breaking news
Tamil Nadu
-
పురపాలికల్లో పై‘చేయి’
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్లలో డివిజన్లతోపాటు సింహభాగం మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను తన ఖాతాలో వేసుకుంది. కనీసం 90 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టణ స్థానిక సంస్థల్లో పట్టు సాధించగలిగింది. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో భాగంగా 81 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది.వీటితోపాటు నలుగురు స్వతంత్రులు, ఒక ఏఐఎఫ్ బీ అభ్యర్థి గెలుపొందిన స్థానాలు కూడా కాంగ్రెస్ మద్దతుతోనే వచ్చాయి. ఈక్రమంలో మరో 11 మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్చైర్మన్ల ఎంపిక ప్రక్రియ మిగిలి ఉండగానే, 86 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక, పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ పీఠాలు తమవేననే ధీ మా అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం. ఆది నుంచీ ఆచితూచి పురపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మొదటి నుంచీ ఆచితూచి వ్యవహరించింది. అభ్యర్థుల ఎంపిక మొదలు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ముగిసేంతవరకు పార్టీ నాయకత్వం సమన్వయంతో వ్యవహరించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యతలు తీసుకుని ఎన్నికలను ఎదుర్కొన్నారు. వీరికి తోడు పీసీసీ నియమించిన సమన్వయకర్తలు, పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారు పార్టీ అభ్యర్థుల గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు.పీసీసీ ఏర్పాటు చేసిన వార్రూం కూడా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికల దిశలో నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. ప్రతి రోజూ ఎన్నికల సరళిని పర్యవేక్షించిన ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి, తగిన సూచనలు చేశారు. గత నెలలో తన విదేశీ పర్యటనకు ముందు, ఆ తర్వాత రెండు దఫాలుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.రేవంత్ బీజేపీ, బీఆర్ఎస్లను నేరుగా తన మాటలతో ఢీ కొట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగలిగారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ కూడా పార్టీ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పురపాలిక ఎన్నికల్లో ఘన విజయం దిశగా ముందుకు నడిపించారు. మెదక్లోనే... ఓ మోస్తరు పోయిన దగ్గరే వెతుక్కోవాలనే నానుడి చందంగా.. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో కొంతమేరకు ప్రతికూల ఫలితాలు వచి్చన ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాని నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునే విషయంలో పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 90శాతానికి పైగా దక్కించుకోగా, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు, మెదక్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించగలిగింది.మరీ ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను పట్టుపట్టి మరీ అధికార పార్టీ చేజిక్కించుకుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత స్థానం కావడంతో అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠంపై కూర్చోగలిగింది. సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక, ఒక మెట్టు తగ్గి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వడంలోనూ తాము చాకచక్యంగా వ్యవహరించామ ని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి.ఇక్కడ మేయర్ పీఠం సీపీఐకి ఇవ్వడం ద్వారా ఆ పార్టీ భవిష్యత్తులో చేసే రాజకీయ పదవుల డిమాండ్కు చెక్ పెట్టగలిగామని అంటున్నాయి. ఇక, పుర పీఠాలనూ ఎక్కువ శాతం బీసీ వర్గాలకు కేటాయించామని, ఆయా వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాలతోపాటు రిజర్వు చేయని మున్సిపాలిటీలను కూడా వెనుకబడిన వర్గాలకు కేటాయించామని చెబుతున్నాయి. తాము చెప్పిన విధంగా 50 శాతం కంటే ఎక్కువ బీసీలకు అవకాశం కలి్పంచామని కూడా పేర్కొంటున్నాయి. అయితే, ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకునే విషయంలోనే వ్యూహాత్మక వైఫల్యం జరిగిందని, దీనిపై సమీక్ష చేస్తామని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
క్షేత్ర పాలకునికి అభిషేక పూజలు
తిరుమల: గోగర్భం సమీపంలో రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె నుంగంబాక్కంలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరిగిన ఘర్షణలో ప్రత్యేక దళాల పోలీసుపై దాడి చేసిన కేసులో బీజేపీ, డీఎంకేకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..చైన్నె నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో సలీం ప్రత్యేక దళాల పోలీసుగా పనిచేస్తున్నాడు. గత వారం అతను రోడ్డుపై వెళ్తునప్పుడు ఐదుగురు వ్యక్తుల ముఠా గొడవ చేసి అతనిపై దాడి చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసు సలీం నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కుండ్రత్తూర్ ప్రాంతానికి చెందిన జగన్నాథన్, అనగాపుత్తూర్ ప్రాంతానికి చెందిన మహాదేవన్, శరవణన్, పుస్తక దుకాణం యజమాని ధనశేఖరన్, రవి దాడి చేసినట్లు తేలడంతో వారిని అరెస్టు చేసి ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వాసవీ క్లబ్ చెన్నపట్నా, వనిత చైన్నెపట్న సంయుక్త ఆధ్వర్యంలో రుద్రాభిషేకం పూజలను వైభవంగా నిర్వహించారు. చైన్నె మాధవంలో ఆదివారం నిర్వహించిన రుద్రాభిషేకంలో ఆయా క్లబ్ల సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శివలింగానికి పాలు, పెరుగు పంచామృతం, గంధం, పన్నీరుతో అభిషేకాన్ని మాధవరం కర్పగాంభీక సమేత కై లాసనాథర్ ఆలయ అర్చకులు బృందం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఇందులో క్లబ్ అధ్యక్షులు జీఆర్ అశోక్ కుమార్, ఏ.జనని, కార్యదర్శులు జీవీ రాధాకృష్ణన్, గీతాలక్ష్మీ , ట్రెజరర్లు డాక్టర్ ఎం.చంద్ర గుప్తా, తనూజ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఖరారు చేసిన మధురై ధర్మాసనం అన్నానగర్: బిడ్డకు విషం ఇచ్చి చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష విధించాలన్న దిగువ కోర్టు నిర్ణయం సరైనదేనని హైకోర్టు మధురై శాఖ తీర్పునిచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపం మల్లి ప్రాంతానికి చెందిన మునీశ్వరన్. ఇతని భార్య రేవతి. ఈమె కళాశాల ప్రొఫెసర్. వీరికి సాధన అనే కుమార్తె ఉంది. ఆ బిడ్డ పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. బిడ్డను చూసుకోవడానికి రేవతి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే, బిడ్డను నిరంతరం చూసుకోవడం, మానసిక ఒత్తిడి కారణంగా, 2018లో వారు శీతల పానీయంలో విషం కలిపి తమ బిడ్డకు ఇచ్చారు. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆ బిడ్డ 6.10.2018 న మరణించింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, మల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవిల్లిపుత్తూరు మహిళా కోర్టు కేసును విచారించింది. కాగా బిడ్డ విష ప్రయోగం ద్వారా మరణించినట్లు తేలడంతో ఆ బిడ్డ తల్లిదండ్రులకీ జీవిత ఖైదు విధించారు. దీనికి వ్యతిరేకంగా దంపతులు హైకోర్టు మధురై శాఖకు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఈ కేసును న్యాయమూర్తులు జి.కె. ఇళంధిరైన్, ఆర్. పూర్ణిమ విచారించి శిక్షను ఖరారు చేశారు. తిరువొత్తియూరు: సేలం, ఈరోడ్, తిరుప్పూర్ , పోతనూర్ మీదుగా వెళ్లే బెంగళూరు – తిరువనంతపురం నార్త్ స్పెషల్ రైలును మరో నెల పొడిగించారు. గళూరు నుంచి తమిళనాడు మీదుగా కేరళకు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణికుల రద్దీని నివారించడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. దీని ప్రకారం, బెంగళూరు నుండి సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోతనూర్, పాలక్కాడ్ మీదుగా తిరువనంతపురానికి వారపు ప్రత్యేక రైలు నడుస్తోంది. దీని గడువు కాలం ప్రస్తుత నెల (ఫిబ్రవరి, 2026) చివరితో ముగియనుండగా, మరో నెల పాటు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీని ప్రకారం, బెంగళూరు–తిరువనంతపురం నార్త్ వీక్లీ స్పెషల్ రైలు (06523), మార్చి 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి సోమవారం (5 రోజులు సేవలు) పొడిగించనున్నారు. ఇది బెంగళూరులో రాత్రి 7.25 గంటలకు బయలుదేరి, కృష్ణరాజపురం, బంగారుపేట మీదుగా అర్ధరాత్రి 12.05 గంటలకు సేలం చేరుకుంటుంది. తర్వాత 10 నిమిషాల్లో బయలుదేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు ఈరోడ్, తెల్లవారుజామున 1.50 గంటలకు తిరుప్పూర్ చేరుకుని, పోతనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, కొట్టాయం, ఎర్నాకుళం, కొల్లం మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. ఈనేపథ్యంలో తిరువనంతపురం నార్త్–బెంగళూరు వీక్లీ స్పెషల్ రైలు (06524), మార్చి 3వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతి మంగళవారం (5 సేవలు) పొడిగించనున్నారు. తిరువనంతపురం నార్త్ స్టేషన్లో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, పాలక్కాడ్ మీదుగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.05 గంటలకు సేలం చేరుకుంటుంది. తర్వాత బంగారుపేట, కృష్ణరాజపురం మీదుగా ఉదయం 8.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ రైలు సేవను ఉపయోగించుకోవాలి అని దక్షిణ రైల్వే పరిపాలన కోరింది. -
జననాయకన్ చిత్రానికి మరో షాక్
తమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్ చిత్రానికి ఎదురౌతున్న అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నటుడు విజయ్ చిత్ర షూటింగ్కు ముందే తన చిత్ర విడుదల సమయంలో ఆటకాలు ఎదురౌతాయని, వాటిని అధిగమించగలరా? అని ఏ ముహూర్తాన అన్నారోగాని, అక్షరాలా అదే జరుగుతోంది. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ కోసం గత డిసెంబర్ నెలలో సెన్సార్బోర్డుకు పంపారు. అయితే ఇప్పటి వరకూ సర్టిఫికెట్ రాలేదు. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్రాలన్నీ సఫలం కాలేదు. చివరికి హైకోర్టు నుంచి పిటిషన్ను వాపస్ తీసుకున్నారు. అయితే సెన్సార్ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయకన్ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికెట్ ఇస్తుందో తెలియని పరిస్థితి. జనవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెల 20వ న చిత్రం విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్ సినిమాస్ సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్ 30 వరకూ విడుదల అవ్వడానికి అవకాశం లేదని, అందుకే టిక్కెట్ బుక్కింగ్ డబ్బులను రిఫండ్ చేసుకోండి అని పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఈ ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాంటిది ఆ సమయంలో జననాయకన్ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పరిస్ధితులు విజయ్ అభిమానులకు జీర్ణయింకుకోవడం కష్టమే అవుతుంది. ఇక జననాయకన్ చిత్ర నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
నామక్కల్ హనుమంతుడికి ప్రత్యేక అభిషేకం
సేలం: మాసి మాసం మొదటి ఆదివారం నాడు ప్రపంచ ప్రఖ్యాత నామక్కల్ ఆంజనేయునికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ కార్యక్రమం జరిగింది. వివరాలు.. నామక్కల్ నగరం మధ్యలో నరసింహ స్వామి, నామకిరీతాయర్ ఆలయాలకు ఎదురుగా, ఒకే రాయితో నిర్మించిన 18 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. మాసి మాసం మొదటి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆంజనేయ స్వామికి 1,008 వడమాలలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం, ఉదయం 10 గంటలకు, ఆంజనేయ స్వామికి నెయ్యి, పసుపు, గంధం, సీకాయ్ తిరుమంజల్, 1,008 లీటర్ల పాలు, పెరుగు, పంచామృతం వంటి సువాసనగల పదార్థాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కనకాభిషేకంతో అభిషేకం ముగిసింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. మధ్యాహ్నం తెర దించి మహా దీపారాధన నిర్వహించారు. నామక్కల్ కోట ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఇళయరాజా అధికారులు చేశారు. -
భక్తజనసంద్రమైన శైవ క్షేత్రాలు
● రాత్రంతా జాగారం ● మరుమోగిన శివనామ స్మరణ ● ఆధ్యాత్మికతను చాటిన పర్వదినం శివాలయాలలో భక్తుల పూజలు, అభిషేకాలుతిరువొత్తియూరు: చైన్నె పాత చాకలిపేటలో శ్రీ కపిల వినాయక దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశాలాక్షి సమేత శ్రీ విశ్వనాథస్వామికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.కన్యకాపరమేశ్వరి ఆలయంలో రుద్రాభిషేక పూజలు సాక్షి, చైన్నె: ‘హరహర మహాదేవ.. శంభో శంకర’ అన్న నినాదం రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో ఆదివారం మారుమోగాయి. భక్తజనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివుడి సన్నిధుల్లో మిన్నంటాయి. ప్రత్యేక అభిషేకాది పూజలు జరిగాయి. భక్తిభావం చాటే రీతిలో సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. శివ భక్తులు తమ తమ ఇళ్లల్లో ఉదయాన్నే తల స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షతో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్త్రోత్త్రం, శివ సహస్త్ర నామ పారాయణాలు పటించారు. ఇక సాయం సంధ్య వేళ శివాలయల్లో ఆధ్యాత్మిక వాతావరణం మిన్నంటింది. వేకువజాము వరకు.. రాష్ట్రంలోని రామేశ్వరం రామనాఽథ స్వామి ఆలయం, కంచిలోని ఏకాంభరేశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, కుట్రాలంలోని కుట్రాలనాథేశ్వరర్ ఆలయం, తిరునాగేశ్వరం ఆలయం, కోయంబత్తూరులోని పొల్లాచ్చి సుందరేశ్వరాలయం, కన్యాకుమారిలోని ధను మలయాన్ ఆలయం, కరూర్ జిల్లాలోని ఏకపురీశ్వరర్ ఆలయం...ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రధాన శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. చైన్నె మైలాపూర్లోని కపాలీశ్వర ఆలయం, తిరువాన్మీయూరు మరుదీశ్వర ఆలయం, వేళచ్చేరి శ్రీ దండీశ్వర ఆలయం, తిరువేర్కాడు వీరకత్తీశ్వర ఆలయం, పార్క్టౌన్లోని ఏకాంబరీశ్వరాలయం, వడపళణి వేంగీశ్వరాలయం, సైదాపేట కారనీశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వేకువజాము వరకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాల సందర్శనకు పరుగు కన్యాకుమారిలో శివాలయం వైపుగా పరుగో పరుగుతో యాత్ర భక్తి భావంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు జరిగింది. ఇక్కడి విలవంగోడు, కల్కులం పరిధిలో ప్రసిద్ధి చెందిన 12 శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు శివాలయాలకు భక్తులు పరుగున వెళ్లి దర్శించుకున్నారు. తిరుమలై మహాదేవర్ ఆలయం నుంచి 110 కి.మీ దూరం ఈ పరుగు పయనం యాత్ర జరిగింది. మార్గం మధ్యలోని కాపుకాడు, సెన్నితోట్టం, పల్లన్ విలై, మార్తాండం మీదుగా తొలుత పర్యటించి తీకుచ్చిమహాదేవర్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత అరుమనై, కలియల్ తిరుప్పరపు వీర భద్ర ఆలయం, తిరునంది కరై ఆలయం, కులశేఖరం మార్గం గుండా పయనించి పొన్ మనై మహాదేవర్ ఆలయం, కల్కులం నీలకంఠ స్వామి ఆలయం, తిరువిడై కోడు సడయప్పర్ ఆలయం దర్శించుకున్నారు. చివరగా అమరావతి కోలిపోర్ విలై మీదుగా పయనించి మహాదేవర్ ఆలయంలో పూజలు నిర్వహించారు. దారి పొడవున భక్తులకు ప్రజలు, సంఘాలు సొంటి నీళ్లు, వేరుశనగలు, పానకం, మజ్జిగ, గంజి, పండ్లు అందజేస్తారు. వేలాది మంది ఈ యాత్రలో పాల్గొనడంతో దారి పొడవున భక్తి భావంతో శివ నామస్మరణ మిన్నంటింది. ఇక సేలంలో 12 అడుగులతో 10 టన్నులో శివలింగంను తీర్చిదిద్ది పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు.. అన్ని శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి విడత, తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో విడత పూజ, పన్నెండు నుంచి వేకువ జామున మూడు గంటల వరకు మూడో విడత, మూడు నుంచి నాలుగు గంటల వరకు నాలుగో విడత చొప్పున నాలుగు కాల పూజలు భక్తి భావాన్ని నింపాయి. శివ లింగాలకు పూజలు చేసిన భక్తులు శివుడు, పార్వతీ దేవిలను దర్శించుకున్నారు. అన్ని ఆలయాల్లోనూ రాత్రి వాహనాల్లో స్వామి , అమ్మవార్లను అధిష్టించి ఆలయ పుర వీధుల్లో ఊరేగింపులు జరిగాయి. ఆలయ ఆవరణల్లో శివరాత్రి మహత్యాల్ని వివరిస్తూ ఆథ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాలలో శివుడిని దర్శించుకున్న భక్తులు రాత్రంతా జాగరం చేశారు. పరమశివుని పర్వదినాన్ని ఆథ్యాత్మిక,భక్తి భావంతో భక్తులు గడిపారు. ఆలయాలలో భక్తిని చాటే ప్రవచనాలు, ఆధ్యాత్మిక భావాన్ని నింపే నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఇక, కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసు దేవ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదియోగి విగ్రహం వద్ద బ్రహ్మాండ వేదికపై శివరాత్రి ఉత్సవ వేడుక కనుల పండువగా జరిగింది. ఈ వేడకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటూ ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
క్లుప్తంగా
లగేజీ వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం తిరువొత్తియూరు: బైక్ను లగేజీ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మదురై జిల్లాలో చోటుచేసుకుంది. మదురై జిల్లా ఉసిలంపట్టి తాలూకా కరుమాత్తూరు ప్రాంతానికి చెందిన రాజగురు (27). శనివారం రాత్రి ఇతను, అన్న కూతురు ప్రమిల్లాశ్రీ (7), పక్కింటికి చెందిన సంగీత (29)తో వైద్యం కోసం బైక్లో ఆస్పత్రికి వెళ్తున్నారు. మదురై మెయిన్ రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో అతివేగంగా వచ్చిన లగేజీ వాహనం బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో రాజగురు సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రమిల్లాశ్రీ, సంగీతను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నూరుణి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి రాజ్గురు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉసిలంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కురవకుడికి చెందిన పాండి (43)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త బలవన్మరణం అన్నానగర్: భార్య మందలించిందని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెంగల్పట్టు జిల్లాలోని మరైమలై నగర్ కీళకరణై ప్రాంతానికి చెందిన కన్నన్, అదే ప్రాంతంలో సొంత వెల్డింగ్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఇతను జాస్మిన్ను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కన్నన్ ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. విరక్తి చెందిన జాస్మిన్ భర్తను తీవ్రంగా మందలించి పిల్లలను తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన కన్నన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి ఇరుగుపొరుగు వెంటనే మరైమలైనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరైమలై నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ఆత్మహత్య తిరువొత్తియూరు: చైన్నె పోరూర్ చెరువులో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో మరణించిన వ్యక్తి చైన్నె, టి. నగర్ ప్రాంతానికి చెందిన చంద్రన్ (52) అని తెలిసింది. ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న చంద్రన్ గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన చంద్రన్ పోరూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. బస్సు బోల్తా పడి మహిళ మృతి తిరువొత్తియూరు: ప్రైవేట్ ఆమ్మి బస్సు బోల్తా పడి చైన్నెకి చెందిన మహిళ మృతి చెందింది. మరో 39 మందికి గాయాలయ్యాయి. చైన్నె నుంచి రామనాఽథపురం జిల్లా ముదుకులత్తూరుకు ప్రైవేట్ ఆమ్మి బస్సు శనివారం 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారిలోని కడలూరు జిల్లా వేపూర్ ప్రాంతం వద్ద వెళుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న బారికేడ్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చైన్నె–తాంబరానికి చెందిన విజయన్ భార్య రేణుక (50) సంఘటన స్థలంలోనే మృతిచెందింది. 39మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిని వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నయన మనోహరం – ఆద్యా వినయ్ భరతనాట్య అరంగేట్రం కొరుక్కుపేట: చైన్నె చేట్పేటలో నివసిస్తున్న తెలుగు కుటుంబం ఆశ, వినయ్ దంపతుల కుమార్తె ఆద్యా వినయ్ భరతనాట్య అరంగేట్రం నయన మనోహరంగా సాగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి దీనికి చైన్నె మైలాపూర్లోని ఆర్ఆర్ సభ వేదికైంది. నర్తకి ఆద్యా వినయ్ తనదైన హావభావాలతో, ముద్రాలతో అత్యంత అనురక్తితో నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ వేడుకకు భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ కె ఎస్ రామస్వామి, గురువు శృతి శోబై, తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అలింగం రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి ఆద్యా వినయ్ను శాలువాతో సత్కరించి నాట్య మయూరి అవార్డును అల్లింగం రాజశేఖర్ అందజేశారు. ఆద్యా వినయ్ నృత్యానికి నట్టువాంగం పై గురువు శృతిశోబై, గాత్రం పై గిరీష్ మీనన్, మృదంగం పై నగరాజన్ షణ్ముగలింగం, వయోలిన్ పై సుకన్య, ప్లూట్పైమోహన్ సహకారం అందించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
భక్తులతో పోటెత్తిన శివాలయాలు
–వాడవాడలా మహాశివరాత్రి వేడుకలు వేలూరు: మహాశివరాత్రి పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని శివాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆదివారం రాత్రి ఆలయ రాజగోపురం ముందు 108 తవల నాదేశ్వరర్లు కచ్చేరి, నాట్యం జరిగింది. వేలాదిమంది భక్తులు గిరివలయం వచ్చి ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు శివాచార్యులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనార్థం అనుమతించారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి వివిద పుష్పాలంకరణలు చేసి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో శంఖాభిషేకం పూజలు నిర్వహించారు. వాలాజలోని ధన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక యాగ పూజలు, స్వామి వారికి అభిషేకాలు జరిగాయి. తిరుత్తణి ఆలయంలో 1,008 శంఖాభిషేకం తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం మూలవర్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం 1,008 శంఖాలు వుంచి అలంకరించి పూజలు చేశారు. రాత్రి ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో కొలువై ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. అదేవిధంగా తిరువలంగాడు వఠారన్నేశ్వరర్ ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామికి నాలుగు కాల అభిషేక ప్రత్యేక పూజలు చేశారు. 13 గంటల పాటు ఆధ్యాత్మిక పాటల కచ్చేరితో పాటు నాట్యం అరంగేట్రం చేశారు.తిరుత్తణి ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఘనంగా శివరాత్రి వేడుకలు తిరువళ్లూరు: పట్టణంలోని బొమ్మి అమ్మవారి సమేత గురు ముత్తీశ్వరుడి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ప్రత్యేక అభిషేకంతో ప్రారంభించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రదోషం అభిషేకం దీపారాధన సాయంత్రం ఆరు గంటలకు ఆలయంపై నిర్మించిన 41 అడుగుల శివలింగానికి 1,008 లీటర్లు పాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజలు నిర్వహించారు. తిరువళ్లూరులోని తీర్ధీశ్వరుడి ఆలయం, పేరంబాక్కం శోలీశ్వరుడి ఆలయం, కాశీవిశ్వనాథుడి ఆలయాల్లోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి యాగ పూజలు చేస్తున్న వేద పండితులు, స్వామి వారికి అభిషేకం, శివలింగానికి క్రేన్ సాయంతో పాలాభిషేకం -
ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 వేలు వెనక్కి..!
సాక్షి, చైన్నె: తన భార్యకు ప్రభుత్వం ఖాతాలో వేసిన రూ. 5 వేలును మదురైకు చెందిన సామాజిక కార్యకర్త శంకర పాండివెనక్కు ఇచ్చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి మనీ ఆర్డర్ చేశాడు. మగళిర్ ఉరిమై తిట్టం (మహిళా హక్కు పథకం) రూ. 1000 నగదును , ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ముందుగానే ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటూ వేసవి కాలంలో ప్రత్యేకం అని మరో రూ. 2 వేలు అందజేశారు. ఈ మొత్తాన్ని అందుకున్న మహిళలు అత్యధిక శాతం మంది సీఎం స్టాలిన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే, ఈ రూ. 5 వేలు తమకు వద్దంటూ శంకర పాండి వెనక్కి పంపించడం గమనార్హం. అదే సమయంలో చైన్నెకు చెందిన న్యాయవాది ఒకరు , ఒకే రోజు 1.31 కోట్ల మంది ఖాతాలో రూ. 5 వేలు చొప్పున జమ చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇంత పెద్దమొత్తం ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అందజేసిందని, ఈ మొత్తం ఒకే సారి పంపిణీ చేయడం కారణంగా, ఎదురయ్యే ఆర్థిక భారం తదితర పరిస్థితులను గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో పెద్ద స్కాం ఉండేందుకు అవకాశం ఉందని, దీనిపై విచారణ చేపట్టాలంటూ పలు దర్యాప్తు సంస్థలకు ఆయన లేఖ పంపించడం గమనార్హం. డ్రోన్ ఎందుకు ఎగురవేశావ్? – నిందితుడికి పోలీసుల ప్రశ్నల వర్షం కొరుక్కుపేట: అమిత్ షా బహిరంగ సభలో నిషేదాజ్ఞలు ఉల్లంఘించి డ్రోన్ ఎందుకు ఎగిరింది? అంటూ పట్టుబడిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. వివరాలు.. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో పాల్గొన్నారు. బహిరంగ సభ జరిగిన ప్రదేశంలో కేంద్ర భద్రతా దళాలు విధుల్లో ఉన్నాయి. బహిరంగ సభ జరిగిన ప్రదేశం నుండి దాదాపు కిలోమీటరు దూరంలో డ్రోన్ ఎగరడాన్ని జిల్లా యంత్రాంగం నిషేధించింది. ఈ పరిస్థితుల్లో అమిత్ షా ప్రసంగిస్తుండగా బహిరంగ సభ వేదిక నుండి దాదాపు 500 మీటర్ల దూరం డ్రోన్ ఎగిరింది. దీంతో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికుడు యాంటీ–డ్రోన్ టెక్నాలజీ సహాయంతో డ్రోన్ను కూల్చివేశారు. దీనిపై కారైకల్ పోలీస్ సిటీ ఇన్స్పెక్టర్ పురుషోత్తమన్ నేతత్వంలోని పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు నిర్వహించారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి తిరునల్లార్కు చెందిన లోకేష్ (25) అని తేలింది. అతను కారైకల్లోని భారతీయార్ వీధిలో డ్రోన్ మరమ్మతు దుకాణం , యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభను రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయడానికి డ్రోన్ను ఉపయోగించినట్లుసమాచారం. అయినప్పటికీ, ఆయనను ఇంకా ప్రశ్నిస్తున్నారు. ఓటరు జాబితా విడుదలలో జాప్యం సాక్షి, చైన్నె: తుది ఓటరు జాబితా తయారీలో జాప్యం తప్పలేదు. దీంతో ముందుగా నిర్ణయించినట్టుగా ఈనెల 17వ తేదీన కాకుండా 23వ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. వివరాలు.. రాష్ట్రంలో గత ఏడాది చివర్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 97 లక్షల మంది పేర్లు తొలగించారు. మాదిరి ఓటరు జాబితాలో పేర్లు లేని వాళ్లు మళ్లీ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు తొలుత నెల రోజులు అవకాశం కల్పించారు. తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలతో మరో పది రోజులు కేటాయించారు. అదే సమయంలో ఎన్నికల ఏర్పాట్ల పనులను సైతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారులు వేగవంతం చేశారు. కేంద్రం ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ల బృందం సైతం చైన్నెకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ పరిస్థితులలో 34.73 లక్షల మంది పేర్ల నమోదుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించి ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 17వ తేదిన తుది ఓటరు జాబితా విడుదలకు అధికారులు కసరత్తులు చేపట్టారు. అయితే జాప్యం తప్పలేదు. ఈనెల 10వ తేదీ వరకు నమోదు ప్రక్రియ సాగిన దృష్ట్యా, వాటిని పరిశీలించి తుది ఓటరు జాబితా విడుదలకు మరింత సమయం పట్టక తప్పలేదు. దీంతో ఈనెల 17వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తుది జాబితా ఈనెల 23న వెలువడుతుందని ప్రకటించారు. -
సాధకులకు అవార్డుల ప్రదానం
సాక్షి, చైన్నె: అడ్డంకులను అధిగమించి సామర్థ్యాన్ని సాక్షాత్కరించి సాధకులుగా నిలిచిన వారికి కెవిన్ కేర్ ఎబిలిటీ అవార్డులను అందజేశారు. కెబిన్ కేర్, ఎ బిలిటీ ఫౌండేషన్ నేతృత్వంలో 24వ సంవత్సరంగా అవార్డుల ఉత్సవం చైన్నెలో జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట కృషి చేసిన ఐదుగురు అసాధారణ వ్యక్తులను ఎంపిక చేసిన ఈ అవార్డులను అందజేశారు. కార్యక్రమానికి ప్రపంచకప్ గెలిచిన అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ టీసీ దీపిక, కేరళకు చెందిన తొలి అంధ న్యాయమూర్తి తన్య నాథన్లు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డు గ్రహీతలను సత్కరించారు. సరిగమప విజేత పురుషోత్తమన్, శాసీ్త్రయ సంగీతకారుడు అభినయ సెన్బగరాజ్ బృందం ఈ సందర్భంగా సంగీత విభావరిని ఆహుతులకు వీనుల విందు చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా దివ్యాంగులైన సాధకులను గుర్తించి అవార్డులతో సత్కరించి ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను స్పెషల్ రికగ్నిషన్ అవార్డును సునీల్ జైన్ (బెంగళూరు– ఓ సంస్థ ద్వారా విద్య, ఉపాధి, క్రీడలు, పౌర భాగస్వామ్య రంగాల్లో దివ్యాంగులకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు), ఎబిలిటీ అవార్డు ఫర్ ఎమినెన్స్ను డా. జితేందర్ అగర్వాల్ (గురుగ్రామ్– సరత్కా ఎడ్యుకేషన వ్యవస్థాపకుడు), ఎబిలిటీ మాస్టరీ అవార్డులను అరివురాజా తంగవేలు (తమిళనాడు– మెప్పి ఐటీ సొల్యూషన్ ద్వారా డ్రోన్ సర్వేలు, మ్యాపింగ్ సేవలతో పాటూ దివ్యాంగులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు). శివ కుమార్ శర్మ (చండీగఢ్– చట్ట అవగాహన, థియేటర్, సినిమాల ద్వారా వైకల్య హక్కులపై చైతన్యం కల్పిస్తున్నారు), చంద్ర మౌళి ద్వారపురెడ్డి (ఆంధ్రప్రదేశ్ – ఓ ప్రమాదం జీవితాన్ని కృంగదీసినా, ఆ తదుపరి ఉన్నత విద్య పూర్తి చేసి ఐఐఎంఏలో చదవి ప్రస్తుతం అసెంచర్లో పనిచేస్తున్నారు)కి అందజేశారు. వేడుకలో కెవిన్ కేర్ చైర్మన్ సి.కె. రంగనాథన్ మాట్లాడుతూ, దివ్యాంగుల సామర్థ్యం సమాజాన్ని మారుస్తుందని పేర్కొంటూ, వీరి భవిష్యత్తు నిర్మాణమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎబిలిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జయశ్రీ రవీంద్రన్ మాట్లాడుతూ, 24 ఏళ్లుగా దివ్యాంగుల అసాధారణ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం గర్వకారణమని తెలిపారు. -
నిర్మాత తమిలళగన్ కన్నుమూత
తమిళసినిమా: దివంగత ప్రముఖ రాజకీయనాయకుడు, సినీ నిర్మాత ఆర్వీ .వీరప్పన్ కొడుకు, నిర్మాత, దర్శకుడు వి. తమిలళగన్ శనివారం చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 70 ఏళ్లు. తమిలళగన్ ఆర్వీ.వీరప్పన్ పెద్ద కొడుకు. రజనీకాంత్ నటించిన బాషా, రాణువ వీరన్, పణక్కారన్, మూండ్రుముగమ్, కమలహాసన్ హీరోగా నటించిన కాక్కీసట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాలను తమిలళగన్ నిర్మించారు. అదేవిధంగా మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా తమిలళగన్ శనివారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమిళళగన్ భౌతిక కాయానికి ఆదివారం స్థానిక త్యాగరాయనగర్, తిరుమలైపిళ్లై రోడ్డులో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కాగా తమిళగన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నటుడు రజినీకాంత్ తన సంతాప ప్రకటనలో ఆర్వీ వీరప్పన్ కొడుకు, తన ప్రియమైన సహోదరుడు తమిలళగన్ అద్భుతమైన మనిషి అని పేర్కొన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు రజినీకాంత్ పేర్కొన్నారు. -
అధికారంలో వాటా ఇవ్వాల్సిందే..!
