకవర్గం అంతటా సుడిగాలి ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు మద్దతు కూడగట్టేందుకు మిత్రపక్షాలు పెద్దసంఖ్యలో గుమికూడాయి .సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభించారు. గత ఐదేళ్లలో తాను ముఖ్యమంత్రి స్టాలిన్ సాయంతో పలు ప్రాజెక్టులను పూర్తి చేశానన్నారు. రూ.420 కోట్లతో కొత్త వర్షపునీటి కాలువను నిర్మించానని, మళ్లీ అవకాశం ఇస్తే భవిష్యత్తులో వేలచ్చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. -
టీ నగర్.. దక్కేదెవరికో?
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా టీనగర్ (త్యాగరాయ నగర్) ఉంది. ఈ నియోజకవర్గంలో తాజాగా సమరం రసవత్తరంగా మారింది. తెలుగు, బ్రహ్మణ ఓట్లతో కూడిన ఈ పరిసరాలలో తెలుగు నేపథ్యం కలిగిన ఇద్దరు నేతల మధ్య సమరం హోరా హోరీగా మారి ఉంది. ఇందులో ఒకరు టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ కాగా, మరొకరు అన్నాడీఎంకే అభ్యర్థి సత్యనారాయణన్ అలియాస్ సత్య. ఇక, డీఎంకే అభ్యర్థిగా రాజా అన్భళగన్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా అనూష్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. వివరాలు.. చైన్నెకి గుండెకాయగా టీ.నగర్ను పరిగణించవచ్చు. కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగానూ ఇది ఉంది. కోడంబాక్కం, వెస్ట్ మాంబళం, అశోక్ నగర్ వంటి కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.రాజకీయ చదరంగంలో..టీ నగర్ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో 1957 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే– 6 సార్లు, అన్నాడీఎంకే – 4 సార్లు గెలిచింది. కాంగ్రెస్– 2 సార్లు, టీఎంసీ ఒక సారి విజయం సాధించింది. అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2021లో డీఎంకే కై వశం చేసుకుంది. డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి (దివంగత డీఎంకే నేత జె. అన్బళగన్ సోదరుడు) 56,035 ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే అభ్యర్థి టి.నగర్ సత్య 55,898 ఓట్లు సాధించారు. కేవలం 137 ఓట్ల స్వల్ప తేడాతో డీఎంకే విజయం సాధించింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,54,943. వీరిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో పురుషులు – 74,682, మహిళలు –80,228, ఇతరులు 33 మంది ఉన్నారు.2026 బరిలో ఉన్న అభ్యర్థులుఈసారి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను రంగంలోకి దించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జె. కరుణానిధికి ఈ సారి డీఎంకే సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో జె. అన్బళగన్ కుమారుడు రాజా అన్బళగన్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తృటిలో విజయాన్ని కోల్పోయిన టి.నగర్ సత్య మళ్లీ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీల బలం ఈసారి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే, ప్రపథమంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న తమిళగ వెట్రికళగం (టీవీకే)తరపున ఇక్కడ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ ఆనంద్ అలియాస్ భుస్సీ ఆనంద్ పోటీలో ఉన్నారు. ఒంగోలు పూర్వీకంగా కలిగి పుదుచ్చేరిలో స్థిర పడి, తదుపరి విజయ్కు సన్నిహితుడై పార్టీ స్థాపనలో భుస్సీ ఆనంద్ కీలకంగా వ్యవహరించారు. ఈ నియోజకవర్గంలోని యువత, బ్రహ్మణ, తెలుగు ఓటర్లతో పాటుగా మైనారిటీ యువత ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో భుస్సీ ఆనంద్ విస్తృతంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇక్కడ తెలుగు ఓటర్లు , బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఎటు వైపు అన్నది కీలకంగా మారింది. ఓ వైపు భుస్సీ ఆనంద్, మరో వైపు సత్య ఈ ఓట్లపై దృష్టి పెట్టారు. ఇక, నామ్ తమిళర్ కట్చి తరపున మహిళా అభ్యర్థిగా అనూష విజయకుమార్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో 137 ఓట్లతో ఓడిన సత్య ఈసారి గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థి రాజా అన్భళగన్ అయితే, తన తండ్రి అన్భళగన్ చరిష్మా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే పెరిగిన వాణిజ్యీకరణతో నివాస ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులపై నెలకొన్న వ్యతిరేకతను అధిగమించడం డీఎంకేకు సవాలుగా మారింది. ఇక ఈ మూడు పార్టీ మగరాయుళ్లను ఎన్టీకే తరపున అనూష విజయకుమార్ ఢీ కొడుతున్నారు. మహిళా ఓటర్లు తనను ఆదరిస్తారన్న నమ్మం ఆమెలో మెండుగా ఉండటం గమనార్హం.ప్రధాన సమస్యలు:● ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా టి.నగర్లో ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. మెట్రో రైలు పనుల కారణంగా గత రెండేళ్లుగా రద్దీ మరింత పెరిగింది.● పాండీ బజార్లోని మల్టీ–లెవల్ పార్కింగ్ సౌకర్యం తరచుగా సాంకేతిక సమస్యలతో మూతపడటం లేదా పూర్తి సామర్థ్యంతో నిండిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సమస్యా ఎక్కువే.● వర్షాల సమయంలో వెస్ట్ మాంబళం వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కడం పరిపాటిగా మారింది. వర్షపు నీటి కాలువల నిర్మాణం జరిగినా, ప్రయోజనం ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.● నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో వాయు కాలుష్యం పెరగడం, వాణిజ్య సముదాయాల నుండి వెలువడే టన్నుల కొద్దీ చెత్తను సక్రమంగా తొలగించకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. -
కీలక నేతల నామినేషన్లకు ఆమోదం
సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో మంగళవారం కీలక నేతలకు ఆమోదం లభించింది. ఇందులో సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత పళనిస్వామి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా టీవీకేఅ ధినేత విజయ్ నామినేషన్ టెన్షన్ పెట్టినా చివరకు ఆమోదించారు. ఇక, పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్కు షాక్ తగిలింది. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఇక్కడ టీవీకే పోటీ నుంచి తప్పుకున్నట్లయ్యింది. వివరాలు.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సోమవారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. మొత్తంగా 7,600 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 6,217, మహిళలు 1,380, ఇతరులు ముగ్గురు ఉన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి మొదలైంది. కట్టుదిట్టమైన ఆంక్షలు, సమగ్ర పరిశీలన మేరకు నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలియజేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరగనుంది. గురువారం ఉప సంహరణ ప్రక్రియ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.నామినేషన్లకు ఒకేచైన్నెలోని కొళత్తూరు నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ ఆమోదం పొందింది. అలాగే ఎడప్పాడి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నామినేషన్ కూడా ఓకే అయింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడైన విజయ్, తాను పోటీ చేస్తున్న పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్లు ఆమోదించడంతో ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖరారైంది. పెరంబూరులో నామినేషన్ అఫిడవిట్ రోటరి నకిలీగా చర్చ సాగడంతో విజయ్కు టెన్షన్ తప్పలేదు. చివరకు ఒరిజినల్ అని తేలడంతో నామినేషన్ ఆమోదించారు. అదేసమయంలో విజయ్ పేరును ఇరకాటంలో పెట్టే విధంగా జోషఫ్ పేరిట ఇద్దరు, విజయ్ పేరిట మరో ఇద్దరు దాఖలు చేసిన నామినేషన్లకు ఆమోదం లభించడం గమనార్హం. చేపాక్కం– ట్రిప్లికేన్లో ఉదయ నిధి స్టాలిన్, కారైక్కుడిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సాత్తూరులో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ధర్మపురిలో సౌమ్య అన్బుమణి, టీ నగర్లో భుస్సీ ఆనంద్ , అవినాశిలో కేంద్రసహాయమంత్రి ఎల్ మురుగన్, మైలాపూర్లో తమిళి సై సౌందరరాజన్ వంటి ముఖ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయి.విల్లివాక్కంలో ఉత్కంఠచైన్నెలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి టీవీకే తరపున పోటీలో ఉన్న ఆదవ్ అర్జున నామినేషన్ ప్రస్తుతం నిలిపివేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో భార్య ఆస్తుల వివరాలకు సంబంధించి కొన్ని సందేహాలు తలెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెలువడటంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు సమగ్ర వివరాలను సమర్పించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, గోబిచెట్టి పాళయంలో ఆదాయ పన్ను సమర్పించ లేదంటూ టీవీకే కన్వీనర్ సెంగొట్టయ్యన్ నామినేషన్ పెండింగ్లో పెట్టారు. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్, ఆయనకు ప్రత్యామ్నాయంగా నామినేషన్ వేసి మరొకరి నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. దీంతో మాజీ సీఎం పళణిస్వామి ఓట్లకు చీలిక గండం తప్పినట్లయ్యింది. అదే సమయంలో అభ్యర్థి అరుణ్ కనిపించడం లేదంటూ టీవీకే వర్గాలు ఆరోపించాయి. ఇక, డీఎంకే తరపున పోటీలో ఉన్న నెహ్రు, అన్బిల్ మహేశ్ తదితర మంత్రలందరినామినేషన్లు ఆమోదించారు. ఇక, దిండుగల్లో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్కు చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ రాందాసు తరపున నామినేషన్ దాకలు చేసిన అభ్యర్థిని పీఎంకే పార్టీకి చెందిన వారుగా ఎన్నికల కమిషన్ ఆమోదించింది. దీంతో ఇక్కడ అన్బుమణి పీఎంకేతో కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకు చిక్కులు తప్పలేదు. మాజీ మంత్రి కేసీ వీరమణి నామినేషన్ను సైతం పెండింగ్లో పెట్టారు. -
ప్రభుత్వ బస్సుల్లో హైటెక్ నిఘా
● ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా చర్యలు సాక్షి, చైన్నె : సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి రవాణా శాఖ అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం జీపీఎస్, అత్యవసర బటన్ల వ్యవస్థను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. పలు డివిజన్లుగా తమిళనాడు రవాణా సంస్థ బస్సుల సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇ ందులో ఎక్స్ ప్రెస్, సూదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులలో భద్రతా పరంగా చర్యలు విస్తృతం చేయడానికి నిర్ణయించారు. నిరంతర పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ ద్వారా బస్సు ఎక్కడ ఉంది, ఎంత వేగంతో వెళ్తోంది, ఇంధన సగటు ఎంత వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు సిద్ధమయ్యారు. బస్సులో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వివిధ చోట్ల ఎమర్జెన్సీ బటన్లను ఏర్పాటు చేస్తారు. ప్రమాదం లేదా ఆపద సమయాల్లో ఈ బటన్ నొక్కితే వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందుతుంది.అత్యవసర సమయంలో బస్సు బయట ఉన్న వారికి సమాచారం అందించడానికి ’హూటర్ గన్’ అనే శబ్ద వ్యవస్థను కూడా అనుసంధానిస్తున్నారు. ఈ బస్సులు తమ ప్రయాణ చరిత్రను 180 రోజుల వరకు భద్రపరుస్తాయి. నిబంధనల ఉల్లంఘనలను ఈ వ్యవస్థ స్పష్టంగా గుర్తిస్తుంది. ఈ డేటాను రవాణా, పోలీస్ , అత్యవసర సేవా విభాగాలతో పంచుకోవడం ద్వారా సమగ్ర నిఘా సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ’వాహన్ పోర్టల్’కు కూడా అనుసంధానిస్తారు. -
ఆధునిక యువత ప్రేమను ఆవిష్కరించే వైఫ్
