breaking news
Tamil Nadu
-
పబ్లిక్ రివ్యూలను అనుమతించొద్దు: విశాల్ విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్ ఫ్లవర్. నటుడు విగ్నేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్, జాన్విజయ్, తలైవాసల్ విజయ్, అజయ్రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్రామ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఇందులో విశాల్, పి.వాసు, స్వరాజ్, ఫైవ్ స్టార్ కదిరేశన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు. నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్ను కట్టడి చేయాలని తెలిపారు. -
క్లుప్తంగా
ఎస్పీ బాధ్యతల స్వీకరణ తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా నూతన ఎస్పీగా వివేకానంద శుక్లా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్పీగా వున్న శ్రీనివాసపెరుమాల్ను సీఐడీ ఎకనమిక్ వింగ్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం రాణిపేట జిల్లా ఎస్పీగా ఉన్న వివేకనందశుక్లాను తిరువళ్లూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో వివేకానందశుక్లా గురువారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు పోలీస్ అధికారులు అభినందలు తెలిపారు. కాగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుమ్మిడిపూండి చెక్పోస్టును తనిఖీ చేశారు. జిల్లాకు శుక్లా 23వ ఎస్పీ కాగా, రెండేళ్ల క్రితం శుక్లా తిరువళ్లూరు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. కాగా ఆవడి డిప్యూటీ కమిషనర్గా వున్న ఐమన్ జమాల్ రాణిపేట జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. సీబీఐ విచారణకు నిరాకరణ సాక్షి, చైన్నె : మదురై కార్పొరేషన్లో పన్నుల వసూళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కోర్టు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. మదురై కార్పొరేషన్లో అక్రమలు అంటూ వచ్చి ఆరోపణల వ్యవహారం మధురై ధర్మాసనంకు చేరింది. ఈ కేసు సీబీఐకు అప్పగించాలని పిటిషనర్లు విన్నవించారు. విచారణ ముగియడంతో సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ హైకోర్టు మధురై ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గొంతు కోసి యువకుడి హత్య అన్నానగర్: చిన్నసేలం సమీపంలో ఓ యువకుడిని గొంతు కోసి హత్య చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. కళ్లకురిచ్చి జిల్లాలోని చిన్నసాలెం సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మారిముత్తు (55). ఇతని భార్య పచ్చైయమ్మల్ (50). వీరికి తవాసి (23), భాస్కర్ (19) ఇద్దరు కుమారులు ఉన్నారు. తవాసి కళ్లకురిచ్చిలోని ఒక కసాయి దుకాణంలో పనిచేసేవాడు. భాస్కర్ పశువుల వ్యాపారిగా పనిచేసేవాడు. వీరి తల్లిదండ్రులు వారికి చెందిన ఇంట్లో నివసించేవారు. సోదరులు తవాసి, భాస్కర్ సాధారణంగా రాత్రిపూట గ్రామంలోని ఇంట్లో నిద్రపోతారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి, వారిద్దరూ పొలంలోని ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి, నిద్రించడానికి గ్రామంలోని ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంలో గురువారం ఉదయం, భాస్కర్ మెడ తెగిపోయి రక్తస్రావంతో ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతని సోదరుడు తవసి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడు తవాసి కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ ఘటన కళ్లకురిచ్చి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఆక్రమణల తొలగింపు తిరుత్తణి: కేజీ.కండ్రిగ నొచ్చిలి క్రాస్ వద్ద నెలకొన్న వాహనాల రద్దీ ప్రమాదాల పరిష్కారానికి వీలుగా ఆక్రమణలు తొలగింపు పనులు హైవే శాఖ అధికారులు చేపట్టారు. తిరుత్తణి నుంచి చిత్తూరు వెళ్లే హైవే రోడ్డులో కేజీ.కండ్రిగలో వాహనాల రద్దీని నియంత్రించే విధంగా రూ.26 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేజీ.కండ్రిగలోని నొచ్చిలి క్రాస్లో హైవే రోడ్డును దుకాణాదారులు ఆక్రమించుకోవడంతో నిత్యం వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో హైవే శాఖ నొచ్చిలి రౌండ్ ఠాణా వద్ద రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. కంటైనర్ను ఢీకొన్న కారు తిరుత్తణి: దైవదర్శనం చేసుకుని ఇంటికి వెళుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైర్ పేలడంతో కంటైనర్ను ఢీకొని దంపతులతోపాటు కుమారుడు దుర్మరణం చెందారు. ఈఘటన అరక్కోణం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అరక్కోణంకు చెందిన వెంకటేశన్(45) కారు మెకానిక్. ఇతని భార్య లత. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో దినేష్(17)ప్లస్టూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆడి నెల మొదటిరోజు సందర్భంగా వెంకటేష్, లత, దినేష్తో కలిసి కారులో కాంచీపురంలోని కామాక్షమ్మ ఆలయానికి గురువారం ఉదయం వెళ్లారు. స్వామి దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరారు. కాంచీపురం–అరక్కో ణం రోడ్డులోని నెమిలి వద్ద కారు ముందు టైర్ పేలి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొంది. ప్రమాదంలో వెంకటేశన్ మృతిచెందాడు. గాయపడ్డ భార్య, కుమారుడిని అరక్కోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లత, దినేష్ మృతిచెందారు. నెమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తదానంతో ప్రాణదానం
వేలూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ అన్నారు. కాట్పాడిలోని జూనియర్ రెడ్క్రాస్ సంఘం, జాయిస్ కళాశాల, వేలూరు బ్లడ్ బ్యాంక్, అగర్వాల్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా రక్తదాన దినోత్సవం, ప్రత్యేక కంటి వైద్య శిబిరం రెడ్క్రాస్ సంఘం కార్యదర్శి జనార్ధనన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ప్రమాదాలు జరిగి వచ్చే రోగులకు అవసరమైన రక్తాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసన్, రమేష్కుమార్ జైన్, కార్యవర్గ సభ్యులు విజయకుమారి, జాయిస్ కళాశాల కరస్పాండెంట్ బెన్నీహెయిన్, నవనీతం పౌండేషన్ వ్యవస్థాపకుడు సత్యానందం, బ్లడ్బ్యాంక్ కోఆర్డినేటర్ శివన్, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అధిక సార్లు రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. -
జిల్లా ఆస్పత్రిలో జనరేటర్తో విద్యుత్
తిరుత్తణి: తిరుత్తణిలో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు తలెత్తడంతో జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేశారు. తిరుత్తణిలో రూ.45 కోట్లతో జిల్లా ప్రభుత్వాస్పత్రికి నూతన భవనం నిర్మించి ఇటీవల వైద్యసేవలు ప్రారంభించారు. ఈక్రమంలో బుధవారం రాత్రి తిరుత్తణిలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే వేకువజామున 4 గంటల సమయంలో జనరేటర్లో డీజిల్ అయిపోవడంతో రెండు గంటల పాటు ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు, వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం డీజిల్ తీసుకొచ్చి విద్యుత్ సరఫరా చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు విద్యుత్శాఖ సిబ్బంది ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు గుర్తించి పరిష్కరించి విద్యుత్ సేవలు పునరుద్ధరించారు. -
మదర్థెరిసా ఆశయాలు ఆదర్శంగా తీపుకోవాలి
తిరువళ్లూరు: మదర్థెరిసా ఆశయాలకు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరులోని మదర్థెరిసా నర్సరీ అండ్ ప్రైమరీ పాఠశాలలో కామరాజర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సెల్వకుమార్, గుడిమెట్ల చెన్నయ్య, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తమ్మినేని బాబు, కాపుసేవా సమితి ప్రధాన కార్యదర్శి కేశవులు, సామాజిక సేవకుడు సీహెచ్ ముకుందరావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముందుగా మదర్థెరిసా విగ్రహానికి, కామరాజర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో పీఆర్ కేశవులు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ మల్లిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెట్రోలోకి ఎంఆర్టీఎస్ – త్వరితగతిన పనులకు ఉత్తర్వులు సాక్షి, చైన్నె: మెట్రో రైలు గుప్పెట్లోకి ఎంఆర్టీఎస్ రైలు సేవలు చేరనున్నాయి. బీచ్ నుంచి వేళచ్చేరి – సెయింట్ థామస్ మౌంట్ వరకు మెటో సేవలే లక్ష్యంగా ఏర్పాట్లకు ఉత్తర్వులు జారీ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. రాజధాని నగరం చైన్నెలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు తీవ్ర ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తూవస్తున్నది. ప్రధాన రవాణా మార్గాలుగా ఈఎంయూ (ఎలక్ట్రిక్ రైళ్లు) బీచ్ నుంచి తాంబరం, చెంగల్ప ట్టు, తిరుమాల్ పూర్ వరకు సేవల్ని అందిస్తున్నా యి. అలాగే, సెంట్రల్ మోర్ మార్కెట్ నుంచి తి రువళ్లురు, అరక్కోణం, గుమ్మిడి పూండి మార్గాల్లో ఈ రైళ్ల సేవలు అందుతున్నాయి. అలాగే, బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీ ఎస్ సేవలు సా గుతున్నాయి. ఈ రైలు సేవలను సెయింట్ థామ స్ మౌంట్ వరకు పొడిగించే పనులు ముగింపు ద శలో ఉన్నాయి. ఎంఆర్టీఎస్ రైలు సేవలు పూర్తి గా వంతెన మీద సాగుతుంది. తాజాగా, చైన్నెలో మెట్రో రైలు సేవల విస్తరణ ప్రయాణానికి మరింత సులభతరంగా మారిన నేపథ్యంలో తాజాగా ఎంఆర్టీఎస్ను మెట్రో రైలు గుప్పెట్లోకి తెచ్చేందుకు కసరత్తులు మొదలయ్యాయి. మెట్రో చెంతకు.. దక్షిణరైల్వే పరిధిలో ఉన్న ఎంఆర్టీఎస్ సేవలను మెట్రో గుప్పుట్లోకి త్వరితగతిన తీసుకునే విధంగా సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. . దీంతో ఎంఆర్టీఎస్ను మెట్రో తన గుప్పెట్లోకి తీసుకున్న పక్షంలో నగరం చుట్టు రైలు సేవలకు ఆస్కారం ఉంది. ఇప్పటికే చైన్నెలో రెండు మార్గాలలో మెట్రో రైలు దూసుకెళ్తోంది. మరో మూడు మార్గాలలో 2027లో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఎంఆర్టీఎస్ను సైతం మెట్రో గుప్పెట్లోకి వచ్చిన పక్షంలో ఇదికూడా ఆధునిక హంగులతో వంతెన మార్గం సేవలకు ఉపయోగ పడ్డట్టే. ఈ దృష్ట్యా, త్వరలో అమలు కానున్న ఒకే టికెట్టుతో చైన్నె ప్రయాణానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని చెప్పవచ్చు. -
చౌక దుకాణ భవనం ప్రారంభం
పళ్లిపట్టు: కీచ్చళంలో చౌక దుకాణం నూతన భవవాన్ని ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. పళ్లిపట్టు యూనియన్ కీచ్చళం గ్రామంలో చౌక దుకాణ భవనాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.16 లక్షలతో నిర్మించారు. కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే చంద్రన్ భవనం ప్రారంభించి వినియోగదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మండల డీఎంకే కార్యదర్శి జి.రవీంద్ర, బీడీఓ అరుల్, ఇంజినీర్ రిషికేష్, డీఎంకే మండల నేతలు ఏకాంబరరాజు, శివానందం, మీసై వెంకటేశన్రెడ్డి, గురున్నాథం, మురళి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో
– 200 మంది టీచర్లు అరెస్టు తిరువళ్లూరు: రాష్త్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయుల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం స్థానిక టోల్గేట్ వద్ద రాస్తారోకో చేశారు. కార్యక్రమానికి ఐక్యవేదిక కోఆర్డినేటర్లు రాజాజీ, బాలసుందరం, రాష్ట్ర కోర్డినేటర్ దాస్ హాజరై ప్రసంగించారు. అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించిన మహిళ టీచర్లు 80 మంది సహా రెండు వందలకు పైగా టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. -
మహాబలిపురంలో ‘భారతీయ మహాచరిత్ర’
కొరుక్కుపేట: మహాబలిపురంలో గల ఒక్కొక్క శిల్పం ఒక్కో చారిత్రిక ఘట్టానికి ప్రతీక అని ప్రముఖ లఘుచిత్ర దర్శకుడు శివకుమార్ అభిప్రాయ పడ్డారు. చైన్నె పట్టాభిరాంలో ఉన్న డిఆర్బీసీసీసీ హిందూ కళాశాలలో ఇండియన్ నాలెడ్జి సిస్టమ్ సెల్ తరపున భారతీయ శిల్పకళా వైభవం మీద ప్రత్యేక కార్యక్రమం గురువారం జరిగింది. భారతదేశంలో ఉన్న శిల్పకళ వైభవం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. అది కూడా 6 వ శతాబ్దానికి చెందిన పల్లవ రాజుల్లో పేరు గాంచిన నరసింహవర్మ పల్లవ రాజు చెక్కించిన మహాబలిపురంలో ఉన్న ఒక్కొక్క శిల్పం గురించి పరిశోధిస్తే అసలైన భారత దేశ చారిత్రక వైభవం ఏమిటో తెలుస్తుందని, తాను కొన్ని శిల్పాలను డీకోడ్ చేస్తే అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని తన పరిశోధన గురించి తెలిపారు. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో ఏ ఐ ద్వారా ఈ శిల్పాల్లో ఉన్న అసలు చరిత్రను డీకోడ్ చేస్తే భారతదేశ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుందన్నారు. ఆ దిశగా తనతో పాటు ఆసక్తి గల విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. మహాబలిపురం శిల్పకళా వైభవాన్ని పవర్ పాయింట్ లో చూపుతూ చేసిన వారి ప్రసంగం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. అనేక శిల్పాలను చూపుతూ వాటి విశేషాలను వివరించారు. ఒక్క శిల్పానికి తాను ఏఐ ద్వారా చేసిన వీడియోను చూపించి విద్యార్థుల, అధ్యాపకుల ప్రశంసలను అందుకున్నారు. విద్యార్థుల ప్రశంసలు అందుకున్న ‘భారతీయ శిల్పకళా వైభవం’ అనే అంశం పైన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సెల్ తరపున నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. కల్విక్కరసి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఐకేఎస్ సెల్ సమన్వయ కర్త ఆర్థిక శాస్త్ర అధ్యాపకురాలు డా. వి. సుజాత ముఖ్య అతిథి శివకుమార్, వారి బందంలో ఉన్న ఇతర సభ్యులకు ఆహ్వానం పలికారు. ఐకేఎస్ సెల్ సభ్యురాలు తెలుగు శాఖ అధ్యాపకురాలు డా. తుమ్మపూడి కల్పన వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు, కలైమామణి మాధవపెద్ది మూర్తి, అనిరుధ్, ప్రతిభ, విస్కాం శాఖాధ్యక్షుడు డా. రఘురావ్ పాల్గొన్నారు. -
భవనాల నిర్మాణాలకు భూమిపూజ
తిరువళ్లూరు: జిల్లా కేంద్రంలో రూ.6.33 కోట్లతో నిర్మించనున్న రెండు వేర్వేరు భవనాలకు రాష్ట్ర మంత్రి నాజర్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రూ.3కోట్లతో పర్యాటక భవనం, రూ.3.33 కోట్లతో నగర అభివృద్ధి సంస్థ భవనాలను నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో భవనాల నిర్మాణాల పనులకు మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ భూమిపూజ చేశారు. మొత్తం 8503.84 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించనున్నట్టు మంత్రి నాజర్ వివరించారు. -
అమ్మవారి ఆలయాల్లో ఆడి సందడి
తిరుత్తణి: ఆడి నెల గురువారం ప్రారంభం కావడంతో అమ్మవారి ఆలయాల్లో సందడి నెలకొంది. ఆడి నెల ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ఉదయం పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పట్టణంలోని ఆర్ముగస్వామి వీధిలోని తణిగై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఉదయం అమ్మవారు చందనపు అలంకరణలో కనువిందు చేశారు. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆడి నెల తొలి శుక్రవారం సందర్భంగా వేడుకలకు ఆలయ నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తణిగాచలమ్మ ఆలయంలో పాటు దుర్గాదేవి ఆలయాల్లో వేడుకగా ఆడి నెల తొలిరోజు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మద్దూరులోని మహిషాసురమర్ధిని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
సూపర్ చైన్నె లక్ష్యంగా డిజిటల్ ఉద్యమం
సాక్షి, చైన్నె : సూపర్ చైన్నె లక్ష్యంగా ప్రత్యేక్ష ప్రసారాల కోసం వెబ్సైట్ను గురువారం ఆవిష్కరించారు. ఇది పట్టణానికి సంబంధించిన కథను చెప్పేడమే కాకుండా, భాగస్వామ్య సంస్కృతి, నగర బ్రాండింగ్లో ఒక పెద్ద ముందడుగు అని సూపర్ చైన్నె ఎండీ రంజీత్ డి రాథోడ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌరుల నేతృత్వంలో సాగే ఒక డిజిటల్ ఉద్యమంగా ఈ వేదిక ఉంటుందన్నారు. సూపర్ చైన్నె అన్నది కమ్యూనిటీ స్వరాలు, నవీకరణ, సాంస్కృతిక కథనాల ఏకీకృత డిజిటల్ వేదికగా నిలుస్తుందన్నారు. దీనికి క్రెడాయ్ చైన్నె మద్దతు ఇస్తున్నదని, సాంకేతిక నిపుణులు, పౌరులు, వ్యవస్థాపకులు,కళాకారులు, తమ వంతు సహకారంతో ముందడుగు వేస్తున్నారన్నారు.ఫెయిర్ ప్రో 2025లో సీఎం స్టాలిన్ సూపర్ చైన్నె లోగోను ఆవిష్కరించారని గుర్తు చేస్తూ ఇప్పుడు చైన్నె ను మెట్రోగా మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరంగా ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ డిజిటల్ వేదిక ముందుకెళ్లనున్నట్టు వివరించారు. పాయింట్ కాస్ట్ బ్రాండ్ ఎవాంజెలిస్టు ఆదిత్య స్వామినాథన్ మాట్లాడుతూ, నగరానికి హృదయ స్పందనను అందించే మార్గంగా పాయింట్ కాస్ట్ ఈ వేదిక ద్వారా ప్రజలకు కొత్త అనుభూతిని అందించనున్నట్టు వివరించారు. సూపర్చైన్నె ఐకాన్ ఆఫ్ది మంత్ అనే నెలవారీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని, ఇది సమాజం, ప్రజల పట్ల ఐకానిక్ ధృక్పథం ఉన్న వారిని గుర్తించి వెలుగులోకి తెచ్చి, అవార్డులను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఐకాన్ ఆఫ్ది మంత్గా తొలి అవార్డును అందుకున్న నేచురల్ సెలూన్ సహ వ్యవస్థాపకుడు సీకే కుమర వేల్ మాట్లాడుతూ, చైన్నె తనను తీర్చిదిద్దిందని, మద్దతు ఇచ్చిందని, స్పూర్తినిచ్చిందని వ్యాఖ్యలు చేశారు. క్రెడాయ్ చైన్నె అధ్యక్షుడు ఎ మహ్మద్ అలీ మాట్లాడుతూ, చైన్నె నగరం సూపర్ చైన్నెగా పెట్టుబడులు, ఆవిష్కరణలకు అత్యంత శక్తివంత గమ్యస్థానాలలో ఒకటిగా, డిజిటల్ ఔట్రీచ్, మీడియా సహకారం, ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్ల మిశ్రమం ద్వారా సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక అవకాశాలు, భవిష్యత్తును చాటనున్నామన్నారు. -
సరిహద్దు చెక్పోస్టులో ఏసీబీ దాడులు
– లెక్కలోకి రాని రూ: 95 వేలు స్వాధీనం వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్పేట వద్ద ఆంధ్ర , తమిళనాడు సరిహద్దులో ఆర్టీఓ చెక్పోస్టు ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు తమిళనాడు పర్మిట్తో పాటూ తగిన సర్టిఫికెట్లతో వాహనం నడుస్తుందా? అనే కోణంలో అధికారులు తనఖీ చేసి పంపుతుంటారు. ఈ చెక్పోస్టులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారుల వద్ద అధికారులు అఽధికంగా నగదు వసూలు చేయడంతో పాటూ వాటికి అవసరమైన రసీదు ఇవ్వడం లేదని వేలూరు అవినీతి నిరోధక శాఖ పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో వేలూరు డీఎస్పీ శంకర్ అధ్యక్షతన ఇన్స్పెక్టర్ మైథిలి, పోలీసులు ఆంధ్ర సరిహద్దులోని క్రిష్టియన్పేట చెక్పోస్టుకు వేకువ జామున 3 గంటల సమయంలో ఉన్న ఫలంగా వచ్చారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే కార్యాలయ గదులు, కిటికీలు పూర్తిగా మూసి వేశారు. అనంతరం అక్కడున్న వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కార్యాలయంలో తనఖీ చేయగా లెక్కలోకి రాని రూ: 95 వేలును నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆంధ్ర నుంచి తమిళనాడులోని మార్కెట్కు తీసుకొచ్చే లారీలో నుంచి కాయకూరలను కూడా లంచంగా తీసుకొని కార్యాలయంలో ఉంచినట్లు తెలిసింది. దీంతో కాయ కూరలతో పాటూ నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ పోలీసులు మాట్లాడుతూ క్రిష్టియన్పేట చెక్పోస్టులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు, టూరిస్ట్ బస్సులు, వాహనాలను నిలిపి నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతోనే ప్రస్తుతం తనఖీలు చేపట్టారని వీటిపై సంబంధిత శాఖకు నివేదిక పంపుతామని వెల్లడించారు. -
ఆ ఇద్దరి కాంబోలో చిత్రం
కమల్ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ తమిళసినిమా: విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటుడు కమలహాసన్ ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో నటించిన ఇండియన్–2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. తాజాగా మరో భారీ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడంలోపాటు కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా స్టంట్ డైరెక్టర్స్ ద్వయం అన్బరివ్లను, దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐని తమిళ చిత్ర పరిశ్రమకు పూర్తిస్థాయిలో పరిచయం చేయనున్నారు.ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కోసం నటుడు ఆ మధ్య అమెరికాలో ఏఐ టెక్నాలజీలో శిక్షణ పొంది వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆగస్ట్లో చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. పూర్తిగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ను ముఖ్యపాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కల్యాణి ప్రియదర్శన్ తమిళసినిమా: కుట్టి స్టోరీస్ పిక్చర్స్ పతాకంపై భువనేశ్ చిన్నస్వామి నిర్మిస్తున్న చిత్రం బుధవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి ఫ్రాంక్స్టర్ రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు ఎంఎస్ భాస్కర్, ఫ్రాంక్స్టర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అరుళ్దాస్, శ్రీనాథ్, శివ అరవింద్, ప్రియదర్శిని, అంజలిరావ్, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ చాయాగ్రహణం, రంజన్రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ విచిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ ఇది కామెడీతో కూడిన హర్రర్, ఫాంటసీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి మెట్రో మురళి, మెట్రో గిరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్ చిత్రంతో చాలా పాపులర్ అయిన భాస్కర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హాస్య నటుడిగా పాపులర్ అయిన ఫ్రాంక్స్టర్ రాహుల్ కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటున్నాయని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు చెప్పారు. -
210 స్థానాలలో గెలుపు తథ్యం
● పళణి స్వామి ధీమాసాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమి 210 స్థానాలలో విజయకేతనం ఎగుర వేయడం తథ్యం అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధీమా వ్యక్తంచేశారు. కడలూరు జిల్లాలో పళణిస్వామి ప్రజా చైతన్యపర్యటన విస్తృతంగా గురువారం జరిగింది. చిదంబరం, కాట్టుమన్నార్ కోవిల్ తదితర ప్రాంతాలలో అనూహ్య స్పందన జనం నుంచి రావడం విశేషం. అలాగే రైతులతో సమావేశాలను పళణిస్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా పళణిస్వామి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం తథ్యమన్నారు. 234 స్థానాలలో 210 స్థానాలలో కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే కూటమిలోకి మరికొద్ది రోజులలో సరైన పార్టీలు వచ్చి చేరబోతున్నారని, ఆ పార్టీలు ఏమిటో ఇప్పుడే చెప్పనని వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల ఓట్లను గురి పెట్టి డీఎంకే రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. డీఎంకే కుటుంబ అరాచకాల నుంచి ప్రజలను రక్షించేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. డీఎంకేను ఓడించడం, స్టాలిన్ను గద్దె దించేందుకే ఈ కూటమి అని వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తాను ప్రజా సేవ, సమాజ సేవలో ఉన్నానని , అన్నాడీఎంకే వేదికగా ప్రజల పక్షాన నిలబడి సేవలు అందిస్తున్నానని పేర్కొంటూ, తమ లక్ష్యం డీఎంకే పతనం అని స్పష్టం చేశారు. తమ అమ్మ పథకాలన్నింటికీ పేర్లు మార్చి, కొత్తగా ఏదో సృష్టించినట్టుగా నాటకాలు ఆడుతూ, ప్రజల్ని మభ్య పెడుతున్న డీఎంకేకు చరమ గీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. -
శివరాజ్కుమార్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్
తమిళసినిమా: కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ ఇప్పుడు దక్షిణాది స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రంలో కీలక పాత్రను పోషించి తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అదేవిధంగా తాజాగా జైలర్–2 చిత్రంలోనూ నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న బహుభాషా చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇడి మన్నల్ కాదల్ చిత్రం ఫేమ్ బాలాజీ మాధవన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో తమిళం, కన్నడం భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. వీరి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రిద్ధిక్ మోషన్ పిక్చర్స్ పతాకంపై సురాజ్ శర్మ, కృష్ణకుమార్, ని.సాగర్ షా కలిసి నిర్మిస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా నటుడిగా నాలుగవ దశాబ్దంలోకి అడుగు పెట్టిన శివరాజ్కుమార్ ఈ చిత్రంలో తొలిసారిగా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్గా నటించనున్నారని, చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. కాగా ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. శివరాజ్కుమార్ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల -
తిరుచ్చి శివ వ్యాఖ్యలపై రచ్చ
● నివాసం ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం ● అరెస్టు చేసిన పోలీసులు ● కాంగ్రెస్కు బీజేపీ, అన్నాడీఎంకే సవాల్ ● సీఎం స్టాలిన్ శాంతి మంత్రం సీఎం టోర్నీ 2025కు సన్నద్ధంసాక్షి, చైన్నె : డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ తిరుచ్చి శివ కర్మయోగి కామరాజర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ వర్గాలు దూసుకెళ్లడంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం డీఎంకే కూటమిలో వివాదానికి దారి తీసింది. కామరాజర్ను అవమానించిన డీఎంకే కూటమి నుంచి వైదొలగేందుకు సిద్ధమా? అని కాంగ్రెస్కు బీజేపీ, అన్నాడీఎంకేలు సవాల్ విసిరాయి. వివరాలు.. కాంగ్రెస్ దివంగత మాజీ సీఎం కామరాజర్ను కర్మయోగిగా, విద్యాప్రదాతంగా తమిళనాట ఆరాదిస్తున్న విషయం తెలిసిందే. కామరాజర్ 123వ జయంతిని మంగళవారం జరుపుకున్నారు. ఈ పరిస్థితులలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎ ంపి తిరుచ్చి శివ కామరాజర్కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా వీడియో వైరల్ అయింది. దీనిపై తొలుత కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి బుధవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో తిరునల్వేలి ఎంపీ రాబర్డ్ బ్రూస్ స్పందించారు. వెన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు తిరుచ్చి శివపై దాడి చేస్తూ వ్యాఖ్యల తూటాలను అందుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ నేత తిరుచ్చి వేలు స్వామి అయితే, తీవ్ర స్థాయిలో శివపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వర్గాల నేతృత్వంలో గురువారం తిరుచ్చి శివ ఇంటి ముట్టడికి గురువారం దూసుకెళ్లారు. ఈ వ్యవహారం కాస్త వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ – డీఎంకే మధ్య చిచ్చు రగిలినట్టుగా పరిస్థితి బయలుదేరింది. కూటమిలో కామరాజర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. అదే సమయంలో చిచ్చును మరింతగా రగిల్చే రీతిలో అన్నాడీఎంకే, బీజేపీ దూసుకెళ్లాయి. కాంగ్రెస్కు సవాల్ కామరాజర్ను అవమానిస్తారా? అంటూ ఓ వైపు అన్నామలైతో పాటూ బీజేపీ నేతలు, మరో వైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణిస్వామి వ్యాఖ్యల తూటాలపై దృష్టి పెట్టారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, నాడర్ల సమాఖ్య నేతలు, పీఎంకే నేత అన్బుమణి సైతం దాడికి దిగారు. కామరాజర్ను అవమానిస్తుంటే, కాంగ్రెస్ చోద్యం చూస్తున్నదంటూ అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కామరాజర్పై నిజంగా గౌరవం అన్నది ఉంటే తక్షణం డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమా అని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. కర్మయోగి మరణం తర్వాత కూడా ఆయన్ను అవమానిస్తారా..? అని పళణి స్వామి శివాలెత్తారు. గతంలో డీఎంకే ఇదే రకంగా కామరాజర్ను అవమానించిందంటూ ఆరోపణలు గుప్పించారు. డీఎంకేకు కాంగ్రెస్ నేతలు బానిసలయ్యారని మండి పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ అప్రమత్తమయ్యారు. ఆయన చేసిన ఓ ట్వీట్తో కూటమిలో వివాదం సద్దుమనిగినట్టైంది. చలి కాచుకునే ప్రయత్నంలో.. గొప్ప నాయకుడు కామరాజ్ అంటూ, సమస్యలను సృష్టించి చలికాచుకనేందుకు దుష్ట శక్తులు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం స్టాలిన్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. గొప్ప నాయకుడిగా కామరాజర్ కీర్తించ బడ్డారని గుర్తు చేస్తూ అప్పట్లో గుడియాత్తం ఉప ఎన్నికలలో ఆయన అభ్యర్థిగా నిలబడ్డ సమయంలో ప్రత్యర్థిని బరిలో దించకుండా డీఎంకే దివంగత నేత అన్నాదురై చర్యలు తీసుకున్నారని వివరించారు. కామరాజర్ మరణించిన సమయంలో ఒక కొడుగా నిలబడి అంతిమ సంస్కరణల ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. కామరాజర్ స్మారక చిహ్నాం ఏర్పాటు, జయంతిని విద్యా దినోత్సవంగా డీఎంకే దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి ప్రకటించారన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా, తన పెళ్లికి స్వయంగా అప్పట్లో కామరాజర్ వచ్చారని, ఇది తన జీవితంలో ఒప్ప వరంగా పేర్కొన్నారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప తమిళుడు గురించి వివాదాస్పద చర్చలు జరపడం సరైనది కాదన్నారు. నాయకుల గౌరవాలను కాపాడే విధంగా అభిప్రాయాలను పంచుకోవాలన్నారు. సామాజిక న్యాయం, లౌకిక సామరస్యం కోసం జీవితాంతం పనిచేసిన ఆ గొప్ప నాయకుడి కలలను నెరవేర్చడానికి అందరం కలిసి పనిచేద్దాం! అర్థరహిత చర్చలకు దూరంగా ఉందాం! అని సూచించారు. తిరుచ్చి శివ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతల ఆందోళన -
తైలాపురంలో పోలీసు విచారణ
2 రోజులలో తేలుతుందన్న రామన్న సాక్షి, చైన్నె: తైలాపురంలో ట్యాపింగ్ పరికరం లభించినట్టుగా వచ్చిన సమాచారంతో విల్లుపురం జిల్లా పోలీసు యంత్రాంగం అదనపు డీఎస్పీ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించింది. సైబర్ టీంతో కూడిన ఈ బృందం గురువారం తైలాపురం గెస్ట్ హౌస్లో తనిఖీలు చేసినట్టు సమాచారం వెలువడింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం పలు ధారావాహికల తరహాలో అనేక ట్విస్టులతో సాగుతున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో ఈ వివాదానికి తెర పడుతుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో రాందాసు నివాసం తైలాపురం గెస్ట్ హౌస్లో ట్యాపింగ్ పరికరం సోఫా కింద లభించడం కలకలం రేపింది. దీనిపై విచారణ చేసే విధంగా డీజీపీకి రాందాసు తరపున ఓ వినతి పత్రం ఈ మెయిల్ ద్వారా పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితులలో సైబర్ క్రైం బృందంతో కూడిన అదనపు డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు తైలాపురంలో తనిఖీలు చేశారు. ట్యాపింగ్ పరికరాన్ని పరిశీలించినట్టు, అక్కడి పార్టీ వర్గాలు, సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కాగా, ఈ ట్యాపింగ్ పరికరం గురించి రాందాసు మీడియాతో మాట్లాడుతూ, ఈ పరికరాన్ని ఎవ్వరు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టారో అన్నది రెండు రోజులలో తేట తెల్లం అవుతుందన్నారు. తాను ఏం మాట్లాడుతున్నానో, ఎవరితో సమావేశాలు నిర్వహిస్తున్నానో అన్న వివరాలను ట్యాపింగ్ చేసి ఎవరికి ఎవరు పంపించారో అన్న సమగ్ర వివరాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. -
అదనపు వసతుల కల్పనకు ప్రణాళిక
● మంత్రులు ఏవా వేలు, శేఖర్బాబు వెల్లడి వేలూరు: తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయానికి భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతుంది. దీంతో భక్తులు స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి, ప్రదోషం రోజుల్లో భక్తులు ఆలయంలో కిటకిటలాడుతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వసతులు చేసేందుకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏవావేలు, దేవదాయశాఖ మంత్రి శేఖర్బాబు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మణివాసగన్, రాష్ట్ర కమిషనర్ శ్రీధర్ గురువారం ఉదయం ఆలయానికి చేరుకొని భక్తులకు అవసరమైన అదనపు వసతుల గురించి ఆరా తీశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభ తరంలో తక్కువ సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గర్భవతులు, దివ్యాంగులు, వృద్ధులు వెళ్లేందు అవసరమైన ప్రత్యేక దర్శన దారి, సాధారణ దర్శనం క్యూ, ప్రత్యేక దర్శన క్యూ తదితర వాటిని తనిఖీ చేశారు. అదే విధంగా భక్తులకు ఆలయంలో అవసరమైన వసతులు కల్పించారా మరిన్ని వసతులు అవసరమా? అనే కోణంలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద ఆలయ దర్శనంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపద్యంలో భక్తులు ద్వరగా దర్శనం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాడ వీధులు, ఉన్నామలైయార్ ఆలయం, అన్నామలైయార్ సన్నిధి, భక్తుల ప్రత్యేక దర్శన టికెట్ కౌంటర్ తదతర వాటిని తనఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తర్పగరాజ్, ఎస్పీ సుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ భరణీదరన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● రూ. 37 కోట్లు కేటాయింపు ● ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం
సాక్షి, చైన్నె: 2025 – సీఎం ట్రోపీ పోటీలకు క్రీడల శాఖ, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీలు సిద్ధమయ్యాయి. ఈ సారి మొత్తం ప్రైజ్ మనీ రూ. 37 కోట్లుగా ప్రకటించారు. సీఎం స్పోర్ట్స్ టోర్నమెంట్ రిజిస్ట్రేషన్లను ఆన్లైన్ ద్వారా గురువారం డిప్యూటీసీఎం, క్రీడల మంత్రి ఉదయ నిధి స్టాలిన్ ప్రారంభించారు. వివరాలు.. భారతదేశ క్రీడా రాజధానిగా తమిళనాడును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని పాఠశాల, కళాశాల విద్యార్థులను క్రీడా పరంగా ప్రోత్సహించే విధంగా 2024లో సీఎం టోర్నీ వివిధ కేటగిరీలు, విభాగాల వారీగా విజయవంతంగా నిర్వహించారు. 2025 సంవత్సరంలో సైతం సీఎం కప్ టోర్నీకి సన్నద్దమయ్యారు. ముఖ్యమంత్రి ట్రోఫీ క్రీడలు – 2025 అన్ని జిల్లాలు , ప్రాంతీయ స్థాయిలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. విద్యార్థులు, వికలాంగులు, ప్రజలు , ప్రభుత్వ ఉద్యోగులు, పురుషులు, మహిళలు అంటూ ఐదు విభాగాలలో పోటీలకు చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో 25 రకాలు, రాష్ట్రస్థాయిలో 37 రకాల క్రీడా పోటీల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. వివిధ క్రీడా పోటీలతో సహా మొత్తం టోర్నీ ఖర్చుగా రూ. 83.37 కోట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్ లు htt pr://-cmtsophy.rdat.in, httpr://rdat.tn.gov.in లలో వ్యక్తిగత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు గురువారం క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జె. మేఘనాథరెడ్డి, క్రీడా విభాగం ప్రతినిధులతో కలిసి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.ఆ న్లైన్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లకు చివరి రోజు ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 గంటలుగా నిర్ణయించారు.విజేతలకు బహుమతుల జోరు రాష్ట్ర స్థాయిలో వ్యక్తిగత పోటీల విజేతలకు మొదటి బహుమతి రూ. లక్ష, రెండవ బహుమతి రూ. 75 వేలు. మూడవ బహుమతి రూ. 50,000 అందించనున్నారు. గ్రూప్ పోటీలలో, రాష్ట్ర పోటీ విజేతలకు మొదటి బహుమతి ఒక్కొక్కరికి 75 వేల రూపాయలు, రెండవ బహుమతి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు, మూడవ బహుమతి ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు అందించనున్నారు. పోటీలలో పాల్గొనే వారికి సర్టిఫికెట్లు, వెయ్యిరూపాయలు ప్రదానం చేయనున్నారు. తమిళనాడు నలుమూలల నుంచి 6 –12వ తరగతి వరకు విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు పేర్లను నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. క్రీడాకారులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల,కళాశాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఇతర వివరాల కోసం ప్రభుత్వ పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పోర్ట్ డెవలప్మెంట్ విభాగంలో సమాచారం సేకరించ వచ్చు అని సూచించారు. అలాగే, ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల మధ్య 9514 000 777 నంబర్కు కాల్ చేసి సంప్రదించవచ్చు అని తెలియజేశారు. -
ముగిసిన ఆణిమాస బ్రహ్మోత్సవాలు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ ఆణిమాస బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం తీర్థవారితో ముగిశాయి. వివరాలు.. అరుణాచలేశ్వరాలయంలో సంవత్సరంలో కార్తీక దీపోత్సవాలు, ఆణిమాసంలో ఆణి బ్రహ్మోత్సవాలు ఈ రెండు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో రోజూ స్వామివారిని ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ పుష్పాలంకరణ మధ్య మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సర ఆణిమాస బ్రహ్మోత్సవాలు ఈనెల 8న ద్వజా రోహణంతో శివాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ స్వామి వారికి పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. ఈ ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో ముగియడంతో శివాచార్యులు గురువారం ఉదయం వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలోని పెద్ద నందీ భగవాన్ సన్నది వద్ద ఉన్న కోనేటిలో స్వామి వారికి తీర్థవారి నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పుష్పాలతో అలంకరించి దీపారాధన పూజలు చేసి భక్తుల దర్శనార్థం ఊరేగించారు. స్వామి వారిని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని అరుణాచలేశ్వురునికి హరో.. హరా... నామస్మరణతో కర్పూర హారుతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ● అరుణాచలేశ్వరాలయంలో భక్తుల రద్దీ -
అప్రమత్తంగా..
