Tamil Nadu
-
ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ
●టీఎన్సీసీ నిర్ణయం ●నేతలతో ఇన్చార్జ్ల సమాలోచన సాక్షి, చైన్నె: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆదివారం టీఎన్సీసీ నేతలతో సమావేశంలో ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చైన్నెలో సత్యమూర్తి భవన్ రాష్ట్ర కార్యాలయంగా ఉంది. అలాగే తేనాంపేటలో కామరాజర్ అరంగం ఉంది. 200 గ్రౌండ్లస్థలంతో ఆడిటోరియం ఉంది. ఇక చైన్నె నగరంలో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటూ రాష్ట్రంలో రూ. 500 కోట్లు విలువైన ఆస్తులు పలు జిల్లాలో ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. కామరాజర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్కు అప్పట్లో విరాళాలు అధికంగా వచ్చేవి. పార్టీ కార్యాలయాల కోసం భవనాలు, ఖర్చుల కోసం పంట పొలాలను, అందులో సాగుబడి అయ్యే ఉత్పత్తులను విరాళంగా ఇచ్చేన వారు ఎక్కువే. అయితే ఇందులో అనేకం అన్యాక్రాంతమై ఉన్నాయి. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకుని, పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. అనేక ఆస్తులను పార్టీ వారే స్వాహా చేసి చేతులు మార్చినట్టుగా ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన గిరిశీ చడన్కర్, ఏఐసీసీ కార్యదర్శి సూరజ్ ఎంఎన్ హెగ్డేలు ఆదివారం చైన్నెలోని సత్యమూర్తి భవన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆస్తుల మీద చర్చ జరిగింది. ఉన్నవాటిని పరిక్షించుకోవడం, అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టే విధంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఆస్తుల పరిరక్షణకు గతంలో నియమించిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, మాజీ అధ్యక్షులు తంగబాలు, తిరునావుక్కరసర్ వంటి నేతలతో పాటూ రాష్ట్ర కమిటీ, జిల్లాలో ముఖ్యులైన నేతలు పాల్గొన్నారు. అదే సమయంలో ఏఐసీసీ పెద్దలను చైన్నె కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిశారు. వారికి తమ తరపున వినతి పత్రం సమర్పించారు. చైన్నె జిల్లా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మహిళలకు పెద్ద పీట వేయాలని కోరారు. ప్రస్తుత అధ్యక్షుడు మహిళలకు విలువనివ్వడం లేదని, కార్పొరేటర్లను ఏ ఒక్క సమావేశానికి పిలవడం లేదని ఆరోపించారు. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
● బైక్ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు ● తల్లి, తండ్రి, కుమార్తె దుర్మరణంసేలం : సెంజి సమీపంలో ఉన్న రాజంపుల్లియూర్ గ్రామానికి చెందిన దురైకన్ను (50) ఇటుక పని చేసే కార్మికుడు. చైన్నెలోని మదురవాయల్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన భార్య పచ్చయ్యమ్మాళ్ (46). వీరికి కుమార్తె గోపిక (18), కుమారుడు గుణశేఖర్ (21) ఉన్నారు. ఈ పరిస్థితిలో, మరణించిన దురైకన్ను సోదరుడు నందగోపాల్ అంత్యక్రియలకు హాజరు కావడానికి దురైకన్ను, గుణశేఖర్ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైక్లో సెంజికి బయలుదేరారు. దురైకన్ను, అతని భార్య పచ్చయ్యమ్మాళ్, కూతురు గోపిక బైక్పై వస్తుండగా, గుణశేఖర్ మరో బైక్ మీద వెళ్లాడు. వారు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, విల్లుపురం జిల్లా సెంజి తిండివనం రోడ్డులోని వల్లం తొండియట్టు వంతెన వద్దకు చేరుకుంటుండగా, తిరువణ్ణామలై నుంచి చైన్నె వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న దురైకన్ను, పచ్చయమ్మాళ్, గోపికలు ముగ్గురు కింద పడి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సెంజి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మరణించిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సెంజి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక సమరమే!
● నేటి నుంచి పూర్తిస్థాయిలోసభా కార్యకలాపాలు ● అధికార పక్షాన్ని ఢీకొనేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు ● అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న విపక్ష నాయకులు ● స్పీకర్పై అవిశ్వాసం నోటీసు ● ఓటింగ్కు అవకాశం స్పీకర్పై అవిశ్వాసం నోటీసు స్పీకర్ అప్పావును అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. సభా వ్యవహారాలలో తమకు అన్యాయం చేస్తున్నారన్న ఆగ్రహంతో కన్నెర్ర చేసింది. తమ ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు కావడం లేదని, తమకు సమయం కేటాయించడం లేదన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్కు అన్నాడీఎంకే స్పీకర్పై అవిశ్వాస నోటీసు జారీ చేసింది. దీనిపై సోమవారం ఓటింగ్కు అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, స్పీకర్ అప్పావుకు బదులుగా డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి సభను నడిపించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ విషయంగా స్పీకర్ అప్పావును ప్రశ్నించగా, వారి అవిశ్వాస తీర్మానంను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నా రు. గత సమావేశాలలో కొన్ని సాంకేతిక కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని, అవి ఇక పు నరావృతం కాకుండా చూసుకుంటామన్నా రు. కాగా, అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన పక్షంలో డీఎంకే మెజారిటీ ఆధారంగా అది వీగి పోయే అవకాశాలు అధికంగా ఉండడం గమనార్హం. సాక్షి, చైన్నె: అసెంబ్లీలో బడ్జెట్ల దాఖల పర్వం ముగిసింది. ఇక, నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, వివిధ తీర్మానాలపై జరగనుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నాడీఎంకే , బీజేపీ, పీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అస్త్రాలతో అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి సభా పర్వం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం నోటీసును అన్నాడీఎంకే జారీచేసిన దృష్ట్యా, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు.. 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు చేరింది. ఆ శాఖల మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్కే పన్నీరు సెల్వం తమ పద్దులను సభ ముందు ఉంచారు. ఈ రెండు రోజుల ప్రక్రియ ముగియడంతో సోమవారం నుంచి బడ్జెట్ మీద చర్చ జరగనుంది. సంతాప తీర్మానాల తర్వాత ఈ చర్చ మొదలు కానుంది. 18, 19, 20 తేదీలలోనూఈ రెండు బడ్జెట్లపై చర్చ కొనసాగనుంది. 21వ తేదీన సభలో ఆదాయ వ్యయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఖర్చులతో అనుబంధ పద్దును ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సభ ముందు గణాంకాలతో సహా ఉంచనున్నారు. 22, 23 శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈనెల 24వ తేదీ నుంచి సభలో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ప్రగతి ప్రాజెక్టులు, వివిధ అంశాలపై చర్చలు హోరెత్తనున్నాయి. నీటి పారుదల శాఖ నుంచి మొదలు.. ఈనెల 24వ తేదీన నీటి పారుదల శాఖ, 25న నగరాభివృద్ధి శాఖ, 26న గ్రామీణాభివృద్ధి, 27న ప్రత్యేక పథకాలు, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ, 28న ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖలకు నిధులు కేటాయింపుల చర్చ,సమీక్షలు జరగనున్నాయి. ఈనెల 29, 30 శని ఆదివారాలు, 31న రంజాన్ సెలవు తర్వాత సభ ఏప్రిల్ 1వ తేది పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున రహదారులు, చిన్న హార్బర్లు, ప్రజా పనుల శాఖ, 2న వ్యవసాయం, మత్స్య, పశు సంవర్ధక శాఖలు, 3వ తేదీ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ, 4న న్యాయం, జైళ్లు శాఖ చర్చ జరగనున్నది. 5, 6 సెలవు దినాలు కావడంతో 7వ తేదిన గృహ నిర్మాణం, 8న సహకారం, ఆహార భద్రత శాఖ,9న ఎంఎస్ఎంఈల శాఖ చర్చ, 10వ తేదీ మహావీర్ జయంతి తర్వాత 11, 12, 13, 14 తేదీల సెలవుతో 15వ తేదీ సభ పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున సమాచారం, తమిళాభివృద్ధి శాఖ, 16వ తేదీ దివ్యాంగుల సంక్షేమం, మహిళా సంక్షేమం, హక్కుల శాఖ, 17వ తేదిన పర్యాటకం, హిందూ దేవాదాయ ఽశాఖ, చర్చ తర్వాత 18న గుడ్ ఫ్రైడే, 19,20 శని, ఆదివారాల సెలవుతో 21వ తేదిన విద్యుత్, ఎకై ్సజ్, 22న వైద్యం,ఆరోగ్య శాఖ, 23న వాణిజ్య పనులు, 24న విద్యా శాఖ, 25న ఐటీ ,26న వెనుకబడిన సంక్షేమం,మైనారిటీశాఖ చర్చ లు హోరెత్తనున్నాయి. 27న సెలవు దినం కావడంతో 28వ తేదీన అసెంబ్లీ వ్యవహారాలతోపాటూ ఆయా శాఖల మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. 29, 30 తేదీలలో సీఎం స్టాలిన్ పరిధిలోని హోంశాఖపై చర్చ, సీఎం ప్రత్యేక ప్రసంగాలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలన్నీ ఓ వైపు ఉంటే,మరో వైపు అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సై అంటే సై.. టాస్మాక్ స్కాం, కేరళకు ఖనిజ సంపదల అక్రమ రవాణా,రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విచ్చల విడిగాసాగుతున్న గంజాయి వంటి మాధక ద్రవ్యాల విక్రయాలు, బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాలు వంటిఅంశాలను ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. డీఎంకే పాలన అవినీతిమయం అని చాటే దిశగా అధికార పక్షాన్ని డీకొట్టే విధంగా సభా వేదికగా సమరానికి అన్నాడీఎంకే కాలుదువ్వేపనిలో పడింది. బీజేపీ, పీఎంకేలు సైతం తమ దైన బాణిలో అస్త్రాలు సిద్ధంచేసుకున్నాయి. త్రిభాషా విధానం, లోక్సభ పునర్విభజన పేరిట డీఎంకే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇక తమకు రిజర్వేషన్ అమలు, కులగణనకు పట్టుబట్టే విధంగా పీఎంకే పోరుకు సిద్ధమైంది. ఈ దృష్ట్యా, అసెంబ్లీలో సభా పర్వం వేడెక్కనుంది. తామేమీ తక్కువ కాదన్నట్టుగా డీఎంకే సైతం ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ శాసన సభా పక్షం సమావేశం జరిగింది.ఇందులో సభలో వ్యవహరించాల్సిన అంశాల గురించి చర్చించి వ్యూహాలను రచించి ఉన్నారు. -
మెమరీస్ అండ్ మైల్ స్టోన్స్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా 60 వసంతాలను గుర్తు చేస్తూ జ్ఞాపకాలు, మైలురాళ్లపై చరిత్రకారుడు వి. శ్రీరామ్, లక్ష్మణ్ల మెమరీస్ అండ్ మైల్ స్టోన్స్ పుస్తకాన్ని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ ప్రకాష్, జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా సంజయ్ గాంధీ, తమిళనాడు ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ ఎ.ఎల్. సోమయాజిలు ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన వేడుకలో 1964లో మొదటిసారిగా బ్లూ క్రాస్ ఆఫ్ ఇండి యా రిజిస్ట్రేషన్ చేయబడినప్పటి నుంచి స్వచ్ఛందంగా పనిచేసిన, పనిచేస్తున్న దేశంలో అత్యంత చురుకై న జంతు సంక్షేమ సమూహంగా అవతరించే వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా బ్లూ క్రాస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా ఏదైనా సంస్థను నడపడం కష్టం అని, అది కూడా జంతు సంక్షేమ రంగంలో ఒక సంస్థను నడపడం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సేవలు సాగాయని, మరెన్నో కొనసాగుతున్నాయని వివరించారు. జంతు సంరక్షణలో తాము నిరంతర సేవకులు అని వ్యాఖ్యానించారు. అంగన్వాడీలలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ – 7,783 పోస్టులకు నోటిఫికేషన్సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని అంగన్వాడీలలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు 7,783 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో అంగన్ వాడీలలో ఖాళీలు పేరుకు పోతున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు హోరెత్తిన విషయం తెలిసిందే. పేద పిల్లలకు ప్రాథమికంగా విద్యా అడుగు పడేందుకు వేదికగా ఈ అంగన్వాడీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో పేరుకుపోతున్న ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్ గత కొంత కాలంగా వినిపిస్తూ వచ్చింది. ఈ పరిస్థితులలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కొన్ని మార్గదర్శకాలను మాత్రం రూపొందించారు. వాటికి అనుగుణంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల ఆధారంగా జిల్లాల వారీగా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు 3,886 పోస్టులు అంగన్వాడీ ఉద్యోగి, 305 మినీ అంగన్వాడీ ఉద్యోగి, 3592 అంగన్వాడీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ..గుర్తు మార్పులో తప్పేముంది! ● తమిళం నచ్చని వారికే సమస్య ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ ఆదివారం మీలో ఒకడ్ని అంటూ సామాజిక మాధ్యమం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వీడియో ద్వారా అన్ని వివరాలను విశదీకరించారు. ఇందులో బడ్జెట్ లోగోలో తమిళంలో రూ. అక్షరం చర్చకు దారి తీసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆర్ఎస్.. అని ఆంగ్లంలో ఉపయోగిస్తున్న పదాన్ని తాము తమిళంలో రూ. అని పేర్కొన్నట్టు వివరించారు. భాషా విధానానికి ఏ మేరకు కట్టుబడి ఉన్నామో చాటే విధంగా తమిళంలో రూ. అని పొందు పరిచామన్నారు. అయితే, తమిళం అంటే నచ్చని వారికి ఇది పెద్ద సమస్యగా అనిపించినట్టుందన్నారు. దీనిని వివాదంగా వార్తల్లోకి ఎక్కించారని పేర్కొన్నారు. తాను కేంద్రం నుంచి రావాల్సిననిధుల విడుదల విషయంగా ప్రస్తావిస్తూ లేఖలు రాసినప్పుడు గానీయండి, ఆర్థిక మంత్రి అనేక సందర్భాలలో రూ. అని ఇంగ్లీషు రాసి ఉన్నారన్నవిషయాన్ని ఈసందర్భంగా తాను గుర్తు చేస్తున్నట్టు వివరించారు. అందరూ రూపాయలే అని రాయడం లేదు. కొన్ని సందర్భాలలో సాధారణంగా రూ. అనే రాస్తున్నా రని పేర్కొన్నారు. అయితే, భారత దేశ స్థాయి లో తమ తమ బడ్జెట్ హిట్, తమిళం కూడా హిట్ అని వ్యాఖ్యానించారు. అనంతరం బడ్జెట్ రూపకల్పన గురించిన ప్రశ్నకు ఆర్థిక సలహా మండలిలోని నిపుణుల సలహాలు సూచనలను గుర్తు చేశారు. సచివాలయంలో చాలా రోజులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంత్రులు, అధికారులు కూర్చుని ఈ బడ్జెట్ గురించి సమీక్షించి, చర్చించి సిద్ధం చేశామన్నారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఆరోపణలను బడ్జెట్తో నోళ్లు మూయించామన్నా రు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ పెంపు, అన్నింటా నంబర్ వన్ అనే లక్ష్యాన్ని సాధించడానికి తన ప్రయాణం విస్తృతం అవుతుందన్నారు. -
న్యాయ వ్యవస్థకు.. సంపూర్ణ సహకారం
న్యాయ వ్యవస్థకు అన్ని రకాల సదుపాయాల కల్పన, మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో సుప్రీం కోర్టు శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు శాఖ కోసం.. విద్యావంతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, తన ప్రభుత్వం రాజ్యాంగంలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి, న్యాయ శాఖ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయవిద్య కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఏటా తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్లు విరాళంగా ఇస్తోందని, మరణించిన న్యాయవాదుల చట్టపరమైన వారసులకు అందించే స్కాలర్షిప్ను రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచామన్నారు. పెండింగ్లో ఉన్న అదనపు సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 20 కోట్ల విరాళంగా ఇవ్వనున్నామన్నారు. న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటున్నదని, సంపూర్ణ సహకారం, మద్దతును ఇస్తున్నట్టు వివరించారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం 6 జిల్లా , సెషన్స్ కోర్టులు, 5 అదనపు జిల్లా కోర్టులు, 13 సబార్డినేట్ కోర్టులు, 2 అదనపు సబార్డినేట్ కోర్టులు, 7 ప్రాథమిక క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 18 జిల్లా సివిల్ , క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 3 జిల్లా సివిల్ కోర్టులు, 1 క్రిమినల్ జస్టిస్ ఆర్బిట్రేషన్ కోర్టు, 7 వాణిజ్య కోర్టులు, 9 ప్రత్యేక కోర్టులు, 2 కుటుంబ సంక్షేమ కోర్టులతో సహా 73 కొత్త కోర్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. న్యాయమూర్తుల కోసం కొత్త కోర్టు భవనాల నిర్మాణం నివాస భవనాలు, పాత కోర్టు భవనాల పునరుద్ధరణ, మద్రాసు హైకోర్టు, మధురై ధర్మాసనంలో కంప్యూటర్ సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. వివిధ స్థాయిలో జిల్లా, కింది కోర్టులలో ఉద్యోగాలను సృష్టించామని, ఖాళీలను భర్తీ చేశామని, న్యాయ కళాశాలల ఏర్పాటు విస్తృతం చేశామన్నారు. ఇలా.. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పన, మెరుగుపరచడంలో తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్న దృష్ట్యా, మరోసారి గుర్తుచేయాల్సి బాధ్యతతో చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఈ శాఖ ఏర్పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజ్యాంగం న్యాయవాదుల చేతుల్లో ఉంది.. దీనిని ఒక పత్రంగా పరిగణించ వద్దు.. ఇది మన జీవితం ప్రయాణం.. మన జీవన నాణ్యతను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఒక వాహనం, ఇది ఎల్లప్పుడూ ఈ భూమికి ఆత్మ... అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రకటనగా ఉటంకిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ముందుగా పలువురు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులకు పురస్కారాలను ప్రదానం చేశారు. బార్ అసోసియేషన్ ఘనతను చాటే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: భారత సుప్రీంకోర్టు రాజ్యాంగం ఆమోదించబడి 75 వసంతాలు కావడంతో శనివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో వార్షికోత్సవం జరిగింది. అలాగే చైన్నె బార్ అసోసియేషన్ 160వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ మహాదేవన్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ శ్రీరామ్, న్యాయశాఖ మంత్రి రఘుపతి, హిందూ మత ధార్మిక ధార్మిక శాఖ మంత్రి శేఖర్ బాబు, ఎంపీలు ఎన్.ఆర్. ఇళంగో, విల్సన్, గిరిరాజన్, అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్, చైన్నె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి తిరువెంగడమ్, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఇందులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ ముందుగా తాను ఒక విషయం చెప్ప దలచుకున్నట్టు పేర్కొంటూ, ఓ న్యాయమూర్తి తమిళంలో ఇక్కడ ప్రసంగిస్తారనుకుంటే, ఆంగ్లంలో మాట్లాడారని గుర్తు చేశారు. అదే మరో న్యాయమూర్తి ఆంగ్లంలో మాట్లాడుతారనుకుంటే తమిళంలో మాట్లాడేశారని పేర్కొంటూ, ఇదే ద్విభాషా విధానం అని వ్యాఖ్యానించారు. ఇది తమిళనాడుకు కష్టమైన పరిస్థితి కాదని, చాలా మంచి పరిస్థితి అని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్, తమిళనాడు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లిన ఆర్. మహాదేవన్, కె.వి. విశ్వనాథన్, ఎం.ఎం. సుందరేష్ అందించిన సేవలను కొనియాడారు. మద్రాసు హైకోర్టు చరిత్రను గుర్తు చేస్తూ బార్ అసోసియేషన్ 160 వసంతాల ప్రయాణాన్ని వివరించారు. సమాజంలోని అన్యాయం అనే వ్యాధిని నయం చేసేది న్యాయవాదులే అని, సామాజిక న్యాయం, వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ప్రాథమిక సంస్థగా కూడా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ వ్యాఖ్య చైన్నెలో సుప్రీం కోర్టు శాఖకు వినతిచట్టం ఓ చీకటి గది. చట్టం ఒక చీకటి గది... అందులో న్యాయవాది వాద న ఒక దీపం.. అని మహా పండితుడు అన్న వ్యాఖ్య లను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో న్యాయవాదులు న్యాయమూర్తుల సహకారాన్ని అభినందిస్తున్నామన్నారు. మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు మొదలెట్టిన న్యాయవాదులు ఎందరో తమ వాదన నైపుణ్యాలతో జాతీయస్థాయికి ఎదిగి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి మన న్యాయమూర్తులు అనేక జ్ఞానోదయమైన తీర్పులు ఇచ్చారని, అందించారని వివరించారు. ఇందులో మద్రాస హైకోర్టు బార అసోసియేషన్ సహకారం కూడా గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి ఒక సాధనం అని పేర్కొంటూ ప్రభుత్వ స్వేచ్ఛ, జీవిత సూత్రం, సమానత్వం, సోదరభావం గుర్తింపునకు ఒక పద్ధతి అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చేసిన వ్యాఖ్య లు గుర్తుచేశారు. రాజ్యాంగపరంగా, భారతదేశం ఒక ప్రజాస్వామ్య – సోషలిస్ట్ –లౌకిక – సార్వభౌమ గణ తంత్రం అని, భారత రాజ్యాంగ ప్రవేశికలో చెప్పినట్లుగా న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని వివరించారు. రాజ్యాంగం ప్రభుత్వ నిర్మాణం, విధానాలను నిర్వచిస్తున్నారు. అధికారాలకు మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం, ప్రాథమిక హక్కులు, ప్రధాన సూత్రాలు, దేశం, పౌరుల విధులను కూడా నిర్వచిస్తుందన్నారు. భారతదేశంలో విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులు, విధానాలు రా జ్యాంగంలో సజీవంగా ఉంటుందన్నారు. రాజ్యాంగంపై జరిగే ఏ దాడికై నా వ్యతిరేకంగా స్వతంత్ర న్యాయవ్యవస్థ, అద్భుతమైన న్యాయమూర్తులు, దృఢమైన స్తంభాలుగా నిలుస్తున్నారన్నారు. రాజ్యాంగానికి న్యాయవాదుల సహకారం గురించి ప్రస్తావిస్తూ, ఆర్థికం, విద్య వంటి అనేక విషయాలను వివరించారు. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని నిర్ధారించడంలో, న్యాయవ్యవస్థ రాష్ట్రాల హక్కులను కాపాడుతూనే ఉందన్నారు. -
ఒత్తిడి లేకుండా పనిచేయాలి
వేలూరు: రేషన్ దుకాణ కార్మికులు పని ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే విధంగా చూడాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్లో కో–ఆపరేటివ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ రేషన్ దుకాణంలో పనిచేసే సేల్స్మన్లు, కార్మికులకు ఆదివారం ఒక్కరోజు శిక్షణ తరగతులు కోఆపరేటివ్ సంఘాల అసిస్టెంట్ డైరెక్టర్ తిరుగుణ అయ్యప్పదురై అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణకు కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణంలో పనిచేసే కార్మికులకు తరచూ ప్రజలతో ఉండడం వల్ల పలు పని ఒత్తిడి ఉండవచ్చునని అన్నారు. అయినప్పటికీ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు పని ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. హోమియోపతి డాక్టర్ అరుణ్ విక్రయ దారులకు పని ఒత్తిడి నుంచి తమను ఏ విధంగా కాపాడుకోవాలనే వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం రేషన్ దుకాణాల్లో విశిష్ట సేవలు అందజేసిన సేల్స్మన్లకు, విక్రయ దారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కో–ఆపరేటివ్ విభాగం మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణన్, జిల్లాలోని సేల్స్మన్లు, విక్రయదారులు పాల్గొన్నారు. -
థర్మల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
● విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత ● ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలు సేలం: తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మంటలు అదుపుచేయడానికి వెళ్లిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయాలపాలయ్యారు. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో 12 గంటలకుపైగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి మూడు జిల్లాల నుండి 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయి. తూత్తుకుడిలో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ పనిచేస్తోంది. ఇక్కడ 5 యూనిట్ల ద్వారా 1,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరిస్థితిలో, థర్మల్ పవర్ ప్లాంట్ అన్ని భాగాలను అనుసంధానించే వైర్లు వెళ్లే థర్మల్ పవర్ ప్లాంట్ శీతలీకరణ ప్రాంతానికి సమీపంలో, కేబుల్ గ్యాలరీ అని పిలువబడే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు నెమ్మదిగా అన్ని విభాగాలకు వ్యాపించాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల నుంచి 20కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. గాయపడ్డ ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కప్పబడి ఉండడం వల్ల మంటలను ఆర్పడం కష్టమవుతోంది. పొగలో చిక్కుకున్న తర్వాత ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా, థర్మల్ పవర్ ప్లాంట్లోని 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీని కారణంగా 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రభావితమైంది. ఆధునిక పరికరాలు లేకపోవడం వల్ల అగ్నిమాపక చర్యలకు ఆటంకం కలిగింది. థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.కోట్ల విలువైన కేబుల్ వైర్లు, పరికరాలు, సామగ్రి దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆదివారం రాత్రి వరకు నిప్పును ఆర్పే పనుల్లో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. 18 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మూడు యూనిట్లలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కష్టతరంగా మారిందని థర్మల్ విద్యుత్ కేంద్ర వర్గాలు వెల్లడించాయి, -
అత్తిమాంజేరిపేటలో బిరియానీ పంపిణీ
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపం అత్తిమాంజేరిపేటలో సీఎం స్టాలిన్ 72వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం డీఎంకే ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకున్నారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎంకే నేత విభాగం ఉప కార్యదర్శి రామచంద్రన్ అధ్యక్షతన చేపట్టిన వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 500 మందికి బిరియానీ పంపిణీ చేశారు. ఇందులో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బిరియానీ పోటాపోటీ పడ్డారు. డీఎంకే జిల్లా వర్తక విభాగం ఉప కార్యదర్శి కదిరవన్, మండల నాయకులు అన్బళగన్, గురునాథన్, జయవేలు, రాజేంద్రనాయుడు, రామస్వామి, శేఖర్ పాల్గొన్నారు. -
తిరుచెందూర్ ఆలయంలో భక్తుడి మృతి
సేలం: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూలో నిలిచి ఉన్న భక్తుడు అకస్మాత్తుగా శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడి మృతిచెందాడు. కారైకుడికి చెందిన ఓంకుమార్ (50) అనే భక్తుడు ఆదివారం ఆలయంలో రూ.100ల క్యూలో దర్శనం కోసం నిలిచి ఉన్నాడు. ఆదివారం సేలవు రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా ఓంకుమార్కు శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆలయ సిబ్బంది అతడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఓంకుమార్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. -
పుస్తకాలు పఠిస్తే జీవితం గాడినపడినట్టే!