తమిళసినిమా: ప్రేమ నేపథ్యంలో రూపొందే కొత్తదనంతో కూడిన చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి ఆధునిక యువత ప్రేమ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం వైఫ్. నటుడు ఆర్జే విజయ్, అంజలి నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్.హేమనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు మైత్రేయన్, రెడిస్ కింగ్స్ లీ, అభిషేక్ జోసప్, విజయ్ బాబు, కల్యాణి నటరాజన్, లల్లు, ఖదీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఈ తరం యువత పెళ్ళికి ముందు, ఆ తరువాత 6పేమ గురించి చర్చించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ డ్రామా కథా చిత్రంగా వైఫ్ ఉంటుందని తెలిపారు. కాగా ఈ చిత్రంలోని సారల్ అనే మెలోడి రొమాంటిక్ పాటను మంగళవారం విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పాటకు జెన్ మార్టిన్ సంగీతాన్ని అందించి గాయని సుబ్బలక్ష్మితో కలిసి పాడినట్లు చెప్పారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
అత్యాచారం కేసులో నిందితుడికి 33 ఏళ్ల జైలు
అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని తిరుచిట్రపాలంకు చెందిన మోహన్ (28). ప్లస్–2 విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన కేసులో 2019లో అరెస్టు అయ్యాడు. ఆరోవిల్ పోలీసులు అతనిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారించిన విల్లుపురం పొక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వినోదా మంగళవారం మోహన్కు 33 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధించారు. విజయ్కు 51 షరతులు సాక్షి, చైన్నె :తిరునెల్వేలి, కన్యాకుమారి ప్రాంతాల్లోని 22 మంది అభ్యర్థుల తరపున విజయ్ ప్రచారం చేయనున్నారు. గతంలో కరూర్లో జరిగిన తొక్కిసలాట సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఆయన ప్రచారానికి పోలీసులు తాజాగా 51 కఠిన నిబంధనలను విధించారు. బుధవారం తిరునల్వేలి పాలయంకోట్టై కేడీసీ నగర్ ప్రాంతంలో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. విజయ్ రోడ్ షో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలు , తగినంత పోలీసు బలగాలను పార్టీయే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని షరతు విధించారు. భద్రతా కారణాలు సమయాభావం వలన మంగళవారం నుంచి చైన్నెలో జరగాల్సిన మూడు రోజుల ప్రచారాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. రాహుల్, ప్రియాంకప్రచారానికి ఏర్పాట్లు సాక్షి, చైన్నె: తమిళనాడులో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం కోసం కాంగ్రెస్ కసరత్తులు చేపట్టింది. డీఎంకే కూటమికి మద్దతుగా వీరి ప్రచార వేదికలను ఎంపిక చేస్తున్నారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్తులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమిళనాడులోని ప్రధాన నగరాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించారు. అలాగే పొరుగు రాష్ట్రాల సీఎంలైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమిళనాడులో రెండుసార్లు పర్యటించి ప్రచారం చేయడానికి సంబంధించిన కసరత్తుల్లో టీఎన్సీసీ వర్గాలు ఉన్నాయి. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో పాటూ మాజీ అధ్యక్షులు, కీలక నేతలు ఈ ప్రచార పర్వంలో భాగస్వాములు కానున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లలో రాహుల్, ప్రియాంక పర్యటన ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మామిడి’ గుర్తు వివాదం! సాక్షి, చైన్నె : పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. రాందాస్ , ఆయన కుమారుడు అన్బుమణి మధ్య పార్టీ పగ్గాల కోసం సాగుతున్న పోరు ఇప్పుడు ’మామిడి’ గుర్తు కేటాయింపు వరకు వెళ్లింది. పీఎంకే పార్టీకి గుర్తింపు చిహ్నమైన ’మామిడి’ గుర్తును ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా నిషేధించాలని/ఫ్రీజ్ చేయాలని) రామదాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన చైన్నె సివిల్ కోర్టు రాందాసుకు షాక్ ఇచ్చే విధంగా తిరస్కరించింది. దీంతో రాందాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బసులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ వివాదంపై నేరుగా నిర్ణయం తీసుకునే బదులు, చైన్నె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవాలని రాందాస్కు అనుమతినిచ్చింది. ఒకవేళ ఈ గుర్తుపై స్పష్టత లేకపోతే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హైకోర్టులో తక్షణ విచారణ సుప్రీంకోర్టు సూచన మేరకు రాందాసు మంగళవారం చైన్నె హైకోర్టులో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున, మామిడి గుర్తును ఉమ్మడి చిహ్నాల జాబితాలో ఉంచాలని లేదా వివాదం తేలే వరకు ఎవరికీ కేటాయించకూడదని రాందాసు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. చివరకు పిటిషన్ దాఖలు చేస్తే, దానిని విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు. దీంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున, హైకోర్టు ఇచ్చే తీర్పు పీఎంకే భవిష్యత్ను నిర్ణయించనుంది. -
ఎన్నికల్లో వీరప్పన్ కుటుంబం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్మగ్లర్ వీరప్పన్ భార్య, కుమార్తె పోటీ చేస్తున్నారు. అయితే, వీరు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీలో ఉన్నారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కృష్ణగిరి నియోజకవర్గం నుంచి తమిళనాడు జీవ హక్కుల కట్చి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సోమవారం సాయంత్రం కృష్ణగిరి రెవెన్యూ కమిషనర్, ఎన్నికల అధికారి షాజహాన్న్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.వీరప్పన్ కుమార్తె విద్యారాణి మెట్టూరు నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి పోటీ చేసిన ఆమె, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా ఆమె తన నామినేషన్న్ను ఇప్పటికే దాఖలు చేశారు.కాగా, ఒకే కుటుంబానికి చెందిన వీరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వారు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండడంతో నేరుగా ఒకరిపై ఒకరు తలపడడం లేదు. వీరప్పన్ ప్రభావం ఉన్న అటవీ ప్రాంత నియోజకవర్గాల్లో వీరిద్దరికీ ఓటర్లు ఎలాంటి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి. -
మారుమూల గ్రామాలకూ రవాణా కల్పిస్తాం
తిరువళ్లూరు: డీఎంకే ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పది వేల మినీ బస్సులను కొనుగోలు చేసి మారుమూల గ్రామాలకు సైతం రవాణా సదుపాయాన్ని కల్పిస్తామని డీఎంకే ఎంపీ కనిమెళి హామీ ఇచ్చారు. తిరువళ్లూరు డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్కు మద్దతుగా కనిమెళి కనకమ్మసత్రం వద్ద ప్రచారం నిర్వహించారు. కనిమెళి మాట్లాడుతూ రెండవసారి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది వేల మినీ బస్సులను కొనుగోలు చేయడంతోపాటు మారుమూల గ్రామాలకు బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ అడ్డుకట్ట వేస్తుందన్న ఆయన, గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ద్రోహం చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఉపాధీ హమీ పనుల ఎంపిక సైతం ఢిల్లీ చేతిలోకి వెళుతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. గత ఐదేళ్లలో డీఎంకే హయాంలో 2,03,804 నేరాలు జరిగాయన్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ప్రజల్లో అభద్రతాభావం పెరుగుతుందన్న ఆరోపణలను నమ్మొద్దని, తాము అధికారంలోకి వస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవితాన్ని గడపవచ్చన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. తిరుత్తణిలో.. తిరుత్తణి: ఎన్నికల హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా ప్రజల వద్దకు వచ్చిన డీఎంకేను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి కనిమొళి అన్నారు. తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా తిరుత్తణి బైపాస్ రోడ్డు కూడలిలో మంగళవారం కనిమొళి ప్రచారం నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో సైతం భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు సహా జనసందోహం నడుమ కనిమొళి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు రూ. వెయ్యి ఆర్థికసాయం అందజేస్తామని గత 2021లో డీఎంకే హామిని ఎడపాడి పళనిస్వామి హేళన చేశారని ఆ పథకం అమలుకు సాధ్యం కాదన్నారన్నారు. అయితే సీఎం స్టాలిన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రాష్ట్రంలో 1.31 కోట్ల మంది మహిళలకు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు, తెలిపారు. అయితే ప్రస్తుతం మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. తమిళనాడు అభివృద్ధిని గాలికి వదిలి సవితి తల్లి ప్రేమ చూపిన బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ఇకపై అమిత్షా అన్నాడీఎంకేగా మారుతుందని తెలిపారు. ఎన్నికల తరువాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ద్రవిడ మాడల్ 2.0 పాలనకు ప్రజలు డీఎండీకే అభ్యర్ధిని గెలిపించాలని పిలుపునిచ్చారు. -
అత్యాధునిక వైద్య పరికరాల వితరణ
– అందజేసిన సిల్వర్జూబ్లీ ట్రస్ట్ కొరుక్కుపేట: మద్రాసు నార్త్ లయన్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైన్నె వెస్ట్ మాంబలంలోని ప్రజారోగ్య కేంద్రానికి విలువైన అత్యాథునిక వైద్య పరికరాలు అందించారు. ట్రస్టీలు లయన్ వైవి హరికృష్ణ, లయన్ పీజే పీఎన్ గుప్తా సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో మాంబళంలోని ప్రజారోగ్య కేంద్రానికి చేరుకున్న ట్రస్టీలు పెథాలజీ వైద్య పరికరాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ వల్లినాయగం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో మద్రాసు నార్త్ లయన్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ ట్రస్ట్ వారు అత్యాధునిక వైద్య పరికరాలు అందించటంపై ట్రస్టీలను అభినందించారు. అలాగే ప్రజారోగ్య కేంద్రం వైద్యలు బృందం సైతం మద్రాసు నార్త్ లయన్స్క్లబ్ సిల్వర్ జూబ్లీ ట్రస్టీలకు, మద్రాసు నార్త్ లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖలు లయన్ రఘురామ్ , లయన్ విఠ్ఠల్ , లయన్ జగదీష్ చందర్, లయన్ పార్థసారధి, లయన్ నందగోపాల్ , లయన్ పిచ్చాండి, జె.హరికృష్ణ కుమార్ పాల్గొన్నారు. -
రిజర్వుడ్ స్థానాలపై.. కీలక ఆదేశాలు
సాక్షి, చైన్నె : ఎన్నికల వేళ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల అర్హతపై దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు విచారణకు మంగళవారం స్వీకరించింది. ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారిని మాత్రమే పోటీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని, వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోర్టు ఆదేశించింది. పిటిషన్ నేపథ్యం ఇదీ.. హిందూ మక్కల్ కట్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంపత్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్లో పేర్కొన్న ప్రధానాంశాలలో తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 44 స్థానాలు ఎస్సీలకు కేటాయించబడ్డాయని వివరించారు. భారత రాజ్యాంగం ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారన్నారు. అయితే, ఈ 44 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 90 శాతం మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే సమయంలో వారి మతపరమైన అర్హతలను కఠినంగా తనిఖీ చేసేలా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు విచారణ – ఆదేశాలు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఎన్నికల కమిషన్ తరపు న్యాయమూర్తి స్పందిస్తూ.. అభ్యర్థులు సమర్పించిన ఎస్సీ సర్టిఫికేట్ అసలైనదా కాదా అనే అంశాన్ని మాత్రమే అధికారులు తనిఖీ చేస్తారని, సర్టిఫికేట్ చెల్లుబాటు కాకపోతేనే నామినేషన్ తిరస్కరించబడుతుందని స్పష్టం చేశారు. వాదనల అనంతరం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. అయితే, నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆపడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిశీలన యథావిధిగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది. -
ఇది పక్కా బ్లాక్మెయిల్!