● ముందస్తు ఏర్పాట్లపై దృష్టి ● కమిషనర్లతో సీఎం స్టాలిన్ భేటీ ● అప్రమత్తంగా ఉండాలని సూచన సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , నీటి సరఫరా విభాగం నేతృత్వంలో 25 కార్పొరేషన్లు, 144 మునిసిపాలిటీలు ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు ఆశాజనకంగానే ఉంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ, ఈశాన్య సీజన్లో వర్షాలు అధికంగానేఉంటాయన్న సంకేతాలు వెలువడ్డాయి. నైరుతీ సీజన్ మరోరెండున్నర నెలలు ఉన్నప్పటికీ, దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. అదే సమయంలో ఈశాన్య రుతు పవనాలు ఏటా భారీగానే వర్షాలను తీసుకు రావడం, తుపాన్లు , వాయుగండాలు ఎదురు కావడం జరుగుతోంది. దీంతో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో ప్రజలకు అవస్థలు తప్పదు. దీనిని ముందుగానే గ్రహించి ముందస్తుచర్యలపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. అలాగే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో జరుగుతున్న ప్రాథమిక పనులపై సర్వేకు నిర్ణయించారు. విస్తృత స్థాయి సమీక్ష డీప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, మంత్రి కేఎన్ నెహ్రూ, ప్రధాన కార్యదర్శి మురుగానందంతో కలిసి సీఎం స్టాలిన్ మునిసిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లు, అధికారులతో సమీక్ష ఉదయం సచివాలయంలో నిర్వహించారు. తమిళనాడులోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరాలను తెలుసుకున్నారు. ఈ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా, వర్షపు నీటి పారుదల పనులు, తాగునీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులు, రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్కడెక్కడ అంతా వర్షపు నీటి పారుదల పనులు చేపట్టాల్సిన అవశ్యం ఉందో గుర్తించి త్వరితగతిన పనులు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దానిని అమలు చేయాలని కూడా ఆయన గుర్తించారు. పట్టణ స్థానిక సంస్థలో ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా, శుభ్రతా పనులు, వీధిలైట్ల నిర్వహణ పనులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా అమల్లో ఉన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గత 4 సంవత్సరాలలో 8 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 15 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు అభివృద్ధి, మెట్రో, వివిధ ప్రయోజనకరమైన మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టులు,రైల్వే ప్రాజెక్టులు, కొత్త తాగునీటి ప్రాజెక్టులు, మురుగునీటి పారుదల పనులు వంటి వివిధ ముఖ్యమైన ప్రాజెక్టులు అమలు గురించి అధ్యయనం చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు 3,199 ఉద్యోగాలను కార్పొరేషన్లకు భర్తీ నిమిత్తం కేటాయించారు, మునిసిపాలిటీలలో 4,972 ప్రాజెక్టులు ప్రారంభించే విధంగా నిర్ణయించారు.సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఈశాన్య రుతుపవనాల సీజన్లో వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు వివరించారు. చివరి దశలో ఉన్న అన్ని పనులు, సగం పూర్తయిన అన్ని పనులు, విద్యుత్ బోర్డు, నీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విద్యుత్ బోర్డు, హైవేస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ లతో సమన్వయం అవశ్యం అని, ఈ విభాగాల అధికారులు సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే మురికినీటి కాలువలను శుభ్రం చేయించాలని, పూడిక తీత పూర్తి కావాలని, లోతట్టు ప్రాంతాలు, వరదలకు గురయ్యే ప్రాంతాలు ప్రత్యేక ప్రాధాన్యతతో పనులు చేయాలని తెలిపారు. వర్షాల సీజన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అన్నది కలుగకుండా అన్ని ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవడమే కాకుండా, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మున్సిపల్ పరిపాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి టి. ఉదయచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తాగునీరు సరఫరా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కార్తికేయన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్, కార్పొరేషన్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు. -
మీతో స్టాలిన్ శిబిరానికి పోటెత్తిన మహిళలు
పళ్ళిపట్టు: మీతో స్టాలిన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరానికి మహిళలు పోటెత్తారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు అందజేశారు. వివరాలు.. ప్రభుత్వ పథకాలన్నీ ఒకే చోట క్రోడీకరించి సేవలందించే విధంగా 13 శాఖల ద్వారా 46 సేవలు అందస్తున్న మీతో స్టాలిన్ పధకం శిబిరం పొదటూరుపేట టౌన్ పంచాయతీలో గురువారం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న శిబిరంలో టౌన్లోని 18 వార్డుల్లో తొలి విడతలో 9 వార్డులకు సంబందించి ప్రజలు పాల్గొని దరఖాస్తులు అందజేసి ప్రభుత్వ పథకాలు, సహాయకాలు, సర్టిఫికెట్లు అందజేసేందుకు బారులుదీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన శిబిరంలో 467 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే మహిళల పధకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రూ. వెయ్యి ఆర్థిక సాయానికి 750 మంది దరఖాస్తులు అందజేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. ఇందులో టౌన్ పంచాయతీల సహాయ డైరెక్టర్ జయకుమార్, టౌన్ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నె వేదికగా సర్పేస్ అండ్ కోటింగ్ ఎక్స్ పో సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా సీఐఐ 5వ ఎడిషన్గా సర్పేస్ ఇంజినీరింగ్, తయారీ, కోటింగ్, ఫినిషింగ్, తప్పు రక్షణ, పర్యావరణ ఇంజినీరింగ్, సాంకేతికతల ఆవిష్కరణలతో సర్పేస్ అండ్కోటింగ్ ఎక్స్ పో 2025 గురువారం ప్రారంభమైంది. ఎక్స్పో చైర్మన్, హెచ్బీఎన్ఐ వీసీ డాక్టర్ యు. కామాచ్చి మొదలి, సీఐఐ సదరన్ రీజియన్ డిప్యూటీ చైర్మన్ పి రవిచంద్రన్, సీఐఐ తమిళనాడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఏఆర్ ఉన్ని కృష్ణన్లు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. మూడు రోజుల పాటూ జరిగే ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా సర్పేస్ కోటింగ్ పరిశ్రమలోని వాటాదారులు, తయారీ దారులు, పంపిణీ దారులు, సొల్యూషన్ ప్రొవైడర్లు, వర్తకులు, వినియోగదారులు, విధాన రూపకర్తలు తరలి వచ్చారు. 300లకు పైగా ఎగ్జిబిటర్లు స్టాల్స్ను కొలువు దీర్చారు. కేవలం ప్రదర్శనగా కాకుండా, ఈ రంగం ప్రగతి, సాంకేతికతలను అందిపుచుకునే రీతిలో చర్చలు వంటి కార్యక్రమాలను ఈ మూడు రోజుల పాటుగానిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఎక్స్పో ముఖ్యోద్దేశాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థినికి బెదిరింపులు ● యువకుడి కోసం పోలీసుల గాలింపు తిరువొత్తియూరు: పుదుక్కోట్టై జిల్లాకు చెందిన ఆకాష్ అలియాస్ మొహమ్మద్ అబ్దుల్ (21) తిరువొత్తియూర్లోని పెరియార్ నగర్లో నివాసముంటున్న సమయంలో అదే ప్రాంతానికి ఓ విద్యార్థినిని ప్రేమించాడు. ఆ విద్యార్థి అతని అలవాట్లు బాగాలేవని చెప్పి మొహమ్మద్ అబ్దుల్తో స్నేహం మానేసినట్లు తెలుస్తోంది. దీంతో మొహమ్మద్ అబ్దుల్ తన స్వస్థలం పుదుక్కోట్టైకి వెళ్లాడు. ఈనేపథ్యంలో 2 రోజుల క్రితం, మొహమ్మద్ అబ్దుల్ విద్యార్థినికి ఫోన్ చేసి.. నాకు 2 లక్షలు కావాలి, లేకుంటే మన ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ అని బెదిరించాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్థి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు ప్రకారం, తిరువొత్తియూర్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసి మొహమ్మద్ అబ్దుల్ కోసం గాలిస్తున్నారు. బంగారుగుడిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడిని ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా బుధవారం సాయంత్రందర్శించుకున్నారు. ముందుగా బంగారుగుడి అద్వర్యంలో నడుస్తున్న నారాయణి పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కలుసుకున్న ఆమె బంగారుగుడిలోని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి శక్తిఅమ్మను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్బగా పీఠం నిర్వహకులు ఆమెకు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. టీచర్ ఇంట్లో 45 సవర్ల బంగారం చోరీ తిరువొత్తియూరు: విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై సమీపంలోని పలవనాథం వడక్కుపట్టి కి చెందిన సుదర్శన్ పెరియవల్లికులంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య గాయత్రి. వారికి ఇద్దరు కుమారులు, గాయత్రి ఇంటిలో ఆమె పెద్దమ్మ సుబ్బులక్ష్మి ఉన్నారు. సంఘటన జరిగిన రాత్రి వారు ఇంటికి తాళం వేసి మిద్దె పై మీద పడుకున్నారు. ఇంటి లోపల సుబ్బులక్ష్మి ఒక్కరే నిద్రపోతున్నారు. ఆ సమయంలో, ఆమె ధరించిన 3 సవర్లు బంగారు నగలను తీసి సమీపంలో ఉంచింది. మరుసటి రోజు ఉదయం, సుబ్బులక్ష్మి నిద్ర లేచి చూడగా ఆమె నగలు కనిపించలేదు. దీని గురించి గాయత్రికి చెప్పింది. దీంతో గాయత్రి గదికి వెళ్లి బీరువా తెరచి చూడగా చైన్, చెవిపోగులు, ఉంగరం , డాలర్లు సహా 45 సవర్లు నగలు, రూ. 50,000 నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఈమేరకు గాయత్రి దీనిపై బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాపు అటవీ ప్రాంతంలో చిరుత? పళ్లిపట్టు: కాపు అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు తెలియడంతో అటవీ ప్రాంత గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. పళ్లిపట్టు సమీపం నొచ్చిలి, కప్పూర్కండ్రిగ, కాకళూరు ప్రాంతాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఈక్రమంలో బుధవారం సాయంత్రం కాకళూరు నుంచి నొచ్చిలికి వెళ్లే కొండకు మధ్యలోని రోడ్డులో వెళ్లుతున్న వాహనదారులు చిరుతను అటవీ ప్రాంతంలో చూసినట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి పళ్లిపట్టు అటవీశాఖ అధికారులు నొచ్చిలి కాపు అటవీ ప్రాంతంలో చిరుత జాడపై నిఘా పెట్టారు. -
మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో ముందుకు..
కొరుక్కుపేట: ప్రదాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో తాము మరింత ముందుకు సాగుతున్నామని బెర్గ్నర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉమేస్ గుప్తా తెలిపారు. ఈ మేరకు తరపున రీటైల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చైన్నె వేదికగా బెర్గ్నర్ ఇండియా తరపున నగరవ్యాప్తంగా కీలక వాణిజ్య భాగస్వాములను ఒకే చోటు తీసుకుని వచ్చి ప్రత్యేక డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రీమియం కుక్ వేర్ అగ్రగామి అయిన బెర్గ్నర్ ఇండియా భారతీయ వంటశాల అవసరాల కోసం అర్జెంట్ క్లాసిక్ ప్రెషర్కుక్కర్ సిరీస్ను లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత వంటకాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రై ఫ్లై నాన్ స్టిక్ వంటసామగ్రీని తీసుకుని వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే కొత్త సిరీస్లో లీటరు నుంచి 8 లీటర్లు వరకు పరిమాణాలలో ప్రెషర్ కుక్కర్లను తెచ్చామని వెల్లడించారు. నగరంలో చైన్నె పాండిబజార్లోని ఏజీఎస్ హబ్ మార్ట్, పార్కుటౌన్లోని ఎంఏ యుతిరాజులు నాయుడు స్టోర్ల వద్ద ప్రత్యేక బెర్గ్నర్ గ్యాలరీని ప్రారంభించామని పేర్కొన్నారు. -
కందకోట్టం మురుగన్ ఆలయంలో మహాకుంభాభిషేకం
– వేడుకల్లో మంత్రి శేఖర్బాబు కొరుక్కుపేట: చైన్నెలోని పార్కుటౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ కందకోట్టం శ్రీ కందస్వామి ఆలయం అని పిలవబడే శ్రీముత్తుకుమార స్వామి ఆలయం మహాకుంభాభిషేకం బుధవారం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో హిందూధర్మాదాయ శాఖమంత్రి పీకే శేఖర్ బాబు పాల్గొని జెండా ఊపి కుంభాభిషేకాన్ని ప్రారంభించారు. ఈనెల 10వతేదిన విఘ్నేశ్వర పూజ, గణపతి హోమంతో అంగరంగ వైభవంగా కుంభాభిషేక పూజలు ఆరంభమయ్యాయి. ఈనేపథ్యంలో బుధవారం యాగపూజ , ప్రత్యేకధీరవ్య హోమం, మహాపూర్ణాహుతి, దీపరాధన చేపట్టారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు పైగా శివాచార్యులు రాజగోపురం, అన్ని గోపుర కలశాలలను అందంగా అలంకరించి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని మంత్రి శేఖర్ బాబు ప్రారంభించారు. ఈ వేడుకలకు వేలాదిమంది భక్తులు తరలివచ్చి కుంభాభిషేకాన్ని తిలకించారు. పవిత్ర జలాలను భక్తులపై చల్లటంతో పరవశించి పోయారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందించారు. ఇందులో మేయర్ ప్రియ, ఆలయ ధర్మకర్త , విద్యాశాఖ అధిపతి ఏపీ అశోక్కుమార్, విద్యాశాఖ కమిటీ ధర్మకర్తలు కె నందకుమార్ , ఏఎన్ సురేష్ కుమార్ , కార్యదర్శి లక్ష్మణ స్వామి ఉన్నారు. -
రైల్వే ట్రాక్లపై నిత్యం నిఘా
– ఐదు సీసీ కెమెరాల ఏర్పాటు తిరువళ్లూరు: చైన్నె నుంచి మైసూరుకు ఆయిల్ను తీసుకెళుతున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురై భారీ నష్టాన్ని ఏర్పరిచిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 18 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధం కాగా, 8లక్షల 40వేల లీటర్లు ఆయిల్ అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రమాదం కారణంగా మూడు రోజులపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరం చేసి ట్రాక్లను సరి చేశారు. ప్రమాదానికి కుట్ర వుందా అనే కోణంలో విచారణ జరిపిన రైల్వే హైలెవల్ కమిటీ, ట్రాక్లో ఏర్పడిన పగుళ్లే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఈక్రమంలోనే ట్రాక్పై నిత్యం నిఘా వుంచడం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో నాలుగు ట్రాక్ల వద్ద నాలుగు సీసీ కెమెరాలు, లేన్ మార్పు వద్ద ఒక కెమెరాను నిఘా కోసం ఏర్పాటు చేశారు. సంబంధిత సీసీ కెమెరా ఫుటేజీలను నిత్యం పర్యవేక్షణ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ప్రధాని పర్యటనకు తిరుచ్చిలో ఏర్పాట్లు
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై దృష్టి పెట్టే విధంగా బుధవారం తిరుచ్చి విమానాశ్రయం, పరిసరాలలో భద్రతా రిహార్సల్స్ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 27,28 తేదీలలో అరియలూరు, పెరంబలూరు,తంజావూరు జిల్లాలో పర్యటించేందుకు నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన భద్రత కు సంబంధించిన కసరత్తులు మొదలైనట్టున్నాయి. ఇందుకు అనుగుణంగా తిరుచ్చి విమానాశ్రయం, పరిసరాలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన రిహార్సల్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం వర్గాలు, పీఎం భద్రతా విభాగం వర్గాలు, తిరుచ్చి పోలీసు యంత్రాంగంతోపాటూ పెరంబలూరు, అరియలూరు జిల్లాల పోలీసు అధికారులు ఈ భద్రతా రిహార్సల్స్కు హాజరయ్యారు. అలాగే ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన భద్రత గురించి సమీక్షించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. -
పోటీ కాదు.. సహకార యుగం
– డాక్టర్ నచికేత రౌత్ సాక్షి, చైన్నె : ఇది పోటీ యుగం కాదు, సహకారం యుగం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ డైరెక్టర్ డాక్టర్ నచికేత రౌత్ వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎంఐఎస్టీలో బుధవారం ఇండక్షన్ వేడుక జరిగింది. ఇందులో మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ ఫ్యాకల్టీకి ఇన్ కమింగ్ బ్యాచ్ను అధికారికంగా ఆహ్వానించారు. హెల్త్ సైన్సెస్ నుంచి 1,500 మంది ఫ్రెషర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో నచికేత రౌత్మాట్లాడుతూ, ఇది పోటీ యుగం కాదని , సహకార యుగం అని వ్యాఖ్యలు చేశారు.వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు కలిసి నేర్చుకునే సరస్పర అవగాహన ఈ యుగంలో అవశ్యం అని వివరించారు. ఆధునిక ఆరోగ్య సంరక్షణ వైద్యులు, చికిత్సకులు, ఫార్మసిస్టులు, అనుబంధ నిపుణుల సహకారంతో వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యనిపుణులను ఆయన సత్కరించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఎంఐఎస్టీ వీసీ ముత్తమిళ్ సెల్వన్, అలైడ్ హెల్త్ సైన్సెస్ సలహదారు డాక్టర్ బి రాజశేఖర్,డీన్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
భక్తులతో బోయకొండ కిటకిట
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ తల్లి దీవెనల కోసం భక్తులు బోయకొండకు బుధవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. బోయకొండ ఎటుచూసినా జనసంద్రంగా మారింది. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధ వాహనాల్లో తరలివచ్చారు. ఒక్క రోజే 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. -
ఐదుగురిపై గూండా చట్టం నమోదు
తిరువళ్లూరు: నాటుబాంబులతో దాడి చేసి ఒకరిని హత్య చేసిన కేసులో నిందితులు ఐదుగురిపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గ్రామానికి చెందిన ముఖేష్(25) గ్యాస్ డెలీవరి బాయ్. ఈక్రమంలో గత 25వ తేదీన ముఖేష్ ఇంటి వద్ద నిలబడి ఉన్న అతనిపై నాటుబాంబులు విసిరి హత్య చేశారు. మప్పేడు పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో పేరంబాక్కం గ్రామానికి చెందిన ఆకాష్(19), ఇరుళంజేరి గ్రామానికి చెందిన తరుణ్(19), చిన్నమండలి గ్రామానికి చెందిన మనీష్(21), కుమారచ్చేరి గ్రామానికి చెందిన వసంతకుమార్(23), పేరంబాక్కం గ్రామానికి చెందిన సతీష్(22)లను నిందితులుగా గుర్తించారు. ప్రస్తుతం పుళల్ జైలులో వున్న నిందితులపై గూండా చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, కలెక్టర్ ప్రతాప్కు సిఫార్సు చేసిన క్రమంలో నాటుబాంబులను విసిరి ఒకరి హత్యకు కారణమైన ఐదుగురిపై గూండా చట్టాన్ని ప్రయోగిస్తూ కలెక్టర్ ప్రతాప్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మదురైలో విజయ్ మహానాడు
● వేదిక పనులకు శ్రీకారం ● ఆగస్టు 25న నిర్వహణ ● 20 లక్షల మందితో బల ప్రదర్శన?సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. మదురై వేదికగా పార్టీ మహానాడు నిర్వహణకు సిద్ధమయ్యారు. ఆగస్టు 25వ తేదీన ఎన్నికల శంఖారావం పూరించే విధంగా ప్రజలలోకి దూసుకెళ్లనున్నారు. వివరాలు.. పార్టీ ఆవిర్భావంతో గత ఏడాది అక్టోబరులో విల్లుపురం జిల్లా విక్రవాండి వీ సాలై గ్రామంలో తొలి మహానాడును విజయ్ నిర్వహించి, తన సిద్ధాంతాలను స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి సన్నద్దమయ్యే విధంగా తనతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో వాటా ప్రకటన చేశారు. ఆ తదుపరి కోయంబత్తూరులో బూత్ కమిటీ సమావేశాలను రెండు రోజుల పాటుగా విజయవంతం చేశారు. ఇది చైన్నెకు వెలుపల విజయ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలు. రెండు రోజుల క్రితం చైన్నెలో జరిగిన తొలి నిరసనకు విజయ్ హాజరై డీఎంకే, బీజేపీలపై వ్యాఖ్యల దాటి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మదురై వేదికగా మహానాడు నిర్వహణకు నిర్ణయించారు. మదురై వేదికగా.. ఆగస్టు 25న మదురై వేదికగా ఎలియార్ పట్టిని ఎంపిక చేసినట్టు విజయ్ ప్రకటించారు. దీంతో ఇక్కడ బ్రహ్మాండ వేదిక పనులకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇక్కడ పందిరి గుంజం నాటే కార్యక్రమం బుధవారం జరిగింది. ఇందులో పార్టీ నేతలు భుస్సీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలతో ఇక్కడి ఏర్పాట్లకు భూమి పూజ చేశారు. అలాగే, మదురై పోలీసు కమిషనరేట్లో అనుమతి కోరుతూ స్వయంగా భుస్సీ ఆనంద్వినతి పత్రం అందజేశారు. ఈ మహానాడు ఎన్నికల శంఖారావం పూరించే రీతిలో ఉంటుందని, ఇందులో 20 లక్షల మందిని సమీకరించే విధంగా కసరత్తులలో పార్టీవర్గాలు ఉన్నట్టు ఓ నేత పేర్కొన్నారు. కాగా,ఈ మహానాడు గురించి విజయ్ పేర్కొంటూ, ఇది ఒక రాజకీయ బ్రహ్మాండ వేడుక అని, విజయం...విజయం దిశగా అడుగులు వేద్దామని కేడర్కు పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా విజయ్ పార్టీ జెండా విషయంగా ఇప్పటికే వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. బహుజన్ సమాజ్ వాది పార్టీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఎరుపు, పసుపు, ఎరుపు వర్ణాల విషయంగా మరో పిటిషన్ కోర్టులో దాఖలైంది. ఆ వర్ణాలను తొలగించాలని ఓ సభ నేతృత్వంలో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. -
సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్
కొరుక్కుపేట: స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయ్ దేశ్ముఖ్ సాహస వనిత అని కాయిదె మిల్లెత్ కళాశాల విశ్రాంత ఆచార్యులు సుమబాల కొనియాడారు. ఈమె ప్రతీ మహిళకు ఆదర్శనీయం అని అభిప్రాయపడ్డారు దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభలోని దుర్గా స్రవంతి సాంస్కృతిక విభాగం, శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐక్యుఏసి, సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశముఖ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జార్జిటౌన్లోని కేటీసీటీ బాలికల పాఠశాలలో ఏర్పాటు అయిన ఈ కార్యక్రమానికి కాయిదె మిల్లెత్ కళాశాల విశ్రాంత ఆచార్యులు సుమబాల పాల్గొని దుర్గాబాయి దేశముఖ్ గొప్పదనంపై ప్రసంగించి విద్యార్థుల్లో అవగాహన పెంచారు. కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు. కేటీసీటీ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిల స్వాగతోపన్యాసం చేయగా, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ పి. భరణి కుమారి విద్యార్థులకు ఆశీస్సులతోపాటూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గా స్రవంతి కార్యదర్శి చల్లపల్లి భానుమతి, సభ్యులు ఆముక్త మాల్యద, జయశ్రీ, అనురాధ, తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ మైథిలి, ఇతర అధ్యాపక బృందం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థినులు దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర విశేషాలను ఒక నాటక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. -
వేలూరు ఎస్పీ బాధ్యతల స్వీకరణ
వేలూరు: వేలూరు జిల్లా కొత్త ఎస్పీగా మయిల్ వాగనన్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అక్కడ విధులు నిర్వహించిన మదివాణన్ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఆ సమయంలో మొదటి ఫిర్యాదుగా ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తనకు గత ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని అప్పటి నుంచి తన భర్త వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేస్తున్నారని వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ ఈ ఫిర్యాదుపై ఏడు రోజుల్లో విచారణ జరిపి న్యాయం చేస్తామని లేని పక్షంలో ఏడు రోజుల అనంతరం తనను వచ్చి సంప్రదించవచ్చునని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ సమస్యకు అధిక ప్రాదాన్యత ఇచ్చి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
చైన్నెలో మొదటిసారి..
● సూపర్ వీల్డ్ యంత్రం ద్వారా మురుగునీటి తొలగింపు కొరుక్కుపేట: కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో ఆధునిక యంత్రాలను ఉపయోగించి వర్షపు నీటి కాలువల నుంచి వ్యర్థాలను తొలగించడానికి మొట్టమొదటిసారిగా డ్రెడ్జింగ్ ఆపరేషన్ను మేయర్ ప్రియ ప్రారంభించారు. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా, చైన్నె కార్పొరేషన్ ప్రాంతాలలో కొత్త మురుగు నీటి కాలువల నిర్మాణం, మరమ్మతులు, కొత్త చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ మొదలైన వివిధ పనులు చేపడుతున్నారు. కాగా రానున్న ఈశాన్య రుతుపవనాల దృష్ట్యా, చైన్నె కార్పొరేషన్ ప్రాంతాలలో మురుగునీటి కాలువలలోని అవక్షేపాలు, వ్యర్థాలను త్వరగా, పూర్తిగా తొలగించి పారవేయడానికి ఆధునిక సూపర్ సక్కర్ యంత్రాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. తద్వారా రాయపురం మండలం వీకేసంపంత్ రోడ్డులోని వర్షపునీటి కాలువలో ఆధునిక సూపర్ వీల్డ్ యంత్రం ద్వారా నీటిని తొలగించే పనిని మేయర్ ప్రియ లాంఛనంగా బుధవారం ప్రారంభించారు. మానవత్వం చాటుకున్న పోలీసులు ● విద్యార్థిని చదువుకు రూ.50 వేలు సాయం కొరుక్కుపేట: చైన్నె సమీపంలోని తిరుముల్లై వాయిల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. చదువుకొనసాగించడానికి కష్టంగా ఉన్న విద్యార్థినికి రూ.50 వేలు అందజేసి తిరుములై వాయిల్ పోలీసులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాలు.. తిరుముల్లై వాయిల్ స్వరస్వతి నగర్కు చెందిన వెంకటస్వామి కుమార్తె హెప్జిబా చైన్నెలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. కుటుంబ ఇబ్బందులు కారణంగా, ఆర్థిక సమస్యల కారణంగా హెప్జిబా తన కళాశాల చదువును కొనసాగించలేకపోయింది. అయితే ఆమెకు చదువుకోవాలని కోరిక ఉంది. ఈ పరిస్థితిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినిని రక్షించి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తిరుముల్లైవాయిల్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ పేదరికం కారణంగా విద్యార్థిని తన కళాశాల చదువును కొనసాగించలేకపోతున్నట్టు తేలింది. దీంతో తరువాత తిరుముల్లై వాయిల్ పోలీసులు విద్యార్థినికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు విద్యార్థిని హెప్జిబాకు రూ. 50 వేలు ఇచ్చి, తన కళాశాల చదువును ఉత్తమంగా కొనసాగించమని కోరారు . పోలీసుల చేసిన చర్యను అందరూ ప్రశంసిస్తున్నారు. వేలంకన్ని ఆలయంలో వేడుకగా రథోత్సవం తిరువొత్తియూరు: వేలంకన్ని పవిత్ర మాత ఆలయంలో బుధవారం రాత్రి ఉత్తిరియా మాతా రథోత్సవం ఘనంగా జరిగింది. నాగై జిల్లా వేలంకన్నిలో పవిత్ర మాత కేథడ్రల్ ఆలయం వుంది. ఈ ఆలయంలో మహరాష్ట్రకు చెందిన క్రైస్తవ జాలర్లు జరుపుకునే ఉత్తిరియా మాత వార్షిక ఉత్సవం 6వ తేదీన జెండా ఎగురవేయడంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోజూ ప్రత్యేక మతపరమైన సేవలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఉత్సవమైన రథోత్సవం మంగళవారం రాత్రి నిర్వహించారు.ఈ రథోత్సవానికి వేలంకన్ని ఆర్చ్ డియోసెస్ అధ్యక్షుడు హృదయరాజ్ అధ్యక్షత వహించారు. ఆర్చ్ డియోసెస్ నుంచి పవిత్ర ఉతిరియ్య మాత రథోత్సవాన్ని ఆర్చ్ డియోసెస్ ఫాదర్ అర్పుతరాజ్ ప్రారంభించారు. ఉతిరియ మాత, సెబాస్టియన్, ఆంథోనీ నగరంలోని వీధుల గుండా రథయాత్ర జరిగింది. రోడ్డు కు ఇరువైపులా వేలాది మంది క్రైస్తవులు గుమిగూడి ప్రార్థనలు చేశారు. అలాగే బుధవారం ఉదయం వేలంకన్ని కేథడ్రల్లో కొంకణి భాషలో పూజలు నిర్వహించారు. దీని తరువాత, జెండాను అవనతం చేయడంతో ఉత్సవాలు పూర్తవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. 30 నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ సాక్షి, చైన్నె: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీ నిమిత్తం జూలై 30 నుంచి కౌన్సెలింగ్కు కసరత్తు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు. సైదాపేటలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 6 నుంచి 72,243 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల అనుసంధానం తదితర ప్రక్రియలు పూర్తి కాగా, రాండం నెంబర్లు, ర్యాంకుల జాబితాను ప్రకటించనున్నామన్నారు. 20 మంది విద్యార్థులు నకిలీ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్టు పరిశీలనలో తేలింది. సమగ్ర విచారణ మేరకు చర్యలు తీసకుంటామన్నారు. వీరిపై మూడు సంవత్సరాల వరకు నిషేధం విఽధించడం ఖాయం అని హెచ్చరించారు. 25వ తేదీన మెరిట్ జాబితా విడుదలకు, 30 నుంచి కౌన్సిలింగ్కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
బ్లాక్ కాంబో రిపీట్
తమిళసినిమా: ఇంతకుముందు నటుడు జీవా హీరోగా కేజీ.బాలసుబ్రమణి దర్శకత్వం వహించిన బ్లాక్ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మరో చిత్రం రూపొందుతోంది. ఇది నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న 46వ చిత్రం. దీన్ని కేఆర్ గ్రూప్ పతాకంపై కన్నన్ రవి నిర్మిస్తున్నారు. ముత్తుకుమార్ రామనాథన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే చైన్నెలో ప్రారంభమైంది. నటుడు విశాల్, నిర్మాత ఆర్బీ చౌదరి, తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రబియా కధూన్ నాయకిగా నటిస్తున్న ఇందులో బబ్లూ పృథ్విరాజ్, నైలాఉషా, ఆడుగళం నరేన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి ప్రవీణ్ బినాయ్ చాయాగ్రహణంను అందిస్తున్నారు. కథా, కథనాలు కొత్తగా ఉంటాయని, ప్రేక్షకులను అలరించే పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ఇందులో చోటుచేసుకుంటాయని చెప్పారు. ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణల్లో మద్రాస్ ఐఐటీ మేటి
సాక్షి, చైన్నె: ఆవిష్కరణల్లో మద్రాస్ ఐఐటీ మేటి అని వక్తలు అభిప్రాయపడ్డారు. తాజాగా అత్యంత తేలికై న యాక్టివ్ వీల్చైర్ను ఐఐటీ మద్రాసు ఆవిష్కరించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడిన ఈ వైడీ ఒన్, అల్ట్రా–లైట్ వెయిట్, ప్రెసిషన్–ఇంజినీరింగ్ డిజైన్తో తీర్చిదిద్దినట్టు ఐఐటీ మద్రాసు బుధవారం ప్రకటించింది. యాక్టివ్ వీల్చైర్ దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ప్రెసిషన్–బిల్ట్ మోనో–ట్యూబ్ రిజిడ్–ఫ్రేమ్ వీల్చైర్ అని వివరించారు. కేవలం తొమ్మిది కిలో గ్రాముల బరువుతో రూపొందించామని పేర్కొన్నారు. కార్లు, ఆటోలు లేదా ప్రజా రవాణాలో నిర్వహించడం, ఉంచడం సులభతరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సర్జన్ వైస్ అడ్మిరల్ అనుపమ్ కపూర్, డైరెక్టర్ జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ (సాయుధ దళాలు) , ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ కో– ఆర్డినేటర్ డాక్టర్ మనీష్ ఆనంద్; ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ సింగ్ సమక్షంలో వైడీ వన్ ను ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రవంలో అడ్మిరల్ అనుపమ్ కపూర్ మాట్లాడుతూ, శ్ఙ్రీఐఐటీ మద్రాస్ లో, వస్తున్న ఆవిష్కరణలు, ఉత్పత్తులు ఒకొక్కటికి ఒక్కో ప్రత్యేకత ఉందన్నారు. అవి రోజువారీ ఉపయోగం కోసం, అత్యంత అవసరమైన వ్యక్తుల కోసం ఉపయోగ పడుతున్నాయన్నారు. సాయుధ దళాలకు ఐసీఎంఆర్ ద్వారా అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేసినట్లు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ , శ్ఙ్రీమన దేశ శ్రేయస్సుకు సమ్మిళిత సమాజం ప్రాథమికమైనది, దానిని నిర్ధారించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించాలిశ్రీ అని వ్యాఖ్యలుచేశారు. ఈ ప్రయాణంలో నిబద్ధతకు తాజా ఆవిష్కరణ మరో నిదర్శంనగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి టీటీకే సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ హెడ్ ప్రొఫెసర్ సుజాత శ్రీనివాసన్ మాట్లాడుతూ, శ్ఙ్రీ10 సంవత్సరాల క్రితం ఆర్2డీ2 స్థాపించినట్టు, ప్రతిచోటా వీల్చైర్ వినియోగదారులకు సరసమైన ఎంపికలు, స్వేచ్ఛను అందించడానికి స్టార్టప్లతో (మొదటి నియోమోషన్, ఇప్పుడు థ్రైవ్ మొబిలిటీ) కలిసి పనిచేయడం ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. మద్రాస్–ఇంక్యుబేటెడ్ స్టార్టప్ అయిన థ్రైవ్ మొబిలిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుని వీల్చైర్లను స్థానికంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నట్టు వివరించారు. -
క్లుప్తంగా
బాధ్యతల స్వీకరణ కొరుక్కుపేట: కొలత్తూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఎల్.కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అక్కడ పనిచేస్తున్న పాండియరాజన్ బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా నివేదించవచ్చని, ఎవరైనా నేర కార్యకలాపాలకు పాల్పడితే 9498174483ను సంప్రదించవచ్చని చెప్పారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు తిరువళ్లూరు: సహకార సంఘాల ద్వారా నిరుపేదలకు అందించే రేషన్ సరుకుల్లో నాణ్యతతో పాటు కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ కడంబత్తూరులోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించారు. ఎస్టీల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, రోడ్డు నిర్మాణం, సముదాయ భవనంతో పాటు రేషన్ దుకాణాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాలను నాణ్యతగా నిర్ణీత సమయంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించిన కలెక్టర్, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కడంబత్తూరులోని రేషన్ దుకాణంలో నిరుపేదలకు అందించే రేషన్ సరుకుల వివరాలను లబ్ధిదారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సరుకులు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ప్రయాణికులు లేక ఆరు విమానాలు రద్దు కొరుక్కుపేట: ప్రయాణికులు లేక చైన్నె విమానాశ్రయంలో బుధవారం ఆరు విమానాలు రద్దయ్యాయి. సింగపూర్, ముంబయి, అండమాన్లకు విమానాలు నడుస్తున్నాయి. తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో ఈ విమానాలను రద్దు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానాల్లో ప్రయాణించడానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించారు. వారు ఇతర విమానాల్లో ప్రత్యామ్నాయ తేదీల్లో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేశారు. కూవం నదిలో దూకి యువకుడి ఆత్మహత్య అన్నానగర్: చైన్నెలోని నేపియర్ బ్రిడ్జి సమీపంలో కూవం నదిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె మెరీనా కామారాజర్ రోడ్డు సమీపంలో నేపియర్ వంతెన ఉంది. మంగళవారం సాయంత్రం ఈ వంతెన కింద ఉన్న కూవం నదిలో ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లిన వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫోర్డ్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, ఫైబర్ బోట్ ఉపయోగించి కూవం నదిలో ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం కోసం వెతుకుతున్నారు. ముక్కులో తైలం, కర్పూర చూర్ణం ● ఊపిరాడక 8 నెలల శిశువు మృతి తిరువొత్తియూరు: శరీరంపై, ముక్కులో తైలం, కర్పూరం కలిపి రుద్దడంతో ఊపిరాడక 8 నెలల బిడ్డ మృతి చెందింది. వివరాలు.. చైన్నెలోని అభిరామపురంలోని వల్లవన్ నగర్, ఆర్ కె రోడ్ నివాసి దేవనాథన్ (28) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై 8 నెలల కుమార్తె యాలిని ఉంది. ఆ బిడ్డకు 13వ తేదీన తీవ్రమైన జలుబు వచ్చింది. ఫలితంగా నాటు వైద్యం పేరుతో తైలం, కర్పూరం కలిపి ఆ చిన్నారి ఛాతి, ముక్కుపై రుద్దారు. కొంతసేపటి తర్వాత, ఆ బిడ్డకు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దేవనాథన్ వెంటనే తన బిడ్డను రక్షించి, చికిత్స కోసం ఎగ్మోర్లోని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందుతున్న ఆ చిన్నారి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఈ సంఘటన గురించి అభిరామపురం పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు ఆ చిన్నారి తండ్రి దేవనాథన్ను విచారిస్తున్నారు. విద్యుత్ షాక్తో యువకుడి మృతి తిరువొత్తియూరు: తిరువొత్తియూరు జేజే నగర్ పట్టినాత్తర్ కుప్పం ప్రాంతానికి చెందిన సందీప్ (23) వెల్డింగ్ పని చేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే అతను, మంగళవారం సాయంత్రం చైన్నె పుళల్, వెజ్జీ టారియన్ నగర్ పరిసరాల్లోని మాధవరం రాష్ట్ర రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ టీ కాఫీ అమ్మకాల కంపెనీలో పని చేస్తుండగా.. ఇనుప కమ్మీ హై– ఓల్డ్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ షాక్ తగిలి సందీప్ పైకప్పు నుంచి పడి స్పృహ కోల్పోయాడు. ఇది చూసిన సిబ్బంది అతన్ని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మార్గంమధ్యలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సందీప్కు భార్య, ఏడాదిన్నర వయసున్న బిడ్డ వున్నట్టు తెలిసింది. -
రేపే సెంట్రల్
తమిళసినిమా: ప్రముఖ దర్శకుడు, తమిళ్ సినీ దర్శకుల సంఘం కార్యదర్శి పేరరసు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సెంట్రల్. శ్రీరంగనాధర్ మూవీ మేకర్స్ పతాకంపై వియాబియన్ దేవరాజ్, సదా కుమారగురు, తమిళ్ శివలింగం కలిసి నిర్మించిన చిత్రం సెంట్రల్. భారతీ శివలింగం కథ, దర్శకత్వం, పాటలు, మాటలు రాసి కీలక పాత్రలో నటించిన ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ కథానాయకుడిగా నటించారు. సోనేశ్వరి నాయకిగా నటించిన ఈ చిత్రంలో చిత్తా దర్శన్, ఆరుబాలా, గుణ, మెదకు రాజా, అన్బురాణి, కవినిలవన్, ఓమ్ గణేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. వినోద్గాంధీ చాయాగ్రహణం, ఇలా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 18న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో, ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్, ఆర్వీ ఉదయకుమార్ ,డ్రమ్స్ శివమణి చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. చైన్నెలోని సెంట్రల్స్టేషన్ నేపథ్యంలో సాగే డార్క్ స్టోరీ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఇది నిర్మాతల తొలి చిత్రం అని, పూర్తిచేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాతలు ముగ్గురూ ఉపాధ్యాయులేనని చెప్పారు. దర్శకుడు కథ చెప్పడానికి వచ్చినప్పుడే మీది ప్రతినాయకుడి పాత్ర అని చెప్పారన్నారు. దిగువ తరగతి ప్రజల జీవన విధానమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. మరో జాతిని బాధించే కథ కాదన్నారు. అందరూ ఒకటేనని సందేశంతో కూడిన కథా చిత్రం సెంట్రల్ అని పేరరసు తెలిపారు. -
అందరి నోట సంకీర్ణం మాట
సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయ పార్టీలు కొన్ని సంకీర్ణ పాలన నినాదాన్ని అందుకున్నాయి.అన్నాడీఎంకే– బీజేపీ కూటమి పుణ్యమా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అందుకున్న ఈ నినాదం కాస్త తమిళనాట హాట్ టాపిక్గా మారింది. ఓ వైపు అన్నాడీఎంకే కూటమి వైపు చూస్తున్న పార్టీలు ,మరో వైపు డీఎంకే కూటమిలోని కొన్ని పార్టీలు సైతం సంకీర్ణ నినాదంపై పెదవి విప్పేపనిలో పడ్డాయి. అధికారంలోకి వస్తే కూటమి పార్టీలకు ప్రభుత్వంలో వాటా ఇస్తామని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ గత ఏడాది ప్రకటన చేశారు. దీనిని పెద్దగా తమిళ పార్టీలు పట్టించుకోలేదు. అయితే, డీఎంకే కూటమిలోని వీసీకే, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐలు ఇదే అదనుగా రానున్న ఎన్నికలలో అధిక సీట్లను ఆశించనున్నామని, అధిక స్థానాలలో పోటీ చేసి గెలవడమే లక్ష్యం అని ప్రకటిస్తూ వస్తున్నాయి. డీఎంకే కూటమి బలం అన్నది ప్రస్తుతానికి గట్టిగానే ఉంది. అయితే, ఈ సీట్ల పందేరం ఎన్నికల సమయంలో ఎలాంటి చిచ్చు పెడుతుందో వేచి చూడాల్సిందే. అదే సమయంలో అన్నాడీఎంకే – బీజేపీ నేతృత్వంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలుత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ తదుపరి పలు ఇంటర్వ్యూలలో అధికారంలో వాటా తథ్యం,సంకీర్ణ ప్రభుత్వం అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అయితే, తమిళనాడు చరిత్రలో ఇంత వరకు సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం అన్నది రాలేదు. డీఎంకే, అన్నాడీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వాలు కొనసాగాయి. తాజాగా అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో సంకీర్ణం అన్న చర్చ తమిళనాట జోరందుకుంది. అన్బుమణి నోట అదే మాట అన్నాడీఎంకే – బీజేపీ కూటమిలోకి పీఎంకే వస్తుందన్న ఎదురు చూపులు ఉన్నాయి. అస్సలే బీజేపీ సంకీర్ణ నినాదాన్ని అన్నాడీఎంకే ఖాతరు చేయకుండా, తమ నేతృత్వంలోనే కూటమి, తన నేతృత్వంలోనే ప్రభుత్వం, సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటాం అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పష్టం చేస్తూ వస్తున్నారు. బుధవారం కూడా జరిగిన రోడ్ షోలలో ఆయన ఇదే నినాదం అందుకున్నారు. తానే కూటమికి సుప్రీం అని, తాను తీసుకునే నిర్ణయం కీలకం అని స్పష్టం చేశారు.సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదంటూ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటామని పళణి స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం పళణి స్వామి నిర్ణయం కాదు. అమిత్ షా మాటే వేద వాక్కు అని వ్యాఖ్యలు అందుకుంటున్నాయి. ఈ సమయంలో పీఎంకే లో వివాదాలు ఓ వైపు ఉంటే, నేనే అధ్యక్షుడ్ని అని చెప్పకుంటున్న అన్బుమణి బుధవారం చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇంకెన్నాళ్లు అంటూ ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు. పీఎంకే కూడా తమిళనాట బలమైన పార్టీ అని, తమిళనాడు ప్రజలకు రక్షణగా సంకీర్ణ ప్రభుత్వం అన్నది అవశ్యమని వ్యాఖ్యలు చేశారు. అయితే, కూటమి నిర్ణయాలన్నీ తన అధికారాలకు అనుగుణంగానే ఉంటాయని, మరొకరు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదంటూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు స్పందించడం గమనార్హం. అన్బుమణి కొత్త నినాదం నేనే సుప్రీం అంటున్న పళణి కాంగ్రెస్లోనూ చర్చ మౌనంగా డీఎంకే కాంగ్రెస్లో.. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై కూటమి విషయంగా జాగ్రత్తలు పాటిస్తూ, డీఎంకేతో సన్నిహితంగానే ఉన్నారు. అయితే, ఈ పార్టీలోని కొందరు సీనియర్లు అయితే, సెల్వ పెరుంతొగై డీఎంకే అడుగులకు మడుగులు వత్తుతున్నారని అధిష్టానంకు ఫిర్యాదులు హోరెత్తిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, సీనియర్లు పలువురు తిరుచ్చి వేదికగా జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు డీఎంకే కూటమిలో చర్చకు దారి తీశాయి. రానుంది కూటమి పాలన అంటూ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మంత్రులు తప్పని సరిగా ఉంటారని, ఇదే జరగబోతున్నట్టు వ్యాఖ్యల తూటాలను పేల్చడం చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యలు డీఎంకే,కాంగ్రెస్ మధ్య కాస్త చిచ్చు పెట్టే విధంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో కర్మయోగి కామరాజర్ను అవమానించారంటూ డీఎంకే నేతలపై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి విరుచుకు పడటం మరో హాట్టాపిక్గా మారింది. ఈ సంకీర్ణ నినాదం మున్ముందు డీఎంకే కూటమిలో, అన్నాడీఎంకే కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. -
ఆయిల్ లారీ బోల్తా
తిరువళ్లూరు: పెద్దపాళ్యం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఆయిల్ లారీ కాకలూరు వద్ద ప్రమాదానికి గురైంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యంలోని గోదాము నుంచి బెంగళూరుకు 21 క్వింటాల్ ఆయిల్తో లారీ బుధవారం రాత్రి బయలుదేరింది. లారీని వేలూరుకు చెందిన విజయన్(34) నడిపాడు. ఉదయం తిరువళ్లూరు సమీపంలోని కాకలూరు వద్దకు రాగానే లారీ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయమైంది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు క్రేన్ సాయంతో లారీని బయటకు తీశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. -
‘పళణి’కి శాశ్వత విశ్రాంతి!