– ఎంపీ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యల చర్చ సాక్షి, చైన్నె: తాము డీఎంకేను ఆస్తి పాస్తులు అడగడం లేదని, మర్యాద ఇవ్వాలని కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక ఆయన నేతృత్వంలో జరిగిన మదురై పార్టీ సమావేశంలో టీవీకేతో పొత్తు పెట్టుకుందామని నేతలు బహిరంగంగా నినాదించడం గమనార్హం. వివరాలు.. తమ బంధం బలంగానే ఉందంటూ డీఎంకే, కాంగ్రెస్లు ౖపైపెకి చెప్పుకుంటున్నా, లోలోపల రెండు పార్టీల మధ్య సమరం సాగుతుండటం తాజాగా స్పష్టమవుతోంది. తమకు సీట్ల పంపకాలను తేల్చాలంటూ కాంగ్రెస్ కమిటీ డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ను కలిసి విన్నవించి రెండున్నర నెలలు అవుతోంది. ఇంత వరకు డీఎంకే ఎలాంటి నిర్ణయం అన్నది తీసుకోలేదు. అదే సమయంలో విజయ్ టీవీకే తో పొత్తు అన్నట్టుగా టీఎన్సీసీ నేతలు అనేక మంది పెదవి విప్పుతుండటం చర్చకు దారి తీశాయి. కొందరు అయితే, తమకు ఈ సారి అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని డీఎంకేను డిమాండ్ చేసే పనిలో పడ్డారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని ఏఐసీసీ నుంచి హెచ్చరికలు టీఎన్సీసీ వర్గాలకు వస్తున్నా, ఇక్కడి నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ముందంజలో ఉన్నారు. పొత్తు వద్దు.. మదురైలో ఆదివారం మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశం జరిగింది. ఇందులో మాట్లాడిన నేతలందూరు బహిరంగంగానే డీఎంకేతో పొత్తు వద్దే వద్దని నినాదించారు. టీవీకేతో పొత్తు పెట్టుకుందామని యువత ఆశిస్తున్నట్టు వివరించారు. విజయ్ సీఎం కావాలని, అప్పుడే అన్ని పార్టీలకు అధికారంలో వాటా అన్నది దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇక ఎంపీ మాణిక్యం ఠాకూర్ అయితే మరింతగా డీఎంకే పై విరుచుకుపడ్డారు. తాము డీఎంకేను ఆస్తి పాస్తులు ఇవ్వాలని అడగడం లేదని.. కనీసం మిత్రులకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వడం అలవాటు చేసుకోండి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత మదురై దళపతిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అని ప్రశ్నించారు. అధికారంలో వాటా ఈసారి ఇవ్వాల్సిందేనని, తమకు కావాల్సిన స్థానాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ పదవి ముఖ్యం కాదని, తనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అనురాగాన్ని కించ పరిస్తే సహించబోమని, డీఎంకే చేసిన తప్పులను కాంగ్రెస్ భుజాన మోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరుచుకు పడ్డారు. ఆయన ఈ విధంగా తీవ్రంగా విరుచుకు పడితే, ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవరి అయితే, రూ. 5 వేలు బ్యాంక్ ఖాతాలో వేసినంత మాత్రాన గెలుపు వరించినట్టే అని డీఎంకే భ్రమలో ఉన్నట్టుందని విమర్శించడం చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
సైబర్ భద్రతపై అవగాహన అవసరం
తిరువళ్లూరు: సైబర్ భద్రతపై అవగాహన అవసరమ ని ఎఫ్–సిడాక్ శాస్త్రవేత్త దిజా అన్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని వేల్టెక్ వర్సిటీలో ఏఐ వర్సెస్ సైబర్ సెక్యూరిటీపై రెండు రోజుల సదస్సు జరిగింది. కార్యక్రమానికి వర్సిటీ వ్యవస్థాపక అద్యక్షుడు డాక్టర్ రంగరాజన్ అధ్యక్షత వహించారు. సదస్సులో దిజా, జోకో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథన్, డీజీ అలర్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వినోద్సెంథిల్, డాక్టర్ ప్రభాక రన్ హాజరై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వర్సెస్ సైబర్ సెక్యూరిటి అనే అంశంపై సదస్సులో చర్చించారు. సై బర్ నేరాల ద్వారా వచ్చే బెదిరింపులు, రక్షణ, ఎథిక్స్ ను ఎలా రక్షించుకోవాలనే అంశంపై చర్చించారు. స మాజానికి సైబర్ భద్రతపై మరింత అవగాహన పెంచాలని దిజా సూచించారు. కళాశాల సీఎస్ఈ హెచ్ఓ డీ రాజేంద్రన్, కోఆర్డినేటర్ మహ్మద్ సిద్ధిక్, చొక్కలింగం, అసోసియేట్ డీన్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
కాదల్ రీసెట్ రిపీట్ టీజర్ విడుదల
తమిళసినిమా: ప్రేమ కథా చిత్రాలు ఎప్పటికీ ఎవర్గ్రీనే. అలాంటి వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం కాదల్ రీసెట్ రిపీట్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మలాలి మాన్వీ మూవీ మేకర్స్, సన్ని డెన్వీ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభ ప్రేమ్కుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మదుమ్ఘోష్, జియాశంకర్ జంటగా నటిస్తుండగా మలయాళ ప్రముఖ నటుడు అర్జున్ అశోకన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నటుడు ఎంఎస్.భాస్కర్, జయప్రకాశ్, విజీ చంద్రశేఖర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీతాన్ని, అరవింద్ కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు విజయ్ తెలుపుతూ ఇది ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్కు తగ్గట్టుగా కథ పలు మలుపులతో ఆసక్తికరనంగా సాగుతుందని చెప్పారు. కాగా చిత్ర టీజర్ను ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం విడుదల చేసినట్లు చెప్పారు. ఇది ఇప్పుడు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందుతోందని చెప్పారు. ముఖ్యంగా హారీష్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తాయన్నారు. ఛాయాగ్రహకుడు అరవింద్ కృష్ణ సన్నివేశాల చిత్రీకరణ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు విజయ్ పేర్కొన్నారు. తమిళసినిమా: మనుషులను ఆనందతీరాలకు చేర్చేదీ, అథఃపాతాళానికి తొక్కేసేది ప్రేమ అనే రెండు అక్షరాలే. ఆ రెండు అక్షరాల్లో అంత శక్తి ఉంది. అలాంటి ప్రేమను వేడుకగా జరుపుకోవడానికే ప్రేమికుల రోజు పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. ప్రేమకు పునాది నమ్మకం. అలాంటి నమ్మకమే ప్రేమను, ప్రేమజంటను ముందుకు తీసుకెళుతుంది. ఇకపోతే ప్రేమికుల రోజును ప్రేమలో పడ్డవాళ్లు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు విరివిగా జరుపుకుంటారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. శనివారం చాలా మంది ప్రేమజంటలు ప్రేమికుల రోజును తమ తమ ఇష్టాలకు అనుగుణంగా జరుపుకున్నారు. అలాంటి వారిలో నయనతార, విఘ్నేశ్ శివన్ల జంట ఒకటి. ఈ జంట ఏ విశేష రోజును వదలదు. పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగల రోజులను విశేషంగా జరుపుకుంటూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తారు. తాజాగా నయనతార, విఘ్నేశ్ శివన్ల జంట ప్రేమికుల రోజును ప్రత్యేక ఫొటో సెషన్తో జరుపుకున్నారు. నిజానికి ఈ జంట బిజీగానే ఉన్నారు. విఘ్నేశ్ శివన్ తాను దర్శకత్వం వహిస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెని చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక నయనతార విషయానికి వస్తే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ భామ 40 పదుల వయసులోనూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. నయనతార, విఘ్నేశ్ శివన్ వివాహ జీవితం నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ శనివారం ఈ సంచలన జంట ప్రేమికుల రోజును జరుపుకున్నారు. అందులో భాగంగా నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి ప్రత్యేక ఫొటో సెషన్ను చేయించుకున్నారు. అలా వీరిద్దరూ తీసుకున్న వివిధ భంగిమలతో కూడిన రొమాన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. -
ముగిసిన పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్ జీఎన్ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణ వ పండితుల మంత్రోచ్చారణలతో పూజలతో పాటూ చక్రస్నానం నిర్వహించారు. పెద్దసంఖ్య భక్తులు పాల్గొని చక్రస్నానం కనులారా తిలకించి తరించారు. భక్తులు గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మ రణలు ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాత్రి 7 గంటలకు ధ్వజ అవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా ముగించారు. ఈ వేడుకల్లో ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధనుంజయ్, సూపరింటెండెంట్ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు ఎన్. శ్రీకష్ణ, మాజీ సభ్యులు పీవీఆర్ కష్ణారావు, మోహన్ రావు, రంగారెడ్డి, జయదేవ్, అజయ్, సుబ్రహ్మణ్యం, కార్తీక్, శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, పరసురామన్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా ఈనెల 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పయాగం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. -
విజయ్కాంత్ ఆఫీస్ నుంచే నా పయనం
తమిళసినిమా: ప్రతిభ ఉంటే ఈ రోజు కాకున్నా, రేపు అయినా వెలుగులోకి వస్తుంది. ఇది ఎవరికై నా వర్తిస్తుంది. అలా వెలుగులోకి వచ్చిన దర్శకుడు ఆర్.మహాలక్ష్మీ మురుగన్. ఈయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఎల్ఎస్ఎస్ ( లవ్ షేర్ సబ్స్కైబ్). జేబీ ఫిలింస్ పతాకంపై పి.రఘు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నూతన నటుడు ఆదవ్ కృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయనకు జంటగా సిమ్రాన్ అద్వాని నటించారు. అశ్వమిత్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 20న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని భరణి స్టూడియోలో నిర్వహించారు. ఈ చిత్రంలోని ప్రమోషన్ పాటను దర్శకుడు చరణ్ రాయడం విశేషం. దర్శక, నిర్మాత కదిరేశన్, నటుడు ఇళవరసు, బక్స్, మేనేజర్ యూనియన్ ప్రెసిడెంట్ రాజేంద్రన్ ఆడియోను ఆవిష్కరించారు. ఆదవ్ కృష్ణ మాట్లాడుతూ తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆర్.మహాలక్ష్మీ మురుగన్కు దన్యవాదాలు అన్నారు. చిత్ర దర్శకుడు ఆర్. మహాలక్షీ మురుగన్ మాట్లాడుతూ ఊరులో మిషన్ కుట్టుకుంటూ నాటకాలు ఆడి, కథలను రాసేవాడినన్నారు. అలాంటి తన ఆసక్తిని ప్రోత్సహించే విదంగా తన తండ్రి చైన్నెకి పంపించారన్నారు. అలా తాను నటుడు విజయ్కాంత్ కార్యాలయంలో చేరినట్లు చెప్పారు. అక్కడ నుంచే తన సినీ పయనం మొదలలైందన్నారు. విజయ్కాంత్, ప్రేమలత తనుకు ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఒక మంచి ప్రేమ కథా చిత్రాన్ని చేశామని చెప్పారు. అందుకు యూనిట్ సభ్యులందరూ ఎందగానో సహరించారని చెప్పారు. లవ్ షేర్ సబ్స్రైబ్ చిత్రం యూత్ను అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. -
వైభవం..మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి తారాపడవేడు ప్రాంతంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో హోమ పూజలను నిర్వహించారు. అనంతరం వివిధ పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని హోమ గుండం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాచార్యుల వేద మంత్రాల నడుమ హోమ గుండంలో ఉంచిన కలశ నీటిని రాష్ట్ర జౌళీశాఖ మంత్రి గాంధీ, వేలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో భక్తులు కలశ నీటిని మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ రాజగోపురంపై కలశ నీటిని పోసి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం పుణ్య జలాన్ని భక్తులపై చల్లారు. ఆలయంలోని వరదరాజ పెరుమాళ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు, దీపారాధన పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ బాబు, ఆలయ కార్యనిర్వాహక అఽధికారి మల్లిక, ఽఆలయ ట్రస్ట్ సభ్యులు కన్నన్, లలిత, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పట్టుకొట్టైలో రూ.20 కోట్లతో బస్టాండ్
సాక్షి, చైన్నె: తంజావూరు జిల్లా పట్టుకొట్టై పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆదివారం ప్రారంభించారు. కొత్త బస్సులకు జెండా ఊపారు. తంజావూరు జిల్లాలోని పట్టుకొట్టై నగర పాలక సంస్థ పరిధిలో 6.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ బస్ స్టాండ్ నిర్మించారు.50 బస్సులు నిలిపే సామర్థ్యం, 120 వాణిజ్య దుకాణాలు, 2 పుట్కోర్ట్లు, 3 ప్రయాణీకుల విశ్రాంతి గదులు, తదితర ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన ఉదయ నిధి సాలలిన్ మాట్లాడుతూ, అందరికీ అన్నీ అన్నది ద్రావిడ మోడల్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పట్టుకోట్టై పట్టణంలో 35 కిలోమీటర్ల మేరకు రహదారుల నిర్మాణం, రూ.7.50 కోట్లతో చెరువుల అభివృద్ధి, రూ.22 కోట్లతో మురికి నీటి శుద్ధికరణ కేంద్రం, రూ.5 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ, రూ.4.50 కోట్లతో పాఠశాల గదులు నిర్మాణం, రూ.1.50 కోట్లతో జ్ఞాన కేంద్రం ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. -
తిరుత్తణిలో ఆటోడ్రైవర్ల ఆందోళన
తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయానికి ఆటోలకు అనుమతి నిరాకరించడంతో ఆటోడ్రైవర్లు ఆలయ అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించడంతో ఆటోడ్రైవర్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మహాశివరాత్రి, వారాంతపు సెలవులు, శుభముహూర్తాలు కావడంతో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. దీంతో కొండపైకి ఆటోలకు ఆలయ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆదివారం కొండ ఆలయానికి ఆటోలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన ఆటోడ్రైవర్లు ర్యాలీగా వెళ్లి ఆలయ జాయింట్ కమిషనర్ ఆలయం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని 55 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం వారందిరనీ విడిచిపెట్టారు. -
కోలాహలం.. శివోత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా సాగింది. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, పితృదేవలకు తర్పణం అర్పించే భక్తులు, శంఖం పూరించే జంగమ దేవరలు, ముక్కంటి దర్శనం కోసం పురవీధుల్లో జనం పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని వాయులింగేశ్వరుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం వేకువజామున 2గంటలకే ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామి, అమ్మవార్లను పళ్లియరతో మేల్కొలిపారు. అనంతరం గోపూజ నిర్వహించారు. సుప్రభాత సేవ తరువాత స్వామి అమ్మవార్ల సర్వదర్శనానికి 3 గంటలకు అనుమతించారు. ఉదయం 5 నుంచి 10.30 గంటల మధ్య స్వామి, అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో పాటు క్షీరాభిషేకం పచ్చ కర్పూరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా వివిధ రకాల అభిషేకాలు చేశారు.వేకువజాము 2 గంటల నుంచే స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. రాజగోపురం సమీపం నుంచి సామాన్య భక్తుల కోసం ఉచిత దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల మహాలఘుదర్శనం కల్పించారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుడు ఇంద్ర విమానంపై పురవీధుల్లో ఊరేగారు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ చప్పరంపై అధిష్టించి అనుసరించారు. వేలాది మంది భక్తులు కర్పూర హార తులు పట్టి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. -
కోడెగిత్తల జోరు –యువత హుషారు
వెదురుకుప్పం : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వెదురుకుప్పం మండలంలోని సీఆర్కండ్రిగలో జల్లికట్టును ఘనంగా నిర్వహించారు. రంకెలేస్తూ దూసుకుపోతున్న కోడెగిత్తలను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహం చూపారు. ఇక్కడికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పలువురు తమ పశువులను తీసుకువచ్చారు. నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి ఉసిగొల్పారు. రంకెలేసుకుంటూ దూసుకుపోతున్న ఎద్దులను నిలువరించి పలకలు సాధించేందుకు యువకులు విశ్వ ప్రయత్నం చేశారు. కొన్ని ఎద్దుల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి తమ ప్రతాపాన్ని చూపారు. పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పరుగులు తీశాయి. -
నైతికత నిండిన సమాజం సృష్టిద్దాం!
సాక్షి, చైన్నె: నైతికత, కరుణతో కూడిన సమాజాన్ని సృష్టించేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దాం అని సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. వల్లలార్ ఉద్దేశాలను, ఆయన ఖ్యాతిని ఎలుగెత్తి చాటుదామన్నారు. వల్లలార్ వెలిగించిన జ్యోతి లాగా తమిళనాట ద్రావిడ మోడల్ శాశ్వతం అని వ్యాఖ్యానించారు. వివరాలు.. చైన్నెలో హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వల్లలార్ సదస్సు 2026 కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ధర్మంతో కూడిన చైన్నె అని వల్లలార్ కొనియాడిన ఈ నగరంలో ఆయన చూపిన నైతికతను అనుసరించే ఆధ్యాత్మికులను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. వేల సంవత్సరాల పురాతన దేవాలయాల పునర్నిర్మాణం, ఆలయ రక్షణ కోసం ప్రభుత్వ నిధులు అంటూ తన ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన పనులను ఈ సందర్భంగా వివరించారు. ఆలయాల్లో జరుగుతున్న నిత్య పూజలు, వివిధ ఉత్సవాలను గుర్తు చేస్తూ, సామూహిక వివాహాల నిర్వహణ గురించి పేర్కొన్నారు. వల్లలార్ను మనం ఎందుకు ఉన్నతంగా ఉంచుతున్నామో అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆయన కరుణ, ప్రేమ మార్గాన్ని బోధించారని, ఈ మార్గంలోనే ద్రావిడ మోడల్ ప్రభుత్వం సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. వల్లలార్ తమిళ సమాజంలో ఉద్భవించిన మహనీయుడు అని ఆయన సిద్ధాంతాలను అనేక సందర్భాలలో తాను ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు వివరించారు. గతంలో చైన్నెలో ఆయన నివసించిన ప్రాంతానికి వల్లలార్ నగర్ అని నామకరణం చేశామని, రూ. 10 కోట్లతో వల్లలార్ పేరిట బస్టాండ్ను పునరుద్ధరించామన్నారు. తిరువొత్తియూర్ హైవేకి వెళ్లే మార్గాన్ని ‘‘వల్లలార్ హైవే’’ అని పేరు పెట్టి దానిని ప్రారంభించామన్నారు. వల్లలార్ భక్తుల అభ్యర్థన విజయాల కొనసాగింపుగా, ఆయన ఆలోచనలు, జీవిత సూత్రాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాలనే లక్ష్యంతో అంతర్జాతీయ వల్లలార్ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఏడు ప్రకటనలు.. అంతర్జాతీయ వల్లలార్ సదస్సు వేదికగా సీఎం స్టాలిన్ ఏడు ప్రకటనలు చేశారు. ఈ వేడుకను గుర్తు చేసే విధంగా పాఠశాల ఆవరణలో ఓ స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వడలూరులోని సన్మార్గ శిక్షణ పాఠశాలలో ఇక, సంగీత పాఠాలను కూడా అందించబడుతుందన్నారు. వడలూరులో వల్లలార్ పేరుతో మూలికా వైద్యం ఉద్యానవనం, చైన్నెలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వల్లలార్ పుస్తకం డిపార్ట్మెంట్ ఆఫ్ ఛారిటీస్ ప్రెస్ ప్రచురిస్తుందని, ఏటా వల్లలార్ జయంతి రోజు సందర్భంగా మూడు రోజుల పాటుగా ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. మెట్టుకుప్పం, మరుధూరు, కరుంకలిలలో వల్లలార్ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయనున్నామని, కడలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న పార్కుకు వల్లలార్ పేరు పెడుతున్నామని ప్రకటించారు. కుల, మత భేదం లేకుండా సమాజాన్ని నిర్మించాలనే వల్లలార్ గొప్ప కల ద్రావిడ ఉద్యమానికి ప్రాణం అని వ్యాఖ్యలు చేశారు. విభజన శక్తులకు చోటు అన్నది ఇవ్వకుండా, వ్యక్తిత్వం, నైతికత , కరుణతో కూడిన సమాజాన్ని సృష్టిద్దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, ఎంఆర్కే పన్నీరు సెల్వం, శేఖర్బాబు పాల్గొన్నారు. విద్యా సంస్థలకు మైనారిటీ హోదామైనారిటీల సంక్షేమ శాఖ తరపున మైనారిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 88 విద్యా సంస్థలకు శాశ్వత మైనారిటీ హోదా కల్పిస్తూ, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్లను సీఎం స్టాలిన్ ప్రదానం చేశారు. అలాగే, రూ. 34.98 కోట్ల వ్యయంతో వాణిజ్య పన్ను శాఖ కోసం నిర్మించిన 5 వాణిజ్య పన్ను కార్యాలయ భవనాలు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ. 22.12 కోట్ల వ్యయంతో నిర్మించిన 12 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు, తిరుప్పూర్ రిజిస్ట్రేషన్ జిల్లాలో పొంగళూరు, తాంబరం రిజిస్ట్రేషన్ జిల్లాలో వండలూర్, కళ్లకురిచ్చి రిజిస్ట్రేషన్ జిల్లాలోని వనపురం పేరిట మూడు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఇక, చైన్నె, రాజీవ్ గాంధీ రోడ్డు – సర్దార్ పటేల్ రోడ్డును అనుసంధానిస్తూ రూ. రూ. 60.68 కోట్ల వ్యయంతో మధ్య కై లాష్ జంక్షన్లో నిర్మించిన ఎల్ ఆకార పు వంతెనను సీఎం ప్రారంభించారు. అలాగే షోళింగనల్లూరు ఎల్కాట్ ప్రత్యేక ఆర్థిక మండలిలలో రూ. 84.42 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ విభాగం భవనాలను సీఎం ఆరంభించారు. -
రంగంలోకి వేణుగోపాల్
సాక్షి, చైన్నె: డీఎంకే కూటమిలోని టీఎన్సీసీ నేతలు తలా ఓ దారిలో చేస్తున్న మాటలు రచ్చకెక్కిన నేపథ్యంలో సీట్ల పందేరం వ్యవహారంగా చర్చలకు ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ను ఏఐసీసీ రంగంలోకి దించింది. ఈయన 17వ తేదీన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్సీసీకి చెందిన మరి కొందరు నేతలు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిక్కులు బయలు దేరినట్లయ్యింది. టీవీకే అధినేత విజయ్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండటాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళిని రంగంలోకి దించారు. ఆమె గత నెల ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీతో గంటన్నర పాటుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తదుపరి డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న సమాచారం వెలువడింది. అయితే సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణిలో పడేసింది. ఇది కాంగ్రెస్లో అసంతృప్తిని రగిల్చినట్లయ్యింది. ఎంపీ మాణిక్యం ఠాకూర్ వంటి నేతలు బహిరంగంగానే అధికారంలో వాటా, అధిక సీట్లు అంటూ స్పందిస్తుండడం డీఎంకేకు పుండు మీద కారంచల్లినట్లయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం చర్చను కొలిక్కి తెచ్చేందుకు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ను ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దించారు. గత వారం ఢిల్లీలో తమిళనాడు కాంగ్రెస్ నేతలతో జరిగిన భేటీ మేరకు తదుపరి అడుగులు కేసీ వేణుగోపాల్ ద్వారా వేయించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీన చైన్నెకు వచ్చే ఆయన ఇక్కడి పార్టీ వర్గాలతో సమావేశం కానున్నారు. అలాగే పుదుచ్చేరిలోని కాంగ్రెస్ వర్గాలతోనూ సమావేశం కానున్నడం తో డీఎంకేతో సీట్ల పందేరం కొలిక్కి వచ్చేనా, లేదా మళ్లీ నాన్చుడేనా..? అన్నది వేచి చూడాల్సిందే. -
నటుడైన రాజకీయ నేత
తమిళసినిమా: నటులు రాజకీయ నాయకులు కావడం, రాజకీయ నాయకులు నటులుగా మారడం సర్వసాధారణం. అలా తాజాగా కమ్యునిస్టు నాయకుడు ఆర్.ముత్తరసన్ నటుడిగా అవతారం ఎత్తి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం అరిసి. నటుడు, దర్శకుడు సముద్రఖని, సుబ్రమణి శివ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మోనికా ప్రొడక్షన్స్, అరుంధవం మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎస్ ఏ.రాజ్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వ్యవసాయం, రైతుల ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని వళ్లువర్కోట్టంలో నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైగో,తోళ్ తిరుమావళవన్, ఆర్కే సెల్వమణితోపాటు పలువురు కమ్యూనిస్ట్ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయనిధి స్టాలిన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా వైగో తొలి ప్రతిని అందుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఇంతకాలం రాజకీయనాయకుడిగా ప్రజా సేవలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆర్.ముత్తరసన్ ఇప్పుడు సినీ రంగప్రవేశం చేసి, ఇక్కడ కూడా మంచి సామాజిక బాధ్యతతో కూడిన చిత్రాలను చేయడానికి సిద్ధం అయ్యాయన్నారు. అలా తొలి ప్రయత్నంగా రైతుల ఇతివృత్తంతో కూడిన అరిసి చిత్రాన్ని నిర్మించడంతో పాటు ముఖ్యపాత్రలో నటించాలని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని, ఆర్.ముత్తరసన్ రాజకీయ, సినీ రంగాల్లో తన సేవలను అందించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శని ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నంది భగవాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని పెద్దనంది భగవాన్కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి వివిధ కాయగూరలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శివాచార్యులు కర్పూర హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వరుడిని అలంకరించిన బంగారు వృషభ వాహనంలో ఉంచి ఆలయ మూడవ ప్రాకారం నుంచి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. భక్తులు మాడ వీధుల్లో కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలోని నంది భగవాన్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు పట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నంది భగవాన్ను దర్శించుకున్నారు. -
సమానత్వాన్ని చాటే రీతిలో ర్యాలీ
సాక్షి, చైన్నె: చైన్నెలో సమానత్వాన్ని చాటే విధంగా 3వ ఎడిషన్గా పురుష అల్లీషిప్ సినర్జీ సమ్మిట్ నిర్వహణ ర్యాలీని శనివారం నిర్వహించారు. చైన్నెలోని టైడల్ పార్కు ఆడిటోరియంలో అవతార్ హ్యుమన్ క్యాపిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన పౌరులు, పాఠశాల విద్యార్థులు,కళాశాల యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఏహెచ్సీటీ అవతార్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ, ఎంఐటీఆర్, ఎంఏఎస్ఎస్ ద్వారా బాలురు, యువకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వ్యక్తిగత బాధ్యతలు, ఆలోచనలు, న్యాయం, గౌరవం, కుటుంబాలు, కార్యాలయాలు, సమాజాలను బలోపేతం చేయడం , లింగ సమానత్వం, సమాజంలో సమానత్వానికి చురుకుదనం, మిత్రులుగా కలసి మెలిసి ఉండాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం ద్వారా వివరించినట్టు పేర్కొన్నారు. ర్యాలీతోపాటుగా అవగాహన కార్యక్రమం, వివిధ పోటీలనుసైతం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్సన్ ఫ్యాషన్ ఎండీ డాక్టర్ శామ్ పాల్, ఏహెచ్సీటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఈశ్వర్బాల సుబ్రమణియన్, అవతార్ సీఓఓ ఉమాశంకర్ కందస్వామితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
50 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో రికార్డు
కొరుక్కుపేట: చైన్నె ఓడరేవు 50 మిలియన్ టన్నుల సరుకు రవాణ ద్వారా రికార్డు సష్టించింది. వివరాలు.. చైన్నె పోర్ట్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో చైన్నె ఓడరేవు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించడం ద్వారా రికార్డు సృష్టించింది. ఇది వరుసగా మూడవ సంవత్సరం వృద్ధిని సూచిస్తుందని సమాచారం. కాగా మొత్తం 50 మిలియన్ టన్నుల సరుకులో, 32.27 మిలియన్ టన్నులు కంటైనర్ షిప్ల ద్వారా, 13 మిలియన్ టన్నుల ముడి చమురు, 9.36 మిలియన్ టన్నుల ఎరువులు, 4.36 మిలియన్ టన్నుల వస్తు సముదాయం ఉన్నట్లు పేర్కొన్నారు. నగలు చోరీ కేసులో మహిళ అరెస్ట్ తిరువళ్లూరు: సర్వే పేరిట ఇంటికి వచ్చి ఒంటరిగా వున్న వృద్దురాలిపై కత్తితో దాడి చేసి నగలను అపహరించిన యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు ప్రాంతానికి చెందిన శ్యామల(55) శుక్రవారం ఇంట్లో ఒంటరిగా వున్నారు. ఆ సమయంలో ఓ యువతి తాము సర్వే కోసం వచ్చామని నమ్మించింది. తర్వాత శ్యామల మెడలో వున్న గొలుసును లాక్కుకునే ప్రయత్నం చేశారు. అయితే శ్యామల అరవడంతో స్థానికులు వచ్చి యువతిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో పట్టుబడిన యువతి పవిత్రగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీవారి దర్శనానికి 12గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,222మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,882 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
ధనుష్ @56
తమిళసినిమా: ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న స్టార్ హీరో ధనుష్. ఈయన నటిస్తున్న కర చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ధనుష్ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు.రాజ్ కుమార్ పెరియ సామి కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళం సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ధనుష్ తన 56వ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను ఇంతకుముందు ఎప్పుడు చేయని ప్రయత్నంగా ఈ చిత్రాన్ని పిరియడ్, ఫాంటసీ కథాచిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే దీని పూర్తిగా ఫాంటసీ కథాచిత్రం అని చెప్పలేనని చిత్రంలో ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయని చెప్పారు. అప్పుడే ఈ చిత్ర కథ సరైన బాటలో సాగుతుందని ఈ కథను చెప్పగా ఇది మనిద్దరి కెరీర్లో అత్యంత భారీ చిత్రంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. -
సిగ్నల్ అట్ 11.30 ఫస్ట్లుక్ విడుదల
తమిళసినిమా: అలర్ స్టూడియోస్ పతాకంపై మలర్విళి నటేశన్, డా.శివానిసుబ్రమణి కలసి నిర్మిస్తున్న చిత్రం సిగ్నల్ అట్ 11.30.మలర్ విళి నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సంతోష్ ప్రతాప్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ముఖ్యపాత్రల్లో భవ్య పత్రికా, పూజిత పొన్నాడ, జయప్రకాష్, మునీష్కాంత్ నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్మాతలు పేర్కొంటూ కాలం ఎవరి కోసం ఆగదు అన్న అబ్దుల్ కలాం వ్యాఖ్యల ఆధారంగా రూపొందిస్తున్న కథా చిత్రం ఇది అని పేర్కొన్నారు. సిగ్నల్ అట్ 11.30 చిత్ర కథను వినగానే నచ్చిందన్నారు. సంతోష్ ప్రతాప్ అయితే ఈ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారన్నారు. ఈచిత్రానికి డీ ఇమాన్ సంగీతాన్ని అందించారని, ఆయన సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చుందని చెప్పారు. మలర్విళి నటేశన్ పేర్కొంటూ రాత్రి 11.30 గంటలకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కథానాయకుడికి ఎదురైన అనూహ్య అనుభవం అతని జీవిత దిశను ఎలా మార్చింది అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. దీనికి రాజాపట్టాచార్జీ చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని ఆయన చెప్పారు. -
‘రివాల్డో’ కన్నుమూత
అటవీ గ్రామాల ప్రజలు సాక్షి, చైన్నె: గ్రామీణ ప్రజల కుటుంబాల్లో తానూ ఒక్కడినే అన్నట్టుగా రెండున్నర దశాబ్ధాల పాటూ నీలగిరులలో చక్కర్లు కొట్టిన రివాల్డో ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు రివాల్డోకు కన్నీటి నివాళులర్పించారు. వివరాలు.. నీలగిరి అడవులలోని అరటి తోట తదితర గ్రామాలలో తరచూ అడవి ఎనుగులు సంచారం అధికంగా ఉండేది. ఏనుగులను చూస్తే చాలే జనం భయంతోవణికిపోతారు. అయితే, ఈ ఏనుగుల గుంపు నుంచి బయటపడ్డ ఓ ఏనుగు పూర్తి భిన్నంగా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్య పరిచేది. ఇంటిముందు నిలబడి తొండం పైకి ఎత్తి తనకు ఆహారం, నీళ్లు కావాలనిసైగ చేయడం మొదలెట్టింది. దీంతో ఈ ఏనుగు అక్కడి గ్రామాల ప్రజల కుటుంబాల్లో ఒకటిగా మారింది. దీనికి రివాల్డో అని కూడా నామకరణం చేశారు. ఇంత వరకు ఈ ఏనుగు ఎవ్వరికి ఎలాంటి హానీ కలిగించకపోవడం గమనార్హం.2021లో తొండం వద్ద తీవ్ర గాయాన్ని గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మరింత మచ్చికగా.. గాయంతో బాధపడుతున్న రివాల్డోను తెప్పకాడు ఏనుగుల శరణాలయానికి తీసుకెళ్లారు. ఇక్కడ అన్ని రకాల చికిత్స అందించారు. ఇతర ఏనుగులతో కలిసి పోవడం, అందరితో కలుపుగోలుగా ఉండటం, అందర్నీ ఆశ్చర్య పరిచే విధంగా వ్యవహార శైలి ఉండటంతో దీనిని కుంకీగా మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే జంతు ప్రేమికుల కారణంగా మళ్లీ రివాల్డోను అడవిలోకి పంపించక తప్పలేదు. అయితే మూడు నెలల క్రితం హఠాత్తుగా రివాల్డో జాడ కాన రాలేదు. అరటితోట పరిసర వాసులు రివాల్డో కోసం గాలించారు. ఈ పరిస్థితులలో గత వారం తీవ్ర గాయాలతో రివాల్డోను గుర్తించారు. మరో ఏనుగుతో జరిగిన భీకర గొడవలో గాయాలైనట్టుగా గుర్తించారు. వయోభారం, తీవ్ర గాయాలతో నడవ లేని స్థితిలో ఉన్న రివాల్డోకు చికిత్స అందించారు. ఆ పరిసర వాసులు దానికి కావాల్సిన ఆహారం తీసుకొచ్చిపెట్టారు. కానీ మళ్లీ తమ ముందు ఆనందంతో రివాల్డో తిరుగుతుందని ఎదురు చూసిన ఆపరిసర గ్రామాల ప్రజలకు శనివారం ఉదయాన్నే చేదు వార్త చేరింది. రివాల్డో కన్నుమూసిన సమాచారంతో ఆ పరిసర వాసులు కన్నీటి సంద్రంలోమునిగారు. ఆంగ్లలో పిలిచినా, తమిళంలో పిలిచినా, తొండాన్ని ఆడిస్తూ, తనకు కావాల్సిన ఆహారం తినేసి ఎవరికీ ఎలాంటి హానీ తలబెట్టకుండా వెళ్లే రివాల్డోను తలచుకుంటూ అనేక కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. తమకు రివాల్డోతో రెండున్నర దశాబ్దాల అనుబంధం అని అరటి తోట గ్రామస్తులు రివాల్డోనుతలచుకుంటూ తమ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయామన్న మనో వేదనను వ్యక్తం చేయడం గమనార్హం. -
చెరువులో నాగమ్మ విగ్రహం లభ్యం
వేలూరు: వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని నెల్లూరు పేటలోని చెరువులో ఐదు తలలతో కూడిన నాగమ్మ విగ్రహం లభ్యమైంది. ఆ ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నెల్లూరుపేటలోని చెరువులో అమ్మవారి విగ్రహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ ప్రాంతంలోని మహిళలు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకొని చెరువు మట్టిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి ఆలయ కట్టపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా అమ్మవారి విగ్రహం తమ ప్రాంతంలో కనిపించడంతో ఆ ప్రాంతంలోని మహిళలు అమ్మవారి ఆలయాన్ని చెరువు కట్ట వద్దనే నిర్మించేందుకు గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నారు. -
క్లుప్తంగా
తిరువొత్తియూరు: ఈరోడ్ జీహెచ్ బ్రిడ్జి పైనుంచి కిందపడిన సీఎస్ఐ ఆర్చిబిషప్ మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. ఈరోడ్, సేలం సీఎస్ఐ చర్చి ఆర్చిబిషప్గా జేకబ్ లివింగ్స్టన్ (56) ఉన్నారు. ఆయన గత ఆగస్టు నెలలో ఆర్చిబిషప్గా బాధ్యతలు స్వీకరించారు. ఈరోడ్లో నివాసముంటున్న ఆయనకు రోజూ వాకింగ్ చేయడం అలవాటు. అందులో భాగంగా, జేకబ్ లివింగ్స్టన్ శనివారం తెల్లవారుజామున తన డ్రైవర్తో కలిసి వాకింగ్ చేస్తున్నారు. జీహెచ్ బ్రిడ్జిపై ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు, బ్రిడ్జి పైనుంచి కిందనున్న మీనాక్షి సుందరనార్ రోడ్డుపై పడ్డారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆయన డ్రైవర్, చుట్టుపక్కల వారి సహాయంతో ఆర్చిబిషప్ను ఈరోడ్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. జేకబ్ లివింగ్స్టన్ ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోడ్ జీహెచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరువళ్లూరు: కడంబత్తూరు యూనియన్లోని అర్హులైన 540 మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శనివారం ఉదయం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారికి ఇంటి పట్టాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్లోని కశవనల్లాత్తూరు, ప్రియాంకుప్పం, కూవం, సత్తరై, ఇరుళంజేరి, అగరం, విడయూరు, చిట్రంబాక్కం సహా 25 గ్రామాలకు చెందిన 540 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తహసీల్దార్ బాలాజీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజేంద్రన్ హాజరై పట్టాలను పంపిణీ చేశారు. డీఎంకే యూనియన్ కార్యదర్శులు కొండజేరి రమేష్, జ్ఞానఓలి, గూలూరు రాజేంద్రన్, హరికృష్ణన్ పాల్గొన్నారు. తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలోని ఆత్తూరులో ప్రభుత్వ సంరక్షణాలయం తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సంరక్షణాలయంలో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో నేరాలకు పాల్పడిన 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు ఉన్నారు. శనివారం ఇద్దరు బాలురు తమ కుటుంబ సభ్యులు కలవడానికి రాలేదనే మానసిక ఒత్తిడి, నిరాశతో తమ చేతికి దొరికిన ఆయుధాలతో సెక్యూరిటీని అక్కడున్న వస్తువులను పగలగొట్టి గొడవకు దాగారు. అంతేకాకుండా అక్కడ బస చేస్తున్న ఇతర బాలురిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై చెంగల్పట్టు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెంగల్పట్టు తాలూకా పోలీసు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో పోలీసులు ప్రభుత్వ సంరక్షణాలయానికి వెళ్లి వారిని అదుపు చేశారు. దీనిపై చైన్నె మైనర్ల సంస్కరణ ప్రాంతీయ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. అన్నానగర్: కోయంబత్తూరులో వెనుకబడిన వర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు టాయిలెట్ శుభ్రం చేయమని బలవంతం చేసి, వారి కులం పేరుతో తిట్టి దుర్భాషలాడిన ఘటన కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపంలోని తొట్టిపాళయం ప్రాంతంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐదుగురు విధ్యార్థులను టాయిలెట్ శుభ్రం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు. ఆమె ఆ విద్యార్థులను కులం పేరుతో పిలిచిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం పాఠశాలను ముట్టడించారు. ఈ స్థితిలో విద్యాశాఖ అధికారి పాఠశాలను పరిశీలించి ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరువొత్తియూరు: తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్గా, సహనటుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు తుగ్లక్. ఇతను శుక్రవారం రాత్రి తన కారులో చైన్నె హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తర్వాత రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం. -
కుష్బూ వారసురాలు రెడీ!