– దేవేంద్ర ఫడ్నవీస్పై డీఎంకే ఎంపీల ఆగ్రహం సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీలు తీవ్ర స్థాయిలో మంగళవారం మండిపడ్డారు. తమ అభ్యర్థిని గెలిపిస్తేనే మెట్రో ప్రాజెక్టులు ఇస్తామని చెప్పడం ప్రజలను బెదిరించడమేనని వారు ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇందులో దక్షిణ చైన్నె ఎంపి తమిళచ్చి తంగపాండియన్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మెట్రో ప్రాజెక్టులపై రాజకీయం మదురై, కోయంబత్తూరు మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ మోడల్ ప్రభుత్వం అన్ని రాష్ట్ర స్థాయి పనులను 100 శాతం పూర్తి చేసిందని ఎంపీలు గుర్తుచేశారు. డీపీఆర్ సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. జనాభా సాకుతో వివక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం మధురై, కోయంబత్తూరు జనాభా 20 లక్షలు లేదని సాకు చూపుతూ కేంద్రం అనుమతులు నిరాకరించిందని మండిపడ్డారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న ఆగ్రా, పాట్నా నగరాలకు మాత్రం మెట్రో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది తమిళులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఉన్న వివక్షకు నిదర్శనమని విమర్శించారు. ఫడ్నవీస్పై విమర్శలు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో అక్కడికి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్కు తరలించిన వ్యక్తి ఫడ్నవీస్ అని, అటువంటి వ్యక్తి ఇప్పుడు మధురైలో మెట్రో తెస్తానని చెప్పడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలు కావని, ఇది ‘ఢిల్లీకి – తమిళనాడుకు‘ మధ్య జరుగుతున్న యుద్ధమని వారు అభివర్ణించారు. కాగా,ఫడ్నవీస్ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ సైతం తన ఎక్స్ పేజీలో ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. -
మావేన్ సిలికాన్తో ఐఐటీఎం ప్రవర్తక్ భాగస్వామ్యం
కొరుక్కుపేట: సెమీకండక్టర్ టెక్నాలజీలో పనిచేస్తున్న నిపుణుల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఐఐటీ మద్రాసు ప్రవర్తక్, వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణ సంస్థ అయిన మావెన్ సిలికాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఐఐటీ ఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ శంకర్ రామన్ మాట్లాడుతూ సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వంటి తొమ్మిది నెలల వీఎల్ ఎస్ఐ డిజైన్, వెరిఫికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లు ఆన్లైన్ విధానంలో అందిస్తామని తెలిపారు. మొదటి బ్యాచ్ కోసం అడ్మిషన్లు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. పరిశ్రమ అవసరాలు, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా సైబర్ –ఫిజికల్ సిస్టమ్స్కు ఆధారమైన సెమీకండక్టర్, ఎంబెడెడ్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగ నిపుణులకు ఒక విస్తరించదగిన, అందుబాటులో ఉండే మార్గాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. ఇందులో మావెన్ సిలికాన్ వ్యవస్థాపక సీఈవో పిఆర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వినూత్న ప్రచారం
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఇది నిజంగానే ఒక ఆసక్తికరమైన, వినూత్నమైన ప్రచారం. సాధారణంగా దివంగతులైన నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఓట్లు అడగడం చూసి ఉంటాం. అయితే, జీవించి ఉన్న ఒక నాయకుడి (విజయ్) విగ్రహాన్ని ప్రచారానికి ఉపయోగించి ఓ అభ్యర్థి ఒక కొత్త ట్రెండ్కు తెరలేపాడు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థిగా ఎన్ఎస్ విజ్జి పోటీ చేస్తున్నారు. అత్యంత బలమైన డీఎంకే అభ్యర్థి, మంత్రి అన్బిల్ మహేశ్ను విజ్జి ఢీకొడుతున్నాడు. అయితే విజయ్ ప్రత్యక్షంగా ప్రచారానికి అందుబాటులో లేకపోవడంతో వినూత్న వ్యూహం రచించాడు. విగ్రహం రూపకల్పన విజయ్ తన వెన్నంటి ప్రచారంలో ఉండే విధంగా విగ్రహం రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. ఐదున్నర అడుగుల ఎత్తుతో, విజయ్ రూపంలో ఉండేలా విగ్రహాన్ని తయారు చేయించాడు. తన ప్రచార వాహనంపై ఈ విగ్రహాన్ని ఉంచి నియోజకవర్గమంతా తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దూరం నుంచి చూస్తే ప్రచారానికి విజయ్ వస్తున్నట్టుగా కనిపించే విధంగా విగ్రహాన్ని వ్యాన్లో స్టైలిష్గా నిలబెట్టిన విజీ ఓటర్లకు చేరువయ్యేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. సినీ క్రేజ్ ఉన్న విజయ్ను తన ప్రచారం కోసం లైవ్ లీడర్ పేరిట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని తొలిసారిగా రికార్డుల్లోకి ఈ అభ్యర్థి చేరడం విశేషం. సోషల్ మీడియాలో కూడా ఈ విగ్రహ ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. -
క్లుప్తంగా
తెలుగులో అన్నాడీఎంకే అభ్యర్థి ప్రచారం పళ్లిపట్టు: తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థి హరి పళ్లిపట్టు ప్రాంతంలోని తెలుగు గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగులో ప్రచారం నిర్వహించి ఆకట్టుకున్నారు. తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి పళ్లిపట్టు యూనియన్లోని కరింబేడు, సామంతవాడ, వడకుప్పం, తిరుమలరాజుపేట, వెలిగరం సహా పదికి పైగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం 150 రోజులకు పెంచుతామని, అలాగే మహిళలకు ఆర్థికసాయం రూ.2వేలు అందజేస్తామన్నారు. వృద్ధులకు పింఛన్ రూ.2వేలు వేలు, ఇంటింటికి ఫ్రిడ్జ్ అందిస్తామని, అన్నాడీఎంకేను గెలిపించాలని కోరారు. ప్రజలు కోర్కె మేరకు హరి తెలుగులో ప్రచారం చేసి ఆకట్టుకున్నారు. ప్రచారంలో అన్నాడీఎంకే యూనియన్ కార్యదర్శులు టీటీ.శ్రీనివాసన్, కృష్ణమనాయుడు, రవి, మాజీ పంచాయతీ సర్పంచ్ చంద్రబాబు పాల్గొన్నారు. జీతమంతా ప్రజాసేవకే వినియోగించా! కొరుక్కుపేట: గత ఐదేళ్లుగా తన ఎమ్మెల్యే జీతమంతా ప్రజాసేవకే వినియోగించానని విరుగంబాక్కంఅభ్యర్థి ప్రభాకర్ రాజా అన్నారు. ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్రాజా డీఎంకే తరఫున విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సోమవారం తన నామినేషన్ను దాఖలు చేశారు . అనంతరం ప్రభాకర్రాజా మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తన ఎమ్మెల్యే జీతం మొత్తం ప్రజా సేవకే ఖర్చు పెట్టానని అన్నారు. విరుగంబాక్కం నియోజక వర్గంలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యా ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఉదయసూర్యుడు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్నాడీఎంకే ఇంటింటి ప్రచారం తిరువొత్తియూరు: రాయపురం నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి డి.జయకుమార్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఓట ర్లు దారి పొడవునా స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో జయకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అన్నాడీఎంకేను గెలిపిస్తే రాయపురాన్ని చేస్తానని అన్నారు. రాయపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్నాడీఎంకేను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ఖర్చు కోసం శశికళ రూ.52 లక్షలు ఇచ్చారు! –నీటకోట్టై అభ్యర్థి అన్భళగన్ కొరుక్కుపేట: ఎన్నికల ఖర్చుల కోసం శశికళ తనకు మొత్తం రూ.52 లక్షలు ఇచ్చారని దిండుగల్ జిల్లా నీలకోట్టై అభ్యర్థి అన్భళగన్ తెలిపారు. ఇది బహిరంగంగా చెపట్టంతో రాజకీయంగా చర్చకు దారితీసింది. వివరాలు.. నీటకోట్టై నియోజక వర్గానికి చెందిన అన్భళగన్ గత 2001 ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున నీటకోట్టై నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత పార్టీలో తనకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవటంతో ఆయన బీజేపీలో చేరారు . నీటకోట్టైలో ఎమ్మెల్యే సీటు తనకు ఖచ్చితంగా వస్తుందనే ఆశతో ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పనిచేశారు. కానీ దిండిగల్ మాజీ అన్నాడీఎంకే మంత్రి శ్రీనివాసన్ కూడా ఆ ఆలోచనకు తెరదించారు. దీంతో బీజేపీని వీడి కొత్తగా ఏర్పడిన ఆల్ ఇండియా ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఐఎంఎంకే)లో చేరారు. మరుసటి రోజు ఆయనను నీలకోట్టై నియోజక వర్గం అభ్యర్థిగా ప్రకటించారు . ఈనేపథ్యంలో సోమవారం నీటకోట్టైలో పార్టీ అభ్యర్థి పరిచయ , కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమయంలో అన్భళగన్ మాట్లాడుతూ 2001 ఎన్నికల్లో నీటకోట్టై నియోజక వర్గం నుంచి అన్నాడిఎంకే అభ్యర్థిగాపోటీ చేసినప్పడు రూ.50 లక్షల ఎన్నికల ఖర్చుకోసం ఇచ్చారు. ప్రస్తుతం రూ.2 లక్షలు ఇచ్చారని ఇచ్చారని . మొత్తంరూ.52 లక్షలు ఇచ్చారని అభ్యర్థి చేసిన బహిరంగ ప్రకటన పెద్ద కుదుపును సృష్టించింది. డబ్బు తీసుకున్న ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని , ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ఈవిషయంలో ఎన్నికల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవా లని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కారు దగ్ధం తిరువొత్తియూరు: కొడైకెనాల్కు పర్యటనకు వెళ్లిన కారుకు మంటలు వ్యాపించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. శివగంగై నుంచి మహిళలు, పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో కొడైకెనాల్కు వత్తలగుండు ప్రధాన కొండ రహదారిపై వెళుతున్నారు. నందన్కరై సమీపంలోకి రాగానే హఠాత్తుగా కారు ముందు భాగం నుంచి పొగలు వచ్చాయి. వెంటనే వాహనంలో వున్న వారంతా అప్రమత్తమై కిందికి దిగేశారు. వెంటనే ఒక్కసారిగా మంటలు వ్యాపించి కారు దగ్ధమైంది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. -
● పుదుచ్చేరిలో ష్...గప్ చుప్! ● ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం ● రేపు ఓటింగ్
సాక్షి, చైన్నె : ముప్పై స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ గత నెల ముగియడంతో అభ్యర్థులు ఓట్ల వేటలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలలో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, కూటమిలోని బీజేపీ 10 చోట్ల, అన్నాడీఎంకే 2 చోట్ల, లక్ష్య జననాగయ కట్చి రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ 16 చోట్ల, డీఎంకే 13 చోట్ల, వీసీకే ఒక చోట పోటీలో ఉన్నాయి. ఆది నుంచి కూటమి వివాదం, రెబల్స్ రచ్చ సాగినా, ఎన్నికల సమయానికి కూటమిలోనే నేతలు ఒకే వేదిక మీదకు వచ్చినట్టు గత రెండు మూడు రోజులుగా ఐక్యతను చాటుకునే పనిలో పడ్డారు. ఇండియా కూటమికి మద్దతుగా ఏఐసీసీ నేత రాహుల్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తదితరులు ప్రచారంలో దూసుకెళ్లారు. గత వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజున ఆయా అభ్యర్థులు ఓపెన్ టాప్ వాహనాలలో దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం ప్రచారంలో దూసుకెళ్లారు. మంగళవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ నిది స్టాలిన్ సుడిగాలి పర్యటన చేశారు. పుదుచ్చేరిలో స్వతంత్ర పాలన లేదని, ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా సాగే ప్రభుత్వం నడుస్తున్నట్టు ధ్వజమెత్తారు. పుదుచ్చేరిలో ప్రతి విషయంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడం వలన ప్రజా ప్రభుత్వానికి విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వద్దే వద్దని , ద్రావిడ ఇంజిన్ అనే సింగిల్ ఇంజిన్తో ముందుకెళ్దామని ఓటర్లకు పిలుపు నిచ్చారు. టాస్మాక్ల మూత ప్రచారం సమాప్తం కావడంతో పుదుచ్చేరి, యానం, మగే, కారైక్కాల్పరిసరాలోని అసెంబ్లీ నియోజకర్గాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం జరగనన్నది ఎన్నికలకు బుధవారం ఈవీఎంలను , వీవీ ప్యాడ్లను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇక, మంగళవారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు పుదుచ్చేరిలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు సీల్ వేశారు.శాంతిభద్రతలను కట్టుదిట్టం చేస్తూ చర్యలు తీసుకున్నారు. పుదుచ్చేరి సరిహద్దుల్లోని 19 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు నిఘా ఉంచారు. మద్యం రవాణాను అరికట్టేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా, తమిళనాడు నుంచి తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు మద్యం దుకాణాలకు మూత పడటంతో ముందుగానే మద్యం సీసాలను కొనుగోలు చేయడానికి మందుబాబులు ఎగబడటంతో వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ పెరిగింది.పుదుచ్చేరిలో ఉదయనిధి స్టాలిన్ ప్రచారం -
టైసన్ తరువాత..