తిరువళ్లూరు: పుస్తక పఠనం పెరిగితే జీవితం గాడినపడినట్టేనని సినీనిర్మాత మారిసెల్వరాజ్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి సినీనిర్మాత మారిసెల్వరాజ్, సినీగాయని సెంథిల్గణేష్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. మొదట సెంథిల్ గణేష్, రాజ్యలక్ష్మి బృందం నిర్వహించిన కచ్చేరి అందరినీ ఆకట్టుకుంది. పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, గ్రామీణ కళలు, సంప్రదాయాలపై పాడిన ప్రత్యేక పాటలు అలరించాయి. అనంతరం మారి సెల్వరాజ్ మాట్లాడుతూ పుస్తక అభ్యసనం ప్రతి జీవితంలోనూ మార్పులు తెస్తుందన్నారు. పుస్తక పఠనాన్ని ప్రాథమిక దశ నుంచే అలవరుచుకోవాలన్న ఆయన, యువత విద్యార్థులు పుస్తకాలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకాలను చదవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడంతో పాటు చెడు అలవాట్లకు సైతం దూరంగా వుండొచ్చన్నారు. విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సీనియర్ నటి బిందు ఘోష్ కన్నుమూత
తమిళసినిమా: సీనియర్ హాస్య నటి బిందు ఘోష్ ఇక లేరు. ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని స్వగృహంలో కన్నుమూశారు . ఈమె వయసు 76 ఏళ్లు. ఈమె అసలు పేరు విమల. 1981లో గ్రూప్ డాన్సర్గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె నృత్య దర్శకుడు కన్నప్పన్ వద్ద డాన్సర్గా పనిచేశారు. అలా కలతూర్ కన్నమ్మ చిత్రంలో నటుడు కమలహాసన్తో కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత కోళి కూవుదు చిత్రం ద్వారా నటిగా మారిన బిందు ఘోష్ పలురకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కమల్ హాసన్ రజనీకాంత్ ప్రభు, విజయ్ కాంత్ కార్తీక్ తదితర ప్రముఖ నటుల చిత్రాల్లో నటించారు. తెలుగులో దొంగ కాపురం, పెళ్లి చేసి చూడు, కృష్ణ గారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం తదితర చిత్రాల్లో నటించారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. కాగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తున్న బిందు గోష్ వృద్ధాప్యంలో పలు రకాల సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బు లేక అవస్థలు పడ్డారు. కాగా చైన్నెలోని విరుగంబాక్కంలో నివశిస్తున్న సింధు ఘోష్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బిందు ఘోష్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమార్తెలు తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ
సాక్షి, చైన్నె: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ నేతృత్వంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చైన్నెలో ఆదివారం ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ డాక్టర్ శైలేంద్ర బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఏ అరుణ్, ఆదేశాలతో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్బ్రాంచ్ , శ్రీ రామచంద్ర ఉన్నత విద్య సంస్థ, సైబర్ క్రైమ్ యూనిట్, పరిశోధనా సంస్థతో పాటూ కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాలు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, వివాహాల పేరిట ఆన్లైన్ మోసాలు, ఆనన్లైన్ పార్ట్–టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులను చేత బట్టి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెసెంట్నగర్లోని ఎలియట్స్ బీచ్ పోలీస్ సహాయ కేంద్రం నుంచి పలు ప్రాంతాల గుండా ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ శైలేంద్ర బాబు, విద్యార్థులతో కలిసి రంగురంగుల బెలూన్లను ఎగుర వేశారు. ఈ ర్యాలీలో సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930ని ప్రదర్శించారు. సైబర్ నేరాల అవగాహన గురించి మరింత సమాచారంలో రాణించిన శ్రీరామచంద్ర ఉన్నత విద్య, పరిశోధనా సంస్థకు చెందిన 10 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదనపు కమిషనర్ ఎ. రాధిక, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (సౌత్) బండి గంగాధర్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్లు, ఎస్. ఆరోగ్య, వి.వి. గీతాంజలి. జి. వనిత, పోలీస్ అధికారు లు, ప్రజలు పాల్గొన్నారు. సైబర్ నేరాల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం, తక్షణ సహాయం కోసం 1930ను సంప్రదించడం, సైబ ర్ నేరాలను నిరోధించడం, నివారణ, వేగవంతమైన చర్యను నిర్ధారించడం, ఫిర్యాదులు చేయాల్సిన www.cybercrime.gov.in వెబ్ సైట్ గురించి ఈ ర్యాలీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. -
తిరుత్తణిలో సాధారణ రద్దీ
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటుంటారు. శుభముహూర్తం రోజులు, పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో మూడు నుంచి ఐదు గంటల పాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకోవాల్సి వుండేది. అయితే వేసవి ఎండలతో పాటు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న క్రమంలో భక్తులు రాక తగ్గింది. కొండ ఆలయంలో ఆదివారం సెలవు రోజున కూడా రద్దీ తక్కువగా వుంది. దీంతో ఉచిత దర్శనం క్యూలు ఖాళీగా కనిపించాయి. గంట వ్యవధిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడంతో ఆనందం చెందారు. భక్తుల సౌకర్యార్థం ఎండల నేపథ్యంలో మాడ వీధిలో మ్యాట్ ఏర్పాటు చేసి మంచినీటిని చల్లి చల్లగా వుంచారు. మాడ వీధిలో నడిచి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురికాకుండా స్వామి దర్శనానికి వెళ్లేలా ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు. రచయిత నారుంపూనాథన్ మృతి సేలం: ప్రముఖ రచయిత నారుంపూనాథన్ ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మృతిచెందారు. తూత్తుకుడి జిల్లా కళుగుమలైకు చెందిన ప్రముఖ రచయిత నారుంపూనాథన్ (64). ఈయన బ్యాంకులో పని చేశారు. ఈయనకు భార్య శివగామ సుందరి, ఒక కుమారుడు ఉన్నారు. శివగామ సుందరి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దీపక్ విదేశాల్లో ఉంటున్నారు. నెల్లై చంద్రనగర్లో నివసిస్తున్న నారుంపూనాథన్ కలైంజర్ సంఘం నిర్వాహకునిగా కూడా పనిచేశారు. ఈ స్థితిలో నారుంపూనాథన్ ఆదివారం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడింది. వెంటనే ఆయన్ను నెల్లై వన్నారపేటలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే నారుంపూనాథన్ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చంద్రనాగర్లో ఉన్న ఇంట్లో ఉంచారు. ఆయన భాతికకాయానికి రచయితలు పలువురు అంజలి ఘటించారు. పలు గ్రంథాలు, పుస్తకాలను రచించిన నారుంపూనాథన్ తమిళ సాహిత్యం, తమిళ భాషాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఈయనకు రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఉ.వె.స్ అవార్డును అందజేసింది. కాగా నారుంపూనాథన్ మృతికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, పలువురు రచయితలు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మృతి తిరువొత్తియూరు: తేనె కోసం కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్షాక్కు గురై ఓ ఎలుగుబంటి మృతిచెందింది. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని నాన్సాచ్ ప్రాంతంలో తేయాకు తోట ఉంది. ఈ తోటలోని విద్యుత్ స్తంభంపై తేనెతుట్టె ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ఎలుగుబంటి పిల్లలతో టీ తోటలోకి వచ్చింది. తేనెతుట్టె ఉన్న విద్యుత్స్తంభాన్ని ఎలుగుబంటి ఎక్కుంది. అప్పుడు హఠాత్తుగా ఎలుగుబంటి కరెంట్షాక్కు గురై కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలిసి స్థానికులు కున్నూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఎలుగుబంటి కళేబరాన్ని పరిశీలించారు అనంతరం పశువైద్యుడిని పిలిపించి ఎలుగుబంటికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బైక్ అదుపుతప్పి కార్మికుడు దుర్మరణం తిరువళ్లూరు: నిత్యావసర వస్తువులు కొనడానికి వెళ్లిన ఒడిశా కార్మికుడు బైక్ అదుపుతప్పి కిందపడడంతో దుర్మరణం చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిబాడాకు(33). ఇతను భార్య ఫాతిమాడాకు(28)తో కలిసి ఇటీవల వలస వచ్చారు. ఇద్దరు కలిసి తిరువళ్లూరు జిల్లా విశ్వనాథపురంలో నివాసం వుంటూ స్థానికంగా వున్న ఫేనా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి విశ్వనాథపురం నుంచి మప్పేడుకు ద్విచక్ర వాహనంలో వెళ్లిన సీబాడాకు అక్కడ నిత్యావసర వస్తువులను కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాడు. మప్పేడు సమీపంలో వెళుతుండగా ఎదురుగా పశువులు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. గాయపడ్డ ఇతన్ని 108 వాహనంలో తరలిస్తుండగా మృతిచెందాడు. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
–బావిలో తోసి హత్య – యువకుడి అరెస్టు సేలం: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్స్టేషన్న్కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది. దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పన్నులు వంద శాతం వసూలు చేయాలి
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి, తాగునీరు, ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయాలని కలెక్టర్ ప్రతాప్ సిబ్బందిని ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పన్నులు వసూలు చేయడానికి శని, ఆదివారం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. రెండవ రోజైన ఆదివారం పేరంబాక్కంలో జరిగిన శిబిరాన్ని కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పన్నులను వందశాతం వసూలు చేయాలన్నారు. అక్రమాలను నిరోధించడానికి డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు కూడా వ్యాఖ్యానించారు. పన్నుల చెల్లింపుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కోలాహలం.. ఆణికులతమ్మ రథోత్సవం
వేలూరు: వేలూరు వేలపాడిలోని గ్రామ దేవతైన శ్రీ ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం ఆదివారం ఉదయం కోలాహలంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు అములు, డాక్టర్ అయ్యప్పన్, వేణు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని రఽథంలో ఆశీనులు చేసి దీపారాధన పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణాల మధ్య రథాన్ని లాగారు. ఈ రథం వేలపాడిలోని పలు వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రతి ఇంటి ముందు మహిళలు బొరుగులు, ఉప్పు, మిర్యాలు, పూలు చల్లడంతో పాటు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతలు, పారిశ్రామిక వేత్తలు వీధుల్లో మజ్జిగ, తాగునీటిని సరఫరా చేయడంతో పాటు భక్తులకు అన్నదానం చేశారు. ఈ రథోత్సవం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నధికి చేరుకుంది. -
మూగజీవుల లెక్కింపు పనులు షురూ
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లాలో వ్యవసాయం, పశు పోషణ ప్రజల ప్రధాన జీవనాధారంగా వుంది. జిల్లాలోని తిరువళ్లూరు, తిరుత్తణి, పొన్నేరి, అంబత్తూరు డివిజన్లలో 21వ మూగజీవుల లెక్కింపు గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. మూగజీవుల లెక్కింపు పనుల్లో 45 మంది అధికారుల సమక్షంలో 210 మంది మూగజీవుల లెక్కింపు పనులు చేపట్టారు. జిల్లాలో 6, 47,838 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు చేపట్టారు. మిగిలిన 1,01,905 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో మూగజీవుల లెక్కింపు పనుల్లో సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ నవనీతకృష్ణన్ జిల్లాలో మూగజీవుల లెక్కింపు పనులను ఆదివారం తనిఖీ చేశారుపశుసంవర్థక శాఖ మండల అదనపు డైరెక్టర్ జయంతి, ఉప డైరెక్టర్ శీనివేలన్, సహాయ డైరెక్టర్లు దామోదరన్, అనిత, పశుసంవర్థక శాఖ వైద్యులు, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. -
స్పీకర్ అప్పావుతో సెంగోట్టయన్ భేటీ
● అన్నాడీఎంకేను దూరం పెట్టేలా చర్యలు ● పన్నీరుకు చిరునవ్వుతో పలకరింపు సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత సెంగోట్టయన్ స్పీకర్ అప్పావును అసెంబ్లీ ఛాంబర్లో కలవడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు దూరంగా ఆయన చర్యలు ఉండటమే కాకుండా అసెంబ్లీ లాబీలో మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరునవ్వుతో పలకరించి ముందుకెళ్లారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత సెంగోట్టయన్ ఇటీవల పెదవి విప్పడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత సమరంమళ్లీముదిరినట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, తాను అన్నాడీఎంకేలోనే ఉన్నట్టు సెంగోట్టయన్ చెప్పుకుంటూ వచ్చినా పళణి స్వామిని నేరుగా కలిసిన సందర్భం లేదు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన చర్చలు మరింత చర్చకు తెరలేపాయి. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన అన్నాడీఎంకే సభ్యులందరికి దూరంగా ఉన్నారు. రెండవ రోజు శనివారం సభకు రాగానే స్పీకర్ అప్పావు ఛాంబర్కు వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. ఈ సమయంలో తనకు లాబీలో ఎదురు పడ్డ మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరు నవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు. సాధారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సభ్యులు సభకు 4వ నెంబర్ ప్రవేశ మార్గం నుంచి లోపలకు రావడం జరుగుతుంది. అయితే, సెంగ్టోటయన్ ఆ పార్టీ సభ్యులకు దూరంగా ఉండటమేకాకుండా, వారు వెళ్లిన మార్గంలో కూడా లోనికి వెళ్ల లేదు. పదవ నెంబరు గేట్ మార్గం గుండా అసెంబ్లీలోకి వెళ్లారు. అన్నాడీఎంకే సభ్యుల ఛాంబర్ వైపుగా కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లి పోయారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకేలో మరింత చర్చకు తెరలేపాయి. సెంగోట్టయన్ చర్యల గురించి పళణి స్వామిని మీడియా ప్రశ్నించగా, ఆయన్ని అడగాల్సిన ప్రశ్న తనను అడిగితే ఎలా? అని ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగ వద్దు అని వారించారు. వ్యక్తిగత సమస్య గురించి మాట్లాడే వేదిక ఇక్కడ కాదని సూచించారు. తాము 62 మంది సభ్యులం అని, అందరూ ఇక్కడ ఉన్నారా? అంటే, కొందరు రాలేక పోయి ఉండ వచ్చు..!, వారికి ఏదైనా పని ఉండవచ్చు...! అంటూ దాట వేయడం గమనార్హం. -
అన్నదాతపై.. వరాల జల్లు
వ్యవసాయ బడ్జెట్లో ముఖ్యాంశాలు ..కష్టించే అన్నదాతకు ఆసరగా ఉండేందుకు.. ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్లో ప్రత్యేక కసరత్తు చేసింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందించే పంటల బీమాకు భారీగా నిధులు కేటాయించింది. మొత్తం మీద దుక్కి దున్ని..నాట్లు వేసి పొలంలో చెమటోడ్చి పంటల సాగుబడితో అందరికీ అన్నం పెట్టే అన్నదాత సంక్షేమాన్ని కాంక్షించే విధంగా వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం శనివారం వ్యవసాయ పద్దును అసెంబ్లీలో దాఖలు చేశారు. పాత పథకాలకు 2025–26 సంవత్సరానికి గాను వివిధ ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా రూ. 45,661 కోట్ల నిధులను కేటాయించారు. సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజున ఆర్థిక బడ్జెట్ను ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేశారు. రెండవ రోజున శనివారం వ్యవసాయ బడ్జెట్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ బడ్జెట్ రూపకల్పనలతో తనకు మద్దతుగా నిలిచిన అధికారులతో కలిసి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం తొలుత మెరీనా తీరంలోని అన్నా, కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుని సీఎం స్టాలిన్కు పేపర్ రహితంగా రూపకల్పన చేసిన బడ్జెట్ను ట్యాబ్ను అందజేశారు. అనంతరం సీఎం స్టాలిన్తో కలిసి అసెంబ్లీలో ఎంఆర్కే పన్నీరుసెల్వం అడుగు పెట్టారు. స్పీకర్ అప్పావు సభభలో రైతు బడ్జెట్ దాఖలకు అవకాశం కల్పించారు. దీంతో ఎంఆర్కే పన్నీరు సెల్వం బడ్జెట్ పద్దును వివరిస్తూ ప్రసంగించారు. సభకు వచ్చిన డీఎంకే సభ్యులు అందరూ తామంతా రైతులమే అని చాటే విధంగా రైతు ధరించే తువ్వాలను కండువగా రూపంలో ధరించి సభభలో కూర్చున్నారు. అయితే, సీఎం స్టాలిన్, సీనియర్ మంత్రి దురై మురుగన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధిలు మాత్రం సాధారణంగానే కూర్చున్నారు. రైతుల కీర్తి ప్రతిష్టలతో.. దేశానికి వెన్నెముకగా నిలిచి అందరికీ అన్నం పెట్టే అన్నదాత కీర్తి ప్రతిష్టల గురించి తమిళ మహాకవి తిరువళ్లువర్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని ఎంఆర్కే పన్నీరు సెల్వం అందుకున్నారు. రైతుల జీవన పరిస్థితుల మెరుగు , వ్యవసాయ రంగంలో ఆధునికతను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. 2021 నుంచి నాలుగు సార్లు వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేశానని, ఇది ఐదోసారి బడ్జెట్ అంటూ, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానం, చేసిన ప్రకటనల మేరకు ప్రాజెక్టులు అద్భుతమైన రీతిలో అమలు చేశామని వివరించారు. ప్రస్తుతానికి వ్యవసాయం ఒక శాస్త్రం, సాంకేతికత అని పేర్కొంటూ, ఇందుకు మద్దతు ఇవ్వడం, అభివృద్ధి పరచడం గురించి వివరించారు. డిజిటల్ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తూ కృత్రిమ మేధస్సు– వెబ్సైట్ సెన్సార్ టెక్నాలజీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)తో రైతు శాసీ్త్రయ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నట్టు విశదీకరించారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, ఆధునీకత, వివిధ రకాల పంటల పై ప్రత్యేక దృష్టి వంటి అంశాలపై గత నాలుగేళ్లుగా తాము సాధించిన ఘనతను గుర్తుచేశారు. వ్యవసాయ యంత్రాల వినియోగం, విత్తనాలు, పంట కోత, గిడ్డంగులు, కొనుగోళ్లు వంటి అంశాలతో పాటుగా ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, వెచ్చించిన విధానం గురించి వివరించారు. శ్రీభవిష్యత్తు యువత చేతుల్లో ఉందని పేర్కొంటూ, యువతలో వ్యవసాయంపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యచరణను విస్తృతం చేశామన్నారు.10,187 గ్రామాలలో యువత , రైతు సహకారంతో సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆది ద్రావిడ, గిరిజన , చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం, సమీకృత వ్యవసాయం, గ్రీన్ హౌస్లు వంటి ప్రాజెక్టుల ద్వారా ఉపయోగకర అంశాలను ప్రస్తావించారు. వరి ఉత్పత్తి పెంపు, దిగుబడి పెంపు, చెరకు రైతుకు తోడ్పాటు, మద్దతు ధర గురించి గుర్తు చేస్తూ, రైతులకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా బడ్జెట్లో నిధులను కేటాయించామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎదురైన నష్టాలు, కష్టాలను గుర్తుచేస్తూ, నష్టాన్ని భర్తీ చేయడానికి 1,631 కోట్ల 53 లక్షల రూపాయలు నిధులు గత నాలుగు సంవత్సరాలలో కేటాయించామని, తద్వారా పంటల భీమా పరిహారం రూ. 5,242 కోట్లు రైతులకు దరి చేరిందన్నారు. చైన్నె ఆర్కే సాలైలలో కలైంజ్ఞర్ శత జయంతి స్మారకంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాండ ఉద్యాన వనం గురించి గుర్తుచేస్తూ, ఇది అన్నదాత ప్రయోజనార్థం పూర్తి స్థాయిలోరూ.45,661 కోట్లతో తీర్చిదిద్దిన బడ్జెట్ అని ప్రకటించారు. 1.40 గంటల సేపు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగేళ్లలో 1.86 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లను అందచేశామని ప్రకటించారు. రూ.1427 కోట్ల రుణాలను రద్దు చేశామని గుర్తు చేశారు. కేంద్రాలలో వ్యవసాయ వర్తకం నిర్వహణకు ఏర్పాట్లు. నియంత్రిత మార్కెట్లలో రైతులు, తయారీ సంస్థలకు ఉత్పాదక రుణాలు. రూ.10 లక్షల వరకు అందించేందుకు నిర్ణయం. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్త ఆవిష్కరణకు హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధన నిఽధి కోసం రూ. కోటి కేటాయింపు. రైతు కూలీలు ప్రమాద వశాత్తు మరణిస్తే ఇచ్చే రూ. లక్ష పరిహారాన్ని రూ. 2 లక్షలకు పెంపు. గాయాల పాలయ్యే వారికి రూ. లక్ష వరకు పంపిణీ. వ్యవసాయంలో అధిక ఉత్పత్తికి , సాంకేతిక పనితీరుకు గాను మొదటి ముగ్గురు రైతులకు నగదు బహుమతి. మొదటి బహుమతి రూ. 2 లక్షల 50 వేలు. అలాగే, వివిధ 33 రకాల బహుమతులు ప్రదానం లక్ష్యగా రూ. 55 లక్షలు కేటాయించారు. ఉత్తమ సేంద్రీయ రైతుకు నమ్మాళ్వార్ అవార్డు. విదేశీ పరిజ్ఞానంపై అవగాహనకు వంద మంది రైతులకు విదేశీ పర్యటనకు అవకాశం. సభలో వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేసిన మంత్రి పన్నీర్ సెల్వం రైతు తరహాలో పచ్చ తువాలతో సభకు డీఎంకే సభ్యులు రూ. 45,661 కోట్ల నిధుల కేటాయింపు డెల్టా యేతర జిల్లాలలో సాగుకు ప్రత్యేక దృష్టి పాడి ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంపునకు కార్యాచరణ మహిళా జాలర్లకు శిక్షణ విదేశీ పరిజ్ఞానంపై అధ్యయనానికి టూర్ ఇంటి పంటకు తోడ్పాటు రైతులకు వ్యవసాయ సలహాలు ఇవ్వడం లక్ష్యంగా గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ హోల్డర్లు ద్వారా 1000 సేవా కేంద్రాల ఏర్పాటుకు రూ. 42 కోట్లు కేటాయింపు. వరి ఉత్పత్తి పెంపునకు రూ. 160 కోట్లు. ఇందులో 102 కోట్లు ప్రపథమంగా డెల్టా యేతర జిల్లాలో 34 లక్షల ఎకరాలలో , మరో రూ. 58 కోట్లతో డెల్టాలో 18 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తికి నిర్ణయం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎదురయ్యే కష్టాల నుంచి రైతుకు జీవనోపాధినికల్పించే విధంగా పంట భీమాగా రూ. 841 కోట్లు కేటాయింపు. 2024–25 సీజన్లో 1 లక్ష 30 వేలు చెరకు రైతులకు ఒక టన్నుకు గాను రూ. 349 ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు వీలుగా రూ. 297కోట్లు కేటాయింపు. 3 లక్షల ఎకరాల వర్షాధార భూములలో ముందుగానే దుక్కి దున్నడానికి సబ్సిడీగా రూ. 24 కోట్లు. సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు ను 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అమలు చేయడానికి రూ. రూ. 1,168 కోట్ల కేటాయింపు. తమిళనాడులో తొలిసారిగా జీడిపప్పు ఉత్పత్తుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు రూ. 10 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో ప్రపథమంగా 20 రైతు బజార్ల ద్వారా ఆన్లైన్ డోర్ డెలివరి లక్ష్యంగా స్థానిక ఇంటర్నెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు. వ్యవసాయ ఉత్పత్తులకు నల్లూరు వరగు (కుడలూర్), వేదారణ్యం ముల్లై (నాగపట్టణం), నత్తం చింతపండు (దిండిగల్), ఆయకుడి జామ (దిండిగల్), కల్పట్టి చెరకు మునగ(దిండిగల్)లకు భౌగోళిక గుర్తింపునకు చర్యలు. 17,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రంగం యాంత్రీకరణ ప్రాజెక్టుకు రూ. 215 కోట్ల 80 లక్షలు కేటాయింపు. అటవీ గ్రామాలలోని 63 వేల గిరిజన రైతుల కోసం రూ. 22.80 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టు అమలు. రూ. 142 కోట్లతో ముఖ్యమంత్రి భూ సంరక్షణ పథకంలో 15 ప్రాజెక్టు అను అదనంగా చేర్చి అమలు చేయడానికి నిర్ణయం. గ్రామ పంచాయతీలలో 2,338 మంది రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రూ. 269 కోట్ల 50 లక్షలతో ప్రత్యేక కార్యాచరణ. కలైంజర్ ఆల్ విలేజ్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ ప్రణాళిక అమలు. వ్యవసాయ ఉత్పత్తులకు 100 శాతం విలువతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి మొదటి దశలో రూ. 50 కోట్లు కేటాయింపు. ఒక్కొ యూనిట్కు గరిష్టంగా రూ. 1.50 కోట్లు రాయితీ ఇవ్వనున్నారు. రూ. 50 కోట్ల 79 లక్షల అంచనా వ్యయంలో 11 చోట్ల వ్యవసాయ ఉత్పత్తి విక్రయ కేంద్రాలలో మౌలిక సదుపాయాల మెరుగుకు చర్యలు. మొక్కజొన్న రైతులకు ఎక్కువ ఆదాయం లభించే విధంగా 1,87,000 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో మొక్కజొన్న ఉత్పత్తి అభివృద్ధి ప్రాజెక్టుకు నిర్ణయం. వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెలు విత్తనాలు పండించే 90 వేల మంది రైతుల కోసం రూ.108 కోట్లు 6 లక్షలతో నూనె విత్తనాల ఇయక్కం ఏర్పాటు.. తమిళనాడు చిరు ధాన్యాల ఇయక్కం అమలుకు రూ.52 కోట్లు 44 లక్షల కేటాయింపు. సేంద్రీయ వ్యవసాయం వికేంద్రీకరణకు రూ.12 కోట్లు కేటాయించారు. పాఠశాల , కళాశాల విద్యార్థుల కోసం వ్యవసాయ పర్యటనలు అవగాహన శిబిరాలకు ప్రోత్సాహకాలు, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు. ఆది ద్రావిడ, గిరిజన చిన్న సన్నకారు రైతులకు అదనపు సబ్సిడీ కోసం రూ. 21 కోట్లు కేటాయింపు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలను ప్రోత్సహించండి రూ. 12 కోట్ల 50 లక్షల కేటాయింపుతో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక పథకం అమలుకు నిర్ణయం. ఆరోగ్యకరమైన పంటల లక్ష్యంగా నాణ్యమైన విత్తనం ఉత్పత్తికి రూ. 250 కోట్లు కేటాయింపు రూ. 12 కోట్ల 21 లక్షలతో పత్తి ఉత్పత్తి విస్తరణ ప్రణాళిక. ‘తమిళనాడు ఆగ్రోఫారెస్ట్రీ పాలసీ’ ఆవిష్కరణ – చెట్లను పెంచడం, వాటిని నమోదు, అమ్మకం వంటి అన్ని విధానాలను సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు .గ్రీన్ తమిళనాడు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ. రూ. 125 కోట్లతో పోషక వ్యవసాయ మిషన్. ఇంటి తోట కోసం – కూరగాయల విత్తనాలు ,25 లక్షల పండ్ల మొక్కలు. పప్పుధాన్యాలు , ప్యాకేజీ డెలివరీ నిర్ణయం. 4,000 మొబైల్ పండ్లు కూరగాయల దుకాణాలకు సబ్సిడీ. ఇంటిగ్రేటెడ్ కొబ్బరి అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.35.26 కోట్లు కేటాయింపు. రూ. 10. 50 కోట్లతో 130 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాల ఏర్పాటు. కావేరి, వెన్నారు, వెల్లారు నదీ పరివాహక ప్రాంతాలు, కల్లనైలోని సీ, డీ, ఈ కాలువల పూడికతీతకు నిర్ణయం. మొత్తం 2,925 కి.మీ దూరం పూడికతీతకు రూ.13.80 కోట్ల కేటాయింపు. ముఖ్యమంత్రి సౌర పంపు సెట్ల పథకానకి రూ. 24 కోట్లు కేటాయింపు. 1000 మంది రైతులకు పంపు సెట్లను అందించేందుకు నిర్ణయం. వరి, మొక్కజొన్న, అరటి, వేరుశనగ, మినుములు తదితర పంటలకు 1500 ఎకరాలలో విత్తడం నుంచి పంట కోత వరకు సాగులో యాంత్రీకరణ కు రూ. 3 కోట్లుతో (డెమోన్ స్టేషన్ ప్లాట్స్)కు ప్రణాళిక. రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 9 గిడ్డంగులు, అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. 56 నియంత్రిత అవుట్ లెట్లను రూ.39. 20 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్ నేషనల్ వ్యవసాయ మార్కెట్తో కొత్తగా విలీనం చేయనున్నారు. తద్వారా రైతులు జాతీయ స్థాయిలో వర్తకం చేసుకునేందుకు వీలు కల్పించారు. అదనపు ఆదాయం కల్పనకు జాతీయ స్థాయి వర్తకం అమలు. రూ. 8 కోట్ల విలువైన 50 రైతు బజార్లు అదనపు సౌకర్యాల కల్పన. ప్రాంతం వారీగా ఎంపిక చేయబడిన వ్యవసాయ ఉత్పుత్తుల సేకరణ పశువుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో సహా వ్యవసాయ కార్యకలాపాలకు రైతుల మద్దతు స్వల్పకాలిక రుణ అవసరాల కోసం రూ. 3 వేల కోట్ల మూలధన వ్యయం. పంట రుణాల మాఫీకి రూ.1,477 కోట్ల నిధి. వరి సబ్సిడీకి రూ. 525 కోట్లు నిధి. 10 లక్షల తాటి విత్తనాల పంపిణీకి నిర్ణయం, ఊటీలో రిసార్ట్ల నిర్మాణ పథకానికి బ్రేక్ వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మత్స్యసంపద పెంపునకు ప్రత్యేక కార్యాచరణ. నీటి వనరులలో చేపల ఉత్పాదకతను పెంచే విధంగా ఒక పంచాయతీలోని 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 2 వేల చేపల పిల్లల పంపిణికి చర్యలు. మహిళా జాలర్లు 1000 మందికి నైపుణ్యాల అభివృద్దిలో శిక్షణ. 10 వేల మంది జాలర్లకు వ్యవసాయ రుణ కార్డుల పంపిణీ. 42 వేల ఎకరాలలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల మధురై మల్లి ఉత్పత్తి లక్ష్యం. మదురై, ధర్మపురి, తిరువళ్లూరు, సేలం, దిండుగల్, తిరువణ్ణామలై, కృష్ణగిరి , ఈరోడ్లలో మల్లె పువ్వల ఉత్పత్తికి కార్యాచరణ. 7 వేలమంది మల్లె సాగు రైతుల కోసం రూ. 60 లక్షలు కేటాయింపు. తిరువణ్ణామలై, సేలం, దిండుగల్, తిరుప్పత్తూర్లలో గులాబీల సాగును ప్రోత్సహించేందుకు రూ. కోటి కేటాయింపు. -
సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు
సాక్షి, చైన్నె: సీఈపీటీ విశ్వవిద్యాలయం వేసవి – 2025 కోర్సులను ప్రకటించింది ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులకు సాంప్రదాయ తరగతి గదికి మించి విస్తరించే వైవిధ్యమైన, ఇంటెన్సివ్, సుసంపన్నమైన విద్యా అనుభవాలను ఈ కోర్సుల ద్వారా అందించనున్నామని ఆ వర్సిటీ డిప్యూటీ ప్రోవోస్ట్ (అకాడమిక్) ప్రొఫెసర్ చిరాయు భట్ తెలిపారు. ఈ కోర్సుల వివరాలను శనివారం స్థానికంగా ఆయన ప్రకటించారు. యూరోపియన్ విద్యా వ్యవస్థలలో ప్రముఖంగా ఉన్న సమ్మర్ అండ్ వింటర్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే అంశంతో సీఈపీటీ విశ్వవిద్యాలయం ముందుకెళ్తోందన్నారు. సమ్మర్ అండ్ వింటర్ లలో రెండు నుండి నాలుగు వారాల ఇంటెన్సివ్ కోర్సులను అందిస్తామన్నారు. ఇవి విద్యార్థులకు గణనీయమైన ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అవకాశాలను అందిస్తాయన్నారు. విద్యార్థులు భారతదేశంలో, అంతర్జాతీయంగా క్యాంపస్, ఆన్లైన్, ప్రయాణ ఆధారిత ఎంపికలు సహా సుమారు 50 విభిన్న కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు అని వివరించారు. విద్యార్థులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సులు రూపొందించబడిందన్నారు. పీర్ లెర్నింగ్ ద్వారా, వారు విభిన్న దృక్పథాలను పొందుతారని, క్రెడిట్లను సేకరించడం ద్వారా, వారు వారి విద్యాపరమైన సౌలభ్యాన్ని పెంచుకుంటారని పేర్కొన్నారు. తమ కోర్సులలోని ఇంటర్ డిసిప్లినరీ స్వభావం విద్యార్థులు కొత్త రంగాలను అన్వేషించడానికి, వారి మేధో పరిధులను విస్తరించడానికి దోహద పడుతుందన్నారు. అదే సమయంలో వినూత్న బోధనా పద్ధతులను అందిస్తుందన్నారు. క్రికెట్ పోటీలు సాక్షి, చైన్నె: చైన్నె ప్రెస్క్లబ్, ఇండియన్ ఆయిల్ సంస్థ సంయుక్తంగా చైన్నెలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది. శనివారం ఈ పోటీలను తమిళాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి స్వామినాథన్ ప్రారంభించి, కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ సంస్థ తరఫున అధికారులు సుధాకర్, వెట్రిసెల్వన్, మురళి, రాజశేఖర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సురేష్ వేదనాయగం, ఆసిఫ్, మణికంఠన్, మదన్, సుందరభారతి పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో అగ్రగామి – కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తిరువళ్లూరు: ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి హబ్గా తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో వుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా కన్నూరులో రూ.1200 కోట్ల వ్యయంతో జెట్వర్క్ కొత్త అత్యాధునిక ప్లాంట్ను 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 2వేల మందికి ఉపాధి లభించనుంది. కొత్త ప్లాంట్ను ప్రారంభించే కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టీఆర్బీ రాజా, కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ హాజరై ప్రారంబించారు. మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా వుండడంతోనే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కోయంబత్తూరులో సెజ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, పరిశ్రమలు పెట్టడానికి తమిళనాడు అనువైన రాష్ట్రంగా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారని వివరించారు. దేశంలో 500 బిలియన్ ఈఎస్డీఎం మార్కెట్ ఉత్పత్తుల లక్ష్యాన్ని చేరాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులో ట్రిలియన్ ఉత్పత్తుల మార్కెట్కు దోహదం చేస్తుందన్నారు. మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడుతూ తమిళనాడులో పిల్లైపాక్కం, మనలూరు ప్రాంతాల్లో భారీ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ యూనిట్లను స్థాపించడానికి పీఎం సహకారం అందించారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కృష్ణన్, ఐసీఈఏ అధ్యక్షుడు పంజాజ్ మోహింద్రూ, అరుణ్రాయ్, సంస్థ నిర్వాహకులు అమృత్ ఆచార్య పాల్గొన్నారు. గంజాయి కేసులో వ్యాపారి అరెస్ట్ తిరువొత్తియూరు: తూత్తుకుడి తాళముత్తునగర్ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళుతున్న సెల్వేంద్రన్ (57)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 5 గంజాయి కేసులు ఉన్నట్లు తెలిసింది. అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 3.5 కిలోల గంజాయిని గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. -
అన్నదాతకు ఒరిగేది శూన్యమే
సాక్షి, చైన్నె: వ్యవసాయ బడ్జెట్తో నిజమైన అన్నతదాతకు ఒరిగేది శూన్యమేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. వ్యవసాయ బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు వ్యవసాయ బడ్జెట్లో రైతులకు మేలు చేసే ఒక్క పథకం అంటూ లేదని ధ్వజమెత్తారు. మండు టెండలో అన్నదాత పడుతున్న శ్రమకు గుర్తింపు లేదని, వర్షాల సీజన్లో నెలకొనే నష్టాలకు ఆదుకునే వారు లేరని, ప్రభుత్వ ప్రకటనలన్నీ కంటి తుడుపు చర్యఅని ఆరోపించారు. తమిళనాడులో 11.75 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో అంటూ గతంలో పేర్కొన్నారని, అయితే,సాగు విస్తీర్ణం అన్నది క్రమంగా తగ్గుతోందని వివరించారు. అయితే ఈ పాలకులు సాగు విస్తీర్ణం పెంపు అంటూ నాటకాలు రచిస్తున్నారని విమరిశంచారు. భౌగోళిక గుర్తింపు ప్రయత్నాలు అని పేర్కొంటున్నారేగానీ, వాటిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గతంలో ప్రకటించిన వాటికి భౌగోళిక గుర్తింపు సాధనలో ఎందుకు విఫలమైనట్టు అని ప్రశ్నించారు. ఏటా వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలకు శాశ్వత మోక్షం కల్పించే పథకం, ప్రాజెక్టు అన్నది లేక పోవడం విచారకరంగా పేర్కొనారు. ఈ బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ కాగితాలకే పరిమితం కానున్నాయే గానీ, ఆచరణలో పెట్టబోరని,ఎన్నికల దృష్ట్యా, రైతల దృష్టి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం మాత్రమే ఈ బడ్జెట్ అని పాలకులపై విమర్శలు గుప్పించారు. గతంలో తాము రైతు కమిటీల ద్వారా నేరుగా అన్నదాత వద్దకే పథకాలు వెళ్లే విధంగాచర్యలు తీసుకుంటే, ఈ పాలకులు వాటిని నిర్వీర్యంచేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ఆవిష్కరణల కోసం డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్ రీసెర్చ్ ఫండ్ సృష్టించ బడుతుందని ప్రకటించి, కేవలం రూ. కోటి కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులను మోసం చేయడంలో డీఎంకే పాలకులు నిష్ణాతులు అని,మరో మారు అదే బాణి అనుసరించారని విమర్శించారు. డీఎంకే పాలనలో తమిళనాడు ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, తమిళనాడు ప్రభుత్వం అప్పులు చేయకుండా ప్రాజెక్టులు అమలు చేసే పరిస్థితిలో లేదని ఆరోపించారు. -
టెస్ట్ క్రీడా కథా చిత్రం మాత్రమే కాదు
తమిళసినిమా: నటుడు మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం టెస్ట్. ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా అవతారమెత్తి తన వై నాట్ స్టూడియోస్ ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. నటుడు నాజర్, కాలి వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఏప్రిల్ 4వ తేదీన నేరుగా నెట్ ఫిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర దర్శక నిర్మాత శశికాంత్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. టెస్ట్ చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన కథా చిత్రమే కాదని, ఈ కథలో క్రికెట్ క్రీడకు సంబంధించిన పలు అంశాలు చోటు చేసుకుంటారని చెప్పారు. ఇది ముగ్గురు జీవితాలకు సంబంధించిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర కథను తాను 12 సంవత్సరాల క్రితమే తయారు చేసుకున్నానని చెప్పారు. అయితే పలు చిత్రాలు నిర్మాణంలో ఉండడం వల్ల ఈ కథను తెరకెక్కించడానికి సమయం పట్టిందన్నారు. అయితే కరోనా సమయంలో టెస్ట్ చిత్రాన్ని రూపొందించడానికి ఇదే సరైన తరుణం అని భావించానన్నారు. ఈ చిత్ర కథలు అనుకున్నప్పటి నుంచి నటుడు సిద్ధార్థ తనతో ట్రావెల్ అయ్యారన్నారు అదేవిధంగా మరో మాట చెప్పకుండా నటించటానికి అంగీకరించారన్నారు ఇక నటుడు మాధవన్ మాత్రం కథను మరింతగా అప్డేట్ చేయడానికి పుష్ చేశారని చెప్పారు. నటి మీరాజాస్మిన్ ది అద్భుతమైన పాత్ర అని పేర్కొన్నారు. దర్శకుడుగా తన తొలి చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీ లో స్ట్రీమింగ్ చేయడానికి కారణం ఏంటని అడుగుతున్నారని, దట్ ఫిక్స్ ఓటిటి ప్లాట్ఫామ్ గ్లోబల్ స్థాయిలో రీచ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు నెట్ఫ్లిక్స్ సంస్థతో 9 ఏళ్ల అనుబంధం ఉందని, టెస్ట్ చిత్రాన్ని ఆ సంస్థ నిర్వాహకులు తొలగించి ఫాలో అవుతున్నారని ,అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చిత్ర షూటింగులు మూడు నెలల్లో పూర్తి చేసినట్లు, అయితే అంతకుముందు ఆరు నెలలు చేసినట్లు చెప్పారు. ఇందులో డ్రామా పోర్షన్కు డబ్బింగ్ చెప్పించలేదని, లైవ్ షూటింగ్లో షూట్ చేసినట్లు చెప్పారు. ఈ చిత్రం దర్శకుడిగా తనకు చాలెంజ్ నని అయితే దర్శకుడుగా తనను తాను సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్కు రెడీ అయినట్లు శశికాంత్ తెలిపారు. -
బోధన పద్ధతులపై అవగాహన ఉండాలి
వేలూరు: టీచర్లు వినూత్న విద్యా బోధన, బోధన పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని వేలూరు జిల్లా విద్యాశాఖ సీఈఓ మణిమొళి అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వినూత్న అభ్యాసం, బోధన పద్ధతులు, పరిశోధన పత్రాల భాగస్వామ్యం కోసం ఉపాధ్యాయులకు సైన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో మొట్టమొదటి సారి గా వేలూరులోని ఊరీస్ కళాశాలలో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువళ్లూరు, కాంచిపురం జిల్లాలకు చెందిన 120 మంది టీచర్లకు శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమైంది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల విద్య నుంచే సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పరిశోధన నివేదికలు సమర్పించే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నా రు. శిక్షణను విడతల వారిగా నిర్వహిస్తామని ఇక్క డ శిక్షణ పొందిన వారు మీ ప్రాంతంలోని టీచర్లకు జోన్ల వారిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జ్యోతీశ్వర పిళ్లై, తమిళనాడు సైన్స్ మూవ్మెంట్ జిల్లా కార్యదర్శి డాక్టర్ జనార్దన్, జిల్లా అధ్యక్షులు అముద, మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్రమ ణి, నార్త్జోన్ కో–ఆర్డినేటర్ అంబిక పాల్గొన్నారు. -
ఘనంగా డబ్ల్యూటీఎఫ్లో మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం వేడుకగా జరిగాయి. నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న ఓ హోటల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు ప్రప్రంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైన్నె ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ దావులూరి కోమలి కృష్ణ పాల్గొని మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగు భాష వికాసానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం కర్ణాటక, సినీ గాయినీ జననీ సంజీవి సంగీత విభావరి ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమ నిర్వహణను ప్రమీలా ఆనంద్, సురేఖ మోహన్ దాస్ లు చేపట్టారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరాదత్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్త కోశాధికారి తాల్లూరి రుక్మిణీదేవిని జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నవనారీమణుల పేరిట తొమ్మిది మంది ప్రముఖుల పాత్రలు పోషించిన మహిళలుగా విచ్చేసిన ఉప్పులూరి విజయలక్ష్మి, వెంకటరమణ, ఏ.జాన్సీ రత్నం, డీ హేమమాలిని, ఊరా శశికళ, పోతూరు రమాదేవి, రుక్మిణి దేవి, వినీషా వశిష్ట్, సౌమ్య వశిష్ట్ ఆయా వేషధారణలో ఆకట్టుకున్నారు. తంబూలా గేమ్స్ ను నిర్వహించి బహుమతులు అందజేశారు. -
బాలికలు పరిశోధనలు చేయాలి
వేలూరు: బాలికలు ఉన్నత విద్యపై ఆశక్తి చూపి పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడాలని ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఇరయన్బు అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో 50వ స్నాతకోత్సవం కళాశాల కార్యదర్శి మణినాథన్ అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోను రాణిస్తున్నారని అందుకు కారణం విద్య ఒక్కటే అన్నారు. అధికంగా మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, పట్టుదలతో ఉన్నత విద్యకు వెళితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చన్నారు. ఇండియాలోనే ఉన్నత విద్యలో మన దేశం 75 శాతంగా ఉందన్నారు. వీటిలో తమిళనాడులో విద్యాభివృద్ధి 45 శాతంగా ఉందని తెలిపారు. ఒక మహిళ విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబమే విద్యావేత్తలుగా ఉంటారన్నారు. డిగ్రీలు సాధించిన అందరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్నెట్, వాట్సాప్లను పక్కన బెట్టి విద్యా సంబంధమైన పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. అనంతరం యూజీ, పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన 1,069 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ భానుమతి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
గన్ షూటింగ్ పోటీలకు సర్వం సిద్ధం
తిరుత్తణి: రాష్ట్రంలో ఐదు రోజుల పాటూ జాతీయ స్థాయి గన్, రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన అసోంం, బిహార్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కమెండో బృందానికి తిరుత్తణిలో శనివారం రైల్వే పోలీసులు స్వాగతం పలికారు. తమిళనాడు పోలీసు శాఖ కమెండో ఫోర్స్ ద్వారా చెంగల్పట్టు జిల్లాలో 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటూ గన్, రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, అదనపు సహాయ బలగాలు, కమెండో ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం అస్సాం నుంచి 21 మంది కమెండో ఫోర్సు, బిహార్ నుంచి 29 మంది పోలీసులు రెండు బ్యాచ్లుగా రైలు ద్వారా తిరుత్తణికి చేరుకున్నారు. వారికి రైల్వే పోలీసులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తిరుత్తణి నుంచి పోలీసుల వాహనాల ద్వారా చెంగల్పట్టు జిల్లాకు బయల్దేరి వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలతో పోలీసులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
విష్ణు విశాల్కు జంటగా మమిత బైజూ
తమిళసినిమా: మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి మమిత బైజూ. ఆ చిత్రంతో దక్షిణాది చిత్త పరిశ్రమ దష్టిని తనపై తిప్పుకుంది. అంతే వెంటనే తమిళంలో జీవి ప్రకాష్ కుమార్కు జంటగా రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కొద్దిరోజులు కోలీవుడ్ ఈమెను పట్టించుకోలేదు. అలాంటిది అనూహ్యంగా నటుడు విజయ్ కథా నాయకుడుగా నటిస్తున్న జననాయకున్ చిత్రంలో నటించే అదష్టం నటి మమిత బైజూకు దక్కింది. నటి పూజా హెగ్డే కథానాయక నటిస్తున్న ఇందులో మమిత బైజూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీంతో మరింత పెరిగిందని చెప్పాలి. ఇటీవల టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. కాగా తాజాగా నటుడు విష్ణు విశాల్కు జంటగా నటించే అవకాశం ఈ మాలీవుడ్ భామను వరించింది. ఇంతకుముందు విష్ణు విశాల్ కథానాయకుడిగా ముండాసు పట్టి , రాక్షసన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రామ్ కుమార్ తాగారా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మరోసారి నటుడు విష్ణు విశాల్ కథనాయకుడిగా నటించనున్నారు. దీంతో దర్శకుడు రామ్ కుమార్, విష్ణు విశాల్ కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రం కానుంది. ఇందులోనే నటి మమిత బైజూ నాయికగా నటించనునుంది. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని జి. త్యాగరాజున్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను యూనిట్ వర్గాలు శనివారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. -
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
తిరుత్తణి: నొచ్చిలి రోడ్డులో ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు కోరారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ దీప ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కార సభ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమావేశంలో తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట ప్రాంతాల నుంచి వందకు పైగా రైతులు పాల్గొన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు మాట్లాడుతూ పళ్లిపట్టు ప్రాంతంలోని రాళ్లు, ఇసుక, గ్రావల్ క్వారీల నుంచి రోజూ వందలాది టిప్పర్లు, లారీలు నొచ్చిలి తిరుత్తణి రోడ్డులో వెళుతుంటాయి. భారీ వాహనాలు రోడ్డు నిబంధనలు పాటించకుండా అతివేగంతో పయనించడంతో పాటు అధికభారం తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా రాత్రుల్లో వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని వాహన చోదకులు, గ్రామీణులు ప్రాణాలు కోల్పోవాల్సి వుంది. పోలీసులు, ఆర్టీఓ చర్యలు తీసుకుని వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలు సీజ్ చేయాలని కోరారు. -
కారైక్కాల్ ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అనుసంధానంలోని తిరువలంగాడు ఆలయంలో కారైక్కాల్ అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఆలయంలో 16, 17 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకల ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పనకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో శనివారం తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ మలర్విళి, డీఎస్పీ కందన్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస కేంద్రాలు ఏర్పాటుతోపాటు పరిశుభ్రత, రవాణా సదుపాయాలు, తాత్కాలిక వైద్య కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలీసుల భద్రతకు ఏర్పాట్లు, హైవే రోడ్డులో ఆక్రమణలు తొలగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారానికే సమీక్ష వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే జిల్లాల వారిగా కార్మికులతో నేరుగా సమీక్షిస్తున్నట్లు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొన్కుమార్ అన్నారు. వేలూరులోని కార్మిక సంక్షేమ కార్యాలయంలో కమిషనర్ జ్ఞానవేల్ ఆధ్వర్యంలో కార్మికులతో నేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం 50 మంది కార్మికులకు రూ.15.55 లక్షల విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు దేహదారుఢ్య కోసం ప్రత్యేక మెడికల్ కార్డును అందజేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ఏడు జిల్లాల్లో ఐటీఐని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారని, వాటిని వేలూరులో కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల పెన్షన్ను రూ.3 వేలు చేయాలని సిఫారస్సు చేశామని, వెంటనే వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలోనే కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకొచ్చారని, గత ప్రభుత్వంలో ఎటువంటి ప్రాజెక్టులు తీసుకు రాకపోవడంతోనే కార్మికుల సభ్యత్వం కూడా పూర్తిగా తగ్గిందన్నారు. ఇళ్లులేని ప్రతి కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.4 లక్షలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాని కోరారు. ఆయనతోపాటు భవన నిర్మాణ కార్మికుల అఖిల భారత అధ్యక్షుడు ఆర్టీ పయణి, జిల్లా అద్యక్షుడు వేల్మురుగన్, కార్మిక నేతలు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో అలైషిప్ క్లబ్లు
సాక్షి, చైన్నె: ప్రభుత్వ పాఠశాలల్లో అలైషిప్ క్లబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కార్పొరేట్ల కోసం ప్రపథమంగా మేల్ అలైషిప్ సినర్జీ సమ్మిట్ శనివారం నిర్వహించారు. సమ్మిళిత నాయకత్వం, సమానత్వం సాంస్కృతిక మేధస్సు ప్రధాన అంశాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశంలోని ప్రముఖ వర్క్ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థగా ఉన్న అవతార్ పరిధిలోని లాభాపేక్షలేని విభాగం అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్, ‘మేల్ అలై షిప్ సినర్జీ సమ్మిట్’(ఎంఏఎస్ఎస్) – 2025ను స్థానికంగా నిర్వహించింది, ఇది కార్పొరేట్ నిపుణులు , విద్యార్థుల మైత్రిని సాధించడానికి వేదికగా నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలలో కౌమారదశలో ఉన్న బాలుర సున్నితత్వంపై దృష్టి సారించే విధంగా మెన్ ఇంపాక్టింగ్ ట్రస్ట్ – రెస్పెక్ట్) ఆధారిత ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని నాలుగుప్రభుత్వ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అలైషిప్ క్లబ్లు ప్రారంభించారు. అలాగే, ‘అలైషిప్ను రోజువారీ చర్యలుగా మార్చడం’ అనే అంశంపై ప్యానెల్ చర్చ, ‘హార్ట్ టు ఆర్ట్’ – పోస్టర్ తయారీ పోటీ, కార్యాలయంలో అలైషిప్ ఉత్తమ పద్ధతులు, శక్తిపై వీడియో బైట్లు , మేల్ అలైషిప్ చుట్టూ కేంద్రీకృతమైన ఇతర పోటీలను ఈసందర్భంగా నిర్వహంచారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కూపర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మోహన్రామ్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక నాందికి ఈ క్లబ్లు దోహదకరంగా పేర్కొన్నారు. బాలురు, బాలికలను కలిపి మిత్రత్వాన్ని చురుకుగా అభ్యసించడానికి ప్రయత్నిస్తాయని వివరించారు. తమిళనాడు అంతటా 30 పాఠశాలల్లో తొలి విడతగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా క్లబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ , లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పురుషులు పోషించే కీలక పాత్ర గురించి, వారి సమ్మిళిత నాయకత్వాన్ని ఎలా ప్రోత్సహించవచ్చో, అవకాశాల కోసం ఎలా వాదించవచ్చో, మిత్రుడిగా ఎలా ఉండవచ్చో అన్న విషయాలను విద్యార్థులకు వివరించారు. -
లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా..