తమిళసినిమా: ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్ సెల్వన్ 1, 2, థగ్లైఫ్ చిత్రాలకు పని చేశారు. కాగా పెద్ద కూతురు అవంతిక హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శనివారం ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు.తల్లి కుష్భుతో అవంతిక -
ప్రేమికుల సందడి
సాక్షి, చైన్నె: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పార్కులు, బీచ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్లలో ప్రేమ జంటలు సందడి చేశాయి. ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాలు నిరసనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇక, ప్రేమికులకు గట్టి భద్రత కల్పించే విధంగా అన్ని చోట్ల పోలీసులు నిఘాతో వ్యవహరించారు. వివరాలు.. ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవం పండుగ రోజు అన్న విషయం తెలిసిందే. ఈ రోజును ఆదరించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లు మరి కొందరు. ఆదరణలు, వ్యతిరేకతలతో పని లేకుండా తమ ప్రేమకు అడ్డెవరు అనుకునే వారూ ఉన్నారు. ఇందులో భాగంగా శనివారం ప్రేమికుల దినోత్సవాన్ని సందడిగా జంటలు జరుపుకున్నాయి. పార్కులు, బీచ్లు తదితర ప్రాంతాలలో ప్రేయసీ, ప్రియులతో కలసి వచ్చే ప్రేమికుల కోసం పోలీసులు గట్టి భద్రత కల్పించక తప్పలేదు. వ్యతిరేకులు, నిరసన కారుల నుంచి ప్రేమకుల్ని రక్షించే బాధ్యతను తమ భుజాన వేసుకున్నట్టుగా పోలీసులు అన్ని నగరాలలో ముందుకెళ్లారు. చైన్నెలో మెరీనా, గాంధీ బీచ్, పట్టినం బాక్కం బీచ్, బీసెంట్నగర్, బీచ్లు, గిండీలో చిల్డ్రన్స్ పార్కు, వండలూర్ జూతో సహా పర్యాటక కేంద్రాలలో ప్రేమ జంటలు చక్కర్లు కొట్టాయి. వినోద కేంద్రాలు, బీచ్లలో ప్రేమ జంటలు సందడి చేశాయి. ఒకరికొకరు కానుకల్ని సమర్పించుకున్నారు. రాష్ట్రంలోని ప్రకృతి రమణీయతకు నిలయంగా ఊటీ, కొడైకెనాల్లో అయితే, ఎక్కడ చూసినా కొత్త జంటలు, ప్రేమ జంటలు సందడి చేశాయి. ప్రేమ వివాహం చేసుకున్న కొత్త జంటల ఆనందానికి అవధులు లేవు. ఇక, రోజా పువ్వులు, బొకేల విక్రయాలు జోరుగా జరిగాయి. ప్రేమికుల దినోత్సవం వేళ తిరునల్వేలి జిల్లా వళ్లియూరులో జయకుమార్ అనే వ్యక్తి తన టీ దుకాణంలో ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. మూడు రోజుల పాటుగా తన దుకాణంలో టీ ధర రూ. 1 అని బోర్డు పెట్టేశాడు. ఇక, ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు జరగ్గా పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. బీచ్లో ప్రేమ జంటల సందడి పార్కుల్లో ప్రేమ జంటల సందడి -
ప్రయత్నంతో పాటూ భక్తిభావం అవసరం
వేలూరు: ఫ్లస్–2, పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు భయపడకుండా దైర్యంగా పరీక్షలు రాసేందుకు ప్రయత్నంతో పాటూ భక్తిభావం కలిగి ఉండాలని శ్రీపురం బంగారుగుడి నారాయణి పీఠాధిపతి శక్తి అమ్మ అన్నారు. వివరాలు.. వేలూరు బంగారుగుడిలో పదవ తరగతి, ఫ్లస్–1, ఫ్లస్–2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బంగారుగుడి ఆవరణలో మహా సరస్వతి యాగ పూజలు జరిగింది. ఈ సందర్భంగా యాగ పూజల్లో ఉంచిన పెన్లను గంపలో వేసి యాగంలో ఉంచిన కలశ నీటినిలో ముంచిన పెన్లను విద్యార్థులకు శక్తిఅమ్మ అందజేశారు. శక్తిఅమ్మ మాట్లాడుతూ బంగారుగుడి ఆధ్వర్యంలో 1992వ సంవత్సరం నుంచి విద్యా నేత్రం పథకం ద్వారా పేద విద్యార్థులకు అనేక విద్యా సదుపాయం అందజేస్తున్నామన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ విద్య తప్పనిసరిగా ఉండాలన్నారు. అదే విధంగా విద్య మాత్రమే ప్రతి ఒక్కరినీ ఉన్నత స్థానాలకు చేర్చగలదన్నారు. అటువంటి విద్యలో పరీక్షలు లేకుండా చదివితే వారి సామర్థ్యం బయటి ప్రపంచానికి తెలియదు కాబట్టే పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టారన్నారు. బాగా చదివినంత మాత్రాన పరీక్షలు రాసే సమయంలో భయాందోళన చెందితే చదువుకున్న అంశాలను స్పష్టంగా రాసే అవకాశం ఉండదన్నారు. ఫలితంగా సంవత్సరం విద్య పూర్తిగా వృథా అవుతుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు కోసం సరస్వతి యాగ పూజలు నిర్వహించి కలశ నీటిలో ఉంచిన పెన్లను అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నారాయణి ఆసుపత్రి డైరెక్టర్ బాలాజీ, బంగారుగుడి డైరెక్టర్ సురేష్, ట్రస్టీ సౌందర్రాజన్, మేనేజర్ సంపత్, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
తిరువళ్లూరు: స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న యువకుడికి జీవితఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలో వసంతం ఎంటర్ప్రైజస్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థఽలో 30 మందిపైకి పనిచేస్తున్నారు. వీరిలో మంజుత్, గోకుల్, మేను, దేవజిత్ స్నేహితులు. ఈక్రమంలో 2019వ సంవత్సరంలో పెద్దపాళ్యంలోని ఆర్కాడు ఫాస్ట్ఫుడ్ సెంటర్ సమీపంలో నలుగురు మద్యం తాగే విషయంగా వీరి మద్య ఘర్షణ చోటుచేసుకుంది. మంజుత్, దేవజిత్, మేను కలిసి గోకుల్ను హత్య చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై విడుదలైన ముగ్గురు విచారణకు హాజరు కావాల్సి వుండగా మంజుత్, మేనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేవజిత్ మాత్రం విచారణకు హాజరవుతూ వచ్చాడు. విచారణ పూర్తయిన క్రమంలో నేరం రుజువు కావడంతో దేవజిత్కు జీవితఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి తీర్పును విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యువకుడి అరెస్ట్ –నాటుబాంబులు స్వాధీనం
తిరువళ్లూరు: మామ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాటుబాంబులతో సంచరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్కు చెందిన రౌడీషీటర్ కుల్లశీను. ఇతడిని ప్రత్యర్థులు గత జూలైలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు ప్రవీణ్ (21) విక్కీ(20), ఆకాష్(19)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో కుల్లశీను హత్యకు ప్రతీకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా అతడి బావమరిది అంబ్రోస్ నాటు బాంబులతో మనవాలనగర్లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు శుక్రవారం రాత్రి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఆసమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అంబ్రోస్ (21)ను పోలీసులు విచారణ చేయగా, అతడి వద్ద నాలుగు నాటుబాంబులు వున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో తన మామ హత్య చేసిన వారిపై బాంబులు వేసి హత్య చేయాలని చెప్పడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వాహనాలకు క్రిమిసంహారక మందుల పిచికారీ
వేలూరు: ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలకు క్రిమి సంహారక మందులు పిచకారీ చేసిన తర్వాతే తమిళనాడుకు అనుమతిస్తున్నారు. బర్డ్ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి వేలూరు వైపునకు వచ్చే వాహనాలకు వేలూరు జిల్లా కాట్పాడి సమీపలోని క్రిష్టియన్పేట వద్ద ఉన్న ఆంధ్ర సరిహద్దు వద్ద క్రిమి సంహారక మందులు చల్లి అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బర్డ్ఫ్లూ ఈ నేపథ్యంలో బర్డ్ప్లూ వ్యాధిని నివారించేందుకు పశుసంవర్థక శాఖ డాక్టర్ సురేందర్, వైద్య సిబ్బంది బృందం ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసి వాటికి క్రిమి సంహారక నివారణ మందులను చల్లి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ధ్రా సరిహద్దులో ఉన్న సేర్కాడు, పరదరామి, బత్తలపల్లి వంటి చెక్పోస్టుల వద్ద కూడా క్రిమి సంహారక నివారణ మందులు చల్లిన అనంతరమే వాహనాలను అనుమతిస్తున్నారు. -
రూ. 3 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయి స్వాధీనం
అన్నానగర్: చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయానికి శనివారం వేకువజామున థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి ఓ విమానం చేరుకుంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి పర్యాటక వీసాపై థాయిల్యాండ్ పర్యటన నుండి తిరిగి వచ్చాడు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ అధికారులుకు అనుమానం వచ్చి అతని వస్తువులను తనిఖీ చేశారు. అతని సూట్కేస్ లోపల సెల్ఫీలు తీసుకోగల ఆటోమేటిక్ కెమెరా ఉంది. 8 ప్యాక్ చేసిన పుడ్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. వాటిని తెరిచి చూడగా, అందులో దాచిపెట్టిన 3 కిలోల హైడ్రోపోనిక్, హైగ్రేడ్ గంజాయి కనిపించింది. దీని విలువ దాదాపు రూ. 3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. కాగా గంజాయిని అక్రమంగా రవాణా చేసిన యువకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని.. తిరువొత్తియూరు: మహాశిరాత్రిని పురస్కరించుకుని తిరువవణ్నామలై ఆలయానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాగే తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి తిరువణ్నామలైకి బస్సులు రైళ్లు వెళ్తున్నాయి. అయిన్నప్పటికీ భక్తుల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈక్రమంలో చైన్నె ఎగ్మోర్ నుండి తిరువణ్నామలైకి ప్రత్యేక రైలు ప్రకటించారు. ఈ రైలు నేడు (ఆదివారం) ఉదయం 10.15 గంటలకు ఎగ్మోర్ నుండి బయలుదేరి తిరువణ్ణామలైకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. 16వ తేదీన సోమవారం ఈ రైలు తిరువాణ్ణామలై నుండి తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి చైన్నె ఎగ్మోర్కి ఉదయం 9.15 గంటలకు వచ్చి చేరుతుంది. అదేవిధంగా ఎగ్మోర్ నుండి వేలూరు కంటోన్మెంటుకు రిజర్వేషన్ మెమో ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఈ రైలు ఎగ్మోర్ నుండి రేపు మధ్యాహ్నాం 12 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 6.00 గంటలకు వేలూరుకు చేరుతుంది. తర్వాత 16వ తేదీన వేలూరు కంటోన్మెంట్ నుండి తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి ఉదయం 9.15 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ 2 రైళ్ల రిజర్వేషన్లు శనివారం మధ్మాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా విల్లుపురం తిరువణ్ణామలై మధ్య వేలూరు–విల్లుపురం మధ్య రిజర్వేషన్లు లేని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణరైల్వే అధికారులు తెలిపారు. డీఎంకేలోకి నిలోఫర్ కఫీల్ సాక్షి, చైన్నె: మాజీ మంత్రి, అన్నాడీఎంకే మైనారిటీ మహిళా నేతల నిలోఫర్ కఫీల్ డీఎంకేలో చేరారు. తిరుపత్తూరులో శనివారం జరిగిన డీఎంకే బూత్ కమిటీ మండల మహానాడు వేదికగా ఆమె సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి వేలూరు జిల్లాలో నిలోఫర్ కఫీల్ మైనారిటీ మహిళా కీలక నేతగా వ్యవహరించే వారు. ఆమెకు దివంగత సీఎం జె. జయలలిత ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. 2016లో అన్నాడీఎంకే మంత్రివర్గంలో ఆమెకు కార్మిక సంక్షేమ శాఖను అప్పగించారు. ఇదే జిల్లాలోని మరో మంత్రి కేసీ వీరమణి, నిలోఫర్ కఫీల్ మధ్య గతంలో వార్ సైతం సాగేది. 2021లో నిలోఫర్కు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా పార్టీ కోసం శ్రమిస్తూ వచ్చారు. ఈపరిస్థితులలో తిరుపత్తూరుకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఆమెతో పాటుగా అన్నాడీఎంకేకు చెందిన మైనారిటీ నేతలు, మహిళ నేతలు అనేక మంది డీఎంకే పార్టీలో చేరారు. ఎండోమెంట్ ఓరేషన్ అవార్డు ప్రదానం సాక్షి, చైన్నె: శ్రీ రామచంద్ర ఉన్నత విద్య పరిశోధన సంస్థలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను ఒకే వేదికపైకి తెచ్చే విధంగా ‘లింక్ – లెర్న్ – లీడ్‘ అనే అంశంపై ఇండియన్ స్పీచ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ సదస్సును నిర్వహించారు. తమిళనాడు డాక్టర్ జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్–చాన్స్లర్ డాక్టర్. ఎస్. సౌమ్య, ఎన్ఐఈపీఎండీ డైరెక్టర్ నచికేత రౌత్, శ్రీహెర్ ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, వీసీ డాక్టర్ ఉమా శేఖర్ ఈసందర్భంగా న్యూరో–కమ్యూనికేషన్ డిజార్డర్స్ రంగంలో స్పీచ్–లాంగ్వేజ్ పాథాలజిస్ట్గా 20 సంవత్సరాల పాటు చేసిన అంకితభావ సేవకు గుర్తింపుగా అన్నమ్మ జార్జ్కు ఎస్. మనోహరన్ ఎండోమెంట్ ఓరేషన్ అవార్డును అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రొఫెసర్ ప్రకాష్ భూమినాథన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ ఆర్.సి. పెరుమాళ్, ఇషా టీఎన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రంజిత్ రాజేశ్వరన్, ఇషా టీఎన్ కార్యదర్శి డాక్టర్ సుందరేశన్ పాల్గొన్నారు. -
వైభవంగా పద్మావతి అమ్మవారి రథోత్సవం
కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్ జీఎన్ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా సాగింది. ఆలయ ప్రాంగణం చుట్టూ సాగిన రథోత్సవం కనుల పండువుగా నిలిచింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణవ పండితుల మంత్రోచ్చారణలతో పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అదేవిధంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్ర పర్వంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం పై వేంచేపు చేసి ఊరేగించారు. ఆ సమయంలో భక్తులు గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో స్వామిని సేవించారు. ఈ వేడుకల్లో ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధనుంజయ్, సూపరింటెండెంట్ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ అధ్యక్షులు ఎన్. శ్రీకృష్ణ, మాజీ సభ్యులు రవిబాబు, మోహన్ రావు, రంగారెడ్డి, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
నైనార్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీయడంతో సర్వత్రా పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు. ఇంతకీ ఆయన టీవీకే అధినేత విజయ్, ఓ ప్రముఖ సినీ నటి ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈరచ్చకు కారణంగా మారాయి. వివరాలు.. టీవీకే అధినేత విజయ్ తనప్రసంగంలో ఓ వైపు డీఎంకేను, మరోవైపు బీజేపీని తీ వ్రంగా టార్గెట్ చేస్తూవస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో విజయ్కు గట్టిగా సమాధానం ఇచ్చే వి ధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన ఎదురు దాడి అనుచిత వ్యాఖ్యలకు దారి తీసింది. అనుభవం లేని వ్యక్తి, అయ్యో పాపం రాజకీయాలు తెలియని వ్యక్తి అంటూ ఎద్దేవా చేస్తూ, ముందు ఇంటి నుంచి బయటకు విజయ్ను రానివ్వండీ అంటూనే, తన కుటుంబానికి ఆయన తొలి ప్రాధాన్యతను ఇవ్వమనండి అని నైనార్ వ్యాఖ్యానించారు. అలాగే అంత కంటే ముందుగా ప్రముఖ హీరోయిన్ ప్రభావం నుంచి బయట పడమనండీ అన్న వ్యాఖ్యలతో వ్యక్తిగత దాడికి దిగడం వివాదానికి దారి తీసింది. నైనార్ వ్యాఖ్యలను శనివారం సర్వత్రా ఖండించారు. ఇది తగదు.. విజయ్ను వ్యక్తిగతంగా నైనార్ టార్గెట్ చేయడం, ఇందులోకి ఓ ప్రముఖ నటిని లాగడాన్ని ఖండిస్తూ నేత లందరూ పార్టీలకు అతీతంగా మీడియా ముందు స్పందించారు. డీఎంకే ఎంపీలు తమిళచ్చి తంగ పాండియన్, కనిమొళి సోము స్పందిస్తూ, ఓ మహిళను కించ పరిచే విధంగా బాధ్యత గల పదవిలో ఉన్న నేత వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై బీజేపీలోని మహిళా నేతలు నోరు వి ప్పాలని, సదరు హీరోయిన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, ఇది పద్ధతి కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలను అంగీకరించ బోమని మండిపడ్డారు. సీపీఎం నేత ష ణ్ముగం స్పందిస్తూ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను బాధ్యత గల పదవిలో ఉన్న నేతలు మానుకోవాలని, ఆయన ముందు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎన్సీసీ నేత సెల్వ పెరుంతొగై స్పందిస్తూ, రాజకీయ విమర్శలు రాజకీయంగానే ఉండాలేగానీ, వ్యక్తిగత దాడులకు దారితీయ కూడదని మండిపడ్డా రు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ మాట్లాడుతూ, తాను ఆ వ్యాఖ్యలను విన లేదు, చూడ లేదని, అయితే, వ్యక్తిగతంగా ఒకర్ని దాడి చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. టీవీకే నేతలు సెంగొట్టయ్యన్, నిర్మల్కుమార్ స్పందిస్తూ దిగజారుడు రాజకీయాలు బీజేపీకి తగదు అని మండిపడ్డారు. వారిలో ఓటమి భయం పెరిగిందని, అందుకే టీవీకేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, సామాజిక మాధ్యమాలలో అయితే నైనా ర్ నాగేంద్రన్ను ఓ వైపు విజయ్, మరోవైపు ప్రముఖ హీరోయిన్ అభిమానులు విమర్శలతో విరుచుకుపడుతుండడం గమనార్హం. -
పుదుచ్చేరికి భారీగా వరాలు
ప్రసంగిస్తున్న అమిత్ షా తరలి వచ్చిన బూత్ కమిటీల ప్రతినిధులు సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. తిరుచ్చి నుంచి ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్లో పుదుచ్చేరి వెళ్లారు. కారైక్కాల్లో జరిగిన బీజేపీ బూత్ కమిటీ మహానాడుకు హాజరయ్యారు. కారైక్కాల్ శని భగవానుడు, భద్ర కాళి అమ్మన్ను స్మరించుకుంటూ అమిత్ షా ప్రసంగించారు. పుల్వామా ఘటనలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ వ్యాఖ్యలు అందుకున్నారు. పుదుచ్చేరిలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అంతం చేసి, ప్రజలకు సుపరి పాలనను అందిస్తోందని వివరించారు. పుదుచ్చేరిలో రాజకీయ స్థిరత్వాన్ని అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యలు చేశారు. నిరంతరం దాడులే.. 2019లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 సీఆర్పీఎఫ్ జవానులు మరణించిన రోజు ఇదే రోజు అని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి ఈసందర్భంగా నివాళులు అర్పిస్తూ, కాంగ్రెస్ హయాంలో, ఉగ్రవాదులు రోజూ పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి చొరబడి దాడులు చేసేవారు అని పేర్కొన్నారు. దీనిని వారి దినచర్యగా నాటి కాంగ్రెస్ పాలకులు తీసుకున్నారేగానీ, అప్పటి దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి లేదా రక్షణ మంత్రి ఎవరూ పెదవి విప్పలేదన్నారు. పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉగ్రవాద దాడులకు తగిన సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్లోకి వెళ్లి మరీ వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామన్నారు. పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించామని గుర్తు చేశారు. చివరగా, ఆపరేషన్ సిందూర్ ద్వారా వారి కార్యకలాపాలకు ముగింపు పలికామని వివరించారు. భారతదేశం వైపు కన్నెత్తకుండా చేశామని, దేశ ప్రజల శ్రేయస్సులో, బలమైన భద్రతలో పీఎం మోదీ ముందున్నట్టు తెలిపారు. పుదుచ్చేరి ప్రజలు మోదీ, రంగస్వామిపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారని, 2021లో అసెంబ్లీ ఎన్నికలలో 44 శాతం మద్దతుతో అధికార పగ్గాలు అప్పగించారని గుర్తుచేశారు. గాంధీ కుటుంబం ఖజానాకు నిధులు.. గతంలో పుదుచ్చేరిని పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ రాష్ట్రాన్ని అవినీతి ఊబి లో ముంచి వెళ్లిందని, గాంధీ కుటుంబం ఖజానా నింపడమే లక్ష్యంగా ఆయన పనితీరు ఉండేదని ఆరోపించారు. పుదుచ్చేరికి అప్పట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ మింగేశారని, శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేశారని ధ్వజమెత్తారు. అయితే, తమ ఎన్డీఏ ప్రభుత్వం పుదుచ్చేరిలో అన్నింటిని చక్కదిద్దినట్టు, అందరికీ పథకాలను దరిచేర్చినట్టు వివరించారు. ఇక్కడి ప్రజలకు పూర్తిరక్షణ కల్పించడమే కాదు, వారిజీవితాలలో వెలుగునింపే విధంగా ముందుకెళ్లినట్టు తెలిపారు. ఈసందర్భంగా తాను ఓ విషయాన్ని చెప్పదలచుకున్నట్టు పేర్కొంటూ, త్వరలో ఇక్కడకు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించబోతున్నారన్నారు. పీఎం మోదీ, సీఎం రంగస్వామి కలిసి త్వరలో పుదుచ్చేరి కోసం అనేక పథకాలను ప్రకటించబోతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని, మళ్లీ ఎన్డీఏ పాలన షురూ అని ధీమా వ్యక్తంచేశారు. ముందుగా గోడ పెయింటింగ్స్లో తామర గుర్తుకు స్వయంగా అమిత్ షా రంగులు వేసి అందర్నీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా, బీజేపీ నేతలు నిర్మల్కుమార్ సురానా, రామలింగం, ఎన్బలం సెల్వం, జాన్ కుమార్, నమశ్శివాయం, కల్యాణ సుందరం, శ్రావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి త్వరలో సీఎం రంగస్వామితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మళ్లీ ఇక్కడ ఎన్డీఏ పాలన కొనసాగే విధంగా ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. సీట్ల పంపకాలపై.. అమిత్షా, రంగ స్వామి ప్రత్యేకంగా కాసేపు భేటీ అయ్యారు. ఇందులో సీట్ల పంపకాల గురించి చర్చ జరిగినట్టు సంకేతాలు వెలుడ్డాయి. కూటమిలో బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేతో పాటుగా మరికొన్ని పార్టీలు ఉండటంతో ఉన్న 30 సీట్లను ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా పంచుకునే దిశగా అమిత్ షా సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే తిరుచ్చిలో అమిత్ షాతో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్తోపాటూ మరికొందరు నేతలు సమావేశమయ్యారు. ఇందులో కూటమిలోకి డీఎండీకే, పుదియ తమిళగం తదితర పార్టీలను ఆహ్వానించే దిశగా జరుగుతున్న చర్చల గురించి అమిత్ షాకు నేతలు వివరించినట్టు సమాచారం. రెండు కారణాలతో.. తాను పుదుచ్చేరి రావడానికి రెండు కారణాలు ఉన్నాయని వివరించారు. ఇందులో ఒకటి పీఎం మోదీ, సీఎం రంగస్వామిల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేసిన పనిని ప్రజల ముందు నివేదించేందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. రెండవది ఇక్కడున్న ఇండియా కూటమి దురుద్దేశపూరిత తెరను చింపివేయడానికి వచ్చానని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం పుదుచ్చేరిలో డబుల్ ఇంజిన్ల ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిని అంత మొందించి స్వయం పాలనతో రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పిందని వివరించారు. -
మరో 1000 ఆలయాలకు విస్తరణ
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకకాల పూజ పథకంను మరింతగా విస్తరించారు. ఈ పథకంలో భాగంగా హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలోని మరో 1,000 ఆర్థికంగా వెనుకబడిన ఆలయాలను చేర్చారు. వీటికి రూ. 25 కోట్ల నిధులను కేటాయించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శనివారం సీఎం స్టాలిన్ సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ పథకం పరిధిలో తాజాగా లబ్ధి పొందుతున్న ఆలయాల సంఖ్యం 19 వేలకు చేరింది. ప్రతి ఆలయానికి డిపాజిట్ మొత్తాన్ని రూ. 2 నుంచి రూ. 2.50 లక్షలకు పెంచారు. పూజా ఖర్చులను ఆ డిపాజిట్పై వచ్చే వడ్డీని ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ 19 వేల ఆలయాలకు రూ. రూ.8.58 కోట్ల వ్యయంతో పూజా సామగ్రి పంపిణీ చేశారు. ఇందులో ఇత్తడి తాంబూలం తట్ట, గంట, కామాక్షి దీపం, పంచపాత్రం తదితర సామగ్రిని దేవాలయాల పూజారులకు అందించారు. అదనంగా దేవాలయాల విద్యుత్ బిల్లుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. పూజారులకు ప్రోత్సాహకం పెంపు ఆలయాలలో పనిచేసే పూజారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది వరకు నెల వారీ ప్రోత్సాహం రూ. 1000 అందజేస్తూ వచ్చారు. తాజాగా ఈ మొత్తాన్ని రూ.1500లకు పెంచారు. వేలాది మంది పూజారులకు ఈ పెంపు ప్రయోజనం కలిగించనున్నది. ఇందులో పది మందికి సీఎం స్టాలిన్ పెంపునకు సంబంధించిన చెక్కులను సీఎం అందజేశారు. తమిళనాడు ప్రభుత్వం పురాతన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో పలు మ్యూజియంలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శివగంగ జిల్లాలో రూ.24.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కీలాడి ఓపెన్ ఎయిర్ మ్యూజియాన్ని సీఎం స్టాలిన్ వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. సంగ కాల యుగ నాగరికతకు చెందిన తవ్వకాలలో బయట పడ్డ ఆధారాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఈ మ్యూజియాన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. అలాగే, తంజావూరు జిల్లాలోని మనోరా స్మారక చిహ్నంలో రూ.2.75 కోట్లతో మౌలిక సదుపాయాలు, ఆధునిక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈరోడ్ జిల్లాలో రూ.33.19 కోట్లతో నోయ్యాల్ మ్యూజియం, రామనాథపురం జిల్లాలో రూ.34.55 కోట్లతో నవాయి మ్యూజియం నిర్మాణానికి సీఎం స్టాలిన్ ఈసందర్భంగా శంకుస్థాపన చేశారు. తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రూ.56.41 కోట్ల వ్యయంతో గ్రేట్ చోళ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. చోళుల పరిపాలన, కళా వైభవం, నావికాదళ శక్తి వంటి అంశాలపై ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.సీఎం స్టాలిన్కు మహిళల బ్రహ్మరథం ఆలయ నిధులకు సంబంధించిన చెక్కు అందజేస్తున్న సీఎం స్టాలిన్ బ్రహ్మరథం చైన్నె నుంచి బృందావన్ ఎక్స్ప్రెస్లో జోలార్ పేటకు సీఎం స్టాలిన్ వెళ్లారు. ఆయనకు అరక్కోణం, జోలార్ పేట స్టేషన్లలో ఘన స్వాగతం లభించింది. తిరుపత్తూరులో రూ. 15 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా సముదాయంను సీఎం పరిశీలించారు. కాగా, పెద్దఎత్తున మహిళా లోకం దారి పొడవున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమకు అందిన రూ. 5 వేలు నగదును చూపిస్తూ, ఆనందంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడంతోపాటు పునరుద్ధరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), డిజైన్ కన్సల్టెంట్కు పూర్తి సహకారం అందించాలని బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ–పీఈఎస్ జాయింట్ వెంచర్’ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. సిబ్బంది, సామగ్రి, యంత్రాలను బరాజ్ వద్దకు తరలించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేసింది. పరస్పర అంగీకారంతో రూపొందించే నిబంధనల ప్రకారమే బరాజ్ పునరుద్ధరణ పనులు చేపట్టాలంటూ ‘ఎల్ అండ్ టీ’ప్రత్యుత్తరం రాయడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. పరస్పర అంగీకారమనే ప్రశ్న ఉత్పన్నం కాదని.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని తేలి్చచెప్పింది. కేవలం నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతో ఒప్పంద కాలంలోనే బరాజ్కు నష్టం జరిగిందని.. బరాజ్ పునరుద్ధరణను పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టాలని ‘ఎల్ అండ్ టీ’కి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ రామగుండం సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ నెల 3న ‘ఎల్ అండ్ టీ’కి మరో లేఖ రాశారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు తమ నివేదికల్లో తేల్చడాన్ని గుర్తుచేశారు. పునరుద్ధరణ చర్యల్లో ఈ సంస్థల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం లేఖలో ఆదేశించింది. నీటిపారుదల శాఖ నియమించే డిజైన్ కన్సల్టెంట్ నుంచి అవసరమైన ఇన్పుట్స్ అందిన వెంటనే బరాజ్ పునరుద్ధరణకు సహకరిస్తామని నిర్మాణ సంస్థ పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. పునరుద్ధరణ పనుల డిజైన్ల తయారీ కోసం ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ సంస్థను కన్సల్టెంట్గా ఎంపిక చేశామని.. త్వరలో ఒప్పందం చేసుకోనున్నామని తెలియజేసింది. -
విజయ్-త్రిష బంధంపై బీజేపీ చీఫ్ దారుణమైన కామెంట్స్
చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్గా ఇన్స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్) -
మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు
తమిళనాడు: డీఎంకే ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి రూ.5వేలు వేయడంతో మహిళలు రెట్టింపు ఉత్సాహం చెందారు. ఎన్నికల వేల డీఎంకే వ్యూహానికి సానుకూల స్పందనతో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ మహిళలను ఆకర్షించే విధంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు నెలలకు రూ.3వేలు, మే నెల వేసవి ఎండలకు అదనంగా రూ.2వేలతో కలిపి రూ.5లచొప్పున మహిళ హక్కు పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకే నగదు జమ చేశారు. మహిళల చేతికి డబ్బులు అందాలని శుక్రవారం ఉదయం 7 గంటలకల్లా అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీంతో మహిళలు నగదు విత్డ్రా కోసం బ్యాంకుల వద్దకు పోటెత్తారు. తిరుత్తణిలోని మపోసీ ప్రదాన రోడ్డు మార్గంలోని ఇండియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకుల వద్ద క్యూకట్టారు. రెండు గంటల పాటు బ్యాంకు వద్ద వేచివుండి బ్యాంకు ఏజెంట్లు, సరీ్వసు కేంద్రాల్లో డబ్బులు విత్డ్రా చేశారు. -
చేపల కోసం వల వేస్తే శవం పడింది!
అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థునా? ఎవరైనా విద్యార్థుని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్లుప్తంగా
పది రాతి విగ్రహాలు లభ్యం తిరువళ్లూరు: విడయూరు వద్ద వున్న కుశస్థలీ నదిలో మరో పదికి పైగా రాతి విగ్రహాలు లభ్యం కావడం చర్చినీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ విడయూరులో కుశస్థలి నదికి సమీపంలో కొందరు ఉపాధి కూలీలు పనిచేస్తుండగా బ్రిడ్జి కింద పది అడుగులకుపైగా వున్న అమ్మవారి రాతి విగ్రహం కనిపించింది. వెంటనే మహిళలు కుశస్థలి నదిలో వున్న అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి గాలించారు. ఈ సమయంలో మరో పది చిన్న రాతి విగ్రహలు సైతం లభ్యమయ్యాయి. వాటిని సైతం బయటకు తీసిన మహిళలు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన తహసీల్దార్ బాలాజీ, రెవెన్యూ అధికారులు విగ్రహాలను స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. కాగా ఇటీవలే పింజివాక్కంలోని బ్రిడ్జి వద్ద 50కి పైగా రాతి విగ్రహాలు లభ్యమైన విషయం తెలిసిందే. కాగా బ్రిడ్జిలకు సమీపంలోనే రాతి విగ్రహాలు లభ్యం కావడం చర్చినీయాంశంగా మారింది. చోరీకి గురైన విగ్రహాలను కొందరు కావాలనే నదుల్లో పడేసి వుండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దివ్యాంగుల ధర్నా తిరువొత్తియూరు: చైన్నె, తిరువొత్తియూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లు నెరవేర్చాలని ధర్నా చేసిన దివ్యాంగుల 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని దివ్యాంగులు, సంరక్షకుల హక్కుల సంఘం సభ్యులు దివ్యాంగులకు నెలవారీ సాయాన్ని రూ.6 వేలకు పెంచాలని, తీవ్రమైన దివ్యాంగులకు రూ. 10. వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం తిరువొత్తియూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. అనంతరం ఒక్కసారిగా అందరూ వల్లలార్ నెడుంచాలైలో రోడ్డు దిగ్బంధానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా దివ్యాంగులను తిరువొత్తియూరు పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా తమ వాహనాల్లో ధర్నాలో పాల్గొన్న దివ్యాంగులు స్వయంగా మోటార్ సైకిళ్లపై పోలీస్స్టేషన్న్కు వెళ్లి అరెస్టయ్యారు. శిల్ప కళా పోటీలకు స్పందన సాక్షి, చైన్నె: చైన్నెస్ అమృత గ్రూపు విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన శిల్ప కళా పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి చైనాకు చెందిన శిల్ప కళా నిపుణుడు, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెప్స్ సొసైటీస్ సభ్యుడు యాంగ్ జిస్ క్వాస్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ చెఫ్ నందకుమార్ హాజరయ్యారు. ఈ పోటీలకు చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, ఖైరతాబాద్, విజయవాడలోని చైన్నె అమృత విద్యా సంస్థలకు చెందిన 40 మంది శిల్పకళా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో అర్జున్ ఎస్ఆర్, ఎస్కే పృథ్వీరాజ్, షెహనాజ్ షేక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సంస్థల చైర్మన్ ఆర్. భూమినాథన్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచ ప్రమాణాల శిక్షణ, అంతర్జాతీయ గుర్తింపు, వందశాతం ప్లేస్మెంట్ అవకాశాలను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. చేపల కోసం వల వేస్తే శవం పడింది! ●యువతి దారుణ హత్య ఉదంతం వెలుగులోకి! అన్నానగర్: చేపలు పట్టేందుకు వల వస్తే..ఊహించని విధంగా ఓ శవం అందులో వచ్చింది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటనను ఇది వెలుగులోకి తెచ్చింది. వివరాలు..నాగర్కోయిల్ సుంగాన్ కడైలోని అంబేడ్కర్ కాలనీ ప్రాంతంలో పణంగుళం అనే కొలను ఉంది. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతానికి చెందిన యువకులు కొలనులో చేపలు పడుతుండగా, వారి వలలో ఒక పెద్ద సంచి చిక్కుకుంది. దానిని యువకులు శ్రమలకోర్చి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సంచి నుంచి దుర్గంధం వస్తూండడంతో అనుమానించారు. సమాచారం ఇవ్వడంతో ఇరానియల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంచిని తెరిస్తే...దారుణ హత్యకు గురై, కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఓ యువతి మృతదేహం ఉన్నట్టు బయటపడింది. ఆ యువతి మృతదేహాన్ని తీగలతో కట్టివేసి, పెద్ద రాయి కట్టి కొలనులో పడేసినట్లు తేలింది. హత్య చేశాక నిప్పంటించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ల వయసున్న ఆమె మృతదేహం ఉన్న స్థితి బట్టి వారం క్రితం ఆమె హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో చాలా కాలేజీలు ఉన్నాయి. హత్యకు గురైన యువతి కాలేజీ విద్యార్థినా? ఎవరైనా విద్యార్థిని అదృశ్యమయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నాకు ప్రత్యేకం ఉయిరుళ్లవరై ఉష
తమిళసినిమా: టి.రాజేందర్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉయిరుళ్లవరై ఉష. ఈ చిత్రంలో నటుడు గంగ, నళిని హీరో హీరోయిన్గా నటించారు. నళిని కథానాయకిగా పరిచయమైన మొదటి చిత్రం ఇదే కావడం గమనార్హం. రాధారవి, గౌండమణి, సరిత ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం 1983లో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ విడుదల కావడం ట్రెండీగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఉయిరుళ్లవరై ఉష చిత్రం కూడా 43 ఏళ్ల తర్వాత శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రీరిలీజ్ అయ్యింది. దీన్ని ఫోర్ కే డిజిటల్ ఫార్మెట్లో రూపొందించినట్లు టీ.రాజేందర్ తెలిపారు. ప్రేమ కథ చిత్రాలకు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం రీ రిలీజ్ అయినా సందర్భంగా శింబు తన ఇన్స్ట్రాగామ్లో ఒక పోస్ట్ చేశారు. అందులో ‘సిల్వర్ జూబ్లీ ’వేడుకలను జరుపుకున్న చిత్రం ఉయిరుళ్ళవరై ఉష. టి రాజేందర్ పూర్తి స్థాయిలో కనిపించిన తొలి చిత్రం ఇది. తన ప్రేయసి పేరునే చిత్ర టైటిల్గా మార్చిన నటుడు రాజేందర్. ఉత్తమ నటనను ప్రదర్శించిన నటీనటులు, సంగీతం ప్రేక్షకుల హృదయాల్లోనే కాకుండా, నా మనసులోనూ ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలాంటి ఈ క్లాస్ మూవీ మరోసారి విజయం సాధించాలి అని పేర్కొన్నారు. -
అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన
తిరువళ్లూరు: ఉపాధి పథకాన్ని రద్దు చేస్తారనే అబద్ధపు ప్రచారం చేస్తున్న డీఎంకే తీరును ఖండిస్తూ తిరువళ్లూరు జిల్లాలోని యూనియన్ కేంద్రాల్లో అన్నాఈఎంకే కూటమి నేతలు ఆందోళన చేశారు. కడంబత్తూరు, పూండి, తిరువేళాంగాడులో జరిగిన ఆందోళనకఉ మాజీ మంత్రి రమణ అధ్యక్షత వహించారు. గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనియన్లో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, పొన్నేరి, మీంజూరులో జరిగిన ఆందోళనకు జిల్లా కన్వీనర్ శిరునియం బలరామన్ నేతృత్వం వహించారు. పూందమల్లి, తిరువేర్కాడులో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే మణిమారన్, ఆవడి, తిరునిండ్రవూర్లో జరిగిన ఆందోళనకు మాజీ మంత్రి అబ్దుల్రహీం, అంబత్తూరులో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే అలెగ్జాండర్ అధ్యక్షత వహించారు. ఉపాధి బిల్లులు బకాయిలు లేకపోయినా వున్నట్టు చూపించి కేంద్రప్రభుత్వం ప్రజలను అసంతృప్తి కలిగేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంధ్ర ప్రభుత్వంతో సఖ్యతగా వుంటూ నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన సీఎం స్టాలిన్ వారితో ఘర్షణ పడి పరువును బజారున పడేశారని విమర్శించారు. ఈ ఆందోళనలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి నిర్వీర్యానికి నిరసనగా ఆందోళన తిరుత్తణి: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 125 రోజుల ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే కూటమి పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం బీడీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. తిరుత్తణిలోని బీడీఓ కార్యాలయం వద్ద మండల అన్నాడీఎంకే కార్యదర్శులు అత్తుళూరు రవి, కవిచంద్రన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, పీఎంకే, పురట్చి భారతం సహా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ కార్యదర్శి హరి, మాజీ మంత్రి రమణ పాల్గొని గ్రామీణుల ఉపాధి పథకం నిర్వీర్యం చేసే డీఎంకే ప్రభుత్వ కుట్రలకు నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే పళ్లిపట్టు మండల కార్యదర్శులు టీడీ.శ్రీనివాసన్, కృష్ణమనాయుడు, రవి ఆధ్వర్యంలో బీడీఓ కార్యాలం వద్ద మహాధర్నా చేశారు. -
ఎన్నికలను విజయవంతం చేద్దాం!