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ టైసన్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కబడ్డీ క్రీడ నేపథ్యంలో రూపొందింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తెరపైకి వచ్చింది. కాగా ఆరు నెలలు గడిచినా ధృవ్ విక్రమ్ తదుపరి చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. మణిరత్నం దర్శకత్వంలో ఈయన చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారంతోనే ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ధృవ్ విక్రమ్ నూతన దర్శకుడితో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ దర్శకుడి పేరు కిరణ్ అరవిందకుమార్. ఈయన ఇంతకు ముందు ధృవ్ విక్రమ్ హీరోగా నటించినాదిత్య వర్మ చిత్రానికి అసోసియేట్ డైరక్టర్గా పని చేశారు. అంతే కాకుండా నటుడు సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రానికి రైటర్గా పని చేశారు. ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కించే చిత్రానికి సాయి అభయంకర్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవటడం గమనార్హం. -
ఆరు నామినేషన్ల తిరస్కరణ
వేలూరు: వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో వివిధ కూటమి పార్టీలకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 116 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల్లోని తాలుకా కార్యాలయంలో నామినేషన్లను ఆయా నియోజక వర్గాల ఎన్నికల అధికారులు పరిశీలించారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. వేలూరు నియోజకవర్గంలో 25 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అదేవిధంగా కాట్పాడి నియోజక వర్గంలో మొత్తం 25 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో ఐదుగురి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. అదేవిధంగా కేవీ కుప్పం నియోజకవర్గంలో మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు, గుడియాత్తంలో 21 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనకట్టు నియోజక వర్గంలో మొత్తం 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 9వ తేదీలోపు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని అధికారులు తెలిపారు. -
సీర్గాళి వీధుల్లో స్టాలిన్ వాకింగ్
సాక్షి,చైన్నె : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం సీర్గాళి వీధుల్లో వాకింగ్ చేస్తూ, ప్రజలతో మమేకమయ్యే వ/ధంగాముందుకు సాగారు. ప్రజల్ని పలకరిస్తూ, వారితో కలిసి తానూ సామాన్యుడిగా చాటే విధంగా టీ తాగుతూ ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు. మార్నింగ్ వాక్ – ప్రజా క్షేత్రంలో పుదుచ్చేరిలో ప్రచారం ముగించుకుని మంగళవారం రాత్రి సీర్గాళికి సీఎం స్టాలిన్ చేరుకున్నారు. ఉదయాన్నే తన దిన చర్యలో భాగంగా సీర్కాళి వీధులలో వాకింగ్కు వెళ్లారు. డీఎంకే జిల్లా కార్యదర్శి నివేదా మురుగన్, ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం, ఇతర కీలక నేతలతో కలిసి తెన్ పాతి ప్రాంతం నుంచి ఆయన వాకింగ్ మొదలెట్టారు. వాకింగ్లో భాగంగా స్థానిక రైతు బజార్కు వెళ్లిన స్టాలిన్, అక్కడ కూరగాయలు విక్రయిస్తున్న రైతులతో మాట్లాడారు. వ్యాపారం ఎలా సాగుతోంది? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు. టీ కొట్టులో ముచ్చట్లు కచ్చేరి రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా సాగిన ఈ పర్యటనలో ఆయన అకస్మాత్తుగా ఒక టీ కొట్టులోకి వెళ్లారు. అక్కడ స్వయంగా టీ తాగుతూ, దుకాణదారుడితో వ్యాపార విశేషాలను చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ప్రజలను కలుసుకున్న క్రమంలో, అక్కడికి వచ్చిన పాఠశాల , కళాశాల విద్యార్థులతో సీఎం ఉత్సాహంగా ముచ్చటించారు. విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడగా, స్టాలిన్ వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.కూటమి అభ్యర్థి కోసం ఓట్ల వేట తమ కూటమిలో భాగమైన ఎండీఎంకే అభ్యర్థి ఆర్. సెంథిల్ సెల్వన్ కోసం స్టాలిన్ స్వయంగా ఓట్లు అభ్యర్థించారు. ’ఉదయ సూర్యుడు’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సాయంత్రం సీర్కాళిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో మైలాడుదురై, సీర్కాళి, పూంబుహార్, నాగపట్నం, వేదారణ్యం, కీల్వేలూరు నియోజకవర్గాలకు చెందిన డీఎంకే , మిత్రపక్షాల అభ్యర్థుల తరపున స్టాలిన్ ఓటర్లను ఉద్ధేశించి ప్రసంగించారు. ద్రావిడ మోడల్ప్రభుత్వ పథకాలు, పనితీరు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
క్లుప్తంగా
పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యం సాక్షి, చైన్నె: పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త ఒరవొడితో ముందుకెళ్తున్నామని ఐసీఎల్ ఫిన్కార్ప్ ఎండీ అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం చైన్నెలో జరిగిన సమావేశంలో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీఎల్ ఫిన్కార్ప్ ఏసీడీ ఇష్యూ గురించి వివరించారు.ఇది సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్–కన్వర్టిబుల్ డిబెంచర్ల పబ్లిక్ ఇష్యూగా ఉంటుందని, పెట్టుబడిదారులకు గరిష్టంగా 12.25 శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తారని ప్రకటించారు. ఏప్రిల్ 24న ఈ ఇష్యూ ముగుస్తుందని అన్నారు. గృహాల్లో చైన్నె నంబర్ ఒన్ సాక్షి, చైన్నె: చైన్నె రియల్ ఎస్టేట్ రంగం అద్భుత వృద్ధిని నమోదుచేసింది. గృహ విక్రయాల్లో అగ్రస్థానంలో, ఆఫీసు లీజింగ్లోనూ సత్తాను చాటింది. ఈ మేరకు మంగళవారం నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే ఫలితాలను స్థానికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా రియల్ ఎస్టేట్ క్యూ1 2026’ నివేదిక ప్రకారం, చైన్నె రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఈవిషయంగా నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ జోసెఫ్ తిలక్ మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గృహ విక్రయాల వృద్ధిలో చైన్నె అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాదితో పోల్చితే 9 శాతం వృద్ధితో 4,763 యూనిట్లకు చేరినట్టు ప్రకటించారు. మధ్య తరగతి విభాగంలో రూ.50 లక్షల నుంచి రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాలు 19 శాతం పెరిగాయని తెలిపారు. హోటల్ ఉద్యోగి హత్య అన్నానగర్: చైన్నె, కొళత్తూరు సమీపంలోని పెరవళ్లూరులోని జీకేఎం కాలనీ, 20వ వీధికి చెందిన రమేష్ (57). ఇతను ఒక ప్రైవేటు రెస్టారెంట్లో వెయిటర్. గత 25 ఏళ్లుగా మనస్పర్థల కారణంగా భార్యకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇతని ఇంటికి దగ్గరలో నివసించే రమేష్ తల్లి భా నుమతి రమేష్కు ఫోన్ చేసింది. కాని అతను స్పందించలేదు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు రమేష్ ఇంటి నుంచి బయటకు రాలేదు. అ నుమానం వచ్చిన భానుమతి చూడడానికి రమేష్ ఇంటి తలుపు తెరచి లోపలికి వెళ్లింది. ఇంట్లో కత్తిపోట్లతో రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న రమేష్ను చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. వెంట నే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచా రం అందుకున్న పెరవళ్లూరు పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పో లీసుల ప్రాథమిక విచారణలో రమేష్ సోమవా రం రాత్రి తన ఇంట్లో స్నేహితులతో కలసి మద్యం తాగాడని, స్నేహితుల మధ్య జరిగిన గొడవ రమేష్ను అతని స్నేహితులు కత్తితో పొడిచి చంపి పారిపోయారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు వారాలు అగ్గిపెట్టెల ఫ్యాక్టరీల మూత కొరుక్కుపేట: పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో 5 లక్షల కార్మికుల కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. అగ్గిపెట్టెల కర్మాగారాలను ఈనెల 12 తేదీ నుంచి మూసివేత అమల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అగ్గిపెట్టెల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఈనెల 12 నుంచి రెండు వారాల పాటు అగ్గిపెట్టెల కర్మాగారాలను మూసివేయాలని తయారీదారులు నిర్ణయించారు. దీంతో 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. విమానంలో ప్రయాణికుడి మృతి తిరువొత్తియూరు: మారిషస్ నుంచి చైన్నెకి వెళుతున్న విమానంలో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. మారిషస్ నుంచి చైన్నెకి 186 మంది ప్రయాణికులతో ఒక విమానం బయలుదేరింది. ఈ విమానంలో బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న కృష్ణ (60) అనే వ్యక్తి చైన్నెలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం భార్యతో కలిసి వస్తున్నారు. విమానం మంగళవారం తెల్లవారుజామున వస్తుండగా మార్గమధ్యలో కృష్ణకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. వెంటనే విమాన సిబ్బంది పైలట్కు సమాచారం అందించారు. 20 నిమిషాల ముందుగానే ఉదయం 6 గంటలకు విమానం చైన్నెలో ల్యాండ్ అయ్యింది. వెంటనే విమానంలోకి వచ్చిన వైద్యులు ప్రయాణికుడిని పరీక్షించి అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విమానాశ్రయ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాంబరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరవాత విమానాన్ని శుభ్రం చేసిన కారణంగా ఉదయం 8.10 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఉదయం 9.20 గంటలకు మారిషస్ బయలుదేరి వెళ్లింది. ప్రైవేట్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం తిరువొత్తియూరు: చైన్నె టి.నగర్లో ప్రైవేటు గోడౌన్లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. రూ.40 లక్షల విలువైన కూరగాయలు, కిరాణ సామగ్రి దగ్ధమయ్యాయి. చైన్నె టి.నగర్ త్యాగరాయ నగర్ మూసా వీధిలో ఆన్లైన్లో నిత్యావసర వస్తువులు విక్రయించే సంస్థకు చెందిన గోదాం ఉంది. ఈ గోదాంలో కూరగాయాలు, కిరాణా సామగ్రి వంటి నిత్యావసర వస్తువులు అమ్మకం కోసం ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ గోదాం నుండి అకస్మాతుగా మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే గోదాంలో ఉన్న కూరగాయలు, కిరాణ సామగ్రి వంటి నిత్యావసర వస్తువులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. -
ఎన్నికల ఖర్చు రూ.1,302 కోట్లు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ.1,302 కోట్లు ఖర్చు అవుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ మంగళవారం ప్రకటించారు. అలాగే, తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగించి ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అయితే నామినేషన్ దాఖలు వరకు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చిన ఓటర్ల దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను మంగళవారం అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఇందులో మొత్తం ఓటర్లు: 5,73,43,291గా ప్రకటించారు. ఇందులో పురుషులు–2,80,30,658, మహిళలు– 2,93,04,905, ఇతరులు– 7,728 మంది ఉన్నట్టు వివరించారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. కాగా, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘా బృందాలు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.462.74 కోట్ల విలువైన నగదు, వస్తువులు పట్టుబడ్డట్టు వివరించారు. గత ఎన్నికల కంటే ఈ సారి రూ. 507 కోట్లు ఖర్చు అధికంగా ఉండడం గమనార్హం. -
అఫిడవిట్ వైరల్.. మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు!