రాజకీయాల నుంచి.. ● 2026 ఎన్నికల తర్వాత ఆయనకు ప్రజలు బై..బై చెబుతారు ● సీఎం స్టాలిన్ జోస్యం సంక్షేమ పథకాలను అందజేస్తున్న సీఎం స్టాలిన్ ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి శాశ్వత విశ్రాంతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో బై బై..పళణి అన్న నినాదం రాష్ట్రంలో మిన్నంటనున్నట్టు చెప్పారు. ఇక మీతో స్టాలిన్ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదులన్ని సకాలంలో పరిష్కరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.సాక్షి, చైన్నె: ముఖ్యమంత్రి స్టాలిన్ బుధవారం మైలాడుతురై జిల్లాలో పర్యటించారు. ఇక్కడ జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారు. రూ. 48 కోట్ల 17 లక్షల వ్యయంతో పూర్తయిన 47 ప్రాజెక్టులను ప్రారంభించారు.రూ. 113 కోట్ల 51 లక్షల విలువైన 12 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.271 కోట్ల 24 లక్షల విలువైన సంక్షేమ పథకాలను,సలహాయకాలను 54,461 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎం.ఆర్.కె. పన్నీర్సెల్వం, శివ.వి. మెయ్యనాథన్, తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ఢిల్లీ ప్రతినిధి ఎ.కె.ఎస్. విజయన్, ఎంపీ ఆర్. సుధ, శాసనసభ సభ్యులు ఎం. పన్నీర్సెల్వం, నివేద ఎం. మురుగన్, ఎస్. రాజ్ కుమార్, మైలదుత్తురై జిల్లా కలెక్టర్ హెచ్.ఎస్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ పరిష్కారం చిదంబరంలో మీతో స్టాలిన్ పథకం ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో వచ్చే అన్ని ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రకటించారు. మహిళల హక్కు పథకం కోసం లబ్ధిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని, అందరికీ అన్నీ దరి చేరుతాయని స్పష్టం చేశారు. తాను ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేస్తూ, కొత్త పబ్లిసిటీ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు అని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రగతిని చూసి ఓర్వ లేఖ నోటికి వచ్చింది వాగేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందుగా తాను గ్రామ గ్రామాన తిరిగానని, బెడ్ షీట్ మీద కూర్చుని స్వీకరించిన విజ్ఞప్తులను అధికారంలోకి రాగానే, వర్క్ షీట్గా మార్చి వర్క్ ఆర్డర్లతో అమలు చేయించామన్నారు. అయితే, ఆయన పెద్ద మేధావి వలే మాట్లాడేస్తున్నాడని, తమిళనాడు ప్రజలు నా కుటుంబం, వీరి విషయానికి వస్తే ఈ స్టాలిన్ చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. స్వలాభం కోసం పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టేసిన పళణిస్వామి ఇప్పుడు ప్రజలను, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలలో ఉన్నాడని మండిపడ్డారు. పది సంవత్సరాల వైఫల్యానికి మూల్యంగా 2019 నుంచి పళణి స్వామి అన్నీ ఓటములే అని, ప్రజలు ఆయన్న తిరస్కరిస్తూ వస్తున్నారని, 2026లో శాశ్వతంగా ఆయనకు విశ్రాంతి కల్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ధీమా వ్యక్తం వేశారు. ఈ ఎన్నికలలో పళణి...బై..బై అన్న నినాదం మార్మోగ నున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రంగంలో పళణిని నమ్మేందుకు అన్నాడీఎంకే కేడర్ సిద్ధంగా లేదని, తాజాగా అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ సుందరం ట్రావెల్స్ సినిమాను గుర్తు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పొగలు కమ్ముకుంటూ దూసుకెళ్లే బస్సులో కూర్చుని నోటికి వచ్చిన అబద్ధాలను ఆ చిత్రంలో వళ్లించినట్టుగా, ఇప్పుడు పళణి పర్యటన సాగుతోందని చమత్కరించారు. బీజేపీని నమ్మి మోసపోయేది మీరే...ప్రజలు కాదు, ప్రజలకు అండగా ద్రావిడ మోడల్ ఉంది... 2026లో ద్రావిడ మోడల్ 2.ఓ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని వ్యాఖ్యలు చేశారు., శ్రీతమిళనాడు స్టాలిన్ చేతుల్లో ఉంది... సురక్షితంగా ఉంది. స్వార్థ లాభం కోసం ప్రాకులాడే వాళ్లు ఇక్కడ లేరు. అంటూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటు వేశారని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముందుగా మైలాడుదురైలో డీఎంకె దివంగత నేత కరుణానిధి విగ్రహాన్ని స్టాలిన్ ఆవిష్కరించారు. డీఎంకే సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఆ ప్రాంతాలలో ఇంటింటికీ స్వయంగా వెళ్లి సభ్యత్వ పేర్లు నమోదు చేయించారు. కితాబు ఎనిమిది కొత్త వాగ్దానాలు తన ప్రసంగంలో ఎనిమిది కొత్త వాగ్దానాలు ఈసందర్భంగా సీఎం ఇచ్చారు. నిడూరు పంచాయతీలో రూ. 85 కోట్లతో రైల్వే వంతెన నిర్మాణం, తరంగం బాడి – మంగ నల్లూర్ – ఆడుతురై మార్గాన్ని రూ. 45 కోట్లతో విస్తరించనున్నామని ప్రకటించారు. సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటూ పాలు పంచుకుని, స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు స్వామి నాగప్పన్ జ్ఞాపకార్థం మైలాడుతురైలో విగ్రహం ఏర్పాటు, రూ. 7 కోట్లతో కుత్తాలం కెనాల్ పునరుద్ధరణ, తరంగంబాడి సర్కిల్లోని తాజంపేట, వెల్లకోయిల్ గ్రామాలలో రూ. 8 కోట్లతో మౌలిక సదుపాయాల మెరుగుదల, సిర్కాళి మునిసిపాలిటీకి కొత్త భవనం, మత్స్యకారులు సంబంధించి సిర్కాళి సర్కిల్, తిరుముల్లై వాసల్ సముద్రపు అలల తాకిడి నుంచి ఆ పరిసరాలకు రక్షణకల్పించే విధంగా రాతి గోడ నిర్మాణానికి చర్యలుతీసుకోనున్నట్టు చెప్పారు. చైన్నెలోని ఇండియన్ ఇన్స్టిటట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం మేరకు ఈ పనులు మొదలు అవుతాయని చెప్పారు. సిర్కాళి సర్కిల్లో పూంపుహార్ ఫిషింగ్ పోర్టులో డ్రెడ్జింగ్ పనుల రూ. నాలుగు కోట్లతో చేపట్టనున్నట్టు, సిర్కాళి మునిసిపాలిటీలో థెర్ కీజ్ వీధి, అప్పర్ స్ట్రీట్, సౌత్ స్ట్రీట్, నార్త్ స్ట్రీట్లకు ఇరు వైపులా వర్షపు నీటి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. సీఎం స్టాలిన్ ఈ వేడుకలో ప్రసంగిస్తూ మంత్రి శివ వి. మెయ్యనాథన్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పుదుకోట్టై జిల్లాకు చెందిన నేత అయినా, బాధ్యత తీసుకొని ఈ మైలడుతురైను తన సొంత జిల్లాగా భావించి పనిచేస్తూ వస్తున్నారని కితాబు ఇచ్చారు. మైలాడుతురైకు వచ్చేందుకు తనకు నాలుగు గంటలు సమయం పట్టిందని, ఈ మేరకు ప్రజలు దారి పొడవున తనకు అభిమాన ఆహ్వానం పలికారని వివరించారు. ఇక్కడి వీధులలో నడుస్తూ ,ప్రజల్ని పలకరించే సమయంలో వర్షం సైతం పులకరింప చేసిందన్నారు. వర్షంలోనే తన మీద అభిమానం చూపినప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని వ్యాఖ్యలు చేశారు. గత 4 సంవత్సరాల ద్రావిడ మోడల్ పాలనలో ఈ జిల్లాకు రూ. 7 వేల కోట్ల మేరకు అభివృద్ధి నిధులు కేటాయించామని వివరించారు. కొత్తగా ఆవిర్భవించిన ఈ జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయం మొదలు అన్ని రకాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేశామన్నారు. ఈ జిల్లాకు ఏం అవసరమో గురించి, వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. ఈ జిల్లా మత్స్య కారులతోనూ నిండి ఉందని గుర్తు చేస్తూ వనగిరిలో చిన్న ఓడరేవు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమిళనాడు మత్స్యకారులకు భద్రత కల్పించాలంటే కచ్చదీవులను స్వాధీనం చేసుకోవడమే శాశ్వత పరిష్కారంగా పేర్కొన్నారు. తాను ఇప్పటికే పలు మార్లు ప్రధానిని ఈ వ్యవహారంపై కలిసి విన్నవించినా, ఫలితం శూన్యం అని విమర్శించారు. రాజకీయాలు చేస్తున్నారు... కచ్చదీవుల విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. ఒక దేశం మరో దేశంతో ఒప్పందం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఇందుకు సంబంధించిన అధికారం కేంద్రానికి ఉందని వివరిస్తూ 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు కచ్చదీవుల విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ధ్వజమెత్తారు. తమిళనాడులోని ద్రావిడ మోడల్ ప్రభుత్వం నిరంతరం మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
వేలూరు: ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు వెంటనే విచారణ జరిపి పరిష్కరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని నాల్గవ జోన్ కస్పా ప్రాంతంలో జరిగిన మీతో స్టాలిన్ పథకాన్ని ఆమె ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 13 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, ప్రజలు ఇచ్చే వినతులపై అక్కడిక్కడే విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా కార్పొరేషన్లోని అన్ని వార్డుల్లోను, అన్ని గ్రామ పంచాయతీలోను ఈ శిబిరాలు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, మేయర్ సుజాత, జోన్ చైర్మన్ వెంకటేశన్, తహసీల్దార్ వడివేల్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ తగ్గించడానికి బైపాస్
● మొదటి దశ పనులకు రూ.30 కోట్లు ● త్వరలోనే పనులు ప్రారంభం తిరువళ్లూరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరులో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి 9 కిమీ మేరకు బైపాస్ రోడ్డు వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మొదటి దశ పనులు తిరుపాచ్చూర్ నుంచి సేలై వరకు ప్రారంభం కానుండగా, ఇప్పటికే ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. తిరువళ్లూరు చైన్నెకి సమీపంలోని నగరం. జిల్లా కేంద్రంగా ఏర్పాటై 25 సంవత్సరాలు దాటింది. జిల్లా కేంద్రం కావడంతో జనం నిత్యం రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతోపాటు తిరువళ్లూరు సమీపంలో తిరుమళిసై, శ్రీపెరంబదూరు, కాకలూరు సిప్కాట్లు వుండడంతో ఇక్కడికి వెళ్లే భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం రద్దీ: తిరువళ్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు వెయ్యికి పైగా మట్టి, ఇసుక లారీలు వెళుతుంటాయి. దీంతో జేఎన్, సీవీనాయుడు రోడ్డు, మార్కెట్ వీధి, ఆవడి–తిరువళ్లూరు, సెంగుడ్రం–తిరువళ్లూరు రోడ్డులో వాహనాలు బారులు తీరి గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో 13 ఏళ్లుగా బైపాస్ రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఎగువనల్లాటూరు నుంచి తిరుప్పాచ్చూర్ వరకు 9 కిమీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం వేయడానికి 2019లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పనులకు మొత్తం రూ.86.26 కోట్లు కేటాయించగా మొదటి దశ పనులను 5.6 కిమీ పనుల కోసం రూ.30 కోట్లను విడుదల చేశారు. ఈక్రమంలో ఆగస్టు మొదటి వారంలో పనులు ప్రారంభం కానున్నాయి . బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కానున్నాయి. -
పెన్షనర్ల ఆందోళన
వేలూరు: దేశవ్యాప్తంగా పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు పెన్షనర్లు సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఆందోళనకు సంఘం జిల్లా కార్యదర్శి రవి, జిల్లా అధ్యక్షుడు పన్నీర్సెల్వం, కోశాధికారి జ్ఞానశేఖరన్ హాజరై ప్రసంగించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్ణమూర్తి మాట్లాడుతూ పే కమిషన్ సిఫారసులను మినాహాయించే ఫైనాన్స్ బిల్లు వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని, నాలుగు సెట్ల కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పెన్షన్ ఫండ్ రెగ్యులేషన్ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే తిరిగి చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పే కమిషన్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఓకేషనల్ ప్రభుత్వ టీచర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్, సమన్వయ కమిటీ జిల్లా కార్యదర్శి లోకనాథన్ పాల్గొన్నారు. -
చిత్ర ప్రమోషన్ ప్రధానంగా మారింది
తమిళసినిమా: ఎంఎన్ఆర్ పిక్చర్స్ పతాకంపై ఎం.నాగరత్నం నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం వళ్లిమలై వేలన్. ఇళక్కియ నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఎస్.మోహన్ కథ, దర్శకత్వం వహించారు. ఆల్డ్రిన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, దర్శకుడు వి.శేఖర్, సినీ ప్రముఖులు పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు వి.శేఖర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రాన్ని రూపొందించడం సులభమని, ప్రమోషన్ చేయడం ప్రధానంగా మారిందన్నారు. తాము చిత్రాలు చేస్తున్న కాలంలో 250 థియేటర్ల వరకు లభించేవని, ఇప్పుడు పెద్ద చిత్రాలకు 1000 థియేటర్లకం పైగా కేటాయిస్తున్నారని, దీంతో చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదన్నారు. ఈ విధానం మారాలని అన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని దర్శకుడు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు కుమారస్వామి సీజన్ నడుస్తోందని, ఆయన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారని అన్నారు. ఈ చిత్రంలో నటించిన హీరోహీరోయిన్లు కథకు తగ్గట్టుగా ఉన్నారని ఆయన ప్రశంసించారు. తాము చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంటుందనే అభిప్రాయాన్ని చిత్ర నిర్మాత, కథానాయకుడు ఎం.నాగరత్నం వ్యక్తం చేశారు. -
అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కింపు నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 10న పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో సోమవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి వారి సన్నిధి, అమ్మవారి ఆలయం, వినాయకుడి ఆలయం ఇతర ప్రాంతాల్లోని 22 హుండీలలోని భక్తులు వేసిన కానుకలను ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. లెక్కింపులో రూ.4 కోట్ల 73 లక్షల నగదు, 116 గ్రాముల బంగారం, 2,438 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ జెసి తెలిపారు. ఈ నగదును ప్రభుత్వ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. లెక్కింపులో దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ జీవానందం పాల్గొన్నారు. -
రజనీ మాటలను ఆహ్వానిస్తున్నాం !
వేలూరు: పార్టీకి సీనియర్లు ఎంతో ముఖ్యమని నటుడు రజనీకాంత్ చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర సీనియర్ మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలో మీతో స్టాలిన్ పథకాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రసంగించారు. డీఎంకే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సమయంలో పలువురు హేళన చేశారన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం మీతో స్టాలిన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటిలో ఎటువంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరిస్తామని సమస్యత్మాక వినతులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సేలంలో కరుణానిధి విగ్రహంపై నల్లటి కాటుక పూశారని ఇది పద్ధతి కాదన్నారు. ఒక రాజకీయ పార్టీకి, ఒక ఆర్గనైజింగ్కు సీనియర్లు ఎంతో ముఖ్యమని రజనీ చెప్పడం అభినందనీయమన్నారు. దీంతో తాను రజనీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపానన్నారు. అనంతరం పొన్నై, గుడియాత్తం ప్రాంతాల్లో మీతో స్టాలిన్ పథకాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, యూనియన్ చైర్మన్ వేల్మురుగన్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేషన్ జోన్ చైర్పర్సన్ పుష్పలత, కార్పొరేటర్ అన్బు, లోకనాథన్, రవికుమార్, టీటా శరవణన్ పాల్గొన్నారు. -
విద్యార్థినికి లైంగిక వేధింపులు
– వృద్ధుడిపై పోక్సో కేసు పళ్ళిపట్టు: పాఠశాల విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆర్కేపేట మండలానికి చెందిన విద్యార్థిని (13) ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన డేవిడ్(65) ఇంటికి పిలిచి లైంగికంగా వేధించాడు. బాధితురాలు తప్పించుకుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు లైంగిక దాడి విషయం చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరుత్తణిలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ మలర్ డేవిడ్ను పోక్సో చట్టం కింద మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
పళ్లిపట్టు: అత్తిమాంజేరిపేటలో తాగునీటి ఎద్దడికి నిరసనగా మహిళలు మంగళవారం రోడ్డెక్కారు. పళ్లిపట్టు యూనియన్లోని అత్తిమాంజేరిపేటలోని భారతీయార్ నగర్లో 300కు పైగా కుటుంబాలు ఉన్నయి. పంచాయతీ ద్వారా కులాయిల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈక్రమంలో పైపులైన్లు మూడు రోజుల కిందట విరగడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పైపులైన్లు మార్చి తాగునీరు సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆ ప్రాంతం వాసులు కోరారు.అయితే ఇంత వరకు పైపులైన్లు మార్చక పోవడంతో అత్తిమాంజేరిపేట బస్టాండు వద్ద ప్రదాన రోడ్డులో ఖాళీ బిందెలు వుంచి రాస్తారోకో చేపట్టారు. వాహన సేవలకు అంతరాయం చోటుచేసుకోవడంతో పొదటూరుపేట పోలీసులు మహిళలతో మాట్లాడి వెంటనే తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు రాస్తారోకో విరమించారు. -
దినేష్ అన్నీ ఉన్నాయి
అవకాశాల వేటలో ప్రియాంక తమిళసినిమా: ఒక్కోసారి సక్సెస్ఫుల్ నటి అని ముద్ర వేసుకున్నా అవకాశాలు ముఖం చాటేస్తుంటాయి. నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ దక్షిణాది కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె 2019లో కన్నడ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తెలుగులో నాని గ్యాంగ్లీడర్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత తమిళంలో శివకార్తికేయన్కు జంటగా డాక్టర్, డాన్ చిత్రాల్లో వరుసగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా గ్లామర్కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్నారు. ఇలా సూర్యతో ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్ సరసన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఆ మధ్య తెలుగులో నాని సరసన సరిపోదా శనివారం చిత్రంలో నటించి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటిది ఆ తరువాత అవకాశాలు కరువయ్యాయి. నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. అంతే ఆ తరువాత తమిళంలో మరో అవకాశం రాలేదు. తెలుగులోనూ ఓజీ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. దీంతో మడి కట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఉండదని గ్రహించారో ఏమోగానీ గ్లామర్కు తెర రేపింది. తాజాగా వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అందులో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు చోటు చేసుకున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా ప్రియాంకమోహన్ అవకాశాల వేట మొదలుపెట్టారన్నమాట. తమిళసినిమా: రబేకింగ్ పాయింట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం యాదుమ్ అరియాన్. ఎం.గోపి కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ పత్రికాధినేత దినేష్ కథానాయకుడుగా పరిచయం అయ్యారు. నటి ప్రణనైతిక రచించిన ఈ చిత్రంలో విజయ్ టీవీ ఫేమ్ కేపీవై ఆనంద్ పాండి శ్యామన్, అప్పుకుట్టి ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రం ఈనెల 18న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. దర్శకుడు పేరరసు, స్టంట్ మాస్టర్ కణలచ కన్నన్, సౌందరరాజన్, పత్రికల సంఘం అధ్యక్షుడు టీఎస్ సుభాష్, దర్శకుడు ఈవీ.గణేష్, సంపత్రామ్ పాల్గొన్నారు. పేరరసు మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న దినేష్ ఒక పత్రిక అధినేత కుటుంబానికి చెందిన వారిని పేర్కొన్నారు. ఆయనలో నటుడికి కావాల్సిన లక్షణాలని పుష్కలంగా ఉన్నాయన్నాన్నారు. ఇంతకుముందు కాదల్ మన్నన్ ( ప్రేమ రారాజు)గా జెమిని గణేశన్, ఆ తర్వాత కాదల్ ఇళవరసన్ ప్రేమ యువరాజు)గా కమలహాసన్ ఉండేవారన్నారు. ఆ తరువాత ఎవరూ లేరని, ఇప్పుడు ఆస్థానాన్ని దినేష్ పూర్తిచేయడానికి వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఈ చిత్ర దర్శకుడు విజయ్కి వీరాభిమాని అని అందుకే ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ విజయ్ అభిమానులు అయి ఉండాలని భావించి ఉంటారన్నారు. ఈ చిత్రంలో కూడా విజయ్కు సంబంధించిన సన్నివేశాలను పొందుపరిచారని చెప్పారు. -
కాదల్లా సక్సెస్ కావాలి
తమిళసినిమా: శ్రీ కృష్ణ ప్రొడక్షన్న్స్ పతాకంపై మౌళి ఎం.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ఉసురే. అసలు చిత్రం ఫేమ్ టీజే అరుణాచలం బిగ్బాస్ ఫేమ్ జనని జంటగా నటించిన విచిత్రం ద్వారా నటి మంత్ర (తెలుగులో రాశీ) ముఖ్యపాత్రలో రీ ఎంట్రీ అయ్యారు. నవీన్ ది గోపాల్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రానికి కిరణ్ జోష్ సంగీతాన్ని, మార్కీ సాయి చాయాగ్రహణం అందించారు. నిర్మల్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఒకటవ తేదీన విడుదలకు చదమవుతోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ పొందడం విశేషం. ఉసురే చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ విజయకుమార్, కార్యదర్శి పేరరసు, దర్శకుడు సుబ్రమణ్యంశివ , సంగీత దర్శకుడు సత్య, మిర్చిశివ పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. మంత్ర మాట్లాడుతూ తన రీఎంట్రీ మంచి చిత్రంతో కావాలని ఆశించానన్నారు. మిర్చి శివ మాట్లాడుతూ ఇది చిత్తూరులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు వారు చెప్పారన్నారు. కిరణ్ జోష్ చక్కని సంగీతాన్ని అందించారని ప్రశంసించారు. లండన్కు చెందిన తమిళుడైన టీజే అరుణాచలం ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం అన్నారు. బిగ్బాస్ ఫ్రేమ్ జనని ఈ చిత్రం ద్వారా కథానాయకగా పరిచయం అవుతున్నారని ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాదల్ అద్భుతమైన చిత్రమని ఆ చిత్రంలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు మిర్చి శివ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
కొత్త పాస్పోర్ట్ కోరుతూ సీమాన్ పిటిషన్ కొరుక్కుపేట: నామ్ తమిళన్ కచ్చి చీఫ్ కో– ఆర్డినేటర్ సీమాన్ విదేశాలకు వెళ్లేందుకు తన పాస్పోర్ట్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అంతలోనే ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేయడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సీమాన్ పేర్కొంటూ తాను కొత్త పాస్పోర్ట్ కోసం ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారికి దరఖాస్తు చేసుకున్నప్పుడు, నాపై ఉన్న క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ నా దరఖాస్తు తిరస్కరించినట్లు తెలిపారు. రాజకీయ కారణాల వల్ల ఈ కేసులు నమోదు చేశారని, ఈనేపథ్యంలో కొత్త పాస్పోర్ట్ కోసం దరఖాస్తును తిరస్కరించిన పాస్పోర్ట్ అధికారి మణి ఆదేశాల రద్దు చేసి, పాస్పోర్ట్ జారీ చేయాలి అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్, మండల్ పాస్పోర్ట్ అధికారి, నీలంకరై పోలీస్ ఇన్స్పెక్టర్లకు నోటీసులిచ్చింది. కాలువ నిర్మాణానికి భూమిపూజ తిరువళ్లూరు: తిరునిండ్రవూర్ చెరువు నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లడానికి 850 మీటర్ల దూరంతో నిర్మించనున్న కాలువ నిర్మాణ పనులకు మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ మంగళ వారం భూమిపూజ కార్యక్రమాన్ని చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్లో పెద్ద చెరువు వుంది. చెరువు మొత్తం విస్తీర్ణం 350 హెక్టార్లుగానూ కరకట్ట 4,816 మీటర్లుగాను వుంది. ఇక్కడ 149.70 మిలియన్ ఘనపరిమాణం నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ చెరువు నిండితే మిగులు జలాలు చెరువుకు సమీపంలోని పెరియాన్నగర్, ముత్తమిళ్నగర్, కన్నికాపురం, స్వదేశీనగర్లోని నాలుగువేల నివాసాలకు నీరు చేరి నెలల తరబడి ప్రజలు జలదిగ్భందంలోనే వుండాల్సిన పరిస్థితి వుంది. ఈక్రమంలో నివాస ప్రాంతాలకు నీరు రాకుండా కాలువ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 2025–26 సంవత్సరం నిధులతో కాలువ నిర్మాణం కోసం రూ.9.10 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన క్రమంలో మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ భూమిపూజ చేశారు. కాలువను 850 మీటర్ల మేరకు నిర్మించనున్నారు. భూమిపూజ అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ కాలువ నిర్మాణ పనులను వేగంగా, నిర్ణీత సమయంలోపు పూర్తి చేస్తామన్నారు ఏటీఎంలలో నగదు నింపే సంస్థలో రూ.50 లక్షల చోరీ ● పరారీలో ఉన్న ఉద్యోగి కోసం గాలింపు తిరువొత్తియూరు: చైన్నెలోని తేనాంపేట్లోని గిరియప్ప రోడ్డులో సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీ పనిచేస్తోంది. ఇది ఏటీఎం సెంటర్లలో డబ్బు నింపే ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉండగా, శంకర్ అనే వ్యక్తి ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత వారం ఏటీఎం నగదుతో నింపుతున్న సమయంలో మొత్తంలో రూ.50 లక్షల నగదు తక్కువగా వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం గురించి యాజమాన్యం కంపెనీ ఉద్యోగులను విచారించగా, ఆ డబ్బును అత్యవసర అవసరాలకు ఉపయోగించామని, డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ శంకర్ అకస్మాత్తుగా డబ్బు తిరిగి ఇవ్వకుండా అదృశ్యమయ్యాడు. దీంతో ప్రైవేట్ కంపెనీ మేనేజర్ కార్తీక్ తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శంకర్ కోసం గాలిస్తున్నారు. పెన్షన్ రూ.5వేలకు పెంచాలి వేలూరు: దేశవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకంజవేస్తున్నాయని భవణ నిర్మాణ కార్మికుల సంఘం అఖిల భారత అద్యక్షుడు ఆర్టీ పయణి అన్నారు. వేలూరులోని అన్ని కార్మికుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికులకు ప్రస్తుతం రూ.1,200 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, దానిని రూ.5 వేలకు పెంచాలన్నారు. కార్మికులు పలు సంవత్సరాలుగా ప్రభుత్వానికి చందాలు కట్టి సభ్యులుగా చేరితో అతి తక్కువ పెన్షన్ మంజూరు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే దహనక్రియలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘం మాజీ అద్యక్షుడు నారాయణన్, సంక్షేమ బోర్డు సభ్యులు మహేశ్వరన్, శివానందం, రీజినల్ అధ్యక్షులు భాస్కరన్, కార్తికేయన్, జిల్లా ఆర్గనైజర్ ఉమాశంకర్, వేల్మురుగన్ పాల్గొన్నారు. సురక్షిత డ్రైవింగ్కు చర్యలు సాక్షి, చైన్నె: వర్షా కాలంలో సురక్షిత డ్రైవింగ్ నిర్ధారించే విధంగా ఉచితంగా 40 పాయింట్లలో వాహనాల తనిఖీలకు చర్యలు తీసుకున్నామని వోక్స్ వ్యాగన్ ఇండియా మంగళవారం స్థానికంగా ప్రకటించింది. భద్రతకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే విధంగా నమ్మకంగా డ్రైవ్ చేయడానికి మాన్సూన్ సర్వీస్ క్యాంప్నకు శ్రీకారం చుట్టామని వివరించారు. వినియోగదారుల భద్రతను వర్షాకాలంలో ధ్రువీకరించే రీతిలో వాహన సంరక్షణ, సేఫ్ డ్రైవింగ్, కీలమైన బ్రేక్లు, టైర్లు, లైటింగ్ వ్యవస్థల తనిఖీలు వంటి అంశాల కోసం ప్రత్యేకంగా పాయింట్లను ఏర్పాటు చేశామని, వర్షాల సీజన్ అంతటా ఈ సేవలు సాగుతాయని డైరెక్టర్ నితిన్ కోహ్లి తెలిపారు. -
ఘనంగా కామరాజర్ జయంతి
తిరుత్తణి: కాంగ్రెస్ నేత, దివంగత మాజీ సీఎం కామరాజర్ నాడార్ 123వ జయంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం తిరుత్తణి నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని కామరాజర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు రామకృష్ణన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ త్యాగరాజన్, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్, పళ్లిపట్టులో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ నివాళులర్పించారు. పాఠశాలల్లో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: కామరాజర్ జయంతిని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కామరాజర్ విగ్రహానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు ఆనందన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్దాస్, ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేషన్, నగర అధ్యక్షుడు స్టాలిన్, వడివేలు పాల్గొన్నారు. అదేవిధంగా కామరాజర్ విగ్రహానికి బీజేపీ, నామ్తమిళర్, డీఎంకే, అన్నాడీఎంకే నేతలు సైతం నివాళులర్పించారు. ఎస్కేపీడీలో.. కొరుక్కుపేట: చైన్నె జార్జి టౌన్లోని ఎస్కేపీడీ బాలుర మహోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మైలాపూర్ డీజీపీ ఆఫీస్ క్యాంపస్లోని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ టి. శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె జెమిని మాజీ అధ్యక్షుడు ఎ. వెంకటకృష్ణన్ విచ్చేసి కామరాజర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్ఎం లీలారాణి, సుజాత పాల్గొన్నారు. -
విజయవంతంగా మాస్కో సమ్మర్ వేడుక
సాక్షి, చైన్నె: సమ్మర్ ప్రాజెక్టు వేడుకలను విజయవంతంచేశామని మాస్కో నగర పర్యాటక కమిటీ మంగళవారం స్థానికంగా ప్రకటించింది. భారతీయ పర్యటకులను ఆకర్షించే విధంగా జూలై 3 నుంచి 13వ తేదీ వరకు మానేజ్నాయ స్క్వేర్ వేదికగా ఈ వేడుకలు జరిగినట్టు పేర్కొన్నారు. చేతి వృత్తి దారులను ప్రోత్సహించే విధంగా, భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిచయంచేసే రీతిలో ఈఉత్సవం విజయవంతంగా జరిగినట్టు వివరించారు. 500లకు పైగా జరిగిన కార్యక్రమాలలో 150 మందికి పైగా కళాకారులు, ప్రదర్శనలు ఇచ్చారన్నారు. మాస్కో నగర పర్యాటక కమిటీ అంతర్జాతీయ రంగంలో కూడా కీలకమైన పర్యాటక గమ్యస్థానంగా ముద్ర వేసుకుంటోన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలను 82,500 మంది తిలకించినట్టు వివరించారు. -
వేడుకగా గౌరవ డాక్టరేట్ల ప్రదానోత్సవం
● నటి సంచితా శెట్టికి గౌరవ డాక్టరేట్ కొరుక్కుపేట: కోయంబత్తూరు వేదికగా అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారతదేశం అంతటా ఉన్న అత్యుత్తమ వ్యక్తులను, వివిధ రంగాలలో వారి అసాధారణ కషికి గాను పలువురిని గౌరవ డాక్టరేట్ లతో సత్కరించారు, ఇండియన్ మీడియా వర్క్స్ ఎండి జాన్ అమలన్ సిఫార్సుపై, యూకే లోని కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ డిస్టెనన్స్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా ఉన్న సెయింట్ మదర్ థెరిసా విశ్వవిద్యాలయం (ఆస్ట్రేలియా) ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్లను అందజేసింది. ఈ వేడుకకు డాక్టర్ లీమా రోజ్ మార్టిన్ హాజరయ్యారు. ఇందులో చైన్నెకి చెందిన ప్రముఖ నటి సంచితా శెట్టి, మెజెంటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ రాఖీ షా, గోవాకు చెందిన నిర్భయ సామాజిక కార్యకర్త తారా కేర్కర్, కోయంబత్తూరుకు చెందిన సామాజిక వ్యవస్థాపకురాలు, జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఆర్టీఎన్ అపర్ణ సుంకు, పంజాబ్ తమిళన్ఙ్ అని పిలువబడే హర్ప్రీత్ సింగ్ ఆనంద్ అలియాస్ టోనీ సింగ్, గ్రాఫిక్సైట్ వ్యవస్థాపకురాలు, 26 ఏళ్ల స్మృతి, గోవాలోని టాలెంట్ హంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ జీటీలకు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇండియన్ మీడియా వర్క్స్ నిర్వహించిన కార్యక్రమం వేడుకగా సాగింది. డాక్టరేట్ అందుకున్న వారిని పలువురు అభినందించారు. -
తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆవణి నెల చివరి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం అనువైన రోజు కావడంతో పాటు ఆవణి నెల చివరి మంగళవారం సందర్భంగా వేకువజామున మూలవర్లకు అభిషేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి దీపారాధన పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు రాక పెరగడంతో కొండ ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉచిత దర్శన క్యూలలో మూడు గంటల పాటు, రూ. వంద ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటలు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. ఎండల తీవ్రత నేపఽథ్యంలో ఆలయం ద్వారా భక్తులకు తాగునీరు సరఫరా చేయడంతో పాటు ఉదయం ప్రసాదాలు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 35 వేల మంది భక్తులు స్వామి సేవలో పాల్గొన్నారు. గురువారం ఆడి నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండ ఆలయంకు భక్తులు తాకిడి విపరీతంగా పెరగనున్న క్రమంలో ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. -
సర్వాతో బీమా సేవలు విస్తృతం
సాక్షి,చైన్నె: సర్వాతో ఆరోగ్య బీమా సేవలను విస్తృతం చేశామని, అవార్డును సైతం గెలుచుకున్నామని మనిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెంటింగ్ఆఫీసర్ సప్నా దేశాయ్ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఆసంస్థ ముఖ్య నిర్వాహకులు ఆశీష్ యాదవ్, తర్వేజ్ మహ్మద్లతో కలిసి 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సాధించిన 30 శాతం ప్రీమియం వృద్ధి, తమిళనాడులో జనవరి నుంచి మే వరకు జరిగిన కార్యకలాపాలలో 52 శాతం సర్వా వాటా, ఎఫ్వై 25లో తమిళనాడులో 11 లక్షలకు పైగా జీవితాలకు కవర్ చేసే విధంగా కార్యక్రమాలు, రాష్ట్రంలో 18 కార్యాలయాల ద్వారా 7 వేల మంది బీమా సలహాదారుల పరిధిని విస్తృతం చేయడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాలను మీడియాకు సప్నా దేశాయ్ వివరించారు. సర్వా ఆరోగ్య సంరక్షణకు తోడ్పాటు బీమాగా మారిందని ప్రకటించారు. సర్వా ఉత్తమ్ అనంత్, సర్వా పరమ్ డే, సర్వా ప్రథమ్ వినియోగదారులకు ఆరోగ్యపరంగా, అత్యవసర సేవల పరంగా అండగా నిలుస్తుందన్నారు. రానున్న రోజులలో తమిళనాడులో సర్వా బీమా సేవలను విస్తృతం చేస్తున్నామని, ఇందులోభాగంగా లోగోను ఆవిష్కరించినట్టు పేర్కొన్నారు. -
“నేను నిన్ను విడిచి ఉండలేను.. నేను నీ దగ్గరకు వస్తున్నాను’
ధర్మపురి సమీపంలో తన భర్త మరణ బాధను తట్టుకోలేక ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని కడ్తూర్ సమీపంలోని తలనాథం గ్రామానికి చెందిన తీతు కుమారుడు దీపమలై (26) ఇంజనీర్. పుట్టిరెట్టిపట్టికి చెందిన గీత (21) ల్యాబ్ టెక్నీషియన్. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారు పాఠశాల రోజుల నుంచి స్నేహితులు, చివరికి ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం వారి ఇద్దరి తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. వ్యతిరేకత కారణంగా, వారు ఒక సంవత్సరం క్రితం వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని నెలలుగా దీపమలై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. తాను చనిపోతానని భావించి, తన ప్రేమ భార్య నుంచి విడిపోయి, ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి జీవించమని చెప్పాడు. దీని కారణంగా గీత రెండు నెలల క్రితం తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఇంతలో ఆరోగ్యం క్షీణించిన దీపమలై గత 29వ తేదీన మరణించాడు. తన భర్త మరణం తర్వాత గీత మానసిక వేదనకు గురైంది. ఈ పరిస్థితిలో గీత ఇన్ స్ట్రాగామ్లో “నేను నిన్ను విడిచి ఉండలేను. నేను నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేసి, ఇంట్లోని ఎలుకల మందు తాగి మరణించింది. కడత్తూర్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీని తరువాత, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు దీపమలై మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశానికి సమీపంలోనే అతని గీత మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. -
నవవధువు చికెన్ తినలేదనే మనస్తాపంతో..