సాక్షి, చైన్నె : తమిళనాడులో ఎన్నికల నగారా మోగించడం, భద్రతా చర్యలు, ఏర్పాట్లు ముమ్మరం అంశాలతో ఎన్నికలను విజయవంతం చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, ముఖ్య పోలీసు అధికారులు, జీఎస్టీ, ఐటీ, అధికారులతో సమావేశం శనివారం చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్లు భానుప్రకాష్, మనీష్ గార్గ్, పవన్కుమార్ శర్మ, సంజయ్కుమార్, అశీష్ గోయల్ ఏడుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం రాత్రి చైన్నెకి చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం పుదుచ్చేరిలోని ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. రెండో రోజుగా శుక్రవారం తమిళనాడులోని ఎస్పీలు, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల ముఖ్యఅధికారులు, ఐటీ, జీఎస్టీ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. తమిళనాడు ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతాపరమైన అంశాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను విజయవంతం చేయడం లక్ష్యంగా, నగదు బట్వాడా కట్టడి దిశగా భద్రత ఏర్పాట్లు, తనిఖీలు, సమష్టి సమన్వయం వంటి అంశాల గురించి ఎన్నికల డిప్యూటీ కమిషనర్లు ఇక్కడి అధికారులకు వివరించారు. మార్చిలో నగారా మోగించే దిశగా సూచనప్రాయంగా సమాచారం. ఈ సమావేశంలో వెలువడినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, కౌంటింగ్ కేంద్రాల అంశాలతోపాటు ఇక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా ఎన్నికల కమిషనర్లు సూచనలు చేసినట్టు తెలిసింది. -
మంచి కంటెంట్ చిత్రాలకే ఆదరణ
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ కొంత గ్యాప్ తర్వాత తాజాగా నిర్మించిన చిత్రం ఫోర్ ఇడియట్స్. దీనికి డా.ఎం. శ్రీవాత్సవ్, ఎం.గోకుల్కృష్ణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీకే.మురుగేశన్, జ్యో. ఏఎన్.సెల్వరాజ్ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సజోసుందర్ మురుగేశన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అదేవిధంగా పుగళ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఇందులో నయన్ నాయకిగా నటిస్తున్నారు. సుభాష్ మునిరత్నం సంగీతాన్ని, యుకే.సెంథిల్కుమార్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చైన్నెలోని కమల థియేటర్లో నిర్వహించారు. పుగళ్ మాట్లాడుతూ చైన్నె, వడపళనిలో టూవీలర్, కారు సర్వీసింగ్లో పనిచేస్తున్న తన గెటప్, క్యారెక్టర్ చూసిన ఒక మిత్రుడు నువ్వు సినిమాల్లో నటించవచ్చుగా అని చెప్పాడు. దీంతో విజయ్ టీవీలో అవకాశం కల్పించారని తెలిపారు. అక్కడ గుర్తింపు తెచ్చుకుని, సినిమాల్లో హాస్య నటుడిగా పరిచయం అయ్యానన్నారు. ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం వినోదంతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తిరుప్పూర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ చిన్న, పెద్ద తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న కథా చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. అలా మంచి కంటెంట్ కలిగిన చిత్రంగా ఫోర్ ఇడియట్స్ ఉంటుందని చెప్పారు. -
వృషభ వాహనంపై విహారం
ఏర్పేడు : గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయంలో శుక్రవారం ఉదయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లు వృషభ వాహనంపై పుర వీధుల్లో విహరించారు. ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు, ఈవో రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు వేడుకగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ ప్రత్యేక అభిషేక పూజలు చేసి సాయంత్రం స్వామి, అమ్మవార్లను కామధేను వాహనంపై విహరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. -
ఉచిత ఇంటి పట్టాల పంపిణీ
తిరుత్తణి: పట్టణ శివారులో మూడు దశాబ్దాలుగా నివాశముంటున్న 20 కుటుంబీకులకు ఎమ్మెల్యే చంద్రన్ ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. తిరుత్తణి శివారులోని కార్తికేయపురం పంచాయతీలోని పీటీ పుధూర్ గ్రామంలోని అరుంధతీ కాలనీలో 40కి పైగా కుటుంబీకులు నివాశముంటున్నారు. పట్టణ శివారులో పోరంబోకు స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్న వారికి ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అయితే పట్టణ శివారులో ధర ఎక్కువగా వున్నందున ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి వీలుకాక అధికారులు చేతులెత్తేశారు. దీంతో ప్రభుత్వ ఆర్ధిక సాయం పొందలేక అరుంధతీ కాలనీ కుటుంబీకులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమై బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చంద్రన్ ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి అర్హులైన 20 కుటుంబాలకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకున్నారు. శుక్రవారం తహసీల్దార్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని అర్హులకు ఉచిత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి హారతి, ఆర్ఐ మణిభారతి పాల్గొన్నారు. -
ప్రేమకు ‘అ’భయం
సాక్షి, చైన్నె: శనివారం ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని ప్రేమ జంటలకు అభయం కల్పిస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో హద్దులు మీరకుండా హెచ్చరించేందుకు సిద్ధమయ్యారు. పార్కులు, బీచ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్లలో ప్రేమ జంటలు సందడి చేసే అన్ని ప్రాంతాల్లోనూ భద్రతను కల్పించారు. ప్రేమ జంటల కోసం రోజాపువ్వులు మార్కెట్లో పెద్ద ఎత్తున కొలువుదీరాయి. ప్రేమికులకు ఫిబ్రవరి 14 పండుగ రోజు అన్న విషయం తెలిసిందే. ఈ రోజును ఆదరించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లు మరి కొందరు. వీరితో తమకేంటి అనే వాళ్లూ ఇంకొందరు. ఇక, ప్రేమ జంటలను ఏకం చేస్తూ ప్రేమకోసమే జీవితాన్ని గడిపిన వాలెంటైన్ చనిపోయిన ఈ రోజున తన ప్రేయసి వద్ద, ప్రియుడి వద్ద ప్రేమను వ్యక్తీకరించే వాళ్లెందరో. అలాగే, ప్రేమ వివాహం చేసుకున్న కొత్త జంటల ఆనందానికి అవధులు ఉండవు. ప్రేయసి, ప్రియులతో కలసి వచ్చే ప్రేమికుల కోసం శనివారం పోలీసులు చైన్నె వంటి రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో గట్టి భద్రత కల్పించారు. వ్యతిరేకులు, నిరసన కారుల నుంచి ప్రేమికుల్ని రక్షించే బాధ్యతను తమ భుజాన వేసుకుని పోలీసులు పహారా పెంచారు. చైన్నెలో మెరీనా, గాంధీ బీచ్, పట్టినం బాక్కం బీచ్, బీసెంట్నగర్, బీచ్లు, గిండీలో చిల్డ్రన్స్ పార్కు, శివారుల్లోని నీలంకరై, కోవలం, మహాబలిపురం బీచ్, వండలూర్ జూసహా పర్యాటక కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ప్రేమజంటలు తరలి రావడం జరుగుతుంది. తమ ప్రేమను వ్యక్తీకరించే వాళ్లు కొందరు అయితే, తమ ప్రేయసి, ప్రియులకు కానుకల్ని సమర్పించుకుని ఆనందాన్ని పంచుకునేందుకు మరెందరో రెడీ అయ్యారు. ఇక, ప్రేమికుల కోసం రోజా పువ్వులు కొలువు దీరాయి. సాధారణంగా చైన్నె మార్కెట్కు రోజుకు ఏడు టన్నుల రోజాలు నీలగిరి, హొసూరు, కృష్నగిరి నుంచి వస్తుంటాయి. అయితే, శనివారం అదనంగా మరో ఆరేడు టన్నుల రోజాలు దిగుమతి అయ్యాయి. పది, పన్నెండు రోజా పువ్వులతో కూడిన ప్యాక్ను రూ.600 వరకు విక్రయిస్తున్నారు. -
డీఎంకేను గద్దె దించడమే లక్ష్యం
సేలం: ప్రజా వ్యతిరేక డీఎంకే పాలనను అధికారం నుంచి తొలగించి టీవీకేను అధికారంలోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రజల లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. 2026లో వందకు వంద శాతం టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను ప్రేమించే ఈ విజయ్ కావాలా..? ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపే స్టాలిన్ ..కావాలా తేల్చుకునే ఎన్నికలే త్వరలో జరగనున్నట్టు వ్యాఖ్యలు చేశారు. సేలంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ప్రచార సభ జరిగింది. ఇందులో ఐదు వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా, విజయ్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. పాస్లు లేని వాళ్లు సైతం దూసుకొచ్చేయడంతో కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు భానుడు భగ భగ మండుతుంటే, మరో వైపు విజయ్ వేదికపై వాడివేడిగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు. కాగా, ఈ సభకు వచ్చిన ఉత్తరాదికి చెందిన, స్థానికంగా వెండి తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న సూరజ్(37) స్పృహ తప్పి మరణించడం విషాదానికి దారి తీసింది. ప్రజారక్షకుడిని తమిళనాడుకు మొదటి సైనికుడిగా, మొదటి రక్షకుడిగా నిలబడడమే తన లక్ష్యం అని పేర్కొంటూ, తాను అందరి నుంచి ఓట్లు అడగడానికి రాలేదని, అందరిని న్యాయం అడగడానికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. నేను ఏం తప్పు చేశాను? రాజకీయాల్లోకి రావడం తప్పా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలకు కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి, స్థలం ఇస్తారని, అయితే, తనకు మాత్రమే ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకున్న సొమ్ముతో ఓటర్లను కొనేయ వచ్చు అని కలలు కంటున్నారని, వారు ఇచ్చే నోట్లు తీసుకుని వారి చెవులలో ఘీంకరించే విధంగా విజిల్ మోత మోగించాలని పిలుపునిచ్చారు. . తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని, ద్వేషపూరిత రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజల రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తమను ఏ టీమ్, బీ టీమ్ అని పిలుస్తున్నారని, తనకు ఇందులో ఎలాంటి అనుభవం లేదని పేర్కొంటూ, పొత్తులపై ఆధారపడిన 75 ఏళ్లుగా ఒకరు, 50 ఏళ్లగా మరొకరు కదన రంగంలోకి వస్తుంటే, ఈ విజయ్ ఒంటరిగా నిలబడి ఢీకొట్ట బోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కలలను వినేందుకు సీఎం పథకాన్ని ప్రకటించారని గుర్తు చేస్తూ, డీఎంకే గద్దె దించడమే ప్రజల కల, టీవీకేను అధికారంలోకి తీసుకు రావడమే ప్రజల కల అని వ్యాఖ్యల తూటాలను పేల్చారు. అధికారంలో వాటా, అధికారంలో భాగస్వామ్యం, సంకీర్ణం అంటూ తాను చేసిన వ్యాఖ్యలు తాజాగా సీఎం స్టాలిన్ను తీవ్ర సంకటంలో పడేసి ఉందంటూ , మరిన్ని షాక్లు త్వరలో సీఎంకు ఇవ్వనున్నామన్నారు. మనం ఏమిటో నిరూపించుకుందాం విజయ్ మాట్లాడుతూ మనల్ని మనం నిరూపించుకోవాలనే తపన అందరిలో పెరగాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ఇతరులకు ఒక రాష్ట్రం కావచ్చునని, అయితే, తనకు మాతృభూమి తమిళనాడు, తన ఇంట్లో 8 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. తనకు అన్నీ ఇచ్చిన తమిళనాడును అన్నింటా ఉన్నత స్థానంలో ఈ విజయ్ నిలబెడతాడని ధీమా వ్యక్తం చేశారు. -
లంకేశ్వరుడిపై లయకారుడు
ఏకాదశి ఉత్సవంలో కల్యాణ వెంకన్న నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఉత్సవర్లు మాడవీధి ఉత్సవంలో భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. సాయంత్రం తిరుచ్చి వాహనంపై శ్రీదేవీ, భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి తిరుచ్చి వాహనం అధిరోహించి, మాడవీధుల్లో విహరించారు. ఏకాదశి ఉత్సవం సందర్భంగా శుక్రవారం పద్మావతీ అమ్మవారి ఊంజల్సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్, అర్చకులు పర్యవేక్షించారు. శ్రీవారి దర్శనానికి 12గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అసుర జాతిలో పుట్టిన రావణుడు బ్రహ్మణోత్తముడు..అత్యంత శివభక్తి పారాయణుడు. కై లాసాన్ని తన శిరస్సుకెక్కించుకుని.. రుద్రవీణాగానంతో పరమేశ్వరుడిని మెప్పించిన భక్తాగ్రేసరుడు. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాంధర్వరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ముక్కంటీశ్వరుడు ధశకంఠుడిపై అధిరోహించాడు. స్వామివారి దేవేరి జ్ఞానప్రసూనాంబ మయూర వాహనాన్ని అధిరోహించి, భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. వినాయకుడు మూషిక వాహనంపై, శ్రీవల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండీకేశ్వరస్వామి, భక్త కన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు బంగారు యాళి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప కొలువుదీరారు. కళాకారుల కోలాటాలు, నందుల వాయిద్యాలు, శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయ పరిసరాలు మార్మోగాయి. –శ్రీకాళహస్తి -
తరలి వచ్చిన తారా లోకం
సాక్షి, చైన్నె : తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, బుల్లితెర అవార్డులు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డుల వేడుక శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కలైవానర్ అరంగం వేదికగా జరిగింది. తమిళ తారాలోకం తరలి వచ్చి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమిళ చిత్ర అవార్డుల వేడుక జరగలేదు. తాజాగా డీఎంకే ప్రభుత్వం ఎట్టకేలకు అవార్డుల ప్రదానోత్సవానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా 2016 నుంచి 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 2014 నుంచి 2022 సంవత్సరాలకు స్మాల్ స్క్రీన్ అవార్డులు, 2015 – 2016 నుంచి 2021 – 2022 సంవత్సరాలకు తమిళనాడు ప్రభుత్వ ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అవార్డులను గత నెల ప్రకటించారు. వీరికి అవార్డుల ప్రదానోత్సం కోలాహలంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో చైన్నెలోని కలైవానర్ అరంగం వేదికగా జరిగింది. అవార్డుల ప్రదానం 2016 నుంచి 2022 వరకు ఆయా సంవత్సరాల వారీగా విడుదల చేసిన జాబితాలోని ఉత్తమ నటులు, నటీమణులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హాస్య నటులు, దర్శకులు, ఉత్తమ చిత్రాలు, కేటగిరిలకు ఎంపికై న వారికి అవార్డులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సమాచారమంత్రి స్వామినాథన్, దేవదాయశాఖ మంత్రి శేఖర్బాబు అవార్డులను అందజేశారు. అలాగే, గాయని సుశీలకు కలైంజ్ఞర్ స్మారక అవార్డును అందజేశారు. ఉత్తమ చిత్రాలకు మొదటి బహుమతి రూ. 2 లక్షలు, రెండవ బహుమతి రూ. లక్ష, మూడవ బహుమతి రూ.75 వేలు అందజేశారు. ప్రత్యేక బహుమతి రూ.75 వేలు, మహిళలను సానుకూల దృక్పథంలో చిత్రీకరించిన చిత్రానికి రూ. 1.25 లక్షల ప్రత్యేక బహుమతిని అందించారు. ఉత్తమ నటుడు, నటి , ఉత్తమ సాంకేతిక కళాకారులకు ఇతర విభాగాలకు పది గ్రాముల బంగారు పతకం, జ్ఞాపిక, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అవార్డులను ఽనటీనటులు సూర్య, కార్తీ, శివకార్తికేయన్, ధనుష్, విక్రమ్ప్రభు, విష్ణు విశాల్, ఆర్ పార్థిబన్, కీర్తిసురేష్, సాయిపల్లవి, ఐశ్వర్యరాజేష్, ఆండ్రియా, ఊర్వశి, తుషారా విజయ్, యోగిబాబు, అమీర్, సముద్రఖని, మారిసెల్వరాజ్, కోవై సరళ, శ్రీరంజని, అర్జున్దాస్ తరలివచ్చి అవార్డులను అందుకున్నారు. ఇందులో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్కు పొన్నియన్ సెల్వన్చిత్రానికిగాను ఉత్తమ అవార్డు అందుకున్నారు. పొన్నియన్ సెల్వ ల్యాండ్ మార్కు చిత్రం అని, దక్షిణ భారత దేశంలో అత్యంత ముఖ్య కథనం అని పేర్కొంటూ, ఇందుకు అవార్డు రావడం ఆనందంగా ఉందని ఏఆర్ రెహ్మాన్ తెలిపారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి ప్రసంగిస్తూ, ఈ అవార్డులపై మొదలైన విమర్శలకు సరైన సమాధానం ఇచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలోని జ్యూరీ కమిటీ అర్హులైన వారిని ఎంపికచేసిందని వివరించారు. -
లో ఓల్టేజి సమస్యతో పనిచేయని మరమగ్గాలు
–విద్యుత్ గ్రీవెన్స్లో నేత కార్మికుల ని‘వేదన’ తిరుత్తణి: బుచ్చిరెడ్డిపల్లెలో లో–ఓల్టేజి సమస్య పరిష్కరించాలని నేత కార్మికులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తిరుత్తణిలోని డివిజినల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ శేఖర్ ఆధ్వర్యంలో విద్యుత్ గ్రీవెన్స్ నిర్వహించారు. సబ్ డివిజన్ వ్యాప్తంగా నుంచి విద్యుత్ వినియోగదారులు, రైతులు, నేత కార్మికులతోపాటు ప్రజలు విద్యుత్ సమస్యలపై వినతిపత్రాలు అందజేసారు. బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన నేత కార్మికులు మాట్లాడుతూ, నెల రోజులుగాలో తమ గ్రామంలో ఓల్టేజి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో మరమగ్గాలు పనిచేయక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నట్టు నివేదించారు. కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి లో ఓల్టేజి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజినల్ ఇంజినీర్ మురగ భూపతి, సహాయ ఇంజినీర్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు -
నేడు కారైక్కాల్కు అమిత్షా
సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా శనివారం పుదుచ్చేరిలోని కారైక్కాల్లో పర్యటించనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తమిళనాడులో డీఎంకేను గద్దె దించి తీరతానన్న సంకల్పంతో అమిత్షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి దిశగా కసరత్తులు వేగవంతం చేశారు. తాజాగా మరోమారు రాష్ట్ర పర్యటనకు అమిత్షా వచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన తిరుచ్చికి చేరుకున్నారు. ఇక్కడి హోటల్లో బస చేశారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నేడు కారైక్కాల్లో సభ కారైక్కాల్లో జరిగే ఎన్డీఏ కూటమి బహిరంగ సభకు శనివారం అమిత్షా హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుచ్చి నుంచి హెలికాప్టర్లో పుదుచ్చేరి వెళ్తారు.11 గంటలకు పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి నేతలందర్నీ అమిత్షా మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయం చేయనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరునల్లారు వెళ్తారు. ఇక్కడ శని భగవానుడి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం పార్టీ వర్గాలతో సమావేశం అవుతారు. నాలుగు గంటలకు ఇక్కడి నుంచి హెలికాప్టర్లో తిరుచ్చి వెళ్తారు. ఇక్కడ అమిత్షా తమిళనాడు బీజేపీ నేతలు, కూటమి పార్టీలతో సమావేశం కానునున్నారు. పొత్తు కసరత్తులను డీఎండీకేతో ముగించి, అమిత్షా ముందుకు ప్రేమలత విజయకాంత్, సుదీష్ నేతలను తీసుకెళ్లే దిశగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. అలాగే, పుదియ తమిళగం నేత కృష్ణస్వామిని సైతం అమిత్ షా వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు విస్తృతం చేశారు. కారైక్కాల్కు రానున్న అమిత్షాకు బ్రహ్మరథం పట్టే విధంగా పుదుచ్చేరిలో బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. అభివృద్ధి పనుల పరిశీలన కొరుక్కుపేట: పెరంబూర్లోని తిరువికానగర్లో అభివృద్ధి పనులను హిందూధర్మాదాయశాఖా మంత్రి పి.కె.శేఖర్బాబు పరిశీలించారు. ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టు కింద, తిరువికానగర్, ఒట్టేరి, పెరంబూరు, జమాలియా, మంగళపురం ప్రాంతాలలో సీఎండీఏ చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు నిర్మాణ పనులు శుక్రవారం ఉదయం మంత్రి పీకే శేఖర్బాబు స్వయంగా వెళ్లి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెలలో 20కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రజల ప్రయోజనం కోసం అంకితం చేసినట్లు తెలిపారు. తమిళనాడు రవాణా సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ముఖ్యమంత్రి 25వ తేదీన ప్రజల ప్రయోజనం కోసం 20 కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారన్నారు. -
అబ్బురం.. ద్వాదశ జ్యోతిర్లింగం
నగరి: మున్సిపల్ పరిధిలోని కీళపట్టు త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయ ఆవరణలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది వినూత్న అమరికలు చేపట్టడం పరిపాటిగా వస్తోంది. ఈ ఏడాది ఆలయం వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపడతారనే ఉత్కంఠ కూడా ప్రజల్లో ఉంది. ఈ ఏడాది భక్తులను ఆకట్టుకునేలా ఓంకారేశ్వర, కాశీ విశ్వనాథ, భీమేశ్వర, రామనాథ, త్రయంబకేశ్వర, నాగేశ్వర, సోమనాథ, మల్లికార్జున, వైద్యనాథ, ఘృష్మేశ్వర, కేదారేశ్వర, మహాకాళేశ్వర అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలను, శ్మశానాధీశుని ప్రతిమను ఆకట్టుకునేలా ప్రతిష్టించారు. ఆయా ప్రాంతాల్లోని విగ్రహాలను అచ్చుపోసినట్లు చేపట్టిన ఈ అమరికలు చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. స్థానిక భక్తుడు గణేశ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు రెండు నెలలుగా కష్టపడి ఈ అమరికలను సిద్ధం చేశారు. అత్యంత ప్రత్యేకత సంతరించుకున్న ఈ శిలారూపాలను వీక్షించడానికి స్థానిక భక్తులు ఆసక్తి చూపుతున్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని చెస్ గ్రాండ్ మాస్టర్ వి.ఎస్ రాహుల్ అన్నారు. వేణుగోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ 45వ వార్షిక స్పోర్ట్స్మీట్ చైన్నె ఎగ్మూర్లోని రాజారత్నం స్టేడియంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ వి.ఎస్. రాహుల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ముందుగా తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు కె. అనిల్కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలుపుతాయని అన్నారు. అనంతరం చెస్ గ్రాండ్ మాస్టర్ వి.ఎస్. రాహుల్ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఆసక్తి ఉన్న క్రీడలో సాధన చేయగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ముగింపు వేడుకలో విజేతలు, ఉత్తమ అథ్లెట్లకు పతకాలు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఇందులో పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ వి.గోవింద్, ఉపాధ్యక్షుడు ఆనందకుమార్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్.ఆర్. ఇలంగో, హెచ్ఎం వి. షీలా, కో–ఆర్డినేటర్ లేఖ, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఢిల్లీబాబు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
నటి వర్సెస్ దర్శకురాలు
తమిళసినిమా: నటి వరలక్ష్మీశరత్కుమార్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. విదేశాల్లో విద్యను అభ్యసించి కోలీవుడ్లో కథానాయకగా పరిచయమైన వరలకి్ష్ పొడా పొడి చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అలా కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఈమె ఆ తర్వాత ప్రతి కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి నిలక్షణ నటిగా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు ,మలయాళం భాషల్లో నటిస్తున్నారు. గత ఏడాది ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలస్ సత్యదేవ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా దర్శకురాలుగా, నిర్మాతగా అవతారం ఎత్తారు. ఈమె తన చెల్లెలు పూజతో కలసి దోశ డైరీస్ అని చిత్రం నిర్మాణ సంస్థను ప్రారంభించి సరస్వతి అనే పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమెనే దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో ప్రకాష్రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. వరలక్ష్మి ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నటి వర్సెస్ దర్శకురాలు పేరుతో చేసిన వీడియోను ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు.. కథానాయకి వరలక్ష్శీరత్కుమార్, దర్శకురాలు వరలక్ష్మీ మధ్య జరిగే వాగ్వాదం తో సాగే ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. -
ఎంజీ మెజిస్టర్ ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్లో కొత్త ప్రయాణంగా ఎంజీ మెజిస్టిర్ను జేఎస్ డబ్ల్యూఎంజీ మోటారు ఇండియా ఆవిష్కరించింది. ఇది వరకటి ఈ–సెగ్మెంట్ కంటే పొడవు, ఎత్తులో, విశాల వంతమైన సౌకర్యాలతో ఈ ప్రీమియం ఎస్యూవీ అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. ఈ మోడల్లో సెగ్మెంట్లోనే మొదటిసారి ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్లు (ముందు, వెనుక, మధ్య), 10 ఆఫ్–రోడ్ మోడ్లు అందుబాటులో ఉంచారు. ఈఎస్యూవీ ప్రీ బుకింగ్ అవకాశం కల్పిస్తూ శనివారం స్థానికంగా వివరాలను ఎంజీ ఇండియా ప్రకటించింది. తాబేళ్ల అక్రమ రవాణా అన్నానగర్ : భ్యాంకాక్ నుంచి విమానంలో చైన్నెకి అక్రమంగా తీసుకొచ్చిన తాబేళ్లు, ఇగువానాలు, ఊసరవెల్లిలు, పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి చైన్నెలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం ఓ విమానం చేరుకుంది. విమానంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో చైన్నెకి చెందిన యువకుడి ట్రాలీ బ్యాగ్లో తనిఖీ చేయగా అందులో 9 ఆఫ్రికన్ తాబేళ్లు, 4 ఇగువానాలు, 1 తూర్పు నీటి డ్రాగన్, 12 బాల్ పైథాన్లు, 1 అల్బినో కార్న్ స్నేక్, 3 ఊసరవెల్లిలు, 1 తెల్లటి కింగ్స్నేక్ ఉన్నట్టు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. టీచర్ బైక్ చోరీ తిరువొత్తియూరు: కూరగాయలు కొనడానికి వెళ్తే తన మోటార్ సైకిల్ కొట్టేశారంటూ ఓ టీచర్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా సాతాన్కుళం ప్రాంతానికి చెందిన కై ్లటన్ ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం సాతానుకుళం వారపు సంతలో కూరగాయలు కొనడానికి తన బైక్లో వెళ్లారు. అక్కడ ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్ ఉంచి సంతకెళ్లి వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. కంగారుపడి గాలించినా ఫలితం శూన్యం. బైక్ పార్కింగ్ చేసిన చోట ఉన్న ఒక సీసీ టీవీ కెమెరాను పరిశీలిస్తే ..ఓ యువకుడు కాసేపు బైక్పై కూర్చుని అటూ ఇటూ తిప్పుతూ దానిని అక్కడ నుంచి తోసుకువెళ్లినట్టు ఉండడంతో చోరీకి గురైనట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ ఘటన కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
చిన్నతనం నుంచే నాకు గుర్తింపు లేదు: సింగర్
గాయని కెనిషా పేరు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఈమె మల్టీ టాలెంటెడ్ బ్యూటీ. గాయని, గీత రచయిత, డాన్సర్, నటి ఇలా పలు టాలెంట్స్ కలిగిన బెంగళూరు భామ కెనిషా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటుడు రవిమోహన్ స్నేహితురాలిగా వార్తల్లో నానుతున్న గాయని ఈమె. అంతే కాదు నటుడు రవిమోహన్కు ఆయన భార్యకు మధ్య మనస్పర్థలకు, వారు విడిపోవడానికి కారణం ఈమె అనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటికి బలం చేకూర్చే విధంగా రవిమోహన్, కెనిషా జంటగా తిరున్నారు.రవి మోహన్పై పొగడ్తలుఇలాంటి పరిస్థితుల్లో నటి కెనిషా సందర్భం వచ్చినప్పుడల్లా రవిమోహన్పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇటీవల శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రవిమోహన్ హీరో అయినా విలన్ అయినా ఆయన వల్లే ఈ చిత్రం ఆడుతోంది. ఎవర్ గ్రీన్ రవిమోహన్ ముందు తన కళ్లకు ఎవరు కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవితో బర్త్డే సెలబ్రేషన్స్రవిమోహన్కు నీడలా ఉంటున్న కెనిషా గత 7వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోగా రవిమోహన్ హాజరై పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇటీవల ఈ గాయని తన ఎక్స్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో తనకు చిన్న వయసులోనుంచే గుర్తింపు లేదంది. ప్రపంచమే మారిపోయిందితాను ఇతరుల నుంచి చిన్న గుర్తింపు, ప్రేమనే ఆశించానని తెలిపింది. అలాంటిది రవిమోహన్ వచ్చిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, తన ఆలోచనలు, భావాలు, ప్రేమ తదితర విషయాలు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయంది. ఎవరేమనుకున్నా తాను బాధ పడనని, తాము నిజంగా చాలా ప్రశాంతంగా ఉన్నామంది. ఈ విషయం తమను అర్థం చేసుకున్న వారికి తెలుసని, కష్టాల్లో అండగా నిలబడినవారికి, రవిమోహన్కు ధన్యవాదాలని కెనిషా పేర్కొంది. -
8 వేల రోబో శస్త్ర చికిత్సలతో అపోలో అరుదైన రికార్డు
కొరుక్కుపేట : చైన్నె నగరంలోని అపోలో హాస్పిటల్స్ 8 వేలకు పైగా రోబో సహాయక శస్త్రచికిత్సలు నిర్వహించి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి తెలిపారు. ఈ శస్త్రచికిత్సలు రోగులకు 50 శాతం రక్తస్రావాన్ని తగ్గిస్తుందని, అంతే కా కుండా 1, 2 రోజులు మాత్రమే ఆసుపత్రిలో గడిపి త్వరగా డిశ్చార్జ్ అవుతారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా రోబోటిక్ సహాయ క శస్త్రచికిత్సలు చేసిన ఏకై క ఆసుపత్రిగా అపోలో హాస్పిటల్స్ పేరుగడించిందని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ స్ట్రాటజీ డైరెక్టర్ సింధూరీ రెడ్డి మాట్లాడుతూ రోగి రోగ లక్షణాలను బట్టి ఆయా రోగాల కు అనువైన రోబోటిక్ పరికరాలను ఉపయోగించి వైద్యనిపుణులు శస్త్రచికిత్సలందిచారని అన్నారు. రోబోటిక్ సర్జరీల ద్వారా యూరాలజీ, గైనకాలజీ, లేప్రోస్కోపిక్, ఆర్థోపెడిక్స్, ఆంకాలజీ సంబంధిత శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి వైద్యు లు పాల్గొని రోబో శస్త్రచికిత్సల గురించి వివరించారు. -
కదం తొక్కిన.. కార్మిక లోకం
సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు రాష్ట్రంలో హోరెత్తాయి. కార్మిక సంఘాల నేతృత్వంలో రైల్ రోకోలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. చైన్నెలో పలుచోట్ల ఆందోళనలు జరగగా సుమారు ఎనిమిది వేల మంది కార్మికులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో పాటుగా అనుబంధ కార్మిక విభాగాలు కేంద్ర కార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా, వివిధ డిమాండ్లను ఎత్తి చూపుతు ఒక రోజు సార్వత్రిక సమ్మెకు గురువారం పిలుపు నిచ్చాయి. దీనికి డీఎంకే కూటమి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే, ఉద్యోగులు నిరసనలలో భాగస్వామ్యం అయ్యే విధంగా విధులు బహిష్కరిస్తే, చర్యలు తప్పదని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్రం తీరును ఎండగడుతూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడును అభివృద్ధిని విస్మరించిందన్న ఆగ్రహంతో, విద్యా నిధులు, నీటి సరఫరా పథకాలు, రైల్వే అభివృద్ధికి ఏదీ నిధులు అని ప్రశ్నిస్తూ కార్మిక చట్ట సవరణ బిల్లులు కార్మిక హక్కులను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉదయాన్నే నిరసనలు హోరెత్తాయి. కార్మికులు, రైతులు, ఆయా పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు నిరసనలో భాగస్వామ్యమయ్యాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, డియూసీసీ, తదితర సంఘాలు, రైతు సంఘాలు, సమాఖ్యాల నేతృత్వంలో మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, తదితర నగరాలలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసుల వద్ద నిరసనలు హోరెత్తించారు. డెల్లా జిల్లాలలో రైతు సంఘాలు కదం తొక్కడంతో పలు చోట్ల రైల్రోకోలు జరగ్గా నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పలు రైళ్లను నిరసన కారులు అడ్డుకోవడంతో వాటి సేవలకు ఆటంకం తప్పలేదు. ఇక చైన్నెలోని తిరువొతి్ూత్యర్, అంబత్తూర్, అన్నా సాలై హెడ్ పోస్టాఫీస్, గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పల్లావరం తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిరసనలో పాల్గొన్న పలువురిని అదుపులోకి తీసుకుని సమీపంలోని కల్యాణ మండపాలకు తరలించారు. ధర్నాల కారణంగా చైన్నె పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్, పోస్టల్, ఆదాయపు పన్ను కార్యాలయాల పనితీరు కొంత మేర ప్రభావితమైంది. రోడ్డు దిగ్బంధనలు, రైలు మార్గ నిరసనల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. విమ్కో నగర్ వద్ద ఎలక్ట్రిక్ రైలును నిరసన కారులు అడ్డుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతృత్వంలో సాయంత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలు, బడ్జెట్లో నిధుల కేటాయింపులో వివక్షను ఖండిస్తూ నిరసనలు అనేక చోట్ల జరిగాయి. కాగా రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె నిరసనలకే పరిమితమయ్యాయి. అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ లేదు. నిరసనలు జరిగిన ప్రాంతాలలో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. -
ఎన్నికల బహిష్కరణకూ సిద్ధం
సాక్షి, చైన్నె : పుదుచ్చేరికి రాష్ట్రహోదా లక్ష్యంగా ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు రెడీ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి ప్రకటించారు. అవసరం అయితే, ఎన్నికలను బహిష్కరించేందుకూ వెనుకాడబోమని వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న నినాదం గత కొన్నేళ్లుగా మిన్నంటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మార్గాలు గత పాలకులు, తాజాగా అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం సైతం అసెంబ్లీలో రాష్ట్ర హోదా కోసం పఏటా తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపిస్తూ వస్తున్నది. అయితే, కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాడలు ఉన్నాయి. ఇందులో పుదుచ్చేరిలో 22 ఉండగా, కారైక్కాల్, మాగే, యానంలలో మిగిలినవి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పాలక ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోతుంది. దృ ష్ట్యా, ప్రస్తుతానికి మధ్యంతర బడ్జెట్ను మాత్రమే సమర్పించవచ్చు. గురువారం అసెంబ్లీలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి రంగస్వామి మధ్యంతర బడ్జెట్ను దాఖలు చేశారు.ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రంగ స్వామి పర్యవేక్షిస్తున్న దృష్ట్యా, ఆయనే సమగ్ర వివరాలను అసెంబ్లీకి వివరించారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మూడు నెలలకు గాను బడ్జెట్లోరూ. 5,396 కోట్ల వ్యయం కేటాయించారు. ముందుగా ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ , మాజీ ఎమ్మెల్యే సుబ్బ రాయన్, జస్టిస్ డేవిడ్ ఆరుస్వామి మృతికి సంతాపం తెలియజేశారు. రాష్ట్ర హోదాపై రచ్చ ఈ సందర్భంగా పుదుచ్చేరికి ఏదీ రాష్ట్ర హోదా అంటూ ప్రతి పక్షం, స్వతంత్ర సభ్యులు నినాదాలు అందుకన్నారు. ప్రతిపక్ష నాయకుడు శివ, ‘మనం ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర హోదా కోసం పోరాడకూడదని తమరు అన్నారే, మరీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర హోదా గురించి తమరు మర్చిపోయారా?‘ అని నిలదీశారు. దీనికి ముఖ్యమంత్రి రంగస్వామి స్పందిస్తూ, ‘ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర హోదా కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయా?‘ అని సవాల్ చేశారు. దీంతో సభలో వాగ్వివాదాలు హోరెత్తాయి. రంగస్వామిని నిలదీస్తూ ప్రతి పక్షాలు వ్యాఖ్యల తూటాలను పేల్చాయి. రాష్ట్ర హోదా కోసం ఎన్నికలు బహిష్కరించేందుకు సిద్ధమా..? అని నిలదీయగా, సిద్ధం అంటూ ఆయన సమాధానం ఇవ్వగం గమానార్హం. అధికార, ప్రతి పక్ష సభ్యులు వ్యాఖ్యల తూటాల మధ్య సభలో మధ్యంత బడ్జెట్ను దాఖలు చేశారు. -
నగల రికవరీ పేరిట ఆంధ్ర పోలీసుల హల్చల్
తిరువళ్లూరు: నగల రికవరీ పేరిట నిందితుడితో తిరువళ్లూరుకు వచ్చిన చిత్తూరు జిల్లా నగరి పోలీసులు స్థానికంగా హల్చల్ సృష్టించడంతో పాటూ వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధి సెల్ఫోన్ను లాక్కుని వీడియోలను డిలీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని సీవీ నాయుడు రోడ్డులో ఆరాధ్య గోల్డ్ పేరిట సంస్థను గత పది సంవత్సరాల నుంచి స్థానికులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర రిజిస్ట్రేషన్తో కూడిన రెండు వాహనాలు, తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఒక వాహనంలో వచ్చిన డీఎస్పీ అజీజ్, నగరి ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావుతో సహా సుమారు 10 మందికి పైగా పోలీసులు ఆరాధ్య గోల్డ్ సంస్థ వద్దకు చేరుకున్నారు. అనంతరం కారులో వున్న యువకుడిని దించి మొదటి అంతస్తులోని ఆ దుకాణానికి తీసుకెళ్లి సుమారు గంట పాటూ విచారణ చేపట్టారు. దుకాణంలోని సిబ్బంది వద్ద సైతం విచారణ చేశారు. అనంతరం కొందరు పోలీసులను అక్కడే వదిలిపెట్టి, మూడు వాహనాలో డీఎస్పీ అజీజ్, సీఐ మల్లిఖార్జునరావు పూందమల్లి వైపు వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదం విచారణ అనంతరం కిందకు దిగిన సీఐ మల్లిఖర్జునరావు వద్ద తమిళ మీడియా వివరణ కోరేందుకు యత్నించింది. అయితే ఆ సమయంలో వీడియోలు తీయెద్దు అంటూ సీఐ మల్లికార్జున్ హెచ్చరించారు. ఓ మీడియా ప్రతినిధి ఫోన్ను లాక్కుకుని బలవంతంగా వీడియోలను తొలగించారు. అయితే సీఐ చర్యలను మిగిలిన మీడియా ప్రతినిధులు ప్రతిఘటించారు. తమ ఫోన్ను లాక్కుకునే హక్కు మీకు లేదని వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ మాట్లాడుతూ నగల రికవరీ కోసం వచ్చాం. ఇక్కడ పనులు ఇంకా పూర్తి కాలేదు. అయినా ఏం చెప్పమంటారు అంటూ వెళ్లిపోయారు. వివాదంగా మారిన వ్యవహారం మీడియా ప్రతినిధుల సెల్ఫోన్ లాక్కోవడం, ఆంధ్ర పోలీసుల దురుసు ప్రవర్తనపై తిరువళ్లూరు ఇన్స్పెక్టర్ దామోదరన్కు సమాచారం అందింది. ఘటన స్థలానికి వచ్చిన ఇన్స్పెక్టర్ దామోదరన్ ఆంధ్ర పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు దురుసుగా ప్రవర్తించడం వల్ల సమస్యలు ఎదురైతే నేనే సమాధానం చెప్పాలి. నా సర్కిల్లోకి వస్తే కనీసం సమాచారం ఇవ్వరా’ అంటూ ఆంధ్రా పోలీసులను నిలదీశారు. విచారణ పద్ధతిగా చేస్తే తాము సైతం సహకరిస్తామన్నారు. -
సత్వచ్చారిలో మేస్త్రి దారుణ హత్య
– హిజ్రాతో పాటూ ఐదుగురు అరెస్ట్ వేలూరు: వేలూరు సత్వచ్చారిలోని వావుసీ నగర్కు చెందిన రాము(45) భవన నిర్మాణ మేస్త్రిగా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాము రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా రాముకు అదే ప్రాంతానికి చెందిన వారితో గురువారం రాత్రి ఘర్షణ జరిగినట్లు దీంతో వారు హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు హిజ్రాతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. -
విచారణైకు దశాబ్దం
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో రూపొంది విడుదలైన కొన్ని చిత్రాలు సాధారణంగా కాకుండా ఒక కాలానికి చెందిన గొంతుకగా, సమాజానికి సాక్ష్యాలుగా మారుతాయి. అలాంటి వాటిలో 2016లో విడుదలైన విచారణై చిత్రం ఒకటి. ఆ చిత్రం విడుదలై దశాబ్ద కాలం అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలోని బాలు మహేంద్రన్ స్టూడియోలో సమావేశమైంది. తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిత్ర దర్శకుడు వెట్రిమారన్, రచయిత చంద్రకుమార్, నటుడు దినేష్, దర్శక నటుడు సముద్రఖని, శరవణ సుబ్బయ్య, మూనార్ రమేష్, దిలీప్ సుబ్బరాయన్, దర్శకుడు తమిళ్, ఛాయాగ్రాహకుడు రామలింగం తదితర విచారణై చిత్ర యూనిట్ పాల్గొన్నారు. నటుడు ధనుష్కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్, దర్శకుడు వెట్రిమారన్కు చెందిన గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం రచయిత చంద్రకుమార్ రాసిన లాకప్ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది అన్నది గమనార్హం. పోలీస్ విచారణ పేరుతో జరిగే మానవహక్కులను మీరడం, పోలీసుల క్రూరత్వ చర్యలు, సాధారణ ప్రజల వేదనలు తదితర అంశాలతో సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చి రూపొందించిన చిత్రం విచారణై. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడి తమిళ సినిమా గౌరవాన్ని పెంచింది. ఇలాంటి సాహసంతో కూడిన సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. -
రంగంలోకి బీజేపీ ఎన్నికలనిర్వహణ కమిటీ
సాక్షి, చైన్నె: బీజేపీలో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు నిర్వహణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ జాబితాను ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ కమిటీలను ఇప్పటికే బీజేపీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు నాయకులు, స్వచ్ఛంద సేవకులు పూర్తిగా క్షేత్రస్థాయి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర కోశాధికారి ఎస్ఆర్ శేఖర్, ఉపాధ్యక్షుడు ఆర్ఎన్ జయప్రకాష్, వెంకటేశన్, రాష్ట్ర స్థాయి నేతలు మాలా సెల్వకుమార్, ఎస్ఆర్ రామ ప్రియన్ ఉన్నారు. 21న కొచ్చిలో ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక సాక్షి, చైన్నె: దక్షిణ భారత సినిమా రంగంలోని అత్యుత్తమ ప్రతిభకు సత్కారంగా 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల ఉత్సవం ఈసారి కేరళ రాష్ట్రం కొచ్చిలో జరగనుంది. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను తొలిసారిగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21 కొచ్చిలోని అడ్లక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహోత్సవం జరగనుంది. కేరళ ప్రభుత్వ ప్రజాపనులు – పర్యాటక శాఖ మంత్రి పి.ఎ. మహ్మద్ రియాస్, డబ్ల్యూడబ్ల్యూఎం అండ్ టైమ్స్ స్ట్రాటజిక్ సొల్యూషన్ డైరెక్టర్ రోహిత్ గోపకుమార్, ఫిల్మ్ ఫేర్ ఎడిటర్ జితేష్ పిళ్లైలో గురువారం ఈ వివరాలను స్థానికంగా ప్రకటించారు. దక్షిణ భారత సినిమా అత్యుత్తమ ప్రతిభను గౌరవించే ఈ వేడుకను కేరళలో నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని ఫిల్మ్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఇది కీలక అడుగు అవుతుందని చెప్పారు. దక్షిణ భారత సినిమా వైభవం, వైవిధ్యం, సృజనాత్మకతను మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనున్న ఈ అవార్డు వేడుకపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొందన్నారు. ఈ అవార్డుల ఉత్సవానికి తమిళం,తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలు నామినేషన్లలో ఉన్నాయని, అలాగే, ఉత్తమ నటీ నటులు, దర్శకులు, తదితర అన్ని రకాల అవార్డుల నామినేషన్లు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. భారీగా కాకుల మరణాలు తిరువొత్తియూరు: చైన్నె ,తిరువొత్తియూరు ఎర్నావూరు ప్రాంతంలో పెద్దఎత్తున కాకులు చనిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కాకులు అకస్మాత్తుగా చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా కాకులు చనిపోతున్నాయని ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో చనిపోయిన కాకులను లోతైన గుంతలు తవ్వి పూడ్చిపెట్టాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో చైన్నె ఎర్నావూరు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కాకులు అంతుపట్టని రీతిలో మృతి చెంది పడి ఉన్నాయి. ఇది చూసిన ప్రజలు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని భయపడి చైన్నె కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చైన్నె కార్పొరేషన్ వైద్య అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన కాకులను గుంత తవ్వి పాతి పెట్టారు. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. రాజకీయాల నుంచి తప్పించేందుకు కుట్ర సాక్షి, చైన్నె: తనను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆవేదన వ్యక్తం చేశారు. రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ద్వారా పార్టీని తన గుప్పెట్లోకి అన్బుమణి తీసుకుని, బీజేపీ, అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేశారు. అదే సమయంలో రాందాసు వెన్నంటి ఉన్న వారిని టార్గెట్ చేస్తూ అన్బుమణి విరుచుకు పడుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం దిండివనంలో రాందాసు మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగంతో వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి తరపున తనకు వ్యతిరేకంగా అబద్ధాలు, వక్రీకరణతో కూడిన వ్యాఖ్యలు పెరిగాయని వివరించారు. రోజుకో అబద్ధాలను వళ్లిస్తున్నారని, రాజకీయంగా తనను దిగజార్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలు చూస్తుంటే, తనను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగేలా చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అపవాదులను మూట కట్టడం తీవ్ర బాధ కలిగిస్తోందని, తనను ఎగతాళి చేయడం, మరింత వేదనకు గురిచేస్తున్నట్టు ఉద్వేగానికి లోనయ్యారు. తనను మాత్రమే కాకుండా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ అధ్యక్షుడు జీకేమణిని సైతం నీచంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ, చిహ్నం విషయంగా తాను హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎన్నికల కమిషన్ సరైన మార్గంలో వెళ్లడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు ధ్వజమెత్తారు. -