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పలువురు కీలక నేతలు నామినేషన్లు సమర్పించారు. అయితే, పళనిస్వామి నామినేషన్ అఫిడవిట్పై చర్చ మొదలైంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం పళనిస్వామి నామినేషన్ చర్చనీయాంశంగా మారింది. ఆయన తన కుటుంబానికి రూ.8.99 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తనకు చరాస్తులు రూ.50.86 లక్షలు ఉన్నాయని.. ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, వంటి స్థిరాస్తులేవని చెప్పారు. తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి వాహనాల్లేవని వెల్లడించారు. ఆయన సతీమణి రాధకు స్థిర, చరాస్థులు కలిపి రూ.5.61 కోట్లు ఉన్నట్లు, ఉమ్మడి కుటుంబం పేరుమీద మరో రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు పళనిస్వామి చెప్పారు. దీంతో, ఆయన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.ముగిసిన నామినేషన్ల పర్వంమార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరుగుతోంది. ఉప సంహరణ తర్వాత ఈనెల 9వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు. -
ఈసారి గెలవకపోతే..? తమిళిసై భవిత ఏంటి!
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఒక్క సారైనా విజయకేతనం ఎగురవేయాలన్న ఆకాంక్షతో గవర్నర్ పదవిని సైతం త్యాగం చేసి వరుస ఎన్నికలను బీజేపీ మహిళా సీనియర్ నేత తమిళి సై సౌందరరాజన్ ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా ఆమె ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ మైలాపూర్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే సిట్టింగ్ సీటులతో తనదే మళ్లీ విజయం అన్న ధీమాతో డీఎంకే అభ్యర్థి టీ వేలు ఉన్నారు. ఇక ఈ ఇద్దరీ మధ్యలో ఓట్లను చీల్చే దిశగా తమిళగ వెట్రి కళగం (టీవీకే), నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అభ్యర్థులు ఉన్నారు.సాక్షి,చెన్నై : తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత పురాతన ప్రాంతాలలో మైలాపూర్ ఒకటి. ప్రసిద్ధ కపాలీశ్వరర్ ఆలయం, శాంతోమ్ చర్చి ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అన్నాడీఎంకే ఏడు సార్లు విజయ కేతనం ఎగుర వేసింది. గతంలో రెండు సార్లు గెలిచినా, చివరకు రెండు దశాబ్దాల తర్వాత 2021లో డీఎంకే అభ్యర్థి టి. వేలు పాగా వేశారు. ఇక, ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ మూడు సార్లు గెలిచినా, ఐదు దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పోటీకి సాహసించ లేదు. ఇక, 2001లో ఇక్కడ బీజేపీ విజయ ఢంకా మోగించింది. అప్పటి సీనియర్ నేత కేఎన్ లక్ష్మణన్ గెలిచారు. గెలుపు గుర్రం ఎవరో.. ఇక్కడ మొత్తం 1,94,731 ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ. పురుషులు 93,017, మహిళలు 1,01,691, ఇతరులు 23 మంది ఉన్నారు. మైలాపూర్లో మత్స్యకార సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓటుతో డీఎంకే తన పట్టును నిలుపుకుంటుందా? లేదా తమిళిసై ద్వారా ఇక్కడ కమలం వికసిస్తుందా..? లేదా విజయ్ రూపంలో విజిల్ మోత మోగేనా అన్నది వేచి చూడాల్సిందే. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఈ పరిధిలోని మందవేలి, అభిరామపురం వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, పాత నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రధానంగా మారింది. మెట్రో రైలు పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ జాం ఏర్పడటం సామాన్యులకు పెద్ద ఇబ్బందిగా మారింది. వేసవిలో తాగునీటి ఎద్దడి, వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.తమిళిసై విశ్వ ప్రయత్నంతమిళిసై సౌందరరాజన్ ఆమె తమిళనాడుకే కాదు, తెలంగాణ, పుదుచ్చేరికి సైతం సుపరిచితురాలే. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా సైతం సేవలు అందించారు. అయితే, ఆమె ఆకాంక్ష అంతా ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నదే. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2019 లోక్సభ ఎన్నికలలో సైతం పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. చివరకు ఆమెకు తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఏక కాలం పనిచేసే అవకాశం దక్కింది. అయినా, ఎన్నికలలో పోటీ చేసి గెలవాలన్న ఆకాంక్ష ఆమెలో తగ్గలేదు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ 2024 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. ఈ పరిస్థితులలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో మైలాపూర్ నుంచి ఎన్నికల రేసులోకి దిగారు. ఈసారి తనకు ఓటర్లు ఒక్క ఛాన్స్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇందుకు అన్నాడీఎంకే, పీఎంకే , టీఎంసీ తదితర పార్టీలతో కూడిన తమ కూటమి బలంతో పాటూ బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తుందన్న ధీమా కారణంగా చెప్పవచ్చు. ఇక ఆమె డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే టీ వేలును ఢీ కొడుతున్నారు. స్థానికుడైన వేలు నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి కావడంతో గెలుపు కోసం ఆమె మరింత శ్రమించక తప్పదు. గత ఐదు సంవత్సరాలలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమా వేలులో ఉన్నప్పటికీ, టీవీకే తరపున ఆ పార్టీ కోశాధికారి వెంకటరమణన్ ఇక్కడ రేసులో ఉండడంతో ఓట్ల చీలిక టెన్షన్ రేపుతోంది.విజయ్ అభిమానులు, యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో వెంకటరమణన్ ఉన్నారు. నామ్ తమిళర్కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా అరుణ్ పోటీ చేస్తున్నారు. తమిళ జాతీయవాదం, స్వచ్ఛమైన రాజకీయాల నినాదంతో ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. వీరితో పాటూ తమిళగ ద్రావిడర్ కట్చి నుండి మూర్తి, స్వతంత్ర అభ్యర్థిగా స్థానికుడైన విజయకృష్ణ కూడా ఇక్కడ రేసులో ఉన్నారు. -
సంఘం నిర్వాహణ బాధ్యతలు సులభం కాదు
తమిళ సినిమా: దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం నూతన కార్యవర్గం పరిచయం, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు గెలుచుకున్న వారికరిని సత్కరించే అ వేడుక ఆదివారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ జరిగింది. దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం 2026– 2029 ఏడాదికిగాను అధ్యక్షుడిగా గోపి కష్ణ, కార్యదర్శిగా ఉమాశంకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు లింగుస్వామి,నిథిలన్, కార్తీక్ సుబ్బరాజ్, ఎళిల్, నిర్మాత టీ.శివ, కదిరేశన్ ,ధనుంజయన్, కరు.నాగరాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ వేదికపై దక్షిణ భారత సినీ ఎడిటర్ల నూతన కార్య నిర్వాహకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్న కళాకారులను సత్కరించారు.ఈ సందర్భంగా ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణి మాట్లాడుతూ 2026 –2029 ఏడాదికి గాను నిర్వాకం బాధ్యతలు చేపట్టిన నూతన దక్షిణ భారత సినీ ఎడిటర్ల సంఘం నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు గెలుచుకున్న కళాకారులను శుభాకాంక్షలు అన్నారు. ఫెఫ్సీకి ఎడిటర్ల సంఘం తమ శక్తికి మించి భాగస్వామ్యం అందిస్తోంది అన్నారు. ఎడిటింగ్ నిర్వహణ అన్నది ఛాలెంజింగ్ తో కూడుకున్నది అనీ, శారీరకంగానూ, మానసికంగానూ శ్రమతో కూడుకుందని పేర్కొన్నారు. అదేవిధంగా సంఘం నిర్వాహక బాధ్యత అన్నది అంత సులభం కాదు అన్నారు. ఫెఫ్సీని చూసి ముందు తనకు భయం వేసింది అనీ, అయితే ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. తాను మొదటి నుంచి చెబుతోంది ఒక్కటేనని, నిర్మాతలు బాగుంటేనే మనం మంచిగా పని చేయగం అని ఆర్కే. సెల్వమణి పేర్కొన్నారు. -
నామినేషన్లకు తెర..!
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి,విరుదాచలంలో డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, సాత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడునైనార్ నాగేంద్రన్, అవినాశిలో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ నామినేషన్లు సమర్పించారు. వివరాలు.. 234 నియోజకవర్గాలతో కూడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం గత నెల 30వ తేదిన ప్రారంభమైన విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలు కూటమిగా, నామ్ తమిళర్ కట్చి, టీవీకేలు ఒంటరిగా, పురట్చి తలైవర్ మక్కల్ కట్చి, పీఎంకే మరో కూటమిగా ఎన్నికల్లోకి వెళ్లాయి. తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నామినేషన్ల పర్వం శరవేగంగా సాగింది. శనివారం నాటికి 234 అసెంబ్లీ నియోజకవర్గాలలలో 3430 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో పురుషులు 2731, మహిళలు 698 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. ఈ పరిస్థితులలో చివరి రోజైన సోమవారం సుమారు 1700 లకు పైగానామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్య నేతల దాఖలు సేలం ఎడప్పాడి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నామినేషన్ సమర్పించారు. చివరి రోజున పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు నామినేషన్లు వేశారు. 8వ సారి పోటీకి నామినేషన్ సమర్పించిన పళణిస్వామి మీడియాతోమాట్లాడుతూ, 234 స్థానాలలో 210 స్థానాలలో అన్నాడీఎంకే కూటమి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15న కన్యాకుమారిలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఇక, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ కాట్పాడిలో నామినేషన్ వేశారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం బోడినాయకనూరు నియోజకవర్గంలో ప్రపథమంగా డీఎంకే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. డీఎంకేకు చెందిన కొందరు అభ్యర్థులతో పాటుగా ఈ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థులందరూ నామినేషన్ సమర్పించారు. ఇక, బీజేపీ అభ్యర్థులందరూ చివరి రోజున నామినేషన్ వేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి మైలాపూర్లో తమిళి సై సౌందరరాజన్, అవినాశిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి కేంద్ర సహాయమంత్రి ఎల్ మురుగన్ నామినేషన్ వేశారు. సాత్తూరులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెహ్వాల్తో కలిసి బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ నామినేషన్ దాఖలు చేశారు. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్తన భర్త విజయకాంత్ను తొలిసారిగా అసెంబ్లీకి పంపించిన విరుదాచలం నియోజకవర్గంలో నామినేషన్ సమర్పించారు. ధర్మపురిలో పీఎంకే అభ్యర్థిగా సౌమ్య అన్భుమణి నామినేషన్ వేశారు. కాగా, అనేక చోట్ల పీఎంకేలో ఓ వైపు అన్భుమణి మద్దతు అభ్యర్థులు, మరో వైపు రాందాసు మద్దతు అభ్యర్థులు నామినేషన్ల సమయంలో కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, విరుదునగర్ రెడ్డియార్ పట్టికి చెందిన అమృత పాండి(30) అనే సామాజిక కార్యకర్త స్వతంత్ర అభ్యర్థిగా విరుదునగర్లో నామినేషన్ దాఖలు చేయడానికి చొక్కా ధరించకుండా అర్ధనగ్నంగా వచ్చాడు. పేదరికాన్ని చాటే విధంగా తాను ఈ విధంగా వచ్చినట్టు పేర్కొన్నా, పోలీసులు అనుమతించ లేదు. చివరకు చొక్కా ధరించి నామినేషన్ సమర్పించాడు. ముగిసిన నామినేషన్ల పర్వం మార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరగనన్నది. ఉప సంహరణ తదుపరి 9వ తేదిన తుది జాబితాను ప్రటించనున్నారు. ఆరు గంటల వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు. -
గెలిస్తే మంత్రి పదవి..!