తమిళనాడు: వెల్లకోవిల్ సమీపంలో భార్య చికెన్ తినడానికి నిరాకరించిందని నవవరుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలూకాలోని సక్కోట్టై ప్రాంతానికి చెందిన మణికంఠన్ (29 ). ఇతను ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేటప్పుడు, అతనితో కలిసి పనిచేసే సుబలక్ష్మి (25)తో ప్రేమలో పడ్డాడు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులను ధిక్కరించి, వారిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో, వారు తిరుప్పూర్ జిల్లా వెల్ల కోవిల్ పుత్తూరులోని సుబలక్ష్మి సోదరి మేనక ఇంట్లో నివసించారు. ఈ స్థితిలో, మేనక, ఆమె భర్త ఆలయ ప్రత్యేక కార్యక్రమానికి తిరుచ్చికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఉన్న మణికంఠన్ దుకాణం నుంచి చికెన్ కొని తన భార్యను తినమని అడిగాడు. తన సోదరి గుడికి వెళ్లినందున ఇంట్లో చికెన్ తినడానికి ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనితో ఆగ్రహించిన మణికంఠన్ తన ఇంటి బయట ఉన్న ఇనుప కడ్డీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతన్ని రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మణికంఠన్ మృతి చెందినట్లు ప్రకటించాడు. -
క్లుప్తంగా
నమ్మ హెల్త్ కార్డ్ ఆవిష్కరణ సాక్షి, చైన్నె: ఎంజీఎం హెల్త్ కేర్ నేతృత్వంలో నమ్మ హెల్త్ కార్డ్ను రూపకల్పన చేశారు. మహిళలకు ప్రత్యేకంగా ఉచిత మాస్టర్ హెల్త్ చెక్తోపాటూ ఆరు ప్రత్యేక ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా కల్పించనున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ కార్డును అన్నా నగర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బి. స్నేహప్రియ ఆవిష్కరించారు. ఎంజీఎం హెల్త్ కేర్ ఎండీ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాలన్ కార్డును అందుకున్నారు. ఈ కార్డు ప్రయోజనాల గురించి డాక్టర్ ప్రశాంత్ వివరిస్తూ ఈ కార్డు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా పేర్కొన్నారు. కార్డు దారులకు ప్రత్యేక ప్రయోజనాలుగా ఔట్ పేషెంట్ కన్సల్టేషన్, డయాగ్నస్టిక్ పరీక్షలు, ఫార్మసీ బిల్లులు, ప్రీమియం హెల్త్ చెక్ ప్యాకేజీలపై భారీ తగ్గింపు కల్పిస్తున్నామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఉచిత మాస్టర్ హెల్త్చెక్ చేయనున్నామన్నారు. తమ హెల్త్ కేర్ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రయోజనాలతోపాటుగా 10 కి.మీ దూరం పరిధిలో ఉచిత అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టామన్నారు. యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్టు తిరువొత్తియూరు: పుట్టినరోజు వేడుకలకు స్నేహితుడిని తీసుకెళ్లి కత్తులతో దాడి చేసి హత్య చేసిన నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన చైన్నెలోని వ్యాసర్పాడి ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్కు చెందిన పుదు నగర్ 7వ వీధిలోని కుమార్, చిత్ర దంపతుల కుమారుడు శంకర్(19), కుమార్తె వనిత(17) ఉన్నారు. శంకర్ సైదాపేట కళాశాలలో చదువు మధ్యలో మానేసి, మెకానిక్ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని పుట్టినరోజు కావడంతో అతనితో పాటు కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం వచ్చి కేక్ కట్ చేసేందుకు శంకర్ను తీసుకెళ్లారు. దీని తర్వాత వారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తరువాత ఎరుకంచెరి ప్రాంతంలోని గ్రౌండ్లో అందరూ ఫుట్బాల్ ఆడారు. ఆ సమయంలో హఠాత్తుగా శంకర్కు అతని స్నేహితుడు ధనరాజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో స్నేహితులు కలిసి శంకర్పై కత్తులతో దాడి చేసి పారిపోయారు. తీవ్రగాయాల పాలైన శంకర్ అదే చోట మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న కొడుంగైయూర్ ఇన్స్పెక్టర్ శరవణన్ నేతృత్వంలోని పోలీసులు సోమవారం ఉదయం వెళ్లి శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ధనరాజ్, విజయ్, లింగేష్, నితిన్ అనే నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. గుండెపోటుతో వరుడి మృతి తిరువొత్తియూరు: చైన్నె, కీలాంబాకం ప్రాంతంలో సినిమా చూస్తున్న సమయంలో నవ వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. చైన్నె మందవెలి ఎస్బీఐ కాలనీకి చెందిన మెల్లివిన్(29) ఎగ్మోర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య గాయత్రి. వీరికి ఒక నెల క్రితం వివాహం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో నూతన వధూవరులు మోటార్ సైకిల్పై కీలంబాక్కం దగ్గర ఓఎంఆర్ రోడ్డులో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్లారు. అక్కడ షాపింగ్ చేసి, థియేటర్లో సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తున్నప్పుడు మెల్లివిన్కు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. దీంతో షాక్ అయిన గాయత్రి థియేటర్లో ఉన్నవారి సహాయంతో తన భర్తను చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మెల్లివిన్కు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ఇది విన్న గాయత్రి బోరుమని విలపించారు. దీనిపై సమాచారం మేరకు కీలంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకుని మెల్విన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. మెల్విన్ గుండె పోటుతో మృతి చెందాడా లేక మాల్కు వచ్చినప్పుడు అతను ఎలాంటి ఆహారం తిన్నాడు, ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఫలితాల ఆధారంగా తదుపరి దశ దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. యువకుడి హత్య తిరువొత్తియూరు: స్థలం విషయంలో జరిగిన వివాదంలో గునపంతో దాడి చేసి యువకుడిని హత్య చేసిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణంబందనల్లూర్ వేడమంగళం సౌత్ రోడ్కు చెందిన బాలయ్య అతని కుమారుడు వెట్రివేల్(30) ఇతని చిన్నాన్న అజాకర్(50). సమీపంలో నివశించే రెండు కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి గొడవ జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఆదివారం రాత్రి భూమి సమస్యకు సంబంధించి అళగర్ వెట్రివేల్ మధ్య వాదన జరిగింది. దీనితో కోపంగా ఉన్న అళగర్ అతని కుమారులు విఘ్నేష్, చంద్రు వెట్రివేల్పై గునపంతో దాడి చేశారు. దీనిని అడ్డుకున్న వెట్రివేల్ బావమరిది సురేష్పై కూడా దాడి జరిగింది. ఇందులో గాయపడిన వెట్రివేల్ను కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెట్రివేల్ మృతి చెందినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన సురేష్ను తదుపరి చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి అళగర్, చంద్రులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విఘ్నేష్ కోసం గాలిస్తున్నారు. -
శివకాశిలో మెరుపు సమ్మె!
సాక్షి, చైన్నె : విరుదు నగర్లో జిల్లాలో ఇక మీదట ఒక్క బాణసంచా ప్రమాదం జరగడానికి వీలు లేదని గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించిన నేపథ్యంలో బాణసంచా పరిశ్రమల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. అధికారుల తనిఖీలకు భయపడి మెరుపు సమ్మె అంటూ బాణసంచా పరిశ్రమలను సోమవారం మూసి వేశారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాలు బాణా సంచాల తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజలకు వందలాదిగా ఉన్న బాణసంచా పరిశ్రమలలో కూలి పనులే దిక్కు. అదే సమయంలో నిత్యం ఇక్కడ ప్రమాదాలు సైతం తప్పడం లేదు. ఈ ఆరు నెలలో సుమారు 10కి పైగా ప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్ది మరిన్ని ప్రమాదాలు తప్పదేమో అన్న ఆందోళన నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గతవారం ఈ ప్రమాదాలపై దక్షిణ భారత గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. విరుదునగర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒక్కటంటే ఒక్క ప్రమాదం జరగడానికి వీలు లేదని హెచ్చరించింది. పది రోజులలలో ఇక్కడున్న అన్ని పరిశ్రమలలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం, పేలుడు పదార్థాల క్రమబద్ధీకరణ విభాగం అధికారులతో కూడిన మరో బృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇక్కడ కార్మికులకు ఉన్న భద్రత, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చేపట్టిన చర్యలను సమగ్రంగా పరిశీలించి నివేదికలను సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అధికారులు రంగంలోకి దిగారు. పరిశ్రమలలో తనిఖీలపై దృష్టి పెట్టారు.అ దే సమయంలో సుమారు 200 పరిశ్రమలు సోమవారం మూసి వేశారు. తమ డిమాండ్ల పరిష్కారం అంటూ ఆయా సంస్థలు సమ్మెనినాదం అందుకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. రోజు వారీ కూలీలనిమ్తితం పనులకు వచ్చేవారిలో ఆందోళన బయలుదేరింది. కాగా, అధికారుల తనిఖీలకు భయపడే ఈ నాటకం ఆడుతున్నారన్న ఆరోపణలు బయలుదేరాయి. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు లేని దృష్ట్యా, సమ్మె గంట అంటూ ఆయా పరిశ్రమలు మూసి వేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అధికారులకు భయపడి మూత -
భక్తజన సాగరం.. తిరుప్పరకుండ్రం
సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో మహాకుంభాభిషేక వేడుక సోమవారం ఘనంగా జరిగింది. భక్త జనుల హరోం హర నామస్మరణ నడుమ మహోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలోని మురుగన్ ఆరుపడై వీడులలో మొదటి ఆలయంగా తిరుప్పరకుండ్రంప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే.ఇక్కడ గత కొన్నేళ్ల అనంతరం మహాకుంభాభిషేకానికి హిందూ, దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది. గత వారం రోజులుగా యాగ శాలలో పూజలు నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఆలయం ఆవరణలో భక్తుల హరోం..హర నామస్మరణ మార్మోగింది. ప్రత్యేక యాగాలు, పూజలు జరిగాయి. సోమవారం వేకువ జామున మూడున్నర గంటల నుంచి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకు యాగశాల నుంచి పవిత్ర జలాలను కలశాలలో ఉంచి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 5.25 గంటలకు రాజగోపురంలోని 7 కలసాలకు పవిత్ర అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రులు శేఖర్ బాబు, మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. సరిగ్గా 6.10 గంటలకు మురుగన్ సన్నిధిలో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున జన సందోహం తిరుప్పర గుండ్రంకు తరలి రావడంతో ఆ పరిసరాలు హరోం..హర నామస్మరణలో మునిగాయి. ఈ ఉత్సవం నిమిత్తం మధురై నుంచి మీనాక్షిఅమ్మవారు, సుందరేశ్వర స్వామి వారు తరలి రావడం విశేషం. స్వామి అమ్మవార్లను, వళ్లి దేవానై సమేత మురుగన్ను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. మహోకుంభాషేకానికి తరలి వచ్చిన భక్తులపై డ్రోన్ల ద్వారా పవిత్ర జలాలను చల్లారు. భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ● ఘనంగా మహా కుంభాభిషేకం జెండా ఊపుతున్న మంత్రులు శేఖర్బాబు, మూర్తి -
సెప్టెంబర్ 4న మదురైలో బల నిరూపణ
– పన్నీరు శిబిరం నిర్ణయం సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం సెప్టెంబర్ 4న మదురై వేదికగా తన బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినానంతరం ఆ పార్టీని కై వసం చేసుకునేందుకు పన్నీరు సెల్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలలో బీజేపీ కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న పన్నీరు సెల్వంకు తాజాగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపిన నేపథ్యంలో తదుపరి రాజకీయ ప్రత్యామ్నాయం మీద పన్నీరు శిబిరం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సోమవారం చైన్నెలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో బలాన్ని చాటే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మద్దతు దారులను ఏకం చేయడం, కార్యక్రమాలను విస్తృతం చేయడంతోపాటుగా సెప్టెంబర్ 4వ తేదీన మదురై వేదికగా బల నిరూపణ దిశగా భారీ కార్యక్రమానికి తీర్మానించారు. ఇక్కడ జరిగే భారీ కార్యక్రమంలో తమ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను చాటే దిశగా ముందుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధంచేశారు. మీడియా సంధించిన ప్రశ్నకు పన్నీరు సెల్వం సమాధానం ఇస్తూ అన్నాడీఎంకే నుంచి ఆహ్వానం వస్తే చేరేందుకు సిద్ధమన్నారు. తనకు ఏ పదవీ వద్దు అని కార్యకర్తగా పనిచేయడానికి రెడీ అని సమాధానమిచ్చారు. గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ తిరుత్తణి: కొండజాతి ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, పనులకు శ్రీకారం చుట్టారు. తిరుత్తణి యూనియన్ బీరకుప్పం పంచాయతీలో కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండజాతి ప్రజల గ్రామానికి గతవారం వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసే వారి కష్టాలు, కనీస అవసరాలు తెసుకుని వారికి సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి వెను వెంటనే తాగునీరు. విద్యుత్, రోడ్లు సౌకర్యాల కల్పనకు అధికారులను రంగంలోకి దింపారు. వెను వెంటనే విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు కల్పించారు. దీంతో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న 15 కుటుంబీకులకు పక్కా ఇళ్లు రూ.4.50 లక్షల చొప్పున నిర్మించేందుకు ఎయిడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం నిర్వహించిన భూమిపూజలో ఎయిడ్ ఇండియా సంస్థ నిర్వాహకులతోపాటు ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమిపూజ ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సాయంత్రం సమయాల్లో ట్యూషన్ తరగతుల కోసం గది సైతం నిర్మించనున్నట్లు తెలిపారు. కొండజాతి ప్రజల సమస్యలు వెను వెంటనే పరిష్కరించి, ఇళ్లు నిర్మాణానికి సైతం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు వేలూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అందజేసే బాధ్యత సర్పంచ్లపై ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కన్నియంబాడి యూనియన్ పరిధిలోని కమ్మవాన్పేట గ్రామ పంచాయతీలో అన్నా మరుమలర్చి పథకం కింద రూ. 45.65 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
2026లో అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు తథ్యం
సాక్షి, చైన్నె: 2026లో అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు అవుతుందని , ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిపళణి స్వామి స్పష్టం చేశారు. సంపూర్ణ మెజారిటీతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణి స్వామి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం కడలూరులో ఆయన ఆలయంలో పూజలతో పర్యటన మొదలెట్టారు. ముందుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటూ కూటమి పాలనకు , సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీతో జాతీయస్థాయిలో తాము పొత్తు పెట్టుకున్నామని పేర్కొంటూ, అన్నాఎంకే నేతృత్వంలోనే తమిళనాడులో కూటమి అన్నది స్పష్టం చేశారు. మీతోస్టాలిన్ కార్యక్రమం ఓ నాటకం అని,ప్రజల సెల్నెంబర్లన్నీ అధికారుల ద్వారా దొంగలించి డీఎంకే ఐటీ విభాగానికి ఎన్నికల సమయంలో అప్పగించేందుకే ఈ కొత్త పబ్లిసిటీ అంటూ ఆరోపణలు చేశారు. -
తిరుత్తణిలో అన్నాడీఎంకే ధర్నా
తిరుత్తణి: డీఎంకే ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, హామీలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రచారాలకు మాత్రం పరిమితమవుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో తిరుత్తణిలో సోమవారం ధర్నా చేపట్టారు. ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తిరుత్తణి నియోజకర్గం వ్యాప్తంగా నుంచి రెండు వేల మందికి పైగా అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొన్నాయి. ఇందులో మాజీ మంత్రులు జయకుమార్, రమణ పాల్గొని, డీఎంకే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. -
ఆగస్టులో భువనచంద్ర సాహిత్య సాగరంపై సదస్సు
● బ్రోచర్ను ఆవిష్కరించిన విస్తాలి శంకర రావు కొరుక్కుపేట: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 28, 29 తేదీల్లో భువనచంద్ర సాహిత్య సాగరం–సృజనాత్మక హరివిల్లు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం మెరీనా బీచ్లోని సాగరతీరాన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఆచార్యులు ఎల్బీ శంకరరావు సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. వీటిని సాహితీ ప్రియులు, రచయితలు, ఆచార్యులు అయిన గుడిమెట్ల చెన్నయ్య, లింగమనేని సుజాత, డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద, డాక్టర్ ఎలిజిబెత్ జయకుమారి, సంగీత దర్శకుడు ఎంఆర్ సుబ్రమణ్యం, నాగేశ్వర రావు(ట్రిప్లికేన్ ), డాక్టర్ పాండురంగ కాళియప్ప, డాక్టర్ మాదా శంకరబాబు, విద్యార్థినీవిద్యార్థులు అందుకున్నారు. ఈ సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న సాహితీ కృషీవలుడు భువనచంద్ర అని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సాహిత్యం, సినీ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన అగ్రశ్రేణి రచయిత భువనచంద్ర అని పేర్కొన్నారు. భువనచంద్ర బహుముఖ సాహితీ కృషిని సమగ్రంగా తెలుసుకునే రీతిలో ఆగస్టు 28, 29వ తేదీల్లో రెండు రోజులపాటు భువనచంద్ర సాహితీ సాగరం–సృజనాత్మక హరివిల్లు పేరుతో అంతర్జాతీయ సదస్సును చేపడుతున్నట్టు విస్తాలి శంకరరావు ఈ సందర్భంగా వెల్లడించారు. -
సాహిత్యానికి నిలయం... భారతదేశం
కొరుక్కుపేట: విభిన్న భాషలు, సంస్కృతితో కూడిన భారతదేశం సాహిత్యానికి నిలయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. ఈ మేరకు నైవేలిలోని లిగ్నైట్ హాలు వేదికగా నైవేలి పుస్తక ప్రదర్శన ఘనంగా ముగిసింది. ఆదివారం జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్సీఐఎల్ పుస్తక ప్రదర్శనకు గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాల పిల్లలను ఉచితంగా తీసుకుని రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పుస్తకాలు ఎల్లప్పుడూ మన హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రం గొప్ప సంస్కృతి, సాహిత్యానికి పేరుగడించిందని అభిప్రాయపడ్డారు. భారతదేశం సాహిత్యానికి నిలయమని, వివిధ రాష్ట్రాల విభిన్న సాహిత్యం, కళలలో భరతమాత హృదయ స్పందనను వినవచ్చని పేర్కొన్నారు. ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ దార్శనికతను గుర్తు చేసుకుంటూ సాహిత్యం, సంస్కృతి వ్యాప్తి ద్వారా మాత్రమే ఇది వాస్తవం అవుతుందని తెలిపారు. ముందుగా ఎన్ఎల్సీఐఎల్ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లి మాట్లాడుతూ ఎన్ఎల్సీఐఎల్ చరిత్రలో నైవేలి పుస్తక ప్రదర్శన ఒక స్వర్ణ దినోత్సవంగా అభివర్ణించారు. కడలూరు జిల్లాలోని 653 పాఠశాలల నుంచి ఉచిత రవాణా సదుపాయం కల్పించి విద్యార్థులను నైవేలి పుస్తక ప్రదర్శనకు తీసుకుని రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2030 నాటికి పునరుత్పాదక శక్తిని 8 రెట్లు పెంచాలని కంపెనీ ప్రణాళికలు వేసిందని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగిసిన ఎన్ఎల్సిఐఎల్ పుస్తక ప్రదర్శన -
పాలారులో చెత్త వేయొద్దంటూ ధర్నా
వేలూరు: వేలూరు కార్పొరేషన్లో సేకరించే చెత్తను పాలారులో వేయడాన్ని ఖండిస్తూ స్థానికులు ధర్నా నిర్వహించారు. వేలూరు ఎస్పీ కార్యాలయం వెనుక వైపున ఉన్న పాలారులో ప్రతి రోజూ కార్పొరేషన్లో సేకరించే చెత్తను పారిశుధ్య కార్మికులు దగ్ధం చేస్తున్నారు. దీంతో దుర్వాసన రావడంతోపాటు దోమలు, ఈగల బెడద అధికమై స్థానికులు పలు రోగాల బారిన పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం ఉదయం కార్పొరేటర్ సుమతితోపాటు స్థానికులు పాలారు వద్దకు చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కార్పొరేషన్లో సేకరించే చెత్తతోపాటు ఆసుపత్రిలో ఉపయోగించే మందులు, చికెన్ దుకాణాల్లో సేకరించే వాటిని కూడా ఒకే చోట వేయడంతో దుర్వాసన వస్తుందని, వీటిపై పలు మార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ చెత్తను ఒక్కడ దగ్ధం చేయడం ద్వారా రాత్రి, పగలు పూర్తిగా దుర్వాసనతో కూడిన పొగలతో కమ్ముకు పోతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్, మేయర్, కార్పొరేషన్ అధికారులకు వీటిపై వినతిపత్రం అందజేశారు. -
● నేడు చిదంబరంలో శ్రీకారం ● 46 సేవలకు దరఖాస్తుల స్వీకరణ ● 45 రోజులలో పరిష్కారం ● తొలి విడతగా నెల రోజుల పాటూ శిబిరాలు ● మహిళా హక్కు పథకం కోసం ప్రత్యేక అవకాశం ● రైలులో సీఎం ప్రయాణం
సాక్షి, చైన్నె: ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం)ను ద్రావిడ మోడల్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా కోటి 6 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతోంది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూరడం లేదంటూ మహిళలు నినదించడంతో మరోమారు దరఖాస్తులు ఆహ్వానించగా, 11 లక్షల మందికి పైగా మహిళా అప్పీలు విజ్ఞప్తిని దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7.35 లక్షల లక్షల మందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా కోటి 15 లక్షల మంది మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. అయినా తమ కంటే తమకు రావడం లేదని నినదించే వారి సంఖ్య అధికంగానే ఉంది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం స్టాలిన్ అర్హులైన మహిళలు అందరికి పథకం వర్తింపజేయడమే లక్ష్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను సడలించారు. ఇంటింటా దరఖాస్తులు.. మీతో స్టాలిన్ నినాదాన్ని మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా స్వచ్ఛంద సేవకులు లక్ష మంది ద్వారా ఇంటింటా దరఖాస్తులు, సమాచార బుక్లెట్ల పంపిణీ ఇప్పటికే విస్తృతంగా జరుగుతోంది. మీతో స్టాలిన్ గురించి ఈ పథకం ప్రత్యేక అధికారి అముదా ఐఎఎస్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల విజ్ఞప్తులకు త్వరితగతిన పరిష్కారం దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు గుర్తుచేశారు. గతంలో మీ నియోజకవర్గంలో సీఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. చైన్నె సచివాలయంలోని సీఎం సెల్కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతున్నదన్నారు. అదే సమయంలో ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, తమకు కావాల్సిన పథకాలు, లబ్ధి, ప్రయోజనాలను సత్వరంగా పొందేందుకు వీలుగానే మీతో స్టాలిన్ తొలి విడతగా ఆగస్టు 15వ తేది వరకు జరుగుతుందన్నారు. వాస్తవానికి నవంబర్ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రజల నుంచివచ్చే స్పందన మేరకు ఆగస్టు 15 తర్వాత మరింత విస్తృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ విజ్ఞప్తులను అధికారుల దృష్టికి తెచ్చిపరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ఇక్కడకు వచ్చే ఫిర్యాదులన్నీ 45 రోజులలోపు పరిష్కరించ బడుతాయని వివరించారు. ఇది వరకు 20 వేల మంది ప్రజలకు ఒక శిబిరం ఏర్పాటు చేశామని, తాజాగా 10 వేల మందికి ఓ శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్నామన్నారు. గత నాలుగు సంవత్సరాలలో 1.05 కోట్ల విజ్ఞప్తులు రాగా 1.01 కోట్లు పరిష్కరించ బడ్డాయని వివరించారు. కాగా చిదంబరం పర్యటన నిమిత్తం సీఎంస్టాలిన్ రైలులో ప్రయాణించారు. చైన్నె తాంబరం రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం ఎక్స్ప్రెస్ రైలులో చిదంబరానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల డీఎంకే వర్గాలు,అధికారులు, మంత్రులు వీడ్కోలు పలికారు. చిదంబరానికి రైలులో బయలుదేరిన సీఎం లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు.. తాంబరం స్టేషన్లో డీఎంకే వర్గాల వీడ్కోలురాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలలోని 43 నుంచి 46 సేవలను ప్రజలు త్వరితగతిన పొందేందుకు వీలుగా మీతో స్టాలిన్ నినాదంతో శిబిరాల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. కడలూరు జిల్లా చిదంబరంలో మంగళవారం మీతో స్టాలిన్ కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో ప్రత్యేకంగా మహిళా హక్కు పథకం కోసం మరింతగా లబ్దిదారులకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఈ మగళిర్ ఉరిమి తిట్టంకోసం దరఖాస్తులు చేసుకోదలచని వారికి అవకాశం కల్పించడమే కాకుండా, ప్రభుత్వ విభాగాలలోని 43 నుంచి 46 సేవలను ప్రజలు సులభంగా పొందేందుకు వీలుగా మీతో స్టాలిన్కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు 10 వేల శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. కడలూరు జిల్లా చిదంబరం వేదికగా ఈ శిబిరాలకు సీఎం స్టాలిన్ మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ వరకు ఈ శిబిరాలు జరగనున్నాయి. తమిళనాడులోని లక్షలాది మంది ప్రజలు రోజూ ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,768 శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 6,232 శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో పట్టణ ప్రాంతాల్లోని 13 ప్రభుత్వ విభాగాల నుంచి 43 సేవలు అందుబాటులో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో 15 విభాగాలకు చెందిన 46 సేవలు అందించనున్నారు. ఒక్క మహిళా హక్కు పథకమే కాదు, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, సేవలను వివరించే విధంగా, వాటి ప్రయోజనాలు, అర్హతల గురించి అవసరమైన సమగ్ర సమాచారాలను బుక్ లెట్ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. శిబిరం రోజున అర్హతగల మహిళలు అధికారుల్ని సంప్రదించి మహిళ హక్కు పథకం దరఖాస్తును సమర్పించే వీలు కల్పించారు. ఈ శిబిరాలలో స్వీకరించే దరఖాస్తులను 45 రోజులలో పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారు. కొన్నింటిని అప్పటికిప్పుడే పరిష్కరించేందుకు సైతం శిబిరాలలోచర్యలు తీసుకున్నారు. -
గ్లెనీగల్స్లో కంటి సంరక్షణా కేంద్రం
సాక్షి, చైన్నె: చైన్నెలోని గ్లెనీగల్స్ ఆస్పత్రిలో అత్యాధునిక కంటి సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ వైస్ చైర్ పరస్సన్ డాక్టర్ సుధా శేషయ్యన్ప్రారంభించారు. ఈ ఐ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఈ రవీంద్ర మోహన్, గ్లెనీగల్స్ సీఈఓ డాక్టర్ నాగేశ్వరరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈసందర్బంగా రవీంద్ర మోహన్ మాట్లాడుతూ, సమగ్ర, బహుళ విభాగాలు, అధిక నాణ్యత కలిగిన కంటి సంరక్షణ అందించడం లక్ష్యంగా ఇక్కడ సెంటర్ఏర్పాటు చేశామన్నారు. నేత్ర వైద్య శాస్త్రాన్ని న్యూరాలజీ, ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వంటి ఇతర ప్రత్యేకతలతో అనుసంధానించడం ద్వారా రోగులకుఒకే చోట అన్ని సేవలు అందించేందుకు వీలు కల్పించామన్నారు. -
శరవేగంగా సహాయక చర్యలు
● మొదటి రెండు రైల్వే లైన్లు పునురుద్ధరణ ●ఆలస్యంగా నడిచి రైళ్లతో ప్రయాణికుల ఇబ్బందులు తిరువళ్లూరు: చైన్నె ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మైసూరు వైపు బయలుదేరిన గూడ్స్ రైలులో మంటలు చెలరేగి తిరువళ్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం ఏర్పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 8.40 లక్షల లీటర్లు ఆయిల్, 18 ట్యాంకర్లు దగ్ధమై దాదాపు రూ. 15 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తిరువళ్లూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్ రైల్వేట్రాక్ పూర్తిగా దెబ్బతింది. మరో రెండు లైన్లుకు సంబందించిన విద్యుత్ లైన్లు, సిగ్నల్బోర్డులు, రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పలు ఎక్స్ప్రెక్స్ రైళ్లు, లోకల్ రైళ్ల రాకపోకలను ఆదివారం ఉదయం నుంచి నిలిపివేశారు. మంటలను దాదాపు పది గంటల పాటూ శ్రమించి అధికారులు అదుపు చేశారు. అనతరం సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. పది ప్రొక్లెయిన్లు, జేసీబీలు, క్రేన్లు, భారీ యంత్రాల సాయంతో పనులను ప్రారంభించారు. తక్కువ ప్రమాద తీవ్రత వున్న మొదటి రెండు లైన్లు, ట్రాక్లను సరిచేసి సోమవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించారు. మరో రెండు లైన్లులో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఈ పనులు సోమవారం రాత్రిలోపు వందశాతం పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆలస్యంగా నడిచిన రైళ్లు గూడ్స్ ప్రమాదం కారణంగా అన్ని ఎక్స్ప్రెక్స్, లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ రోజుల కంటే తక్కువ రైళ్లను నడపడంతో తిరువళ్లూరు, పుట్లూరు, సెవ్వాపేట, వేపంబట్టు, కడంబత్తూరు తదితర రైల్వేస్టేషన్లో రైళ్ల కోసం ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటూ రద్దీ ఎక్కువగా కనిపించింది. పలువురు ఉద్యోగులు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడవడంతో సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరు, తిరుత్తణి, అరక్కోణం నుంచి తక్కువ సంఖ్యలో రైళ్లను నడిపారు. అయితే చాలా రైళ్లను తిరునిండ్రవూర్ వరకు నడిపి అక్కడ నుంచి చైన్నె, బీచ్, తామంబరం తదితర ప్రాంతాలకు రాకపోకలను కొనసాగించారు. కాగా కడంబత్తూరు రైల్వేస్టేషన్ నుంచి తిరువల్లూరు వరకు గంటకు పది కిమీ వేగంతో రైళ్లను నడిపారు. బృందావన్, డబుల్ డెక్కర్ లాంటి ఎక్స్ప్రెక్ రైళ్లు కడంబత్తూరు, తిరువళ్లూరులో ఆగి బయలుదేరింది. ప్రమాదంలో దెబ్బతిన్న కొన్ని ట్యాంకర్లో ఆయిల్ను ఓఎన్జీసీ లారీల ద్వారా తరలించగా, మిగిలిన ట్యాంకర్లను నూతన ఇంజిన్తో సోమవారం ఉదయం మైసూరుకు తరలించారు. నమోదు కానీ ఎఫ్ఐఆర్ గూడ్స్ ప్రమాదంపై స్టేషన్ మాస్టర్ జీఆర్పీ పోలీసులకు పిర్యాదు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదం జరిగి 36 గంటలు దాటుతున్నా ఇంత వరకు ఫిర్యాదు రాలేదని జీఆర్ పోలీసులు వివరించారు. తమకు ఫిర్యాదు వస్తే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. ఇదే విషయంపై స్టేషన్ మాస్టర్ను వివరణ కోరగా, ఫిర్యాదు చేయలేదన్న మాటవాస్తవమే. ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. ఎప్పడు చేస్తామనే విషయం తమకు తెలియదు. పూర్తి వివరాల కోసం ఉన్నత అధికారుల వద్ద వివరణ తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు ముమ్మరం పగుళ్లే ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు ప్రమాదానికి ట్రాక్లో ఏర్పడిన పగుళ్లే ప్రమాదానికి కారణంగా వుండొచ్చన్న కోణంలో సాక్షి ట్రాక్లోని పగుళ్లు వున్న ఫొటోలతో సహా వార్తను ప్రచురించింది. ఈక్రమంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతాప్, గూడ్స్ రైలు ప్రమాదానికి ట్రాక్లో ఏర్పడిన పగుళ్లే కారణమని, కుట్రకోణం లేదని రైల్వేశాఖ ప్రాధమిక విచారణలో గుర్తించిందన్నారు. జిల్లా యంత్రాంగం సైతం లోతైన నివేదికను రైల్వే శాఖ నుంచి కోరామని, చివరిగా ఎప్పడు ట్రాక్ను పర్యవేక్షించారు. ట్రాక్లో ఏర్పడిన పగుళ్లను ఎందుకు గుర్తించలేదన్న విషయంపై సైతం నివేదిక కోరినట్టు వివరించారు. త్వరలోనే డీఆర్ఎంతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి భవిషత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. నేటి నుంచి యధావిధిగా రాకపోకలు సోమవారం రాత్రికి సహాయక చర్యలను పూర్తి చేసి అన్ని రకాల రైళ్లను కాలయాపన లేకుండా కొనసాగించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు వివరించారు. అధికారులు సోమవారం రాత్రికి పనులు పూర్తి చేస్తే మంళవారం నుంచి అన్ని రకాల రైల్వే సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొదటి రెండు లైన్లులో దెబ్బతిన్న విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించారు. పాక్షికంగా దెబ్బతిన్న సిగ్నల్బోర్డు, ట్రాక్లకు వేగంగా మరమ్మతులు చేపట్టారు. ప్రమాదం జరిగిన నాలుగవ ట్రాక్లో వున్న ట్యాంకర్లను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. అనంతరం మంటల తీవ్రతతో అరకిలోమీటర్ మేరకు దెబ్బతిన్న సిమెంట్ దిమ్మెలు, ట్రాక్లను తొలగించారు. వాటి స్థానంలో గుళకరాయిని పోసి కొత్త సిమెంట్ దిమ్మెలు, ట్రాక్, సిగ్నల్ బోర్డులు, విద్యుత్ లైన్లును ఏర్పాటు చేశారు. -
అమెరికన్ తమిళుల కోసం బన్బట్టర్ జామ్
తమిళసినిమా: రెయిన్ ఆఫ్ ఆరోస్ పతాకంపై సురేశ్ సుబ్రమణియన్ నిర్మించిన చిత్రం బన్బట్టర్ జామ్. బిగ్బాస్ సీజన్–5 విన్నర్ రాజు జయమోహన్ కథానాయకుడిగా పరిచయం అయిన ఈ చిత్రానికి రాఘవ్ మిర్త్ దర్శకత్వం వహించారు. ఆద్య ప్రసాద్, దివ్య ట్రిక్కా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో నటుడు చార్లీ, శరణ్య పొన్వన్నన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నిర్మాత సురేశ్ సుబ్రమణియన్ అమెరికాలో వ్యాపారవేత్త కావడంతో బన్ బట్టర్ జామ్ చిత్రాన్ని ఇటీవల అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా, ఉత్తర అమెరికా తమిళ సంఘం ఫెడరేషన్ ఆప్ తమిళ్ సంఘాస్ ఆఫ్ నార్త్ అమెరికా తరఫున ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. చిత్ర ట్రైలర్ను ముందుగానే విడుదల చేయడంతో దాన్ని చూసి ఈ ప్రదర్శనకు సుమారు 5 వేలకు పైగా తమిళ ప్రేక్షకులు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకుని బన్ బట్టర్ జామ్ చిత్రాన్ని తిలకించినట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రాన్ని చూసిన వారంతా చాలా బాగుందని ప్రశంసిస్తూ అమెరికాలో ఉండి తమిళ చిత్రాన్ని ఎలా నిర్మించారంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిపారు. అమెరికాలోని తమిళ ప్రేక్షకులను అలరించిన బన్ బట్టర్ జామ్ చిత్రం త్వరలో తమిళనాడులోని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందన్నమాట. -
కన్నడ పైంగిళికి.. వీడదీయని తమిళ బంధం
● సరోజాదేవి మృతికి పలువురి సంతాపం తమిళసినిమా: కళామతల్లి ముద్దు బిడ్డలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నటి సరోజాదేవి ఒకరు. పుట్టి పెరిగింది బెంగుళేరులోనైనా, భారతీయ సినిమా చరిత్రలో నటిగా ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. 1955లో కన్నడంలో మహాకవి కాళిదాస్ అనే చిత్రంలో నటించి తొలి చిత్రంతోనే సక్సెస్పుల్ నాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. కాగా నటి సరోజాదేవి తమిళంలో ఎంజీఆర్కు జంటగా నాడోడి మన్నన్ చిత్రంతో పరిచయం అయ్యారు. 1958లో విడుదలైన ఆ చిత్రం ఘనవిజయాన్ని సాదించింది. ఆ తరువాత ఎంజీఆర్, శివాజీగణేశన్ వంటి పలువురు దిగ్గజ కథానాయకుల సరసన నటించి ప్రఖ్యాత నటిగా పేరుగాంచారు. ఎంజీఆర్కు జంటగా 15 చిత్రాలు, శివాజీగణేశన్కు జంటగా 20 చిత్రాల్లో నటించిన సరోజాదేవి తెలుగులోనూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పలు చిత్రాల్లో నటించారు. అలా తమిళం,తెలుగు,కన్నడం భాషల్లో మొత్తం 200 లకు పైగా చిత్రాల్లో నటించారు. ఈమెకు అభినయ సరస్వతి అనే బిరుదు ఉంది. అదే విధంగా పద్మభూషణ్,పద్మశ్రీ వంటి అత్యున్నతి పురస్కారాలను అందుకున్న నటీమణి ఈమె. కాగా తమిళంలో సరోజాదేవి నటించిన చివరి చిత్రం ఆదవన్. ఈ చిత్రం 2020లో విడుదలయ్యింది. కాగా 87 ఏళ్ల ఈ మహానటి వృద్ధాప్యం కారణంగా సోమవారం బెంగుళూర్లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. దీంతో ఇండియన్ సినిమా ఒక నట సరస్వతిని కోల్పోయింది. సరోజాదేవి మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, ప్రతిపక్ష నేత పళణిస్వామి, రజనీకాంత్, కమల్హాసన్ సహా పలువురు సినీ రాజకీయనాయకులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా నటి సిమ్రాన్,కుష్భూ, నటుడు విక్రమ్ ప్రభు, రాధిక శరత్కుమార్ మొదలగు పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
రైలు పట్టాలు దాటుతున్న చిరుత
●నిఘా కెమెరాలో రికార్డు అన్నానగర్: కోయంబత్తూరు పక్కన ఉన్న మదుక్కరై నుంచి కేరళ అటవీ ప్రాంతం గుండా రెండు రైల్వే ట్రాక్లు వెళతాయి. ఇక్కడ అడవి ఏనుగులు సహా వివిధ రకాల అడవి జంతువుల కదలికలు చాలా ఉన్నాయి. ఈ ట్రాక్ భూమి నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంది. ట్రాక్ సమీపంలో అడవి ఏనుగులు సహా అడవి జంతువుల ఉనికిని గుర్తించడానికి ఏఐ టెక్నాలజీతో కూడిన నిఘా కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో మదుక్కరై–వలయార్ అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ను దాటుతున్న చిరుతపులి నిఘా కెమెరాలలో రికార్డైంది. చిరుతపులి ట్రాక్పై కూర్చుని కొంతసేపు చుట్టూ చూసింది. అప్పుడు అది ట్రాక్ పై పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. -
అధికారులే సమాచార సారథులు
● ప్రతినిధులుగా నలుగురు ఐఏఎస్లు ● నియమించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి,చైన్నె : సీనియర్ అధికారుల్నే సమాచార సారథులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సీనియర్ ఐఏఎస్లకు పలు శాఖలలోని విభాగాలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాలు, వివరణలు, పథకాలు, ఇతర కార్యక్రమాలన్నీ ఈ అధికారులే ప్రజలలోకి తీసుకురానున్నారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వ విభాగాల ముఖ్యమైన సమాచారం, పథకాలు, కార్యక్రమాలు, అవసరమైన వర్గాలలో మీడియా ద్వారా సకాలంలో సముచిత సమాచారం అందించే దిశగా, ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకునే రీతిలో ఐఏఎస్ అధికారులను ఎంపిక చేశామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ ఐఏఎస్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నలుగురికి బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వ ప్రచార, సమాచార సారథులుగా రంగంలోకి దించడమే కాకుండా వారికి ఆయా శాఖలు, విభాగాలను కేటాయించారు. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలన్నీ ఇక ఈ అధికారులే సమన్వయం చేయనున్నారు. సమాచారాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు విద్యుత్ బోర్డు చైర్మన్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. రాధాకృష్ణన్ను నియమిస్తూ, ఆయన పరిధిలోకి విద్యుత్, వైద్యం, రవాణా ,సహకార సంఘాలు, ఆహారం, వినియోగదారుల సంక్షేమం, విదేశాల్లో నివసిస్తున్న తమిళుల సంక్షేమం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య, చేనేత, హస్తకళలు, వస్త్రాలు, ఖద్దర్ రంగాలు, మానవ వనరుల నిర్వహణ శాఖలను అప్పగించారు. గ్రామీణావృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడికి గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన, నీటి సరఫరా, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, మత్స్యకారులు సంక్షేమ, వ్యవసాయం, రైతు సంక్షేమం, జల వనరులు, పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు,పెట్టుబడులు ప్రోత్సాహం, వాణిజ్య విభాగం, సహజ వనరుల విభాగం అప్పగించారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి , ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్కు హోం వ్యవహారాలు, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖను కేటాయించారు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి పి. అముదాకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కులు, వికలాంగుల సంక్షేమం, కార్మిక సంక్షేమం , నైపుణ్యాల అభివృద్ధి, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, రహదారులు, చిన్న ఓడరేవులు, పర్యాటకం, సాంస్కృతికం, హిందూ మత దేవాదాయం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలు శాఖలను అప్పగించారు. ప్రభుత్వ ప్రతినిధులకు ఆయా విభాగాల కార్యదర్శులు, ఇతర అధికారులు సంప్రదింపులలో ఉండాలి. తమకు కేటాయించిన శాఖలలలోని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు, సమాచారాలుసేకరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల పరంగా సమగ్ర సమాచారాలను ఈ ఐదుగురు ప్రభుత్వ ప్రతినిధులే ప్రజలకు సకాలంలో సమాచారాలను అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. -
సూపర్గుడ్ ఫిలింస్ చిత్రంలో విశాల్
తమిళసినిమా: తమిళం, తెలుగు సినీ పరిశ్రమలో సూపర్గుడ్ ఫిలింస్ చిత్ర నిర్మాణ సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్ర అధినేత ఆర్.బీ.చౌదరి పలువురు నిర్మాతలకు మార్గదర్శి. నూతన దర్శకులకు, సాంకేతిక వర్గానికి అవకాశం కల్పించడం ఆయన ప్రత్యేకత. ఈయన పరిచయం చేసిన వారంతా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. అదే విధంగా సూపర్గుడ్ ఫిలింస్ కొత్త వారితో పాటు, స్టార్ హీరోలతోనూ చిత్రాలను నిర్మించి, విజయాలను సాధించింది. అలా ఇప్పటి వరకూ 98 చిత్రాలను నిర్మించింది. కాగా 99వ చిత్రాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులో నటుడు విశాల్ హీరోగా నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటించిన మదగజరాజా చిత్రం ఇటీవల విడదలై మంచిి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈయన నటిస్తున్న ఈ చిత్రం విశాల్కు 35వ చిత్రం అన్నది విశేషం. నటి దుషారా విజయన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సోమవారం ఉదయం చైన్నెలోని సూపర్గుడ్ ఫిలింస్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు కార్తీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు అందించారు. నటుడు కార్తీ క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. ఈ చిత్ర తొలి షెడ్యూల్ను చైన్నెలో 45 రోజులపాటు నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. సూపర్గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న 99వ చిత్రంలో రవిఅరసు దర్శకత్వంలో తన 35వ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని నటుడు విశాల్ పేర్కొన్నారు. మార్క్ ఆంటోని తరువాత జీవీ ప్రకాశ్కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని, మదగజరాజా చిత్రం తరువాత ఛాయాగ్రహకుడు రిచర్డ్ ఎం.నాథన్ ఈ చిత్రానికి పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య ఎంత?