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, సత్యరాజ్, నటి శృతిహాసన్, రెండా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా చిత్రం టైటిల్ వీడి యోతో పాటూ రెండు పాటల క్లిప్పింగ్స్ ను విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇది స్మగ్లింగ్ గ్యాంగ్స్ ఇతివృత్తంతో రూపొందుతున్న కథా చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం దర్శకుడు లోకేష్ కనకరాజ్ 49వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నటి శృతిహాసన్ ఎక్స్ మీడియా ద్వారా ఆయనకు జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. కాగా కూలీ చిత్రంలో నటుడు బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈయన పుట్టిన రోజు శుక్రవారం మే కావడంతో ఆయనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. అంతేకాకుండా కూలీ చిత్రంలో లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్తో ఉన్న ఫొటోను, నాగార్జునతో, ఉపేంద్ర, సత్యరాజ్తో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలిప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కూలీ చిత్రంపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయనే చెప్పాలి. -
ఉత్సాహంగా ఉగాది ముగ్గుల పోటీలు
కొరుక్కుపేట: ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వహక వర్గం, సర్ త్యాగరాయ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశ్వావసు ఉగాది మహోత్సవ వేడుకలు– 2025 సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. దీనికి పాతచాకలిపేటలోని శ్రీ సుబ్బారావు కల్యాణ మండపం వేదికైంది. మొదటి సారిగా ఈ పోటీల్లో కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్, కేటీిసీటీ బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటుకుని మొదటి బహుమతిని ఎస్.అపూర్వ, ఎస్.కీర్తిగ, రెండవ బహుమతిని. భూమిక, డి. మహ, మూడవ బహుమతిని వి.సర్వేశ్వరి, వి.అభినయ గెలుచుకున్నారు. మొదటి మూడు బహుమతులు కేసరి మహోన్నత పాఠశాల– టి.నగర్, ఈ పోటీలో కేటీసీటీ ప్రాథమిక పాఠశాల నాలుగవ తరగతి విద్యార్థినులు శ్రీమిత, కార్తీక ప్రత్యేక బహుమతి గెలుచుకున్నారు. పెద్దలకు నిర్వహించిన పోటీలో ప్రత్యేక బహుమతిని బి.లోహిత గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా మన్ని వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, వరలక్ష్మి వ్యవహరించారు. -
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
● సినీ పక్కీలో ఛేజింగ్ ● కొలనులో దూకడంతో పట్టుబడిన వైనం సేలం: కోవై జిల్లా పెరూర్ సమీపంలో ఆలన్తురై ప్రాంతానికి చెందిన రైతు కృష్ణసామి (62). ఈయన సర్టిఫికెట్ కోరుతూ మత్తువరాయపురం వీఏఓ వెట్రివేల్ (35)ను కలిశాడు. అప్పుడు వీఏఓ వెట్రివేల్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.5 వేలు లంచం అడిగాడు. దీంతో కృష్ణస్వామి రూ.1000 నగదును వెట్రివేల్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బును శుక్రవారం ఇస్తానని తెలిపాడు. దీంతో వీఏఓ కృష్ణస్వామిని పుట్టువిక్కి రోడ్డు వద్దకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలని తెలిపాడు. ఇదిలాఉండగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని కృష్ణస్వామి ఈ విషయాన్ని ఏసీబీ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ శాఖ అదనపు ఇన్స్పెక్టర్ దివ్య, పోలీసులు రసాయనంతో పూసిన నోట్లను అందజేశారు. ఆ నగదు నోట్లతో కృష్ణసామి వీఏఓను శుక్రవారం సాయంత్రం సుండక్కాపుత్తూర్ రోడ్డు వద్ద పుట్టువిక్కిర ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు వెట్రివేల్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులను చూసిన వెంటనే వీఏఓ బైక్పై తప్పించుకుని పారిపోయాడు. అయితే పోలీసులు సినీ పక్కీలో వీఏఓను వెంబడించారు. వీఏఓ పెరూర్ కులత్తేరి రోడ్డుపై బైక్ను నిలిపి పెరూర్ కొలనులో దూకేశాడు. లంచం డబ్బులను కూడా కొలనులో పడేశాడు. పోలీసులు వెట్రివేల్ను అరెస్టు చేశారు. అనంతరం కొలనులో వెట్రివేల్ వేసిన రూపాయి నోట్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం వీఏఓను వేట్రివేల్ను పెరూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ పోలీసులు తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు. -
సరెండర్ కోసం విజయ్సేతుపతి సపోర్ట్
తమిళసినిమా: యువ నటుడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరెండర్. ఈయన తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ఇది అన్నది గమనార్హం. ఇందులో నటుడు లాల్, సుజిత్ శంకర్, మునీష్ కాంత్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆఫ్ బీట్ ఫిలిమ్స్ పతాకంపై విక్రం కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ సరెండర్ చిత్రం యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా తమిళ సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కాగా చిత్రం టైటిల్ను, ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు విజయ్ సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా సరెండర్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి మెయ్యేంద్రన్ ఛాయాగ్రహణం అందించగా, వికాశ్ ప్రదీషా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితర ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశారన్నది గమనార్హం. -
ఐఐటీ మద్రాస్లో..సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఓపెన్ హౌస్
సాక్షి, చైన్నె: ఇండియన్ ఇనన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్)లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్(సీఎఫ్ఐ) ఓపెన్ హౌస్ – 2025 కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో 26 జట్లకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్థుల ఆవిష్కరణలు కొలువయ్యాయి. 60 అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించారు. దేశంలో విద్యార్థులచే నిర్వహించబడే అతిపెద్ద ఇన్నోవేషన్ ల్యాబ్లలో ఒకటిగా సీఎఫ్ఐ పేరు గడించింది. ఇందులో విభిన్న సాంకేతిక డొమైన్లలో విస్తరించి 14 క్లబ్లు ఉన్నాయి, అలాగే జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో చురుకుగా పోటీపడే ఎనిమిది పోటీ జట్లు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఏటా నిర్వహించబడే ఓపెన్ హౌస్లో పూర్తిగా విద్యార్థులే రూపొందించి నిర్మించిన ఉత్పత్తులు కొలువు దీర్చడం జరుగుతోంది. ఇందులో ప్రాజెక్టులు, పరిశ్రమ, పూర్వ విద్యార్థుల నుంచి మరింత మద్దతును ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన వేదికను ఈ ఓపెన్ హౌస్ అందిస్తోంది. శనివారం జరిగిన ఓపెన్ హౌస్ 2025 అనేక అద్భుతమైన ప్రదర్శనలకు సాక్ష్యంగా నిలిచింది, ఆవిష్కరణలు.. హర్యానాలోని సోనిపట్లోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలోని భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంలో సందర్శకులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఏఐ–ఆధారిత హ్యూమనాయిడ్ సంవిద్, ఓ సూపర్సిరింజ్, ఖచ్చితమైన అనస్థీషియా మోతాదును నిర్ధారించే వాల్యూమ్–గేటెడ్ సిరంజి. ఓ డ్రోన్ స్వార్మ్, పేలోడ్ లిఫ్టింగ్, డెలివరీ కోసం రూపొందించబడిన డ్రోన్ల సమన్వయ సముదాయం కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణలను మార్కెట్కు తీసుకెళ్లడంలో సహాయం చేయాలని పరిశ్రమ, పూర్వ విద్యార్థుల సంఘానికి పిలుపునిస్తూ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ ఓపెన్ హౌస్వేదికగా పిలుపు నిచ్చారు. విద్యార్థి సమాజంలో నిర్మాణ సంస్కృతిని ఈ కార్యక్రమం పెంపొందించిందన్నారు. తమ అండర్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మంది సీఎఫ్ఐ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ సంవత్సరం ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఈ బృందాలు అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడంతో పాటూ కొన్ని అసాధారణమైన ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే ప్రీ–ఇంక్యుబేటర్ నిర్మాణ్ను చేరుకుంటున్నాయని ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థి సార్థక్ సౌరవ్ గ్రాాడ్యుయేషన్ తర్వాత వెంటనే తన సొంత స్టార్టప్ (మాటరైజ్)ను స్థాపించి చేరడం ఇదే మొదటిసారి పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించినందుకు జట్లు, విద్యార్థి కార్యనిర్వాహకులు, అధ్యాపక మార్గదర్శకులు మరియు సహాయక సిబ్బందిని అభినందించారు. అలాగే స్టార్టప్ శతం మిషన్ను కొనసాగించడానికి మరింత బలంగా సహకరించడానికి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మాట్లాడుతూ, సీఎఫ్ఐ అనేది ఆవిష్కరణ సృజనాత్మకతకు ఒక వెలుగు అని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఓపెన్ హౌస్లో 1,000 మంది విద్యార్థులతో కూడిన 60కి పైగా ప్రాజెక్టులు తమ వద్ద ఉన్నట్టు వివరించారు. ఈ ఆవిష్కరణల ఆధారంగా 15 పేటెంట్లను దాఖలు చేశామన్నారు. అలాగే మూడు సంభావ్య స్టార్టప్ల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో ఐఐటీ మద్రాస్ త్వరలో లక్ష్యాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు.. ఈ పదర్శనలో సాప్ట్వేర్, ఏఐ రంగంలో దృష్టి లోపం ఉన్న వారికి యాక్సెసిబిలిటీని పెంచే ఆడియో – ఆధారిత వీఆర్ గేమ్ బ్లింక్, విభిజన్న శైలులను మిళితం చేసే మల్టీ –ట్రాక్ ఫ్యూజన్ మ్యూజిక్ జనరేటర్ ఏఐఐ రెహమాన్ వంటి ప్రాజెక్టులు లీనమయ్యే సాంకేతికతను ఈ ప్రదర్శన ద్వారా ముందుకు తెచ్చాయి. నాణ్యతను కొనసాగిస్తూ ఫైల్ పరిమాణాలను ఆప్టిమైజ్ చేసే అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనం యాక్సిఫై, భవిష్యత్తు–ప్రూఫ్ భద్రతను నిర్ధారించే పోస్ట్–క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లైబ్రరీ క్వాన్ క్రిప్ట్, గణన సామర్థ్యం, సైబర్ భద్రతలో ఆవిష్కరణలను ప్రదర్శించారు. ట్రేడ్క్రాఫ్ట్, ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, వినియోగదారులు స్టాక్, ఫ్యూచర్స్ , ఆప్షన్స్ ట్రేడింగ్ను రిస్క్–ఫ్రీ వాతావరణంలో అనుకరించడానికి అనుమతి ఇచ్చారు. ఫార్ములా స్టూడెంట్ ఈవీ రేస్ కార్ టీమ్ రఫ్తార్, ఫార్ములా భారత్ – 2025లో ఓవరాల్ స్టాటిక్స్లో మొదటి స్థానాన్ని కై వసం చేసుకోవడం విశేషం. ఇంజినీరింగ్ డిజైన్, ఖర్చు, తయారీ చ ఉత్తమ బ్యాటరీ ప్యాక్లలో అత్యున్నత అంశాలు ఉన్నాయి. హైపర్లూప్ కోసం సబ్–స్కేల్ ప్యాసింజర్ క్యాబిన్ , మార్గదర్శక బూస్టర్–క్రూయిజర్ టెక్నాలజీని అభివృద్ధి తో పాటుగా స్టీల్ ట్యూబ్లను ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్ ట్యూబ్లతో భర్తీ చేస్తూ మౌలిక సదుపాయాలను మరింత స్కేలబుల్గా తీర్చిదిద్దారు. వారి టెస్ట్ ట్రాక్ ఏరోడైనమిక్స్, లెవిటేషన్, ప్రొపల్షన్ , భద్రతా వ్యవస్థల వాస్తవ–ప్రపంచ ధ్రువీకరణకు ఇందులో అనుమతి ఇచ్చారు. ఆవిష్కరణల కొలువు 60 టెక్ ఇన్నోవేషన్ల ప్రదర్శన -
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్కి ప్రకాశ్రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
పవన్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.మరోవైపు, పవన్ కల్యాణ్కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. నటుడు ప్రకాష్రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తమిళులపై కామెంట్స్.. పవన్కు ప్రకాష్రాజ్ కౌంటర్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నటుడు ప్రకాష్రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్ చేశారు."మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please... 🙏🏿🙏🏿🙏🏿 #justasking— Prakash Raj (@prakashraaj) March 14, 2025ఇక, అంతకుముందు.. పవన్ కల్యాణ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. -
యథార్థ ఘటనలతో రాబర్
తమిళసినిమా: ిసనిమా అనేది కల్పిత కథలతో కూడిన కాలక్షేప మాధ్యమమే కాదు. సమాజానికి కావలసిన చక్కని సందేశంతో కూడిన ప్రయోజనాత్మక కథా చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అవి సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకొస్తుంటాయి. అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రం రాబర్ అని చెప్పవచ్చు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చైన్ స్నాచింగ్ సమస్య ఒకటి. చైన్ స్నాచింగ్కు కారణాలు చాలానే ఉంటాయి. ఆడంబర జీవితాలకు అలవాటు పడే జులాయిగాళ్లు, కష్టపడకుండా సంపాదించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటారు. దీని వల్ల అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక సమస్యలకు గురవుతున్నారు. అలా ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అయితే అలా చైన్ స్నాచింగ్కు పాల్పడిన వారు బాగుంటున్నారా అంటే వారు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం రాబర్. ముఖ్యంగా చైన్ స్నాచింగ్లతో మహిళలకు జరుగుతున్న బాధను చాలా స్పష్టంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని పాత్రికేయురాలు ఎస్.కవిత తన ఇంప్రెస్ ఫిలింస్ సంస్థతో కలిసి, మెట్రో ప్రొడక్షన్స్ అధినేత ఆనంద్కృష్ణన్తో కలిసి నిర్మించడం విశేషం. సత్య, డేనియల్, అన్నేపోప్, జయప్రకాశ్, దీపాశంకర్, సెండ్రాయన్, పాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్ఎం.పాండి దర్శకత్వం వహించారు. ఎన్ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం, సోహన్ శివనేశ్ సంగీతాన్ని అందించారు. అత్యంత సహజత్వంగా వాస్తవ సంఘటనలతో రూపొందించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. శక్తి ఫిలింస్ సంస్థ ద్వారా శక్తివేల్ తమిళనాడు విడుదల హక్కులను పొంది రాబర్ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. -
కిటకిటలాడిన తిరువణ్ణామలై గిరివలయం
వేలూరు: తమిళ మాసి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. పంచ భూత స్థలమైన అరుణాచలేశ్వరాలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులోని 14 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా పౌర్ణమి గురువారం ఉదయం 11.40 గంటలకు ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం ముగియడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో తిరువణ్ణామలై చేరుకొని భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
కమనీయం.. తిరుకల్యాణోత్సవం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని వల్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మురుగ పెరుమాల్ తిరు కల్యా ణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు, దీపారాధనలు చేసి తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. ఆర్యవైశ్య వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారికి వరుస తాంబూలం అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ధనశేఖర్ శెట్టియార్, కార్యదర్శి ఆనందన్, కోశాధికారి కుప్పురాజ్, పీఆర్ఓ సుబ్రమణ్యశెట్టియార్, జాయింట్ కార్యదర్శి భాస్కరన్, వాసుదేవన్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ సారథి పాల్గొన్నారు. -
పరువు నష్టం కేసులో పళనికి ఊరట
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామిపై ఎంపీ దయానిధి మారన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధిస్తూ శుక్రవారం ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి పళనిస్వామి పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో, సెంట్రల్ చైన్నెలో డీఎంకె ఎంపీ దయానిధి మారన్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను సరిగ్గా ఖర్చు చేయడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. ఈ ప్రసంగాన్ని ఖండించిన దయానిధి మారన్, ఎడపాడి పళనిస్వామిపై పరువు నష్టం దావా వేశారు. చైన్నె జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో, తాను వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా మాట్లాడానని, ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలు పరువు నష్టం కలిగించేవి కావని, కాబట్టి తనపై ఉన్న కేసును రద్దు చేయాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జి.కె.ఇళందిరియన్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఎడపాడి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జాన్ సత్యన్ వాదిస్తూ ఆయన వార్తాపత్రికలోని వార్తలు, ప్రభుత్వ వెబ్సైట్లోని డేటా ఆధారంగా మాత్రమే మాట్లాడానని, ఎటువంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. వాదనల అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టులో విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి జారీ చేశారు. మాజీ కేంద్ర మంత్రికి సత్కారం సాక్షి, చైన్నె: దేశానికి విశేష సేవలను అందించినందుకు భారత మాజీ కేంద్రమంత్రి సురేష్ప్రభును శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ సంయుక్తంగా సత్కరించుకుంది. శుక్రవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దేశాభివృద్ధికి ఎనలేని సేవలను అందించారని ఆ సేవలకు గుర్తింపుగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభుతోపాటు మరో ఇద్దరు న్యాయ ప్రముఖులు మద్రాస్ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.శంకరనారాయణన్, సీనియర్ న్యాయవాది జయేష్ డోలియాను సత్కరించారు. సురేష్ప్రభు మాట్లాడుతూ ప్రజలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఆ కార్యక్రమాన్ని సమ్మతించానని తెలిపారు. తాను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నాలను వివరించారు. దేశంలో 80 శాతం విద్యుత్ కొరత ఉందని ఆయన గుర్తు చేశారు. తన హయాంలో ఉచిత విద్యుత్ ప్రాజెక్టుపై తొలిసారి సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితను మరిచిపోలేమన్నారు. ఇందులో శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. మోటారు పంపుల తయారీ నగరంగా కోవై సాక్షి,చైన్నె: ప్రపంచంలోనే మోటారు పంపు సెట్ల తయారీ నగరంగా కోయంబత్తూరును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని భారత మోటారు పంపు తయారీదారుల సంఘం ప్రశంసించింది. ఇండియన్ పంప్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి. కార్తీక్ మాట్లాడుతూ, కోయంబత్తూరు మోటారు పంప్ పరిశ్రమను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటును తమకు ఎంతో ఆనందకరంగా పేర్కొన్నారు. బడ్జెట్లో అధునాతన పంపుల తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రకటించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, కోయంబత్తూర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వి.సెంథిల్ బాలాజీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
బావిలోకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరి మృతి ● కారులో ప్రయాణించిన రైతు, రక్షించడానికి వెళ్లిన ఈతగాడు సేలం: ఈరోడ్–సత్యమంగళం సమీపంలో కారు బావిలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని ముల్లికాపాళయంకు చెందిన రైతు యువరాజ్ (65)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం 6 గంటలకు తోటలో ఉన్న కారును యువరాజ్ నడుపుతున్నాడు. కారు అకస్మాత్తుగా అదుపుతప్పి వెనక్కి దూసుకెళ్లి సమీపంలోని 80 అడుగుల లోతైన బావి రిటైనింగ్ వాల్ను ఢీకొని బావిలో పడిపోయింది. బావిలో నీరు 50 అడుగుల లోతులో ఉండడంతో కారు నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న యువరాజ్ బయటకు రాలేక నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి గ్రామస్తులు సత్యమంగళం పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. యువరాజ్ను రక్షించే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది తాడుకట్టి బావిలోకి దిగారు. 50 అడుగుల లోతు వరకు నీరు నిలిచి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వారు రాత్రి 11 గంటల వరకు సహాయక చర్యలను కొనసాగించారు. గజ ఈతగాడు మృతి ఆ తరువాత, వారు భవానీసాగర్ నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించారు. వారిలో భవానీసాగర్ అన్నానగర్కు చెందిన తిరుమూర్తి(42) కూడా బావిలోకి దిగి యువరాజ్ను రక్షించడానికి ప్రయ త్నించాడు. బావిలోని నీటిని మోటారుతో బయటకు పంపింగ్ చేశారు. ఈ పరిస్థితిలో బావిలోకి దిగిన నలుగురు ఈతగాళ్లు ఊపిరాడక వెలుపలికి వచ్చేశారు. అయితే తిరుమూర్తి నీటిలో మునిగిపోయాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 9 గంటలపాటు శ్రమించిన తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, నీళ్లన్నీ ఖాళీ అయిన తర్వాత, కారులో ఉన్న యువరాజ్, తిరుమూర్తి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. తర్వాత బావిలో ఉన్న కారును కూడా ఒక పెద్ద క్రేన్ ద్వారా బయటకు తీశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈతగాడు తిరుమూర్తి కారు బావిలో పడడంతో దానిలోని గ్యాస్ బావిలోకి పోవడంతో ఊపిరాడక మరణించాడని తేలింది. ఈ ఘటనపై సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకథా చిత్రంగా డెక్స్టర్
తమిళసినిమా: సినిమా కథలు కొత్తగా ఉండవు. ఏ చిత్రంలోనైనా ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, వినోదభరిత అంశాలే ఉంటాయి. అయితే ఆ కథలను తెరపై ఆవిష్కరించే విధానమే కొత్తగా ఉండాలి. అలాంటి చిత్రాలే ప్రేక్షకుల ఆదరణను పొందుతాయి. అలాంటి మంచి కంటెంట్తో తెరకెక్కిన తాజా చిత్రం డెక్స్టర్. కథ పాతదే అయినా, దాన్ని కథనం, తెరపై ఆవిష్కరించిన తీరు జనరంజకంగా ఉన్న చిత్రం ఇది. బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఒక కుర్రాడి జీవితాన్ని ఎలాంటి పరిణామాలకు గురి చేసింది, దాని వల్ల ఎందరి ప్రాణాలు బలైయ్యాయి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్స్టర్ చిత్రాన్ని రామ్ ఎంటర్టెయినర్స్ పతాకంపై ప్రకాశ్.ఎస్వీ నిర్మించారు. సూర్యన్.జీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో రాజీవ్ గోవింద్, అభిషేక్ జార్జ్, యుక్తా పెర్వీ, సితార విజయన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య గోవిందరాజ్ చాయాగ్రహణం, శ్రీనాఽథ్ విజయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఒక గాఢమైన ప్రేమికుడి ఆవేదన, ప్రతీకారేచ్ఛ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందింది. ప్రేమించిన ప్రియురాలు హత్యకు గురైతే ఆమె జ్ఞాపకాలు గుండెల్లో గుచ్చుకుంటుంటే అతని బాధను, మనోవేదనను చూడలేక అతని మిత్రుడు ఏం చేశాడు? అదే విధంగా అనుకోకుండా తారస పడిన బాల్య స్నేహితురాలు అతనికి ఏ విధంగా బాసటగా నిలిచింది? ఆమె కుటుంబ సమస్య ఏమిటి? దాన్ని ఆమె స్నేహితుడు పరిష్కరించగలిగాడా వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్స్టర్ చిత్రం ఊహించని మలుపులతో సాగుతుంది. చిత్రంలో ప్రేమ, పగ, ప్రతీకారాలతో పాటు రొమాన్స్, అందమైన పాటలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని శుక్రవారం తెరపైకి వచ్చింది. -
తంగం బడ్జెట్