– తిరువయ్యారు అభ్యర్థికి ఉదయ నిధి ఆఫర్ సాక్షి, చైన్నె : తిరువయ్యారు అభ్యర్థి దురై చంద్రశేఖర్కు మంత్రి పదవిని డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ ఆఫర్ చేశారు. ఆయన్ని భారీ ఆధిక్యంతో గెలిపిస్తే ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో తిరువయ్యారు ఓటర్లకు ఉదయనిధి సూచించారు. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రంలో దూసుకెళ్తున్నారు. తాజాగా డెల్టా జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో తిరువయ్యారు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన హామీ ఇచ్చారు. తిరువయ్యారు డీఎంకే అభ్యర్థి దురై చంద్రశేఖరన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటానని ఓటర్లకు వాగ్దానం చేశారు. 60 వేల ఓట్ల మెజార్టీ ఇస్తే.. మంత్రి పదవి ఖాయం అని తంజావూరు జిల్లాలోని తిరువయ్యారు నియోజకవర్గ అభ్యర్థి దురై చంద్రశేఖరన్కు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. సొంత నియోజకవర్గాన్ని కూడా మర్చిపోయా ప్రచార జోరులో ఉన్న ఉదయనిధి తన వ్యక్తిగత పోటీ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కూడా చేపాక్కం– ట్రిప్లికేన్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయి ఉండటంతో తాను అభ్యర్థిని అన్న విషయాన్నే తరచుగా మర్చిపోతున్నానని వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రచారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామిని ఉదయ నిధి టార్గెట్ చేశారు. ఆయనకు తానంటే ఎనలేని ప్రేమ, ఇష్టం అని వ్యాఖ్యలు చేశారు. ఆయన లాగా కాళ్లు పట్టుకోవడం తనకు చేత కాదంటూ గతంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ కాళ్ల మీద పళణి స్వామి పడ్డ ఫొటోలను ప్రదర్శిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. సిక్సర్ కొట్టాలి దురై చంద్రశేఖరన్ ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఆరోసారి విజయం సాఽ దించి ‘సిక్సర్’ కొట్టాలని ఆకాంక్షించారు. అంతే కాదు ఆయనను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపి స్తే, మంత్రిని చేయాలని నాయకుడు (సీఎం స్టాలిన్)కి విజ్ఞప్తి చేస్తాను అని ప్రకటించారు. తంజావూరు జిల్లా డీఎంకేకు కంచుకోట అని, గత ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాలకు గాను 7 స్థానాల్లో డీఎంకే కూటమి గెలిచిందని గుర్తు చేశారు. దివంగత నేత కరుణానిధి ఈ జిల్లా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రస్తుత సీఎం స్టాలిన్ కూడా తనను తాను ఎల్లప్పుడూ ‘డెల్టా బిడ్డ’గా చెప్పుకుంటారని పేర్కొంటూ, అదే ఇంటి బిడ్డంగా గర్వంగా తాను కూడా ఇక్కడికి వచ్చానని ఉదయనిధి పేర్కొన్నారు. -
రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థులపై పిటిషన్
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వుడు స్థానాల విషయంలో సోమవారం దాఖలైన ఓ కీలక పిటిషన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన నియోజకవర్గాల్లో కేవలం హిందూ, సిక్కు , బౌద్ధ మతాలను అనుసరించే వారిని మాత్రమే పోటీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను చైన్నె హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారించనుంది. హిందూ మక్కల్ కట్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జున్ సంపత్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషనర్ వాదన అర్జున్ సంపత్ తరపు న్యాయవాది ఎస్. కార్తికేయబాలన్ కోర్టులో తన వాదనలను వినిపిస్తూ పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించేవారిని మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా పరిగణించాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఈ స్పష్టం చేసినట్టు వివరించారు. తమిళనాడులోని మొత్తం 44 రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 90 శాతం మంది హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందని వారు (ప్రధానంగా క్రైస్తవ మతానికి మారిన వారు) ఉన్నారని పిటిషనర్ ఆరోపించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థుల మతపరమైన స్థితిగతులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఈ మేరకు ఎన్నికల అధికారులందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది మంగళవారం (ఏప్రిల్ 7) నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఒకవేళ ఈ లోపు స్పష్టత రాకపోతే అనర్హులు పోటీ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది అత్యవసర విచారణ కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి అరుల్ మురుగన్తో కూడిన ధర్మాసనం, మంగళవారం కేసును విచారిస్తామని ప్రకటించారు. -
ప్రశాంత్ పుట్టిన రోజు సందర్భంగా..
తమిళసినిమా: టాప్స్టార్ ప్రశాంత్ పుట్టిన రోజు వేడుకలు సోమవారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నిర్మాత కలైపులి ఎస్.ధాను ,టీ.శివ, కథిరేశన్, ఫైవ్స్టార్ కథిరేశన్, జీవీ.ప్రకాశ్కుమార్, ఆర్కే.సురేశ్, నటి దేవయాని నటుడు విశాల్, దర్శకుడు వెట్రిమారన్, దర్శకుడు కేఎస్.రవికుమార్, చరణ్ తదితరులు పాల్గొని ప్రశాంత్కు శుభాకాంక్షలు అందించారు. అదేవిధంగా ప్రశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ను వెల్లడించారు. ఈ చిత్రానికి రంజన్ అనే టైటిల్ను నిర్ణయించారు. స్టార్ మూవీస్ పతాకంపై ప్రీతీ త్యాగరాజన్ సమర్పణలో శాంతి త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా నిర్మాత కథిరేశన్ వారుసుడు హరిని, నటి దేవయాని వారసురాలు ప్రియాంకను యువ జంటగా పరిచయం చేస్తున్నారు. కాగా జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, రవియాదవ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. కాగా ప్రశాంత్ పుట్టిన రోజున ఈ విషయాన్ని దర్శకుడు త్యాగరాజన్ వెల్లడించారు. ఇది చాలా సంతోషకరమైన రోజు అని నటుడు ప్రశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనకు శుభాకాంక్షలు అందించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విశాల్ మాట్లాడుతూ నటుడు ప్రశాంత్ చూసి తాను చాలా ఆసూయపడేవాడినని అన్నారు. తన చిన్నతనంలోనే ఆయన టాప్స్టార్గా రాణించారని, చాలా స్మార్ట్గా ఉండడంతో అమ్మాయిలు ఆయన్ని ఎక్కువగా ఇష్టపడేవారని అన్నారు. అదే విధంగా ఈ చిత్రం ద్వారా యువ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న నిర్మాత కథిరేశన్ వారసుడు హరి, నటి దేవయాని వారసురాలు ప్రియాంకలకు శుఽభాకాంక్షలు తెలిపారు. రంజన్ చిత్ర యూనిట్తో సినీ ప్రముఖులు -
రాజ్య సభలో ఆరుగురు ప్రమాణ స్వీకారం
సాక్షి, చైన్నె: తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏక గ్రీవంగా ఎంపికైన ఆరుగురు సభ్యులు సోమ వారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రపథమంగా రాజ్య సభభలో డీఎండీకే తరఫున సుదీష్ అడుగు పెట్టడంతో తమ దివంగత నేత విజయకాంత్ ఫొటోను సభలో ప్రదర్శించారు. రాష్ట్రానికి చెందిన డీఎంకే – తిరుచ్చి శివ, అందియూరు సెల్వ రాజ్, కనిమొళి సోము, ఎన్ఆర్ ఇలంగో, అన్నాడీఎంకే తరఫున తంబిదురై, తమిళ మానిల కాంగ్రెస్కు చెందిన జీకే వాసన్ పదవీ కాలం ముగియడంతో ఈ స్థానాల భర్తీకి గత నెల ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 14మంది నామినేషన్లు దాఖ లు చేయగా, ఆరుగురు ప్రధాన అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే పరిశీలనలో పరిగణనలోకి తీసు కున్నారు. దీంతో వారంతా ఏకగ్రీవంగా ఎంపికై నట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.శాంతి గత నెల ప్రకటించారు.ఎన్నికై న వారిలో అధికార డీఎంకే కూటమిలో నలుగురు, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిలో ఇద్దరు ఉన్నారు. వీరిలో డీఎంకే కూటమిలో డీఎండీకే తరఫున ఎల్కే సుదీష్ తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టి ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. డీఎండీఎకే కండువా, విజయకాంత్ చిత్రంతో ఆయన రాజ్య సభలో అడుగు పెట్టారు. ఇక, అన్నాడీఎంకే నుంచి తంబిదురై మరోసారి మళ్లీ సభలో అడుగు పెట్టారు. పీఎంకే తరఫున అన్బుమణి మూడోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక, డీఎంకే నుంచి తిరుచ్చి శివ వరుసగా ఆరోసారి అడుగు పెట్టారు. అలాగే, డీఎంకే నుంచి కాన్ స్టంట్ రవీంద్రన్, ఈ కూటమిలోని కాంగ్రెస్కు చెందిన క్రిష్టోఫర్ తిలక్ మొదటిసారి రాజ్యసభలో అడుగు పెట్టారు. వీరంతా తమిళంలోనే ప్రమాణ స్వీకారం చేసి తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తే, వీరికి తమిళంలోనే చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సైతం శుభాకాంక్షలు చెప్పడం విశేషం! కొత్తగా ఎంపికై న ఈఆరుగురి పదవీ కాలం 2032 వరకు ఉంటుంది. -
అరుణాచలేశ్వరాలంలో పంగుణి ఉత్సవంలో తీర్థవారి
వేలూరు: తమిళ పంగుణి మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అరుణాచలేశ్వరాలయంలో డిసెంబర్ మాసంలో మహా దీపోత్సవం పది రోజుల పాటూ జరుగుతుంది. అదేవిధంగా పంగుణి ఉత్సవాలను కూడా మార్చి మాసంలో నిర్వహించడం ఆనవాయితీ. అందులో బాగంగా పంగుణి మాత కళ్యాణోత్సవం పంచమూర్తుల సాక్షిగా ఈనెల 2వ తేదిన జరిగింది. అదే రోజు సాయంత్రం అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారి ఆలయ ద్వజా రోహణం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో బాగంగా ఆరవ రోజైన సోమవారం తామర కోనేటిలో తీర్థవారి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో తిరుకళ్యాణోత్సవం సమయంలో ఉంచిన నవధాన్యాలు కోనేటిలో వదిలారు. ముందుగా అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి తామర కోనేటి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కోనేటి వద్ద అన్నామలైయార్కు హరోం హరా అంటూ నామస్మరణాలు చేసుకొని పూజలు చేసి తీర్థవారి నిర్వహించారు. అనంతరం అన్నామలైయార్, ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారిని రాత్రి భక్తుల దర్శనార్థం మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
బల ప్రదర్శన నడుమ నామినేషన్లు
తిరువళ్లూరు: రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శన నడుమ డీఎంకే అన్నాడీఎంకే అభ్యర్థులు ర్యాలీగా వచ్చి తమ నామినేషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో నామినేషన్ల ప్రక్రియ గత 30న ప్రారంభమైంది. ఇప్పటికే తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, ఆవడి, అంబత్తూరు, మధరవాయల్, మాధవరం తదితర నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో నామినేషన్కు ఆఖరిరోజు కావడంతో తిరువళ్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు బలప్రదర్శనగా వచ్చి నామినేషన్లు వేశారు. డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఆర్ఎస్ భారతితో కలిసి ప్రారంభించారు. అనంతరం మద్దతుదారులతో కలిసి స్థానిక కామరాజర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. ఆ తర్వాత కూటమి నేతలతో కలిసి రాజేంద్రన్ నామినేషన్ను దాఖలు చేశారు. అలాగే, అన్నాడీఎంకే అభ్యర్థి బీవీ రమణ తన మద్దతుదారులతో తిరుపతి–చైన్నె జాతీయ రహదారి మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ కార్యదర్శి పన్నీర్సెల్వం, పీఎంకే రాష్ట్ర ఉప కార్యదర్శి బాలయోగి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
తండ్రి కోసం తనయుడి త్యాగం!