● డీజీపి, కమిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు కొరుక్కుపేట: చైన్నెలోని అల్లికుళం కోర్టులో విచారణలో ఉన్న కేసులో నిందితుడు రాజరాజ చోళన్ పై జారీ చేసిన అరెస్టు వారెంట్ను అమలు చేయడానికి నీలంకరై పోలీసుల అనుమతి కోరుతూ జమునా శివలింగం చైన్నె ఐఎస్ఓలో ఫిటీషన్ దాఖలు చేశారు . ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పి. వెల్మురగన్ మాట్లాడుతూ గత జనవరిలో జారీ చేసిన ఈ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి అరెస్టు వారెంట్లు జారీ చేయలేదన్నారు. కాగా అరెస్టు వారెంట్లు జారీ చేయబడిన అనేక కేసులు ఇప్పటికీ పెండింగ్ దశలోనే ఉన్నాయి. మేజిస్ట్రేట్, జిల్లా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ల ఆదారంగా నిందితులను నిర్ధిష్ట వ్యవధిలోపు అరెస్టు చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరుస్తారు. లేకపోతే వారెంట్ అమలు కాకపోవడంపై సంబంధిత కోర్టుకు నివేదిక దాఖలు చేసి కొత్త వారెంట్ జారీ కోసం అభ్యర్థన చేయాలి. ఈక్రమంలో తమిళనాడు అంతటా ఎన్ని కేసులలో అరెస్టు వారెంట్లు జారీ చేశారు. పెండింగ్లో ఎన్ని ఉన్నాయి అనేదానిపై డీజీపీ , చైన్నె పోలీసు కమిషనర్ ఈనెల 23 తేదీలోపు నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే తమిళనాడుఅంతటా ఎన్ని కేసులలో ఇంకా అరెస్టు వారెంట్లు అమలు చేయలేదో అనే దాని పై కూడా వివరణ ఇవ్వాలి అని పేర్కొంటూ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఘనంగా ది గుడ్ డీడ్స్ 2వ ఎడిషన్ ●ప్రారంభించిన గవర్నర్ రవి సాక్షి, చైన్నె: ట్రాన్స్ జెండర్ల జీవితాలలో వెలుగు నింపే విధంగా, విద్య, ఉద్యోగ పరంగా శిక్షణకు తోడ్పాటు అందించే రీతిలో ది గుడ్ డీడ్స్ క్లబ్ ఛాంపియన్స్ విద్య సహకారం, స్కాలర్ షిప్ల పంపిణీ వేడుక చైన్నెలో జరిగింది. ఇందులో గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. సామాజిక సేవకురాలు అప్సర రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ది గుడ్ డీడ్స్ క్లబ్ రెండవ ఎడిషన్గా విద్య, సమ్మిళితం, జాతీ నిర్మాణం, శక్తివంతమైన దృష్టితో దాతృత్వం, సాంస్కృతికత, నెట్ వర్కింగ్ను విస్తృతం చేసే విధంగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆర్థికంగా వెనుక బడిన యువతకు పూర్తి విద్య, వసతి, పోలీసు శిక్షణ కోసం నిధులు సమకూర్చడం లక్ష్యంగా రూ. 5 లక్షల విరాళంను వల్లమై ట్రస్ట్కు అందజేశారు. సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లుగా శిక్షణతో జీవితాలను కొనసాగించడానికి అర్హులైన వారికి సహకారం అందించేందుకు నిర్ణయించారు. అలాగే ఇన్పర్మేషన్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యషించేందుకు గాను ట్రాన్స్ ఉమెన్ మయూరకు రూ. లక్ష స్కాలర్ షిప్ అందజేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి, గుడ్ డీడ్స్ క్లబ్ అధ్యక్షురాలు అప్సర రెడ్డి, వైస్ చైర్ పర్సన్ సింధూర అరవింద్ స్కాలర్ షిప్లను అందజేశారు. న్యూస్రీల్ -
కుటుంబ కథా చిత్రాలు చాలా కష్టం
తమిళసినిమా: నటుడు విజయ్సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం తలైవన్ తలైవి. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రానికి పాండిరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ట్రేడ్ సెంటర్లో భారీ ఎత్తున నిర్వహించారు. ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక విషయంలో తనకు దర్శకుడు పాండిరాజ్కు మధ్య ఏర్పడిన సంఘటన తరువాత చాలా కాలం ఇద్దరం మాట్లాడుకోలేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన చిత్రం తలైవన్ తలైవి అని పేర్కొన్నారు. చిత్రం ప్రారంభమైన తరువాత తమ మధ్య బేధాభిప్రాయాలు తొలగి మంచి స్నేహం ఏర్పడిందన్నారు. అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు పాండిరాజ్ తమను చాలా కష్టపెట్టారని చెప్పారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు చెప్పారు. నటి నిత్యామీనన్ తాను 2018లో ఒక మలయాళ చిత్రంలో నటించామని చెప్పారు. అప్పుడే మరో చిత్రంలో కలిసి నటించాలని భావించామన్నారు. అది ఈ చిత్రంతో కుదిరిందని పేర్కొన్నారు. ఇది భార్యాభర్తలు విడిపోకూడదని చెప్పే కథగా ఉంటుందని చెప్పారు. చిత్ర దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ తలైవన్ తలైవి కుటుంబ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. నిజం చెప్పాలంటే కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడం చాలా కష్టం అన్నారు. ఈ తరహా చిత్రాలు కొంచెం మారినా సీరియల్స్గా మారే ప్రమాదం ఉందన్నారు. ఆ విషయంలో తాను చాలా సమయం తీసుకుని కథ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఇది భార్యాభర్తల మధ్య అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది ఒక యధార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. నటుడు విజయ్ సేతుపతి చాలా బాగా నటించారని, అదే విధంగా నటి నిత్యామీనన్ లేకుంటే ఇందులోని పాత్రను ఊహించలేమన్నారు. ఇప్పటి వరకూ తాను అనుకున్న ఏ కథానాయకి తన చిత్రాల్లో నటించలేదనీ, ఈ చిత్రంలో మాత్రం ముందు నుంచి నిత్యామీనన్నే అనుకున్నాననీ, ఆమెనే నటించారని దర్శకుడు పాండిరాజ్ చెప్పారు. తలైవన్ తలైవి చిత్రం యూనిట్ -
ఘనంగా మాస్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం
● గుడిమెట్ల చెన్నయ్యకు ఘన సత్కారం కొరుక్కుపేట: మద్రాసు ఆదిఆంధ్ర అరుంధతీయ ఆదివాసీ సంక్షేమ సంఘం(మాస్)–చైన్నె ఆధ్వర్యంలో 33వ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి పెరంబూరులోని డీఆర్బీసీసీ స్కూల్ ఆడిటోరియం వేదికై ంది. మాస్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ కొల్లిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు పాల్గొన్నారు. చైన్నెతోపాటు చుట్టపక్కల ప్రాంతాలలో 10వ తరగతి, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాదించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతిభా అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున 67 మందికి స్కాలర్షిష్లు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2025 సంవత్సరానికి తెలుగు ఉగాది పురస్కారం అందుకున్న జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్యను మాస్ తరఫున ఘనంగా సత్కరించారు. ముందుగా మాస్ ఉపాధ్యక్షుడు నూనె శ్రీనివాసులు స్వాగతోపన్యాసం చేయగా, అధ్యక్షుడు డాక్టర్ కొల్లిరాజు 1992లో దివంగత కేజీ గోపాలకృష్ణ స్థాపించిన మాస్ ఆవిర్భావం నుంచి చేపడుతున్న కార్యక్రమాలను సభకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం.మోహన్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సమయం, విద్య ప్రాముఖ్యతను వివరించారు. కాలాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని హితవు పలికారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నా టామ్స్ వ్యవస్థాపకుడు గొల్లపల్లి ఇశ్రాయేల్, జిల్లా రెవెన్యూ అధికారి జీఆర్ దివ్య, మద్రాసు వర్శిటీ తెలుగుశాఖాధ్యక్షుడు విస్తాలి శంకర రావు, మాస్ సలహాదారు ఏ.జైసన్, టామ్స్ బీఎన్ బాలాజీ, జీసీ పెద్ద నాగూర్, యు.నాగయ్య తదితరులు మాట్లాడారు. మాస్ ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి అజరత్తయ్య సూచనలతో మాస్ జాయింట్ ట్రెజరర్ వి.దీనదయాళన్, జాయింట్ సెక్రటరీ ఎన్.రాజీవ్, ఎస్.తిరుపతయ్య, ఎం.వీరయ్య, ఏఎన్.రాజేష్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వందన సమర్పణను జాయింట్ సెక్రటరీ పి.పాల్ కొండయ్య చేశారు. -
రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
●ప్రాణభయంతో కిందికి దూకిన ఆరుగురికి గాయాలు అన్నానగర్: చైన్నెలోని పెరవళ్లూరులో ఆదివారం రెండు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రాణాలతో బయటపడటానికి 2వ అంతస్తు నుంచి దూకి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చైన్నె పెరవళ్లూరులోని ఎస్.ఆర్.పి. కాలనీ వీధిలో హరి గోవింద్ యాజమాన్యంలోని రెండు అంతస్తుల భవనం ఉంది. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్, జిమ్, మొదటి అంతస్తులో జిమ్, రెండవ అంతస్తులో స్నూకర్ హాల్, కాఫీ షాప్ ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విద్యుత్ లోపం కారణంగా భవనంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రారంభమైన మంటలు రెండవ అంతస్తు వరకు వ్యాపించాయి. దీని వల్ల దట్టమైన పొగలు ఎగిసి రెండవ అంతస్తు వరకు వ్యాపించాయి. మొదటి అంతస్తులోని వ్యక్తులు దిగగలిగారు. అయితే రెండవ అంతస్తులోని స్నూకర్ హాల్లోని ఆరుగురు వ్యక్తులు మెట్లపై పొగ కమ్ముకోవడంతో కిందికి దిగలేకపోయారు. దీంతో ఆరుగురు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రెండవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దూకారు. ఈక్రమంలో వారంతా గాయపడ్డారు. వారిలో, కొలత్తూర్ వినాయగపురం వీరరాఘవన్ నగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ (42) పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే సెంబియం, కొలత్తూరు అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు అంతస్తుల్లో చెలరేగిన మంటలను ఆర్పారు. పెరవళ్లూరు పోలీసులు ఈ ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు దశాబ్దాల తర్వాత ఉగ్రమూకల అరెస్టుపై బీజేపీ హర్షం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి మూడు దశాబ్దాలుగా చిక్కకుండా తిరుగుతున్న ముగ్గురు టెర్రరిస్టులను ఏటీఎస్( యాంటీ టెర్రరిజం స్వ్కాడ్) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హర్షం వ్యక్తం చేశారు. సదీఖ్ అలీ అలియాస్ టైలర్ రాజా, మహ్మద్ అలీ మన్సూర్, అబుబాకర్ సిద్ధిఖిలను ఏటీస్ బృందం అదుపులోకి తీసుకోవడాన్ని ప్రత్యేకంగా అభినందించారాయన. ఇది తమిళనాడు ఏటీఎస్ పోలీసుల ఘనత అంటూ ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జరిగిన ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ముగ్గుర్ని మూడు దశాబ్దాల తర్వాత పట్టుకోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు అన్నామలై ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. After three decades, the Tamil Nadu Anti-Terrorism Squad has successfully arrested three long-absconding terrorists, Sadiq Ali (also known as Tailor Raja), Mohammed Ali Mansoor, and Abubacker Siddique, linked to a series of targeted terror attacks across Tamil Nadu.These… pic.twitter.com/ODNkJ5HqwW— K.Annamalai (@annamalai_k) July 14, 20251998లో కోయాంబత్తూర్లో జరిగిన ఉగ్రదాడిలో 59 మంది ప్రాణాలు కోల్పోగా, మరొకవైపు 1993లో చెన్నై ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో జరిగిన బాంబు దాడి జరిగింది. ఇక 1995లో నాగూర్లో హిందూ మున్నాని నాయకుడు ముతుకృష్ణన్ భార్యను పొట్టనపెట్టుకున్నారు ఈ ఉగ్రవాదులు. రామాయణం పుస్తకంలో బాంబు దాచి ముతుకృష్ణన్ భార్యను హత్య చేశారు. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వీరిపై ఏటీఎస్ నిఘా వేసి ఉంచింది. తప్పుడు ఐడెంటీ కార్డులతో ఖాళీగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుని తప్పించుకుని తిరుగుతూ ఉన్న వీరిని ఎట్టకేలకు ఏటీఎస్ బృందం పట్టుకుంది. -
షూటింగ్లో ఆర్టిస్ట్ మృతి.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్
ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వెట్టువన్. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ తమిళనాడులోని కిళైయూర్ కావల్ సరగమ్ సమీపంలో విళుందమావడి గ్రామంలో గత మూడు రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం షూటింగ్లో పాల్గొన్న మోహన్ రాజు అనే స్టంట్ కళాకారుడు కారులో నుంచి బయటకు దూకుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.స్టంట్ కళాకారుడు మృతివెంటనే అతన్ని నాగపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాజు మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన స్టంట్ కళాకారుడు మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. ఈయన మృతి వెట్టువన్ చిత్ర యూనిట్నే కాకుండా సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్టంట్ కళాకారుడు మోహన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ (Vishal) సంతాపం ప్రకటించారు.ప్రమాదకర స్టంట్లుసినిమా షూటింగ్లో కారులో నుంచి దూకుతూ స్టంట్ కళాకారుడు రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. తను ఎంతో ధైర్యశాలి. నా సినిమాల్లో ఎన్నో ప్రమాదకర స్టంట్లు చేశాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కేవలం ఒక్క ట్వీట్ చేసి నా పని నేను చేసుకోలేను. అతడి కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను. వారికి తోడుగా ఉండటం నా బాధ్యత అని ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు.ఫైట్ మాస్టర్ ట్వీట్ఫైట్ మాస్టర్ సిల్వ స్టంట్.. రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్ను కోల్పోయాం. స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు. అతడిని మిస్ అవుతున్నాం అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు.So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…— Vishal (@VishalKOfficial) July 13, 2025 One of our great car jumping stunt Artist S M Raju Died today while doing car stunts 😭😭RIPOur stunt union and Indian film industry ll be missing Him😭😭 pic.twitter.com/9Qr7Zg8Dbb— silva stunt (@silvastunt) July 13, 2025చదవండి: సకల సినీ పాత్రలకు పెట్టని కోట -
తిరుపతి – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆగస్టులో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018), ప్రతి శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్న గర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడి పత్రి, ఎరగ్రుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపే ట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు (07251), ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు (07252) రైళ్లు నడువను న్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
ఘనంగా వాసవీ క్లబ్ సేవలు
కొరుక్కుపేట: చైన్నె ఎగ్మూర్లో వాసవీ క్లబ్ చెన్నపట్న, వనిత చెన్నపట్న సంయుక్త ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. క్లబ్ల అధ్యక్షులు హెచ్.బాలాజి, పూర్ణిమల నేతత్వంలో జరిగిన వేడుకలకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సౌభాగ్య ఆదికేశవన్ వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో క్లబ్లకు 15 సంవత్సరాలుగా అధ్యక్షులుగా సేవలందించిన వారిని ఘనంగా సత్కరించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మింట్లోని టైటివి స్కూల్ వేదికగా ఉచిత మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వేడుకల్లో క్లబ్ సెక్రటరీలు సతీష్, ఉష, కోశాధికారులు అశోక్, జనని, జోన్ చైర్మన్ బాలాజి, ఇమ్మిడి కిషోర్ పాల్గొన్నారు. -
3,500 ఆలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తాం
–మంత్రి శేఖర్బాబు సేలం: ఈ ఏడాది చివరి నాటికి 3,500 దేవాలయాల్లో కుంభాభిషేకం నిర్వహిస్తామని హిందూదేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తెలిపారు. ఈరోడ్ కొండపై తిండల్ వేలాయుధస్వామి ఆలయం ఉంది. హిందూధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రస్తుతం రాజగోపురం నిర్మించే పనులు జరుగుతున్నాయి. దీని తర్వాత ఆలయం ముందు 186 అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించి, దానికోసం పనులు ప్రారంభించారు. ఆదివారం మంత్రులు శేఖర్బాబు, ముత్తుసామి పనులను పరిశీలించారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ ద్రవిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హిందూ మతపరమైన ఎండోమెంట్స్ అండ్ చారిటీస్ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి చేపట్టని పునరుద్ధరణల పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ సంవత్సరం చివరి నాటికి 3,500 ఆలయాల్లో పునరుద్ధరణలు పూర్తవుతాయని అన్నారు. 186 అడుగుల ఎత్తులో ఆసియాలోనే ఎత్తైన విగ్రహాన్ని ఈరోడ్ తిండాల్ వేలాయుధ స్వామి ఆలయంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. -
రైలు ప్రయాణికుల పడిగాపులు
తిరుత్తణి: తిరువళ్లూరు వద్ద ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ల గూడ్సు రైల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంతో చైన్నె అరక్కోణం మార్గంలో రైళ్ల సేవలు ఆదివారం పూర్తిగా రద్దయ్యాయి. దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుత్తణి నుంచి చైన్నెకి వెళ్లే విద్యుత్ రైళ్ల సేవలను నిలిపివేయడంతో పాటు తిరుపతి నుంచి చైన్నె వెళ్లే సప్తగిరి, గరుడాద్రి ఎక్స్ప్రస్ రైళ్ల సేవలతో పాటు అన్నీ రైళ్ల సేవలు ఆగిపోయాయి. దీంతో తిరుత్తణి ఆలయానికి వచ్చిన భక్తులు పనుల నిమిత్తం ప్రయాణం చేసేవారు, తిరుత్తణి రైల్వే స్టేషన్లో ఉదయం నుంచి పడిగాపులుకాచారు. రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్లో ప్రకటించడంతో బస్సుల ద్వారా ప్రయాణం చేయాల్సి రావడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. -
వీరవణక్కం విప్లవ పాట ఆవిష్కరణ
ఎస్జే సూర్య, ఏఆర్ రెహ్మాన్ తమిళసినిమా: విశారద్ క్రియేషన్న్స్ సంస్థ నిర్మించిన చిత్రం వీరవణక్కం. అనిల్ వి.నాగేంద్రన్ దర్శకత్వం వహించిన ఇందులో రితేష్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నుగత్తడియై తోళిల్ సుమంత్ వుళైప్పాళిగలే అంటూ సాగే చెప్పవా గీతాన్ని యాసిన్ నిజార్ పాడారు. నవీన్ భారతి రాసిన ఈ పాటకు జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, డాక్టర్ తోల్ తిరుమావలవన్ విడుదల చేశారు. చైన్నెలో ఈ పాట ఆవిష్కరణ జరిగింది. ఇందులో పాల్గొన్న తోల్తిరుమావలవన్ మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలోని తెండ్రలే మలై తెండ్రలే అనే పల్లవితో సాగే మరో పాటను ఇటీవల విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చినట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను నిర్మాతకు చెందిన విశారద్ క్రియేషన్స్ యూట్యూబ్ చానల్లో పొందుపరిచినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు అనిల్ వి నాగేంద్రన్, సహదర్శకుడు కేజీ.రామకుమార్, రితేష్, వీసీకే పార్టీ సహాయ కార్యదర్శి వన్ని అరసు పాల్గొన్నారు. -
వైభవం..మునీశ్వర్ మహాకుంభాభిషేకం
తిరుత్తణి: మునీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సమీపంలోని ఎస్.అగ్రహారం గ్రామంలో ఎల్లయమ్మన్ గుంట వద్ద 11 అడుగుల ఎత్తులో మునీశ్వర్ విగ్రహం ప్రతిష్టించారు. విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు మహాకుంభాభిషేకం వేడుకలు సందర్భంగా యాగశాలలు ఏర్పాటు చేసి నిత్యహోమగుండ పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి హోమ పూజలు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మునీశ్వరర్ విగ్రహానికి పుణ్యతీర్ధాలతో మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులపై పుణ్యతీర్థాలు చల్లారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. -
క్లుప్తంగా
గొంతుకు ఊయల బిగించుకుని విద్యార్థి మృతి పళ్లిపట్టు: ఊయల గొంతు బిగించుకుని 9వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన శోకాన్ని మిగిల్చింది. వివరాలు.. పొదటూరుపేట పోలీసుల కధనం మేరకు.. దిగువ నెడిగళ్లు గ్రామానికి చెందిన నాగరాజ్ అతని భార్య జ్యోతి దంపతులకు ప్రేమలక్ష్మి(16), కిరణ్(14) అనే ఇద్దరు పిల్లలున్నారు. వారిలో కిరణ్(14) తిరుత్తణిలోని ప్రయివేటు పాఠశాలలో 9వ తరగతి చదువుకునేవారు. ఈ క్రమంలో నాగరాజ్ అతని భార్యతో కలిసి ఆదివారం బందువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో కిరణ్ వుంటుండగా, చీరతో ఊయల కట్టి ఆడుకుంటుండగా, గొంతుకు ఊయల చిక్కుకుని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా చుట్టుపక్కల వారు కాపాడి పొదటూరుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారి మృతి పట్ల పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య అన్నానగర్: అంబత్తూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అంబత్తూరు పోలీస్స్టేషన్ సమీపంలోని మారాజ్పురం ప్రాంతానికి చెందిన అరుణాచలం (30). ఇతని భార్య రాణి. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి 11 గంటలకు అరుణాచలం భార్య రాణి, పిల్లలతో ఇంటి ముందు ఉన్నాడు. ఆ సమయంలో కత్తులు, కొడవళ్లతో ఒక రహస్య ముఠా అక్కడికి వచ్చి అరుణాచలంతో వాగ్వాదానికి దిగి అరుణాచలాన్ని దారుణంగా నరికి చంపారు. భార్య, పిల్లలు భయంతో కేకలు వేశారు. రాణి భర్తను కాపాడేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న అంబత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. వారు అరుణచలం మృతదేహాన్ని శవపరీక్ష కోసం కిల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రయం విషయంలో జరిగిన వివాదంలో ఈ హత్య జరిగిందని తెలిసింది. హత్యకు సంబంధించి వినోద్, శ్రీనివాసన్లను పోలీసులు అరెస్టు చేశారు. యువకుడి హత్య – ముగ్గురు నిందితుల అరెస్ట్ అన్నానగర్: దిండుక్కల్ జిల్లా వత్తలకుండు సమీపంలోని అయ్యంగొట్టై గ్రామానికి చెందిన కోడి అలియాస్ కృష్ణన్ (25) మహిళలను ఎగతాళి చేశాడనే ఆరోపణలతో అయ్యంగొట్టైపుత్తూరు నివాసి దవపాండితో వివాదం ఏర్పడింది. దీని తరువాత, కోడి అలియాస్ కృష్ణన్ అయ్యంగొట్టైపుత్తూరులోని దవపాండి ఇంటికి వెళ్లి ఈ విషయంపై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఉన్న దవపాండి తన బంధువులతో కలిసి శనివవారం రాత్రి అయ్యంకోటలోని ఇంట్లో నిద్రిస్తున్న కృష్ణను ఊఫు మందై గ్రామంలోని కాళియమ్మన్ ఆలయ ప్రాంతానికి పిలిపించారు. రాత్రి యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితిలో, దవపాండి (25), అతని సోదరుడు నాగపాండి (23), స్నేహితుడు సంజయ్ (25) లు తాము దాచిపెట్టిన కత్తితో కోడి అలియాస్ కృష్ణన్ను నరికారు. తీవ్రంగా గాయపడిన కోడి అలియాస్ కృష్ణన్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. తిలకోట్టై డీఎస్పీ సెంథిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీని తర్వాత, కోడి అలియాస్ కృష్ణన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం దిండుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలకు పంపారు. ఇన్స్పెక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని పోలీసులు, హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు దవపాండి, నాగపాండి మరియు సంజయ్ను రాత్రిపూట అదే ప్రాంతంలో దాక్కున్న వారిని అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏడుగురు మత్స్యకారుల అరెస్టు కొరుక్కుపేట: సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని రామేశ్వరానికి చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. వివరాలు.. రామేశ్వరం ఫిషింగ్ పోర్టు నుండి 456 ఫిషింగ్ బోట్లు మత్స్య శాఖ కార్యాలయం నుంచి అనుమతులు పొంది బయలుదేరాయి. వాటిలో ఎక్కువ భాగం హిందూ మహాసముద్రంలో పడవలలో చేపల వేటకు వెళ్లారు. శ్రీలంక సరిహద్దులో ఉన్న నెడుంతీవు సమీపంలో చేపలు పడుతున్నారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో శ్రీలంక నేవీకి చెందిన గస్తీ పడవ కొద్ది దూరం నుంచి మెరుపు వేగంతో మత్స్యకారుల పడవలను చుట్టుముట్టారు. తర్వాత శ్రీలంక నావికాదళం సిబ్బంది మత్స్యకారులైన షణ్ముగం (30), దుతార్ (40), ఎడిసన్ (51), శక్తివేల్ (47), జేసుదీష్ (48), దల్విన్రాజ్ (46), అన్బళగనన్ను అరెస్టు చేసి ఫిషింగ్ బోట్లో తీసుకెళ్లారు. దీంతో వారిని విడిపించాలని కేంద్ర ప్రభుత్వానికి రామేశ్వరం జాలర్లు విజ్ఞప్తి చేశారు ఇంటిపై పెట్రో బాంబులు అన్నానగర్: రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి ఇంటిపై పెట్రో బాంబులు విసిరారు. నైల్లె జిల్లాలోని అంబై ముడప్పాలం నార్త్ స్ట్రీట్కు చెందిన రవిచంద్రన్ (65) రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి. శనివారం రాత్రి కొంతమంది యువకులు అతను నివసించే వీధిలో స్నేహితుడి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ సమయంలో వారు వీధిలో కేక్ కట్ చేస్తూ వీరంగం సృష్టించారు. దీంతో రవిచంద్రన్ వారిని మందలించాడు. దీంతో యువకులు అర్ధరాత్రి రవిచంద్రన్ ఇంటిపై నాలుగు పెట్రో బాంబులు వేసి పారిపోయారు. వాటిలో 2 పేలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పేలని రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మతతత్వ శక్తుల వ్యూహాల్ని ఛేదిద్దాం!
● మరింతగా శ్రమిద్దాం ● ప్రజల్లో మద్దతు పెరిగింది ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: మతతత్వ శక్తుల వ్యూహాల్ని తమిళనాడులో భగ్నం చేద్దామని, వారికి ఇక్కడ చోటు లేదని నిరూపిద్దామని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరింతగా శ్రమిద్దామని, మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంద్దామని కేడర్కు పిలుపునిచ్చారు. ప్రజలలో మద్దతు అన్నది పెరుగుతున్నదని, బాధ్యతతో మరింతగా ముందుకెళ్దామన్నారు. వివరాలు.. సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వన్ టూ వన్గా నేతలతో సమావేశాలను విస్తృతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేడర్ను అప్రమత్తం చేస్తూ ఆదివారం లేఖ రాశారు. 10 సంవత్సరాలు అధికారం అన్నది దూరంగా ఉన్నప్పుడు, ద్రవిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కేడర్ పడ్డ శ్రమ, సేవలను ఈసందర్భంగా గుర్తు చేశారు. తనను సీఎంగా కూర్చోబెట్టిన క్షణాలలో కేడర్ ఆనందాన్ని పేర్కొంటూ, అఽధికారంలోకి వచ్చినానంతరం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాగ్దానాలన్నీ విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో జూన్ 1న మధురైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోదరా కదలిరా నినాదంతో నియోజకవర్గ నేతలను స్వయంగా తానే కలిసి పార్టీ పరంగా పరిస్థితులను ఆరా తీస్తూ వస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్దాం.. తమిళనాడు ప్రజలు ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ఇంటింటా జరుగుతున్న సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తున్నదన్నారు. జూలై 1న చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 77 లక్షలమందికి పైగా కొత్త సభ్యులు పార్టీలో చేరి ఉన్నారని వివరించారు. తమిళనాడు, తమిళ సంస్కృతి అంటూ ప్రగల్బాలు పలుకుతూ ఓ వైపు, మరోవైపు తమిళనాడుకు నిధులు ఇవ్వకుండా అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న వాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి వ్యూహాలను రచిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలను మత పరంగా విభజించి, ఇక్కడ పాగా వేయాలన్న కుట్రలతో ఉన్న మతతత్వ శక్తులను పాదం మోపనీయకుండా అడ్డుకుంద్దామని కేడర్కు పిలుపు నిచ్చారు. ఇందు కోసం ప్రజలందర్నీ ఒకే జట్టుగా ఒకే వేదికగా నిలబెడుదామని, సభ్యత్వ నమోదును మరింత విస్తృతం చేద్దామని సూచించారు. అన్ని వర్గాల ప్రజల నుంచి ద్రావిడ మోడల్ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని, అదే సమయంలో బాధ్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మద్దతు పెరిగేకొద్దీ, బాధ్యత కూడా పెరుగుతుందని, వారి అంచనాలను తీర్చదానికి మరింతంగా అందరం కష్టపడి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. విజయమే లక్ష్యంగా మరింతగా శ్రమించేందుకు ప్రతి ద్రావిడ సైనికుడు సిద్ధం కావాలని కోరారు. -
సారీ కాదు.. న్యాయం కావాలి!