● అసెంబ్లీలో ఆర్థిక పద్దు ● దాఖలు చేసిన ఆర్థికమంత్రి తంగం తెన్నరసు ● అప్పులు 9 లక్షల కోట్లు ● పథకాలకు నిధుల వరద ● మహిళలకు అందలం ● ఉద్యోగులకు కానుక ● నేడు వ్యవసాయ బడ్జెట్ సాక్షి, చైన్నె: ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తనదైన శైలిలో రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం అసెంబ్లీలో దాఖలు చేశారు. తమిళనాడు భవిష్యత్తుకు దిక్సూచీగా పేర్కొంటూ పద్దుల చిట్టాను వివరించారు. రాష్ట్ర అప్పులు రూ. 9 లక్షల కోట్లకు చేరినట్టు ప్రకటించారు. పథకాలకు నిధుల వరద పారిస్తూ, చైన్నె శివారులో గ్లోబల్ సిటీ నిర్మాణం, రోడ్లు, వంతెనల ఏర్పాటు వంటి కొత్తప్రగతి పథకాలను ప్రకటించారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీతో పాటు ఉద్యోగులకు ఈఎల్ (ఎర్న్డ్ లీవ్ సరెండర్ సిస్టమ్)ను మళ్లీ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2025–26 సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్ను సభలో మంత్రి తంగం తెన్నరసు ప్రవేశ పెట్టేందుకు ముందుగా సీఎం స్టాలిన్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ గురించి సీఎంతో చర్చించినానంతరం అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ, స్పీకర్ అప్పావు అధ్యక్షతన సభ సరిగ్గా 9.30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 12.10 గంటల వరకు బడ్జెట్ ప్రసంగం 2.40 గంటలు సాగింది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్ ప్రసంగానికి సిద్ధం కాగా, అన్నాడీఎంకే సభ్యులో ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు ఇది సమయం కాదంటూ స్పీకర్ వారించారు. అనంతరం సభలో పూర్తి స్థాయి బడ్జెట్ను తంగం తెన్నరసు దాఖలు చేశారు. తమిళనాడులో విద్య, ఆరోగ్యం వంటి అంశాలను గుర్తు చేస్తూ శాంతి సామరస్యాల గురించి ప్రస్తావించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను విశదీకరించారు. తమిళ భాషాభ్యున్నతి గురించి ప్రస్తావిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచీగా నిలిచే విధంగా పలు పథకాలు, అంశాలకు నిధులను కేటాయిస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. తిరుక్కురల్ను అన్ని ప్రపంచ భాషల్లో అనువదించేందుకు, విదేశాలలో సైతం పుస్తక ప్రదర్శనల ఏర్పాటుకు నిధులను కేటాయిస్తూ తొలి ప్రకటన చేశారు. కిలడి, తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, తెన్కాశి ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు విస్తృతం చేయడం, మ్యూజియంల ఏర్పాటు, ఎగ్మూర్ మ్యూజియంలో సింధులోయ నాగరికత ఆవిష్కరణ, మహాబలిపురం ప్రగతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ, నిధులను కేటాయించారు. ఈ ఏడాది రూ.3,500కోట్లతో లక్ష గృహాలను నిర్మించనున్నారు. అప్పులు రూ.9 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు రూ.9 లక్షల కోట్లను దాటింది. బడ్జెట్లో ఆదాయ వ్యయ వివరాల సమయంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లోటు రూ. 41,634 కోట్లుగా చూపించారు. రానున్న కాలంలో ఈ లోటు క్రమంగా తగ్గుతుందని వివరించారు. 2025–26 ప్రభుత్వం 1,62,096.76 కోట్ల అప్పులు తీసుకునేందుకు నిర్ణయించింది. అలాగే, 55,844.53కోట్ల విలువగల అప్పును తిరిగి చెల్లించనున్నారు. గత ఏడాది 8 లక్షల కోట్లుగా అప్పులు ఉండగా ప్రస్తుతం రూ. 9 లక్షల కోట్లను దాటింది. ఇక, బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శనివారం వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేయనున్నారు. సోమవారం నుంచి బడ్జెట్ చర్చ. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు శాఖల వారీగా నిధుల కేటాయింపు చర్చ జరుగుతుందని స్పీకర్ అప్పావు ప్రకటించారు. బడ్జెట్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎర్న్డ్ లీవ్ సరెండర్ సిస్టమ్ను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని 40వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. బడుల్లో 1,721 పీజీ టీచర్ల నియామకానికి చర్యలు రెండు సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లతో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు లేదా ట్యాబ్ల పంపిణీ పాఠశాలలో చెస్ క్రీడపై మక్కువ పెంచే విధంగా పాఠ్యాంశం, వ్యాయామ పాఠ్యాంశాలలో మార్పునకు నిర్ణయం. కున్నూరు, నత్తంచైన్నె ఆలందూరు, విక్రవాండి, సెయ్యూరు సహా 10 చోట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఏర్పాటు. యువజన క్రీడల శాఖకు రూ. 572కోట్ల కేటాయింపు. మొబైల్ వైద్య సేవలతో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు పరికరాల కొనుగోలుకు రూ. 40 కోట్లు కేటాయించారు. క్యాన్సర్ను ప్రారంభంలోనే గుర్తించే పరికరాన్ని రూ.110 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ దిశగా టీకాలు వేయడానికి రూ. 36 కోట్లు, కాంచీపురంలో అన్నా స్మారక క్యాన్సర్ ఆస్పత్రి హోదా పెంపునకు రూ.120 కోట్లు అంటూ తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖకు రూ.21,096 కోట్లు కేటాయించారు. హొసూరులో రూ.400 కోట్లతో టైడల్ పార్క్, సైన్స్ సెంటర్ ఏర్పాటు, విరుదునగర్లో మినీ టైడల్ పార్క్, మదురై మేలూరు, కడలూరులలో పాదరక్షల పార్క్ను రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు కేటాయించనున్నారు. పుదుకోట్టైలో 200 ఎకరాల్లో కొత్త పారిశ్రామక వాడ ఏర్పాటు, పరందూరులో కొత్త విమానాశ్రయ ఏర్పాటు పనులు త్వరలో వేగవంతం చేయనున్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించే విభాగానికి రూ.3,915కోట్లు కేటాయించారు. స్పేస్ రంగంలో పరిశోధనలు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిధులు అంటూ ఎంఎంఎస్ఈ విభాగానికి రూ.1,918 కోట్లు కేటాయించారు. చైన్నె కార్పొరేషన్ రూ. 50 కోట్లతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఐటీశాఖకు రూ.131కోట్ల కేటాయింపు. వాటర్ మేనేజ్మెంట్ పథకం అమలుకు రూ.2వేల కోట్లు. వెల్లిమలై, ఆలియారు పరిధిలో రూ.11, 721 కోట్లతో కొత్తగా 2 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు. విద్యుత్శాఖకు రూ. 21,168 కోట్ల కేటాయింపు. మత సామరస్యాన్ని పరిరక్షించే గ్రామ పంచాయతీలను ప్రతి ఏటా 10 ఎంపిక చేయనున్నారు. తలా ఒక కోటి అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక నిధి కేటాయింపు. చైన్నె, మదురై, కోయంబత్తూరుల కోసం 1,125 విద్యుత్ బస్సుల కొనుగోలు. 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రూ.125 కోట్లు కేటాయింపు. చైన్నె సైదా పేటలో రూ. 110 కోట్లతో 190 గృహాల నిర్మాణం. రామనాథపురంలో రూ.21 కోట్లతో నావల్ ఎగ్జిబిషన్. కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చైనె శివారులో 2 వేల ఎకరాల్లో గ్లోబల్ సిటీ రూపకల్పన, ఉమ్మడి తాగునీటి పథకం అమలుకు రూ. 21,678 కోట్ల కేటాయింపు, చైన్నెకు తాగు నీరు అందించేందుకు కోవలం– తిరుప్పోర్ మధ్య రూ. 350 కోట్లతో కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం. పది కార్పొరేషన్లలో సీనియర్ సిటిజన్ల కోసం రూ.10 కోట్లతో అన్బుచోళై మయంల ఏర్పాటు. -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కార్తీ
తమిళసినిమా: నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన మెయ్యళగన్ చిత్రం సద్విమర్శలతో పాటు, ప్రేక్షకాదరణ అందుకుంది. తాజాగా కార్తీ నటించిన వా వాద్ధియార్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సర్ధార్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రంలో కార్తీ నటించనున్నారు. అదే విధంగా డానాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. దర్శకుడు మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబందించిన కథా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా మరో చిత్రానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ప్రస్తుత సమాచారం. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించనున్నారన్నదే ఆ న్యూస్. దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంతకు ముందు నటుడు సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క, వారణం ఆయిరం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మరో చిత్రం రూపొందాల్సి ఉండగా సూర్య, గౌతమ్ మీనన్ల మధ్య అభిప్రాయబేధాలు కారణంగా ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా సూర్య సోదరుడు, ప్రముఖ కథానాయకుడు కార్తీ , దర్శకుడు గౌతమ్ మీనన్ క్రేజీ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషం. గౌతమ్ మీనన్ ఇటీవల కార్తీకి కథ చెప్పినట్లు, అది నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రముఖ రచయిత జయమోహన్ రాసిన కథనే గౌతమ్మీనన్ కార్తీకి చెప్పినట్లు తెలిసింది. ఇది దర్శకుడు గౌతమ్ మీనన్ స్టైల్లోనే యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాఫోన్ పట్టి చాలా కాలం అయ్యింది. ఈయన నటుడిగా బిజీ అయ్యారు.నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ధృవనక్షత్రం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విదుదలకు ఎదురు చూస్తోంది. ప్రస్తుతం గౌతమ్మీనన్ ఒక మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
ఖైదీలను చిన్నచూపు చూడొద్దు
వేలూరు: జైలు నుంచి విడుదలైన ఖైదీలను చిన్న చూపు చూడకుండా వారిని సమాజంలో ఒకరిగా చూడాలని వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ధర్మరాజ్ అన్నారు. వేలూరు సెంట్రల్, మహిళా సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన ఖైదీలకు మాజీ జైలు ఖైదీల పునరావాస సంఘం, వెటర్నరీ శాఖ, జైళ్ల శాఖ సంయుక్తంగా కోళ్ల పెంపకంపై శిక్షణ తరగతులు జైలు ఆవరణలో జరిగాయి. ఆయన మాట్లాడుతూ క్షణికావేశంతో చేసిన తప్పులకు వీరందరూ జైలు శిక్ష అనుభవించి చేసిన తప్పును తెలుసుకొని వారి జీవితంలో మార్పురావడంతోనే జైలు నుంచి విడుదల చేశారన్నారు. అయితే ఈ సమాజం జైలు శిక్ష అనుభవించిన వారిని చిన్నచూపు చూడకుండా సమాజంలో ఒకరిగా చూడాలన్నారు. మాజీ ఖైదీలు ఇకపై చెడు అలవాట్లకు బానిస కాకుండా స్వయం ఉపాధిని ఎంచుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం సాయం చేసేందకు సిద్ధంగా ఉందన్నారు. అందుకే ప్రస్తుతం కోళ్ల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన కోల్లను కొనుగోలు చేసి ఇచ్చి వాటిని పెంచుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో చెడు అలవాట్లకు వెళ్లకుండా కుటుంబాన్ని పోషించుకోవాలన్నారు. జైలు ఖైదీల పునరావాసుల సంఘం కార్యదర్శి జనార్దన్, సీనియర్ న్యాయవాది విజయరాఘవులు, కోశాధికారి శ్రీనివాసన్, సభ్యులు శరవణన్, వెటర్నరీ విభాగం ప్రొఫెసర్ పాండియన్ పాల్గొన్నారు. -
అసెంబ్లీకి టాస్మాక్ స్కాం
● అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్ సాక్షి, చైన్నె: టాస్మాక్లో ఈడీ దాడుల నేపథ్యంలో రూ.1000 కోట్ల స్కాం జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారం శుక్రవారం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీ తొలి రోజు బడ్జెట్ దాఖలుకు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు సిద్ధమయ్యారు. ఆసమయంలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత జోక్యం చేసుకుని టాస్మాక్ స్కాం అంటూ నినదించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, చర్చకు పట్టుబట్టారు. శుక్ర, శనివారాలు కేవలం బడ్జెట్ దాఖలుకు మాత్రమే సమయం అని స్పీకర్ అప్పావు వారించారు. దీంతో ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి జోక్యం చేసుకుని స్పీకర్తో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారాలన్నీ సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. వీరు బయటకు వెళ్లగానే, ఇదే స్కాంను ఎత్తిచూపుతూ బీజేపీ సభ్యులు సైతం నినాదాలు అందుకున్నారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అలాగే, రాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి పెట్రేగిందని నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి మాజీ సీఎం పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. నాలుగైదు రోజులుగా టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగాయని, ఇందులో వెయ్యికోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నట్టు పేర్కొన్నారు. టాస్మాక్ ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు వస్తున్నదని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు. డీఎంకేను తరిమికొట్టే రోజులు సమీపంలోనే ఉందని, ప్రజలు ఆ మేరకు ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ ఈ స్కాంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ఈనెల 17న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. టాస్మాక్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈడీ చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటామని రాష్ట్ర ఎకై ్సజ్ మంత్రి సెంథిల్బాలాజీ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పసలేని బడ్జెట్ అసెంబ్లీలో తంగం తెన్నరసు బడ్జెట్ దాఖలు చేశారు. ఎలాంటి పన్నుపోటు, కొత్త భారం అన్నది లేకుండా పాత పథకాలకు నిధులు, కొత్త ప్రాజెక్టులు అంటూ ప్రసంగం ముగించారు. అయితే, ఈ బడ్జెట్పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు రుణాలను మాఫీ చేయని వాళ్లు, విద్యార్థులకు ఎక్కడి నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇస్తారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వాగ్దానాలను మమా అనిపించారని, ఈ బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ, ఈ బడ్జెట్లో ఏమీ లేదని, పాత వాటికి రంగులు వేసుకున్నారని విమర్శించారు. కాగా బడ్జెట్లో ఇండియన్ కరెన్సీ సింబల్ను తొలగించి తమిళ అక్షరంగా ‘రూశ్రీ’ వాడడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విభజన వాద రాజకీయాలను డీఎంకే చేస్తున్నట్టు మండిపడ్డారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొంటూ బడ్జెట్లో ప్రజలను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని మండిపడ్డారు. త్వరలో డీఎంకేను ఇంటికి పంపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
ఆర్డీఓ కార్యాలయం ముట్టడి
తిరుత్తణి: ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు తహసీల్దార్ అనుమతి నిరాకరణతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి శుక్రవారం నిరసన తెలిపారు. ఆర్కేపేట యూనియన్లోని ఎస్వీజీ.పురం గ్రామంలో 1999లో ఆదిద్రావిడ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా 297 పేద కుటుంబాలకు ఉచిత ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు అందజేశారు. ప్రస్తుతం వంద మంది అర్హులు ఇళ్లు నిర్మించుకుని నివాశముంటున్నారు. అయితే 200 మంది అర్హులు పేదరికంతో ఇళ్లు నిర్మించుకోలేక అద్దె ఇళ్లలో నివాశముంటున్నారు. ప్రభుత్వం ఉచిత ఇంటి పట్టాలు ఇచ్చి పాతికేళ్లు అవడంతో కొంతమంది అర్హులు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే పాతికేళ్లుగా ఇళ్లు నిర్మించుకోక పోవడంతో ఉచిత ఇంటి పట్టాలు రద్దు చేసినట్లు కొత్తగా ఇళ్లు నిర్మాణానికి అనుమతి లేదని తహసీల్దార్ రాజేష్కుమార్ బాధితులు ఇళ్ల నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు తెలిసింది. దీంతో బాధితులు ఆర్డీఓ కార్యాలయం ముట్టడించి తమకు న్యాయం చేయాలని ఉచిత ఇంటి స్థలాల్లో తాము ఇళ్లు నిర్మించుకున్న నివాసాలకు అనుమతివ్వాలని కోరుతూ ఆర్డీఓ దీపకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేసి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
తిరువల్లూరు: నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై న వారు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ఇటీవల గ్రూప్–4 పరీక్షలను నిర్వహించి మూడు నెలల క్రితం ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో విజయం సాధించిన వారికి ఇటీవల జిల్లాలకు నూతన ఉద్యోగులను కేటాయించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లాకు 20 మందిని కేటాయించగా వారు గ్రామీణభివృద్ధి శాఖ లో అసిస్టెంట్లుగా విధులను నిర్వహించనున్నా రు. నూతన ఉద్యోగులకు ఇటీవల శిక్షణ సైతం ఇచ్చారు. శిక్షణ పూర్తయిన క్రమంలో నూతన ఉద్యోగులు కలెక్టర్ ప్రతాప్ను కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలకు ఎంపికై నవారు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. విధి నిర్వహణలో అవినీతికి దూరంగా వుండాలన్న ఆయన, ఉద్యోగుల పనితీరు ఆదర్శంగా వుండాలని సూచించారు. ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు. -
ఏవీఐటీలో నెట్రిక్స్ 2కే 25 ప్రాజెక్ట్ పోటీలు
సాక్షి, చైన్నె: ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఏవీఐటీ) కంప్యూటర్ సైన్న్స్ ఇంజినీరింగ్ విభాగం నెట్రిక్స్ 2కే 25 పేర్లతో జాతీయస్థాయి ప్రాజెక్టు పోటీల సింపోజియం విజయవంతంగా జరిగింది. జాతీయ స్థాయి టెక్నాలజీ పోటీగా పయనూర్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమానికి దేశంలోని వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి, జ్ఞానాన్ని మార్పిడి చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది ఏఐసీటీఈ విజన్ ఆఫ్ ఏఐ ఫర్ ఆల్ విధానం మేరకు విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకునేందుకు, అమలు చేయడానికి వీలు కల్పించారు. గ్లోబల్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ సాయినారాయణన్ గోపాలకృష్ణన్ ఈ కార్యక్రమంలో ఏఐ, విద్య, వైద్యం వినోదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వివిధ రంగాలపై ప్రభావం గురించి వివరించారు. విద్యా సంస్థకు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎస్ బాలకృష్ణన్ , ప్రిన్సిపల్ డాక్టర్ జి.సెల్వకుమార్, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ముత్తుకుమరన్, సమన్వయకర్త డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు. -
28న టీవీకే సర్వసభ్య సమావేశం
● ఏర్పాట్లలో విజయ్ సాక్షి, చైన్నె: తమిళగ వెట్రికళగం తొలి సర్వ సభ్య సమావేశం నిర్వహణకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సిద్ధమయ్యారు. ఈనెల 28న తిరువాన్మియూరులో సమావేశానికి కసరత్తులు చేపట్టారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి పార్టీపరంగా 121 జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు 95 జిల్లాలకు కార్యదర్శులు, ఇతర కమిటీ సభ్యులను ప్రకటించారు. గురువారం మరో 19 జిల్లాల కార్యదర్శులను నియమించారు. ఇంకా ఏడు జిల్లాలకు మాత్రమే కమిటీని ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రజల్లోకి వెళ్లే విధంగా తీర్మానాలు, హామీలను ప్రకటించేందుకు విజయ్ కసరత్తులు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 28న సర్వసభ్య సమావేశ నిర్వహణకు ఆయన యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జిల్లాల కమిటీలు, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రాష్ట్ర కమిటీకి సంబంధించి పూర్తి పదవుల భర్తీ ప్రక్రియ ముగియనున్నట్టు చెబుతున్నారు. ఈప్రక్రియ తర్వాత సర్వ సభ్య సమావేశాన్ని సమావేశపరిచి ఏప్రిల్ రెండు లేదా మూడో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లే విధంగా విజయ్ ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంటున్నారు. -
నాలుగు వాహనాలు ఢీ
– 10 మందికి తీవ్రగాయాలు సేలం: విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైన్నె వైపు వెళుతున్న లోడు లారీ తెన్పాసరై వద్ద వెళుతుండగా సైక్లిస్ట్ను తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ వెనుక వస్తున్న మరొక లారీ, ప్రభుత్వ బస్సు, కారు వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని పోలీసులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో పేలిన ఫ్రిడ్జ్ తిరుత్తణి: తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో మందులు వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే గర్భిణులు, చంటి పిల్లల తల్లులను ఆస్పత్రి సిబ్బంది కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో 15 మంది గర్భిణులు, చంటి పిల్లల తల్లులు చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వార్డులోని మందులు నిల్వ వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగలు చోటుచేసుకున్నాయి. దీంతో గర్భిణులు, చంటి బిడ్డల తల్లులను అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కాపాడి సమీపంలోని వార్డుకు తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి చేరుకుని అత్యవసర ద్వారం అద్దాలు కూల్చి వార్డులో కమ్ముకున్న పొగలను శుభ్రం చేసి సకాలంలో స్పందించి గర్భిణులు, బాలింతలను కాపాడిన ఆస్పత్రి సిబ్బంది సేవలను వైద్యులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కొనియాడారు. వాహనం ఢీకొని చిన్నారి దుర్మరణం తిరువళ్లూరు: ఫోర్క్లిఫ్ట్ వాహనం ఢీకొని 8 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కల్లకురుచ్చి ప్రాంతానికి చెందిన చెల్లముత్తు, ప్రియారాణి దంపతులు తిరువళ్లూరుకు వచ్చి గత మూడు నెలల నుంచి ప్రయివేటు ఇటుక బట్టీలో పనిచేస్తున్నా రు. వీరికి భువనేశ్వరి అనే 8 నెలల చిన్నారి వుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రియారాణి తన 8నెలల చిన్నారిని చెట్టు కింద పడుకోబెట్టి పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో ఇటుక రాయిని బట్టీ వద్దకు తీసుకొచ్చిన ఫోర్క్ లిఫ్ట్ అపరేటర్ నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారి పై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనపై మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య తిరువొత్తియూరు: చైన్నె వడపళనిలో కుటుంబకలహాలతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె, వడపలని వెస్ట్ శివాలయం వీధికి చెందిన ఆర్ముగం (47) కారు డ్రైవర్. ఇతనికి మద్యం అలవాటు ఉంది. రాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఆర్ముగం ఇంటికి వచ్చాడు. భార్య రాణితో గొడవ పడ్డాడు. విరక్తి చెందిన రాణి అతనిపై కోపగించుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆర్ముగం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత బయటికి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త శవముగా వేలాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోఈసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి నిద్రతో సంపూర్ణ ఆరోగ్యం
కొరుక్కుపేట: మంచి నిద్రతో సంపూర్ణ ఆర్యోగం లభిస్తుందని అపోలో ఆస్పత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్లీప్ హెల్త్ హెచ్ఓడీ డాక్టర్ కార్తీక్ మాదేశ్ అన్నారు. అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి – వానగరం ఆధ్వర్యంలో ప్రపంచ స్లీప్ డే 2025ను పురస్కరించుకుని స్థానిక వానగరం జంక్షన్ వద్ద నిద్రపై ప్రజల్లో అవగాహన పెంచారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున పాల్గొని తలదిండ్లను ప్రదర్శిస్తూ మానవహారంగా నిద్రపై అవగాహన కల్పించారు. డాక్టర్ కార్తీక్ మాదేశ్ మాట్లాడుతూ తక్కువగా నిద్ర పోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, బలహీనమైన రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్య రుగ్మతలతో ముడిపడి ఉందని అన్నారు. మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. న్యూరాలజీ హెచ్ఓడీ , సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రభాష్ ప్రభాకరన్, అపోలో ఆస్పత్రి వానగరం వైద్యులు డాక్టర్ మోహనకృష్ణన్, డాక్టర్ రాహుల్ రాఘవ్ మీనన్, వానగరం, తిరువెర్కాడు మున్సిపాలిటీ చైర్మన్ మూర్తి పాల్గొన్నారు. -
నేతలను తీర్చిదిద్దడమే లక్ష్యం
సాక్షి,చైన్నె: భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలను అవపోషణ చేసుకున్న నాయకులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకెళ్తామని నయంతా విశ్వవిద్యాలయం ప్రకటించింది. చైన్నెలో కొత్తగా ఈ విశ్వవిద్యాలయ ఆవిర్భావ ప్రకటనను శుక్రవారం చేశారు. మొదటి బ్యాచ్ ఆగస్టు 2025లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. అత్యాధునిక క్యాంపస్తో ఉత్తమ పారిశ్రామక వేత్తల బృందం మద్దతుతో ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భవించినట్టుగా నయంతా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సీఈఓ రంజన్ బెనర్జీ తెలిపారు. స్థానికంగా ఈ వివరాలను ఆయన వెల్లడిస్తూ, నయంత విశ్వవిద్యాలయం పూణేలో 100 ఎకరాలతో రూపుదిద్దుకుని ఉందన్నారు. నయంతా అంటే శ్రీన్యూ హోప్ఙ్ అని అర్థం వస్తుందని, భారతదేశం అంతటా విద్యార్థులకు ఆలోచించే విద్యను అందించడంలో ముందుంటామన్నారు. విద్యాసంస్థ వ్యవస్థాపక సభ్యుడు రమేష్ మంగలేశ్వరన్, అకడమిక్ హెడ్ డి.పార్థసారథి పాల్గొన్నారు. -
మాతృభాషను మరువొద్దు
కొరుక్కుపేట: బతుకుదెరువు కోసం ఎన్ని భాషలనైనా నేర్చుకోండి కానీ, మాతృభాషను మాత్రం మరువొద్దని అఖిల భారత తెలుగు సమాఖ్య, ఎస్కేడీటీ పాఠశాలల అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. చైన్నె విల్లివాకంలోని శ్రీ కనకదుర్గ తెలుగు ప్రాథమిక పాఠశాల 78వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పాల్గొన్న సీఎంకే రెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోను విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. మాతృభాషను మరువొద్దని విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉద్యోగ విరమణ పొందనున్న శ్యామలకుమారిని ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు లయన్ జనక కోటయ్య బహుమతులను ప్రదానం చేశారు. మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షుడు విస్తాలి శంకరరావు, ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభారాజా, హెచ్ఎం రేణుక, సీఎం కిషోర్, పోరూరు శ్రీనివాసరావు, ఎన్. నర సింహులు, శేషగిరిరావు, పీవీహెచ్ కామేశ్వరరావు, హెచ్ఎం మోహన్నాయుడు పాల్గొన్నారు. -
TN Rupee Symbol Row: అవమానంగా ఫీలవుతున్నారా?