సాక్షి, చైన్నె : సాధారణంగా పిల్లల కోసం తండ్రులు త్యాగాలు చేస్తారు. అయితే ఇక్కడ తండ్రి కోసం తనయుడు ఏకంగా తనకు దక్కిన సీటును చివరిక్షణంలో త్యాగం చేశాడు. ఇది డీఎంకేలో పెద్ద చర్చకే దారి తీసింది. చివరి క్షణంలో తనయుడు తీసుకున్న నిర్ణయంతో చివరకు తండ్రినే అభ్యర్థిగా డీఎంకే ప్రకటించాల్సి వచ్చింది. వివరాలు.. ఈసారి డీఎంకే ముగ్గురు మంత్రులకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇందులో ఆర్. గాంధి, మనో తంగరాజ్, కయల్వెలి సెల్వరాజ్ ఉన్నారు. అయితే ఆర్. గాంధీకి బదులుగా ఆయన తనయుడు వినోద్ గాంధీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. తనకు సీటు ఇవ్వకుండా తనయుడికి ఇవ్వడంతో గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా తనయుడి నియోజకవర్గంలో కాకుండా, ఇతర నియోజకవర్గాలలో డీఎంకే అభ్యర్థుల కోసం గాంధీ రాజకీయ పావులు కదుపుతూ రావడంతో వినోద్ గాంధీ తన తండ్రిలోని అసంతృప్తి, ఆవేదనను గుర్తించినట్టున్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ తనకు దక్కిన ఎమ్మెల్యే సీటును తండ్రి కోసం త్యాగం చేస్తూ వినోద్ గాంధీ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధినేతకు దీనిని ఓ లేఖగా పంపించారు. రాణిపేట అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్కు, సోదరుడు ఉదయనిధి స్టాలిన్కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే, తన తండ్రికి మళ్లీ పోటీ చేయాలనే బలమైన కోరిక ఉందని, ఆయన ఇష్టాన్ని గౌరవిస్తూ, ఈ అవకాశాన్ని తిరిగి ఆయనకే అప్పగించాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ వస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. దీంతో డీఎంకే అధిష్టానానికి షాక్ తప్పలేదు. అదే సమయంలో మంత్రి గాంధీకి సీటు నిరాకరించడంపై ఆయన వర్గీయుల్లో తీవ్ర అసహనంతో ఉండటమే కాకుండా, వినోద్ గాంధీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. వినోద్ గాంధీకి పార్టీ వర్గాలు సహకరంచడం లేదన్న సమాచారంతో చివరకు గాంధీకి బీ ఫాం అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో తన కుమారుడు వినోద్, ఇతర కూటమి పార్టీ స్థానిక నేతలతో కలిసి గాంధీ ఆగమేఘాలపై నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
మేలూరులో విశ్వనాథన్కు షాక్..!
– స్థానిక కాంగ్రెస్లో వ్యతిరేకత సాక్షి, చైన్నె : మదురై జిల్లా మేలూరు నియోజకవర్గంలో కాంచీపురం మాజీ ఎంపీ విశ్వనాథన్కు పెద్ద షాక్ తగిలింది. ఆయన్ను అభ్యర్థిగా అంగీకరించే ప్రసక్తే లేదని అక్కడి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. డీఎంకే కూటమిలో మేలూరును కాంగ్రెస్కు పార్టీకి కేటాయించారు. ఈ సీటుకు చివరి క్షణంలో ఆదివారం అభ్యర్థిని ప్రకటించారు. స్థానికంగా ఉన్న పలువురు కీలక నేతలు సీటు కోసం ప్రయత్నించినా, చివరకు జనరల్ స్థానంలో వెనుకబడిన సామాజిక వర్గం నేత, కాంచీపురానికి చెందిన మాజీ ఎంపీ విశ్వనాథన్ను అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ స్థానిక నేతల్లో అసంతృప్తి రేగింది. దీంతో విశ్వనాథన్ ఒంటరిగా మిగలాల్సిన పరిస్థితి కలిగింది. సోమవారం మేలూరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఆయన్ను బయటకు వెళ్లి పోవాలంటూ స్థానిక నేతలు హెచ్చరించారు. వారిని బుజ్జగించేందుకు విశ్వనాథన్ ప్రయత్నించినా స్థానిక నేతలు ఏమాత్రం తగ్గలేదు. ఆయన్ను నిలబెట్టి మరీ స్థానిక నేతలు కుర్చీల్లో కూర్చుని నిలదీయడంతోపాటు తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి ఆయన మరేమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ తనకు బీ–ఫాం ఇచ్చిన నేపథ్యంలో ఆయన తనతో పాటు కాంచీపురం నుంచి వచ్చిన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మేలూరులో పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఎన్సీసీ పెద్దలు రంగంలోకి దిగారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం.. – స్వస్థలాలకు ఉత్తరాది కార్మికుల ప్రయాణం కొరుక్కుపేట: తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 9వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో, తిరుప్పూర్లో పనిచేస్తున్న ఆయా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఓటు వేయడానికి తమ స్వస్థలాలకు బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. వివరాలు.. తిరుప్పూర్లోని నిట్వేర్ పరిశ్రమ , ఇతర ఉత్పాదక రంగాలలో వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ , అస్సాం తర్వాతి అతిపెద్ద ఉపాధి కల్పించే రాష్ట్రాలుగా ఉన్నాయి. ప్రస్తుతం వారి సొంత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఇక్కడి కార్మికులు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లి ఓటు వేయడానికి వీలుగా కంపెనీలు వారికి సెలవులు మంజూరు చేయాలని వస్త్ర పరిశ్రమతో సహా పారిశ్రామికవేత్తలందరికీ కార్మికశాఖ గత వారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని కారణంగా సెలవు ప్రకటించడంతో అస్సాం కార్యకర్తలు ఎన్నికలలో తమ ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఉత్సాహంగా తమ సొంత ఊళ్లకు తరలివస్తున్నారు. దీంతో తిరుప్పూర్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. -
క్లుప్తంగా
తిరుచ్చిలో 307 మంది రైతులకు సమన్లు అన్నానగర్: జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం అధ్యక్షుడు అయ్యక్కన్ను నేతత్వంలో 300 మందికి పైగా రైతులు, తమ వివిధ డిమాండ్లను నెరవేరుస్తూ గత ఏడాది నవంబర్ 18న ఢిల్లీలో నిరసన తెలిపేందుకు రైలులో బయలుదేరారు. ఆ సమయంలో అకస్మాత్తుగా నాగ్పూర్ రైల్వే స్టేషనన్లో దిగి నిరసన చేపట్టారు. ఈ విషయమై, రైల్వే రక్షణ దళం పోలీసులు అయ్యక్కన్ను సహా 307 మంది రైతులపై కేసు నమోదు చేశారు. దీని తర్వాత, మధ్యప్రదేశ్ రైల్వే పోలీసులు ఆదివారం అయ్యక్కన్ను ఇంటికి వెళ్లి, విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరు కావాలని అతనికి, 307 మంది రైతులకు సోమవారం సమన్లు జారీ చేశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ అభ్యర్థి ఫ్యాక్టరీలో ఐటీ దాడులు తిరువొత్తియూరు: పుదుచ్చేరి, ముత్యాల్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరం రాజేంద్రన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన దోమల నివారణ కాయిల్స్ ఫ్యాక్టరీ తట్టాంచావడి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, తట్టాంచావడి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న దోమల నివారణ కాయిల్స్ ఫ్యాక్టరీలో సోమ వారం ఉదయం పారామిలిటరీ బలగాల భద్రతతో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు 5 గంటల కంటే ఎక్కువ సమయం కొనసాగుతున్నాయి. నగదు పంపిణీ వంటి ఫిర్యాదుల కారణంగా ఆదాయపు పన్ను శాఖ అక్కడ రైడ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటన సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన ఫ్యాక్టరీలో జరిగిన తనిఖీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. మామల్లపురం బీచ్లో అమ్మన్ విగ్రహం లభ్యం అన్నానగర్: మామల్లపురం బీచ్లో 3 అడుగుల ఎత్తయిన అమ్మవారి విగ్రహం లభ్యమైంది. ఈ విషయంపై రెవెన్యూ శాఖ దర్యాప్తు చేస్తోంది. వివరాలు.. మామల్లపురం బీచ్లో ఆదివారం చాలా మంది పర్యాటకులు సముద్రంలో స్నా నం చేస్తుండగా, 3 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం ఒకటి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఆ విగ్రహంలో సగం మట్టి కూరుకుపోయి ఉంది. 200 కిలోల బరువున్న ఈ అమ్మవారి విగ్రహం ఒక పీఠం పై కూర్చుని, తన నాలుగు చేతులలో కుడి, ఎడమ వైపులా వరుసగా ఈటె, బాకు, కత్తి, గదను పట్టుకుని ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొందరు వీధి వ్యాపారులు ఒడ్డుకు కొట్టుకొచ్చిన దేవతా విగ్రహం గురించి మామల్లపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మట్టిలో కూరుకుపోయిన దేవతా విగ్రహాన్ని తవ్వి తీసి, ప్రతిష్టించారు. విగ్రహాన్ని తీసి విచారణ జరపాలని పోలీసులు రెవెన్యూ శాఖకు తెలియజేశారు. తిరుక్కలకుండ్రం తహసీల్దార్ దేవేంద్రన్ ఆదేశాల మేరకు, మామల్లపురం రెవెన్యూ అధికారి పుష్పరాజ్, అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి నియోజకవర్గంలో 32 మంది నామినేషన్ తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలకు చివరి రోజు పూర్తి కావడంతో తిరుత్తణి నియోజకవర్గంలో 32 మంది నామినేషన్ దాఖలు చేశారు.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23న పోలింగ్ జరుగనుంది. దీంతో నామినేషన్ల పర్వం మార్చి 30న ప్రారంభమై సోమవారం పూర్త య్యింది. తిరుత్తణి నియోజకవర్గంలో చివరిరోజు అన్నాడీఎంకే అభ్యర్ధి హరి, డీఎండీకే అభ్యర్ధి కృష్ణమూర్తి సహా 14 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు కోసం అన్నాడీఎంకే అభ్యర్ధి హరి అన్నాడీఎంకే కూటమి నేతలతో కలిసి రెండు వేలకు పైబడిన శ్రేణులతో భారీ ర్యాలీగా తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డీఎంకే కూటమి డీఎండీకే అభ్యర్ధి కృష్ణమూర్తి మున్సిపల్ కార్యాలయం నుంచి డీఎంకే కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి రెండు వేల మందికి పైబడిన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట డీఎంకే జిల్లా కార్యదర్శి చంద్రన్, మాజీ జిల్లా కార్యదర్శి భూపతి సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తిరువొత్తియూరు కోర్టుకు బాంబు బెదిరింపు తిరువొత్తియూరు: చైన్నె రాజాక్కాడై ప్రాంతంలో క్రిమినల్ న్యాయస్థానం ఉంది. సోమవారం ఉదయం యధావిధిగా కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోర్టులో బాంబు పెట్టామని కోర్టు ఈ–మెయిల్కు బెదిరింపు సమాచారం వచ్చింది. విషయం తెలుసుకున్న కోర్టులో ఉన్న వారంతా బయటకు వచ్చారు. తిరువొత్తియూరు పోలీసులు , బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని స్నిఫర్ డాగ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాంబు లేదని తెలిసింది. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సినీ నిర్మాత జాఫర్ సాఽధిక్ ఇంట ఐటీ సోదాలు
తమిళసినిమా: ఆ మధ్య మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే బెయిల్పై విడుదలైన సినీ నిర్మాత, వ్యాపారవేత్త జాఫర్ సాధిక్కు చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఆయనతో సంబంధం కలిగిన వారి ఇళ్లను.. మొత్తం చైన్నెలోని 15 ప్రాంతాల్లో ఎన్నికల స్క్వాడ్తో కలిసి ఐటీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. జాఫర్ సాధిక్ చైన్నె, ఢిల్లీ నగరాల్లో కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తూ భారీ ఎత్తున సంపాదించి ఆ సొమ్ము చిత్ర నిర్మాణానికి వెచ్చించినట్లు ఆయనపై అభియోగాలు మోపారు. ఢిల్లీ, చైన్నె పోలీసులు ఆయనతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా చైన్నె ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్ అధికారులతో కలిసి జాఫర్సాధిక్కు చెందిన ఇళ్లు,కార్యాలయాలు, స్థానిక పురషవాక్కమ్ బ్రిడ్జి సమీపంలోని గెస్ట్ హౌస్ తదితర 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అదే విధంగా జాఫర్ సాధిక్ నిర్మించిన చిత్రంలో నటించిన దర్శకుడు అమీర్ ఇంటిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ విస్తృతంగా సోదాలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
రికార్డుతో ఘనత చాటిన సీమాట్స్ విద్యార్థులు..!