● లాకప్ డెత్లపై విజయ్ ● చైన్నెలో తొలిసారిగా నిరసన ● డీఎంకేపై వ్యాఖ్యల తూటాలు సాక్షి, చైన్నె : సారీ కాదు...న్యాయం కావాలంటూ లాకప్ డెత్ మరణాలపై తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పబ్లి సిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం...నేడు సారీమా..! ప్రభుత్వంగా మారినట్టుందని విమర్శించారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుభువనంలో జరిగిన సెక్యూరిటీ గార్డు అజిత్కుమార్ లాకప్ డెత్తో పాటూ డీఎంకే హయాంలో వివిధ ప్రాంతాలలో చోటు చేసుకున్న 24 మరణాలకు న్యాయం కోరుతూ తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో చైన్నెలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఆపార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రపథమంగా చైన్నెలో నిరసనకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. లాలప్ డెత్ మరణాలకు సంబంధించిన బాధిత కుటుంబాలతో కలిసి వేదిక మీద నుంచి తన నిరసన తెలియజేశారు. సారీ వద్దు..న్యాయం కావాలని అన్న నినాదంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించారు. విజయ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు, కేడర్ నిరసనకు తరలి రావడంతో ఆ సరిసరాలు కిట కిటలాడాయి. తోపులాట సైతం జరగడంతో స్వల్పంగా పలువురు గాయపడ్డారు. నిరసనలో ఆ పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితర ముఖ్యులు ప్రసంగిస్తూ డీఎంకే, బీజేపీలపై శివాలెత్తారు. సారీ మా సర్కారు.. విజయ్ మాట్లాడుతూ అజిత్ కుమార్లాకప్ డెత్ కేసును గుర్తు చేస్తూ, ఆ కుటుంబానికి ఒక్క సారీ చెబితే సరి పోతుందా..? అని ప్రశ్నించారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చారు...సారీచెప్పారు..అయితే, గత నాలుగేళ్లలో జరిగిన 24 లాకప్ డెత్ ఘటనలలో బాధిత కుటుంబాలకు సారీ చెప్పారా...? చెప్పకుండా ఉంటే చెప్పేయండి..! అని డిమాండ్ చేశారు. అలాగే నష్ట పరిహారంకూడా ఇచ్చేయండి సీఎం సార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ ద్రావిడ మోడల్ ప్రభుత్వం ప్రస్తుతం సారీ మా సర్కారుగా మారిందని విమర్శించారు. ఏదైనా ఘటన జరిగితే సారీ చెప్పడం అదే పనిగా పెట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. తెలియకుండా జరిగిందీ.., జరగకూడదని జరిగిందీ...సారీ అంటూ ఒక్కమాటతో ఈపాలకులు ముగించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. మీరు చేసిందేమిటో.. గతంలో సాత్తాన్కులంలో తండ్రికుమారుడు జుడిషియల్ కస్టడీలో మరణిస్తే, కేసును సీబీఐకు అప్పగించడం తమిళనాడు పోలీసులకు అవమానం అని వ్యాఖ్యలు చేసిన వాళ్లు, ఇప్పుడు అజిత్కుమార్ విషయంలో చేసిందేమిటో? అని ప్రశ్నించారు. తమిళగ వెట్రి కళగం నేతృత్వంలో న్యాయ పోరాటం ద్వారా ప్రత్యేక సిట్కు పట్టుబడుతున్న సమయంలో విచారణకు భయపడి ముందస్తుగానే సీబీఐ విచారణకు అప్పగించారని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కనుసన్నల్లో ఉన్న సీబీఐకు అప్పగించి కేంద్ర ప్రభుత్వం వెనుక దాక్కోవడం ఎందుకో.? అని సీఎంస్టాలిన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇంకా ఎన్ని ఘోరాలు, నేరాలు చూడాలంటూ, అన్నావర్సిటీ మొదలు అజిత్కుమార్ కేసు వరకు కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక తమరెందుకు సార్...తమరి ప్రభుత్వం ఎందుకు సార్. తమరికి సీఎం కుర్చీ ఎందుకు సార్..! అంటూ చమత్కారాలతో ప్రశ్నలను సీఎంను ఉద్దేశించి చేశారు. తాను ఎలా ప్రశ్నించినా తమరి వద్ద సమాధానం అన్నది ఉండదను సార్ అంటూ తమరికి తెలిసిందంతా సారీ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేసిన తప్పులకు ప్రాయచ్చిత్తంగా శాంతి భద్రతలను పునరుద్ధరించండి, బాధితులకు న్యాయం చేయండి అని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలతో కలిసి తాము సరి చేయాల్సి ఉంటుందని, ఎలాంటి పోరాటాలకై నా వెనుకాడే పరిస్థితి లేదనిహెచ్చరించారు. -
వీరాణం చెరువుకు జలకళ
తిరువొత్తియూరు: చైన్నెకి తాగునీటిని సరఫరా చేసే వీరాణం సరస్సు మళ్లీ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. చైన్నె నగరం తన తాగునీటి అవసరాల కోసం పూండి, చోళవరం, పుళల్, కన్నన్ కోట్టై తేర్వాయి కండ్రిగై, సెంబరం పాక్కం, వీరాణం సరస్సుల నుంచి నీటిని వినియోగిస్తారు. వీరాణం సరస్సు కడలూరు జిల్లాలోని కాట్టుమన్నార్ కోవిల్ సమీపంలో ఉంది. జిల్లాలో ఇది అతిపెద్ద నీటి వనరు. దీని పూర్తి సామర్థ్యం 47.50 అడుగులు. పూర్తి సామర్థ్యం 1,465 మిలియన్ క్యూబిక్ అడుగులు. ఈ సరస్సు మూలంగా కడలూరు జిల్లాలోని కావేరి డెల్టా ప్రాంతాలైన చిదంబరం, కట్టుమన్నార్ కోవిల్, భువనగిరి, తిరుముద్దంలోని 44,856 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తోంది. ఈ చెరువు నుంచి ముఖ్యంగా చైన్నెకి రోజూ నీటిని పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి 27న వీరానం సరస్సు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగా, జూన్ 4న రెండోసారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. వీరాణం సరస్సు నుంచి సేథియాతోప్పు వీఎన్ఎస్ ఆనకట్ట ద్వారా మిగులు నీటిని విడుదల చేయడం, చైన్నెకి సెకనుకు 74 క్యూబిక్ అడుగుల నీటిని సరఫరా చేయడం వల్ల ఇది జరిగింది. దీని వలన సరస్సు నీటి మట్టం దాని మొత్తం నీటి మట్టం నుంచి 45.25 అడుగులకు తగ్గింది. ఈ క్రమంలో, ప్రజా పాలన శాఖ అధికారులు కొన్ని రోజుల క్రితం దిగువ ఆనకట్ట నుంచి వడవారు ద్వారా సెకనుకు 1,800 క్యూబిక్ అడుగుల నీటిని విడుదల చేశారు. దీని కారణంగా, వీరనం సరస్సు నీటి మట్టం మళ్లీ క్రమంగా పెరగడం ప్రారంభమైంది. ఈ పరిస్థితిలో వీరాణం సరస్సు శనివారం సాయంత్రానికి పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. ఈ సంవత్సరం మూడోసారి వీరాణం సరస్సు పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే శనివారం నాటికి దిగువ జలాశయం నుంచి వీరాణం సరస్సుకు సెకనుకు 1000 క్యూబిక్ అడుగుల నీరు ప్రవహిస్తోంది. ఎప్పటిలాగే చైన్నె ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి సెకనుకు 74 క్యూబిక్ అడుగుల నీటిని పంపుతున్నారు. -
గూడ్స్ రైలులో.. మంటలు
చైన్నె తండయార్పేట నుంచి ఆదివారం ఉదయం మైసూరు వైపు క్రూడ్ ఆయిల్తో బయలుదేరిన గూడ్స్ ట్యాంకర్లో భారీ అగ్నిప్రమాదానికి గురైంది. తిరువళ్లూరు సమీపంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. ఐదు జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సుమారు పది గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా రైలు సేవలు ఆగాయి. ఇక ఆ పరిసరాలన్నీ దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నట్టుగా పొగ నిండిపోయింది.తిరువళ్లూరు: సాధారణంగా ఉదయం వేళలలో చైన్నె వైపుగా కోయంబత్తూరు, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో రైళ్ల రాక పోకలు సాగిస్తుంటాయి. అలాగే ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు మరింత వేగంగా పరుగులు తీస్తుంటాయి. నిత్యం బిజీగా ఉండే రైల్వేమార్గంలో హఠాత్తుగా జరిగిన ఘటన ప్రయాణికుల్నేకాదు, అధికారులు ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. చైన్నె తండయార్ పేటలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 52 ట్యాంకర్లతో క్రూడ్ ఆయిల్తో గూడ్స్ రైలు మైసూరు వైపు ఆదివారం ఉదయం బయలుదేరింది. ఒక్కో ట్యాంకర్లో సుమారు 70 వేల లీటర్లు ఆయిల్ సామర్థ్యం వుంది. ఈ క్రమంలో ట్యాంకర్ గూడ్స్ రైలు తిరువళ్లూరు రైల్వే స్టేషన్ దాటి వెళ్తుతున్న క్రమంలో ఉదయం 5 గంటలకు భారీ శబ్దంతో ప్రమాదానికి గురైంది. రైలు నుంచి ఏర్పడిన శబ్దంతో రైల్వేట్రాక్ సమీపంలో నివాసం వుంటున్న సంచార కులాలకు చెందిన కుటుంబాలు, ఎస్టీ సామాజికవర్గ ప్రజలు, వరధరాజర్ నగర్ ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. స్వల్పంగా ట్యాంకర్ నుంచి మంటలు రావడం ప్రారంభమై క్షణాల్లో ఇతర ట్యాంకర్ల వైపుగా వ్యాపించింది. ఇంజిన్ నుంచి మూడవ ట్యాంకర్తో మొదలైన మంటలు క్షణాల్లో 12 ట్యాంకర్లకు వ్యాపించింది. ఉరకులు పరుగులు.. భారీగా మంటలు ఎగిసిపడి పొగలు కమ్ముకోవడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వచ్చిన రైల్వే అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రమాధం తీవ్రతను గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన తిరువళ్లూరు, తిరువూర్, పేరంబాక్కం తదితర అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా పలితం దక్కకపోగా మరింతగా మంటలు ఎగిసిపడింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల దూరం మేరకు పొగలు కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, మంత్రి నాజర్, జీఎం ఆర్ఎన్ సింగ్, డీఆర్ఎం విశ్వనాథన్, రైల్వే ఎస్పి ఈశ్వరన్తో పాటు పలువురు ఉన్నత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్తితిని సమీక్షించారు. ప్రమాదం తీవ్రతను గుర్తించి కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, చైన్నె, తిరువళ్లూరు తదితర జిల్లాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, వాహనాలను రప్పించారు. దీంతో పాటు గుమ్మిడిపూండి, తిరుమళిసై, అంబత్తూరు, శ్రీపెరంబదూరు సిప్కాట్లలోని ప్రవేటు పరిశ్రమలకు చెందిన వాహనాలను సైతం పిలిపించి నీటిలో ఫోమ్ను కలిపి మంటలను అదుపు చేశారు. దీంతో పాటూ అరక్కోణం జాతీయ విపత్తు నిర్వాహణ బృందాలకు చెందిన సిబ్బందిని సైతం రంగంలోకి దించారు. దాదాపు పది గంటల పాటు శ్రమించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 12 ట్యాంకర్లు, 8.40 లక్షల లీటర్లు క్రూడ్ ఆయిల్ అగ్నికి ఆహుతి అయ్యింది. దట్టమైన పొగ.. ప్రమాదం క్షణాల్లో వ్యాపించిన క్రమంలో మంటలు ఎగిసిపడింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో సమీప ప్రాంతాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. గుండె శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఎస్టీ సామాజిక వర్గాల గృహాలు, సంచార కులాలకు చెందిన ప్రజలు, వరధరాజనగర్ ప్రాంతాలకు చెందిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. గర్భిణులు, చిన్నపిల్లలను సైతం అంబులెన్స్లో తరలించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. కిలో మీటర్లకొద్ది దట్టమైన కారు మబ్బులుకమ్ముకున్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా పలు గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. ఎక్కడికక్కడ ఆగిన రైళ్లు తిరువళ్లూరు సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. అరక్కోణం నుంచి చైన్నె వైపు వస్తున్న చైన్నె మెయిల్ను ఏకాటూరు వద్ద నిలిపి వేయడంతో ప్రయాణికులు దాదాపు మూడు కిలోమీటర్ దూరం మేరకు నడక సాగించి తిరువళ్లూరు, మనవాలనగర్కు చేరుకుని బస్సు, లోకల్ రైళ్ల ద్వారా చైన్నెకు బయలుదేరారు. కాగా సేలం, తిరుపత్తూరు, మైసూరు, బెంగళూరు, తిరుపతి, తిరుత్తణి, కాట్పాడి, జోలార్పేట తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వచ్చిన రైళ్ళును అక్కడిక్కడే నిలిపి వేశారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రైలులోనే వుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీరు, ఆహారం అందక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తిరువేళాంగాడు, కడంబత్తూరు తదితర ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రయాణికులను చైన్నెకు తరలించారు. చైన్నె నుంచి తిరువళ్లూరు మీదుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పదికి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో పది ఎక్స్ప్రెస్ రైళ్లను ఎక్కడిక్కడే నిలిపివేవారు. ఐదు ఎక్స్ప్రెస్ రైళ్లనుదారి మళ్లించారు. కాగా తిరుత్తణి, తిరువళ్లూరు, తిరుపతి, అరక్కోణం, తిరువణ్ణామలై, కాట్పాడి తదితర ప్రాంతాల నుంచి చైన్నె వైపు వెూటఛీుఽ వందకు పైగా లోకల్ రైలు రాకపోకలను సైతం నిలిపివేశారు. తండయార్పేట నుంచి మైసూరుకు వెళ్తున్న సమయంలో ఘోరం క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు దగ్ధం 70 వేల లీటర్లు సామర్థ్యం వున్న 12 ట్యాంకర్లు అగ్నికి ఆహుతి రూ.13 కోట విలువైన 8.40 లక్షల లీటర్ల ఆయిల్ నష్టం రెళ్ల రాకపోకలు నిలిపివేత ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు దెబ్బతిన్న నాలుగు రైల్వే లైన్లు,సిగ్నల్ బోర్డు, విద్యుత్ లైన్లు ధ్వంసమైన రైల్వేట్రాక్ ప్రమాదం తీవ్రత ఎక్కువ కావడంతో ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగించే ట్రాక్లు కూడా చిద్రమయ్యాయి. పట్టాలు సైతం మంటల తీవ్రతకు ముక్కలయ్యా. నాలుగు ప్రధాన లైన్లులోని విద్యుత్ లైన్లు, ట్రాక్, సిగ్నల్ బోర్డులు ద్వంసం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా ప్రమాదం జరిగిన ప్రాంతాలకు సమీపంలో వున్న నివాసాలకు సైతం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వీటి పునరుద్ధరణకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం: ఉదయం ఐదు గంటలకు ప్రమాదం జరగ్గా, దాదాపు పది గంటల పాటు శ్రమించిన అధికారులు సాయంత్రం మూడుగంటలకు మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు కాస్త అదుపులోకి రాగానే రైల్వే సిబ్బంది సుమారు మూడువందల మందితో సహాయక చర్యలను ప్రారంభించారు. మొదట నష్టం తక్కువగా వున్న లోకల్ రైల్వే ట్రాక్లకు విద్యుత్ పునరుద్ధరణ, పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సరిచేయడం, సిగ్నల్ బోర్డు మరమ్మతులను ప్రారంభించారు. ఇప్పటికే రైల్వేకు చెందిన భారీ వాహనాలు, 10 ప్రోక్లెయిన్స్, జేసీబీలతో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో వున్న మరో రెండు ట్యాంకర్లలోని క్రూడ్ ఆలయిల్ను లారీలోకి నింపే ప్రక్రియను సైతం ప్రారంభించారు. కాగా రైల్వే ఉన్నత అధికారులుసైతం అక్కడే వుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాటికి రెండు లైన్లును సరి చేసి రాకపోకలను పునరుద్ధరించే అవకాశం వుంద అధికారులు వెల్లడించారు. -
మహా కుంభాభిషేకం
తిరుప్పరకుండ్రంలో నేడు తిరుప్పరకుండ్రంలో ఏర్పాటు.. (ఇన్సెట్) మీనాక్షి, సుందరేశ్వరులు ● తరలి వస్తున్న భక్తులు సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో మహాకుంభాభిషేక వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడి వేడుక కోసం మదురై నుంచి మీనాక్షి అమ్మన్ మరియు సుందరేశ్వరర్ స్వామి వారు తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నిఘా కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో మురుగన్కు ఉన్న ఆరుపడై వీడులలో మొదటిదిగా తిరుప్పరకుండ్రంప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. మదురై జిల్లా తిరుప్పరకుండ్రం కొండపై సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో గత కొన్నేళ్ల అనంతరం మహాకుంభాభిషేకానికి హిందూ, దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. రాజగోపురంను పంచవర్ణాలతో తీర్చిదిద్దారు.జీర్ణోద్దారణ పనులు ముగియడంతో ఈనెల పదో తేది నుంచి ఇక్కడ కుంభాభిషేకానికి సంబంధించినయాగ శాల పూజలు జరుగుతూ వచ్చాయి. ఆలయం ఆవరణలో వళ్లి దేవానై మండపం ఆవరణలో యాగ శాల పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక యాగాలు, పూజలు జరిగాయి. సోమవారం వేకువ జామున మూడున్నర గంటల నుంచి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకు యాగశాల నుండి పవిత్ర జలాలను కలశాలలోఉంచి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఉదయం 5.25 గంటలకు రాజగోపురంలోని 7 కలసాలకు పవిత్ర అభిషేకాలు జరగనున్నాయి. అలాగే, ఆలయ ప్రాంగణంలోని గోవర్ధన ఆలయంలో, విమాన ప్రకారంలకు అభిషేకాలు నిర్వహించనున్నారు.సరిగ్గా 6.10 గంటలకు మురుగన్ సన్నిధిలో మహాకుంభాభిషేకం జరగనున్నది. ఈ వేడుక నిమ్తితం తమిళనాడులోని మురుగన్ భక్తులు ఆదివార ం మధ్యాహ్నం నుంచే తిరుప్పర కుండ్రం వైపుగా పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది. మీనాక్షి, సుందరేశ్వరుల పయనం మదురైలోని తిరుప్పరంకుండ్రంలో జరగనున్న కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకుని మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర్ స్వామి ఆదివారం తమ ఆలయం నుంచి తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. మదురై ఆలయంలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి పది గంటలకు స్వామి, అమ్మవారులు తిరుప్పరకుండ్రంకు బయలు దేరగా దారి పొడవున భక్తులు కర్పూర నీరజనాలు పలికారు. తిరుపరంకుండ్రంకు అర్ధరాత్రి చేరుకుని కుంభాభిషేకం అనంతరం మదురై ఆలయానికి స్వామి,అమ్మవార్లు తిరిగి వచ్చేందుకు సమయం పట్టనున్న దృష్ట్యా, సోమవారం మీనాక్షి అమ్మన్ ఆలయంలో భక్తులకు దర్శనంరద్దు చేశారు. తిరుప్పర కుండ్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. -
24 నుంచి పళణి మలి విడత పర్యటన
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మలి విడత పర్యటన రూట్ మ్యాప్, షెడ్యూల్ను ఆదివారం ప్రకటించారు. ప్రజలను, తమిళనాడును రక్షిద్దామన్న నినాదంతో ప్రజా చైతన్య యాత్రకు ఈనెల 7వ తేదీన పళణిస్వామి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు అనూహ్య స్పందన అన్నాడీఎంకే వర్గాల నుంచి వస్తోంది. తొలి విడత పర్యటన 23వ తేదీ వరకు అని ముందుగా ప్రకటించారు. తాజాగా మలి విడత పర్యటన షెడ్యూల్ను ప్రకటించారు. ఈ మేరకు 24వ తేదిన పుదుకోట్టై జిల్లా గందర్వ కోట్టై నుంచి మలి విడత పర్యటన ప్రారంభం కానుంది. తొలి రెండు రోజులు పుదుకోట్టై జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో పర్యటించనున్నారు. 26వ తేదీన శివంగంగై జిల్లా, ఆతదుపరి మూడు రోజుల అనంతరం 30, 31తేదీలలో రామనాథపురం జిల్లా ఆగస్టు 1,2 తేదిలలో తూత్తుకుడి జిల్లా, 4,5,6 తేదిలలో తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో, 7,8 తేదీలలో విరుదునగర్ జిల్లాలో పర్యటన జరగనుంది. కాగా, ఆదివారం కడలూరుజిల్లాలో పళణి పర్యటన విస్తృతంగా సాగింది. -
సర్వ దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆక్టోపస్ సర్కిల్ వరకు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 92,221 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాయం కంటే ముందు వస్తే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
శక్తి తిరుమగన్ విడుదలకు తేదీ ఖరారు
తమిళసినిమా: విజయ్ ఆంటోనీదో సెపరేట్ రూట్ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ నది ఒంటరి పోరు అని పేర్కొనవచ్చు చిన్న పరిశ్రమంలో ఎంతో పోరాడి సంగీత దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ శాఖలో విజయం సాధించి ఆ తర్వాత కథానాయకుడుగా అవతారం ఎత్తారు అక్కడ సక్సెస్ అయ్యి ఆ తర్వాత నిర్మాతగా ఎడిటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన కథానాయకుడు దర్శకుడు నిర్మాత ఎడిటర్ సంకేత దర్శకుడు అంటూ బహుముఖ ప్రతిభావంతుడుగా తనను తాను నిరూపించుకున్నారు. ఇటీవల విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి, సంగీతాన్ని అందించి, నిర్మించిన చిత్రం మార్గన్. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మార్గం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు గాను విజయ్ ఆంటోని కతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన మరో చిత్రం శక్తి తిరుమగళ్. దీనికి ముందుగా పరాశక్తి అనే టైటిల్ నిర్ణయించారు అయితే ఆ టైటిల్ వేరే వారు రిజిస్టర్ చేయడంతో ఆ తర్వాత శక్తి తిరుమగన్ అనే టైటిల్ ఖరారు చేశారు. అదేవిధంగా తెలుగులోనూ రూపొందుతున్న ఈ చిత్రానికి భద్రకాళి అనే టైటిల్ నిర్ణయించారు. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. తృప్తి రవి నాయకిగా నటిస్తున్న ఇందులో వాగై చంద్రశేఖర్ సునీల్ గిరి పలని సెల్మురుగన్ కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఇది విజయ్ ఆంటోని కథానాయకుడు నటిస్తున్న 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళం ,తెలుగు భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనట్లు అధికారికంగా ప్రకటించారు. -
పెరుగుతున్న చాక్లెట్ అమ్మకాలు
షేడ్ హౌస్ నిర్మాణానికి భూమి పూజకొరుక్కుపేట: పూందమల్లి బైపాస్ బస్టాండ్ వద్ద రూ.35 కోట్లతో పెద్ద షేడ్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా పూందమల్లి నగర్లోని 20వ వార్డులోని శక్తినగర్లో రూ.16 లక్షలతో కొత్త దుకాణ భవనాన్ని నిర్మించడానికి భూమి పూజను ఎమ్మెల్యే కృష్ణసామి చేశా రు. డీఎంకే నగర కార్యదర్శి జీ.ఆర్. తిరుమల ము న్సిపాలిటీ చైర్మన్ కాంచన, వైస్ చైర్మన్ కే.శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ ఎం.శరవణ కుమార్, పారిశుధ్య అధికారి గోవిందరాజ్, డీఎంకే కార్యనిర్వా హకులు ఏ.విమల్ ఆనంద్, మాజీ పబ్లిక్ ప్రాసి క్యూటర్ రాజేంద్రన్, పి.అన్బళగన్ పాల్గొన్నారు.నీలగిరిలో పెరుగుతున్న చాక్లెట్ అమ్మకాలుకొరుక్కుపేట: నీలగిరిలోని ఒక చాక్లెట్ దుకాణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. కిలోల చొప్పున అమ్ముతున్నారు. కేజీ రు.800లకే విక్రయంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. భారతదేశానికి వచ్చిన అంకోరియన్లు తమ సొంత అవసరాల కోసం తమ ఇళ్లలోనే కేక్లు, చాక్లెట్లు తయారు చేసుకోవడం ప్రారంభించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వంటకాలు అమితంగా ఇష్టపడుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఇంట్లో తయారు చేసిన మాచా చాక్లెట్లు ఉదయపూర్, కొడైకెనాల్ వంటి కొన్ని కొండ ప్రాంతాల్లో మాత్రమే తయారవుతాయి. మంచి నాణ్యత గల, స్వచ్ఛమైన కోకో ఆధారిత, ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు కూడా కిలోకు రూ.800కు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్ నిలిపివేత
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.🚨 #Breaking: Massive fire engulfs a diesel freight train near Tiruvallur, Tamil Nadu. Several major trains from MGR Chennai Central have been canceled for today, July 13, as a safety precaution. Passengers are advised to check with @GMSRailway for updates.#TrainFire #TamilNadu… pic.twitter.com/1ipJg4q94M— Shubham Rai (@shubhamrai80) July 13, 2025ఇక, గూడ్స్ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.Major fire broke out very near tiruvallur railway station! Oil trail got collapsed n breakup a major fire.. #tiruvallur #tiruvallurrailwaystation #railway #SouthernRailway @RailMinIndia @IRCTCofficial @GMSRailway @UpdatesChennai @THChennai @polimernews pic.twitter.com/YJ8G534hpc— arsath ajmal (@ajmalji) July 13, 2025 A fuel-laden railway tanker caught fire near Tiruvallur.Thick black smoke and intense flames engulfed the area, disrupting train services.Firefighters are on the scene, & officials are investigating the cause.#TrainFire #BreakingNews #ChennaiUpdates @NewIndianXpress@xpresstn pic.twitter.com/Pc3jwtJJDd— Ashwin Prasath (@ashwinacharya05) July 13, 2025 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్కు వచ్చే ఎక్స్ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 🚨 BREAKING: Goods train derails and catches fire near Tiruvallur railway station in Tamil Nadu. Rescue operations currently underway. 🚂🔥#TiruvallurTrainAccident #TamilNadu #TrainDerailment #RescueOperations #Breaking #IndianRailways #Emergency #SafetyFirst pic.twitter.com/NShYM4uw8K— Benefit News 24 (@BenefitNews24) July 13, 2025Southern Railway tweets, "Due to a fire incident near Tiruvallur, overhead power has been switched off as a safety measure. This has led to changes in train operations. Passengers are advised to check the latest updates before travel." pic.twitter.com/LTvTAFYNqu— ANI (@ANI) July 13, 2025 -
అనుభవజ్ఞులు లేని పార్టీ విజయం సాధించలేదు
తమిళసినిమా : అనుభవజ్ఞులు లేని ఏ సంఘం, ఏ పార్టీ అయినా విజయం సాధించలేదని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఎంపీ వెంకటేష్ రాసిన వేల్ పారి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం స్థానిక కలైవానర్ అరంగం ఆవరణలో ఏవీ వేలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనానన్నారు. అదే వేడుకలు ప్రభుత్వ అధికారులు, మంత్రులు పాల్గొన్నారని.. వారంతా తను మిత్రులు లేరని పేర్కొన్నారు. ఆ వేదికపై ఓల్డ్ స్టూడెంట్స్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని వారు తరగతల గది నుంచి బయటకు వెళ్లరని చెప్పానన్నారు. అయితే వారంతా మూల స్తంభాలు, వ్యవస్థాపకులు, అనుభవజ్ఞులు కాలేరని, వారు నిర్వహించే సంఘాలు గాని పార్టీలు కానీ విజయం సాధించలేవని అన్నానన్నారు. అయితే తాను చెప్పదలచుకున్నది వేరని , అనుభవజ్ఞులు కాకపోతే విజయం సాధించలేరు అని చెప్పలేక పోయానని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటి మిస్టేక్ చేయకూడదు అని, సరిగా మాట్లాడాలని భావించానన్నారు. 1996 ప్రాంతంలో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ని రెండు మూడు సార్లు కలిసే అవకాశం కలిగిందన్నారు. అప్పుడు ఆయన మహారాష్ట్రలో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేశానని 10 పశువులు ఉన్నాయని చాలా పుస్తకాలు కొనుగోలు చేశానని ఆ పుస్తకాలు చదువుతూ అక్కడే శేష జీవితాన్ని గడపాలన్న ఆశను వ్యక్తం చేశారన్నారు. అప్పుడు తనకు రాజకీయాల కంటే ఆయన చెప్పిన ఆ విషయం బురల్రోకి ఎక్కిందన్నారు. అప్పటినుంచి మంచి పుస్తకం లభిస్తే విశ్రాంతి సమయంలో అలాంటి ఒక ప్రాంతంలో ఆ పుస్తకాలు చదువుతూ గడపాలన్నది తన కోరిక అని చెప్పారు. దీంతో పలు పుస్తకాలను సేకరిస్తున్నట్లు చెప్పారు కలలు ఏ రూపంలో ఉన్న వాటిని ఆస్వాదించడానికి తమిళ ప్రజలు జాతి, మతం, భాషా భేదాలను చూడరన్నారు. హ్యాట్సాఫ్ నీ కాళ్లకు నమస్కరిస్తున్నాను అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. -
ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టులోని ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించే విధంగా రూ.1.75 కోట్లతో అదనపు భవన నిర్మాణ పనులను భూమిపూజతో ఎమ్మెల్యే చంద్రన్ శనివారం ప్రారంభించారు. పళ్లిపట్టు శివారులోని కోనేటంపేటలో పళ్లిపట్టు ప్రభుత్వాస్పత్రి వుంది. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచే విధంగా ఆరోగ్యశాఖ నిధుల నుంచి రూ.1.75 కోట్లతో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి అదనపు భవనం నిర్మాణ పనులకు తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ భూమి పూజ చేశారు. ఇందులో ప్రజాపనుల శాఖ ఈఈ దేవన్, ఎస్టీఓ మురళి, మండల డీఎంకే కార్యదర్శి శ్రీనివాసన్, పట్టణ కార్యదర్శి సెంథిల్కుమార్, పట్టణ చైర్పర్సన్ మణిమేగళై, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో చికిత్స పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన మహిళలు ఆస్పత్రిలో అదనపు వైద్యులు నియమించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే చంద్రన్ ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వైద్యులు, వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
బూత్ ఏజెంట్లే విజయంలో కీలకం
పళ్లిపట్టు: అన్నాడీఎంకే విజయంలో బూత్ ఏజెంట్లే కీలకమని ఎన్నికల వేళ అప్రమత్తంగా వ్యవహరించి ఓటరు జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీవీ రమణ అన్నారు. పళ్లిపట్టు, ఆర్కేపేట, తిరుత్తణి మండలాల్లో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల సమావేశం శనివారం నిర్వహించారు. పళ్లిపట్టు మండల అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహిహించిన బీఎల్ఓల సమావేశానికి మండల కార్యదర్శి టీడీ శ్రీనివాసన్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బీవీ రమణ, మాజీ ఎంపీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి తిరుత్తణి హరి, జిల్లా ఎన్నికల పరిశీలకులు విజయకుమార్ పాల్గొని బీఎల్ఓలకు ఓటరు జాబితాతో పాటు నూతన ఫారాలు, ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్లు చేర్పునకు సంబంధించి అవగాహన కల్పించారు. ఆవిన్ మాజీ చైర్పర్సన్ వేలంజేరి కవిచంద్రన్, పొదటూరుపేట టౌన్ చైర్మన్ రవిచంద్రన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి జయవేలు, నేతలు శాంతిప్రియ, కృష్ణమ నాయుడు, చంద్రబాబు పాల్గొన్నారు. -
రుణాల పంపిణీలో అవకతవకలు
తిరుత్తణి: బ్యాంకు రుణాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్లో రైతు సంఘం అధ్యక్షుడు డిమాండ్ చేశారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ స్థాయి అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా నుంచి రైతులు పాల్గొన్నారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు. సమావేశంలో రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్రాజు మాట్లాడుతూ నొచ్చిలిలోని ఇండియన్ బ్యాంకులో అర్హులైన రైతులకు, వ్యాపారులకు బ్యాంకు రుణాలు పంపిణీ చేయకుండా కమీషన్ల కోసం బ్యాంకు అధికారులు కుమ్మకై ఇతర ప్రాంతాలకు చెందిన వారికి రూ.7కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో బ్యాంకు నష్టాల్లో కూరుకుపోయిందని, రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు నష్టాల్లో వున్నట్లు తెలిపారు. అవకతవకలకు పాల్పడిన బ్యాంకు అధికారులు, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సీఎస్బీఎస్ ఒప్పందం కీలకం
తిరువళ్లూరు: టీసీఎస్తో ప్రత్యూష కళాశాల కుదుర్చుకున్న కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఒప్పందం ద్వారా భవిషత్తులో నైపుణ్యవంతమైన ఇంజినీర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందని టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా అరణ్వాయల్కుప్పంలోని ప్రత్యూష్ కళాశాల సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్తో కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్పై కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సంబంధిత ఒప్పందంపై టీసీఎస్ అకడమిక్ హెడ్ సుశీంద్రన్, ప్రత్యూష్ కళాశాల చైర్మన్ రాజారావ్ పరస్పర అంగీకారంతో సంతకం చేశారు. చైర్మన్ రాజారావ్ మాట్లాడుతూ పరస్పర సహకారంతో విద్యారంగం, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి సీఎస్బీఎస్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ప్రిన్సిపల్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల నిఫుణుల నుంచి మార్గదర్శకత్వం, ఆచరణాత్మక శిక్షణ, ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి సీఎస్బీస్ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్లేస్మెంట్ డైరెక్టర్ హైమావతి పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నె వైద్యుడి నుంచి రూ.2.90 కోట్లు దోచుకున్న ముఠా – సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కొరుక్కుపేట: ముంబై సైబర్ క్రైమ్పోలీసు అధికారులుగా నటిస్తూ చైన్నెలో ఓ వైద్యుడినుంచి రూ.2.9 కోట్లు దోపిడీ చేసిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు సోదిస్తున్నారు. వివరాలు.. ముంబాయ్ సైబర్ క్రైమ్ పోలీసు డివిజన్ నుంచి వచ్చినట్టు చెప్పుకుని ఓ రహస్య ముఠా చైన్నె కు చెందిన ఒక వైద్యుడిని సంప్రదించారు. కేసు పెడతామని బెదిరించి వారి నుంచి రూ.2.90 కోట్లు లాగేసుకున్నారు. అంతలోనే మోస పోయానని గ్రహించిన వైద్యుడు జరిగిన దాని ని అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తోంది. విద్యార్థినులకు లైంగిక వేధింపులు – ప్రభుత్వ టీచర్ అరెస్ట్ తిరువొత్తియూరు: ఓమలూరు సమీపంలో ఐదుగురు విద్యార్థినుల వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని ఓమలూరు సమీపంలోని కడైయంపట్టి గ్రామంలోని పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో 4 ,5 తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినులపై తరగతి ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందింది. విద్యార్థుల ఫిర్యాదుపై ప్రధానోపాధ్యాయుడు దర్యాప్తు నిర్వహించారు. ఆ ఉపాధ్యాయుడు 9, 10 సంవత్సరాల బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసింది. దీని తరువాత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓమలూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ శశికళ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు నిర్వహించి, విద్యార్థులను వేధించిన తిరునెల్వేలిలోని వడక్కన్ పట్టికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు తంగవేల్ (43)పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం ఆ టీచర్ తంగవేలు అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వృద్ధురాలిని గొంతు కోసి చంపి.. – 5 సవర్ల నగలు చోరీ అన్నానగర్: తిరుచ్చి జిల్లా, మనప్పారై, వైయంపట్టి యూనియన్, పెరియకులంపట్టి గ్రామానికి చెందిన, కులందై థెరెసు (65). ఈమె కుమారుడు సౌరిముత్తు తిరుచ్చిలో, కుమార్తె జెబామాలైమెరి సమీపంలోని ముగవనూర్ లో నివసిస్తున్నారు. దీని కారణంగా, కులందై థెరసు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె 100 రోజుల పనికి, కూలీ పనికి వెళ్లేది. ఈమె సాధారణంగా రాత్రిపూట ప్రాంగణంలో, తలుపు వద్ద తాడు మంచం మీద పడుకుంటుంది. శుక్రవారం రాత్రి ఆమె ప్రాంగణంలో ఓ మంచం మీద పడుకుంది. శనివారం ఉదయం ఈమె శరీరం నుంచి రక్తం కారుతున్నట్లు చూసిన స్థానికులు సమీపంలోకి వెళ్లి చూడగా గొంతు కోసి పడి ఉన్న కులందై థెరసును చూశారు. ఆమె ధరించిన 5 సవర్ల నగలు కనిపించలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కులందై థెరసు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. విచారణ లో వద్దురాలిని గొంతు కోసీ హత్య చేసి 5 సవర్ల నగలు చోరీ చేసుకుని పరారైనట్లు తెలిసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలిసులు, హంతకుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. హత్య కేసులో నలుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్యం మత్తులో ఏర్పడిన గొడవలో స్నేహితుడి తలపై బండరాయి వేసి హత్య చేసిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దిండిగల్ జిల్లా వత్తులగుండు మదురై వెళ్లే మెయిన్ రోడ్లో ఆర్టీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ఐదుగురిలో నలుగురు కలిసి ఒకరి గొంతు నులిమి తలపై రాయి వేసి హత్య చేసి పారిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో హత్యకు గురైన వ్యక్తి మదురై జైహింద్పురానికి చెందిన రౌడీ శివమణి తెలిసింది. హత్య చేసిన ఇతని స్నేహితులు మణికంఠన్, అరుల్మణి, సూర్య మునస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం –యువకుడి అరెస్ట్ తిరుత్తణి: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తిరుత్తణికి చెందిన యువతి డిగ్రీ చదివి ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి, తెక్కళూరు దళితవాడకు చెందిన ఇన్బరాజ్(27) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి సంపాదించిన డబ్బును ఇన్బరాజ్ తీసుకున్నాడు. ఈక్రమంలో వారం రోజుల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో మోసం చేసిన ఇన్బరాజ్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు తిరుత్తణి మహిళా పోలీస్స్టేషన్ సీఐ మలర్ ఇన్బరాజ్ను అరెస్టు చేశారు. -
ఉమ్మడి విన్యాసాలు
జపాన్ కోస్టుగార్డు నౌక ఇట్సుకుషిమ చైన్నెకు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ కోస్టుగార్డు, జపాన్ కోస్టుగార్డు సంయుక్తంగా ఇండో – పసిఫిక్ ప్రాంతంలో బలాన్ని మరింత చాటే విధంగా విన్యాసాలను ఆదివారం ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉమ్మడి ఆపరేషన్ వంటి అంశాలను ప్రదర్శించారు. జపాన్ నౌకలోని కెప్టన్నవోకి మిజోగుచి నేతృత్వంలోని 50 మంది బృందం, భారత కోస్టుగార్డు తూర్పు రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ దత్వీందర్ సింగ్ సైని నేతృత్వంలో భారత బృందం ఈ విన్యాసాలను సాగరంలో అదరగొట్టారు. పరస్పర సహకారం ఒప్పందాలు ఈ సందర్భంగా జరిగాయి. – సాక్షి, చైన్నె -
● 42 కుటుంబాల దత్తత
వినాయక మిషన్ లా స్కూల్లో శనివారం లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలకు శ్రీకారం చుట్టారు. న్యాయ విద్యార్థులు, సాధారణ ప్రజలతో ఈసందర్భంగా ఓపెన్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 42 ఇరుళర్ తెగ కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా విధాన కమిటీ చైర్మన్ డి మురుగేషన్, వీఎంఎల్ఎస్ ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధా గణేశన్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సురేష్ శామ్యూల్, జిందాల్ గ్లోబల్ లా స్కూల్కు చెందిన ఏ ప్రాన్సీస్ జూలియాన్, వీఎంఆర్ఎఫ్ ఛాన్స లర్ డాక్టర్ ఏ ఎస్ గణేశన్, డీన్ అనంత్ పద్మనాభవన్, న్యాయ నిపుణులు అంబిలిమీనన్, ఇన్బ విజ యన్ వీరరాఘవన్, డాక్టర్ అనంత్ పద్మనాభన్, ఆంటోనీ జూలియన్లు హాజరయ్యారు. – సాక్షి, చైన్నె -
సూర్య విజయ్సేతుపతికి మంచి భవిష్యత్తు
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడుగా అవతారం ఎత్తి తెరకెక్కించిన చిత్రం ఫినిక్స్. ఆయన భార్య రాజ్యలక్ష్మి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా విజయ్సేతుపతి వారసుడు సూర్య విజయ్సేతుపతి కథానాయకుడిగా పరిచయమయ్యారు. శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని వేల్రాజ్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈనెల 4వ తేదీన విడుదలై ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ శుక్రవారం థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. సూర్య విజయ్సేతుపతి మాట్లాడుతూ ఫినిక్స్ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అన్నారు. చిత్రం చూసిన తర్వాత చాలామంది అభినందించారని, మాస్టర్ అనల్అరసు తనను హీరోగా ఎంపిక చేసి ఉండకపోతే తాను ఈ వేదికపై ఉండేవాడిని కాదని అన్నారు. నిర్మాత తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారన్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తనకు సహకరించారని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తాను దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకు భార్య రాజ్యలక్ష్మి మద్దతుగా నిలిచినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఫినిక్స్ చిత్రానికి చాయాగ్రాహకుడు వేల్ రాజ్, సంగీత దర్శకుడు శ్యామత సీఎస్ మూలస్తంభాలు అని పేర్కొన్నారు. ఎడిటర్ రూబెన్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని తెలిపారు. ఈ చిత్ర విజయం తనతో పాటు ఇందులో పనిచేసిన అందరికీ చెందుతుందన్నారు. సూర్య విజయ్సేతుపతికి మంచి భవిష్యత్తు ఉందని దర్శకుడు అనల్ అరసు అన్నారు. ఫినిక్స్ చిత్ర యూనిట్ -
డీఎంకేలో వార్ రూం!