గరుడునిపై పద్మావతమ్మ విహారం
– శాస్త్రోక్తంగా పద్మావతి అమ్మవారికి పూజలు కొరుక్కుపేట: చైన్నె, టి.నగర్ జీఎన్ చెట్టిరోడ్డులో కొలువుదీరిన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు–2026 అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఉదయం శ్రీపద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రధానార్చకులు, వైష్ణవ పండితుల మంత్రోచ్ఛారణతో మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు నగరం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. ఇదే విధంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అమ్మవారు గరుడ వాహనంపై వేంచేపు చేసి ఆలయ ప్రధాన వీధుల్లో ఊరేగారు. ఊరేగింపు పొడవునా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణలతో మార్మోగింది. కాయకర్పూర హారతులు పట్టి అమ్మవారి సేవలో తరించారు. ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధనుంజయ్, సూపరింటెండెంట్ పుష్పలత, టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ సభ్యులు ఏర్పాట్లు కల్పించారు. ఈ రెండు వాహనోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
ప్రాణం తీసిన అనుమానం
అన్నానగర్: చైన్నె సమీపంలో అనుమానంతో తలెత్తిన వివాదంతో వివాహం అయిన రెండేళ్లకే మహిళా పోలీసు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. చైన్నెలోని ఎగ్మోర్ పోలీసు క్వార్టర్స్లో నివశిస్తున్న భువనేశ్వరి(29) 2016లో తమిళనాడు పోలీసుగా చేరి ఆవడి బెటాలియన్లో పనిచేస్తోంది. ప్రస్తుతం ఈమె ఎగ్మోర్లోని క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తుంది. ఈమె రెండు కుటుంబాల అంగీకారంతో 2024లో సిలంబరసన్ను వివాహం చేసుకుంది. భువనేశ్వరి తరచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో భర్త సిలంబరసన్ అనుమానం పెంచుకున్నాడు. అదే సమయంలో భువనేశ్వరికి తిరువణ్ణామలైకి చెందిన స్నేహితుడు, న్యాయవాది అయిన శివమూర్తితో స్నేహం ఉండేది. ఈ స్నేహం కారణంగా భువనేశ్వరి వివాహానికి ముందు అతనికి లక్ష రూపాయలకు పైగా నగదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం సిలంబరసన్కు తెలిసింది. దీంతో అతను ఆమెతో తరచూ గొడవ పడుతూ వచ్చాడు. ఈ స్థితిలో బుధవారం రాత్రి ఇంట్లో వంట చేస్తున్న భువనేశ్వరిని సిలంబరసన్ తాగిన మత్తులో శివమూర్తితో అనుసంధానించి అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన భువనేశ్వరి, సిలంబరసన్ తాగిన మత్తులో నిద్రపోతున్న సమయంలో విద్యుత్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపట్లో మద్యం మత్తులో లేచిన సిలంబరసన్ తన భార్య ఉరి వేసుకుని ఉండడం చూసి సహాయం కోసం కేకలు వేశాడు. సమీపంలోని వ్యక్తులు ఆమెను చూడడానికి వచ్చినప్పుడు, ఆమె చనిపోయి కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎగ్మోర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దీని తరువాత ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసి భర్త సిలంబరసన్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ జంటకు వివాహం జరిగి 2 సంవత్సరాలు మాత్రమే కావడంతో ఆర్డీఓ దర్యాప్తునకు ఆదేశించారు. -
మహాబలిపురం వేదికగా ఐపీఎంఏ గ్లోబల్ ప్రాజెక్టు
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని మహాబలిపురంలో ఐపీఎంఏ గ్లోబల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందులో భాగంగా శుక్ర, శనివారం ప్రొఫెషన్ ఫోరం ప్రపంచ పరివర్తనకు ప్రాజెక్టు నిర్వహణ గురించి చర్చించనున్నారు. సమర్థవంతమైన ప్రాజెక్ట్ నిర్వహణ రంగంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఐపీఎంఏ ఇండియా ఎడిషన్ గురించి గురువారం పీఎంఏ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ఏ శివథాను పిళ్లై, ఐపీఎంఏ అధ్యక్షుడు మ్లాడిన్ ఉకుమనొవిస్, మాజీ అధ్యక్షుడు రిహార్డ్ వార్నర్, ఉపాధ్యక్షుడు వ్లాడ్మిర్ ఒబ్రొడొవిస్లు చైన్నెలో ప్రకటించారు. ప్రాజెక్ట్ వృత్తి భవిష్యత్తు దిశ, సాంకేతికత ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రాజెక్ట్ నిర్వహణ పాత్ర వంటి అంశాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారని తెలిపారు. పరిశ్రమ నాయకులు, గ్లోబల్ ప్రాజెక్ట్ మేనేజర్లు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు ఈ వేదికపై ఒకచోట చేర్చనున్నామని వివరించారు. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్ అమలు, పాలన విధానాలను ఎలా ప్రభావితం చేస్తోందనే అంశంపై ప్రత్యేకంగా చర్చలు జరుగనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ హాజరు కానున్నట్టు ప్రకటించారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా వెట్రి
తమిళసినిమా: 8 తోట్టాక్కల్ చిత్రం ఫేమ్ వెట్రి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం పరేడ్. హైదరాబాద్కు చెందిన అక్షిత, చాందిని తమిళరసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు బాలాజీ శక్తివేల్, సింగం పులి, శరవణ సుబ్బయ్య, రబ్బర్ బంతు జాన్సన్ దివాకర్, కోడంగి వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ హౌస్ జైన్ క్రియేషన్స్ సంస్థలతో కలిసి మహేందర్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెబ్ చిత్రం ఫేమ్ హారూన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నటుడు వెట్రి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు చెప్పారు. ఆయన తన వృత్తిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు, ఆయన కుటుంబం ఎలాంటి బాధింపులకు గురైంది, అందులోంచి ఎలా బయట పడగలిగారు తదితర ఆసక్తికరమైన అంశాలతో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రంగా పరేడ్ చిత్రం ఉంటుందని తెలిపారు. జాన్ రాబిన్స్ సంగీతాన్ని, కేవీ.కిరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రంలోని పోలీసులకు సంబంధించిన ఒక పాటను దర్శకుడు అరుణ్ రాజా కామరాజ్ పాడడం విశేషమన్నారు. కెప్టెన్ ఎంపీ ఆనంద్, కేఎస్కే సెల్వకుమార్ నిర్మాణ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను చైన్నె, కోవై, కోడైకెనాల్ ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. -
రూ. 11.5 కోట్లతో వాణిజ్య సముదాయం
కొరుక్కుపేట: గత సంవత్సరం ఎన్నూర్ కత్తివాక్కం బజార్ వీధిలోని మార్కెట్ను కూల్చివేసి, రూ. 115 కోట్లతో కొత్త చేపల మార్కెట్ ప్రాజెక్టును నిర్మించారు. ఎకరంలో మొదటి అంతస్తు విస్తరించి, 77 దుకాణాలు, కమ్యూనిటీ హాల్, ఆధునిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలతో ఇది చివరి దశకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో మంత్రి పి.కే శేఖర్ బాబు గురువారం అక్కడ నిర్మిస్తున్న కొత్త చేపల మార్కెట్, షాపింగ్ మాల్, కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ నిర్మాణాలను పరిశీలించారు. ఆ సమయంలో, పనుల స్థితిని అధికారులను అడిగి తెలుసుకుని, వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అదేవిధంగా, మహాలక్ష్మి నగర్లోని మునిసిపల్ మిడిల్ స్కూల్, తండయార్పేట్లో జరుగుతున్న ఆధునిక బస్టాండ్ నిర్మిస్తున్న కమ్యూనిటీ సెంటర్, సంక్షేమ కేంద్రంలో నిర్మాణ పనులను పూర్తి చేసి, పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. రాబోయే కొద్ది రోజుల్లో కొత్త భవనాన్ని విద్యార్థుల ఉపయోగం కోసం అప్పగిస్తామని శేఖర్బాబు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చు చేయనున్నారు. మహాలక్ష్మి నగర్ మునిసిపల్ మిడిల్ స్కూల్ను పరిశీలిస్తున్న మంత్రి శేఖర్బాబు -
తమిళనాడుకు మోదీ హల్వా
తిరుత్తణి: తమిళనాడుకు హల్వా ఇచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ప్రజలు హల్వా ఇవ్వాలని ఎమ్మెల్యే చంద్రన్ పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపు చేయకుండా, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తున్న కేంద్ర బీజేపీతో చేతులు కలిపిన అన్నాడీఎంకే పార్టీ తీరుకు నిరసనగా డీఎంకే ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తిరుత్తణి సమీపంలోని కార్తికేయపురంలో నిర్వహించిన ధర్నాలో డీఎంకే కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని రాష్ట్రానికి హల్వా ఇచ్చిన ప్రధాని మోదీకి బీజేపీ అన్నాడీఎంకే పార్టీల కూటమికి ప్రజలు హల్వా ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. తిరుత్తణి పట్టణంలో మాజీ డీఎంకే జిల్లా కార్యదర్శి భూపతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన ధర్నాలో డీఎంకే కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మోసగించిన బీజేపీ, అన్నాడీఎంకే కూటమికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నినాదాలు చేశారు. -
క్లుప్తంగా
వేర్వేరు కారణాలతో ఆత్మహత్యలు అన్నానగర్: చైన్నెలోని కొళత్తూర్ ప్రాంతానికి చెందిన ఎత్తిరాజ్ (55) పారిమునైలోని రాజాజీ రోడ్డులోని పోస్టాఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఎత్తిరాజ్ తన సెల్పోన్, బ్యాగ్ను రాజా అన్నా ములైపురం గ్రీన్ వేస్ రోడ్డులోని ఫ్లయింగ్ రైలు స్టేషన్ ఫ్లాట్పారంపై వదిలివేసి, అకస్మాత్తుగా ఫ్లయింగ్ రైలు వంతెనపై నుండి ఆడయార్ నదిలోకి దూకాడు. ఈ విషయం తెలుసుకున్న అభిరామపురం పోలీసులు అగ్ని మాపక సిబ్బంది సహాయంతో నదిలో దూకిన ఎత్తిరాజ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎత్తిరాజ్ నదిలో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటన కోయంబత్తూరు జిల్లాలోని ఇట్టిడేపాళయం గ్రామానికి చెందిన చిన్నదురై కుమారుడు మోహన్ రాజ్(25) కూలీ. ఇతనిపై ఇప్పటికే సిరుముటై పోలీస్ స్టేషన్లో దాడి కేసు, ఈరోడ్ జిల్లాలో గంజాయి కేసు ఉన్నాయి. గంజాయి అమ్మినందుకు ఈరోడ్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. గత 3 నెలలుగా అతను పోలీస్స్టేషన్కు వెళ్లి ఒక పిటిషన్పై సంతకం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతోనే తన జీవితం కోల్పోయానని చెబుతూ వీడియో రికార్డు చేసి, ఆపై తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షనర్ల వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి వేలూరు: పెన్షనర్లకు వ్యతిరేకంగా ప్రవేశ పెడుతున్న పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అన్ని పెన్షనర్ల సంఘాల అద్వర్యంలో వేలూరులోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అద్యక్షుడు పన్నీర్సెల్వం నాయకత్వం వహించగా జిల్లా కార్యదర్శి లోకనాథన్ మాట్లాడారు. తమిళనాడు రిటైర్డ్ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు జనార్దనన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కార్మికుల సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు సెట్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన 2025 చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ పథకాలకు మహాత్మాగాంధీ పేరును తొలగించి కొత్త పేర్లు ప్రవేశ పెట్టడాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. ఈ ధర్నాలో తమిళనాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కూటమి జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, ఆల్ డిపార్ట్మెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణమూర్తి, కన్వీనర్ జ్ఞానశేఖరన్, వివిధ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిపాలు తాగుతూ చిన్నారి మృతి తిరుత్తణి: తల్లిపాలు తాగుతుండగా, అస్వస్థతకు గురై 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సునీల్ సలీమ్(29) అతని భార్య సీత(27) కనకమ్మసత్రంలో అద్దె ఇంట్లో రెండేళ్లుగా కాపురంఉంటున్నారు. ప్రైవేటు కర్మాగారంలో పని చేస్తూ సునీల్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు వితిష అనే 9 నెలల పాప ఉంది. బుధవారం సాయంత్రం బిడ్డకు సీత తల్లిపాలిస్తుండగా, చిన్నారికి అస్వస్థతకు గురైంది. వెంటనే స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి 108 ఆంబులున్స్ ద్వారా తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చిన్నారి మృతి చెందింది. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిపాలు తాగుతూ చిన్నారి అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. టీవీకే కార్యకర్తల హల్చల్ తిరువొత్తియూరు: తిరువణ్ణామలై జిల్లా వందవాసిలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ పుట్టినరోజు వేడుకల్లో భయపెట్టే విధంగా చేతిలో కత్తి పట్టుకుని హంగామా చేసిన ఆ పార్టీ కార్యదర్శితోపాటు 50 మంది నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళగ వెట్రి కళగం తిరువణ్ణామలై తూర్పు జిల్లా కార్యదర్శిగా ఉదయకుమార్ పనిచేస్తున్నారు. అతని పుట్టినరోజు వేడుకలకు టీవీకే నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వందవాసి ఐదు కాళ్ల వంతెన దగ్గర నుండి తెరిచిన వాహనంలో జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ నిలబడి వచ్చారు. అప్పుడు టీవీకే నిర్వాహకులు జిల్లా కార్యదర్శి ఉదయకుమార్కు నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేశారు. తర్వాత దారి పొడవునా టపాసులు పేల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఊరేగింపుగా వెళ్లారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. దీని తరువాత జిల్లా కార్యదర్శి ఉదయకుమార్ చేతిలో తుపాకీ లాంటి టపాసు చేతిలో పట్టుకుని కాల్చారు. దీన్ని కొనసాగిస్తూ చేతిలో కత్తి పట్టుకుని తిప్పి చూపించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా, ప్రజలకు భయం కలిగించే విధంగా నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేసి పాల్గొన్న జిల్లా కార్యదర్శి ఉదయకుమార్, కార్యదర్శులు నైనా మహమ్మద్, వసంతకవిన్, సమాచార సాంకేతిక విభాగం మణికందన్, యువజన విభాగం తిరువాసగమణి, యూనియన్ కార్యదర్శులు తిరుమలై, జయరాజ్తో పాటు 50 మంది టీవీకే నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా నిబంధనలకు విరుద్ధంగా క్రేన్ ద్వారా దండలు వేసినందున పోలీసులు క్రేనన్ను స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక సంఘాల నిరసన
సేలం: కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 29 కార్మిక చట్టాలను సవరించి, 4 ప్రత్యామ్నాయ చట్టాలను ప్రవేశపెట్టింది. దీనిని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. ఈ 4 కార్మిక చట్టాలను, సంబంధిత నిబంధనలను ఉపసంహరించుకోవడం, ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకోవడం తదితర డిమాండ్ల కోసం కార్మిక సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. అదేవిధంగా రైతులను ప్రభావితం చేస్తుందని భావిస్తున్న భారత్–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విత్తన బిల్లు ముసాయిదా, విద్యుత్ సవరణ బిల్లు, అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లును ఉపసంహరించుకోవాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. ఈ డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నాయి. దీనిలో భాగంగా ఈరోడ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, కార్మిక సంఘాలు ఈరోడ్ తాలూకా కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపాయి. అదేవిధంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రైలు సమ్మెను ప్రకటించాయి. దీని కారణంగా ఈరోడ్ రైల్వేస్టేషన్ వద్ద భారీ పోలీసు భద్రతను మోహరించారు. -
రైల్రోకోకు యత్నం
తిరువళ్లూరు: కేంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో గురువారం ఉదయం తిరువళ్లూరులో రైల్రోకోకు యత్నించిన 150 మందిని అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరిస్తూ కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరులో బంద్ ప్రభావం కనిపించలేదు. ఆటోలు, బస్సులు యథావిధిగా కొనసాగింది. ఈ క్రమంలో డీఎంకే, వీసీకే, కాంగ్రెస్ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సీఐటీయూతోపాటు సంఘాలు పెద్దకుప్పం రైల్వేస్టేషన్ వద్ద ఽ ఆందోళన నిర్వహించాయి. కార్మికులకు వ్యతిరేకంగా రూపొందించిన నాలుగు చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే విత్తనాల చట్టంను వెనక్కి తీసుకోవాలని, అణుశక్తి విభాగంలో ప్రైవేటు వ్యక్తులు సంస్థలను అనుమతించకూడదని నినాదాలు చేశారు. అనంతరం రైలురోకోకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు 150 మందిని అరెస్టు చేసి ప్రైవేటు మండపానికి తరలించారు. డీఎంకే కూటమి ధర్నా తిరువళ్లూరు: తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని పిలుపు నిచ్చిన క్రమంలో గురువారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. తిరువళ్లూరు, కాకలూరు, సెవ్వాపేట, తిరువేళాంగాడు, పూందమల్లి, పొన్నేరి, గుమ్మిడిపూండి, ఆవడి, అంబత్తూరుతోపాటు వేర్వేరు ప్రాంతాల్లో డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్తో పాటు కూటమి నేతలు మద్దతు పలికారు. డీఎంకే ఆధ్వర్యంలో తిరువళ్లూరులో నిర్వహించిన ఆందోళనల్లో స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పూందమల్లిలో ఎమ్మెల్యే కృష్ణస్వామి, గుమ్మిడిపూండిలో టీజే గోవిందరాజన్, పొన్నేరిలో జిల్లా కన్వీనర్ రమేష్రాజ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిరసించడంతోపాటు ఉపాధి హామీ పనులు, విద్య నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. మరణంలోనూ వీడని బంధం అన్నానగర్: కన్యాకుమారి జిల్లాలోని కన్నకోడ్ ప్రాంతానికి చెందిన వర్ కరుణాకరన్ (78) ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఇతని భార్య ఓమన(74) వీరికి పిల్లలు లేరు. బుధవారం సాయంత్రం వృద్ధాప్యం కారణంగా ఓమన అకస్మాత్తుగా మరణించింది. వీరు వివాహమైన్పటి నుంచి సంతోషంగా కలిసి జీవించారు. భార్య మరణాన్ని తట్టుకోలేని కురుణాకరన్ అకస్మాత్తుగా ఊపిరి ఆడక మూర్చపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్దిసేపటికే అతను కూడా మరణించాడు. -
విత్లవ్ సక్సెస్ ఆనందం
తమిళసినిమా: విజయం ఎవరికై నా నూతనోత్సాహాన్నిస్తుంది. అయితే దాని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నవారికి ఆ విజయం అందితే ఆ ఆనందమే వేరు. అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారు సౌందర్య రజినీకాంత్. ఈమె దశాబ్దం క్రితమే నిర్మాతగా మారారు. పలు చిత్రాలను నిర్మించారు. దర్శకురాలిగానూ చిత్రాలు చేశారు. తాజాగా మహేష్ రాజ్ పసిలియన్తో కలిసి నిర్మించిన చిత్రం విత్లవ్. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం దర్శకుడు అబిషన్ జీవింద్ కథానాయకుడిగా పరిచయం అయిన ఇందులో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ నాయకిగా నటించారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రానికి కో–డైరెక్టర్గా పని చేసిన మదన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం చిత్ర యూనిట్ చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌందర్య రజినీకాంత్ మాట్లాడుతూ విత్ లవ్ చిత్రం ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందడంతో అమ్మానాన్నలను కలవడానికి పోయస్ గార్డెన్కు వెళ్లానని తెలిపారు. అక్కడ తన తల్లి హారతి పళ్లెం పెట్టుకుని నిలబడ్డారన్నారు. నాన్న ఆప్యాయంగా కౌగిలించుకుని అభినందించారని, అప్పుడు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా నాన్నా అని తాను అడిగానన్నారు. ఈ చిత్రానికి తన తండ్రి రజనికాంత్ ఆశీస్సులు మొదటి నుంచి ఉన్నాయని చెప్పారు. తాను 18 ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉన్నానని, తన తొలి విజయం విత్లవ్ చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు తన కుటుంబంగా మారిందన్నారు. నిర్మాత మహేష్రాజ్ పసిలియన్ తన తమ్ముడు అని, ఈ చిత్ర దర్శకుడు మదన్తో మరో చిత్రం చేయడానికి రెడీ అని అన్నారు. అదే విధంగా ఈ చిత్ర కథానాయకుడు ఆబిషన్ జీవింద్ మాట్లాడుతూ రజినీకాంత్ సార్ను కలిసినప్పుడు హీరో అయ్యిపోయావ్ అంటూ అభినందించారన్నారు. సౌందర్య రజనీకాంత్, మహేష్ రాజ్ పసిలియన్ సంస్థలో మరిన్ని చిత్రాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
జాతీయ స్థాయి హ్యాకథాన్కు అనూహ్య స్పందన
కొరుక్కుపేట:డెవలపర్ నెట్వర్క్ స్పేస్ (డీఎన్ఎస్ ) క్లబ్తో కలిసి వడపళని క్యాంపస్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ స్థాయి హ్యాకథాన్ అయిన హ్యాక్ఎలైట్ 2026కు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమం కంప్యూటర్ సైనన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ గోల్డా దిలీప్ స్వాగత ప్రసంగంతో హ్యాకథాన్ ఆరంభించారు. వైస్–ప్రిన్సిపాల్ (అకాడెమిక్స్ – ప్లేస్మెంట్స్) డాక్టర్ సి. గోమతి ప్రత్యేక ప్రసంగం చేశారు. జెన్క్సాయ్ అండ్ జెన్వాయిస్ వ్యవస్థాపకుడు హరివికాష్ భక్తవత్సలం అతిథిగా పాల్గొన్నారు. వెర్నూర్ వ్యవస్థాపకులు స్వాతిష్ జి, అవెంట్రో టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సారా సామ్రిన్లతో కూడిన బాహ్య జడ్జింగ్ ప్యానెల్ గా వ్యవహరించి విజేతలకు ప్రకటించారు.ముగింపు వేడుకల్లో ఎస్ ఆర్ ఎం డీన్ (ఎఫ్ఈటీ) డాక్టర్ సి.వి.జయకుమార్ , స్పేస్ముష్ వ్యవస్థాపకుడు శివరామన్ ఎస్ పాల్గొని విధ్యర్డులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు.ఈశ్వరి ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానాన్ని కై వసం చేసుకుని రూ.15,000 నగదు బహుమతిని అందుకుంది. రెండవ స్థానాన్ని ఎస్ఆర్ కేటీఆర్ రూ.10,000 బహుమతి లభించింది. మూడవ స్థానాన్ని సెయింట్ జోసెఫ్ కళాశాల , ఎస్ ఆర్ ఎం జె టి ఆర్ పంచుకున్నాయి, ప్రతి సంస్థకూ రూ.5,000 నగదు బహుమతి చొప్పున అందజేశారు. విజేతలకు బహుమతులు అందిస్తున్న నిర్వాహకులు -
ఎన్నికల సన్నాహాలు ముమ్మరం
సాక్షి, చైన్నె: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికల సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. తొలి రోజున పుదుచ్చేరిలో అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్లతో కూడిన బృందం సమావేశమైంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు భన్వర్ ప్రకాష్, మనీష్ గార్గ్, పవన్కుమార్ శర్మ, సంజయ్కుమార్, ఆశిష్ గోయల్ తదితర ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం బుధవారం రాత్రి చైన్నెకు చేరుకుంది. వీరికి చైన్నె విమానాశ్రయంలో తమిళనాడు ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి గురువారం పుదుచ్చేరిలో వెళ్లిన కేంద్ర అధికారుల బృందం అక్కడి ఎన్నికల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రాలు ఏ మేరకు ఎన్నికల ఏర్పాట్లు చేసి ఉన్నాయో పరిశీలిస్తున్నామని వివరించారు. ఎన్నికలకు అన్ని పనులు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర పరిపాలన అధికారులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశాల్లో ఆదాయపు పన్ను, కస్టమ్స్, రైల్వేలు, పోలీసు, రవాణా శాఖ, అంతర్గత వ్యవహారాల విభాగం, ట్రాఫిక్ శాఖ సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. శుక్రవారం చైన్నెలో పర్యటించే కేంద్ర బృందం ఇక్కడి అధికారులతో సమావేశం కానున్నది. -
క్లుప్తంగా
స్వచ్ఛశక్తి దిశగా గ్రీన్ ఇండియా సాక్షి, చైన్నె: స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడం, స్వచ్ఛ శక్తి భవిష్యత్తుపై దృష్టి పెట్టే దిశగా పునరుత్పాదక ఇంధన సమీక్షలో నిర్ణయించారు. వాటర్ టుడే నేతృత్వంలో చైన్నెలోని వర్తక కేంద్రంలో పునరుత్పాదక ఇంధన ఎక్స్పో 2026 గురువారం ప్రారంభమైంది. ‘‘పునరుత్పాదక–మొదటి యుగానికి భారత విద్యుత్ వ్యవస్థల మార్పు’’ అనే అంశంపై ఇందులో చర్చ జరిగింది. విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులు, సాంకేతిక నిపుణులు పాల్గొని గ్రిడ్ స్థిరత్వం, శక్తి నిల్వ సాంకేతికతలు, హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థలు, ఇ–మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాలపై చర్చించారు. స్వచ్ఛ శక్తి ప్రాజెక్టులకు పెట్టుబడులు, విధాన మద్దతు మరియు అమలు వ్యూహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 14 వరకు జరిగే ఈ ఎక్స్పోలో 200కు పైగా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. 12 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం సేలం: ఈరోడ్ జిల్లాలోని శివగిరి, దాని పరిసర ప్రాంతాలలోని రైస్ మిల్లులలో అమ్మకానికి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల నేర దర్యాప్తు విభాగం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో వారు శివగిరి ప్రాంతంలో ముమ్మర గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో, శివగిరిలోని రంగసముద్రం ప్రాంతంలోని రామలింగానికి చెందిన తోటలో రేషన్ బియ్యాన్ని కట్టలుగా నిల్వ ఉంచారని, రామలింగం తన మోర్టన్ రైస్ మిల్లు సమీపంలోని పికప్ ట్రక్కులో రేషన్ బియ్యాన్ని కూడా నిల్వ చేసినట్లు వెల్లడైంది. నిదింతులైన రైస్ మిల్లు యజమాని రామలింగం, మేనేజర్ కడవేలు, థాంప్సన్ను అరెస్టు చేశారు. వారి నుండి 12,000 కిలోల రేషన్ బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గూడ్స్ రైలులో మంటలు తిరువళ్లూరు: మీంజూరు సమీపంలోని అత్తిపట్టు పుదునగర్ ప్రాంతం నుండి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రేణిగుంట వైపు బయలుదేరింది. మొత్తం 64 బోగీలతో గూడ్స్ రైలు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కడంబత్తూరు సమీపంలోని ఏకాటూరు రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగా, గూడ్స్ రైలులోని బొగ్గు ఉన్న 2 బోగీల నుండి ఆకస్మికంగా పొగలు వచ్చాయి. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన రైలులో వున్న సిబ్బంది వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. గూడ్స్ రైలు డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా కడంబత్తూరు రైల్వే స్టేషన్లో ఆపారు. సమాచారం అందుకున్న పెరంబాక్కం అగ్నిమాపక సిబ్బంది స్టేషన్ అధికారి ప్రసన్న ఆధ్వర్యంలో 3 గంటల పాటూ పోరాడి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత గూడ్స్ రైలు గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మళ్లీ రేణిగుంట వైపు బయలుదేరింది. గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో కడంబత్తూరు రైల్వే స్టేషన్లో కొద్దిసేపు కలకలం రేగింది. కాగా బొగ్గు బోగీలో మంటలు ఎలా చెలరేగాయనే దానిపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. 13 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు కొరుక్కుపేట: పట్టినపాక్కం పోలీసులు 2013లో స్థానికంగా జరిగిన ఓ కారు దొంగతనం కేసులో వేలచేరి ప్రాంతానికి చెందిన సతీష్(40) అనే రౌడీ ని అరెస్టు చేశారు. తరువాత అతను బెయిల్పై వి డుదలై, ఈ కేసుకు సంబంధించి సైదాపేట కోర్టు లో హాజరుకాకుండా 13 సంవత్సరాలుగా పరారీ లో ఉన్నాడు. దీని తర్వాత, సతీష్ను అరెస్టు చేసి మళ్లీ హాజరుపరచాలని కోర్టు పట్టినపాక్కం పోలీ సులను ఆదేశించింది. దీని తర్వాత, ఇన్స్పెక్టర్ వి జయకుమారి నేతత్వంలోని పోలీసులు అప్రమత్తంగా ఉండి, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన పరారీలో ఉన్న సతీష్ను అ రెస్టు చేశారు. తరువాత, అతన్ని సైదాపేట కోర్టు లో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. టైడెల్ పార్క్లో యాక్సెస్ టెక్నాలజీ సాక్షి, చైన్నె: చైన్నెలోని టైడెల్ పార్క్లో యాక్సెస్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం వైద్య హబ్గానే కాకుండా పారిశ్రామిక హబ్గానూ అవతరించిందన్నారు. సాంకేతికత ఆధారిత శిక్షణ సాఫ్ట్వేర్ పరిష్కారాలపై నిబద్ధతతో పని చేస్తున్న యాక్సెస్ టెక్నాలజీ శాఖను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యాక్సెస్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు వెంకటేశన్ మాట్లాడుతూ యాక్సెస్ టెక్నాలజీస్ 2022 నుండి ఐటీ నియామకాలలో ఉందన్నారు . తాము ఇప్పటివరకు 1800 మందికి ఉపాధి కల్పించామన్నారు. త్వరలో 3000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. -
పెట్టుబడుల..
సాక్షి, చైన్నె : తమిళనాడును ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ చర్యలు విస్తృతం చేశారు. దేశ విదేశాలకు చెందిన సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గతంలో జరిగిన ఒప్పందాల మేరకు తమిళనాడులో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలు, యాజమాన్యాలకు పరిశ్రమల ఏర్పాటుకు గాను, అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, స్థల కేటాయింపు, సబ్సీడీలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 36,968 కోట్ల పెట్టుబడితో 60,823 మంది ఉపాధి కల్పించే విధంగా 71 పరిశ్రమల ముందుకు వచ్చాయి. ఈ పనులన్నింటికీ చైన్నెలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 31,934 కోట్లతో 82,664 మందికి ఉపాధి కల్పించే విధంగా పనులను సకాలంలో పూర్తి చేసిన 52 పరిశ్రమలలో ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తూత్తుకుడిలో కేన్స్ టెక్నాలజీస్ కంపెనీతో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, హెచ్డీఐ ఫ్లెక్కిబుల్ (పీసీబీ) ఉత్పత్తి ప్రాజెక్టు కోసం ఒకటి, తూత్తుకుడి ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చే దిశగా, ఆస్ట్రా జెనెకా గ్లోబల్ విస్తరణ కేంద్రం ఏర్పాటుకు మరొకటి చొప్పున రెండు అవగాహన ఒప్పందాలు ఈ సందర్భంగా జరిగాయి. తాజాగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ప్రాజెక్టులు రామనాథపురం, తూత్తుకుడి, తిరుచ్చి, విల్లుపురం, ధర్మపురి, రాణిపేట్, తిరుపత్తూరు, కోయంబత్తూర్, నామక్కల్, ఈరోడ్ తదితర జిల్లాలో ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ కంపెనీ రూ. 5000 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉపాధి దిశగా కాంచీపురం పారిశ్రామిక వాడలో ఔషధ తయారీ ప్రాజెక్టు, హ్యుందాయ్ మోటార్ ఇండియాతో ఒప్పందం మేరకు 7,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు టీఆర్బీ రాజ, సీఎస్ మురుగానందం, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జె. జయరంజన్, పరిశ్రమలు, పెట్టుబడి ప్రోత్సాహం విభాగ కార్యదర్శి వి. అరుణ్ రాయ్, తమిళనాడు ఇండస్ట్రీస్ గైడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దారెజ్ అహ్మద్ పాల్గొన్నారు.నెర వేరిన కల.. ఉత్తర చైన్నె పరిధిలోని కొరుక్కుపేట– మనాలి రోడ్డులో రైల్వే 2బీ క్రాసింగ్లో రూ. 75 కోట్ల వ్యయంతో కొత్తగా వంతెన నిర్మించారు. ఈ పరిసర మార్గాలను కలిపేందుకు కోసం ఈ వంతెన ఏర్పాటైంది. ఈ పరిసర వాసుల కలగా ఉన్న ఈ బ్రిడ్జిని గురువారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే న్యూ మనలి రోడ్డు, కొరుక్కు పేట, తండయార్ పేట లోరూ. 1.10 కోట్లతో నిర్మించనున్న పార్కు పనులకు సీఎం స్టాలిన్ ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నెహ్రూ, శేఖర్బాబు, మేయర్ ప్రియ, ఎంపీ కళానిధి వీరా స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యతోనే దేశాభివృద్ధి
వేలూరు: ప్రతి కుటుంబంలో ఒకరు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ ఆధ్వర్యంలో అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు స్కాలర్షిప్లను అందజేస్తున్నారు. దీంతో తిరువణ్ణామలై జిల్లాలో మొట్ట మొదటిసారిగా ఈ పథకాన్ని చాన్స్లర్ ప్రారంభించి మొత్తం 242 మంది విద్యార్థులకు రూ. 28 లక్షలు చేసే స్కాలర్షిప్లను అందజేసి ప్రసంగించారు. తన రాజకీయ జీవితానికి తిరువణ్ణామలై జిల్లా ముడి పడి ఉందన్నారు. తాను మూడవ తరగతిలో ఉన్న సమయంలో పెరియార్ వైపు చేరాన్నారు. 1967వ సంవత్సరంలో అన్నా యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆ సమయంలో సుమారు 25 మంది యువకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చిందని అందులో తాను ఒకరిని అన్నారు. ఉత్తర ఆర్కాడు జిల్లాలో 75 లక్షల మంది జనాభా ఉన్నారని బారత దేశంలో ఉన్నత విద్య నమోదు రేటు 28 శాతంగా ఉందన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో 65 నుంచి వంద శాతంగా ఉందన్నారు. తమిళనాడు 50 శాతంలో మొదటి స్థానంలో ఉందని కేరళ రెండవ స్థానంలో ఉందన్నారు. అందరికీ ఉన్నత విద్య అందజేయాలనే ఉద్దేశంతోనే అందరికీ ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు ఈ స్కాలర్షిప్లు అందజేస్తున్నామని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి మాట్లాడుతూ ఇండియాలోనే ఉన్నత విద్యలో రికార్డు సాధించిన రాష్ట్రం ఇది . అఖిల భారత సగటు కంటే 50 శాతం ఎక్కువగా తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమయంలో రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అరుణై మెడికల్ కళాశాల డైరెక్టర్ ఈవీవీ కంబన్, మాజీ మంత్రులు అగ్రి క్రిష్ణమూర్తి, సేవూరు రామచంద్రన్, అందరికీ ఉన్నత విద్యా పథకం కార్యదర్శి లక్ష్మణన్, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుందర్రాజ్, ట్రస్టీ కుమరేషన్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజం కోసం పెళ్లి చేసుకోను..!
తమిళసినిమా: కోలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో నటుడు శింబు ఒకరు. బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు సంచలన నటుడిగా ముద్ర వేసుకున్నారు. సీనియర్ నటుడు టీ.రాజేందర్ వారసుడు అయిన శింబు ప్రేమాయణం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. మొదట నటి నయనతారతో ప్రేమ వ్యవహారం, ఆ తరువాత నటి హన్సికతో ప్రేమ పెళ్లి గడియల వరకు వెళ్లి ఆగిపోయిందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రస్తుతం ఈయన వయసు 43 ఏళ్లు. ఇప్పటికీ అవివాహితుడిగానే ఉన్న శింబు పెళ్లి గురించి ప్రచారం కొనసాగుతూనే ఉంది. మరో విషయం ఏమిటంటే శింబు తమ్ముడు, చెల్లెలు పెళ్లిళ్లు జరిగి చాలా కాలమే అయ్యింది. కాగా ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ చిత్రంలో నటిస్తున్న శింబు ఇటీవల పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో. ‘‘ మొబైల్ ఫోన్లు అమల్లోకి వచ్చిన తర్వాత మనుషుల భావాలు మారిపోయాయి..ఎంత వేగంగా ప్రేమించుకుంటున్నారో , అంతే వేగంగా విడిపోతున్నారు. అయితే అందమైన ప్రేమానుబంధాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నాకు సంబంధించినంత వరకు పెళ్లి అనేది అంత అవసరమైంది కాదు. మానసికంగా సిద్ధమైనప్పుడే పెళ్లి అనేది చేసుకోవాలి. అంతేగానీ ఈ సమాజాన్ని సంతృప్తి పరచడడం కోసం మాత్రం నేను పెళ్లి చేసుకోను ‘‘అని పేర్కొన్న ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఏదీ మన చేతల్లో ఉండదు !
తమిళసినిమా: అంతిల్ సినిమా, పలంపూర్ టాకీస్ సంస్థలు కలసి నిర్మించిన చిత్రం ఓ బటర్ ఫ్లై. ఈచిత్రం ద్వారా విజయ్ రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకుముందు కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి, ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ రూపొందించి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నివేదిత సతీష్, సిబి చంద్రన్, అతుల్, నాజర్, లక్ష్మీప్రియ, చంద్రమౌళి, గీత కై లాసం ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న ఓ బటర్ ఫ్లై చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది భార్య భర్తల మధ్య ప్రేమ, చిన్న చిన్న మనస్పర్థలు వంటి అంశాలతో కూడిన సస్పెన్న్స్, థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన చిత్రమని చెప్పారు. ఆసక్తికరమైన అంశాలు, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ను 40 రోజుల్లో పూర్తి చేశామని, ఎక్కువ భాగం కొడైకెనాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్రంలో సీతాకోకచిలుక ఒక భాగం అవుతుందని చెప్పారు. చివరిగా ఏది మన చేతుల్లో ఉండదనే చిన్న సందేశంతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రానికి బలమైన సాంకేతిక వర్గం పనిచేసినట్లు చెప్పారు. వైసాక్ సోమనాథ్ సంగీతాన్ని అందించారని చెప్పారు. -
వైద్య సంరక్షణ సేవలు మరింత విస్తృతం
సాక్షి, చైన్నె: సమగ్ర వైద్య సంరక్షణ సేవల విస్తృతంలో ప్రైవేటు భాగస్వామ్యం అవశ్యమని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఊబకాయం (ఒబేసిటీ), మధుమేహం (డయాబెటిస్) వంటి జీవనశైలి వ్యాధుల నివారణ, చికిత్స కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘రెవివో క్లినిక్ – ఇంటిగ్రేటెడ్ కేర్ ఫర్ ఒబేసిటీ అండ్ డయాబెటిస్’ చైన్నెలో ప్రారంభమైంది. దీనిని బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రారంభించారు. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వ వైద్య పథకాలు, సేవల విస్తృతం గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో రెవివో క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ అరుణ్ రాఘవన్, ది క్వాడ్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ అశోక్ లు మాట్లాడుతూ, ఊబకాయం, మధుమేహం వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ను స్థాపించినట్లు తెలిపారు. క్లినికల్ నైపుణ్యాన్ని నిర్మాణాత్మక జీవనశైలి మార్పులతో అనుసంధానించడం ఈ కేంద్రం ప్రత్యేకతగా పేర్కొన్నారు. పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్య మద్దతు, ప్రవర్తనా మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి రోగికి వ్యక్తిగత చికిత్సా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ‘‘జీవనశైలి మార్పులు లేకుండా మందులు సరైన ఫలితాలు ఇవ్వవు అని, అలాగే వైద్య పర్యవేక్షణ లేకుండా జీవనశైలి మార్పులు నిలబడవు అని వివరించారు. -
సైలప్పన్ సైకిల్ మార్ట్ నుంచి ఫస్ట్లుక్
తమిళసినిమా: లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ఇసక్కి కార్వన్నన్ నిర్మిస్తున్న చిత్రం సైలప్పన్ సైకిల్ మార్ట్. రచయిత, దర్శకుడు వెట్రిమారన్ శిష్యుడు సుఖాగా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఇసక్కి కార్వన్నన్, ఎంఎస్.భాస్కర్, ఇళవరసు, మూనార్ రమేష్, దర్శకుడు సుబ్రహ్మణియ శివ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటూ పూజా మోహన్ రాజ్, సుధా నంది, సూర్జిత్ గోపీనాథ్, విద్యా విజయకుమార్, యశ్వంత్, సంతాన లక్ష్మి, మీనాక్షి అయ్యర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి మార్టిన్ డాన్ రాజ్ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక సాధారణ ప్రజల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే కథా చిత్రంగా సైలప్పన్ సైకిల్ మార్ట్ ఉంటుంది. దర్శకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు వెట్రిమారన్ విడుదల చేశారు. చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇళయరాజా సంగీతంలో రూపొందిన పాటలు చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతాయని అభిప్రాయపడ్డారు. -
కారైక్కాల్కు అమిత్ షా
సాక్షి, చైన్నె: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు తమిళనాడు పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 13న ఆయన తిరుచ్చికి రానున్నారు. 14వ తేదీన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో జరిగిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. వివరాలు.. తమిళనాడులో డీఎంకే గద్దె దించి తీరుతానన్న సంకల్పంతో అమిత్ షా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలో బలమైన కూటమి దిశగా కసరత్తు వేగవంతం చేశారు. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కూటమి నేతలందరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. అయినా, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే నుంచి సమాధానం కరువు కావడంతో చివరకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ డీఎండీకే వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇది ఒకటి రెండు రోజులలో ఫలితాన్ని ఇవ్వనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో తిరుచ్చి పర్యటనకు వస్తున్న అమిత్షాతో ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే వర్గాలను సమావేశ పరిచే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో అమిత్ షా పర్యటన ఖారారు కావడంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు. 13న తిరుచ్చికి రాక అమిత్ షా 13వ తేదీన తిరుచ్చికి రానున్నారు. ఇక్కడ పార్టీ వర్గాలతో సమావేశం అవుతారు. మరుసటిరోజు 14న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో జరిగిన ఎన్డీఏ కూటమిబహిరంగ సభకు హాజరు కానున్నారు. తిరుచ్చి నుంచి హెలికాఫ్టర్లో పుదుచ్చేరి వెళ్తారు. పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి నేతలందర్నీ అమిత్షా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయం చేయనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరుచ్చికి తిరుగు పయనం అవుతారు. ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తదితర నిర్వాహకులతో సమావేశం కానున్నారు. -
ఇప్పటికీ నెరవేరని కోరిక ఉంది!