చెన్నై: తమిళనాట రూపాయి చిహ్నం మార్పు రగడపై.. ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతుల్లో ఈయన రూపొందించిన రూపాయి గుర్తును తొలగించి.. ఆ స్థానంలో రూ. అనే అర్థం వచ్చేలా తమిళ పదం డీఎంకే ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. భాషా యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ బీజేపీ వర్సెస్ కేంద్రంగా పరస్పర విమర్శలతో సాగుతోందీ వ్యవహారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తానేం తప్పుబట్టబోనని ఉదయ్ కుమార్ అంటున్నారు.మేం రూపొందించే అన్ని డిజైన్లకు పేరొస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాగే.. అందరు వాటిని మెచ్చుకోవాలనీ లేదు. ప్రతీ ఒక్కరూ తమ పనిలో విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విమర్శలను సానుకూలంగా తీసుకుని.. ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాది అదే ధోరణి. అంతమాత్రాన ఇదేదో నన్ను, నా పనిని అవమానించడం అని నేను అనుకోను. రూపాయి సింబల్ను రూపొందించడాన్ని గర్వంగా భావిస్తున్నానన్న ఆయన.. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తానేం వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. చిహ్నం మార్పునకు ప్రభుత్వానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.. అవేం నన్ను అసంతృప్తికి గురి చేయలేదు ఆయన వ్యాఖ్యానించారు.నాడు నేను నాకు అప్పగించిన పని గురించి మాత్రమే ఆలోచించా. సాధారణంగా.. అర్థవంతంగా ఉండే ఒక చిహ్నం రూపొందించాలని ఒకింత ఆందోళనగానే పని చేశా. ఆ చాలెంజ్లో విజయం సాధించా. అంతేకానీ, వివాదంగా మారాలని.. మారుతుందనిగానీ అనుకోలేదు అని ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారాయన. ఇదిలా ఉంటే.. 2009లో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రూపాయికి ఓ గుర్తును సూచించాలని బహిరంగంగా పోటీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 3,331 డిజైన్లలో ఐదు షార్ట్ లిస్ట్ చేశారు. అందులో ప్రొఫెసర్ ఉదయ్ పంపిన గుర్తు ఫైనలైజ్ అయ్యింది. ఇది దేవనాగరి లిపి र, 'ra', లాటిన్లో ఇంగ్లీష్లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో రెండు సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి. అయితే.. ఓ తమిళ వ్యక్తి రూపొందించిన గుర్తునే మార్చేసి.. డీఎంకే ప్రభుత్వం దారుణంగా అవమానపరిచిందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ విమర్శల వేళ దాని రూపకర్తే ఆ చర్యను తేలికగా తీసుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: రూపాయి సింబల్ సృష్టికర్త మామూలోడు కాదండోయ్! -
రూ. 5 కోట్ల అప్పు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
సాక్షి, చెన్నై: ఆయన డాక్టరు, ఆమె న్యాయవాది. వీరికి ఇద్దరు పిల్లలు..ఎంతో ఆనందకరంగా ఉన్న వీరి జీవితాన్ని అప్పులు కాటేశాయి. అప్పులు రూ. 5 కోట్లకు చేరడంతో చెల్లించ లేని పరిస్థితులలో జీవితాన్ని కుటుంబం అంతా ముగించేశారు. చెన్నై తిరుమంగళంలో గురువారం ఉదయం ఈఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. చెన్నైలో అన్నానగర్, తిరుమంగళం పరిధిలోని 17వ క్రాస్ స్ట్రీట్లోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ ప్లాట్లో డాక్టర్ బాలమురుగన్ (52) కుటుంబం నివాసిస్తూ వచ్చింది. ఆయన భార్య సుమతి (47) హైకోర్టులో న్యాయవాది. ఈ దంపతులకు జశ్వంత్కుమార్ (19), లింగేశ్కుమార్(17) కుమారులు. పెద్దవాడు ప్లస్–2 ముగించి డాక్టరు కావాలన్న కలతో నీట్కు సిద్ధమవుతున్నాడు. రెండవ వాడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. బాల మురుగన్కు అన్నానగర్లో రెండు, రెడ్ హిల్స్లో ఒకటి అంటూ పలు చోట్ల స్కాన్ సెంటర్లు ఉన్నాయి. రుణాలు అధికమై.. గురువారం ఉదయం బాలమురుగన్ డ్రైవర్ విజయ్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకు డాక్టర్ తెరవక పోవడంతో పక్కన ఉన్న ప్లాట్ల వారి సహకారంతో వారి బంధువులకు సమాచారం అందించాడు. వారు తిరుమంగళం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, పోలీసులు ఆ ప్లాట్కు చేరుకుని తలుపు పగల కొట్టి వెళ్లి చూడగా ఓ గదిలో ఒకే ఫ్యాన్కు సుమతి, చిన్న కుమారుడు లింగేశ్వర్ ఉరివేసుకుని మృత దేహాలుగా బయటపడ్డారు. మరో గదిలో వేర్వేరు ఫ్యాన్లకు బాల మురుగన్, పెద్దకుమారుడు జశ్వంత్కుమార్ మృతదేహాలుగా వేలాడుతుండటంతో కలకలం రేగింది. వీరి ఆత్మహత్య సమాచారంతో ఆ పరిసరాలలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న స్కాన్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది ఆ ఇంటి వద్దకు పరుగులు తీశారు. కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, సకాలంలో, నిర్ణీత సమయంలో జీతాలను ఇస్తూ, ఆదరిస్తూ వచ్చిన యజమాని కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించినపోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. విచారణలో స్కాన్ సెంటర్ల విస్తరణ కోసం రూ. 5 కోట్ల వరకు అప్పులు చేసినట్టు వెలుగు చూసింది. నెలకు రూ.5 లక్షల వరకు ఈఎంఐలు కడుతుండటం, మరికొందరికి వడ్డీలు చెల్లిస్తుండటం వెలుగు చూసింది. ప్రస్తుతం వడ్డీ చెల్లించ లేని పరిస్థితులలో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు పెరిగినట్టు గుర్తించారు. అప్పులు కట్ట లేని పరిస్థితులలో తీవ్ర మనోవేదనతో ఉన్న డాక్టర్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో సుమతి, చిన్నకుమారుడు ఒకే ఫ్యాన్కు ఉరి పోసుకుని ఉండటంతో వారిని హతమార్చి, ఆతర్వాత పెద్దకుమారుడిని ఉరివేసి హతమార్చి, చివరకు డాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. -
₹పై లొల్లి.. మరి అప్పుడేం చేశారు?
చెన్నై/న్యూఢిల్లీ: కేంద్రం-తమిళనాడు మధ్య భాషా వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రూపాయి సింబల్(Rupee Symbol) ₹ ప్లేస్లో తమిళ అక్షరం చేర్చిన డీఎంకే ప్రభుత్వం తీరుపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళంలోనే ఆమె కౌంటర్ ఇచ్చారు. అంత అభ్యంతరాలు ఉంటే.. గతంలోనే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారామె. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును (₹) తొలగించి.. రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది స్టాలిన్ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు చెలరేగాయి. బీజేపీ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ చేశారు. గతంలో.. యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్యపక్షంగా ఉంది. ఆ సమయంలో ఆ గుర్తును తీసుకొచ్చారు. పైగా ‘₹’ సింబల్ను రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే. ఇప్పుడు దీన్ని పక్కనపెట్టడం ద్వారా.. డీఎంకే ఓ జాతీయ గుర్తును తిరస్కరించడమే కాకుండా.. తమిళ యువకుడి సృజనాత్మకతను విస్మరిస్తోంది అని సీతారామన్ అన్నారు. రూపాయి చిహ్నం ‘₹’ అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందిందని.. ప్రపంచ ఆర్థిక లావాదేవీల్లో దేశానికి గుర్తింపుగా నిలుస్తోందని అన్నారామె. అలాగే.. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా? అని డీఎంకేను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు. అలాంటిది జాతీయ చిహ్నాలను తొలగించడమంటే.. ఆ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించడమే అని వ్యాఖ్యానించారామె. డీఎంకే చేసిన పని జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీసే చర్యలన్న ఆమె.. ఇది భాష, ప్రాంతీయ దురభిమానానికి ఉదాహరణగా పేర్కొన్నారు.దేశ ఐక్యతను బలహీనపరిచే, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. -
రాష్ట్ర ప్రజల సంక్షేమమే డీఎంకే ధ్యేయం
మంత్రి దురై మురుగన్ వేలూరు: రాష్ట్ర ప్రజల సంక్షేమమే డీఎంకే ధ్యేయమని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ 72వ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని గంగనెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే నందకుమార్ సొంత నిధులతో జిల్లాలోని 1,072 మంది గర్భిణులకు సీమంతం సామగ్రి పంపిణీ, అన్నదానం, సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ కుటుంబంలో మీకు సీమంతం చేశారో లేదో తనకు తెలియదు గానీ మీ అన్నగా మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా, నాన్నగా ఎమ్మెల్యే నందకుమార్ ఇంత మందికి సీమంతం చేయడంతో పాటువస్త్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి సహాయకాలు దేశంలో ఎవరూ చేయబోరని, ఇది డీఎంకేలోని ప్రజా ప్రతినిధులతోనే సాధ్యమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని మీరు సరైన సమయంలో వైద్యపరీక్షలు చేసుకుని ఈ సమాజానికి ఉపయోగ పడేలా పురిటిబిడ్డను ప్రసవించాలని, ఆరోగ్యంగా పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, మేయర్ సుజాత, జెడ్పీ చైర్మన్ బాబు, మాజీ ఎంపీ మహ్మద్ సఖీ తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా
వేలూరు: చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని కోరుతూ తమిళనాడు చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాట్పాడిలోని ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఈ ధర్నాకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి మణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరుకు రైతులకు ఎకరా చెరుకు విత్తనానికి రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వాలని, అలాగే ఫ్యాక్టరీ పంపే ఒక టన్ను చెరుకు ధర రూ.5,500 ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు అనేక కష్టాలు పడి ఫ్యాక్టరీలకు చెరుకును పంపితే బిల్లులు ఇవ్వడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేలా చూడాలన్నారు. ఈ ధర్నాలో ఆ సంఘం రెతు నాయకులు మణి, కన్నయ్యనాయుడు, రంగనాధన్, బాల వినాయకం రైతులు పాల్గొన్నారు. -
జీరో డయాలసిస్ లక్ష్యం
– ఘనంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవ ర్యాలీ సాక్షి, చైన్నె: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక మిషన్ విశ్వవిద్యాలయం, చైన్నె ఆరుపడై వీడు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాంచీపురం క్యాంపస్లోని అలైడ్ హెల్త్ సైన్సెస్ కళాశాల, శ్రీ మెడికల్ ఫౌండేషన్, ఏకేజీ ఫెర్టిలిటీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ జరిగింది. మూత్రపిండాల ప్రాముఖ్యత, వాటి రక్షణ అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఆ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ గణేషన్ మార్గదర్శకంలో డీన్ ప్రొఫెసర్ డాక్టర్ సెంథిల్కుమార్ పర్యవేక్షణలో ర్యాలీతోపాటుగా అవగాహన శిబిరం జరిగింది. గ్యా స్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నీలమేఘం, కిడ్నీ హెల్త్ ఇండియా ప్రతినిధులు, డాక్టర్ ప్రభు కాంచి, వాలంటీర్ ఆర్గనైజర్ శుభాశాంతిని పళనిస్వామి, చెంగల్పట్టు వైద్య కళాశాల నెఫ్రాలజీ విభాగంలో నిపుణుడు డాక్టర్ నాగరాజన్, మెడికల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శశికుమార్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వరి, డైరెక్టర్ శ్రీ ముత్తురాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు భాను, దినేష్ ,మెడికల్ ఫౌండేషన్కు చెందిన తౌఫిక్ అహ్మద్, కావ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలతో శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే, 2050 నాటికి జీరో డయాలసీస్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే రీతిలో అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించారు. -
దీక్షిత్ శెట్టి కోలీవుడ్ ఎంట్రీ
తమిళసినిమా: కన్నడం, తెలుగు భాషల్లో నటిగా మంచి గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి తాజాగా కోలీవుడ్లో కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన ఇంతకుముందు తెలుగులో నాని కథానాయకుడిగా నటించిన దసరా చిత్రంలో ముఖ్యపాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కన్నడంలో ఫినిక్ తదితర ప్రాంతాల్లో నటించారు. కాగా ఇప్పుడు తమిళంలో శ్రీసరవణ ఫిలిం ఆర్ట్స్ పతాకంపై జీ.సరవణన్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బిగ్బాస్ రియాల్టీ గేమ్ షో ఫేమ్ అయినా జీనత్ కథానాయకిగా పరిచయం అవుతున్నారు. సారా కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు భాషా భేదం లేకుండా దక్షిణాదిని దాటి పాన్ ఇండియా చిత్రాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. మలేషియాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం నటుడు దీక్షిత్ శెట్టి తన పాత్ర కోసం మేకోవర్ అయ్యి నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి వెంకీ సూరినేని ,ఆయాగ్రహణం అందిస్తున్నారని, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. -
‘ఫిడే’ విజేతకు ప్రోత్సాహం
సాక్షి, చైన్నె: ఫిడే ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్లో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన చదరంగం ఆటగాడు ప్రణవ్ వెంకటేషన్కు నగదు ప్రోత్సాహాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఆ క్రీడాకారుడ్ని సత్కరించి రూ. 20 లక్షలు చెక్కును అందజేశారు. విద్య, క్రీడలపరంగా తమిళనాడును అత్యుత్తమ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. క్రీడాకారులను ప్రోత్సహించేలా పలు పథకాలను అమలు చేస్తున్నారు. క్రీడల్లో పతకాలను సాధించిన వారికి నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గత నెల జరిగిన ఫిడే ప్రపంచ జూనియర్ చాంపియన్ షిఫ్ టోర్నమెంట్లో తమిళనాడుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ విజయకేతనం ఎగురవేశాడు. చైన్నెకు చేరుకున్న ప్రణవ్ గురువా రం సచివాలయంలో సీఎం స్టాలిన్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. తాను సాధించిన పతకాన్ని సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ను సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లు సత్కరించారు. ప్రణవ్ను మరింత ప్రోత్సహించే విధంగా రూ. 20 లక్షలు నగదు ప్రోత్సాహానికి గా ను చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ మురుగానందం, క్రీడలశాఖ కార్యదర్శి అతుల్య మి శ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జె. మేఘనాథరెడ్డి పాల్గొన్నారు. ముందుగా సీఎం స్టాలిన్తో ఎంఎస్ స్వా మినాథన్ పరిశోధన సంస్థ అధ్యక్షురాలు, శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ భేటీ అయ్యారు. చైన్నె రామాపురంలో తన తండ్రి హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పేరిట పార్కు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రూ.20 లక్షల నజరానా -
ట్రామా విజయం సాధించాలి
తమిళసినిమా: టర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.ఉమామహేశ్వరి నిర్మించిన చిత్రం ట్రామా. నటుడు వివేక్ ప్రసన్న, నటి పూర్ణిమ రవి, ఆనంద్ నాగ్, చాందిని తమిళరసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. నిళల్ గళ్ రవి, మారి ముత్తు, ప్రదోష్, వైయాపురి, రమ, నమో నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా తంబిదురై మారియప్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేసిన ఈయన ఒక కార్పొరేట్ ఉద్యోగి అన్నది గమనార్హం. అజయ్ శ్రీనివాస్ చాయాగ్రహణం, రాజ్ ప్రతాప్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఆల్ఫా 3 ఎంటర్టైనర్ సంస్థ అధినేత ఇళమారన్ పొంది విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రామా చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్లోని పీటీ త్యాగరాజన్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నటుడు కే.భాగ్యరాజ్, నటుడు రాధారవి, మాజీ శాసనసభ్యురాలు విజయదారణి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు తంబిదురై మారియప్పన్ మాట్లాడుతూ తాను కథలు చేత పట్టి దర్శకుడిగా అవకాశాల కోసం చాలా మంది నిర్మాతల చుట్టూ తిరిగానని, ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో తన ఫ్రెండ్స్ సపోర్ట్ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఇది మూడు కథలతో కూడిన ఆంథాలజీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు కే.బాగ్యరాజ్ మాట్లాడుతూ ఎన్ని కథా చిత్రాలు రూపొందినా యువకులు ప్రేమించకపోయినా, ప్రేమ గురించే చర్చించుకుంటారని, అలాంటిది ఈ చిత్రం దర్శకుడు తంబిదురై తొలి ప్రయత్నంలోనే మూడు కథలతో కూడిన వైవిధ్య భరిత ఆంథాలజీ కథా చిత్రం చేయడం విశేషమని అన్నారు. ట్రామా అంటే అర్థం ఏమిటిని అడగ్గా బాధింపు అని దర్శకుడు చెప్పారన్నారు. యూనిట్ సభ్యులు ఎంతో శ్రమించి రూపొందించిన ఈ ట్రామా చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
మరో 19 జిల్లాలకు కార్యదర్శులు
సాక్షి, చైన్నె: మరో 19 జిల్లాలకు కార్యదర్శులను నియమిస్తూ తమిళగ వెట్రి కళగం నేత విజయ్ గురువారం ప్రకటించారు. ఇందులో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగాను, చిన్న నియోజకవర్గాలు రెండింటిని ఓ జిల్లాగాను ప్రకటించారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి పార్టీపరంగా 121 జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుతలుగా 95 జిల్లాలకు కార్యదర్శులు, ఇతర కమిటీ సభ్యులను ప్రకటించారు. వీరందరితోనూ పోటోలు దిగుతు ఆ యా పదవుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను విజయ్ స్వయంగా అందిస్తూ వస్తున్నారు.ఈ పరిస్థితులలో గురువారం మరో 19 జిల్లాల కార్యదర్శులను నియమించారు. దీంతో పార్టీ కార్యాలయం ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. ఈ మరో ఏడు జిల్లాలకు మాత్రమే ఇక కమిటీ ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రకటన తరువాయి విజయ్ రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గురువారం విజయ్ను చూసేందుకు తన కుమారుడితో వచ్చిన ఓ మహిళకు అనుమతి దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనతో ఆందోళనకు దిగడంతో అక్కడున్న పార్టీ వర్గాలు అడ్డుకున్నాయి. -
2026 తరువాతే ఆ చిత్ర అప్డేట్
తమిళసినిమా: నటుడు విజయ్ ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న తన 69వ చిత్రం జననాయకన్ చివరిదనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడమే అదే విధంగా ఈయన ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం పార్టీ 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతోంది. దీంతో ప్రస్తుతం విజయ్ తాను నటిస్తున్న చిత్రాన్ని ఎన్నికలకు ముందు తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే విజయ్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన గోట్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే గోట్ చిత్రం చివర్లో గోట్ వెర్సెస్ ఓజీ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభును గోట్ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు? అసలు అది ఉంటుందా ? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ గోట్ చిత్రం సీక్వెల్ గోట్ వెర్సెస్ ఓజీ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ 2026 తరువాత ఉంటుందని పేర్కొన్నారు. దీంతో విజయ్ మళ్లీ నటించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన సమాధానం ఉండటంతో ఆయన అభిమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే వెంకట్ ప్రభు వ్యాఖ్యలపై నటుడు విజయ్ వర్గం ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు ప్రస్తుతం చైన్నె 28 చిత్రానికి పార్టు – 3 చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. -
ప్రదీప్ రంగనాథన్తో ముగ్గురు బ్యూటీస్?
అను ఇమాన్యువేల్ఐశ్వర్య శర్మ తమిళసినిమా: ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న యువ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విజయం సాధించాయి. అందులో రెండు చిత్రాలకు ప్రదీప్ రంగనాథన్నే దర్శకుడు కావడం విశేషం. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. కాగా ప్రస్తుతం నటుడు ప్రదీప్ రంగనాథన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ ఒకే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తదుపరి ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న భారీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారన్నదే ఆ ప్రచారం. మహిళా దర్శకురాలు సుధా కొంగర శిష్యుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలిసింది. కాగా ఇందులో ప్రేమలు చిత్రం ఫేమ్ మమిత బైజూ నాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటి అను ఇమాన్యువేల్, సీరియల్ నటి ఐశ్వర్య శర్మ కూడా కథానాయికలుగా నటించబోతున్నట్లు సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ -
గుంటూరు రుచులతో ఫుడ్ ఫెస్టివల్!