సాక్షి, చైన్నె: వేగంగా హిమోగ్లోబిన్ స్క్రీనింగ్ నిర్వహించి, గరిష్ట సంఖ్యలో కౌమార దశలోని బాలికలకు రక్తహీనత పరీక్షలు చేసి, సీమాట్స్ విద్యార్థులు రికార్డు సాధించారు. రెండు గంటల్లోనే 653 మందికి పరీక్షలు సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ పరిధిలోని హెల్త్ సైన్సెస్ బ్లాక్లో భారీ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. నాలుగు గంటల సమయంలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే నర్సింగ్ కళాశాల బృందం తమ అసాధారణ సమన్వయంతో కేవలం రెండు గంటల్లోనే 653 మంది బాలికలకు స్క్రీనింగ్ పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌమార దశలో ఉన్న బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించడం, దానిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ ఘనతను రాబా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. నాట్యాచార్య తిలకవతి హాజరై, కళాశాల ప్రతినిధులకు మెడల్, ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. రికార్డు సాధించడంపై సీమాట్స్ గౌరవ చాన్సలర్ డాక్టర్ ఎన్ఎం.వీరయ్యన్, ప్రో చాన్సలర్ డాక్టర్ దీపక్ నల్లసామి, వైస్ చాన్సలర్ డాక్టర్ అశ్విని కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ షీజా వర్గీస్ మాట్లాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ ఎల్. పరిమళ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్.తమిళసెల్వి నేతృత్వంలో ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులను అభినందించారు. -
కాలువలో మునిగి ఇద్దరి మృతి
అన్నానగర్: కోయంబత్తూరు జిన్నింగ్ మిల్ ప్రాంతానికి చెందిన కార్తికేయన్ (42). ఇతడి బంధువు ఇరుకూరు నారాయణస్వామి లే అవు ట్ ప్రాంతానికి చెందిన రక్షణ్ (17). ఇతడు ఇటీవలే తన ప్లస్–2 పరీక్షలు రాశాడు. ఈ స్థితిలో కార్తికేయన్, అతని కుటుంబం, రక్షణ్ ఈరోడ్ జిల్లాలోని కొడివేరికి కారులో విహారయాత్రకు వెళ్లారు. పుంజైపులియంపట్టి సమీ పంలోని సెన్బగపుదూర్ కాలువ గట్టు గుండా వెళుతున్నప్పుడు, వారు కారును ఆపి, అందరూ స్నానం చేయడానికి కాలువలోకి దిగారు.లోతైన స్థలంలో స్నానం చేస్తుండగా కార్తికేయన్, రక్షణ్ మునిగి చనిపోయారు. ఈ సంఘటన గురించి పోలిసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కొరుక్కుపేట: శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల (ఎస్కేపీసీ) 23వ స్నాతకోత్సవాన్ని కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. చైన్నెలోని మద్రాస్ విశ్వవిద్యాలయ పరీక్షల కంట్రోలర్ (ఇన్న్చార్జ్) డాక్టర్ అరుల్ వాసు ముఖ్య అతిథిగా హాజరై 600 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 35 మంది యూనివర్సిటీ ర్యాంకర్లను ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యార్థులను జ్ఞాన సంపన్నులు కావాలని, విలువలను నిలబెట్టుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలన్నారు. గౌరవ కరస్పాండెంట్ చిన్ని బాలాజీ మాట్లాడుతూ, నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, నాయకత్వం, విలువలతో కూడిన సంపూర్ణ అభివద్ధి ద్వారా యువతులకు సాధికారత కల్పించాలనే నిబద్ధతను ఈ సంస్థ కొనసాగిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వనజ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నప్పిన్నై , డీన్ పీబీ.వనిత, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుత్తణి: బావిలో జారిపడి పాఠశాల విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తణి యూనియన్లోని ఎస్.అగ్రహారం గ్రామానికి చెందిన కరుణాకరన్ రైతు. అతని ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో పెద్దమ్మాయి వినిష(15) ఆర్కేపేట ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాశారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం కరుణాకరన్ తన పొలంలో పనులు చేసుకుంటుండగా అక్కడే వున్న వినిత ఆమె తమ్ముడు దిలీప్(12) ఇద్దరుకలిసి నీరు తాగేందుకు పొలం సమీపంలోని బావిలోకి దిగారు. నీరు తాగుతుండగా వినిత కాలు జారి బావిలో పడిపోయారు. అక్కడేవున్న ఆమె తమ్ముడు కేకలు విని అక్కడే పొలం పనులు చేసుకుంటున్న కరుణాకరన్తో పాటూ రైతులు బావిలో దూకి వినిషను కాపాడే ప్రయత్నం చేసారు. అయితే అప్పటికే బాలిక బావిలో మునిగిపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సంఘటన ప్రాంతం చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి బాలిక మృతదేహం వెలికితీయడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అనుసరించండి
– కలైమామణి ప్రొఫెసర్ జ్ఙానసంబంధం తిరువళ్లూరు: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న క్రమంలో విద్యార్దులు అందుకు అనుగుణంగా డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అనుసరించాలని విద్యార్థులకు కలైమామణి ప్రోఫెసర్ జ్ఞానసంబంధం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే ఇంజనీరింగ్ కళాశాలలో 18వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కళాశాల వ్యవస్తాపక అధ్యక్షుడు ఆర్ఎస్ మునిరత్నం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కలైమామణి జ్ఞానసంబందం హాజరై బహుమతులను ప్రదానం చేసి విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రేడియన్స్–2026 సావనీర్ను విడుదల చేశారు. దీంతో పాటు వేర్వేరు రంగాల్లో రాణించి విద్యార్దులకు 54 లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ ఆర్ఎం కిషోర్, ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్కుమార్, డీన్ రామర్, డైరెక్టర్ జ్యోతినాయుడు, కార్యదర్శి యలమంచి ప్రఽధీప్, సలహాదారులు విశ్రాంత ఐఏఎస్ అధికారి పిచ్చాండి, పళణిస్వామితో పాటూ పలువురు పాల్గొన్నారు. -
కలల ప్రపంచంలో రాహుల్ గాంధీ విహారం
సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇండియా కూటమిపై సోమవారం తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎక్కుపెట్టారు. సోమవారం సాయంత్రం తిరుకనూరులో జరిగిన ఎన్డీయే బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాస్తవ ప్రపంచంలో కాకుండా కలల లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడకు వచ్చి పాకిస్థాన్న్లో ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను భయపెడుతున్నారన్నారు. పుదుచ్చేరిలో ఇండియా కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే పదవుల కోసం ఇప్పుడే కొట్టుకుంటున్నారని విమర్శించారు. నారాయణస్వామి పాలనపై ధ్వజం గతంలో జరిగిన కాంగ్రెస్ పాలన పుదుచ్చేరిని వెనక్కి నెట్టిందని అమిత్ షా ఆరోపించారు. అభివృద్ధి కుంటుపడిందన్నారు.మాజీ సీఎం నారాయణస్వామి హయాంలో పుదుచ్చేరి అభివృద్ధిలో వెనుకబడింది. ఆ నష్టాన్ని పూడ్చడానికే తమకు ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు పుదుచ్చేరి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే మళ్లీ ఎన్డీయే కూటమినే గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత ఖర్గేకు కౌంటర్ గత ఎన్నికల్లో పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం సాధించినప్పుడు, అది ఒక చిన్న ప్రాంతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎగతాళి చేశారని అమిత్ షా గుర్తు చేశారు. అది 300 సీట్లు అయినా, 30 సీట్లు అయినా.. పుదుచ్చేరి భారతదేశంలో అంతర్భాగం. పుదుచ్చేరి తమ గుండెల్లో ఉందన్నారు. భారత్ విజయానికి పుదుచ్చేరి విజయం చాలా అవసరం అని స్పష్టం చేశారు. ఉద్యోగ మేళాలపై ప్రశంసలు మన్నడిపట్టు అభ్యర్థి, మంత్రి నమశ్శివాయం చేపట్టిన అభివృద్ధి పనులను అమిత్ షా ప్రశంసించారు. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించవచ్చనే నమ్మకాన్ని నమశ్శివాయం వాస్తవం చేసి చూపించారని కొనియాడారు. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారా డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అమిత్ షా ఓటర్లకు హామీ ఇచ్చారు. సభలో ఎన్డీయే అభ్యర్థులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