సాక్షి, చైన్నె: ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టే విధంగా డీఎంకే నేతృత్వంలో వార్ రూమ్(కంట్రోల్) ఏర్పాటైంది. అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ నుంచి సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర వ్యవహారాలను శనివారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పరిశీలించారు. వివరాలు.. 2026లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో ప్రజల్ని ఏకం చేసే విధంగా 45 రోజుల ప్రచార పర్యటన, సభ్యత్వ నమోదుకు ఈనెల ఒకటో తేది నుంచి శర వేగంగా జరుగుతోంది. పది రోజులలో సుమారు 75 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే, ఇంటింటా ప్రభుత్వ పథకాలను విస్తృతం చేసే దిశగా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. మీ తో స్టాలిన్ నినాదంతో ఈనెల 15 నుంచి అధికారిక వేడుకగా ప్రభుత్వ సంబంధిత సేవలను త్వరితగతిన పొందేందుకు వీలుగా శిబిరాల ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే సోదరా కదిలిరా నినాదంతో నియోజకవర్గాల వారీగా నేతలతో స్టాలిన్ సమావేశం అవుతూ వస్తున్నారు. శనివారం దిండుగల్, వేడచందూరు, వేపన హల్లి నియోజకవర్గాల నేతలతో వన్ టూ వన్గా వేర్వేరుగా నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనం చేసి నేతలకు పలు సూచనలు ఇచ్చి పంపించారు. అలాగే, తరచూ డివిజన్ల వారీగా నియమించిన ఇన్చార్జ్లు, పార్టీ 78 జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్నికలకు సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి చర్చించడం,నిర్ణయం తీసుకోవడంతో పాటుగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా తనకు వచ్చే వివరాలను పరిశీలించడం, సభ్యత్వ నమోదు తదితర ప్రక్రియల మీద దృష్టి పెడుతూ ప్రత్యేకంగా వార్రూమ్ను ఏర్పాటు చేయించారు. పరిశీలించిన స్టాలిన్ 3 నియోజకవర్గ నేతలతో భేటీ తిరుచ్చి శివాకు బాధ్యతలు అన్నా అరివాలయంలో ఏర్పాటు చేసిన ఈ వార్ రూమ్ను శనివారం స్టాలిన్ పరిశీలించారు. ఇక్కడి ఏర్పాట్లను గురించి మంత్రి టీఆర్బీ రాజ , సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ స్టాలిన్కు వివరించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు వివరాల శాతం గురించి, ఇతర సమాచారాల గురించి నియోజకవర్గాల వారీగా స్టాలిన్ పరిశీలించారు. ముందుగా సీనియర్ నేత పొన్ముడిని తొలగించడంతో ఆయన స్థానంలో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్టీ కార్యాలయంలోని ఛాంబర్లో కేటాయించిన సీటులో స్టాలిన్ కూర్చోబెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, ఆర్ఎస్ భారతీ, టీకేఎస్ ఇలంగోవన్, పూచ్చి మురుగన్ వంటి నేతలు ఈసందర్భంగా శివకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
నిఘా నీడలో గ్రూప్– 4 పరీక్ష
● 3,935 పోస్టులకు 13.89 లక్షల మంది హాజరు ● పలుచోట్ల అభ్యర్థుల ఆగ్రహం సాక్షి, చైన్నె: వీఏఓ, జూనియర్ అసిస్టెంట్తో సహా పలు పోస్టుల భర్తీ నిమిత్తం శనివారం నిఘా నీడలో గ్రూప్ 4 పరీక్షల జరిగింది. 3,935 పోస్టులకు గాను 13.89 లక్షల మంది పరీక్షకు హజరయ్యారు. అనేక చోట్ల కాస్త ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించక పోవడంతో అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వివాదం తప్పలేద. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 4 పోస్టుల్లో 3,935 ఖాళీల భర్తీకి ఇటీవల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామ పరిపాలనా అధికారి వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 1,621, జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 239, టైపిస్ట్ 1,099, షార్ట్హ్యాండ్ టైపిస్ట్ (గ్రేడ్ 3) 368, అసిస్టెంట్ కన్సర్వేటర్ 519, తదితర పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణతను విద్యార్హతగా నిర్ణయించినా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13 లక్షల 89 వేల 738 మందిని పరీక్షకు అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో 5,26,553 మంది పురుషులు,8,63,688 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 354 ప్రాంతాలలో 4,922 పరీక్ష వేదికలను ఎంపిక చేశారు. 20 మంది అభ్యర్థికి ఒక ఇన్విజిలేటర్ను నియమించారు. అన్ని వ్యవహారాలను వీడియో రికార్డు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టంగా ఆంక్షలు.. ఆదివారం రాత పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగింది. ఈ పరీక్ష నిమిత్తం ఆయా సెంటర్ల వద్దకు ఉదయాన్నే ఏడు గంటలకే అభ్యర్థులు చేరుకున్నారు. 8.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనీఖల అనంతరం అనుమతించారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రతనడుమ లోనికి పంపించారు. కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వకుండా పరీక్షల ప్రక్రియ నిఘా నీడలో జరిగింది. కొన్ని నిమిషాల పాటుగా ఆలస్యంగా వచ్చిన ఏ ఒక్కర్నీ లోనికి అనుమతించ లేదు. అనేక సెంటర్లలో నలుగురైదుగురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చి అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎవర్నీ లోనికి అనమతించ లేదు. దీంతో తీవ్ర నిరాశతో కొందరు హాల్ టికెట్లను అక్కడే చించి పడేసి వెళ్లి పోయారు.మరి కొందరు కాళ్లా లేవలా పడ్డా అధికారులు అంగీకరించ లేదు. తమకు కేటాయించిన సమయం వరకు అనుమతించామని, తాము ఏమి చేయలేమంటూ కొందరు అధికారులు అభ్యర్థులను బుజ్జగించి వెనక్కి పంపించేశారు. చైన్నెలో అయితే, 310 సెంటర్లలో పరీక్ష జరిగింది. ఈ పరీక్షలను పలు సెంటర్లలో టీఎన్పీఎస్సీ చైర్మన్ ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫలితాలను మూడు నెలల్లో వెల్లడిస్తామన్నారు. 13.89 లక్షల మంది పరీక్షలకు హాజరైనట్టుగా అంచనా వేస్తున్నామన్నారు. -
కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు ప్రోత్సాహం
– పీఎఫ్ జోన్ కమిషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య కొరుక్కుపేట: కొత్త ఉద్యోగులకు రూ.15వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్టు చైన్నె నార్త్ జోన్ ప్రాడిడెంట్ ఫండ్ కమీషనర్ దేబీ ప్రసాద్ భట్టాచార్య ప్రకటించారు . దీనిని సంబంధించి ఒక ప్రకటనలో పేర్కొంటూ.. కేంద్రమంత్రివర్గం ఇటీవల ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించిందని.. దీని ద్వారా 3.5 కోట్లమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.99.45 కోట్లు కేటాయించింది. ఈ పథకం ఆగస్టు 1 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించబడిన ఉపాధి అవకాశాలకు వర్తిస్తుందన్నారు. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్లో నమోదు చేసుకున్న ఉద్యోగులకు రెండు విడతలుగా రూ.15 వేలు వరకు ప్రోత్సాహకం ఇస్తుందని వెల్లడించారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారన్నారు. చైన్నెలో 11 స్క్వాయర్ ప్రారంభం సాక్షి,చైన్నె : చైన్నె వళ్లువర్ కోట్టం హైరోడ్డులో విలేజ్ స్క్వాయర్ భవనంలో కొత్తగా 11 స్క్వాయర్ శాఖను ప్రారంభించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు ప్రారంభో త్సవం సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగర వాసులను ఆహ్లాద పరిచేరీతిలో ఈ 11 స్క్వాయర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో పసందైన భోజనంతోపాటు క్యూరేటెడ్ సంగీతం , స్టైలిష్ వాతావరణంతో మిళితం చేసి కొత్త అనుభూతులను కల్పించనున్నామన్నారు. ప్రతీ వారం డిజే నైట్స్ తోపాటుగా ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్తదనం కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు . ప్రముఖ గాయనీ గాయకులను సైతం ఆహ్వానించి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తేని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి – బంధువులు రోడ్డు దిగ్బంధం అన్నానగర్: తేని జిల్లా పూదిప్పురం సమీపంలోని వాలైయతు పట్టి గ్రామానికి చెందిన కార్తీక్ భార్య గర్భిణి జయలక్ష్మి(23). ఆమెను జూలై 9వ తేదీన ప్రసవం కోసం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆమెకు చికిత్స అందించారు. జూలై 10న సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శస్త్రచికిత్స కారణంగా గర్భాశయం నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో గర్భాశయాన్ని తొలగించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో రక్తస్రావం కొనసాగుతోందని జయలక్ష్మి ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొంటూ, సరైన చికిత్సను అందించలాని డిమాండ్ చేస్తు శుక్రవారం సాయంత్రం తేని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై అనారోగ్యంతో ఉన్న మహిళ బంధువులు కూర్చుని రోడ్డును దిగ్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఆండిపట్టి డీఎస్పీ శివసుప్పు నేతత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. రోడ్డు దిగ్బంధం కారణంగా దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జయలక్ష్మి చికిత్స ఫలించక మృతి చెందింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మెడికల్ కాలేజీ వద్ద పోలీసులను మోహరించి భద్రతా పనిలో నిమగ్నమై ఉన్నారు. 18 మంది బాలికలకు లైంగిక వేధింపులు – అనాథ శరణాలయం యజమాని సహా ముగ్గురి అరెస్ట్ తిరువొత్తియూరు: ఓ ఆశ్రయంలో 18 మంది బాలికలను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో యజమాని సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు.. వండలూర్ సమీపంలోని ఉనమంచెరి ప్రాంతంలో ఓ ప్రైవేట్ అనాథ శరణాలయం నడుస్తోంది. ఈ అనాథ శరణాలయంలో 30 మందికి పైగా బాలికలు నివసిస్తున్నారు. వారందరూ ఒకే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ క్రమంలో అనాథ శరణాలయంలోని బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్టు చిన్నారులు భద్రత సంక్షేమ శాఖ అధికారులకు రహస్య సమాచారం అందించారు. దీంతో వండలూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. దీని ఆధారంగా, శరణాలయ యజమాని అరుల్ దాస్, షెల్టర్ సభ్యురాలు ప్రియ, శరణాలయ డ్రైవర్ పళనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. బాలికలను లైంగికంగా వేధించిన విషయంపై వారి వద్ద దర్యాప్తు చేస్తున్నారు. ఈ శరణాలయం 15 సంవత్సరాలు గా నడుస్తోందని, పళని గత 3 నెలలకు ముందు పనిలో చేరి నట్లు తెలిసింది ఈ ఘటన ఉనమంజేరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
జాన్ కుమార్కు మంత్రి పదవి
● 14న ప్రమాణ స్వీకారం సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఎన్. రంగస్వామి కెబినెట్లోకి కొత్త మంత్రిగా జాన్కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే, బీజేపీకి చెందిన మరో ముగ్గురునేతలకు నామినేటెడ్ ఎమ్మెల్యేల పోస్టులు దక్కాయి. వివరాలు.. 2021లో ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత నెల రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే మంత్రి పదవికి బీజేపీ ఎ మ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఎంపికయ్యారు. బీజేపీలో సాగిన పరిణామాలు సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. మరో ముగ్గురికి నామినేటెడ్ పోస్టులు బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చిన జాన్కుమార్కు ప్రస్తుతం మంత్రి పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా జాన్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట టెట్టారు. కేంద్ర హోం శాఖ ఆమోదం నేపథ్యంలో కొత్త మంత్రి, నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఈ నెల 14వ తేదీన రాజ్ నివాస్లో ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్టు పుదుచ్చేరి నుంచి సమాచారాలు అందుతున్నాయి. -
రాందాసు సామాజిక మాధ్యమాలు హ్యాక్
● డీజీపీకి ఫిర్యాదు ● పార్టీకి నేనే భవిష్యత్తు అని వ్యాఖ్య సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. దీనిపై ఆన్లైన్ ద్వారా డీజీపీకి ఆయన తరపున శనివారం ఫిర్యాదు చేశారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సాగుతూ వచ్చిన సమరం ప్రస్తుతం డిజిటల్ వార్కు పరిస్థితులు కల్పించి ఉన్నాయి. తన నివాసంలో ట్యాపింగ్ పరికరం వెలుగు చూసినట్టుగా రాందాసు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తన సోషల్ మీడియా ఖాతాలన్నీ హ్యాక్ చేసినట్టు రాందాసు ప్రకటించారు.దీనిని హ్యాక్ చేసిన వారిని గుర్తించిచర్యలు తీసుకోవాలని రాందాసు డిమాండ్ చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇది ఓ వైపు ఉంటే, మరో వైపు కేడర్కు రాందాసు లేఖ రాశారు. పీఎంకేకు భవిష్యత్తు తానే అని స్పష్టం చేశారు. పీఎంకే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టానని, మరింత దూకుడుగా ముందుకెళ్తామని సూచించారు. 40 స్థానాలలో అభ్యర్థుల గెలుపు దిశగా ఉరకలు తీద్దామని కేడర్కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, రాందాసు నివాసంలో లండన్లోని కొనుగోలు చేసినట్టుగా పేర్కొన్న ట్యాపింగ్ పరికరం గురించి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్బుమణి డిమాండ్ చేశారు. -
ఎప్పటికీ చెరగని పేరు నాగేష్
ఉరుట్టు ఉరుట్టు ఆడియోను ఆవిష్కరించిన ఆర్వీ ఉదయకుమార్, విక్రమన్, కస్తూరిరాజా, యూనిట్ సభ్యులు తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మరువని శాశ్వత పేరు నగేష్. నా కుమారుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన కాదల్ కొండేన్ చిత్రంలో నాగేష్ నటించారు. ఆయన గురించి మాట్లాడకుండా ఏ సినిమా మీడియా ఉండలేదు. అన్ని విజయాలు సాధించిన నటుడు నాగేష్. అలాంటి తండ్రి బాధకు ఉపశమనం కలిగించేది గజేష్ నాగేష్. నువ్వు కథానాయకుడిగా నటించిన ఉరుట్టు ఉరుట్టు చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. చిత్తం నిర్మాతకు నా అభినందనలు అని సీనియర్ దర్శకుడు ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్ తండ్రి అయిన కస్తూరిరాజా ఉరుట్టు ఉరుట్టు చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో అన్నారు. జై స్టూడియో క్రియేషన్న్స్ పతాకంపై సాయి కావ్య, సాయి కై లాష్ సమర్పణలో పద్మరాజు జయశంకర్ నిర్మించిన చిత్రం ఉరుట్టు ఉరుట్టు. భాస్కర్ సదాశివం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గజేష్ నాగేష్ కథానాయకుడిగా నటించారు. నటి రిత్విక శ్రేయ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి యువరాజ్ బాలరాజ్ చాయాగ్రహణం, అరుణగిరి సంగీతాన్ని, కార్తీక్ కృష్ణన్ నేపథ్య సంగీతాన్ని అందించారు. త్వరలో ఈచిత్రం తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఆనందబాబు మాట్లాడుతూ తనను ఆదరించినట్లుగానే తన కుమారుడిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. -
ఘనంగా నాబార్డ్ 44వ వ్యవస్థాపక దినోత్సవం
కొరుక్కుపేట: నేషల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాత్రి చైన్నె వేదికగా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను భారత ప్రభుత్వ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగం సెక్రటరీ ఎం నాగరాజు , తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎన్ . మురునందం, నాబార్డ్ ఛైర్మెన్ శ్రీషాజీ కెవి ,నాబార్డ్ డిఫ్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే సూద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు ఎండీలు, నాబార్డ్ సీనియర్ అధికారులు ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా నాబార్డు 44 సంవత్సరాల ప్రయాణంలో గ్రామీణ పరివర్తన పట్ల అచంచలమైన నిబద్దతో పనిచేస్తుందన్నారు. ఆర్థిక, మౌలిక సదుపాయాలను అందుబాటలోకి తీసుకురావటం నుంచి ఆవిష్కరణ, స్థితిస్థాపకతలను పెంపొందించడం వరకు లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. భారతదేశం సమ్మిళిత వృద్ది వైపు వేగంగా అడుగులు వేయటంతోపాటూ డిజిటల్ పరివర్తన, గ్రామీణ సంస్థలకు మద్దతు, అట్టడుగు స్థాయి వారిని ప్రోత్సహించడంలో నాబార్డ్ కృషి ఎనలేదనిదని ఈసందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం అతిథిగా పాల్గొన్న ఎం. నాగరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా నాబార్డ్ భారతదేశ గ్రామీణాభివృద్ధ్ది వ్యూహానికి మూలస్తంభంగా పనిచేసిందని కొనియాడారు. తమిళనాడులో నాబార్డ్ సహకారాలను తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం కొనియాడుతూ గ్రామీణ జీవనోపాధిని పెంపొందించటంలో నాబార్డ్ కీలక పాత్రపోసించిందని అని ప్రసంశించారు. సరిహద్దు ఔట్రీచ్ను బలోపేతం చేయడానికి న్యూ సబ్ – ఆఫీస్ ఇన్ లెఫ్, గ్రిప్ ప్రోగ్రామ్, రూరల్ టెక్ కోల్యాబ్, నివారన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. -
క్లుప్తంగా
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ● అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశం కొరుక్కుపేట: తంజావూరు సమీపంలో చెరువులో మునిగి మృతిచెందిన పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తంజావూరు జిల్లా పూతలూరు తాలూకాలోని మరుదగుడి గ్రామా నికి చెందిన తిరువెంకటయ్యన్ పట్టికి చెందిన జశ్వంత్ (8), మాధవన్ (10) ఈనెల 11వ తేదీ ఉరానికుళం వద్ద ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి మృతిచెందారు. ఈ విషాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారని సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. సీఎం జనరల్ రిలీఫ్ ఫండ్ నుంచి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు అందించాలని సీఎం అధికారు లను ఆదేశించారు. చైన్నె వీఐటీలో ఫ్రెంచ్ భాష క్లబ్ వేలూరు: చైన్నె వీఐటీ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఎంబీఏ ఫ్రెషర్స్ ఇండక్షన్–2025 కార్యక్రమంలో ఫ్రెంచ్ భాష క్లబ్ను ప్రారంభించారు. వీటిలో పుదుచ్చేరి, చైన్నె ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ హిజ్ ఎక్స్లెన్సీ మిస్టర్ ఎటియన్ రోలాండ్ పీగ్ హాజరై క్లబ్ను ప్రారంభించి ప్రసంగించారు. ఇది పోటీ ప్రపంచమని పోటీ ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైన్నె వీఐటీ క్యాంపస్లో ఫ్రెంచ్ భాష క్లబ్ను ఏర్పాటు చేయడం ద్వారా తమ సంస్కృతిని కాపాడుకుంటూ ఫ్రెంచ్ సంస్కృతిని అనుభవిస్తారని తెలిపారు. వీఐటీ చాన్స్లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులు మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం మాట్లాడుతూ విద్యార్థులు సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. వీఐటీ ప్రొ వైస్ చాన్స్లర్ డాక్టర్ త్యాగరాజన్, డాక్టర్ పీకే, అదనపు రిజిస్ట్రార్ మనోహరన్ పాల్గొన్నారు. అలయన్స్ ఫ్రాంకై జ్ ఆఫ్ మద్రాస్, వీఐటీ చైన్నె మధ్య అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హుండీలో చోరీ: వ్యక్తి అరెస్ట్ తిరువొత్తియూరు: తిరువణ్ణామలైలోని అన్నామలైయార్ ఆలయంలోని హుండీలో నగదు చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నామలైయార్ ఆలయానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి బంగారు ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీ నుంచి నగదు చోరీ చేశాడు. హుండీ నుంచి నగదు చోరీ చేస్తుండగా చూసిన ఆలయ సిబ్బంది, ఆలయ నిర్వాహకులు తిరువణ్ణామలై నగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తిరువణ్ణామలై నగర పోలీసులు, అన్నామలై ఆలయ హుండీ నుంచి రూ.5వేలను చోరీ చేసిన తిరువరూర్ జిల్లాకు చెందిన పళని కుమారుడు శబరినాథన్ (40)ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన శబరినాథన్ నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ సేలం: ఈరోడ్ కార్పొరేషన్లో జోన్–1లోని పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ చేశారు. ఈరోడ్ కార్పొరేషన్లోని 4 జోన్లలోని మొత్తం 60 వార్డుల్లో ప్రత్యేకంగా మాస్ క్లీనింగ్ జరుగుతోంది. ఇందులో జోన్ 1 పరిధిలోని చిన్నప్ప లేఔట్లో శుభ్రపరిచే పని జరిగింది. ఈ పనిని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ప్రారంభించారు. జోన్–1 అధ్యక్షుడు పి.కె.పళనిస్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొని సామూహికంగా శుభ్రపరచడంలో పాల్గొన్న 50 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫాం అందజేశారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పిచ్ముత్తు, హెల్త్ ఆఫీసర్ తంగరాజ్, హెల్త్ ఇన్స్పెక్టర్ సతీష్, జూనియర్ ఇంజినీర్లు తిరుమూర్తి, సువరన్సింగ్, డీఎంకే కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. బస్సులో రూ.16.30 లక్షలు స్వాధీనం ● ఒకరి అరెస్ట్ వేలూరు: బస్సులో రూ.16.30లక్షలు తీసుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడి జిల్లాకు చెందిన 25 సంవత్సరాల మహిళ బెంగళూరులోని ప్రయివేటు కంపెనీలో పనిచేస్తుంది. ఈమె వేలూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు భర్తతో పాటు బెంగళూరు నుంచి ఓ ఏసీ బస్సులో బయలు దేరింది. బస్సు శుక్రవారం అర్ధరాత్రి తిరుపత్తూరు జిల్లా మాదనూరు వద్ద టీతాగేందుకు నిలిపారు. ఆ మహిళ టీ తాగి భర్తతో పాటు బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సులో ఉన్న ఓ యువకుడు మహిళను సెల్ఫోన్లో ఫొటో తీశాడు. గమనించిన మహిళ ఆ యువకుడితో గొడవకు దిగింది. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేలూరు నార్త్ పోలీసులు బస్సు వద్దకు చేరు కుని యువకుడిని అరెస్ట్ చేశారు. విచారణలో యువకుడు తూత్తుకుడి జిల్లా కయల్పట్టణంకు చెందిన ఇంద్రీస్ అని తెలిసింది. అతని బ్యాగు ను తనఖీ చేయగా అందులో రూ.16.30 లక్షల హవాలా నగదు ఉన్నట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నగదును కోర్టులో అప్పగించారు. -
సెంజి కోటకు యునెస్కో గుర్తింపు
సాక్షి, చైన్నె: సెంజికోటకు యునెస్కో గుర్తింపు దక్కింది. పురాతన ప్రదేశాల అధ్యయనంలో వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. రాష్ట్రంలో తంజావూరులోని బృహదీశ్వరాలయం, మహాబలిపురం, కుంబకోణం ఐరాతీశ్వరర్ ఆలయం, నీలగిరులు వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తింపును దక్కించుకుని ఉన్నాయి. తాజా గా జాబితాలో మరాఠా రాజుల స్థావరంగా ఉన్న సెంజి కోటను ప్రభుత్వ సిఫారసు మేరకు యునెస్సో గుర్తింపు కల్పిస్తూ ప్రకటన వెలువడింది. 1678లో మరాఠాలు సెంజి కోటను తమ గుప్పెట్లోకి తెచ్చుకు న్నారు. ఇది ప్రస్తుతం విల్లుపురం జిల్లాలో ఉంది. సెంజి అనే ప్రాంతంగానే ఈ కోట పేరిట పట్టణం వెలసి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో అప్పటి మైనారిటీ శాఖ మంత్రి సెంజి మస్తాన్, నాటివిల్లుపురం కల్టెర్ పళణి నేతృత్వంలో ప్రత్యేక బృందం సెంజి కోటకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసింది.ఈ కోటలోని కల్యాణ మహల్, దర్బార్ హాల్, ఎలిఫెంట్ పూల్, మ్యూజియం, కోటలోని వంతెన, కొండపై ఉన్న ఫిరంగులు వంటి అనేక అంశాలు ఈనివేదికలో పేర్కొన్నారు.ప్రస్తుతం అన్నిరకాల పరిశీలన తదుపరి మహారాష్ట్రాలోని చత్రపతి శివాజీ పాలించిన కోటలను, తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజికోటను వారసత్వ ప్రదేశంగా యూనెస్కో గుర్తింపు కల్పించింది. సెంజి కోట -
సంకీర్ణంలో వాటా.. బాటలోనే అమిత్ షా
● వెనక్కి తగ్గని కేంద్ర మంత్రి ● సంపూర్ణ మెజారిటీతో అధికారం మాదే: పళణి ● బీజేపీ తమకు ప్రత్యర్థి అన్న విజయ్ సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే కూటమి ఏర్పడినప్పటి నుంచి అధికారంలోకి వస్తే సీఎం ఎవరో, సంకీర్ణ ప్రభుత్వమా..? అన్న చర్చ తమిళనాట విస్తృతంగా సాగుతూ వస్తోంది. ఇటీవల ఓ తమిళ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే అన్నాడీఎంకేలో దారి తీశాయి. సీఎం అభ్యర్థి ఎవరో అన్నది తేల్చక పోవడం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు తథ్యం అన్న ఆయన వ్యాఖ్యలు అన్నాడీఎంకేను ఇరకాటంలో పడేశాయి. అదే మాట.. కూటమి పాలన విషయంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. 2026 ఎన్నికలలో కూటమి గెలిస్తే అధికారంలో వాటాతథ్యమన్నారు. తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతల విచ్ఛిన్నం, వారసత్వ రాజకీయం, తదితర అంశాలతో ప్రజలుమార్పును ఆశిస్తున్నారని, ఈసారి తమ కూటమి అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమిలోని పీఎంకే,విజయ్ టీవీకేలతో పాటుగా చిన్న పార్టీలను ఒకే గొడుగు నీడన తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నామని ప్రకటించారు. అమిత్ షా వ్యాఖ్యలు మళ్లీ అన్నాడీఎంకేలో చర్చకు దారి తీయడంతో ఈ సారి వ్యూహాత్మకంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఎదురు దాడి వ్యాఖ్యలను పేల్చారు. శనివారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2026 అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీతో అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను గుర్తు చేయగా, తాను స్పష్టం చేశానుగా అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికారం చేజిక్కించుకుంటుందంటూ పరోక్షంగా సంకీర్ణ పాలనకు అవకాశం లేదని పళణి తేల్చి చెప్పడం గమనార్హం. అదే సమంయలో కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ను ప్రశ్నించగా, అమిత్ షా వాక్కు వేద వాక్కు అని స్పష్టం చేశారు. ఆయన తమ అధినేతలు అని, వారి ఆదేశాలే కీలకం అని, వారు చెప్పిందే జరుగుతుందని, ఇదే తమకు వేద వాక్కు అని పేర్కొనడం గమనార్హం. ఇక, తమను పదే పదే కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని తమిళగ వెట్రి కళగం తీవ్రంగానే పరిగణించింది. తమ అధ్యక్షుడు విజయ్ తరపున పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి రాజ్ మోహన్ స్పందిస్తూ, పార్టీ ఆవిర్భావ సమయంలోనే స్పష్టం చెప్పామని, అలాగే, ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీలోనూ స్పష్టతను మరింతగా వ్యక్తం చేశామన్నారు. తమ డీన్ఏలోనే బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం ఉంందన్నారు. తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీ బీజేపీని ఎప్పుడో ఎంపిక చేశామని, ఎట్టి పరిస్థితులలోనూ వారితో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి హత్య
● నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో తిరువళ్లూరు: ఇంటికి సమీపంలో మద్యం తాగుతూ వీరంగం చేస్తున్న యువకులను వారించిన వ్యక్తిని మద్యం మత్తులో వున్న యువకులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా ఈకాడు సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఈకాడు కండ్రిగ ప్రాంతానికి చెందిన కార్తికేయన్(42). ఇతను చైన్నెలోని ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఇతని భార్య సంధ్య(34). వీరికి ఇద్దరు కుమార్తెలు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఈకాడు కండ్రిగలోని ఇంటికి తిరువళ్లూరు నుంచి బయలుదేరాడు. ఇంటికి సమీపం వస్తుండగా ఆ సమయంలో అక్కడ మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో కార్తికేయన్ వారిని మందలించాడు. మద్యం మత్తులో వున్న యువకులు కార్తికేయన్పై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు డీఎస్పీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. నిందితులను శిక్షిస్తామన్న డీఎస్పీ హామీ మేరకు రాస్తారోకో విరమించారు. -
కొండ ప్రాంత ప్రజల జీవన విధానమే కేవీ
తమిళసినిమా: కొడైకెనాల్లోని కొండ వాసీ ప్రజల కష్టాలు, బాధలు వంటి జీవన వినోదాన్ని తెరపై ఆవిష్కరించే కథా చిత్రం ఠెవి అని ఆ చిత్రం దర్శకుడు తెలిపారు. ఆర్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫిలిం కంపెనీ పతాకంపై పెరుమాళ్.జీ.జగన్ జయసూర్య నిర్మించిన చిత్రం కేవీ. తమిళ్ దయాళన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆదవన్ కథానాయకుడిగా పరిచయం కాగా నటి శీలా రాజ్ కుమార్ నాయకిగా నటించారు. జాగ్వలిన్, చార్లెస్, వినోద్, చిదంబరం ధర్మదురై జీవా ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలు తెలుపుతూ మనం సాధారణంగా కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలకు విహార యాత్రలు చేసి వస్తున్నాయన్నారు. అయితే అక్కడి కొండ వాసీయుల జీవితా, గురించి పట్టించుకోమన్నారు. అలా కొడైకెనాల్ సమీపంలోని కెవి అనే గ్రామంలోని ఆ ప్రకృతితో కలిసి జీవించే చాలా మందికి తెలియని ప్రజల బాధలు, కష్టాలు మొదలగు వారి జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రమే ఇదని చెప్పారు. పుట్టడం ప్రకృతిలో భాగమైతే మనిషి చావడం హింసాత్మకమైయిందన్నారు. ఇకపై ఎవరైనా అలాంటి చావు రాకూడదని, వారు సమాజంలో ఒకరిగా గుర్తించబడాలని చెప్పే చిత్రం కేవీ అని చెప్పారు. అలాంటి ప్రాంతంలో 110 రోజులు చిత్రం షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఇది అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని బాలసుబ్రమణియన్.జి, ఎస్.రాజా రవివర్మన్, జగన్ జయసూర్య చాయాగ్రహణం అందించారు. -
గ్రూప్–4 పరీక్షలు ప్రశాంతం
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రూప్–4 పరీక్షలు పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో వున్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో గత ఆరు నెలల క్రితం ప్రభుత్వం గ్రూప్–4 నోటిపికేషన్ను విడుదల చేసింది. ఈ క్రమంలో జిల్లా నుంచి మొత్తం 38,117 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించడానికి 126 ఇన్విజిలేటర్లు, 39 తనిఖీ బృందాలు, తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో స్పెషల్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. కాగా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి 38,117 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 31,082 మంది హాజరయ్యా రని కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. కై వండూరు, తిరుప్పాచ్చూర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పకడ్బందీగా గ్రూప్–4 పరీక్షలు వేలూరు: వేలూరు జిల్లాలో జరిగిన గ్రూప్–4 పరీక్షలు శనివారం పకడ్బందీగా జరిగాయి. 84 పరీక్ష కేంద్రాల్లో 20,110 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ ముస్లిం పాఠశాల, కాట్పాడిలోని వీఐటీ పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలను కలెక్టర్ సుబ్బలక్ష్మి పరిశీలించారు. ఈవేరా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 11 మందిని అనుమతించకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. -
వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్ ట్రేస్ చేసి నిందితులను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.ఏం జరిగిందంటే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్తసన్), శివకుమార్, గోపిలను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. చిత్రహింసలకు గురి చేసి..బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్లో రాయుడిని టార్చర్ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ.. -
క్లుప్తంగా
రైల్లో మహిళ నగలు చోరీ అన్నానగర్: రైల్లో ఓ మహిళ నుంచి 17 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చైన్నెలోని మేడవాక్కం ప్రాంతానికి చెందిన జయరామన్. ఇతని భార్య తమిళసెల్వి (27). వీరికి ముగ్గురు కుమారులు. వారికి మదురై జిల్లాలోని తిరుమంగళం కామరాజపురం ఉత్తర ప్రాంతంలో ఇల్లు ఉంది. గతవారం, తమిళసెల్వి చైన్నె నుంచి తిరుమంగళంకు అనంతపురి రైలులో వెళ్లింది. ఆమె బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి ముత్తునగర్ ఎక్స్ప్రెస్ రైలులో చైన్నెకి తిరిగి వెళ్లింది. ఇంటికి వెళ్లి పర్సు చూడగా 17 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించింది. రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరువణ్ణామలై–నరసాపూర్ మధ్య ప్రత్యేక రైలు వేలూరు: ఆంధ్ర రాష్ట్రం నుంచి తిరువణ్ణామలైకి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరువణ్ణామలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని నరసాపురం వరకు వారాంతపు ప్రత్యేక రైలు నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో తిరువణ్ణామలై నుంచి తన మొదటి ప్రయాణాన్ని వారాంతపు రైలు గురువారం బయలుదేరింది. తిరువణ్ణామలై నుంచి ఉదయం 11 గంటలకు బయ లుదేరి వేలూరు, కాట్పాడి, చిత్తూరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, బ్రహ్మవరం మీదుగా నరసాపురం రైల్వేస్టేషన్కు అర్ధరాత్రి 2 గంటలకు చేరుకుందని రైల్యే అధికారులు తెలిపారు. ఈ వారంతపు ప్రత్యేక రైలు ఈనెల 17, 24, ఆగస్టు మాసంలో 7,14, 21, సెప్టెంబర్ 4, 25వ తేదీల్లో ఈ ప్రత్యేక రైలు తిరువణ్ణామలై నుంచి బయలుదేరి నరసాపురానికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. గిరివలయం రోడ్డులో భక్తుడి హత్య ● ఇద్దరి అరెస్ట్ వేలూరు: తిరువణ్ణామలైలో అన్నామలైయార్ ఆలయ దర్శనానికి వెల్లి గిరివలయంలో నడిచి వెళుతున్న తెలంగాణ భక్తుడిని హత్య చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, యాదగిరి జిల్లాలోని సౌందరిపురానికి చెందిన విద్యాసాగర్(32) ఈనెల 7న తిరువణ్ణామలైలోని స్వామి వారి దర్శనార్థం వచ్చాడు. 8వ తేదీన రాత్రి అతను అన్నామలైయార్ ఆలయం నుంచి గిరివలయం రోడ్డులో నడిచి వెలుతుండగా ఇద్దరు యువకులు బైకులో వచ్చారు. ఆ సమయంలో విద్యాసాగర్ను అదుపు తప్పి ఢీకొట్టినట్లు తెలిసింది. దీంతో విద్యాసాగర్, ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన ఆ యువకులు కత్తితో విద్యాసాగర్పై దాడి చేసి పరారిపోయారు. విషయం తెలిసి తిరువణ్ణామలై పోలీసులు అక్కడికి చేరుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యాసాగర్ గురువారం సాయంత్రం మృతిచెందాడు. పోలీసులు సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అనంతరం తిరువణ్ణామలైకి చెందిన గణేశ్వరన్, తమిళరసన్లను అరెస్ట్ చేశారు. మూడు కార్లు ఢీ: ఏడుగురికి గాయాలు తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని జాతీయ రహదారిలో మూడు కార్లు ఢీకొన్న ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి తిరుత్తణి పోలీసుల కథనం మేరకు..చైన్నెకి చెందిన ముకుందన్(51), వదరరాజన్(53) తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని శుక్రవారం మధ్యా హ్నం చైన్నెకి బయలుదేరారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహదారిలోని పొన్పాడి రైల్వేస్టేషన్ క్రాస్ వద్ద తిరుత్తణి సమీపం మురుకంబట్టుకు చెందిన విజయ్(29), అన్న విగ్నేష్(30) కొత్తూరులో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళుతుండగా, తిరుపతి నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఢీకొని అదుపుతప్పి తిరుపతి నుంచి చైన్నెకి వెళుతున్న మరో కారును సైతం ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గిరివలయం రోడ్డు
కిటకిటలాడిన వేలూరు: తమిళ ఆణి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి గురువారం వేకువజామున 2.33 గంటలకు ప్రారంభమై శుక్రవారం 3.08లకు ముగియడంతో కార్తీకదీపం తరహాలోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తిరువణ్ణామలై చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో తిరువణ్ణామలైలో గురువారం రాత్రి గిరివలయం రోడ్డు, ఆలయ మాడ వీధులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు 6గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
కాట్టుపల్లిలో నౌకాదళం కీల్ లేయింగ్
సాక్షి, చైన్నె: భారత నౌకాదళానికి థర్డ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎప్ఎస్ఎస్) కీల్ లేయింగ్ను చైన్నె శివారులోని కాట్టుపల్లి ఎల్అండ్టీ షిప్ యార్డ్లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ వివరాలను నౌకాదళం వర్గాలు ప్రకటించాయి. వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, కంట్రోలర్ వార్షిప్ ప్రొడక్షన్– అక్విజిషన్ , ఇండియన్ నేవీ, హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్, మెస్సర్స్ ఎల్అండ్టీ నుంచి సీనియర్ అధికారుల సమక్షంలో దీనిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. భారత నౌకాదళం ఆగస్టు 2023లో ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ కొనుగోలు కోసం హెచ్ఎస్ఎల్తో ఒప్పందంపై సంతకం చేసిందిని, డెలివరీ షెడ్యూల్ 2027 మధ్యలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం బలాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డెలివరీ కోసం కఠినమైన సమయపాలనను తీర్చడానికి హెచ్ఎస్ఎల్ రెండు నౌకల నిర్మాణాన్ని కాట్టుపల్లి ఎల్అండ్టీ షిప్ యార్డ్కు సబ్ కాంట్రాక్ట్ చేసినట్టు వివరించారు. సముద్రంలో ఫ్లీట్ షిప్లను తిరిగి నింపడం ద్వారా భారత నౌకాదళం ‘బ్లూ వాటర్’ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నదని ప్రకటించారు. 40వేల టన్నుల కంటే ఎక్కువ రవాణా కలిగిన ఈ నౌకలలో ఇంధనం, నీరు, మందుగుండు సామగ్రి, నిల్వలను కలిగి ఉంటాయని వివరించారు. ఇవి సముద్రంలో నౌకాదళంకు దీర్ఘకాలిక, స్థిరమైన కార్యకలాపాలకు వీలు కల్పిస్తాయని, తద్వారా పరిధి అన్నది పెరుగుతుందన్నారు. -
జనాభా నియంత్రణకు సహకరించాలి
వేలూరు: జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరులో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ జనాభా 743 కోట్లుగా ఉందని అన్నారు. సంవత్సరానికి జిల్లాలో 55 వేల మంది జన్మిస్తున్నారన్నారు. వీరిలో రెండవ చిన్నారులకు పైగా జన్మించే వారి సంఖ్య 12.8 శాతంగా ఉందన్నారు. వీటి శాతాన్ని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన అవసరమన్నారు. విద్యా వేత్తలు, విద్యార్థులు మీ సమీపంలోని కుటుంబీకుల వద్ద ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. అనంతరం జనాభా నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ముందుగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, జోన్ చైర్మన్ వెంకటేశన్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మణిమేగలై, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ.18 కోట్ల వస్తువుల రికవరీ
తిరువళ్లూరు: ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 పోలీస్స్టేషన్లో నమోదైన కేసులను ఛేదించిన పోలీసులు రూ.18 కోట్ల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, నగదును రికవరీ చేసి బాధితులకు కమిషనర్ శంకర్ అప్పగించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీసుస్టేషన్లు వున్నాయి. గత ఆరు నెలల కాలంలో చోరీలు, స్నాచింగ్, మోసాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. వీటిని పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన వ్యక్తుల నుంచి 87 సవర్ల బంగారు నగలు, 922.989 కిలోల వెండి, రూ.3.96 లక్షల నగదు, 317 సెల్ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, 90 ఏసీలతో పాటు వస్తువులను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి మోసాలకు పాల్పడిన సంఘటనలపై 16 కేసులు నమోదు చేసి రూ.6.89 కోట్ల ఆస్తులను రికవరీ చేశారు. ● బాధితులకు అప్పగించిన ఆవడి పోలీసు కమిషనర్ -
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్ నియోజకవర్గం స్వతంత్ర నగర్ ఆది ఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. స్వతంత్ర నగరంలో రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్నికల నిర్వాహకులైన మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు ఎస్ బాలాజీ, ఎన్ హరినారాయణ, గ్రామ పెద్ద ఏటీ వెంకటేష్ల పర్యవేక్షణలో ప్రమాణస్వీకారం జరిగింది. ఇందులో స్వతంత్ర నగర్ ఆదిఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎం.కృష్ణమూర్తి, సెక్రటరీగా యూ. హరి, కోశాధికారిగా కేఎల్ శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు టి.వెంకటయ్య, ఉపకార్యదర్శి కె.ఎస్.విష్ణు ప్రసాద్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్, రామనగర్ టామ్స్ నేత పాల్ కొండయ్య పాల్గొన్నారు. -
ఘనంగా అయగు ముత్తుకోన్ జయంతి
వేలూరు: స్వాతంత్య్ర పోరాట యోధుడు అయగు ముత్తుకోన్ 268వ జయంతిని వేలూరులోని ఆయర్ కుల యాదవర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అయగు ముత్తుకోన్ చిత్ర పటాన్ని ఉంచి గురు పూజోత్సవంఫొటో ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షుడు జీకే గంగాధరన్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచి పెట్టి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే కార్తికేయన్, సంఘం ప్రధాన కార్యదర్శి ఎంజీ రమేష్, కోశాధికారి సతీష్కుమార్, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి సీకే దేవేంద్రన్, కార్పొరేటర్ టీటా, పారిశ్రామిక వేత్తలు సీకే గణేశన్, వీజీ తులసిరామన్, జీజీఆర్ గోకుల్, తమిళ్మణి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆగస్ట్ 1న తెరపైకి సరెండర్
తమిళసినిమా: నటుడు దర్శన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరెండర్. లాల్, సుజిత్ శంకర్, మునీష్కాంత్, పళనికుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్వీ.కుమార్ నిర్మించారు. ఈచిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ వద్ద అసోసియేట్గా పనిచేశారన్నరది గమనార్హం. వికాశ్పడిశ సంగీతాన్ని, మెయ్యేంద్రన్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఆగస్ట్ ఒకటవ తేదీన తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఎన్నికలకు ముందు 5 రోజుల్లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఒక పోలీస్స్టేషన్లో ఒక మెటీరియల్, అదేవిధంగా ఒక గ్యాంగ్ ఎన్నికల కోసం పంచాల్సిన డబ్బు మిస్ అవుతుందన్నారు. ఈ రెండు అంశాలతో సాగే కథా చిత్రం అని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ను చైన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు, మునీష్కాంత్కు సంబంధించిన షూటింగ్ను తిరుచ్చిలో నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో పాటలు ఉండవని అన్నారు. ఇందులో లాల్ పోలీస్స్టేషన్లో నిజాయితీగల రైటర్గా నటించారని, దర్శన్ పోలీస్ అధికారిగా నటించారని చెప్పారు. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అనే కాన్సెప్ట్తో తెరకెక్కించిన కథా చిత్రం ఇదన్నారు. చిత్రం చూసిన ప్రేక్షకులు గుడ్ ఫీల్తో బయటకు వస్తారని దర్శకుడు పేర్కొన్నారు. -
వనితా విజయ్కుమార్పై ఇళయరాజా పిటిషన్
తమిళసినిమా: ఈ మధ్య కొత్త చిత్రాల్లో పాటలు హిట్ అవుతున్నాయో లేదోగానీ, పాత పాటల రీమిక్స్లు మాత్రం ఆయా చిత్రాల వసూళ్లకు ప్లస్ అవుతున్నాయి. దీంతో పలువురు దర్శక నిర్మాతలు పాత చిత్రాలను తమ చిత్రాల్లో వాడుకోవడానికి ఆసక్తి చూపితున్నారు. కాగా ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లే కుండా ఎవరైనా తమ చిత్రాల్లో వాడితే వెంటనే వారిపై నష్టపరిహారం కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తారు. తాజాగా నటి వనితావిజయ్కుమార్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వనితా విజయ్కుమార్ తొలి సారిగా దర్శకత్వం వహించి నాయకిగా నటించిన చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. డాన్స్ మాస్టర్ రాబర్ట్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వనితా విజయ్కుమార్ కూతురు జోవిక విజయ్కుమార్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఇందులో నటుడు కమలహాసన్ మైఖెల్ మదన కామరాజన్ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. కాగా ఆ చిత్రంలోని శివరాత్తిరి అంటూ సాగే పాటను మిస్సెస్ అండ్ మిస్టర్ చిత్రంలో వాడారు. దీంతో తన అనమతి పొందకుండా వనిత తన పాటను వాడారంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో చిత్రం నుంచి తన పాటను వెంటనే తొలిగించాలని, లేకుంటే నష్ట పరిహారం కోరడం జరుగుతుందని ఇళయరాజా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. వచ్చే సోమవారం విచారించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. పాటను వాడుకోవడానికి ఇళయరాజా అనుమతి తీసుకున్నాట్లు, అందుకుగానూ చిత్ర టైటిల్ కార్డులో ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. -
చిత్ర నిర్మాణ రంగంలోకి..