సాక్షి, చైన్నె: ఫెదర్స్ హోటల్లో గుంటూరు నుంచి గోదావరి వరకు నినాదంతో వంటకాల రుచులు కలిగిన ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం ఏర్పాటు కానుంది. ఆంధ్ర – తెలంగాణ రుచులను భోజన ప్రియులకు అందించేలా మెను సిద్ధం చేశారు. ఆంధ్ర, తెలంగాణ రుచులు, వివిధ వారసత్వ వంటకాలను ఇక్కడి ఆహార ప్రియులకు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గుంటూరు ముచ్చటైన కారంతో ఉండే రుచులు, గోదావరి సుగంధ ద్రవ్యాలు, తీరప్రాంత రుచికరమైన వంటకాల వరకు, ఈ ఆహార ఉత్సవంలో కొలువు దీర్చనున్నారు. చట్నీలు, కూరలు, సువాసన గల బిర్యానీలు, సంప్రదాయ స్వీట్లు, ఆవకాయ పచ్చడి, గోంగూర మాంసం, మామిడికాయ పప్పు, గుంటూరు కోడి కూర, రొయ్యలు వేపుడు, నెల్లూరు చేప పులుసు, తెలగపిండి ఎండు రొయ్యలు, కోడి పులావ్, ఆవకాయ అన్నం అంటూ బ్రహ్మాండ బఫేగా వంటకాలను అందిస్తున్నారు. ఈనెల 23వ తేదీ వరకు ఫెడర్స్ వాటర్ సైడ్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ సాగనున్నది. -
పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
● డిప్యూటీ సీఎం ఉదయనిధి ● 50 ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ ● బడులకు గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్లు సాక్షి, చైన్నె: తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు తరపున పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆదేశించారు. 50 ఎలక్ట్రిక్ ఆటోలను మహిళలకు పంపిణీ చేశారు. బడులకు గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు, వాతావరణ మార్పు శాఖ తరపున మహిళా స్వయం సహాయక సంఘాలకు 50 విద్యుత్ ఆటోల అందజేత కార్యక్రమం జరిగింది. ఈ ఆటోలకు డిప్యూటీ సీఎం ఉదయనిధి జెండా ఊపారు. అలాగే పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ వెబ్సైట్ వేదిక ద్వారా పర్యావరణ పరిరక్షణకు పరిష్కారాలను అందించనున్నారు. కొత్త పారిశ్రామిక కంపెనీలను నమోదుకు దోహదకరం కానుంది. అలాగే తమిళనాడు మార్కెట్ అవకాశాలను సృష్టించుకోవడానికి నూతన ఆవిష్కరణల ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాజెక్ట్గా ఈ వెబ్ సైట్ ఉంటుందని ప్రకటించారు. తమిళనాడు తీరంలో జీవనాడి, సంప్రదాయ స్థితి స్థాపకతలు, స్వదేశీ స్థిర ఆవాసాలు– వాతావరణ మార్పు, ఉత్తమ పద్దతుల పేరిట మూడు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పచ్చదనంతో కూడన వాతావరణం కల్పించిన దిండిగల్ జిల్లా పంచంపట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్,కరూర్ జిల్లా పూగలూరులోని ప్రభుత్వ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుచ్చి జిల్లా కాంచనాయకన్పట్టి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరిస్తూ, వారికి హరిత పాఠశాలలకు గాను సర్టిఫికెట్లను అందజేశారు. ఎలక్ట్రిక్ ఆటోలు.. రోజువారీ జీవితంలో వాతావరణాన్ని కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ ఉత్పత్తులకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం వంటి అంశాలపై అవగాహన ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటులతో సిద్ధం చేసి, ఎలక్ట్రిక్ ఆటోలను అందజేసి, అందులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ తమిళనాడును పర్వావరణ ముప్పు నుంచి పరిరక్షించే విధంగా వివిధ కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపు నిచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అవగాహన కల్పించాలని, తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు తరపున పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ను పూర్తిగా అమలు చేయాలని ఆదేశించారు. 50 ఎలక్ట్రిక్ ఆటలలో ఒకొక్కటి ధర రూ. 4.83 లక్షలుగా పేర్కొంటూ, ఈ ఆటోలు మహిళా స్వయం సహాయక బృందాలకు స్నాక్స్, రీసైకిల్ చేసిన ఉత్పుత్తులు, పర్యావరణ అనుకూల వస్తువలు అమ్మకాలు, తదితర వాటికి సైతం ఉపయోగకరంగా ఉంటే రీతిలో ఏర్పాటు జరిగినట్టు వివరించారు. , ఈ ఎలక్ట్రిక్ ఆటోలపై అవగాహన ప్రచారంలో అత్యాధునిక మైక్రోఫోన్ యాంప్లిఫైయర్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పసుపు రంగు బ్యాగ్, బయోడిగ్రేడబుల్ టంబ్లర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, చెక్క స్పూన్లు . రీసైకిల్ చేసిన కార్డ్బోర్డ్తో తయారు చేసిన గ్లాస్, ప్లేట్లు ఈ ఆటోల ద్వారా ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పర్యావరణ , అటవీ శాఖ అదనపు ప్రధానకార్యదర్శి సుప్రియ సాహూ, పంచాయతీ రాజ్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ భేడీ, ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్టర్ ఎ.ఆర్. రకుల్నాథ్, తమిళనాడు మహిళ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శ్రేయ పి సింగ్, కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ డాక్టర్ ఎం. జయంతి, చైర్మన్, తమిళనాడు వాతావరణ మార్పు ఉద్యమం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వివేక్కుమార్, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిసభ్యకార్యదర్వి ఆర్. కన్నన్ తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి.. పంచతంత్రం
విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధి వంటి ఐదు అంశాలను మెరుగు పరిచేందుకు నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎం స్టాలిన్ కోరారు. దీనిని సమగ్రంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘానికి సూచించారు. ● ఐదు సామాజిక అంశాల్లో మెరుగుదలే కీలకం ● రాష్ట్ర ప్రణాళిక సంఘానికి సీఎం స్టాలిన్ సూచన సాక్షి, చైన్నె: సచివాలయంలో సీఎం స్టాలిన్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం సమావేశం సాగింది. 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈ సందర్భంగా ప్రణాళిక కమిషన్ వర్గాలు సీఎం స్టాలిన్కు అందజేశారు. అలాగే సీఎం అల్పాహార పథకం – ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై ప్రభావం గురించి తుది నివేదిక, 10– 12 తరగతి పబ్లిక్ పరీక్షల విధానాలపై అధ్యయనం, చైన్నె పరిసర ప్రాంతాలలో వలసదారులు– కార్మికుల జీవితంపై అధ్యయనం వంటి అంశాలపై పరిశోధన నివేదికలను సమర్పించారు. అనంతరం, రాష్ట్ర ప్రణాళిక కమిటీ తాత్కాలిక ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జె. జయరంజన్ బృందం కార్యకలాపాలు, గత సమావేశంలో ఆదేశాలు, నిర్ణయాలు, సిఫార్సుల అమలు గురించి సమీక్షించారు. అధ్యయనాలు, ఫలితాలు, మార్గదర్శకత్వం, ప్రాజెక్టులత్లో సాధారణ ప్రజలపై కలిగే ప్రభావాలు, దానివల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఈ సమావేశంలో సీఎం విశదీకరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అమలు చేసిన ప్రత్యేక ప్రాజెక్టులు తమిళనాడు ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్, రిసోర్స్ఫుల్ సర్కిల్స్ వంటి ప్రాజెక్టు పనులపై ప్రస్తుతం జరుగుతున్న అధ్యయనాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అభివృద్ధి అంటే సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాషా, జాతి వంటి అంశాల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై ఆధారపడ్డ అంశాలను గుర్తుచేశారు. తమిళనాడులోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది ప్రణాళిక, సమాంతర అభివృద్ధిని సాధించే లక్ష్యంతో అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అందించిన వివిధ పరిశోధన నివేదికలు, విధాన ముసాయిదాలను ప్రస్తవిస్తూ, వాటిని విభాగాలు ప్రభుత్వ కార్యదర్శులు అమలు చేశారా లేదా, ఈ ప్రణాళికల సిఫార్సులను వారి విభాగాలలో సరిగ్గా అమలు చేయడానికి ఈ కమిటీ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధిని మెరుగు పరిచేందుకు నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికిమద్దతుగా నిలవాలని, సిఫార్సులే కాదు సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ప్రణాళిక కమిటీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, తాత్కాలిక ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జె. జయరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ యాదవ్, ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఉదయచంద్రన్, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ రాముడు. శీనువాసన్, ప్రొఫెసర్ సుల్తాన్ అహ్మద్ ఇస్మాయిల్, కె. దీనబంధు, శాసనసభ సభ్యుడు డాక్టర్ ఎలిలన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎలిగంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక నివేదికలోని అంశాలను జయరంజన్ వివరించారు. బడ్జెట్కు వేళాయె!మెట్రో అధికారులతో.. మెట్రో ప్రాజెక్టు అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. చైన్నెలో ఫేజ్–2 పనులు, కోవై, మదురై, తిరుచ్చి వంటి నగరాలమెట్రో రైలు ప్రాజెక్టుల అమలుకు తీసుకున్న చర్యల గురించి చర్చించారు. సాధ్యాసాధ్యాలతో పాటూ రైల్వేమార్గం, స్టేషన్లు వంటి అన్ని అంశాలతో సమగ్ర నివేదిక రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురైలలో త్వరితగతిన ప్రాథమిక పనులు ముగించి మెట్రో రైలు కుసంబంధించి అన్నిరకాల పనులపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2025–2026 సంవత్సరానికి గాను తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ దాఖలుకు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆర్థిక పద్దును దాఖలు చేయనున్నారు. శనివారం రైతు సంక్షేమాన్ని కాంక్షించే బడ్జెట్ను వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం సభలో సమర్పించనున్నారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో పూర్తిస్థాయిలో చివరి బడ్జెట్ దాఖలుకు ఇదే అవకాశం కావడంతో జనరంజక పథకాలు, ప్రకటనలు ఉండవచ్చు అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఇప్పటి వరకు మూడుసార్లు పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో దాఖలు చేసింది. ఈ ఏడాది మే నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ కాలంలో ప్రజల్ని ఆకర్షించే పథకాలను హోరెత్తించారు. ప్రధానంగా విద్యార్థి, మహిళలు, యువతీ, యువకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమలు చేసిన పథకాలు డీఎంకేకు మరింత బలంగా మారాయి. ఈ పథకాలే గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ డీఎంకే కూటమి క్లీన్స్వీప్ చేయడానికి మార్గాన్ని చూపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే కూటమి బలం పెరగడమే కాదు, సీఎం స్టాలిన్ పలుకుబడి సైతం పెరిగినట్టు సర్వేలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా గెలుపుతో మళ్లీ అధికార పీటాన్ని దక్కించుకునే విధంగా సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. జనరంజకంగా.. 2025–2026 ఆర్థిక నివేదికను జనరంజకంగా తీర్చిదిద్ది ప్రకటించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ దాఖలుకు చివరి అవకాశం కావడంతో 2026 అసెంబ్లీ ఎన్నికలకు పునాదిని మరింత పటిష్టం చేసుకునే రీతిలో కొత్త పథకాలు, ప్రాజెక్టులను బడ్జెట్ ద్వారా ప్రకటించేందుకు రెడీ అయ్యారు. 2026 మార్చి నాటికి ఎన్నిక లప్రక్రియ మొదలయ్యే అవకాశాలతో మధ్యంతర బడ్జెట్ను ఆ సమయంలో దాఖలు చేయడానికి వీలుంటుంది. అందుకే తాజా బడ్జెట్ను ప్రజాకర్షణ లక్ష్యంగా మలిచే విధంగా ఇప్పటికే ఆర్థికమంత్రి తంగం తెన్నరసు కసరత్తులు పూర్తి చేశారు. 2025–26 సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు సభ మొదలు కాగానే,బడ్జెట్ను ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇక శనివారం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం సభలో సమర్పించనున్నారు. అధికారులతో రోజూ సమావేశాలు, సమీక్షలు ఇప్పటికే ఆయన పూర్తి చేసి రైతులను ఆకర్షించే బడ్జెట్ను సిద్ధం చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆపరిసరాలలో భద్రతను కట్టదిట్టం చేశారు. ఇక సభలో డీఎంకేను ముప్పు తిప్పలు పెట్టే విధంగా అన్నాడీఎంకే, పీఎంకే, బీజేపీలు వ్యూహాలకు పదును పెట్టి ఉన్నాయి. శాంతిభద్రతల వైఫ్యలం, టాస్మాక్లో ఈడీ దాడులు, అవినీతి వంటిఅంశాలను అస్త్రంగా చేసుకుని సభను స్తంభింపజేసే దిశగా కార్యాచరణలో ఆ పార్టీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆర్థిక బడ్జెట్ను ప్రజలందరికి తెలియజేసే విధంగా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు జరిగాయి. చైన్నెలో 100 చోట్ల ఎల్ఈడీ స్కీన్ల ద్వారా ప్రసారం చేయడానికి చర్యలు తీసుకున్నారు. పార్కులు, బీచ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలోని ఇతర 24 కార్పొరేషన్లులో 48 చోట్ల,137 మునిసిపాలిటీలలో 274 చోట్ల, 425 పట్టణ పంచాయతీలలో 936 చోట్ల ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. దీంతో బడ్జెట్ మీద ఎదురుచూపులు పెరిగాయి -
చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయి సీజ్
● కోవై యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: ఆంధ్ర నుంచి ఎక్స్ప్రెస్ రైలు ద్వారా గంజాయిని తరలించిన కోవైకి చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 కిలోల గంజాను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం పోలీసులు నిఘా చేస్తున్నారు. ఈక్రమంలో 1వ ప్లాట్ఫారానికి షాలిమార్ ఎక్స్ప్రెస్ వారాంతపు ప్రత్యేక రైలు వచ్చి ఆగింది. రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ గోవిందరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఓ యువకుడి వద్ద ఉన్న సంచిలో 10 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిసింది విచారణలో అతను కోవై జిల్లా మాదం పట్టి మహాలక్ష్మి ఆలయ వీధికి చెందిన సురేష్ కుమార్ (26) అని ఆంధ్ర నుంచి అతను గంజాయి తీసుకొస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సురేష్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి పుళల్ జైలుకు తరలించారు. క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్లో ‘వీఐటీ’కి చోటు కొరుక్కుపేట: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను వివిధ అంశాల వారీగా అంచనా వేసే క్యూఎస్ ర్యాంకులు–2025 విడుదలయ్యాయి. ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్– 2025లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన వేలూ రు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) స్థానం దక్కించుకుంది. 14 పాఠ్యాంశాల బోధనలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల సరసన వీఐటీ నిలవడం విశేషం. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్(ఏఐ) పాఠ్యాంశాలకు సంబంధించి.. ఏకంగా ప్రపంచంలోని టాప్–100 విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ విద్యావిశ్లేషకుడు క్యాక్వారెల్లి సైమండ్స్ ఈ జాబితాను బుధవారం విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1700 విశ్వవిద్యాలయాల్లో 55 రకాల పాఠ్యాంశాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2025 ఎడిషన్ను రూపొందించారు. ఈ అధ్యయనంలో వీఐటీ అద్భుత ప్రతిభను ప్రదర్శించింది. 4 పాఠ్యాంశాల ర్యాంకులను మెరుగుపర్చుకోవడంతోపాటు మరో 8 పాఠ్యాంశాల ర్యాంకులను యథాతథంగా కాపాడుకోగలిగింది. మరో రెండు పాఠ్యాంశాలు తొలి సారి ర్యాంకింగ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా వీఐటీ వర్సిటీ నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు. వీఐటీలో బోధిస్తున్న పాఠ్యాంశాలకు దక్కిన పాయింట్లు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ 142, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 110, డేటాసైనన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ 51– 100, ఇంజినీరింగ్ – ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 151–200, ఇంజినీరింగ్– మెకానికల్, ఏరోనాటికల్ అండ్ మానుఫ్యాక్చరింగ్ 201– 250, ఇంజినీరింగ్ – కెమికల్ 251 – 300, న్యాచురల్ సైన్సెస్ 362, మెటీరియల్ సైన్న్స్ 151–200, మ్యాథమెటిక్స్ 201–250, స్టాటిస్టిక్స్ అండ్ ఆపరేషనల్ రీసెర్చ్ 251–275, కెమిస్ట్రీ 301–350, ఫిజిక్స్ అండ్ అస్ట్రానమీ 401–450, ఎన్విరాన్మెంట్ సైన్సెస్ 451–500, బయోలాజికల్ సైన్సెస్ 351–400, అగ్రికల్చరర్ అండ్ ఫారెస్ట్రీ 351–400, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ 551–600 పాయింట్లు దక్కించుకుంది. అవినాశిలో దారుణం● ఫాంహౌస్లో దంపతుల హత్య సేలం: తిరుప్పూర్ జిల్లాలోని అవినాశి సమీపంలో రైతు దంపతుల హత్య దిగ్భ్రాంతికి గురిచేసింది. తిరుప్పూర్లోని అవినాశి సమీపంలోని తులుక్కముత్తూర్ పంచాయతీలోని ఊంజపాలయం గ్రామంలోని ఒక తోట ఇంట్లో పళనిస్వామి (84), అతని భార్య పర్వతం (70) అనే దంపతులు నివసిస్తున్నారు. వారి పిల్లలు వివాహం చేసుకుని విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, ఈ దంపతులు తోట ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం చాలాసేపు ఆ జంట ఇంటి నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన పొరుగింటి వారు చూడగా.. ఆ జంట దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోడి గొడవ కారణంగానే.. పోలీసుల ప్రాథమిక విచారణలో అదే ప్రాంతంలో నివసిస్తున్న రమేష్ (46) వివాహం కాలేదు. ఇతని కోడి పళనిస్వామి ఇంటికి వద్దకు చేరి అరుస్తూ ఉన్నట్టు, ఈ విషయంగా పళనిస్వా మి, పర్వతం దంపతులు రమేష్తో అప్పుడ ప్పుడూ గొడవపడుతూ వచ్చారని తెలిసింది. ఈ క్రమంలో బుధవారం కూడా వీరి మధ్య గొడవ ఏర్పడగా రమేష్ కత్తితో పళనిస్వామి, పర్వతంను హత్య చేసి, బైక్పై పరారైనట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు రమేష్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సంక్షేమ పథకాలపై అవగాహన
కొరుక్కుపేట: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ శ్రీ కన్యకాపరమే శ్వరి మహిళా కళాశాల (ఎస్కేపీసీ) విద్యార్థినులు ప్ర త్యేకతను చాటుకుంటున్నారు. ఆటపాటలు, మైమ్ యాక్ట్స్, డ్యాన్స్ వంటి ఆకర్షణీయమైన ప్రదర్శనలతో తమ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చైన్నె ఐల్యాండ్ గ్రౌండ్స్ వేదికగా 49వ వాణిజ్య ప్రదర్శన 2025లో ఈనెల 12 నుంచి 14 వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పాల్గొని ప్రత్యేక స్టాల్స్ ద్వారా పలు అంశాలపై అవగాహన పెంచుతున్నారు. ఈ ఫెయిర్లో టీటీడీసీ డిప్యూటీ సెక్రటరీ వీరు సామి, టిటిడిసి అదనపు డైరెక్టర్ టీఎంటీ ఉమా శంకర్, విద్యాశాఖ అనుసంధాన అధికారులు డాక్టర్ జె. సులైమాన్, డాక్టర్ డబ్ల్యూ శాంతి, డాక్టర్ ఎస్. సెంథిల్ ఎస్కేపీసీ స్టాల్స్ను సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ వూటుకూరు శరత్ కుమార్ ప్రభుత్వ అధికారులకు స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ ఇన్చార్జ్ డాక్టర్. పి. బి. వనీత, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎం. వి. నప్పిన్నై, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డా. పి. భరణి కుమారి, డాక్టర్ పి ఎస్ మైథిలి పాల్గొన్నారు. -
కాట్పాడిలో ఫైనాన్సియర్పై హత్యాయత్నం
వేలూరు: జిల్లాలోని కాట్పాడి సమీపంలో ఉన్న వంజూరుకు చెందిన అరుణ్ అనే ఫైనాన్సియర్పై హ త్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు వి చారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. వేలూ రు జిల్లా కాట్పాడి సమీపంలోని గాంధీనగర్లో వంజూరుకు చెందిన అరుణ్ అనే వ్యక్తి ఫైనాన్స్ కా ర్యాలయం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి కా ట్పాడి వీజీరావ్ నగర్కు చెందిన జాన్సన్ ఫైనాన్సియర్ అరుణ్తో కార్యాలయంలో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. జాన్సన్ తోసి వేయడంతో అరుణ్ కింద పడి స్పృహతప్పాడు. ఆ సమయంలో అరుణ్ కడుపులో కమ్మీ గుచ్చుకుని రక్తపు మడుగులో పడి ఉండడంతో అతన్ని వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి జాన్సన్ తరలించాడు. ఆస్పత్రిలో అరుణ్కు చికిత్స చేస్తున్న సమయంలో అతని కడుపులో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే విరుదంబట్టు పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అదనపు ఎస్పీ భా స్కరన్, డీఎస్పీ పయణి, పోలీసులు ఫైనాన్స్ దుకాణం వద్దకు చేరుకుని విచారణ జరపడంతోపాటు వేలి ముద్రలను సేకరించారు. జాన్సన్ను విచారణ చేస్తున్నారు. -
నయనతారపై ధనుష్ పిటిషన్
– విచారణ ఏప్రిల్ 9కి వాయిదా తమిళసినిమా: కోలీవుడ్లో నటి నయనతారపై న టుడు ధనుష్ చైన్నె హైకోర్టులో వేసిన పిటిషన్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కే సులో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వివరాలు.. విజయ్ సేతుపతి నయనతార జంటగా నటించిన చిత్రం నానుమ్ రౌడీ దాన్. నటుడు ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంత వరకు అంతా హ్యాపీ. అయితే ఇటీవల నోటా నయనతార తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలతో నయనతార బిహైండ్ ది ఫెయిరీ పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూ పొందించారు.దీన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ నయనతార పుట్టినరోజు సందర్భంగా స్ట్రీమింగ్ చేసింది. అయితే అందులో తన అనుమతి లేకుండా తన చిత్రం నానుమ్ రౌడీదాన్లోని సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపిస్తూ నటుడు ధనుష్ చైన్నె హైకోర్టులో రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందే ఈ వ్యవహారంలో నయనతార, నెట్ ఫ్లిక్స్ సంస్థకు ధనుష్ తరపున సమన్లు జారీ చేశారు. దీంతో నయనతార నటుడు ధనుష్ను విమర్శిస్తు బహిరంగంగా ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అంతే కాకుండా ధనుష్ నష్టపహారం వ్యవహారంపై కోర్టు లోనే ఎదుర్కొంటామని పేర్కొన్నారు. కాగా ఈ కేసు మరోసారి గురువారం న్యాయస్థానం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నయనతార, ధనుష్ తరపు న్యాయవాదులు తీవ్రంగా తమ వాదనను వినిపించారు. నానుమ్ రౌడీ దాన్ చిత్రంలో ఉపయోగించని సన్నివేశాలునే డాక్యుమెంటరీ చి త్రంలో వాడామని, అందువల్ల నటుడు ధనుష్ కో రినట్లుగా నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చి త్రంలో ఉపయోగించక పోయినా, అవి తమ చిత్రం కోసం చిత్రీకరించినవేనని ధనుష్ తరపు న్యాయ వాది వాదించారు. అంతే కాకుండా నానుమ్ రౌడీ దాన్ చిత్రం షూటింగ్లో నయనతారను ఎలివేట్ చేయడానికి దర్శకుడు విఘ్నే ష్ శివన్ పలు టేక్లు షూట్ చేసి చిత్ర నిర్మాణ వ్యయం పెంచొరని ఆరోపిస్తూ నయనతార డాక్యుమెంటరీపై నిషేధం విధించాలని కోరారు. అయితే నిషేధించాలన్న కోరికను న్యాయస్థానం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. -
పదేళ్లలో విజయవంతంగా 7500 ప్రసవాలు
– అపోలో ఉమెన్స్ ఆస్పత్రి ఘనత కొరుక్కుపేట: అపోలో ఉమెన్స్ హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ అండ్ నియోనేటల్ కేర్లో దశాబ్ద కాలం విజయవంతంగా పూర్తి చేసుకుందని అపోలో హా స్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో 10 ఏళ్ల వే డుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆస్ప త్రిలో అప్పటివరకు ప్రసూతి విభాగం 7500 ప్రస వాలు విజయవంతంగా పూర్తి చేయగా, గైనకాలజికల్ బృందం 33 వేల శస్త్ర చికిత్సలను నిర్వహించిన ట్లు తెలిపారు. -
ఐఐటీలో సీఎఫ్ఐ ఓపెన్ హౌస్ 2025 స్టూడెంట్స్ టెక్ ఎక్స్పో
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసులో సీఎఫ్ఐ ఓపెన్ హౌస్ 2025 స్టూడెంట్స్ టెక్ ఎక్స్ పో జరగనుంది. ఈనెల 15వ తేదీన కొత్త విద్యా సముదాయం (ఎన్ఏసీ)లో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వీ కామకోటి ఈ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. భారతదేశంలోని విద్యార్థులచే నిర్వహించనున్న అతి పెద్ద ఆవిష్కరణ ప్రయోగశాలల్లో ఒకటైన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్(సీఎఫ్ఐ) విభిన్న సాంకేతిక డొమైన్లలో విస్తరించి ఉన్న 14 క్లబ్లు, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో చురుకుగా పోటీపడే ఎనిమిది పోటీ జట్లను కలిగి ఉన్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పూర్తిగా విద్యార్థులే రూపొందించిన, నిర్మించిన ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం ప్రాజెక్టులు, పరిశ్రమ, పూర్వ విద్యార్థుల నుంచి మరింత మద్దతును ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన వేదికగా ఈ ఎక్స్పో నిలవబోతోందన్నారు. -
8 అరుదైన కోతులు, శునకం స్వాధీనం
ఇద్దరు యువకుల అరెస్టు అన్నానగర్: వులేషియా నుంచి చైన్నె విమానాశ్రయానికి అ క్రమంగా తరలిస్తున్న 8 అరుదైన కోతులు, కుక్కలను కస్ట మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చె న్నైలోని మీనంబాక్కం అన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం రాత్రి మలేషియా ఎయిర్లైనన్స్ విమానం వచ్చింది. విమానంలో అరుదైన జాతులను అక్రమంగా తరలిస్తున్నట్లు చైన్నె విమానాశ్రయ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు స్నిఫర్ డాగ్తో నిఘా పెట్టారు. విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో చైన్నెకి చెందిన ఇద్దరు యువకులను అనుమానించిన కస్టమ్స్ శాఖ అధికారులు వారిని విచారించారు. వారిద్దరు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వారు అతని వస్తువులను శోధించారు. వారు తెచ్చిన ప్లాస్టిక్ బుట్టలను వేరు చేయగా ఆ బుట్టల్లో అరుదైన జంతువులు ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారిద్దరినీ బ యటే నిలిపివేసిన అధికారులు, చైన్నె లోని బీసెంట్నగర్లోని వన్యప్రాణి క్రైం విభాగానికి సమాచారం అందించి సమన్లు జారీ చేశారు. బుట్టల లోపల తనిఖీ చేయగా కోతి–1, మార్బుల్ కో తి–2, తూర్పు బూడిద గిబ్బన్ కోతి–4 ఏషియాటిక్ శునకం 1 ఇందులో 8 అరుదైన జాతు లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి ఇండోనేషియా, యూరప్, చైనాలోని సుమత్రా, జావా ద్వీపంలో క నిపించే అరుదైన జాతులుగా గుర్తించారు. 8 అ రు దైన జాతుల్లో, 3 ఆసియాటిక్ వుడ్చక్ 1, తూర్పు సంబల్ గిబ్బన్ 2 చనిపోయాయి. మరో 5 అరుదైన జాతులు సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని అ క్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం సజీవంగా ఉన్న 5 అరుదైన జాతులను మలేషియా రాజధాని కౌలాలంపూర్కు తిరిగి పంపించారు. చనిపోయిన జంతువులను దహనం చేశారు. విమానంలో అక్రమంగా జంతువులను తరలించిన చైన్నెకి చెందిన ఇద్దరు యువకులను కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. -
జేఏసీకి వస్తున్నాం!