తమిళసినిమా: సినిమాను ప్రేమిస్తే అది కచ్చితంగా ఉన్నత స్థాయిలో కుర్చోపెడుతుంది. ఇందుకు పలువురు ఉదాహరణ. ప్రతిభ, అంతకు మించిన ప్రేమ ఉంటే సినిమా ఎవరినైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్లుందని చాలా మంది నిరూపించారు. అలాంటి వారిలో నటి శ్రియ ఒకరు అని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్లో పుట్టి, పెరిగిన ఈ బ్యూటీ 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తరువాత హిందీ, తమిళం , కన్నడం తదితర భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు. తమిళంలో విజయ్, రజనీకాంత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో , తెలుగులో చిరంజీవి, నాగార్జున వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగారు. ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే ఈమె నటించారన్నది గమనార్హం. ఏదేమైనా గత 25 ఏళ్లుగా నాట్ అవుట్గా కొనసాగుతున్న శ్రియ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం కథానాయకి పాత్రలు కాకపోయినా నటనకు అవకాశం ఉన్న అక్క,అమ్మ వంటి పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి శ్రియ మంచి నృత్య కళాకారిణి అన్నది గమనార్హం. ఇటీవల ఈ భామ ఓ భేటీలో పేర్కొంటూ చాలా భాషల్లో చాలా చిత్రాల్లో నటించానని, అయితే తాను మొదట ప్రేమించేది నాట్యాన్ని అని చెప్పారు. ఇంత వరకు నటించని, నటించాలని ఆశపడే పాత్ర ఏదైనా ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా ఉందన్నారు. అదేమాటంటే నాట్య కళాకారిణి పాత్ర అని చెప్పారు. ఒక నాట్యకళాకారిణిగా జీవిత పయనాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నట్లు శ్రియ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామ కోరిక నెరవేరే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి. -
టీవీకే విజయ్పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఏంకే ముందుకు సాగుతోంది. మరోవైపు.. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.బీజేపీ నేత అన్నామలై.. తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు. తమిళనాడులోని జన్జెడ్ విజయ్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ, విజయ్కు రాజకీయ అనుభవం లేదు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేశారు. అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు. ఉదాహరణకు బీహార్నే తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు. ప్రజాదరణ కూడా కనిపించింది. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. అదే విధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు. 2026 ఎన్నికలు మార్పు కోసం జరిగే ఎన్నికలు. తమిళ ప్రజలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు. గత 12 సంవత్సరాలలో ఆయన క్రమంగా తన మార్కు చూపించారు అని అన్నారు.కార్తీ కీలక వ్యాఖ్యలు..మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా టీవీకే విజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి. గ్రౌండ్ లెవల్ యంత్రాంగం అవసరం. విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు. అలాగే, బీజేపీపై స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కిచెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందూత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.విజయ్ పోటీ ఎక్కడ?ఇదిలా ఉండగా.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘వి’తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలో ఉన్నాయి. -
ఘంటసాలకు ఘన నివాళి
కొరుక్కుపేట: తెలుగుజాతి గర్వించదగ్గ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని బుధవారం పెరంబూరులో నిర్వహించారు. చైన్నె పెరంబూరులోని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, గాయకుడు కిడాంబి లక్ష్మీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని బాబు మాట్లాడుతూ, తెలుగుజాతి గర్వించదగ్గ మహాగాయకుడు ఘంటసాల అని, సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. లక్ష్మీ కాంత్ మాట్లాడుతూ, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, జనని సంస్థలు ఏటా ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, ఘంటసాల ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, విషాద గీతాలను మధురంగా ఆలపించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సహకార సంఘాల పోస్టుల సంఖ్యలో మార్పు కొరుక్కుపేట: తమిళనాడు సహకార సంఘాలలో ఖాళీల పోస్టుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నట్లు నియామక విభాగం తెలిపింది. ఈ విషయంపై బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాలు.. సహకార సంఘాల రిజిస్ట్రార్ నియంత్రణలో పనిచేసే ప్రధాన కార్యాలయం, సహకార సంఘాలు, బ్యాంకులలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి సెప్టెంబర్ 13, 2025న నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో, పరిపాలనా కారణాల దృష్ట్యా, తమిళనాడు రాష్ట్ర ప్రధాన సహకార బ్యాంకు, తమిళనాడు రాష్ట్ర సహకార వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఖాళీల సంఖ్యను తాజాగా మార్చారు. ఆ విషయంలో, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో బ్యాంక్ అసిస్టెంట్ పోస్టుకు 111 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర సహకార వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బ్యాంకులో అసిస్టెంట్ పోస్టులకు 65 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలిపారు. అందువల్ల, రాష్ట్ర నియామక కేంద్రం ద్వారా అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం ఖాళీల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు కులాల వారీగా కోటా, ఆదాయం వారీగా ఖాళీ పోస్టులను ప్రతిపాదించనున్నట్టు అధికారులు తెలిపారు. రైలు నుండి జారిపడి దంపతుల మృతి తిరువొత్తియూరు: పరిగెడుతున్న రైలు నుంచి జారి కింద పడిన కళ్లకురిచ్చికి చెందిన దంపతులు మృతి చెందారు. వివరాలు.. కళ్ళకురిచ్చి జిల్లా, అయ్యనార్ పాళయం గ్రామానికి చెందినవారు శివకండన్ (37). అతని భార్య కలైయరసి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరంతా ముంబైలో ఉంటూ ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అయ్యనార్ పాళయం గ్రామంలో జరిగిన బంధువుల ఇంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై నుండి కళ్లకురిచికి, ముంబై నుండి తిరునల్వేలికి వెళ్లే దాదర్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఆరణి పక్కన ఉన్న వడమాతిమంగళం ప్రాంతంలో రైలు వెళ్తున్నప్పుడు శివకండన్ తలుపు తెరిచి తలుపు ముందు నిలబడి చూస్తున్నట్లు సమాచారం. వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. అతని కాపాడేందుకు యత్నించిన భార్య కలైయరసి కూడా పడిపోయింది. దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తోటి ప్రయాణికులు కళంబూర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాట్పాడి రైల్వే పోలీసులు శివకండన్, కలైయరసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సెల్వకుమార్కు పదవి సాక్షి, చైన్నె : టీవీకే నేత విజయ్ మాజీ మేనేజర్, సన్నిహితుడు పిటీ సెల్వకుమార్కు డిఎంకేలో పదవి అప్పగించారు. డీఎంకే ట్రేడర్స్ వింగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంగా అన్నాడీఎంకేతో పాటుగా పలు పార్టీల నుంచి డీఎంకేలో చేరిన కీలక నేతలకు పదవులు అప్పగిస్తూ డీఎంకే కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో సెల్వకుమార్కు ట్రేడర్స్ వింగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవిని, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేసుబ్బరత్నంకు డీఎంకే న్యూస్ రూమ్ మేనేజర్ బాధ్యతలు, మాజీ ఎమ్మెల్యే బాల గంగాధరన్కు వర్తక విభాగం డిప్యూటీ చైర్మన్ పదవి, సురేష్కుమార్కు కార్యదర్శి పదవి అప్పగించారు. మరి కొందరికి సైతం పదవులు కేటాయించారు. -
సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..!
‘తమిళనాడు గెలుస్తుంది.. దేశానికే మార్గదర్శకం చేస్తుంది’ అని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇండియా టుడే నేతృత్వంలో చైన్నెలో బుధవారం తమిళనాడు– రౌండ్ టేబుల్ కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్ పాల్గొని.. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సాక్షి, చైన్నె : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు పోటా పోటీగా ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇండియా టుడే నేతృత్వంలో సాగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం స్టాలిన్ వివిధ అంశాలపై స్పందించారు. ఆయన మాటల్లోనే.. ఇండియా టుడే కూడా తమిళనాడు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటోంది. ఓటర్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఇది స్పష్టంగా తెలిసి ఉంది. మీ సర్వే ప్రకారం, డీఎంకే కూటమి 45 శాతం మద్దతుతో ముందంజలో ఉంది. మాకు, రెండవ స్థానానికి మధ్య తేడాను చూడండి. ఇక్కడ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఉన్నారు. కార్యకర్తలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా...సింపుల్ లాజిక్ అంకగణితం ఇది. మూడు శాతం తేడాతో క్లీన్ స్వీప్ అన్నది జరిగింది. ఇప్పుడు 12 శాతం తేడా. అయితే, ఇది ఖచ్చితంగా బ్రహ్మాండ విక్టరీ అవుతుంది!. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సర్వే ఫలితం మాకు ఓ బూస్ట్! ప్రజలతో ఎప్పటికీ ఉంటాం.. ప్రజల కోసం కృషి కొనసాగుతుంది. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మీ అంచనాలను నిజం చేస్తాం.. అని వివరించారు. ఐదేళ్ల క్రితం తమిళనాడు పరిస్థితి ఎలా ఉండేది? ఇక్కడ అందరికీ అది తెలుసు. ఇప్పుడు ద్రవిడ మోడల్ ప్రభుత్వం ఏర్పడింది, ఈ ఐదు సంవత్సరాలలో చరిత్ర సృష్టించాం. తమిళనాడు విజయపథం వైపు పయనిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఈ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ద్రవిడ మోడల్ 2.0 తో మన విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. మీడియా మిత్రులారా..రాజకీయ పరిశీలకులారా అని సంబోధిస్తూ, కొన్ని గణాంకాలతో తమిళనాడు ఆర్థిక వృద్ధి 11.19 శాతంకు చేరడం గురించి ఈ సందర్భంగా వివరించారు. రెండు అంకెల వృద్ధి అనేది 14 సంవత్సరాల క్రితం, అది కూడా డీఎంకే పాలనలోనే ఉండేది. ఆ తర్వాత తాజాగా మేం సాఽధించాం. తమిళనాడు జీఎస్టీ రూ. 17 లక్షల 23 వేల 698 కోట్లుగా నమోదైంది. తలసరి ఆదాయం రూ. 3. 58 లక్షలుగా ఉండి జాతీయ సగటుతో పోల్చి చూస్తే, 1.74 రెట్లు ఎక్కువ అన్నది గుర్తుంచుకోవాలి. భారతదేశం అంతటా ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో సైనన్స్ ల్యాబ్లు 50 శాతం స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే తమిళనాడులో 98.3 శాతం పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 100 కళాశాలల్లో తమిళనాడులో 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచికలో 78 పాయింట్లతో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ఏ గణాంకాలు తీసుకున్నా కూడా తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. అందుకే తమిళనాడుకు 65కి పైగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఐదేళ్లలో తమిళనాడు బ్రహ్మాండ ప్రగతి పథంలో దూసుకెళ్లింది. చరిత్ర సృష్టించే పథకాలు అమల్లోకి విజయవంతంగా తీసుకొచ్చాం. ద్రవిడ మోడల్పథకాలు, ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలు ఆదర్శకంగా తీసుకున్నాయి. అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలి. ప్రతి నెలా ఒక కోటి 30 లక్షల మంది మహిళలకు రూ. 1000 నగదు అందజేస్తున్నాం. ఈ సందర్భంగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సీఎం వివరిస్తూ, డీఎంకే ప్రభుత్వం కొనసాగితేనే తమిళనాడు భవిష్యత్తు బాగుంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు తనపై నమ్మకం ఉంది. ఎల్లప్పుడూ విశ్వాసానికి నిజాయితీగా నేను ఉంటాను. కష్ట పడిపనిచేస్తున్నాను. డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షోభాలను సృష్టిస్తున్నదో అందరికీ తెలుసు. ఆర్థిక కేటాయింపు, పన్ను కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులకు ... ఇలా అన్నింటా అన్యాయం, ద్రోహం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బడ్జెట్లోనూ తమిళనాడుకు దక్కింది సున్నా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గవర్నర్ ద్వారా అనేక అడ్డంకులు.. అని పేర్కొంటూ, తాజాగా అవినీతి పరులందర్నీ ఒక చోట చేర్చి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ అవినీతి కూటమి పేరు డబుల్ ఇంజిన్ అంటా. ఇది ఓ డబ్బా ఇంజిన్. బీజేపీ విషయానికొస్తే, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. సమస్యలను సృష్టించి చలి కాచుకుంటోంది. ప్రజాస్వామ్య భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో హక్కుల కోసం గళాన్ని వినిపించడం, బంధం కోసం హస్తాన్ని అందించడం డీఎంకే నైజం. తమిళనాడుకు దక్కాల్సిన నిధులు, న్యాయం కచ్చితంగా లభిస్తాయి. మేం సాధిస్తాం.. తమిళనాడులో బీజేపీ ఫాసిస్ట్ రాజకీయాలకు ప్రజలే చరమ గీతాన్ని పాడుతారు. తమిళనాడులో ద్రావిడ మోడల్ 2.ఓ షురూ. ఇది దేశంలోనే నంబర్– 1 రాష్ట్రం అయిన తమిళనాడు గెలుస్తుంది. అది భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న స్టాలిన్ డీఎంకే కొనసాగితేనే భవిష్యత్తు.. బ్రహ్మాండ ప్రగతి.. అప్పటి.. ఇప్పటి పరిస్థితిని.. విద్వేషాలకు కుట్ర ఈ కార్యక్రమంలో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం గురించి సందించిన ప్రశ్నకు సీఎం స్టాలిన్ ఇచ్చిన సమాధానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అందుకు ఇక్కడ చోటు లేదు. అధికారంలో వాటా అన్నది తమిళనాడుకు కలిసిరాదు. ఇది మాకు తెలుసు...వాళ్లకీ తెలుసు అని కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కూటమిలో కాంగ్రెస్ బంధం కొనసాగుతుంది. ఇతరులు ఆశిస్తున్నవి జరగవు అని సమాధానం ఇచ్చారు. దీనిపై టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై స్పందిస్తూ, అధికారంలో వాటా విషయంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ స్పందిస్తూ, 2006 ఎన్నికలలో డీఎంకేకు మెజారిటీ లేదని, ఈ సమయంలో అధికారంలో వాటా విషయంగా కాంగ్రెస్ పెద్ద తప్పే చేసిందన్నారు. అయితే, తాజాగా ఆ తప్పు చేయబోమని, ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ పాలన లేదా కూటమి పాలన అన్నది ప్రజలే రానున్న ఎన్నికలలో నిర్ణయిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇక, జాతీయ నాయకుడు ప్రవీణ చక్రవర్తి స్పందిస్తూ, సంకీర్ణంలో తమిళ ప్రజలకు ఎలాంటి సమస్య లేదని, ఇతర రాష్ట్రాలు అధికారంలో వాటా ఇస్తుంటే, తమిళనాడు భయపడుతున్నది ఎందుకు..? అని ప్రశ్నించడం గమనార్హం. -
పూందమల్లి–వడపళని మధ్య సేఫ్టీ టెస్ట్ రన్
సాక్షి, చైన్నె : ఫేజ్ –2 లో భాగంగా చైన్నెలో పూందమల్లి – వడపళణి మధ్య మెట్రో రైలు సేప్టీ టెస్ట్ రన్ బుధవారం ప్రారంభమైంది. ఈ రన్ను రైల్వే భద్రతా కమిషర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. మరో రెండు రోజుల పాటూ ఈ రన్ జరగనుంది. వివరాలు.. చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో మూడు మార్గాలలో పనులు జరుగుతున్నాయి. ఇందులో పూందమల్లి – లైట్ హౌస్ మార్గంలో పనులు శరవేగంగా సాగుగుతున్నాయి. ఇప్పటికే పూందమల్లి నుంచి పోరూర్ – వడపళణి వరకు వంతెన మార్గంలో, కోడంబాక్కం నుంచి పనగల్ పార్కు మీదుగా లైట్ హౌస్ వరకు భూగర్భ మార్గంలో రైలు పయనించనుంది. ఇందుకు సంబంధించిన పనులను ఆయా ప్రాంతాలను విభజించి నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో అత్యంత రద్దీతో కూడుకున్న టీ నగర్ పనగల్ పార్కు – కోడంబాక్కం మధ్య జరుగుతూ వచ్చిన భూగర్బ రైల్వే మార్గం తవ్వకాల పని ముగించారు. ట్రాక్, రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే పూందమల్లి నుంచి పోరూర్ వరకు 9 కి.మీ దూరం రైల్వే స్టేషన్లు తదితర పనులన్నీ ముగిశాయి. ట్రయల్ రన్ పలుమార్లు విజయవంతం చేశారు. అలాగే, ఇదే మార్గంలో పోరూర్ నుంచి వడపళని వరకు సైతం పనులన్నీ ముగించారు. గత నెల పూందమల్లి నుంచి వడపళణి వరకు రైలు సేవలకు నిర్ణయించినా, రైల్వే భద్రతా కమిషన్ నుంచి అనుమతి అన్నది దక్కలేదు. దీంతో ఆ దిశగా మెట్రొ వర్గాలు కసరత్తు చేపట్టాయి. సేఫ్టీ టెస్ట్ రన్.. రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం బుధవారం చైన్నెకు చేరుకుంది. పూందమల్లి – వడపళణి మధ్య మెట్రో నిర్వహణకు సంబంధించి అన్ని పనులను ఈ బృందం పరిశీలించింది. మెట్రో రైలును తక్కువ వేగంతో నడపడం, భద్రతా పరంగా ఉన్న అన్ని రకాల అంశాలను ఈ బృందం వీక్షించింది. బ్రేకింగ్ టెక్నాలజీ, పట్టాల నాణ్యత, పటిష్టత, రైలు కోచ్లలో సౌకర్యం, ప్రయాణికులకు కల్పించిన భద్రతా, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేఫ్టీ రన్ జరిగింది. తొలి రోజున తక్కువ వేగంతో రైలు ముందుకు సాగినా, రెండో రోజుగా గురువారం 80 నుంచి 90 కీ.మీ వేగంతో రైలు నడిపేందుకు , భద్రతా పరంగా సమస్యలను సమగ్ర అధ్యయనం చేసే విధంగా సేప్టీ రన్ జరగనుంది. మూడు రోజుల ఈ సేప్టీ రన్ తదుపరి, ఈ మార్గంలో రైలు నడిపేందుకు సంబంధించిన అనుమతులను ఈ కమిషన్ ఇవ్వనుంది. -
రంగంలోకి సీఈసీ
సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించేందుకు ముందుగా ఇక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్(సీఈసీ) వర్గాలు చైన్నెలో పర్యటనకు రెడీ అయ్యారు. డిప్యూటీ కమిషనరన్ భాను ప్రకాష్ నేతృత్వంలోని బృందం బుధవారం చైన్నెకు చేరుకుంది. గురు, శుక్రవారం చైన్నెలో పర్యటించనుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో మే మొదటి వారంలో కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాల్సి ఉంది. ఈ దృష్ట్యా, ఏప్రిల్లో ఎన్నికలు ఒకే విడతగా ముగించే దిశగా ఎన్నికల యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది. కొత్త ప్రభుత్వం కొలువుకు మరో రెండు నెలలే సమయం ఉండంతో ముందుగా అన్ని ప్రక్రియలను ముగించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉరకలు తీస్తున్నారు. నగారా మార్చి మొదటి వారంలో మోగ వచ్చు అన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కమార్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్భాను ప్రకాష్ నేతృత్వలోని బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి చైన్నెకు చేరుకున్న ఈ బృందం గురు, శుక్రవారం సమావేశాలలో బిజీ కానుంది. తొలుత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో, ఆ తదుపరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన బృందం, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశానికి నిర్ణయించింది. అంతలోపు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినఅంశాలతో సమగ్ర నివేదిక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ సిద్ధం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లుగల్లంతైన వాళ్లు సుమారు 34.73 లక్షల మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. ముందుగా నిర్ణయించినట్టుగా ఈనెల 17న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. -
● ఆస్పత్రిలో చికిత్స ● సీఎం పరామర్శ
జారి పడ్డ మంత్రి దురై మురుగన్సాక్షి, చైన్నె : డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ మంత్రి దురై మురుగన్ (87) ఇంట్లో జారి పడ్డారు. ఆయన్ని చైన్నెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వయోభారం దృష్ట్యా దురై మురుగన్ తరచూ ఆస్పత్రికి వెళ్లి సాధారణ పరీక్షలు, చికిత్స చేసుకోవడం తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ముఖ్యమైన కార్యక్రమాల నిమిత్తం మాత్రమే ఇంటి నుంచి బయటకు వస్తున్నారు.ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో జారి కింద పడ్డారు. ఆయన్ని కుటుంబ సభ్యులు, భద్రతా సిబ్బంది గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాలికి, చేతికి గాయం కావడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారంతో ఉదయాన్నే సీఎం స్టాలిన్, ఆస్పత్రికి చేరుకుని ఆయన్ని పరామర్శించారు. అస్వస్థతకు కారణాలు, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
బంపర్ ఆఫర్.. వైన్ కొంటే బీర్ ఉచితం
సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువ. ఇక్కడ వివిధ రకాల బ్రాండ్లు లభిస్తుంటాయి. తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరలకు ఇక్కడ విస్తృత శ్రేణి మద్యం బ్రాండ్లు లభించడం జరుగుతుంది. అందమైన సాగర తీరప్రాంత నగరం కావడంతో పుదుచ్చేరికి నిత్యం పర్యాటకులు హోరెత్తుతుంటారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి మద్యపాన ప్రియులు తరచుగా పుదుచ్చేరికి వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారం ఇక్కడ జోరుగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో పుదుచ్చేరిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పుదుచ్చేరి నిలవడంతో, మద్యం దుకాణాలు ఇప్పుడు పండుగ సీజన్కే పరిమితం కాకుండా ప్రత్యేక రోజుల సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో, వాలెంటైన్స్ డే సందర్భంగా ‘‘వైన్ కొనుగోలు చేస్తే బీరు ఉచితం’’ అంటూ కొన్ని మద్యం దుకాణాలు ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులను ఆకర్షించి, తర్వాత విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వినియోగదారులు తాము మోసపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.దీంతో ఎక్సైజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. అలాగే ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్లు సైతం ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు అంటూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రకటనలను ఇచ్చుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి 14వ తేదీకి మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఇక్కడి ఆఫర్లపై దృష్టి పెట్టే వాళ్లు పెరిగారు. అదే సమయంలో మద్యం దుకాణాలలో ఆఫర్ల ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తేలితే, సంబంధిత మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
తిరుత్తణిలో కానుకల వెండి కరిగింపు
తిరుత్తణి: స్థానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు కానుకలుగా చెల్లించిన రూ.30 కోట్లు విలువ చేసే టన్ను వెండిని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో కరిగించే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి హుండీల్లో కానుకలు సమర్పిస్తుంటారు. భక్తులు చెల్లించిన కానుకలను ప్రతినెలా ఆలయ అధికారులు లెక్కిస్తారు. నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే బంగారు, వెండి ఆభరణాలు మాత్రం కొండ ఆలయంలోని రహస్య గదిలో భద్రపరుస్తుంటారు. గత ఏడేళ్లలో భక్తులు కానుకలుగా చెల్లించిన వెండి ఆభరణాలు 1,050 కేజీలు. ఈవెండిని కరిగించాలని హిందే దేవదాయ శాఖ ఆదేశించింది. ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దొరస్వామిరాజ్ను పర్యవేక్షణ అధికారిగా నియమించింది. మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు వెండి కరిగించే పనులు రిటైర్డ్ న్యాయమూర్తి దొరస్వామిరాజ్ సమక్షంలో సన్నిది వీధిలోని మయిల్ మండపం వద్ద వెండి కరిగించే పనులు చైన్నెకి చెందిన ప్రయివేటు కంపెనీ ద్వారా నిర్వహిస్తున్నారు. కరిగించిన వెండిని బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు ఆలయ అధికారి రమణి తెలిపారు. -
విద్యతోనే అసమానతలు దూరం
కొరుక్కుపేట: విద్యతోనే సమాజంలోని అసమానతలు దూరమవుతాయని తమిళనాడు ఆది ఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్), జనోదనం వ్యవస్థాపకుడు డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయేల్ అన్నారు . జనో అల్యుమిని స్టూడెంట్స్ ఆధ్వర్యంలో సమాజానికి చేసిన సేవలకు గొల్లపల్లి ఇజ్రాయేల్కు సత్కార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పెరియమేట్లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్ఆర్డీ సెంటర్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించి శాలువా, గజమాలలతో ఘనంగా సత్కరించారు . గొల్లపల్లి ఇశ్రాయేల్ మాట్లాడుతూ అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన ధ్యేయమన్నారు. -
సింహ వాహనంపై శ్రీసోమస్కందమూర్తి తేజసం
తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీకామాక్షి అమ్మవారి సమేతంగా శ్రీసోమస్కందమూర్తి సింహ వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో తేజో విలాసంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి వాహన సేవ అత్యంత వేడుకగా సాగింది. అడుగడుగునా భక్తులకు కర్పూర హారతులు పట్టి స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి ముందు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి భూత వాహన సేవ కోలాహలంగా సాగింది. భజన మండళ్ల కళాకారుల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు భూత వాహనదారుడైన విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో సోమస్కందమూర్తి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల వారి ఆధ్వర్యంలో చేపట్టిన భక్తి సంగీత, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింపజేశాయి. -
నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో 13.59 లక్షల మంది విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు అందజేయనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని ఇడయన్సాత్తు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలతోపాటు పాఠశాల, అంగన్వాడీ విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. వేలూరు జిల్లాల్లో మొత్తం 4.87లక్షల మందికి ఈ మాత్రలను అందజేయనున్నామన్నారు. ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తిరువణ్ణామలై జిల్లాలో 6.79లక్షల మంది విద్యార్థులకు మాత్రలను అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఉన్నఅపోహలను వదిలి పెట్టి మాత్రలు వేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మాత్రలను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. -
వృద్ధ దంపతులకు సత్కారం
తిరుత్తణి: హిందూ దేవాదాయ శాఖ ద్వారా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతులకు పట్టు వస్త్రాలు, పండ్లు, పలహారాలు, విభూది ప్రసాదాలతో సత్కరించాలని అసెంబ్లీలో మంత్రి శేఖర్బాబు ప్రకటించారు. దీంతో తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ద్వారా వృద్ధ దంపతులను గౌరవించే విధంగా ఆలయం ద్వారా ప్రకటన విడుదల చేశారు. 50 వృద్ధ దంపతులను ఎంపిక చేశారు. కొండ ఆలయంలోని కావడి మండపంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న వృదఅధ దంపతులు వారి కుటుంబీకులతో పాల్గొన్నారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి, ట్రస్టీలు సురేష్బాబు, నాగన్ తదితరులు వృద్ధ దంపతులకు పట్టు వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమ, విభూది, సిల్వర్ ప్లేట్లు సహా రూ. 2,500 విలువైన వస్తువులు పంపిణీ చేసి గౌరవించారు. -
ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
వేలూరు: వేలూరు కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ, అంగన్వాడీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు, తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ సంఘం వంటి సంఘాల ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తమిళనాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పన్నీర్సెల్వం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పది శాతం అదనపు పెన్షన్ అందజేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అదే విధంగా అంగన్వాడీ, గ్రామ పంచాయతీ సహాయకులకు రూ.7,850 కనీస పెన్షన్గా ఇస్తామని ప్రకటించి ప్రస్తుతం మరోసారి ఎన్నికల వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా తమిళనాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కలెక్టరేట్ ఎదుట ఉన్న రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేశారు. పోలీసులు రెవెన్యూ, అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రయివేటు కళ్యాణ మండపానికి తరలించారు. -
చాలా సంతృప్తి కరంగా రూట్
మయిలా చిత్రంలో నీ మెలోడి డార్కస్ ప్రదీప్ రంగనాథన్ చిత్రంలో మమితా బైజుతమిళసినిమా: నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళం భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అయితే అంతకుముందే ఈమె నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్కు జంటగా కోలీవుడ్కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. సెన్సార్ సమస్యల్లో ఇరుక్కున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కర చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈయనకు జంటగా ఒక చిత్రంలోని ఈ రెండు వారం అనే మరో చిత్రంలోని అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. తమిళసినిమా: నిర్మాతలు ఎప్పుడైతే తమ చిత్రాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తారో, ఆ చిత్రాలు సక్సెస్ అయినట్లే. ఆ విధంగా రూట్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ చిత్రంపై ఆ చిత్ర నిర్మాతలు చాలా సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అపర్శక్తి కురాణ నాయకిగా నటిస్తున్నారు. నటి భవ్య ట్రిఖ, వైజీ. మహేంద్రన్, పావని రెడ్డి, లింగ, ఆర్జే ఆనంది తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సూర్య ప్రతాప్. ఎస్. కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వెరూస్ పతాకంపై షేక్ ముజీబ్, ధనిస్తాన్ ఫెర్నాండో, రాజరాజన్ జ్ఞాన సంబంధం, సంజయ్ శంకర్లో కలిసి నిర్మిస్తున్న చిత్రం రూట్. కాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శక నిర్మాతలు మీడియాకు వెల్లడించారు. ఇది టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు సూర్య ప్రతాప్ తెలిపారు. ఇది ఊహలు, కలలు వంటి అంశాలతో కూడిన కథా చిత్రం అని తెలిపారు. చిత్ర షూటింగును చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కాగా రూట్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైనింగ్ మొదలగు అన్ని కార్యక్రమాలు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ చిత్రం కథను చెప్పినప్పుడే తమకు నచ్చిందని, ఆయనపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే చిత్రం చాలా సంతప్తికరంగా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అదేవిధంగా నటి అపర్శక్తి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. -
ఇదేంది ‘తంబీ’!