తమిళసినిమా: ఇంతకుముందు పలు మ్యూజికల్ ఈవెంట్స్ను సక్సెస్ఫుల్గా నిర్వహించిన నాయిస్ అండ్ గ్రెయిన్స్ సంస్థ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సంస్థ అధినేతలు కార్తీక్ శ్రీనివాస్, మహావీర్ అశోక్ నిర్మిస్తున్న ప్రొడక్షన్–2 చిత్రం శుక్రవారం ఉదయం చైన్నెలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి కిశోర్ రాజ్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కోమాలి, ఖైదీ, వీఐపీ–2, ఇమైకా నొడిగల్, కీ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. కాగా తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అన్నాబెన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రేమతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం రూపొందడానికి దర్శకుడు కే.భాగ్యరాజ్ సహకారం చాలా ఉందని పేర్కొన్నారు. కాగా మళ్లీ ఆయన చిత్రాలను గుర్తుకు తెచ్చే విధంగా తమ చిత్రం ఫీల్ గుడ్ ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈచిత్రంలో అన్నాబెన్ నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ బాలు చాయాగ్రహణం, సహ కథా రచయితగానూ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
దేశాభివృద్ధికి అడ్డు లేకుండా పెరుగుదల
తిరువళ్లూరు: దేశాభివృద్ధికి ఆటంకం లేకుండా జనాభా పెరుగుదల ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1987వ సంవత్సరంలో జూలై 11 నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు దాటిన క్రమంలో అప్పటి నుంచి ప్రతి ఏటా జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభా 143.81 కోట్లు, రాష్ట్ర జనాభా 7.7 కోట్లకు దాటిందన్నారు. సీ్త్రలకు వివాహ వయస్సు 21గా నిర్ణయించారని, బిడ్డ అన్నారు. తక్కువ వ్యవఽధిలో పిల్లలు కనడం ద్వారా వారిలో పోషక లోపం వుంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సూచించారు. జాయింట్ డైరెక్టర్లు అంబిక, డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, ప్రియ, ప్రభాకరన్ పాల్గొన్నారు. -
ముగిసిన మొహర్రం వేడుకలు
● సీఎంతో సైఫుద్దీన్ భేటీ సాక్షి, చైన్నె: చైన్నెలో పది రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక అషారా ముబారకా (మొహర్రం) వేడుకలు ముగిశాయి. దావూదీ బోహ్రాల సామాజిక వర్గం నాయకడు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్న్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆతిథ్యం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 43,000 మందికి పైగా దావూదీ బోహ్రాలు తమ వార్షిక మొహర్రం సమాజం కోసం చైన్నెకు తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఆశారా ముబారకా సభ ముగింపుతో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దావూదీ బోహ్రా ముస్లిం సమాజం 53వ నాయకుడు ిసయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్కు ఆతిథ్యం ఇచ్చారు. తమిళనాడు హిందూ మత ధార్మిక శాఖ మంత్రి పీకే శేఖర్బాబుతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. సయ్యద్నా నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగే వార్షిక మొహర్రం సమాజం ఆశారా ముబారకా గురించి, జూన్ 27 నుంచి జూలై 5, 2025 వరకు చైన్నెలో జరిగిన కార్యక్రమం గురించి ఈసందర్భంగా సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమం తమిళనాడులో కమ్యూనిటీలో అతిపెద్ద అంతర్జాతీయ సమావేశాల్లో ఒకటిగా నిలిచిందని, 50 సంవత్సరాల విరామం తర్వాత చైన్నెలో జరిగినట్టు తెలియజేశారు. వేలాది మంది హాజరైన వారికి అన్ని సౌకర్యాలు, భద్రత కల్పించిన ప్రభుత్వం, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్, చైన్నె పోలీసులు, ఇతర ప్రజా సేవా విభాగాలకు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ తన హృదయపూర్వక కృతజ్ఞతలను ఈసందర్భంగా తెలుపుకున్నారు. దావూదీ బోహ్రా సమాజం, క్రమశిక్షణ సంస్థ, పౌర దృక్పథం, వాణిజ్యం, వ్యాపారం, సామాజిక అభివృద్ధికి సహకారాన్ని ఈసందర్భంగా సీఎం స్టాలిన్ గుర్తుచేశారు. -
● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధి సంస్థకు రూ.2.15 కోట్లు ● తిరుక్కురల్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని హిందూమత, దేవదాయ శాఖ విస్తృతం చేసింది. తాజాగా రూ.100 కోట్లతో పునరుద్ధరణ పనుల నిమిత్తం 63 ఆలయాలను ఎంపిక చేశారు. ఈపనులను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం ప్రారంభించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. 3,297 ఆలయాలను ఇప్పటివరకు అభివృద్ధి చేశారు. ఆక్రమణల్లోని ఆలయాల ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో రాజుల కాలంలో నిర్మించిన ఆలయాలను అక్కడి శాసనాలు, శిల్పాల ఆధారంగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాల వివరాల సేకరణను విస్తృతం చేశారు. 714 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు గుర్తించారు. వీటి స్వరూపం చెక్కు చెదరకుండా పునరుద్ధరించే విధంగా 2022–2023 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.425 కోట్ల నిధులను కేటాయించారు. ప్రభుత్వ నిధులు, సేకరించిన విరాళాలతో మొత్తం రూ.571.55 కోట్లతో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన 352 దేవాలయాల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకున్నారు. ఇందులో 60 ఆలయాల పునఃప్రతిష్ఠ పూర్తి చేశారు. కుంభాభిషేకాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో మరో 63 ఆలయాల పునరుద్ధరణకు సిద్ధమయ్యారు. రూ.100 కోట్ల పనులను సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేవాలయాల ప్రాచీనత, వాస్తుశిల్పంపై భవిష్యత్తు అధ్యయనాలు భవిష్యత్ తరాలకు అందించడం లక్ష్యంగా వాటి పురాతనం చెక్కు చెదరకుండా పనులకు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు దురైమురుగన్, పి.కె.శేఖర్బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం పాల్గొన్నారు. తమిళాభివృద్ధి కొనసాగింపు లక్ష్యం అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళాభివృద్ధి సంస్థ అభివృద్ధి పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారు. తమిళ అభివృద్ధి సంస్థకు రూ.2 కోట్ల 15 లక్షల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.రాజేంద్రన్అందుకున్నారు. 2025–2026 వార్షిక సమావేశం నిర్ణయం మేరకు తమిళ అభివృద్ధి సంస్థ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంటుంది అని సమాచార మంత్రి స్వామినాథన్ ప్రకటించారు. ఇందు కోసం రూ.2 కోట్లు నిధి అందజేస్తామన్నారు. రూ.2 కోట్లు డిపాజిట్గా అందజేశారు. ఇందులో నుంచి వచ్చే ఆదాయం సహా మొత్తం రూ. 2.15 కోట్లకు చెక్కును రాజేంద్రన్కు సీఎం స్టాలిన్ అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రి స్వామినాథన్ పాల్గొన్నారు. తిరుక్కురల్ శ్రీ పుస్తకావిష్కరణ సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ తరఫున, తిరుక్కురల్– సార్వత్రిక జ్ఞానం, ప్రపంచానికే నిధి అన్న పుస్తకాన్ని రూపొందించారు. ప్రపంచ తమిళ భాషా ఫౌండేషన్న్ సంయుక్త ప్రచురణ ఆంగ్ల అనువాదం కూడా చేశారు. దీనిని సీఎం స్టాలిన్ విడుదల చేశారు. ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఏవీ వేలు, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అధికారుల వినియోగం కోసం 198 వాహనాలను సీఎం స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయా అధికారులకు తాళాలను అందజేశారు. అనంతరం అధికారులు, మంత్రులతో సీఎం స్టాలిన్ వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. -
ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు 62వ స్నాతకోత్సవం శుక్రవారం చైన్నె క్యాంపస్లో ఘనంగా జరిగింది. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ను ఈసందర్భంగా ప్రారంభించారు. జాతీయ విలువ కలిగిన అత్యున్నత సంస్థగా ఐఐటీ మద్రాసును భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభివర్ణించారు. ఐఐటీ మద్రాసు ఆవరణలో ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో 3,661 విద్యార్థులకు డిగ్రీలు (జాయింట్, డ్యూయల్ డిగ్రీలు సహా) ప్రదానం చేశారు. మొత్తం 529 మందికి పీహెచ్డీలు కూడా ప్రదానం చేశారు. కార్యక్రమానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఐఐటీ మద్రాస్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ పవన్ గొయాంకా స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ విలువ కలిగిన సంస్థ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను , వివిధ బహుమతి విజేతలను అందుకున్న వారిని అభినందిస్తూ, అజిత్ దోవల్ మాట్లాడుతూ, జాతీయ విలువ కలిగిన మార్గదర్శక సంస్థ ఐఐటీ మద్రాసు అని అభివర్ణించారు. ఇక్కడ ఉండటం ఒక గౌరవంగా పేర్కొన్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ, విదేశాలలో వ్యక్తిగత సౌకర్యాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి, నిజమైన విజయం నివసించే చోట కాదు, అందించే దానిలో ఉంటుంది.్ఙ అని అజిత్ దోవల్ పిలుపు నిచ్చారు. ప్రశంసల కోసం మాత్రమే కాకుండా, ప్రభావం కోసం ఆవిష్కరణలు చేయండి అని పిలుపునిచ్చారు.అలాగే, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాయని వివరించారు. అయితే, కొన్ని అంతర్జాతీయ మీడియా తప్పుడు సమాచారాన్ని బయటకు ప్రచారంచేసినట్టు అసహనం వ్యక్తం చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మట్లాడుతూ 3,227 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేశామన్నారు. ఈసందర్భంగా తమ పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంబంధాలు, సంస్థాగత అభివృద్ధి ద్వారా 2024–25లో రూ. 320 కోట్లు సేకరించామన్నారు. ఐఐటీ మద్రాస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయాంకా మాట్లాడుతూ, 100 సంవత్సరాల స్వాతంత్య్రం జరుపుకునే సమయానికి ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ఙ్ మేరకు పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశం చూడవచ్చు అని వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐఐటీ తన ఉత్సవాల ద్వారా ప్రదర్శనలలో కళలకు ఎల్లప్పుడూ ప్రాముఖ్యతను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవం ఐఐటీ మద్రాస్లో సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) కారిడార్ను ప్రారంభించారు. ఈ కేంద్రం ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది, విభిన్న విభాగాల నుంచి అధ్యాపకులను ఒకచోట చేర్చుతుంది. దీని పరిశోధన విస్తృత శ్రేణి నేపథ్య రంగాలను కలిగి ఉంటుంది. అలాగే, కృష్ణ చివుకుల బ్లాక్లో ఐకేఎస్ కారిడార్ను అజిత్ దోవల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ గురుమూర్తి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్, హెచ్ఎస్ఎస్ విభాగం ఐకేఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దీపక్ పరమశివన్ పాల్గొన్నారు. బీఎస్ అనిరుద్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైజ్, భారతరత్న ఎం విశ్వేశ్వరయ్య మెమోరియల్ ప్రైజ్, అనిత్ ఆనంద పొహెలికి ఇనిస్టిట్యూట్ మెరిట్ ప్రైజ్, వీఆర్ అభినవ్కు డాక్టర్ శంకర్ దయాల్శర్మ ప్రైజ్, రాజ గోపాల సుబ్రమణియంకు గవర్నర్ ప్రైజ్ను బహుమతిగా అందజేశారు. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు జాతీయ విలువ కలిగిన సంస్థగా అజిత్ దోవల్ అభివర్ణన -
27, 28 తేదీల్లో మోదీ పర్యటన
సాక్షి, చైన్నె : తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఈనెల 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులు జరుగుతున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే పతనం లక్ష్యంగా బీజేపీ, అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మరోవైపు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రజల్ని ఆకర్షించే పర్యటనల్లో ఉన్నారు. అమిత్షా తరచూ రాష్ట్రానికి వస్తుంటే, పళణిస్వామి తమిళనాడును కాపాడుదాం అనే నినాదంతో యాత్రను విస్తృతం చేశారు. ఈయాత్ర పలు జిల్లాలో ప్రజల్ని ఆకర్షించే విధంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వీరికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. డెల్టా జిల్లాల్లో అరియలూరు, పెరంబలూరు వెనుకబడిన జిల్లాలు. అలాగే, తంజావూరు వ్యవసాయానికి ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందిది. ఈ మూడు జిల్లాల్లో ఇంతవరకు బీజేపీ అధినాయకుల పర్యటనలు జరగలేదు. తాజాగా మోదీ పర్యటనకు కసరత్తులు జరుగుతున్నాయి. అరియలూరు జిల్లాలో గంగై కొండ చోళపురంలో ఈనెల 20వ తేదీ నుంచి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం 27వ తేదీ జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మోదీ రానున్నట్టు సమాచారం. ఇందుకు సంబందించిన ఏర్పాట్లపై బీజేపీ వర్గాలు దృష్టిపెట్టినట్టు తెలిసింది. 28వ తేదీ పెరంబలూరు, తంజావూరులలోనూ పర్యటించే విధంగా మోదీ కార్యక్రమాలకు కసరత్తులు జరుగుతున్నాయి.ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఏఐ టెక్నాలజీతో గుర్తించాం! తీవ్రవాదుల అరెస్టుపై డీజీపీ శంకర్జివాల్ సాక్షి, చైన్నె: ఏఐ టెక్నాలజీ ఆధారంగా తమ వద్ద ఉన్న అజ్ఞాతంలో ఉన్న తీవ్రవాదుల ఫొటోలను ప్రస్తుతం ఎలా ఉంటారో అలా తీర్చిదిద్ది ముగ్గుర్ని అరెస్టు చేశామని డీజీపీ శంకర్ జివాల్ తెలిపారు. కోయంబత్తూరు బాంబు పేలుడుతో పాటు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్ఞాత తీవ్రవాదులు అబూబక్కర్ సిద్ధిక్, మహ్మద్అలీ, టైలర్ రాజ అలియాస్ సాధిక్లను తమిళనాడు తీవ్ర వాద నిరోధక విభాగం బృందం గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్టు గురించి శుక్రవారం డీజీపీ శంకర్ జివాల్ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గుర్ని పట్టుకోవడంలో తమకు అత్యాధునిక సాంకేతికత ఎంతో ఉపయోగకరంగా మారిందన్నారు. ముఫ్పై సంవత్సరాల క్రితం వారు ఎలా ఉన్నారో అనే ఫొటో మాత్రమే తమ వద్ద ఉండేదని, వాటి ఆధారగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రస్తుతం ఎలా ఉన్నారో గుర్తించ గలిగామన్నారు. ఈ ముగ్గురు పూర్తిగా తమ పాత ఐడెంటిటీని రూపు మాపి, కొత్త ఐడెంటితో రియల్టర్గా, కూరగాయల మార్కెట్ నడుపుతూ విదేశాలకు సైతం వెళ్లి వచ్చినట్టు తేలిందన్నారు. వీరి కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక బృందం శ్రమించిందన్నారు. వీరిని మరింతగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక చోట జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని పోలీసు వ్యవస్థపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని తిరుభువనంలో సెక్యూరిటీ అజిత్కుమార్ లాకప్ డెత్ ఘటనపై డీజీపీ వ్యాఖ్యలు చేశారు. నాకు వ్యతిరేకంగా కుట్ర సాక్షి, చైన్నె: తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరుగుతోందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఆరోపించారు. తన నివాసం నుంచి ట్యాపింగ్ పరికరాన్ని గుర్తించామన్నారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి రాందాసు మధ్య సమరం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి తప్పించే దిశగా రాందాసు తుది నిర్ణయానికి వచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. పీఎంకే రెండు ముక్కలయ్యేనా అన్నట్టుగా తాజా పరిస్థితులు కనబడుతున్నాయి. తన నేతృత్వంలోని మద్దతు వర్గాన్ని అన్బుమణి శుక్రవారం చైన్నెకి పిలిపించారు. వారితో జరిగిన సమావేశంలో తన నేతృత్వంలో పీఎంకే సభ్యత్వ నమోదు వేగవంతం చేయించాలని ఆదేశించారు. బలోపేతం దిశగా అడుగులు వేద్దామని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాందాసు మరోబాంబు పేల్చారు. తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఏమిచేస్తున్నాను, ఏమి మాట్లాడుతున్నానో పసిగట్టేందుకు ట్యాపింగ్ పరికరాన్ని ఉపయోగించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తైలాపురం గెస్ట్ హౌస్లో తన గదిలో సోపా కింద దీనిని గుర్తించామన్నారు. ఇది లండన్లో తయారు చేసినట్టుగా ఉందని పేర్కొన్నారు. మైలాడుతురై జిల్లా శీర్గాలిలో వన్నియర్ మహిళా సంఘ మహానాడుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆగస్టు 10న జరగనున్న మహానాడు ఏర్పాట్లను రాందాసు పరిశీలించారు. -
14న మద్దతుదారులతో పన్నీరు భేటీ
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈనెల 14న తన మద్దతుదారులతో సమావేశానికి మాజీ సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. వేప్పేరిలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు పన్నీరుసెల్వం విస్తృతంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీజేపీతో జతకట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి రాజకీయంగా రాష్ట్రంలో బలపడ్డారు. తన బలాన్ని మరింతగా చాటుకునే దిశగా రాష్ట్రంలో చైతన్య యాత్ర పేరిట పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తర్వాత కార్యాచరణపై పన్నీరుసెల్వం దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా ఈనెల 14న మద్దతుదారులతో సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీ సైతం తనను పక్కన పెట్టిన నేపథ్యంలో పన్నీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఎదురుచూపులు పెరిగాయి. అదే సమయంలో అన్నాడీఎంకే వివాదంపై కేంద్ర ఎన్నికల కమిషన్ జాప్యం చేస్తుండడం హైకోర్టుకు శుక్రవారం చేరింది. అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ తీరును ఖండించారు. జాప్యమేలా అంటూ ప్రశ్నలు వేశారు. -
విద్యా కేంద్రంగా తమిళనాడు
● మంత్రి అన్బిల్ మహేశ్సాక్షి, చైన్నె: భారత దేశానికే తమిళనాడు అత్యున్నత విద్యా కేంద్రంగా అవతరించిందని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి తెలిపారు. క్రెసెంట్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ స్వర్ణోత్సవ సంబరాలు గురువారం రాత్రి చైన్నెలో జరిగాయి. అన్నాసాలైలోని కామరాజ్ అరంగంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి ప్రసంగిస్తూ, ఐదు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యకు, నమ్మకానికి, సమర్థులైన యువతులను తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల పాత్రను ప్రశంసించారు. మిస్తైల్ మ్యాన్ శ్రీడాక్టర్ అబ్దుల్ కలాం నుంచి మాజీ రాష్ట్రపతి నారాయణన్ వరకు ఎందరో ద్విభాషా విధానం అమలైన పాఠశాలల్లో చదువుకుని ఉన్నత స్థానానికి చేరారని వివరించారు. ఈ విధానమే ప్రతి విద్యార్థి భవిష్యత్ అని, ఆ దిశగా తమిళనాడు ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలంగా రూపొందించి ఉందన్నారు., అందరికీ అందుబాటులో ఉండే, సమానమైన, నాణ్యమైన విద్యను నిర్ధారించడానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు వ్యవస్థలను తమిళనాడు కలిగి ఉందన్నారు. నేడు తమిళనాడు దేశంలోనే అత్యున్నత విద్యాకేంద్రంగా మారిందన్నారు. నాగపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలూర్ షానవాస్ పాల్గొని బలమైన విలువలతో కూడిన అకడమిక్ ఎక్సలెన్స్ను నిర్ధారించడంలో సీత కతి ట్రస్ట్ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీత కతి ట్రస్ట్ చైర్మన్ ఆరీఫ్ బుహారీ రెహమాన్, కార్యదర్శి ఖలీద్ బుహారీ, ది రైస్ గ్లోబల్ వ్యవస్థాపకుడు రెవరెండ్ డాక్టర్ జగత్ గాస్పర్రాజ్, ఐయూఎంఎల్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఫాతిమా ముజఫర్, పాఠశాల కరస్పాండెంట్ షరీఫా ఎ.అజీజ్, ప్రిన్సిపల్ బుష్రా అమౌల్లా, జాయింట్ కరస్పాండెంట్ మరియం హబీబ్, వైస్ ప్రిన్సిపల్ , కోఆర్డినేటర్ జమీరా ఆఫ్రాన్ పాల్గొన్నారు. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్బేస్లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్లోని సర్గోధా, రహీంయార్ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
విచారణ కమిషన్కు సిద్ధం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో చేసిన అప్పులకు విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఎడపాడి చెప్పడం విడ్డూరంగా ఉందని వీటికి తాము అందుకు సిద్ధమని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని అరుంబర్తి గ్రామంలో నాబార్డు నిధుల నుంచి రూ: 24.82 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్డ్యామ్ నిర్మాణ పనుల కోసం అడుగు భాగంలో ఎనిమిది అడుగులలోతు తీసి పనులు చేస్తున్నామన్నారు. ఈ చెక్డ్యామ్ ఏర్పాటు చేయడం వల్ల కాట్పాడి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. వీటితో పాటు కావనూరు చెరువు నిండి అందులో నుంచి వచ్చే నీరు పూర్తిగా ఈ చెక్డ్యామ్కు వస్తుందన్నారు. అదేవిధంగా అరుంబర్తి గ్రామంలో రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. డీఎంకే ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూసి ఎడపాడి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, యూనియన్ చైర్మన్ వేల్ మురుగన్, వైస్ చైర్మన్ శరవణన్, అధికారులు పాల్గొన్నారు. -
క్రైస్తవ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తద్వారా సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ నేతలు గురువారం ఉదయం ఽతిరువళ్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు ఐజాక్ హాజరై ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న క్రైస్తవులకు ప్రత్యేకంగా 10.5 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పంచమీ భూములను స్వాధీనం చేసుకుని నిరుపేదలైన క్రైస్తవులకు పంచిపెట్టాలి. రాష్ట్రంలో అనుమతులు కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవ మిషనరీలు, కళాశాలలు, యూనీవర్శిటీలకు వెంటనే అనుమతులను ఇవ్వాలని నినాదాలు చేశారు. క్రైస్తవులు, చర్చి ప్రసంగీకులపైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్కుట్టి, జిల్లా అధ్యక్షుడు రాజన్, శ్యామ్యూల్ రాజ్సెడ్రిక్బెనోతో పాటూ పలువురు పాల్గొన్నారు. -
వేడుకగా మన్నారుస్వామి వార్షికోత్సవం
తిరుత్తణి: మన్నారుస్వామి ఆలయ వార్షికోత్సవం గురువారం వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగలో శ్రీదేవి, భూదేవి సమేత మన్నారుస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులు చేపట్టి మూడేళ్ల కిందట మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈక్రమంలో ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామికి అభిషేక, ఆరాధన పూజలు నిర్వహించారు. వేడుకల్లో తెన్నేటి కుటుంబీకులతో పాటు గ్రామీణులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పంచాయతీ మాజీ సర్పంచ్ మునిరత్నం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. -
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
తమిళసినిమా: కోలీవుడ్లో మాదక ద్రవ్యాల వ్యవహారంలో కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చైన్నె మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు బుధవారం రాత్రి నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలపై కొత్తగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతాల్లో పవనాలు పశ్చిమ దిశగా కదులుతున్నాయి. ఈక్రమంలో గాలులు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రకు వర్షాలు తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశాలలో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక తమిళనాడు వాతావరణం గుండా పసిఫిక్ మహాసముద్రం వైపు చైనా వైపు గాలులు వీస్తున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా చైనాలో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు ఉత్తర తీరం వెంబడి వర్షం పడుతుంది. ఏర్కాడ్, కల్వరాయణమాలయ, కొడైకెనాల్ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఇక 12వ తేదీన తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం జిల్లాల్లో వర్షం కురుస్తుందని చైన్నె వాతావరణ శాఖ ప్రకటించింది. వృద్ధురాలి హత్య నగలు చోరీ తిరువొత్తియూరు: వృద్ధురాలిని దారుణంగా హతమార్చి దుండగలు నగలు చోరీ చేసిన ఘటన కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కడలూరు జిల్లా బువనగిరి సమీపంలోని చెట్టికుళం ప్రాంతంలోని నాథమేడుకు చెందిన వేలు. ఇతని భార్య చంద్ర (60). ఈమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి వెనుక తలుపు పగులగొట్టి లోపలికి చొరబడి చంద్ర ముఖంపై దిండుతో నొక్కడంతో ఊపిరాడక మృతిచెందింది. వృద్ధురాలి మెడలోని చైన్, గాజులు దోచుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన నాగరాజన్ కుమారుడు పశుపతి (27) వృద్ధురాలిని హత్య చేసి నగలు దొంగిలించాడని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 76,501 మంది స్వామి వారిని దర్శించుకోగా 29,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
క్లుప్తంగా
విద్యార్థిని బలవన్మరణం తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా పరమతి వెల్లూర్ తాలూకా, వడకర యత్తూరు, ప్రాంతానికి చెందిన నటరాజ్ (45) అతని కుమార్తె ప్రాణిక (13) ఆ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థి ప్రాణిక, బుధవారం సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణిక తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసరికి, కుమార్తె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం చూసి వారు బోరున విలపించారు. తరువాత, ఇరుగు పొరుగు వారు బాలికను చికిత్స కోసం వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ పరీక్షించిన వైద్యులు ప్రాణిక మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం తిరుత్తణి: ప్రభుత్వ బస్సు అద్దం ధ్వంసం సంఘటన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బస్టాప్ వద్ద కలకలం రేపింది. తిరుత్తణి సమీపంలోని తిరుపతి చైన్నె–జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు బస్సుల్లో తిరుత్తణికి వచ్చి చదువుకుంటున్నారు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం కళాశాల ముగిశాక విద్యార్థులు బస్సుల కోసం బస్టాప్ వద్ద వేచివున్నారు. ఈ సమయంలో తిరుత్తణి నుంచి తిరువళ్లూరుకు వెళుతున్న బస్సులో విద్యార్థులు తొక్కిసలాడుతూ ఎక్కారు. బస్సు ఫుల్ కావడంతో డ్రైవర్ బస్సు కదల్చగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బస్సు అద్దాన్ని పగులగొట్టారు. డ్రైవర్ బస్సును అక్కడే ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారైకల్ ఆలయంలో మామిడి పండగ సంబరాలు ● రాత్రిపూట అమృత నైవేద్య కార్యక్రమం కొరుక్కుపేట: కారైకల్ భారతీ నగర్ వీధిలో అమ్మన్ ఆలయం ఉంది. దేవతను పూజించడానికి మామిడి పండ్లను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కారైకల్ అమ్మన్ ఆలయంలో ఏటా మామిడి ఉత్సవ పండుగ సాంప్రదాయకంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పండుగ 8వ తేదీ సాయంత్రం ప్రారంభమైంది. ఈ పండుగలో ప్రధాన కార్యక్రమం బుధవారం కారైకల్ అమ్మైయార్ ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి పౌర సరఫరాల మంత్రి తిరుమురుగన్, ఎమ్మెల్యే నజీమ్ , పుదుచ్చేరి డిఐజి సత్య సుందరం, కారైకల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ చౌజన్య, డీఎంకే వ్యవసాయ విభాగం నిర్వాహకుడు ప్రభు అలియాస్ సృథ్వీరాజ్, ఆలయ పరిపాలన అధికారి కనిదాసన్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మామిడి పండుగలో పాల్గొన్న భక్తులు తమ ఇళ్ల పైకప్పు నుంచి మామిడి పండ్లను విసిరారు. భక్తులు ఉత్సాహంగా మామిడి పండ్లను పట్టుకున్నారు. ఈ మామిడి పండ్లు తినడం వల్ల సంతానోత్పత్తిలో శుభం కలుగుతుందని నమ్ముతారు. అందువల్ల, చాలా మంది మహిళలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని మామిడి పండ్లను పట్టుకున్నారు. వీధుల నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొని పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించి, దేవత దర్శనం చేసుకున్నారు. రెండు లారీలు ఢీ ముగ్గురు దుర్మరణం తిరువొత్తియూరు: రెండు లారీలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై బైపాస్ రోడ్డు పునరుద్ధరణ పనులు గత కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తూత్తుకుడి నుంచి పళనికి పౌడర్తో కంటైనర్ లారీ అర్ధరాత్రి బయలుదేరింది. లారీడ్రైవర్ జయమురుగన్ లారీ నడుపుతున్నాడు. అదేవిధంగా, ఇలాంటి పౌడర్ పైపులను తీసుకుని వెళుతున్న మరో లారీ మదురై నుంచి తూత్తుకుడికి వెళుతోంది. ఈలారీని ముత్తురాజ్ నడుపుతున్నాడు. ఈరెండు లారీలు అరుప్పుకోట్టై జంక్షన్ వద్ద అరుప్పుకోట్టై–తూత్తుకుడి నాలుగు లేన్ల రహదారిపై గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్లు జయమురుగన్, ముత్తురాజ్, లారీలోని మరొక ప్రయాణికుడు మృతిచెందారు. సమాచారం అందుకున్న అరుప్పుకోట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని లారీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కూడంకుళంలో కలకలం మత్స్యకారుల ఆందోళన తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలోని కుడంకుళం సమీపంలోని కూటపుల్లి గ్రామంలో నివసించే సంధ్య, సూసయి, సూడి, పెలికాన్, తిపుర్సియన్, దీపన్, దీపగురుస్, తెలస్, రూబన్ , అజిత్ అనే 10 మంది మత్స్యకారులు తమ సొంత పడవలను కలిగి ఉండి చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈ పడవలు తమిళనాడు వెట్రి కలగం పార్టీ రంగులు పెయింటింగ్ చేసి వుండడాన్ని కారణంగా చూపుతూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పడవల యజమానులకు ఈ నెలకు ఇవ్వాల్సిన 250 లీటర్ల సబ్సిడీ కిరోసిన్ నూనెను అధికారులు నిలిపివేశారు. దీంతో జాలర్లు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన కూడంకుళం ప్రాంతంలో కలకలం రేపింది. -
శరవేగంగా పుష్కరిణి పనులు
తిరుత్తణి: ఆడికృత్తిక తెప్పోత్సవం సందర్భంగా శరవణ పుష్కరిణి సిద్ధం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వచ్చే నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు ఆడికృత్తిక తెప్పోత్సవం నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు కావళ్లతో తిరుత్తణి ఆలయం చేరుకుని స్వామికి మొక్కులు చెల్లించనున్నారు. ఆగస్టు 16న ఆడికృత్తికతో పాటు తొలిరోజు తెప్పోత్సవం సందర్భంగా శరవణ పొయ్గై పుష్కరిణి శుభ్రం చేసేందుకు వీలుగా ఉభయదారుల నిధుల సాయంతో రూ.23.50 లక్షలతో కోనేటి నుంచి నీటిని తొలగించి పూడిక పనులు రెండు నెలలుగా నిర్వహించారు. ప్రస్తుతం కోనేటిలో కలుషిత నీటిని తొలగించి పూడికతీసి పరిశుభ్రం చేశారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి కోనేరులో నింపుతున్నారు. మరో వారంలో కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఇక, అన్బుమణి మాత్రమే!
● నా పేరు వాడొద్దు ● రాందాసు స్పష్టీకరణసాక్షి, చైన్నె : తండ్రి తనయుడి మధ్య వార్లో మరో ట్విస్టు గురువారం చోటు చేసుకుంది. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడండీ. ఆయన పేరు వెనుక తన పేరును ఉపయోగించ వద్దు అని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు వారసుడు అన్బుమణి అన్న విషయం తెలిసిందే. ఆది నుంచి ఆయన్ని అందరూ అన్బుమణి రాందాసు అని పిలవడం, పేరును రాయడం జరుగుతూ వస్తోంది. తాజాగా తండ్రి, తనయుడి మధ్య వివాదం తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాందాసు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంబకోణంలో తంజావూరు, తిరువారూర్ జిల్లాలో వన్నియర్ సంఘాల నేతలు, పార్టీ వర్గాలతో రాందాసు సమావేశమయ్యారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి చర్యలను ఎండగట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అన్బుమణి తన పేరును ఇనీషియల్గా వాడుకోవచ్చు అని పేర్కొంటూ, అయితే, ఆయన పేరు వెనుక అన్బుమణి రాందాసు అని మాత్రం వాడ వద్దు అని సూచించారు. ఇక మీదట అన్బుమణి అని మాత్రమే వాడాలని పేర్కొంటూ, ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్కు బుధవారం రాందాసు లేఖ రాసిన నేపథ్యంలో గురువారం అన్బుమణి సైతం మరో లేఖ రాశారు. రాందాసు నేతృత్వంలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ తీర్మానాలను ఆమోదించ వద్దని కోరారు. ఈ సమావేశానికి చైర్మన్, ప్రధాన కార్యదర్శి హాజరు కాలేదని, ఈ దృష్ట్యా, ఆ సమావేశ తీర్మానాలకు ఎలాంటి మద్దతు లేదని,వాటిని తిరస్కరించాలని ఎన్నికల కమిషన్ను అన్బుమని కోరారు. -
మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలి
కొరుక్కుపేట: మాతృభాషపై మమకారాన్ని పెంచుకోవాలని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ శంకరరావు పిలుపునిచ్చారు. సమితి తరఫున 23వ వార్షిక పోటీలు గురువారం టి.నగర్లోని బాలానంద విద్యాలయంలో కార్యవర్గ సభ్యులు పసుమర్తి జయశ్రీ , డాక్టర్ టి.కల్పన, శివసుబ్రహ్మణ్యం, దామెర్ల పద్మావతి, బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని 8 పాఠశాలల నుంచి 130 మందికి పైగా తెలుగు విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పద్య పఠనం, వ్యాస రచన, చిత్ర లేఖనం, వక్తృత్వ ఇతర పోటీలను నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా ఆముక్తమాల్యద, శారద, లలిత, వసంతలక్ష్మి, కె.రమాదేవి, గజగౌరీ, వసుంధర, లావణ్య, కమల, లలిత వ్యవహరించారు. దిట్టకవి అనంత పద్మనాభమూర్తి, పాల్గొన్నారు. -
రూ.36.06 కోట్లతో ఆవడిలో బస్టాండ్
తిరువళ్లూరు: ఆవడిలో రూ.36.06 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బస్టాండుకు మంత్రులు శేఖర్బాబు, నాజర్ భూమిపూజ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలో నూతన బస్టాండు నిర్మాణం కోసం 2024–25 బడ్జెట్లో నిధులను కేటాయించారు. 1.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బస్టాండుకు భూమిపూజను గురువారం ఉదయం నిర్వహించారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ ఆవడిలో నిర్మించనున్న బస్టాండులో తాగునీరు, ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, ప్రయాణికుల సీటింగ్ సదుపాయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రకాష్, అదనపు కార్యదర్శి శివజ్ఞానం, ఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుశంకర్, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా స్నిగ్ద 2025 పోటీలు
కొరుక్కుపేట:శ్రీ కన్యకాపరమేశ్వరి మహిళా కళాశాలలోని కళాలయ ఫైన్ ఆర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ స్నిగ్ద 2025శ్రీ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన సాంస్కతిక పోటీలు, ఫ్రెషర్స్ డే ఉత్సవాలు గురువారం విజయవంతంగా ముగిసాయి. గురువారం ఆన్ స్టేజ్ ఈవెంట్లుగా పాటలు, నత్యం తదితర పోటీలు నిర్వహించగా మొదటి సంవత్సరం విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపారవేత్త రాధాకష్ణన్ బాలాజీ హాజరై నక్షత్ర స్టూడెంట్ కౌన్సిల్ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ముందుగా కళాశాల కరెస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, కశాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వణిత తదితరులు కలిసి అతిథిని ఘనంగా సత్కరించారు. నక్షత్ర స్టూడెంట్ కౌన్సెల్ ప్రారంభం