కుప్పంరూరల్: మూడు రాష్ట్రాల కూడలిగా ఉన్న కుప్పం అటవీ ప్రాంతంలో తమిళ ఆస్పత్రి వర్గాలు వ్యర్థాలు పడేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టి వెళ్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై గట్టి నిబంధనలు ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనాల్లో వచ్చి కుప్పం అటవీ ప్రాంతంలో పారబోసి నిప్పుపెడుతున్నారు. గత నెల రోజుల నుంచి ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తమిళ ఆస్పత్రి వ్యర్థాలు కుప్పం అడవుల్లో నిప్పులు రేపుతున్నాయి. వేపనపల్లి నుంచే అధిక మొత్తంలో... కుప్పం మండలం, గుడ్లనాయనపల్లి, తమిళనాడు రాష్ట్రం వేపనపల్లి మధ్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులోనూ వేపనపల్లి అతి సమీపంలో ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న వేపనపల్లి, చుట్టు పక్కల పెద్ద ఎత్తున వెలిసిన ప్రైవేట్, ఆర్ఎంపీ క్లినిక్ల నుంచి నిత్యం వందల కిలోల వ్యర్థాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణపై తమిళనాడులో నిబంధనలు కఠినంగా ఉండడంతో రాత్రి పూట ప్రత్యేక వాహనాల్లో గుడ్లనాయనపల్లి అటవీ ప్రాంతంలో పారబోసి, వ్యర్థాలకు నిప్పుపెట్టి వెళ్తున్నారు. అందులో రసాయనాలతో కూడిన విషపూరిత వ్యర్థాలు కూడా ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడ్లనాయనపల్లి సమీపంలో అక్కడక్కడ పది చోట్ల వరకు పారబోసి నిప్పుపెట్టి వెళ్తున్నారు. పగటి పూట ఆ గాలి పీలిస్తే ఊపిరాడడం లేదని పశువులు, గొర్రెల కాపరులు వాపోతున్నారు. అదే విధంగా ఆ మార్గంలో వెళ్లే వాహనదారులకు ఓ రకమైన దుర్గంధం వస్తోందని చెబుతున్నారు. ఈ మెడికల్ డంపింగ్పై కుప్పం అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పరిశోధన విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
వేలూరు: డిగ్రీలు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యలో పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు ఊరీస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 41వ స్నాతకోత్సవం కళాశాల కార్యదర్శి, సీఎస్ఐ డయాసీస్ బిషఫ్ శర్మ నిత్యానందం అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చాన్స్లర్ ప్రసంగించారు. ప్రస్తుతం యూజీ, పీజీలు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలు సాధించడంతోనే మీ విద్య ముగిసి పోయిందనుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ఈ కళాశాలలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎంత ఉన్నత స్థానాలకు చేరుకున్నా చదివిన కళాశాలను, తల్లిదండ్రులను మరవకుండా ఉండాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా మనం దేశం కోసం ఏమి చేశామని ప్రశ్నించుకోవాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రయత్నిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. అనంతరం డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ఆనీ కమల, కన్వీనర్ తెరడ్ రాజ్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అవార్డుకు నామినేట్ అయిన మయిలా
తమిళసినిమా: కమర్షియల్ తరహాలో.. చక్కని సందేశం ఇచ్చే సినిమాలు అరుదుగా రూపొందుతుంటాయి. అలాంటి చిత్రం మయిలా. మహిళ దర్శకురాలు చెమ్మల అన్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ సమర్పణలో న్యూటన్ సినిమా నిర్మించింది. ళటి పీ.మెలోడీ డార్కస్ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో వి.సుడర్ కోడి కీలక పాత్రను పోషించారు. కాగా ఈ చిత్రం 2026వ సంవత్సరానికి గాను రోటర్డామ్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నెట్ పాక్ ( నెట్ వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఆసియన్ సినిమా) అవార్డుకు నామినేట్ అయ్యింది. అద్భుతమైన క్రియేటివిటీ, కల్చర్, డెప్త్, ఎక్సలన్స్ సినిమాటిక్ అంశాలతో కూడిన చిత్రాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కాగా ఈ చిత్రం అంతర్జాతీయ నెట్ పాక్ అవార్డుకు నామినేట్ కావడంపై చిత్ర దర్శకురాలు అన్నం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఈ అవార్డుకు నామినేట్ కావడం తమ యూనిట్ కు అర్థవంతమైన అంగీకారం అయ్యిందన్నారు. ఈ చిత్రాన్ని ఎంతో నిజాయితీ, నిబద్ధతతో రూపొందించినట్లు చెప్పారు. ఐఎఫ్ఎఫ్ఆర్ ( ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్)లో అవార్డుకు నామినేట్ కావడం తమకు మరింత ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మయిలా చిత్రం సమాజంలోని భాగవతరాకాలను యదార్ధంగా ఆవిష్కరించిన కథా చిత్రం అని దర్శకుడు పా.రంజిత్ పేర్కొన్నారు. ఇలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై చోటు చేసుకోవడం చాలా ముఖ్యమని, ఈచిత్రం అందుకు అర్హత కలిగినదేనని ఆయన పేర్కొన్నారు. మయిలా చిత్రం మరిన్ని అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంటుందని నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమమే
తిరువళ్లూరు: డిమాండ్ల పరిష్కారం కోరుతూ దశల వారీగా ఆందోళన నిర్వహిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆందోళనకు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యవేదిక సంఘం నేతలు జవహర్, సెంథిల్కుమరన్, సెంథిల్కుమార్, మణిగండన్, కృష్ణన్ తదితరులు అద్యక్షత వహించారు. ఈ సందర్బంగా మణిగండన్ మాట్లాడుతూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టడంతో పాటూ ఉన్నత అధికారుల నుంచి వేధింపులకు గురి కాకుండా ఉద్యోగ భద్రత చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రెవెన్యూ అసిస్టెంట్లకు వేతనం పెంపు, సర్వేయర్, రెవెన్యూ ఉద్యోగులకు వేతనాల క్రమబద్దీకరణ చేయాలి కోరారు. విధుల్లో మరణించే ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వ్యక్తులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని, రెవెన్యూ సర్వేయర్ విభాగంలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి– చైన్నె జాతీయ రహదారిలో ఆందోళన నిర్వహించారు. కాగా అనుమతి లేకుండా రాస్తారోకోకు దిగిన దాదాపు 400 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. దివ్యాంగుల ఆందోళన తమ సమస్యలను పరిస్కరించాలనీ కోరుతూ ఆందోళన నిర్వహించిన సుమారు 62 మంది దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు నటేషన్ మాట్లాడుతూ వైద్య పరీక్షల ద్వారా వైకల్యాన్ని కచ్చితంగా లెక్కగట్టి రూ. 6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. అనంతరం రైతు బజారు వద్ద రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
అన్నామలైకు త్వరలో కొత్త బాధ్యత
సాక్షి, చైన్నె: ఎన్నికల పనుల నుంచి తప్పుకున్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఆ పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ బుజ్జగించే పనిలో పడ్డారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీల బలోపేతం, పర్యవేక్షణ నిమిత్తం శక్తి కేంద్రం బాధ్యతలను అన్నామలైకు బీజేపీ అధిష్టానం అప్పగించనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. ఎన్నికల విధులను నేతలకు విభజించే విధంగా నియోజకవర్గాల వారీగా డివిజన్లకు ఇన్చార్జ్లను బీజేపీ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతల నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుకోవడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో చైన్నెకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. అన్నామలైను బుజ్జగించే విధంగా సంతోష్ మంగళవారం ముందుకు సాగారు. అన్నామలై, నైనార్ నాగేంద్రన్లతో తో సంతోష్ సమావేశం నిర్వహించారు. త్వరలో అన్నామలైకు ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించే విధంగా నిర్ణయంచినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్కమిటీల పర్యవేక్షణ, బలోపేతం తదితర పనులను పార్టీ తరపున శక్తి కేంద్ర బాధ్యతగా అన్నామలైకు పనులను అప్పగించనున్నట్టు కమలాలయంలో చర్చ ఊపందుకుంది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కేశవ వినాయగంను తప్పించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆర్ఎస్ఎస్లో ఉత్తర తమిళనాడు కార్యనిర్వాహక కమిటీ సభ్యుడి పదవిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
ఘనంగా 90వ వ్యవస్థాపక దినోత్సవం
సాక్షి, చైన్నె : ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని చైన్నెలో ఘనంగా జరుపుకున్నారు. 1937లో బ్యాంకును స్థాపించిన వ్యవస్థాపకుడు ఎం. సిటి. ఎం. చిదంబరం చెట్టియార్ వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆయన విగ్రహానికి ఐఓబీ ఎండీ అజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జోయ్దీప్ దత్తా రాయ్, దనరాజ్ టి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు , సెంట్రల్ ఆఫీస్ సిబ్బంది కూడా భాగమయ్యారు. ఈసందర్భంగా చైన్నెలోని 43 పాఠశాలల్లో 7,584 మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అల్పాహారం అందజేశారు. చైన్నెలో ఐదు ప్రధాన ప్రాంతాల్లో పారిశుధ్యం , పరిశుభ్రత కిట్లు పంపిణీ చేసి, 4,000 బాలికలు ,10,000 గృహాలకు ప్రయోజనం కల్పించారు. ఇనిషియేటివ్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. స్వామి వివేకానంద సేవాలయ – సామాజిక అభివృద్ధి ట్రస్ట్ ద్వారా 23 మంది పేద వికలాంగులకు వీల్చైర్లు , ట్రైసైకిళ్లను అందజేశారు. 90వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత సామాజిక సేవలలో బ్యాంక్ నిబద్ధతను చాటినట్టు అజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. -
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
పళ్లిపట్టు: వాహనాలు అధిక వేగంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రాస్తారోకో చేశారు. దీంతో పొదటూరుపేటలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పొదటూరుపేట టౌన్ పంచాయతీలో కాంచీపురం వీధి మార్గంలో వందలాది వాహనాలు అధిక వేగంతో వెళుతుంటాయి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహించిన ఆ ప్రాంతం వాసులు మంగళవారం స్పీడ్ బ్రేకర్లు ఉర్పాటు చేయాలని రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ ఆగిపోవడంతో అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని, రోడ్డును విస్తరిస్తామని హామీ ఇవ్వడంతో గంటపాటు నిర్వహించిన రాస్తారోకోను విరమించారు. -
మహిళ దారుణ హత్య
సేలం: ఈరోడ్–చెన్నిమలై రోడ్డు నుండి తిండాల్కు వెళ్లే రింగ్ రోడ్డులో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. మంగళవారం ఉదయం ఓ పాల వ్యాపారి ఈ ప్రాంతం గుండా వెళ్లాడు. ఆ సమయంలో రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఖాళీ స్థలంలో ఓ మహిళ తల ఛిద్రమై నగ్నంగా మరణించి కనిపించింది. విషయాన్ని ఈరోడ్ తాలూకా పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన మహిళ వయస్సు 30 సంవత్సరాలు. ఆమె శరీరం దగ్గర ఎరుపు రంగు బ్లౌజ్ ఉంది. ఒక రాయి కూడా ఉంది. ఆ రాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళ నగ్నంగా హత్యకు గురైనందున, ఆమైపె అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణం నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్లుప్తంగా
జీతం అడిగాడని దాడి అన్నానగర్: ఇంట్లో పనిచేసినందుకు జీతం అడగడంతో యజమాని దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందాడని అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరువెర్కాడ్లోని సెల్వగణపతి నగర్కు చెందిన పచ్చముత్తు (70) దినసరి కూలీ. ఇతను పక్క వీధిలో నివసించే శరవణన్ (45) ఇంట్లో పనిచేసేవాడు. కానీ శరవణన్ హామీ ఇచ్చిన విధంగా జీతాలు చెల్లించలేదని తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో శరవణన్ పచ్చముత్తుపై దాడి చేశాడు. ఘటనలో గాయపడిన పచ్చముత్తు, కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ స్థితిలో, అతను సోమవారం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. తిరువేర్కాడు పోలీసులు పచ్చముత్తు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. శరవణన్ ఆడి చేయడం వల్లే తన తండ్రి చనిపోయాడని పచ్చముత్తు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరువెర్కాడు పోలీసులు శరవణన్ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషపురుగు కరిచి బాలిక మృతి అన్నానగర్: విషపురుగు కరిచి ఓ బాలిక మృతిచెందింది. నమక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ సమీపంలోని కుమారమంగళం పంచాయతీ యూనియన్లోని మిడిల్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలను సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్ పాఠశాల సమీపంలోని ఒక ప్రైవేట్ హాలులో జరిగింది. ఇందులో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కుమారమంగళం కౌండంపాలైయంకు చెందిన మాధేశ్వరన్–ధనలక్ష్మీ దంపతుల కుమార్తె రక్షిత (9) కూడా ఆర్ట్ ప్రోగ్రామ్ రిహార్సల్లో పాల్గొంది. రక్షిత 3వ తరగతి చదువుతోంది. రిహార్సల్ సమయంలో రక్షిత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రక్షిత మంగళవారం మృతిచెందింది. అంతుముందు రక్షిత తన నుదిటిపై పురుగు కుట్టిందని టీచర్కు చెప్పింది. విషపూరిత పురుగు కుట్టడం వల్లే చనిపోయి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాలిక మృతి కారణంగా కార్యక్రమం రద్దు చేశారు. ఆటోడ్రైవర్ దారుణ హత్య అన్నానగర్: మదురైలో ఓ ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మదురైలోని జైహింద్పురంలోని జీవానగర్కు చెందిన రమేష్ (46) ఆటోడ్రైవర్. ఇతని భార్య ప్రియ (29). వీరికి ఇద్దరు పిల్లలు. ప్రియ పెట్రోల్ బంకులో పనిచేస్తుంది. ఈమె భర్త నుంచి విడిపోయింది. ఈక్రమంలో శివకాశి సమీపంలోని పుదుకోట్టై గ్రామానికి చెందిన శంకర్ (27)తో పిల్లలతో కలసి పుదుకోట్టైలో ఒక గదిని తీసుకుని ఉంటోంది. ఇది తెలిసి రమేష్ సోమవారం రాత్రి చెంగల్పట్టుకు చెందిన తన స్నేహితుడు బాలాజీ (31)తో కలిసి పుదుకోట్టై వెళ్లి శంకర్ను కలసి, తన భార్య, పిల్లలను పంపించాలని వేడుకున్నాడు. ఆ సమయంలో శంకర్కు మద్దతుగా ముత్తుపాండి(34), మణిశంకర్(27), రాజేష్, కలసి రమేష్పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ విరుదునగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. పోలీసులు దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రాజేష్ కోసం గాలిస్తున్నారు. ఎన్ఐటీ–తిరుచ్చితో ఎన్ఎల్సీ ఒప్పందం కొరుక్కుపేట: మైనింగ్ టెక్నాలజీలో అధునాతన పరిశోధన, అభివృద్ధి సహకారం కోసం ఎన్ఐటీ–తిరుచ్చితో ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఎన్ఎల్సీ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లి, ఎన్ఐటీ–తిరుచ్చి ప్రతినిధులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నైవేలిలోని ఎన్ఎల్సీఐఎల్ అంతర్గత పరిశోధన అభివృద్ధి కేంద్రమైన సెంటర్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (కార్డ్) వద్ద కార్డ్ సైనేజ్ వాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెటీరియల్ ఫర్ బక్కెట్ వీల్ టీత్ అండ్ ఇట్స్లైఫ్ ఇంప్రూమెంట్ అనే ప్రాజెక్టు కోసం ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.50.73 లక్షలని అన్నారు. పార్థసారథి ఆలయంలో శుద్ధీకరణ పనులు తిరువొత్తియూరు: చైన్నె అంబత్తూరు ప్రధాన కార్యాలయంగా 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న హిందూ దేవాలయాల శుభ్రతకు దైవసేవా మండలి 302 శుద్ధీకరణ పనులు తిరువల్లిక్కేణి పార్థసారథి ఆలయంలో ప్రారంభించారు. మొదటి కార్యక్రమంగా పరిశుభ్రత సంరక్షణపై అవగాహన ఊరేగింపు నిర్వహించారు. ఆ సమయంలో పన్నీరు తిరుమురైనాధర్ను భుజాలపై మోసుకుని, తిరుకై ్కలాయ వాద్యాలు మోగుతుండగా, ఆడియార్లు (భక్తులు) అవగాహన బ్యానర్లను చేతబూని మాడవీధుల్లో ర్యాలీగా వచ్చారు. ఈ ఊరేగింపులో ప్లాస్టిక్ నిషేధాన్ని నొక్కిచెబుతూ ప్రజలకు గుడ్డ సంచులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. ఈ ఆలయంలో వచ్చే వారం జరగనున్న తెప్పోత్సవాన్ని పురష్కరించుకొని భక్తులు కోనేరును శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఆలయం లోపల కూడా శుభ్రపరిచే పనులు జరిగాయి. సాయంత్రం తిరుమురైపారాయణం చేసి ఆలయ ప్రాంగణంలో మంత్రాన్ని జపిస్తూ ప్రపంచ శ్రేయస్సు కోసం సామూహిక ప్రార్థనలు చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.గణేషన్ ఏర్పాట్లు చేశారు. సంస్థ శుద్ధీకరణ పనులు మీంజూర్ ఏకాంబరనాథర్, వరదరాజ పెరుమాళ్ ఆలయాల్లో జరగనున్నాయి. -
భారంగా వీధి కుక్కల పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చైన్నెలో వీధి కుక్కలను సురక్షితంగా తరలించడానికి చైన్నె కార్పొరేషన్ వర్గాలు కుస్తీలు పడుతున్నాయి. ఈ శునకాలను ఎక్కడకు తరలించాలో కార్పొరేషన్ వర్గాలు నిర్ణయించలేక పోతున్నాయి. ఈ వ్యవహారంలో స్వచ్ఛంద సంస్థల మద్దతు కరువైనట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, వీధి కుక్కలను పెంపుడు జంతువులుగా పరిగణిస్తూ, ప్రతి కుక్కకు రూ.750 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా పరిగణించాన్నారు. ఇప్పటివరకు, 40 వీధి కుక్కలను పట్టుకున్నారు. వీటిలో 21 కుక్కలను నెమ్మెలిలోని స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు, మిగిలినవి దత్తతకు ఇచ్చారు. అయితే, మొత్తం వీధి కుక్కల సంఖ్యను లెక్కించడం ఇంకా చైన్నెలో పూర్తి కాలేదని, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం నగరంలోని శివారు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, సమస్యను పరిష్కరించడానికి, మాధవరం, వేలచ్చేరిలలో కొత్త ఆశ్రయ, శునకాల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్థలాలు గుర్తించినట్లు పేర్కొంటున్నారు. ప్రతి కేంద్రం 250 కుక్కలను సంరక్షించగల సామర్థ్యం కలిగి ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కొత్త కేంద్రాలలో, రేబిస్ లక్షణాలు ఉన్న కుక్కలు, దూకుడు కుక్కలకు ప్రత్యేక బోన్లు , బహిరంగ ప్రదేశాలు కల్పించనున్నారు. మొత్తం 300 కుక్కలను కొత్త సౌకర్యాలలో సంరక్షించేందుకు ప్రణాళికా ప్రక్రియ కొనసాగుతోంది. అదే సమయంలో, వీధి కుక్కలను తరలించడంలో జాప్యం ప్రజల అసంతృప్తికి కారణమైంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ముఖ్యంగా అనేక ప్రాంతాలలో తాజాగా పెరుగుతున్న కుక్కల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. -
వరుస కడుతున్న రీ రిలీజ్ చిత్రాలు
తమిళసినిమా: ఇంతకుముందు విడుదలైన స్టార్స్ చిత్రాలు మళ్లీ విడుదల కావడం అనేది ఇటీవల అధికమైందని చెప్పాలి. గతంలో ఎన్జీఆర్, శివాజీ గణేషన్ వంటి హీరోలు నటించిన చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదలై మంచి వసూళ్లు సాధించేవి. కాగా అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది అనే చెప్పాలి. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన గిల్లి చిత్రం విడుదలై సత్తా చాటింది. ఆ తర్వాత పలు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ కు వరస కడుతున్నాయి. ఈ మధ్య విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకరన్ మళ్లీ విడుదల అయ్యి మంచి కలెక్షనన్స్ సాధించింది. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పడయప్పా చిత్రం రీ రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ చిత్రం రూ.60 కోట్లు వసూలు చేస్తే, రీరిలీజ్ లో రూ.70 కోట్లు వసూలు చేసి సినిమా పండితులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా నటించినా మంగాత్త చిత్రం రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేసింది. ఇలానే తాజాగా మరికొన్ని చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అందులో శింబు నటించిన సిలంబాట్టం, విన్నైతాండి వరువాయా, మాధవన్ నటించిన మిన్నలే వంటి చిత్రాలు ఉన్నాయి. అదేవిధంగా తాజాగా సూర్య కథానాయకుడిగా నటించిన మౌనం పేసియదే చిత్రం ఈనెల 13వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా రీరిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. నటి త్రిష, లైలా, హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అమీర్ దర్శకత్వం వహించారు. ఇది దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నది గమనార్హం. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2002లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మౌనం పేసియదే చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా నటుడు సూర్య ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో మంచి ప్రేమ కథ చిత్రం మళ్లీ విడుదల కావడం సంతోషంగా ఉందని, ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటులు గతంలో నటించిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ కు వరస కట్టడంతో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న చిన్న చిత్రాల నిర్మాతలు బెంబేలు ఎత్తుకున్నారు. తమ చిత్రాలకు థియేటర్లు వహించడం లేదని, లభించిన థియేటర్లో విడుదల చేసినా ప్రేక్షకులు లేక వెలవెల పోతున్నాయని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిర్మాతల సంఘం మంచి పరిష్కారం చూపాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. -
పుదుచ్చేరిలో లవర్స్ డే పేరిట ఆఫర్లు
సాక్షి, చైన్నె : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్గా వైన్ కొంటే బీర్ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎకై ్సజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువ. ఇక్కడ వివిధ రకాల బ్రాండ్లు లభిస్తుంటాయి. తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరలకు ఇక్కడ విస్తృత శ్రేణి మద్యం బ్రాండ్లు లభించడం జరుగుతుంది. అందమైన సాగర తీరప్రాంత నగరం కావడంతో పుదుచ్చేరికి నిత్యం పర్యాటకులు హోరెత్తుతుంటారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి మద్యపాన ప్రియులు తరచుగా పుదుచ్చేరికి వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారం ఇక్కడ జోరుగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో పుదుచ్చేరిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పుదుచ్చేరి నిలవడంతో, మద్యం దుకాణాలు ఇప్పుడు పండుగ సీజన్కే పరిమితం కాకుండా ప్రత్యేక రోజుల సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో, వాలెంటైన్స్ డే సందర్భంగా ‘‘వైన్ కొనుగోలు చేస్తే బీరు ఉచితం’’ అంటూ కొన్ని మద్యం దుకాణాలు ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులను ఆకర్షించి, తర్వాత విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వినియోగదారులు తాము మోసపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.దీంతో ఎకై ్సజ్ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. అలాగే ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్లు సైతం ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు అంటూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రకటనలను ఇచ్చుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి 14వ తేదీకి మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఇక్కడి ఆఫర్లపై దృష్టి పెట్టే వాళ్లు పెరిగారు. అదే సమయంలో మద్యం దుకాణాలలో ఆఫర్ల ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తేలితే, సంబంధిత మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. -
ముగిసిన ఓటర్ల నమోదు ప్రక్రియ
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఓటరు నమోదుకు తుది అవకాశం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 17వ తేదీన తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించనున్నారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి తెలిసిందే. ఇందులో 97 లక్షల ఓటర్ల వివరాలు లేనట్టు ఎన్నికల కమిషన్ పరిశీలనలో తేలింది. ఆ తదుపరి విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వాళ్లు తమ పేర్లను మళ్లీ నమోదు చేసుకునేందుకు వీలు కల్పించారు. గత నెల 30 వరకు రెండు సార్లు గడువు పొడిగింపుతో నమోదుకు అవకాశం ఇచ్చారు. అయితే మరో పది రోజులు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆదిశగా అవకాశం కల్పించారు. ఈ గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తాజా ఎంత మంది ఈ పది రోజులలో పేర్లు నమోదు చేసుకున్నారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని దరఖాస్తులను పరిశీలించి, ముందుగా నిర్ణయించిన మేరకుఈనెల 17న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ కసరత్తులలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో జరగనున్న 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం 68,400 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా పేర్కొంటూ ఎన్నికల వర్గాలు ప్రత్యేక నివేదికలను సిద్దంచేసి ఉంచారు. మరికొద్ది రోజులలో కేంద్ర ఎన్నికల కమిషన్వర్గాల సమాలోచన తదుపరి ఎన్నికల నగారా మార్చి మొదటి వారంలో మోగే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సంఘ కార్యాలయం -
మహిళా విద్యే..
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ క్రిస్టియన్ హయ్యర్ ఎడ్యుకేషన్, మహిళా క్రైస్తవ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సీఎంకు కృతజ్ఞత కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. రూ. 3.45 కోట్లతో ఇక్కడ నిర్మించనున్న బ్యాడింటన్ మైదానం పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే విద్యార్థినులతో మాట్లాడారు. ప్రపంచం మీ చేతుల్లో పథకం ద్వారా ల్యాప్ టాప్లను పొందిన వారితో ముచ్చటించారు. మహిళా అధ్యాపకులతో మాట్లాడారు. అనంతరం జరిగిన సభలో సీఎం స్టాలిన్ ప్రసంగించారు. తాను కూడా ఎంసీసీ పూర్వ విద్యార్థినని గుర్తుచేసుకుంటూ తాజాగా ఎంసీసీ నుంచి డబ్ల్యూసీసీకి రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. విద్య మనిషిని మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చగల శక్తి కలిగిందన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మహిళా విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు విశేష ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కళాశాలలో చేరే విద్యార్థినులకు నెలకు రూ.1000 అందించే పుదుమై పెన్ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా లాభపడుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉన్నత విద్యలో మహిళల నమోదు 34 శాతం పెరిగిందని, దాదాపు 8 లక్షల మంది విద్యార్థినులు ప్రయోజనం పొందారని చెప్పారు. మైనారిటీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటూ వస్తున్నదని వివరించారు. అన్ని రకాల పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని మరిన్ని పథకాల ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కష్టపడకుండా ఏమీ దక్కదని, కష్టపడకుండానే దరిచేరేవన్ని త్వరితగతిన దూరమవుతాయని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. -
యువతతో అన్బుమణి ప్రతిజ్ఞ
సాక్షి, చైన్నె : డాక్టర్ అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే యువజన విభాగం జనరల్ కమిటీ సమావేశం రాయపేటలో మంగళవారం జరిగింది. ఇందులో యువత చేత అన్బుమణి ప్రతిజ్ఞ చేయించారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివరాలు.. రాందాసు, అన్బుమణి నేతృత్వంలో వేర్వేరుగా పీఎంకే రెండు శిబిరాలుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో అన్బుమణి నేతృత్వంలో రాష్ట్ర యువజన సమావేశం జరిగింది. ఇందులో తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి వచ్చిన యువత చేత అన్బుమణి ప్రతిజ్ఞ చేయించారు. ప్రదానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమ, అవినీతిని నిర్మూలించడం, మాదక ద్రవ్యాల ప్రభావాల నివారణ, సీ్త్రల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 సామాజిక అంశాలపై దృష్టి పెడుతూ ఈ ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ, ఈ ప్రతిజ్ఞలు యువతను సమాజ అభివృద్ధి, తమిళనాడు పురోగతి , దేశ అభివృద్ధి కోసం కృషి చేయడానికి దారి చూపిస్తాయని వివరించారు. కూటమి విజయం కోసం పీఎంకె యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఓ వైపు యువతను బలోపేతం చేసే దిశగా అన్బుమణి సమావేశాన్ని నిర్వహిస్తే, మరో వైపు ఆయన సతీమణి సౌమ్య అన్బుమణి నేతృత్వంలో మేట్టూరులో మద్యానికి వ్యతిరేకంగా మహిళలను బలోపేతం చేస్తూ ఉద్యమంగా ముందుకు సాగే రీతిలో సమావేశాన్ని నిర్వహించారు. -
చార్జీలు పెంచాల్సిందే...!
సాక్షి, చైన్నె : క్యాబ్, ఆటోచార్జీల పెంపునకు డిమాండ్ చేస్తూ కార్మికులు సోమవారం కదం తొక్కారు. చైన్నెతో పాటూ పలు నగరాలలో నిరసనకు దిగారు. యాభై శాతం మేరకు డ్రైవర్లు పోరు బాటకు మద్దతు ఇచ్చారు. వివరాలు.. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఇది అమల్లో ఉన్నా, ఆ తర్వాత గాల్లో కలిసింది. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీల మీద దృష్టి పడింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటిని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు తగ్గ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కార్మిక, ఆటో సంఘాలతో రవాణా, కార్మిక సంక్షేమ కమిషనర్ సమావేశమయ్యారు. కమిటీ సిఫారసు, అన్ని వర్గాల అభిప్రాయాలతో ప్రస్తుతం కొత్త చార్జీలను నిర్ణయించారు. అయితే దీనికి ఆటో కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. అలాగే తమ నేతృత్వంలో కొత్త చార్జీలు అంటూ ఓ జాబితాను ప్రకటించాయి. గత ఏడాది తమ చార్జీల వసూళ్లకు కార్మిక సంఘాలు నిర్ణయించినా, పోలీసులు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గారు. గత ఈ పరిస్థితులలో కొత్త చార్జీలను నిర్ణయించాలన్న నినాదంతో మంగళవారం ఆటో బంద్కు పిలుపు ఇచ్చారు. ఆటోతో పాటూ క్యాబ్ల యజమానులు, డ్రైవర్లు తమకు సైతం చార్జీలను నిర్ణయించాలన్న డిమాండ్తో ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించారు. అనేక చోట్ల ఆటోల సేవలు ఆగాయి. మరికొన్ని ఆటోలు సాగినా, వాటిపై కన్నెర్ర చేస్తూ ఆందోళనకారులు దూసుకెళ్లే ప్రయ్నతం చేయడంతో కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. అలాగే చైన్నెలో రవాణా కమిషనరేట్ ముట్టడి దిశగా నిరసనలు దూసుకెళ్లగా పోలీసులు వారిని కట్టడి చేశారు. -
ఢిల్లీకి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం
●సకాలంలో పైలెట్ గుర్తించడంతో తప్పిన ప్రమాదం తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయం టెర్మినల్ 4 నుండి ఎయిర్ ఇండియా ఫ్యాసింజర్ విమానం మంగళవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీకి బయలుదేరడానికి సిద్దంగా ఉంది. విమానంలో 165 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బందితో సహా 171 మంది ఉన్నారు. కాగా బయలుదేరే ముందు విమానం ఇంజిన్లను పైలట్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇంజిన్ సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే చైన్నె విమానశ్రయ నియంత్రణ గదికి సమాచారం అందించారు. దీంతో విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రకటించారు. ఆ విమానంలో వున్న ఎంపీ కతిర్ ఆనంద్, పార్లమెంట్ సమావేశంలో పాల్గొనడానికి అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లవలసి వుందని ఎయిర్ ఇండియా అధికారులకు తెలిపారు. వెంటనే అయన్ని మాత్రమే ఉదయం 6.55 గంటలకు ఢిల్లీకి వెళ్లే మరో ఎయిర్ ఇండియా విమానంలో పంపారు. మిగిలిన 164 మంది ప్రయాణికులను చైన్నె విమానాశ్రయం లాంజ్లో ఉంచారు. విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంను సరిచేయడానికి విమానం ఇంజినీర్ల బృందం యత్నించింది. దీంతో ఉదయం 10.15 గంటలకు మరమ్మతులు చేసిన తర్వాత ఢిల్లీకి బయలుదేరింది. కాగా ఇంజిన్ లోపాన్ని పైలట్ సరైన సమయంలో గుర్తించడంతో అందరూ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. కేళంబాక్కం సమీపంలో దారుణం తిరువొత్తియూరు: శివగంగై జిల్లా దేవకోట్టై ప్రాంతానికి చెందిన ఆంధోని(42) ఓ ప్రైవేట్ తారు తయారీ సంస్థలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం అతను ఇటుక బట్టీ పక్క ఉన్న వెణ్బాక్కం నుండి తారు లారీని నడుపుకుంటూ పాత మామల్లపురం రోడ్డు కేళంబాక్కం మీదుగా షోళింగనల్లూరు వైపు బయలుదేరాడు. వాణియంచావడి వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగ తారు లారీకి తగిలినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ షాక్ తగిలి లారీలో మంటలు చెలరేగాయి. అందులో చిక్కుకున్న డ్రైవర్ ఆంధోని బయటకు రాలేక ఘటన స్థలంలోనే శరీరం కాలిపోయి దారుణంగా మృతి చెందారు. తారు లారీ పూర్తిగా కాలిపోవడంతో మంటలు చెలరేగి ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న చిరుచేరి అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీని కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత , లారీలో ఉన్న ఆంధోని మృతదేహాన్ని వెలికితీశారు. ఆనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చైన్నె సూపర్ కింగ్తో బాన్బ్లాక్ ఒప్పందం సాక్షి,చైన్నె : ప్రపంచ ఏఐ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ అయిన బాన్ బ్లాక్ సంస్థ చైన్నె సూపర్ కింగ్స్(సిఎస్కె)తో ఒప్పందం చేసుకుంది. సిఎస్కె అధికారిక ఆర్టిఫిషియల్ ఇంటెలియన్స్ (ఏఐ) భాగస్వామిగా సేవలను అందించనుంది. ఈ మేరకు నగరంలో జరిగిన సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, బాన్ బ్లాక్ సహ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ దురై అప్పాదురై మాట్లాడుతూ, సీఎస్కేతో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందని , ఈ భాగస్వామ్యం చేయడం వల్ల తెలివైన సాంకేతికతతో క్రీడలను ఎలా ఉన్నతీకరించగలవో ప్రదర్శించడం బాన్బ్లాక్ లక్ష్యమని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది క్రికెట్ అభిమానులకు వినోదం అనుభవాలను సృష్టించటంపై దృష్టి పెట్టనున్నట్టు దురై అప్పాదురై పేర్కొన్నారు. అనంతరం కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ బాన్ బ్లాక్తో ఒప్పందంతో క్రికెట్లో ఏఐ సాంకేతికతను వినియోగించటం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ సీజన్ కు సంబంధించిన జెర్సీను ఘనంగా ఆవిష్కరించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 74,130 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,631 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
అసంతృప్తిలో టీఎన్సీసీ
సాక్షి, చైన్నె: సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణితో అనుసరించడాన్ని టీఎన్సీసీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ వేదికగా తమ గళాన్ని మంగళవారం వినిపించారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్లోని కొందరు ఏఐసీసీ నేతలు, టీఎన్సీసీకి చెందిన మరి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో కూటమిలో కొత్త చిక్కులు మొదలయ్యాయి. టీవీకే అధినేత విజయ్కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు ఉండడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. దీంతో పార్టీ పార్లమెంటరీ నేత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి రంగంలోకి దిగారు. గత నెల ఆమె ఢిల్లీలో ఏఐసీసీ నేత రాహుల్గాంధీతో గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతున్నట్టు సమాచారం వెలువడింది. అదే సమయంలో అధికారంలో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చి చెప్పడంతో పాటు 25లోపు సీట్లను, ఒక రాజ్యసభ సీటును ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలిసింది. అయితే, కాంగ్రెస్ స్థానిక నేతలు తమ గళాన్ని తగ్గించలేదు. స్వరాన్ని పెంచడంతో సీట్ల పందేరాన్ని డీఎంకే నాన్చుడు ధోరణిలో పెట్టింది. ఢిల్లీలో పంచాయితీ తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జ్ గిరిష్ చోదన్కర్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతోపాటు ముఖ్యనేతలందరూ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో గిరిష్ మాట్లాడుతూ, డీఎంకేను కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కలసి 70 రోజులు అవుతోందన్నారు. ఇంతవరకు సీట్ల విషయంగా ఎలాంటి నిర్ణయాన్ని డీఎంకే ప్రకటించలేదని, ఇది కాంగ్రెస్ వర్గాలలో అసంతృప్తిని రగిల్చినట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా డీఎంకే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని వేచి చూస్తామంటూ అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనిమొళి మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అసంతృప్తి లేదని, త్వరలో డీఎంకే నేతృత్వంలో పొత్తు, సీట్ల పందేరం చర్చలకుగాను ఓ కమిటీ ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. అంతవరకు వేచి ఉండాలని, ఆ కమిటీ మిత్రులందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు హితవు పలకడం గమనార్హం. -
ప్రొమో షూట్ స్టార్ట్!
తమిళసినిమా: ఒక భారీ చిత్రానికి ప్రొమో షూట్ స్టార్ట్ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్నారన్నదే ప్రస్తుతం పెద్ద సంచలన వార్త. వీరిద్దరూ ఆరంభ కాలంలో పలు చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. కాగా ఆ తరువాత స్టార్ల స్థాయికి చేరుకున్న వీరు విడివిడిగా నటించడం మొదలెట్టారు. అలాంటిది సుమారు 40 ఏళ్ల తరువాత కమలహాసన్, రజనీకాంత్ కలిసి నటించడానికి సిద్దం అవుతున్నారు.దీని గురించి ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించారు. కాగా ఇప్పుడు దీనికి సమయం వచ్చింది. నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి రెడ్ జెయింట్ సంస్థ భాగస్వామ్యం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి జైలర్ చిత్రం ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహించనున్నారు. ఇది నటుడు కమలహాసన్కు 238వ చిత్రం,రజనీకాంత్కు 174వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి రాజీవ్మీనన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను స్థానిక ప్రసాద్ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో దర్శకుడు నెల్సన్, సంగీతదర్శకుడు అనిరుధ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటి నుంచే ఈ క్రేజీ చిత్రం ప్రచారం మారుమోగనుందన్నమాట. ఇకపోతే ప్రస్తుతం జైలర్– 2 చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్ తదుపరి సిబి.చక్రవర్తి దర్శకత్వంలో నటుడు కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. అదే విధంగా నటుడు కమలహాసన్ ప్రస్తుతం ఫైట్మాస్టర్స్ ద్వయం అన్బరివ్ల దర్శకత్వంలో నిర్మిస్తూ, కథానాయకుడిగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెయిన్ కథా చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత తెలుగు చిత్రం కల్కీ– 2 చిత్రంలోనూ నటించడానికి సిద్ధం అవుతున్నారు. -
క్లుప్తంగా
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు వేలూరు: వేలూరు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ శివరామన్ అన్నారు. ఇక్కడ ఇప్పటి వరకవు విధులు నిర్వహిస్తున్న మయిల్వాణన్ను చైన్నె క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో చైన్నె నుంచి శివరామన్ను కేటాయించింది. దీంతో సోమవారం ఉదయం ఆయన వేలూరు ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులు కార్యాలయానికి చేరుకొని పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కొత్త ఎస్పీ మాట్లాడుతూ వేలూరు జిల్లాలో ట్రాఫిక్ సమస్యతో పాటూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా శ్రద్ధ వహిస్తామన్నారు. పాముకాటుకు 11వ తరగతి విద్యార్థి మృతి తిరువొత్తియూరు: తిరువారూర్ సమీపంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాల తరగతి గదిలో పాము కాటుకు గురైన పదకొండవ తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. తిరువారూర్ జిల్లా వలంగైమాన్ తాలూకాలో కేతనూర్ గ్రామం ఉంది. మేల్ వీధికి చెందిన మురుగానందం, రాధ దంపతులకు కుమారుడు కుట్టి అలియాస్ శివప్రకాశం, కూతురు శివశంకరి ఇద్దరూ కవలలు. వారిద్దరూ దగ్గరలోని అరిద్వారమంగళం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో గత 4 వ తేదీన తరగతి గదిలో పుస్తకాలు తీసుకుంటుండగా, కింద సంచిలో ఉన్న కట్లపాము శివప్రకాశాన్ని కాటు వేసింది. పక్కనే అతని చెల్లెలు శివశంకరి కూడా ఉంది. వెంటనే ఉపాధ్యాయులు శివప్రకాశాన్ని చికిత్స నిమిత్తం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతున్న శివప్రకాశం సోమవారం చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై అరిద్వారమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ రైలులో డీఎంకే నేత మృతి అన్నానగర్: పొన్నేరి సమీపంలోని అలాడు ప్రాంతానికి చెందిన డీఎంకేకు చెందిన ప్రేమ్కుమార్ (43) 17వ వార్డు మాజీ కౌన్సిలర్. ప్రేమ్కుమార్ ఊటీకి వెళ్లడానికి ఆదివారం పొన్నేరి నుండి చైన్నె సెంట్రల్కు ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణించాడు. అతడి కోసం సెంట్రల్ రైల్వే స్టేషన్లో వేచివున్న బంధువు ఫోన్ ద్వారా సంప్రదించగా.. స్పందనలేకపోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా తిరువళ్లూరు సమీపంలో రైల్వే పోలీసులు రైలును తనిఖీ చేసినప్పుడు, ప్రేమ్ కుమార్ తన సీటులోనే కూర్చన్న స్థితిలో మృతి చెంది కనిపించాడు. అతని సెల్ ఫోన్ చోరీకి గురైంది. విచారణలో ప్రేమ్ కుమార్ ఎలక్ట్రిక్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడని తేలింది. వాళప్పడి సమీపంలో.. సేలం: వజప్పడి సమీపంలో తనకోసం ముందస్తుగా సమాధి నిర్మించుకున్న రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదివారం మరణించాడు. సోమవారం ఆయన బంధువులు నిర్మించిన సమాధిలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. వివరాలు.. పిచ్చముత్తు (74) సేలం జిల్లాలోని వజప్పడి సమీపంలోని ముత్తంపట్టి గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 15 సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. కాశీ,రామేశ్వరాన్ని పలుమార్లు సందర్శించి తిరిగి వచ్చారు. ఆయన అద్భుతమైన బ్యాడ్మింటన్ ఆటగాడు. అలాగే సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అతని స్వస్థలమైన ముత్తంపట్టి గ్రామంలో, అతని చిత్రంతో కూడిన గ్రానైట్ సమాధి రాయిని 5 సంవత్సరాల క్రితం ఆయనే స్వయంగా నిర్మించుకుని గుర్తింపు పొందారు. బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు అన్నానగర్: వివాహం చేసుకుంటానంటూ బాలికను గర్భవతిని చేసిన యువకుడిని పోక్సో కేసులో అరెస్టు చేశారు. వివరాలు.. కడలూరు జిల్లా పన్రుట్టి సమీపంలోని అంకు చెట్టిపాళయం గ్రామానికి చెందిన కార్తీ (23) దినసరి కూలీ. పన్రుట్టి ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకుంటానని చెప్పి, అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగా, బాలిక అనారోగ్యానికి గురై పన్రుట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించినప్పుడు, ఆమె అప్పటికే 5 నెలల గర్భవతి అని గుర్తించారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పన్రుట్టి ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల పోక్సో కేసు నమోదు చేసి నిందితుడి కార్తీని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
కాలానుగుణంగా మారాలి..!
తమిళసినిమా: ప్రముఖ నటుడు శరత్కుమార్ ఇటీవల డ్యూడ్ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా నటించి ఆ చిత్ర సక్సెస్లో భాగం అయ్యారు. తాజాగా ఈయన నటించిన చిత్రం యాళి. ఇందులోనూ శరత్కుమార్ కథానాయకికి తండ్రిగా నటించడం విశేషం. అయితే ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రను పోషించారు. నటుడు ఇంద్రజిత్ జగజిత్, దేవిక సతీష్ యువ జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు వైయాపురి, శ్రీజిత్ రవి, మైథిలి సత్యరాజ్,బిర్లబోస్, తామరైసెల్వి, సర్జిన్,బిజూ మవునికల్ వర్గీస్, టీనా బాటియా, నిఖిల్ మురుగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 888 ప్రొడక్షన్స్, సెల్యులాయిడ్ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మాధవ్ రామదాసన్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న యాళి చిత్రం ఈ నెల 27వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అయ్యింది. ఈ సందర్భంగా సోమవారం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శరత్కుమార్ మాట్లాడుతూ సముద్రం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇదని చెప్పారు. ఒక ఆధునిక పడవలో అధిక భాగం షూటింగ్ను నిర్వహించారని చెప్పారు. ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు దీన్ని చిత్రంగా ఎలా మలుస్తారు అన్న ఆసక్తి కలిగిందన్నారు. అయితే ఒక పెద్ద బోట్ సెట్ వేసి సముద్రంలో అధిక భాగం చిత్రీకరించారని చెప్పారు. ఇందులో నటి దేవిక సతీష్కు తాను తండ్రిగా నటించానని, ఆమె కొన్ని సన్నివేశాల్లో రిస్క్ చేసి నటించారని చెప్పారు. ఆమెను యాక్షన్ కథా చిత్రాల్లో దర్శకులు ఉపయోగించుకోవచ్చునని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఇంతకు ముందు మేల్ విలాసం అనే చిత్రాన్ని పూర్తిగా కోర్టు రూమ్లోనే చిత్రీకరించారని, అందులో నటుడు పార్తీపన్ నటించారని చెప్పారు. ఆ చిత్రం మాదిరిగానే ఈ చిత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రేక్షకులు వైవిధ్యభరిత కథా చిత్రాలనే ఆదరిస్తున్నారని అన్నారు. సినిమా, ఓటీటీ,టీవీ, షార్ట్ , రీల్స్ అంటూ ఎందులో నటించాలన్న సందేహం కలుగుతోందన్నారు. తనకు సంబంధించినంత వరకూ ఏదైనా నటనేననీ, కాలానుగుణంగా మారాలని భావిస్తున్నానన్నారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి విముక్తి
కొరుక్కుపేట: క్యాన్సర్ చూసి భయపడ వద్దని ప్రారంభ దశలో గుర్తించి తగిన వైద్యం తీసుకుంటే విముక్తి పొందవచ్చునని అపోలో ఆసుపత్రి వైద్యులు అభిప్రాయపడ్డారు. చైన్నెలోని అపోలో క్యాన్సర్ సెంటర్, అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జీరో టు హీరో పేరుతో కేన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ ఆసుపత్రుల వైద్యులు ముందస్తూ కేన్సర్ను గుర్తించటం పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలో యూరో–ఆంకాలజీ , రోబోటిక్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్. శ్రీవత్సన్ సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పి. వెంకట్, బ్రెస్ట్ సర్జరీ కన్సల్టెంట్ డాక్టర్ ఆశా రెడ్డి సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అజిత్ పాయ్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ కుమార్ ఎ.సి., సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ కుమార్ గణపతి వంటి బహుళ విభాగ ఆంకాలజిస్టుల ప్యానెల్ లో పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ రకాలను ముందస్తుగా గుర్తించడం సరళమైన, మరింత ప్రభావవంతమైన చికిత్స, మెరుగైన మనుగడ ఫలితాల ప్రధాన సందేశాన్ని ప్యానెల్ హైలైట్ చేసింది, ప్రారంభంలో క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిగా విముక్తి పొందవచ్చని తెలిపారు. -
వెల్నెస్ బలోపేతమే లక్ష్యంగా ట్రాకథాన్
సాక్షి, చైన్నె: ప్రివెంటివ్ వెల్నెస్, కమ్యూనిటీ ఫిట్నెస్పై నిబద్ధతను చాటే విధంగా ఎంజీఎం హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ట్రాకథాన్ 2026 విజయవంతంగా నిర్వహించారు. చైన్నె రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెంట్కు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. ఈ ట్రాక్ ఆధారిత రన్నింగ్ ఈవెంట్లో 370కు పైగా రిక్రియేషనల్ రన్నర్లు, 240కి పైగా ఎండ్యూరెన్స్ అథ్లెట్లు పాల్గొని, చైన్నెలోని అత్యంత కఠినమైన రన్నింగ్ పోటీలలో ఒకటిగా ట్రాకథాన్ను నిలిపారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా రన్నర్లు 400 మీటర్ల ట్రాక్లో పదేపదే పరుగెత్తుతూ, తమ శారీరక సహనం, వ్యూహాత్మక పేసింగ్, హైడ్రేషన్ క్రమశిక్షణ, మానసిక ధైర్యాన్ని పరీక్షించుకున్నారు. వేగం, సహనం, పట్టుదలతో కూడిన ఉత్కంఠభరిత పోరాటం అనంతరం సీఆర్ టవర్ ట్విస్టర్స్ (అన్నా నగర్) విజేతగా నిలిచి, ప్రతిష్టాత్మక రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది.ఈ ట్రోఫీని ఎంజీఎం హెల్త్ కేర్ డైరెక్టర్ – సీనియర్ కన్సల్టెంట్ (ఇంటర్నల్ మెడిసిన్) డా. స్వామికన్ను ఎం. చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రేస్ డైరెక్టర్ డా. లక్ష్మీ సుందర్ , చైన్నె రన్నర్స్ అధ్యక్షుడు యాసిర్ సుల్తాన్ పాల్గొన్నారు. -
ఇళయరాజా బయోపిక్ చిత్ర దర్శకుడు వైదొలిగారా?
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి చాలా కాలం క్రితమే బీజం పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను నటుడు ధనుష్ పోఫించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా కాలం క్రితం చైన్నెలో భారీ ఎత్తున జరిగాయి. నటుడు కమలహాసన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు ఆ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఆ చిత్రం ఇప్పటి వరకూ సెట్పైకి వెళ్లలేదు. అంతే కాకుండా మొదట్లో అనుకున్న దర్శకుడు మారిపోయారు. అంతే కాదు చిత్ర నిర్మాణ సంస్థ డ్రాప్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్ హీరోగా ఇంతకు ముందు కెప్టెన్ మిల్లర్ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాదేశ్వరన్ ఇళయరాజా బయోఫిక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు.ఇది జరిగి కూడా చాలా కాలం అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి సమచారం లేదు. కాగా తాజాగా ఇళయరాజా బయోఫిక్ చిత్రం నుంచి దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ కూడా వైదొలగారనే ప్రచారం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై నటుడు ధనుష్ వర్గం స్పంధించారు. సోమవారం వారు ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఇళయరాజా బయోఫిక్ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ చిత్రం నుంచి దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ వైదొలగలేదనీ, ప్రస్తుతం ఆయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ చిత్రంపై దృష్టి సారిస్తున్నారని, ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఇళయరాజా బయోఫిక్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలపై పూర్తిగా దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ఇళయరాజా బయోఫిక్ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఽధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నటుడు ధనుష్ తన 55వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అమరన్ చిత్రం ఫేమ్ రాజ్కుమార్ పేరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. కీలక పాత్రలో నటుడు మమ్ముట్టి నటించనున్నారు. సాయ్ అభయంకర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ బడ్డెజ్ చిత్రాన్ని నటుడు ధనుస్కు చెందిన వండర్బార్ ఫిలింస్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీంతో ఆ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. -
మైనర్లకు సెల్ఫోన్ నిషేధించాలి
తిరువళ్లూరు: 16 సంవత్సరాలలోపు పిల్లలు సెల్ఫోన్ వాడకుండా నిషేధిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజినల్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ సుగుణసింగ్ సూచించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్ఎంకే పాఠశాల 12వ వార్షిక క్రీడోత్సవం విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ మునిరత్నం అధ్యక్షతన నిర్వహించారు. సంస్థల ఉపాధ్యక్షుడు ఆర్ఎం కిషోర్ ప్రారంభోపన్యాసం చేయగా, కార్యదర్శి యలమంచి ప్రదీప్ అతిధిలను పరిచయం చేశారు. ముఖ్యఅతిథిగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజినల్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ సుగుణసింగ్ హాజరై క్రీడా ఉత్సవాలను ప్రారంబించారు. అనంతరం విద్యార్దులు చేపట్టిన మార్చ్పాస్ట్ను పరిశీలించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. గత విద్యాసంవత్సరంలో పదవ, ప్లస్–2 పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ. 1.54 లక్షల నగదు బహుమతులను ఆయన అందజేశారు. దీంతో పాటూ జాతీయ స్థాయిలో ఇటీవల జరిగిన అర్చురీ(విల్లువిద్య) పోటీల్లో పాల్గోన్న బాలికకూ ప్రోత్సాహ నగదు కిందు రూ. 25 వేలు అందజేశారు. అనంతరం ఆయన విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫోన్ తదితర వాటికి బానిసై భవిష్యత్ పాడుచేసుకోవద్దని సూచించారు. 16 సంవత్సరాల లోపు పిల్లలు సెల్ఫోన్, సోషల్ మీడియా వాడొద్దన్న చట్టాన్ని పలు దేశాలు రూపొదించి అమలు చేస్తున్నాయి. మనదేశంలోనూ ప్రత్యేక చట్టాన్ని రూపొంచాలన్నారు. చాలా మంది క్రికెటర్ సచిన్, పుట్బాట్స్టార్ రొనాల్డోను రోల్మాడల్గా తీసుకుంటారు. తాను మాత్రం సచిన్ను, రోనాల్డోను ప్రపంచస్థాయి స్టార్లుగా తీర్చిదిద్దిన వారి కోచ్లు బోలోనీ, రమాకాంత్ అర్చురేకర్లను ఆదర్శంగా తీసుకుని ఐపీఎస్ సాధించానన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల సలహాదారులు ఎంఎస్ పళణిస్వామి, మనోహరన్, విద్యార్దులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మొగ్గు
అందాల ప్రదర్శనకే తమిళసినిమా: ఆరంభ దశ నుంచి అందలమెక్కినా కథానాయికలు ప్రాముఖ్యతనిచ్చేది అందాల ప్రదర్శనకే అని చెప్పవచ్చు. అవకాశాల కోసం స్కిన్ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తుంటారు. టాప్ హీరోయిన్గా ఎదిగినా, ఆ స్థానాన్ని నిలుపుకోవడానికి వారికి ఒకే ఒక్క ఆయుధం అందాలారబోతే. నటి రాశీఖన్నా ఇందుకు ఆతీతం కాదు. చూడ చక్కని నటి ఈ బ్యూటీ. అంతే కాదు పాన్ ఇండియా నటి అన్నది అదనపు గుర్తింపు. 2013లో మెడ్రాస్ కఫే అనే చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తు మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలోకి ఇమైకా నొడిగల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే అందులో హీరో అక్కగా నటించిన నయనతార ఆ క్రెడిక్ట్ను కొట్టేశారు. అయితే నటి రాశీఖన్నాకు ఆ చిత్రం మంచి ఎంట్రీనే అయ్యింది. అలా నటుడు రవిమోహన్కు జంటగా అడంగుమరు అనే చిత్రంలో నటించారు. ధనుష్తో కలిసి తిరుచిట్రంఫలం చిత్రంలో క్యామియో పాత్రలో నటించారు. సర్ధార్ చిత్రంలో నటుడు కార్తీకి జంటగా నటించారు. సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో తమన్నతో పోటీ పడి అందాలను ఆరబోశారు. విశేషం ఏమిటంటే కోలీవుడ్లో ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. తెలుగులోనూ హిట్ చిత్రాల్లో నటించారు. అలా నటిగా పుష్కర కాలాన్ని అధిగమించారు. అయినా ఈమెకు స్టార్ ఇమేజ్ రాకపోవడం గమనార్హం. అంతే కాదు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ప్రత్కేక ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని హాట్హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇవి ఎంత వరకు అవకాశాలను తీసుకొస్తాయో చూడాలి. -
నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
వేలూరు: వేలూరు జిల్లాలో ప్రస్తుతం నిర్మిస్తున్న కట్టడ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పంచాయతీ శాఖ మంత్రి ఏవా వేలు అన్నారు. వివరాలు.. వేలూరు జిల్లా పెరుమొగై గ్రామ పంచాయితిలో రూ: 46 కోట్లు వ్యయంతో 250 గదులతో కూడిన ప్రభుత్వ కలైంజర్ వసతి భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఆయన సోమవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పనుల్లో నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. రోజూ పనులను ఇంజినీర్లు తనిఖీ చేయాలన్నారు. ప్రస్తుతం 215 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ వసతి భవణం నిర్మించడం జిల్లాకే గర్వ కారణమన్నారు. ప్రస్తుతం మూడు అంతస్తులుగా నిర్మాణ పనులను జరుగుతున్నాయని ఈ పనులను త్వరగా పూర్తి చేసి రాష్ట్ర సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ రాక ముందే పనులను పూర్తి చేయాలన్నారు. ఆయనతో పాటూ మేయర్ సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అభిమానులకు ఆత్మీయ పలకరింపు
సాక్షి, చైన్నె: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని చూడాలనే ఆశతో మూడో రోజైన సోమవారం కూడా అభిమానులు వీజేపీ లే అవుట్కు భారీగా తరలి వచ్చారు. వీరందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, తనతో ఫొటోలు దిగే అవకాశాన్ని వైఎస్ జగన్ మోహన్రెడ్డి కల్పించారు. వివరాలు.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చైన్నెకు వచ్చినప్పుడల్లా ఇక్కడి అభిమానం ఉప్పొంగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అది రెట్టింపు స్థాయిలో ఉంది. కుటుంబ కార్యక్రమం నిమిత్తం శనివారం చైన్నెకు వచ్చిన జననేతకు అభిమానులు పట్టిన బ్రహ్మరథం గురించి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో తమిళనాడు రాజధానిలోనూ అభిమానులు పోటెత్తారు. శనివారం రాత్రి సైతం అభిమానులు ఈంజంబాక్కం వీజీపీ లే అవుట్లోని సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి నివాసం వద్దకు పోటెత్తారు. రాత్రి సమయంలో సైతం ఇంటిపై నుంచి అభిమానులను ఆయన పలకరించారు. ఆదివారం కూడా అదే తరహాలో తరలివచ్చారు. ఇక సోమవారం చైన్నె పర్యటనను ముగించుకుని బెంగళూరుకు పయనం అవుతున్న సమయంలో సైతం జననేత కోసం అభిమానులు వందలాదిగా ఎదురు చూశారు. దీంతో వారందర్నీ ఆప్యాయంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి పలకరించారు. కొందరయితే, తమ నేతకు గుర్తుగా ఫొటోలను అందజేశారు. మహిళలు, పిల్లలు, కుటుంబ సమేతంగా ఎందరో అభిమానులు తరలి వచ్చినా అందర్నీ పలకరిస్తూ, ఫొటోలు దిగే అవకాశం కల్పించారు. అనంతరం వీజీపీ లే అవుట్ నుంచి బయలుదేరి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విమానాశ్రయానికి చేరుకున్నారు. సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు జహీర్ హుస్సేన్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధి కృత్రిక, నేతలు భాను, నరేన్ తదితరులు విమానాశ్రయం వద్దకు తరలి వచ్చారు. అనంతరం చైన్నె పర్యటన ముగించుకుని బెంగళూరుకు జననేత బయలుదేరి వెళ్లారు. -
రాష్ట్రంలో 6 కొత్త నర్సింగ్ కళాశాలలు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో త్వరలో ఆ రు కొత్త నర్సింగ్ కశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. నర్సింగ్ కళాశాలలో చదువుకున్న 1,100మంది కి డిగ్రీలను ప్రదానం చేశారు. చైన్నెలోని తమిళనాడు డాక్టర్ ఎంజిఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో నర్సింగ్ విద్యార్థులకు స్నాతకోత్సవం సోమవారం జరిగింది. ఇందులో కోర్సులు పూర్తి చేసిన పట్టభద్రులకు డిగ్రీలను అందజేశౠరు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య కళాశాలల్లో వైద్యులకు బ్యాచిలర్ డిగ్రీల స్నాతకోత్సవాలు జరుగుతాయన్నారు. అదే విధంగా నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా స్నాతకోత్సవం నిర్వాహించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంటూ వచ్చిందన్నారు. గత సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలలో స్నాతకోత్సవాలు నిరంతరం జరుగుతున్నాయి. తాజాగా 1,100 మంది నర్సులు పట్టభద్రులయ్యారని పేర్కొన్నారు. వీరిలో డిప్లొమా నర్సింగ్– 949, బి.ఎస్.సి. నర్సింగ్– 75, ఎం.ఎస్.సి. నర్సింగ్– 64, నర్సింగ్ మిడ్వైఫ్ ఆక్సిలరీ– 16 మంది పూర్తిచేశారని వివరించారు. రాష్ట్రంలో 6 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు త్వరలో ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. ఇవి తిరునెల్వేలి, తిరుచ్చి, ధర్మపురి, వెల్లూరు, ఈరోడ్, తిరువణ్ణామలైలో ఏర్పాటు కానున్నట్టు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ నర్సుల సంఖ్యను పెంచిందని పేర్కొంటూ,కరోనా కాలంలో పనిచేసిన 719మందిని కాంట్రాక్టు నర్సులకు మరి కొద్ది రోజులలో పర్మినెంట్ ఉత్తర్వులను అందజేయనున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో 8,834 మంది కాంట్రాక్ట్ నర్సులకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రస్తుతం ఉన్న 6 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 450 బి.ఎస్.సి., 80 పోస్ట్ బేసిక్, 101 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. అలాగే, 25 నర్సింగ్ శిక్షణ పాఠశాలల్లో 2,060 మంది విద్యార్థులు ఉన్నారు. -
మ్యానిఫెస్టోపై కసరత్తు
సాక్షి,చైన్నె : ఎన్నికల పనులను వేగవంతం చేయించే విధంగా బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ రంగంలోకి దిగారు. పార్టీ ఇన్చార్జ్లతో చైన్నెలో సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికల విధుల నుంచి అన్నామలై తప్పుకోవడం గురించి ఈ భేటీలో చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. ఎన్నికల విధులను నేతలకు విభజించే విధంగా నియోజకవర్గాల వారీగా డివిజన్లకు ఇన్చార్జ్లను బీజేపీ అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ నియమించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతల నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తప్పుకోవడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో సోమవారం చైన్నె టీనగర్లోని కమలాలయంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శిబిఎల్ సంతోష్ నేతృత్వంలో సమావేశం జరిగింది. పార్టీ ఎన్నికల పనులు, అంతర్గత వ్యవహరాల గురించి ఈ సమావేశం జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్చార్జ్ అరవింద్ మీనన్, కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఈ సమావేశానికి హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అన్నామలై తనకు కేటాయించిన ఆరు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జ్ పదవికి రాజీనామా చేయడం వెనుక గల కారణాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా అన్నామలై ఉండటంతో ఆయన్ని శాంతింపజేయడానికి బి.ఎల్. సంతోష్ స్వయంగా ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం. కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కాలం నుంచే అన్నామలై, సంతోష్ మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలు ఉన్నాయని, అన్నామలై బీజేపీలో చేరడంలో కూడా సంతోష్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ని బుజ్జగించేందుకు సంతోష్ను బీజేపీ అధిష్టానం రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సమన్వయ కమిటీ ఏర్పాటుకు.. తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే తదితర పార్టీల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 234 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పనులను సమన్వయం చేయడానికి 72 మందితో నియమితులైన ఇన్చార్జ్లు తమ పనులను వేగవంతం చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని, బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని బి.ఎల్. సంతోష్ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో మీడియా సమావేశాలలో జాగ్రత్తలు పాటించాలని, సీనియర్లు దయ చేసి ఆయా నియోజకవర్గాలలో ఉన్న ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందుకెళ్లాలని సూచించినట్టు కమలాలయం వర్గాలు పేర్కొన్నాయి. -
కంట్రోలర్పై వేటు
● టీఎన్పీఎస్సీలో హైడ్రామా సాక్షి, చైన్నె: చివరి క్షణంలో పరీక్ష రద్దు వ్యవహారం రచ్చకెక్కడంతో తమిళనాడు పబ్లిక్ సర్వీసుకమిషన్(టీఎన్పీఎస్సీ)లో సోమవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరీక్షల విభాగం కంట్రోలర్గా ఉన్న షణ్ముగ సుందరంపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఆయన్ని ఆ బాధ్యతలనుంచి తప్పించారు. వివరాలు.. గ్రూప్ –2, గ్రూప్ –2ఏ పరీక్షలు ఆదివారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో టీఎన్పీఎస్సీ అధికారుల నిర్వాకంతో అభ్యర్థులు తీవ్ర మనో వేదనలో పడ్డారు. పరీక్ష కేంద్రాల మార్పు, హాల్ టికెట్లో గందరోగోళం వంటి పరిణామాలతో చివరి క్షణలో పరీక్షలను వాయిదా వేశారు. దీంతో అభ్యర్థులు పలు చోట్ల ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు సోమవారం టీఎన్పీఎస్సీలో పెద్ద హైడ్రామాకు దారి తీసింది. కంట్రోలర్గా ఉన్న సోమసుందరంను ఆ బాధ్యతల నుంచి హుటా హుటీన తప్పించారు. ఆయన స్థానంలో వెంకట ప్రియ అనే అధికారి నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టగానే పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న పరిణామాలు, హాల్ టికెట్గందరోళం తదితర అంశాలపై దర్యాప్తు మొదలెట్టారు. అలాగే మళ్లీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కసరత్తును ప్రారంభించినట్లు తెలిసింది. మానవతా సేవల్లో విశేష కృషికి అవార్డులు సాక్షి, చైన్నె : భగవాన్ మహావీర్ ఫౌండేషన్ 29వ మహావీర్ అవార్డుల విజేతల జాబితాను సోమవారం ప్రకటించింది. అహింస – శాఖాహారం, విద్య, వైద్యం, సమాజం – సామాజిక సేవ రంగాల్లో నిస్వార్థంగా సేవలందించిన వ్యక్తులు, సంస్థలను అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఏడాది అవార్డు గ్రహీతలుగా మహారాష్ట్రకు చెందిన సర్హాద్ (అహింస – శాఖాహారం), హిమాచల్ ప్రదేశ్కు చెందిన సీఓఆర్డీ సంస్థ (విద్య), కర్ణాటకకు చెందిన శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ (వైద్యం), మిజోరాంకు చెందిన శ్రీమతి సంగ్కుమి బువల్చువాక్ (సమాజ – సామాజిక సేవ), ఒడిశాకు చెందిన నిర్మాన్ (సమాజ – సామాజిక సేవ) ఎంపికయ్యారు. కాగా మహావీర్ అవార్డులను ప్రతి సంవత్సరం సమాజంలోని వెనుకబడిన, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వారికి అందజేయడం జరుగుతోంది. అవార్డుతో పాటూ రూ.10 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య నేతృత్వంలోని ప్రముఖ జ్యూరీ నామినేషన్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుగల్చంద్ జైన్ మాట్లాడుతూ, సమాజ సంక్షేమానికి అంకితమైన వ్యక్తులు, సంస్థలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారి సేవలను గుర్తించడం గర్వకారణమని తెలిపారు. త్వరలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. చిదంబరం నటరాజ ఆలయానికి .. కొరుక్కుపేట: చైన్నెకు చెందిన ఓ భక్తుడు. చిదంబరం నటరాజ ఆలయానికి 50 పౌండ్ల బంగారు నాణేలతో దండను కానుకగా ఇచ్చి తనలోని భక్తిని చాటుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లాలోని చిదంబరంలో ప్రసిద్ధ నటరాజ ఆలయం ఉంది. చైన్నెకి చెందిన సుబ్రమణ్యం అనే భక్తుడు ఆలయ శిత్ సభలో ప్రతిష్టించబడిన శివగామి అమ్మవారికి అలంకరించడానికి దాదాపు రూ.45 లక్షల విలువైన 50 పౌండ్ల బంగారు నాణెం దండను విరాళంగా ఇచ్చాడు. దానిని నటరాజ ఆలయ బోర్డు దీక్షితర్, కార్యదర్శి శివసుందర దీక్షితర్లకు తన ప్రధాన దేవత రామలింగ దీక్షితార్ ద్వారా నైవేద్యంగా సమర్పించారు. సోమవారం ఉదయం పూజ సమయంలో బంగారు నాణేల దండను శివగామి అమ్మవారికి అలంకరించారు. కొత్త బస్ స్టేషన్ల ప్రారంభంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ కొరుక్కుపేట: ఆధునిక బస్ స్టేషన్లు ప్రారంభంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో కన్నదాసన నగర్ బస్ స్టేషన్, ఎం.కె.పి. నగర్ ముల్లై నగర్ బస్ స్టేషన్లను కొత్తగా నిర్మించారు. ఈ పనులు మహానగర అభివృద్ధి కమిటీ తరపున జరిగాయి. గత ఏడాది కాలంగా చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రెండు బస్టాండ్లను ప్రజల ఉపయోగం కోసం తీసుకువచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కొత్త బస్టాండ్లను ప్రారంభించారు. వీటిలో సోమవారం నుండి కొత్త సర్వీసులను ప్రారంభమయ్యాయి. -
రామేశ్వరంలో విమానాశ్రయం
సాక్షి, చైన్నె: రామేశ్వరం శ్రీరామనాథ స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం విమానాశ్రయం ఏర్పాటు కానున్నది. ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదిక సన్నద్ధం చేశారు. రామనాథపురం జిల్లా రామేశ్వరంలో రామనాథ స్వామివారు కొలువై ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడి పవిత్ర తీర్థాలలో నిత్యం భక్తులు స్నానాల నిమిత్తం తరలివస్తున్నారు. రామేశ్వరం, ధనుష్కోటి, అరిచల్ దీవుల సందర్శనార్థం నిత్యం సందర్శకులు వస్తుంటారు. రామేశ్వరం వెళ్లాలంటే మదురై విమానాశ్రయంలో దిగి, రోడ్డు మార్గంలో పయనించాల్సి ఉంది. రామేశ్వరానికి నిత్యం పెరుగుతున్న భక్తుల తాకిడి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రోడ్డు రవాణా సమస్యను పరిష్కరించడానికి రామేశ్వరం ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్ట్ కోసం 2025 బడ్జెట్లో అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ కొత్త విమానాశ్రయం స్థానిక రవాణాను వేగవంతం చేయడం, సముద్ర ఆహార పదార్థాల ఎగుమతిని పెంచడం తదితర వ్యాపార అవకాశాలను కూడా కల్పిస్తుందని నిర్ణయించారు. నివేదిక సిద్ధం టిడ్కో(తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ) రామనాథపురంలోని పాలంకుళం, దేవిపట్నం, కుంబరం, కలరి, మణిక్కనేరి ప్రాంతాలలో 500 ఎకరాల భూమిని సేకరించింది. వీటిలో తక్కువ జనసంఖ్య ఉన్న కుంబరం, మణిక్కనేరి ప్రాంతాలను ప్రాధాన్యంగా పరిశీలనలోకి తీసుకుని ఉన్నారు. గత సంవత్సరం చివరిలో సర్వే నిర్వహించి, తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దీనిని తమిళనాడు ప్రభుత్వం పరిశీలనకు పంపించారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం, మణిక్కనేరి ప్రాంతం సాంకేతికంగా విమానాశ్రయం ఏర్పాటు కోసం అనుకూలంగా ఉన్నట్టు పరిగణించారు. విమానాశ్రయం నిర్మాణానికి అనుమతులు కేంద్ర ప్రభుత్వం, భారత విమానాశ్రయాల అథారిటీ నుండి పొందిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
ఊడిన కేశవ వినాయగం పదవి
●బీజేపీలో చర్చ సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కేశవ వినాయగంను తప్పించారు. మాజీ అధ్యక్షుడు అన్నామలై తరపున ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్ఎస్ఎస్ సమావేశంలో సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆర్ఎస్ఎస్లో ఐదు దశాబ్దాలుగా కేశవ వినాయగం సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొన్ని సంవత్సరాల పాటూ వ్యవహరిస్తూవస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తప్పించి, నైనార్ నాగేంద్రన్కు అధిష్టానం పదవి అప్పగించింది. ఆ తదుపరి పరిణామాలతో బీజేపీలో మార్పులు తథ్యమన్న చర్చ జరుగుతూ వచ్చింది. అదే సమయంలో అన్నామలై మద్దతుదారులు ప్రధాన కార్యదర్శి కేశవ వినాయగంపై ఫిర్యాదులు హోరెత్తించినట్టు సమాచారం. తిరుచ్చిలో కీలక నేతగా ఉన్న సూర్య బహిరంగంగానే కేశవ వినాయగంను టార్గెట్ చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితులలో సాయంత్రం నుంచి సుదీర్ఘంగా చైన్నెలో ఆర్ఎస్ఎస్ కమిటీ సమావేశం చైన్నెలో జరిగింది. సమావేశంలో కేశవ వినాయగంను తప్పించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నుంచి ఆయన్ని తొలగించినట్టు సమాచారాలు, తమిళ మీడియాలో వార్తలు హోరెత్తడంతో ఎన్నికల వేళ బీజేపిలో కొత్త చర్చ మీదకు వచ్చినట్లయ్యింది. ఈ పదవి ఎవరికి అప్పగిస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఆర్ఎస్ఎస్ నుంచి కొందరిపేర్లను ఈ పదవికి తాజాగా బీజేపీ అధిష్టానానికి సిఫారస్సు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
చంద్రప్రభపై నీలకంఠుడు
నాగలాపురం: మండలంలోని సురుటుపళ్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా భాసిల్లుతున్న సర్వమంగళ సమేత శ్రీపళ్లికొండేశ్వర స్వామి ఆలయంలో మాహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిత్య వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు సోమవారం చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుక్కల్ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయుద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీకై లాసనాథుడిని, శ్రీపార్వతి దేవిని అధిష్టించి పరిమళాలు వెదజెల్లే పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి, వివిధ రకాల హారతులు సమర్పించారు. అనంతరం రాత్రి 8 గంటలకు వేద మంత్రోచ్ఛారణ నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగించారు. వాహన సేవ ఉభయదారులుగా సత్యవేడుకు చెందిన వి.యన్.పరమశివన్, ఆలయ మాజీ చైర్మన్ తిరునీలకంఠం, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గ్రామోత్సవంలో కోలాట భజనలు, ఆలయ మండపంలో చిన్నారులు భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఈఓ లత, సిబ్బంది పర్యవేక్షించారు. -
క్లుప్తంగా
సీఎం రంగస్వామినికలిసిన రైతులు కొరుక్కుపేట: యునైటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ తమిళనాడు కో–ఆర్డినేటర్ పీఆర్ పాండియన్ నేతృత్వంలోని రైతులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కలిశారు. దీని తరువాత పి.ఆర్.పాండియన్ విలేకరులతో ఆయన మాట్లాడుతూ... సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరారు. జాతీయ బ్యాంకుల నుండి వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో డిమాండ్ల కోసం రైతులు వివిధ రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మార్చి 15న రాంలీలా మైదానంలో ఒక భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. దానికి ముందు తాము అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి డిమాండ్లను తెలుపుతున్నట్టు వెల్లడించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కలుసుకుని రైతుల డిమాండ్లను పూర్తిగా తెలియజేశామన్నారు. అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో రైతులు తీవ్రంగా ప్రభావితమవుతారని వివరించామన్నారు. యువకుడి కిడ్నాప్.. హత్య అన్నానగర్: పుళల్లోని లక్ష్మీ అమ్మన్ కోవిల్ వీధి నివాసి మహేంద్రన్(28) స్వస్థలం తెన్కాశీ. పుళల్ లోని ఒక అద్దె ఇంట్లో నివశించి పాడిలోని ఒక ప్రసిద్ధ వస్త్ర కర్మాగారంలో పనిచేసేవాడు. గత ఏడాది డిసెంబర్లో ఉద్యోగానికి వెళ్లిన మహేంద్రన్ తిరిగి రాలేదు. బంధువులు సంప్రదించగా, అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. బంధువులు, సహోద్యోగులు దీనిపై విచారించగా, మహేంద్రన్ అదృశ్యమైనట్లు తేలింది. మహేంద్రన్ మామ కుమారుడు డిసెంబర్ 26న పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి ఆచూకీ లేదు. తదనంతరం మహేంద్రన్ అదృశ్యంపై చైన్నె హైకోర్టులో అరెస్ట్ వారెంట్ దాఖలు చేయబడింది. దీని తరువాత పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసి, పుళల్ ప్రాంతానికి చెందిన నలుగురిని ప్రశ్నించారు. ఇందులో వారు మహేంద్రన్ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసి, అతని మృతదేహాన్ని పుట్లూరు ప్రాంతంలోని సెప్టిక్ ట్యాంక్లో పడవేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని మాల్ పోలీసులు సేవ పుళల్ పోపైట్టె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సెప్టిక్ ట్యాంక్ నుండి మహేంద్రన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారు దానిని పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ హత్యపై పట్టుబడిన నలుగురితో కూడా పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకేలో పదవుల తొలగింపు కొరుక్కుపేట: అన్నాడీఎంకేలో 9 మంది కార్యనిర్వాహకుల పదవుల తొలగిస్తూ ఎడప్పాడి పళనిస్వామి చర్యలు తీసుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమావేశం కార్యక్రమాన్ని ముగించుకుని అడియార్లోని తన ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో కొంత మంది అన్నాడీఎంకే కార్యనిర్వాహకులు అతని ఇంటి దగ్గర అతని కారును ఆపడానికి ప్రయత్నించారు. వారు జిల్లా కార్యదర్శి అధి రాజారాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా అతను నినాదాలు చేసిన వ్యక్తిని తన ఇంటికి పిలిచి వారి డిమాండ్లు ఏమిటి అని అడిగారు. వారి పిటిషన్లను స్వీకరించారు. మంత్రి మద్దతుదారుడు నిర్వహించిన దర్యాప్తులో వారందరూ మాజీ సభ్యులని తేలింది. వారు అధిరాజారామ్కు వ్యతిరేకంగా ఒక వర్గంగా పనిచేస్తున్నారని కూడా తేలింది. ఎన్నికల సమయంలో ఒక వర్గంగా వ్యవహరించడానికి అనుమతించలేమని చెప్పి కారును అడ్డుకోవడానికి ప్రయత్నించిన 9 మందిపై ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు. చిన్నారుల కష్టాలను ప్రతిబింబించే కొత్త పుస్తకం సాక్షి, చైన్నె: పిల్లల హక్కులు, సకాలంలో రక్షణ పొందకపోయే చిన్నారుల కష్టాలను ప్రస్తావించే కొత్త పుస్తకం చైన్నెలో ఆవిష్కరించారు. హెల్ప్ కెన్ యు హెర్ అస్..? నావిగేటింగ్ సొసియేటల్ ఫాల్ట్ లైన్స్ విత్ చిల్డ్రన్ అన్న ట్యాగ్ లైన్తో ఈ పుస్తకాన్ని రిలీఫ్ ఫౌండేషన్ స్థాపకురాలు, రచయిత విద్య శంకర్ చక్రవర్తి రూపకల్పన చేశారు. పుస్తకం ప్రస్తావనలు చట్ట పరిష్కారాలు, ప్రభుత్వ జువైనెల్ హోంలు, చిన్నారి సంక్షేమ వ్యవస్థలలో కాపాడినవారి అనుభవాలపై ఆధారపడి ఉన్నాయి. పిల్లల జీవితాల్లో జరిగిన దుర్వినియోగం, నిరక్ష్యం గురించి కథలను పుస్తకంలో వివరించడం విశేషం. ఈ కార్యక్రమంలో మాజీ ఒడిశా హైకోర్ట్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ ఆవిష్కరించారు. -
క్రీడాకారులకు తోడ్పాటుగా స్పోర్ట్స్ వైద్య కోర్సు
సాక్షి, చైన్నె : ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ , ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సహకారంతో శ్రీ రామచంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్లో ఫుట్బాల్ ఎమర్జెన్సీ వైద్యం – యాంటీ–డోపింగ్ రీజినల్ పేరిట నాలుగు రోజులు కార్యక్రమం జరిగింది. ఇందులో ఫిలిప్పీనన్స్, మలేషియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, తజికిస్తాన్, భూటాన్, నేపాల్, తదితర సభ్య దేశాల నుంచి 50 మంది వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు తరలి వచ్చారు. డాక్టర్ గుర్చరన్ సింగ్ మాట్లాడుతూ, ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలవడమే ఆసియా ఫుట్బాల్ దీర్ఘకాలిక లక్ష్యంగా పేర్కొన్నారు. ఆటగాళ్ల శిక్షణతోపాటు వైద్య సహాయం, స్పోర్ట్స్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ తాజా కోర్సు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, శాసీ్త్రయ బృందాలకు ప్రాక్టికల్ అనుభవం ఇవ్వడం ద్వారా ఆటగాళ్ల భద్రతను పెంచుతుందన్నారు. శ్రీ రామచంద్ర సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. అరుముగం మాట్లాడుతూ, కోర్సు గాయాలు, ఆకస్మిక గుండె సంబంధిత పరిస్థితులలో వైద్య అత్యవసర పరిస్థితుల నిర్వహణలో అప్డేట్స్ ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య పరికరాలను ఆవిష్కరించారు. -
గుండెపోటుతో ప్రయాణికుడు మృతి
చంద్రగిరి: గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందిన ఘటన సోమవారం ఐతేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు సమీపంలోని హసన్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(48) విశాఖపట్నంలోని ఓ హోటల్లో వంట కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి వద్ద వెళుతున్న క్రమంలో చంద్రశేఖర్ ఫోన్ రింగ్ అయ్యింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తోటి ప్రయాణికులు చంద్రశేఖర్ను వద్దకు వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవళిక మృతదేహాన్ని పరిశీలించి, చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మధురైలో భారీ వావుసీ చిదంబరం విగ్రహం
కొరుక్కుపేట: స్వాతంత్య్ర సమరయోధులు వావుసీ చిదంబరంకు మధురైలో 110 అడుగుల ఎత్తులో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ చాన్స్లర్, ఏసీఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఏసీ షణ్ముగం తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఆవిష్కరిస్తారని ఆయన వెల్లడించారు. చైన్నెలో మీడియాతో ఇంకా మాట్లాడుతూ భారతదేశంలో బానిసత్వ సంకెళ్లను తెంచడానికి దక్షిణాదిలోని తూత్తుకుడి జిల్లాలో ఉద్భవించిన చిదంబరం పిళ్లై, తెల్ల సామ్రాజ్యవాదానికి సింహస్వప్నం అయ్యాడన్నారు. ఆయన కీర్తిని స్మరించుకునేందుకు ఆయనకు 110 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏసీఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం 22వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పునాది రాయి వేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఏసీఎస్ ఫౌండేషన్ తరపున మధురైలో 110 అడుగుల ఎత్తయిన చిదంబర పిళ్ళై విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నమూనాను ఆవిష్కరించారు. న్యూ జస్టిస్ పార్టీ వర్కింగ్ లీడర్ రవికుమార్ ,. ఓం శక్తి రామచంద్రన్, ఎస్ జె . ప్రకాష్, ఎన్ లోకనాథన్,జి వెంకటేష్ ఉన్నారు. -
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభ
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ధూర్జటి కళా ప్రాంగణంలో రూపుదిద్దుకున్న దక్షిణామూర్తి స్వామి పీఓపీ సెట్ భక్తులు, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జ్ఞానానికి ప్రతీకగా భావించే దక్షిణామూర్తి స్వామి దీక్షాస్వరూపంలో విరాజిల్లుతూ, ఆయన పాదాల వద్ద ఉపదేశాన్ని గ్రహిస్తున్నట్లుగా సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నలుగురు మహర్షుల రూపకల్పన అత్యంత హృద్యంగా రూపొందించారు. ఈ సెట్టింగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రావిచెట్టు సహజత్వాన్ని ప్రతిబింబించేలా, కొమ్మలు–ఆకుల వరకు సూక్ష్మ వివరాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతాప్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రతాప్, శ్రీనివాసులు, బాలు, సంతోష నైపుణ్యంతో రూపొందించారు. -
పారిశుధ్య కార్మికులకు సీఎం భోజన పథకం
తిరువళ్లూరు: పారిశుధ్య కార్మికులకు భోజన పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ఉదయం తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంలో ప్రారంభించారు. వివరాలు.. చైన్నె కార్పొరేషన్లో పని చేసే పారిశుధ్య కార్మికులకు అల్పాహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నవంబర్ 15న ప్రారంభించింది. పథకం ఆశించిన స్థాయిలో సఫలం కావడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పారిశుధ్య కార్మికులకు విస్తరింప చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా పథకాన్ని విస్తరించే కార్యక్రమం తిరువళ్లూరు జిల్లాలోని పోలివాక్కంలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చైన్నె కార్పొరేషన్ సహా 25 కార్పొరేషన్లు, 145 మున్సిపాలిటీలు, 479 పట్టణ పంచాయతీల్లోని లక్ష 29వేల 689 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 213.92 కోట్లు రూపాయల అదనపు భారం పడనుందని, నిధుల కొరత లేకుండా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. దీంతో పాటు విధుల్లో ఉంటూ మృతి చెందిన పారిశుధ్య కార్మికులకు పది లక్షల ఆర్థిక సాయం, పక్కాగృహాలు కూడా అందించనున్నారు. నిరాశ పరిచిన సీఎం ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం తిరువళ్లూరు జిల్లా పోలివాక్కంలో భారీగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి తిరువళ్లూరు, తిరునిండ్రవూర్ మున్సిపాలిటీ, తిరుమళిసై మేజర్ పంచాయతీకి చెందిన పలువురు కార్మికులను పిలిపించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు అధికారులు ఘనస్వాగతం కూడా పలికారు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో పారిశుధ్య కార్మికులకు వరాల జల్లు కురిపిస్తామని కార్మికులు భావించారు. అయితే ముఖ్యమంత్రి పది నిమిషాల్లోనే కార్యక్రమాన్ని ముగించి వెళ్లిపోయారు. దీంతో కార్మికులు తీవ్ర నిరాశ చెందారు. అయితే సెక్యూరిటీని దాటుకుని కార్మికులతో షేక్హ్యాండ్, వారితో ఫొటోలకు దిగడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నెహ్రు, మైనారిటీ సంక్షేమశాఖ అధికారి నాజర్, ఆదిద్రావిడ సంక్షేమశాఖ మదివేందన్, ఎంపీ జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు తిరుత్తణి చంద్రన్, తిరువళ్లూరు వీజీ రాజేంద్రన్, మాధవరం సుదర్శనం, పూందమల్లి కృష్ణస్వామి, మధురవాయల్ కారపాక్కం గణపతి, పొన్నేరి దురై చంద్రశేఖర్, ప్రఽభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, కలెక్టర్ ప్రతాప్, మున్సిపల్శాఖ ప్రధాన కార్యదర్శి కార్తికేయన్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ పల్లె మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలూరులో.. వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని 2095 మంది పారిశుధ్య కార్మికులకు ఉదయం అల్పాహారం పథకాన్ని అందజేయనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్పొరేషన్, మేజర్ గ్రామ పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు ఉదయం టిఫిన్ అందజేయాలనే పథకాన్ని రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దీంతో వేలూరు జిల్లాలోని పల్లిగొండ మేజర్ గ్రామ పంచాయతీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యే నందకుమార్, జడ్పీ చైర్మన్ బాబు, సర్పంచ్ సుప్రియ, కార్యనిర్వహణ అధికారి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. దీంతో వేలూరు కార్పొరేషన్లోని రెండో జోన్ సత్వచ్చారిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్ ప్రారంభించారు. ఇందులో జోన్ ఆరోగ్యశాఖ అధికారి బాల మురుగన్, ఆరోగ్యశాఖ ఇన్స్పెక్టర్లు లోకనాథన్, ఆనందన్, నందిని, సూపర్ వైజర్ అశోక్ దేవాలతో పాటు కార్పొరేటర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 వార్డుల్లో మొత్తం 2095 మంది పారిశుధ్య కార్మికులున్నారని ఉదయం 2075 మంది రాత్రి వేళల్లో 20 మంది పని చేస్తున్నారన్నారు. వీరికి అవసరమైన ఆహారాన్ని ఒక చోట తయారు చేసి మొత్తం నాలుగు జోన్లకు ఆరు వాహనాల్లో తీసుకెళ్లి మొత్తం 54 చోట్ల ఆహారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. వారంలో ఆరు రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో రకమైన టిఫిన్ను అందజేయనున్నట్లు తెలిపారు. -
కనులపండువగా మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: కొత్తూరులో మూడు ఆలయాల మహాకుంభాభిషేకం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు యూనియన్లోని కొత్తూరు గ్రామంలోని కమల వినాయకుడి ఆలయం, రాధ, రుక్మణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం, గంగమ్మతల్లి ఆలయాలకు మహాకుంభాభిషేకం పూర్తిచేసి 15 సంవత్సరాలు పూర్తికావడంతో జీర్ణోద్ధరణ పనులు పూర్తిచేసి శుక్రవారం నుంచి ఆదివారం వరకు మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాట్లు చేసి నిత్యహోమగుండ పూజలు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి పూజలు అనంతరం మేళ తాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు ఊరేగింపుగా వచ్చి కమల వినాయకుడి ఆలయ విమాన గోపురానికి పవిత్ర పుణ్యతీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయ గోపురం, చివరగా గంగమ్మ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకం నిర్వహించిన పుణ్యతీర్థాలను భక్తులపై చల్లారు. అనంతరం స్వామివారికి కర్పూర అభిషేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. కొత్తూరు గ్రామస్తులు మహాకుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించారు. -
దశాబ్దాలుగా విసనకర్రల తయారీ
వీసీఎన్ కండ్రిగ వాసులు వేసవి కాలం ప్రారంభానికి ముందుగానే తిరుత్తణి సమీపం వీసీఎన్ కండ్రిగ గ్రామంలో సందడి నెలకొంది. గ్రామంలోని వంద కుటుంబాలకు చెందిన ప్రజలు విసనకర్రల తయారీలో బిజిబిజీగా ఉంటున్నారు. ఇక్క పెద్దగా ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ప్రజల నుంచి ఆదరణ కొరవడిగా తమ పూర్వికులు చూపిన పని మాత్రం వీడకుండా నేటికీ కొనసాగిస్తున్నారు. తిరుత్తణి యూనియన్లోని కొండ గ్రామం వీసీఎన్ కండ్రిగ వాసులు నేటికి పూరె గుడిసెలు, సిమెంట్ షీట్లు ఉండే ఇళ్లలో నివశిస్తున్నారు. దశాబ్దాలుగా వారి ప్రధాన వృత్తి విసనకర్రలు తయారు చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించడం. తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబం పోషిస్తూ హాయిగా జీవితం గడుపుతున్నారు. కాగా వేసవి కాలం ప్రారంభం కావడంతో వినకర్రల విక్రయాలు పెరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. –పళ్లిపట్టు -
మత్తు పదార్థాల విక్రయాలపై మరింత నిఘా
తిరువళ్లూరు: రాష్ట్రంలో మత్తుపదార్థాల విక్రయాలపై మరింత నిఘా పెంచుతామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ అధ్యక్షతన ద్విచక్ర వాహన ర్యాలీ జరిగింది. ముఖ్య అతిథులుగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, సినీనటుడు మంచు మోహన్బాబు, ఆర్య తదితరులు హాజరై ర్యాలీని ప్రారంభించారు. మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎమ్మెల్యే కార్యాలయం వరకు సాగింది. ర్యాలీని ప్రారంభించిన అనంతరం మంత్రి సుబ్రమణియన్ మాట్లాడుతూ రాష్ట్రంలో గుట్కా, గంజాయి, మత్తుమాత్రల విక్రయాలు గతంలో కంటే తగ్గాయన్నారు. కర్ణాటకలో గుట్కాలు, ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని వివరించారు. కర్ణాటక, ఒడిశా, ఆంధ్ర నుంచి వచ్చే పండ్లు కూరగాయల వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని, ఈనేపథ్యంలో సరిహద్దుల్లో వాహనాల తనిఖీ మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి విక్రయాలపై పూర్తిగా పట్టు సాధించి కట్టడి చేశామన్నారు. గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా వారిపై గుండా చట్టం ప్రయోగించడంతో పాటూ నిందితుల బ్యాంకు ఖాతాలను సైతం స్తంబింపజేస్తున్నట్టు తెలిపారు. కాగా బైక్ ర్యాలీలో పాల్గోన్న వారికి సర్టిఫికెట్లు, మెడల్స్, టీషర్ట్స్లను ప్రముఖ సినీనటుడు మంచు మోహన్బాబు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తిరుత్తణి చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.