● పలు పార్టీల సమాచారం సాక్షి, చైన్నె: లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ కి హాజరయ్యేందుకు పలు రాష్ట్రాల పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమ తరపున ప్రతినిధులను పంపించేందుకు నిర్ణయించాయి. పునర్విభజన పేరిట కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాధి రాష్ట్రాలలోని ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు సీఎం స్టాలిన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 22వ తేదిన చైన్నెలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయా రాష్ట్రాల పార్టీల నేతలను డీఎంకే మంత్రులు, ఎంపీల బృందం కలిసి స్టాలిన్ తరపున ఆహ్వానాలు అందిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ జేఏసీ సమావేశానికి బీజేడీ ఎంపీలను పంపించేందుకు నిర్ణయించారు. అలాగే మరికొన్ని పార్టీలు సైతం తమ ప్రతినిధులు హాజరు అవుతారన్న సమాచారం డీఎంకే ప్రభుత్వ అధికారులకు పంపించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మంత్రి వేలు, ఎంపీ విల్సన్ కలిసిన విషయం తెలిసిందే. కర్ణాటక సీఎంసిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ను మంత్రి పొన్ముడి నేతృత్వంలోని బృందం కలిసింది. కాంగ్రెస్ అధిష్టానంకు సమాచారం అందించి ఈ సమావేశానికి ప్రతినిధులను పంపిస్తామని సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గురువారం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సీనియర్ మంత్రి పొన్ముడి, ఎంపీ కనిమొళి తదితరులు కలిశారు. పునర్విభజన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉందని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడమే కాకుండా సమావేశానికి హాజరవుతామని హామీ ఇవ్వడం విశేషం. అలాగే, మంత్రి పొన్ముడి, ఎంపీ ఎన్ఆర్ ఇలంగోవన్లతో కూడిన బృందం సాయంత్రం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కువెళ్లారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్, రావుల చంద్రశేఖర్రెడ్డి, మధుసూదనాచారి, వేముల ప్రశాంత్రెడ్డి, వద్ది రాజు రవిచంద్ర, దామోదర్ రావులను కలిశారు. కేటీఆర్కు సీఎం స్టాలిన్ పంపించిన ఆహ్వాన లేఖను అందజేశారు. జేఏసీ సమావేశానికి హాజరు కావాలని కోరారు. పునర్విభజన రూపంలో ఎదురయ్యే పరిస్థితులను వివరించారు. -
తిరువారూర్లో రూ.కోటి గంజాయి స్వాధీనం
సేలం: తిరువారూర్లో రూ.కోటి విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని తిరువారూర్ – నాగపట్నం జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ హో టల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తు లు అక్కడ ఉంటున్నారని, వారు ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీలంకకు 400 కిలోల గంజాయిని అక్రమంగా తరలించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారని చైన్నె సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఆ సమాచారం ఆధా రంగా పోలీసులు బుధవారం హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అప్పుడు హాస్టల్ ముందు ఆపి ఉంచిన రెండు కార్లలో దాచిపెట్టిన 400 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఒక ప్రైవేట్ హోట ల్లో గదిని అద్దెకు తీసుకుని, ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన బి.విష్ణువర్ధరెడ్డి ఆధార్ ఐడీ కార్డును సమర్పించినట్టు, రెండు కార్లలో వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. తరువాత గదిలో ఉంటున్న వారిని అరెస్టు చేయడానికి పోలీసులు హోటల్ వెనుక భాగంలోకి ప్రవేశించారు. వారు వెళ్లిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను తీసుకురావడానికి వచ్చిన ఒక వ్యక్తి వారిని చూశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి హోటల్ తలుపు ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఓ పోలీసు అధికారి అతన్ని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సీసీటీవీ దృశ్యాలు ఆన్లైన్లో విడుదల కావడం కల కలం రేపుతోంది. ఆ తర్వాత పోలీసులు గదిలో ఉన్న ఐదుగురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, 2 కిలోల బరువున్న 200 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ.కోటికిపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంకా, అరెస్టు చేసిన వ్యక్తులను విచారించినప్పుడు, వారు ఈ గంజాయి ప్యాకెట్లను ముత్తుపేట ప్రాంతంలోని అలయాత్తి అడవుల మీదుగా పడవ ద్వారా నాగపట్నం జిల్లాలోని కొడియకరైకు రవాణా చేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ కేసు ను ఇన్స్పెక్టర్తో సహా ఆరుగురు పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని శుక్రవారం ఉదయం తిరువారూర్ కోర్టులో హాజరుపరుస్తామని, అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
‘స్టాలిన్.. అది నీ మూర్ఖత్వానికి నిదర్శనం’
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం రూపాయి సింబల్ ను మార్చడంపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్రంగా మండిపడింది. అది మూర్ఖపు చర్య అంటూ అభివర్ణించారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. భారత మొత్తం తమ కరెన్సీలో 'Rs' అని ఉంటే 'Ru' అని తమిళనాడు ప్రభుత్వం మార్చడం అతి తెలివి తక్కువ పని అంటూ ధ్వజమెత్తారు. దీన్ని మూర్ఖపు చర్య కాకపోతే ఇంకేమనాలి అని ఆయన ప్రశ్నించారు అసలు స్టాలిన్ ఎలా సీఎం అయ్యారో అంటూ విమర్శలు గుప్పించారు.కాగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం.. తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రూపాయి సింబల్ ను మార్చడమే కాకుండా ‘రు’ అని ఆ సింబల్ పై పేర్కొనడమే వివాదాన్ని మరింత పెంచింది.The DMK Government's State Budget for 2025-26 replaces the Rupee Symbol designed by a Tamilian, which was adopted by the whole of Bharat and incorporated into our Currency. Thiru Udhay Kumar, who designed the symbol, is the son of a former DMK MLA. How stupid can you become,… pic.twitter.com/t3ZyaVmxmq— K.Annamalai (@annamalai_k) March 13, 2025తమిళనాడుపై హిందీ భాష రుద్దుతారా?తాము ఎంతో గౌరవించే తమిళభాషపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో హిందీ భాషను తీసుకొస్తే తమిళనాడు ఎడ్యుకేషన్ సిస్టం అంతా సర్వనాశనం అవుతుందని మండిపడ్డారు. వారి తీసుకొచ్చే ఎడ్ముకేషన్ పాలసీ.. అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు.. కుంకుమ, పసుపు పాలసీ. ఇది భారత్ ను అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన పాలసీ ఎంతమాత్రం కాదు. కేవలం హిందీని అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ.’ అని ధ్వజమెత్తారు స్టాలిన్. -
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాతమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు. -
నిర్మలమ్మ వ్యాఖ్యలకు విజయ్ కౌంటర్
చెన్నై: ద్రవిడ ఉద్యమ నేత, తమిళ సామాజికవేత్త పెరియార్పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తమిళ భాషను పెరియార్ అవమానించారంటూ సీతారామన్ నిజంగా బాధపడుతున్నారా?అని ప్రశ్నించిన ఆయన.. అదే నిజమైతే తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేయకుండా ఆపాలని ఆమెకు సూచించారు.పెరియార్ తన కాలానికి మించిన ఆలోచనలతో సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. అందుకే ఇప్పటికీ ఇక్కడి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ పెరియార్ను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోంది. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అని విజయ్ మండిపడ్డారు. నిర్మలమ్మ ఏమన్నారంటే.. జాతీయ విద్యా విధానం త్రిభాషా నిబంధనపై తమిళనాడు వర్సెస్ కేంద్రంగా విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. తమిళ భాషను అవమానించిన వ్యక్తిని(పెరియార్ను ఉద్దేశించి..) దేవుడిగా చూసే విధానం సరికాదని.. ఆయన్ని గౌరవించడం డీఎంకే పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. తమిళ భాషను తక్కువ అంచనా వేసిన వ్యక్తిని(పెరియార్ను ఉద్దేశించి..) తమ నాయకుడిగా కొనియాడడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. విజయ్ ఏమన్నారంటే.. నిజంగా తమిళ భాషపై పెరియార్ చేసిన వ్యాఖ్యలు నిర్మలా సీతారామన్కు సమస్యగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో మూడు భాషల విధానాన్ని ప్రయోగించడాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి. ఇది తమిళ ప్రజలకు తగిన విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం అనే విషయాన్ని ఆమె గుర్తించాలి. పెరియార్ ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో ఉన్నారు. అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్చలు జరుగుతుంటాయని అన్నారాయన. -
అల్లుడిని చేరదీసిన అత్త.. మరదల్ని గర్భవతి చేసి..
తిరువళ్లూరు: తమిళనాడులోని తిరువళ్లూరు పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. భార్య సోదరిని గర్భవతి చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో, కోర్టు తీర్పు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. చెన్నై ఆండాల్ నగర్కు చెందిన బికారీ నాయక్ కుమారుడు రాజ్కుమార్ నాయక్ (35). ఇతను అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలోనే ఉంటూ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్కుమార్ నాయక్.. తన భార్య ఆమె సోదరి ప్రియదర్శిని(17)ని బలవంతంగా పలుమార్లు శారీరకంగా వాడుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రియదర్శిని గర్భవతి కావడంతో బాధితురాలు ఎన్నూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.అనంతరం కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణలో ప్రియదర్శినిపై బలవంతంగా నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటూ లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు సంవత్సరాల పాటూ అదనంగా శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో నిందితుడిని పుళల్ జైలుకు తరలించారు. -
సీమాన్కు అన్నామలై ప్రశంస
పరస్పరం కరచాలనం సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ ద్రావిడ మోడల్, ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు, చర్చకు, దుమారానికి సైతం దారి తీస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేరాయి. అదేసమయంలో నటి విజయలక్ష్మి తనపై ఇచ్చిన లైంగిక దాడి కేసును సైతం ఆయన సమర్థంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. తన దైన శైలిలో దూసుకెళ్తున్న సీమాన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరు నేతలు బుధవారం ఎదురు పడ్డారు. అన్నామలై నడుచుకుంటూ తన కారు వద్దకు వెళ్తుండగా, సీమాన్ మరో కారులో అదే సమయంలో ఎదురు వచ్చారు. సీమాన్ను చూడగానే జరగండి..జరగండి అంటూ ఆయన కారు వద్దకు అన్నామలై వెళ్లారు. ఆయనతో కరచాలనం చేశారు. గుడ్ ఫైట్ బ్రదర్, గుడ్ ఫైట్, బలంగా ఉండండి...బలంగా ఉండండి అంటూ ఆయన కేస్తున్న పోరాటాలకు తన మద్దతు ఇచ్చే విధంగా అన్నామలై స్పందించడం గమనార్హం. కాలువల్లో సైలెన్ బాటిళ్లతో దోమల నివారణ ● కార్పొరేషన్ కొత్త ప్రయత్నం అన్నానగర్: ఆసుపత్రుల్లో వాడే ’గ్లూకోజ్’ బాటిళ్లతో చైన్నెలోని కాలువల్లో దోమల నిర్మూలించేందుకు కార్పొరేషన్ కొత్త ప్రయత్నం ప్రారంభించింది. చైన్నెలో అడయార్, కూవం, బకింగ్హామ్, ఒట్టేరి నల్లా కెనాల్ సహా 30కి పైగా జలమార్గాలు ఉన్నాయి. అలాగే వర్షపు నీటి కాలువల్లో 365 రోజుల పాటూ మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చైన్నె కార్పొరేషన్ తరఫున ఉదయం, సాయంత్రం వేళల్లో పొగ వ్యాపించే యంత్రాల ద్వారా దోమల నిర్మూలన పనులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రుల్లో ఉపయోగించే ’గ్లూకోజ్’ బాటిళ్లను (ట్రిప్స్ బాటిల్స్) ఉపయోగించి నీటి మార్గాలు, మురుగు కాలువల నుంచి దోమలను నిర్మూలించేందుకు చైన్నె కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో అంబత్తూరు మండల పరిధిలోని కాలువల్లో ఈ పనులు ప్రారంభించారు. అంబత్తూరు, కొరట్టూరు, బడి, పరిసర ప్రాంతాల్లో దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడా ప్రోత్సాహం సాక్షి, చైన్నె : నున్చాకు ఉపకరణంతో ఒక నిమిషంలో 159 నున్చాకు బ్యాక్ హ్యాండ్రోల్స్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన తమిళనాడు క్రీడాకారిణి ఝాన్సీరాణి లక్ష్మీభాయ్ బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, క్రీడల కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జె.మేఘనాథరెడ్డిలను కలిసి తను సాధించిన రికార్డును చూపించారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారిణిని ఉదయనిధి స్టాలిన్ సత్కరించారు. అలాగే ఛాంపియన్ ఆఫ్ ప్యూచర్ అకాడమీకి ఎంపికై న తమిళనాడుకు చెందిన బైక్ బాలరేసర్ రోహన్ ఖాన్ రషీద్ను ఉదయనిధి సత్కరించి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందచేశారు. ఏప్రిల్ 1 నుంచి పరీక్షలు సాక్షి, చైన్నె : రాష్ట్రం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చివరి పరీక్ష తేదిలను పాఠశాల విద్యా శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 21వ తేది వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చుదువుకుంటున్న విద్యార్థలకు ఏప్రిల్ 8వ తేది నుంచి 24వ తేది వరకు చివరి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. తిరువణ్ణామలైకి నేడు 350 ప్రత్యేక బస్సులు తిరువొత్తియూరు: పౌర్ణమి సందర్భంగా తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చైన్నె నుంచి తిరువణ్ణామలైకి 350 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రభుత్వ రవాణా సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. పౌర్ణమిని పురస్కరించుకుని నేడు 13వ తేదీ చైన్నె నుంచి తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. -
పంట బీమా కేటాయింపులో నిర్లక్ష్యం తగదు
తిరువళ్లూరు: జిల్లాలోని రైతులకు పంటల బీమాను అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి(స్టాటస్టిక్ విభాగం) జయ అఽధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా కోరమంగళం గ్రామంలోని వరి పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. పంట బీమా కోసం నమోదయిన రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, సాగు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్కాడుకుప్పంలోని మహోన్నత పాఠశాలలో సహాయకుడి సాయంతో పరీక్షలు రాస్తున్న విద్యార్దుల డేటా సేకరించి దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూండి యూనియన్ రామంజేరి 11వ వ్యవసాయ స్టాటస్టిక్స్ వివరాల సేకరణ ఫేస్–2, 3తదితర పనులను పరిశీలించి అధికారుల వద్ద సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, రైతులకు ఇవ్వాల్సిన బీమా విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పంటల సాగు నమోదు, రైతుల వివరాల నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ భారతి, చైన్నె మండల స్టాటస్టిక్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ ఉమారాణి పాల్గొన్నారు. -
తిరుచెందూరులో వైభవంగా మాసి రథోత్సవం
● మర్మోగిన హరోహర నామస్మరణసాక్షి, చైన్నె: తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం మాసి బ్రహ్మోత్సవ రథోత్సవ వేడుక కనుల పండువగా సాగింది. వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏటా స్కంధ షష్టి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. అలాగే మాసి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. సాగర తీరంలోని ఈ ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఇక్కడి ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంటారు. మాసి ఉత్సవాలు ఇక్కడ ఈనెల 3వ తేదీ నుంచి జరుగుతున్నాయి. రోజూ ఆలయంలో విశిష్ట పూజలు జరుగుతూ వచ్చాయి. బుధవారం రథోత్సవ వేడుక జరిగింది. వేకువ జాము నుంచి ఆలయంలో సుబ్రమణ్యస్వామి వారికి వళ్లి, దేవానై అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. వళ్లి, దేవానై సమేత సుబ్రమణ్య స్వామి వారిని రథంపై అధిష్టంప చేశారు. భక్తులు హోరం..హర నామస్మరణ నడుమ రథోత్సవం కనుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. రథోత్సవం సందర్భంగా తిరుచెందూరు పరిసరాలలో తూత్తుకుడి జిల్లా యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాటుల చేసింది. ఆలయం పరిసరాలలోనే కాకుండా, సముద్ర తీరంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా తిరుచెందూరులో ఉదయం నుంచి వర్షం పడింది. రథోత్సవ సమయానికి వర్షం ఆగింది. ఇతర ప్రాంతాలలో వర్షం కొనసాగినా, రథోత్సవం ముగిసే వరకు తిరుచెందూరులో భానుడు కనుమరుగు కావడం విశేషం. -
గృహిణులకు నెలకు రూ.2500
● నగదు సాయంపెంపు ● రూ. 13,600 కోట్లతో పుదుచ్చేరి బడ్జెట్ ● సభలో దాఖలు చేసిన సీఎం రంగస్వామి సాక్షి, చైన్నె : కుటుంబ పెద్దగా ఉన్న గృహిణులకు నెలకు రూ. 2,500 నగదు సాయం అందజేయనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి ప్రకటించారు.2025–26 సంవత్సరానికి గాను రూ. 13, 600 కోట్ల ఖర్చులతో పుదుచ్చేరిబడ్జెట్ను బుధవారం అసెంబ్లీలో ఆయన దాఖలు చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బడ్జెట్ సమావేశాలు సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రసంగంతో మొదలైన విషయం తెలిసిందే. రెండవ రోజుగా మంగళవారం ఈ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే విధంగా చర్చజరిగింది. మూడోరోజు సభలో ఉదయం ఆర్థిక శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్నసీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలుచేశారు. సభకు ఆయన రాగానే స్పీకర్ ఎన్బలం సెల్వం బడ్జెట్ దాఖలకు అవకాశం కల్పించారు. దీంతో సభలో రంగ స్వామి ప్రసంగించారు. రూ. 13, 600 కోట్లతో బడ్జెట్ దాఖలు చేశారు. ఖర్చులు,ప్రాజెక్టులకు నిధులు, ఇతర అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులకు రూ.1000 బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకం మేరకు విద్యార్థులకు ప్రభుత్వ బడులలో వారంలో రెండు సార్లు పౌష్టికాహారంతో పాటూ గుడ్డు పంపిణీకి నిర్ణయించారు. 6 నుంచి 12 తరగతుల వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యా సాయంగా నెలకు రూ. 1000 చొప్పున మూడు సంవత్సరాల పాటూ అందించేందుకు బడ్జెట్లో నిధులను కేటాయించారు. పాఠశాలల విద్యార్థులు, ప్రజల సహకారంతో లక్ష మొక్కులు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గృహిణులకు.. పాడిఉత్పత్తిని పెంపునకు 50 శాతం రాయితీతో పశువులను అందజేయనున్నారు. పుదుచ్చేరిలోని రెండు ఎగ్జిభిషన్లను పురాతనత చెక్కు చెదరకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. అన్ని కుటుంబ కార్డు దారులకు నెలకు ఉచిత బియ్యంతోపాటూ 2 కేజీల గోదుమ ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు రూ. 2 వేలు ప్రోత్సహక నగదు పంపిణీ, ఈసీఆర్ రోడ్దులో కొత్తగానిర్మించిన బస్టాండ్కు దివంగత మాజీ ప్రధాని వాజ్పేయ్ పేరు పెట్టనున్నామన్నారు. ఎమ్మెల్యేల నిధి రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచుతున్నామని ప్రకటించారు. చివరగా కుటుంబ పెద్దగాఉ న్న గృహిణులకు ఇది వరకు అందజేస్తున్న నెలకు రూ. 1000 నగదు ప్రోత్సాహాన్ని రూ. 2,500లుగా పెంచుతున్నామని వివరించారు. అలాగే వృద్ధాప్య పింఛన్ రూ. 500 పెంచుతున్నామన్నారు. సభలో ప్రసంగిస్తున్న సీఎం రంగస్వామి -
చైన్నెలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
● 15 మండలాలలో ఏర్పాటుకు నిర్ణయం చైన్నెలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కార్పొరేషన్ నిర్ణయించింది. విద్యుత్ బోర్డు సహకారంతో ఈ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తులు మొదలెట్టారు. చైన్నె నగరంలో ఇటీవల కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం పెరిగింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే కాదు, ఎలక్ట్రిక్ బస్సులు సైతం రోడ్డెక్కి ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ ఆటోలు సైతం ఇటీవల నగరంలోకి ప్రవేశించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతుండటంతో వీటీ ఛార్జింగ్ కోసం ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుపై గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ దృష్టి పెట్టింది. చైన్నె నగరంలోని తిరువొత్తియూరు, మనలి, మాధవరం, తండయార్ పేట, రాయపురం, తిరువీకానగర్, అంబత్తూరు, అన్నానగర్, తేనాం పేట, కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూరు, పెరుంగుడి, షోళింగనల్లూరు మండలాలలో మండలానికి ఒకటి చొప్పున తొలి విడతగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థల పరిశీలన, ఎంపికకు గ్రేటర్ చైన్నె అధికారులు బుధవారం నిర్ణయించారు. ఇప్పటికే నగరంలో కొన్ని చోట్ల ప్రైవేటు చార్జింగ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం కార్పొరేషన్ నేతృత్వంలో ప్రభుత్వ చార్జీంగ్స్టేషన్లు ఏర్పాటు కానున్నడం వాహనదారులకు మరింత ఉపయగకరం కానుంది. సాక్షి, చైన్నె -
పెరిగిన విద్యుత్వాడకం
● కొరతకు ఛాన్స్ ఇవ్వకుండా చర్యలు సాక్షి, చైన్నె: రాష్ట్రంలో విద్యుత్ వాడకం అమాంతంగా పెరిగింది. రోజుకు సుమారు 19 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. మున్ముందు రోజులలో 22 వేల మెగావాట్లకు సంఖ్య చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచిక్రమంగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలెట్టిన విషయంతెలిసిందే. దీంతో విద్యుత్ వాడకం పెరిగినట్టైంది. అదే సమయంలో మంగళ చైన్నె, శివారు జిల్లాలలో వాతావరణం మారింది. వర్షం పడింది. అయితే, బుధవారం వర్షంతెరమరుగై భానుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే,తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, రామనాధపురం తదితర దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలో వర్షం బుధవారం సైతం కొనసాగింది. ఈ వర్షాలు ఆగగానే మరింతగా ఎండవేడిమి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దీంతో విద్యుత్ వాడకం అమాంతంగా పెరిగే అవకాశాలు అధికమే. గత నెల రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా, ప్రస్తుతం 19 వేల మెగావాట్లకు చేరింది. మున్ముందు రోజులలో ఈ సంఖ్య 22 వేల మెగావాట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2.5 కోట్ల గృహ కనెక్షన్లు, 40 లక్షల వర్తక,పరిశ్రమ కనెక్షన్లు, 25 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఎలాంటి ఆటంకం అన్నది కలగకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు వీలుగా అధికారులు కసరత్తు మొదలెట్టారు. అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యుత్ కొనుగోళ్ల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్ అందిస్తున్నప్పటికీ, మున్ముందు కోతలు ఎదురయ్యేనా అన్న ఆందోళన తప్పడం లేదు. ఇందుకు కారణం ఏసీల వాడకం పెరగడమే. అయితే, విద్యుత్ కోతలకు ఆస్కారంలేకుండా సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా,రాష్ట్రంలోని అన్ని కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతగా స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన వెలువడింది. -
ప్రత్యేక బృందాల ఆహ్వానం
సాక్షి, చైన్నె: తమిళనాడు సీఎం స్టాలిన్ తరపున ఆహ్వానాన్ని అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను తమిళనాడుతో పాటూ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలలో తగ్గించేందుకు పునర్విభజన అస్త్రంతో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకునేందుకు సీఎం స్టాలిన్ అడుగుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని యాభైకు పైగా పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలోని ఎంపీలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈనెల 22వ తేదీన చైన్నెలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి నిర్ణయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, ముఖ్య పార్టీల నేతలకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ప్రతినిధుల బృందం వారిని స్వయంగా కలిసి ఆహ్వానం పలికే పనిలో నిమగ్నమైంది. మంగళవారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్కు మంత్రి టీఆర్బీ రాజ, ఎంపీ దయానిధి మారన్ నేతృత్వంలోని బృందం మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు కలిశారు. జేఏసీ సమావేశానికి హాజరవుతామని నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ బుధవారం ప్రకటించింది. బుధవారం ఆంధ్రప్రదేశ్కు తమిళనాడు మంత్రి ఏవీ వేలు, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది విల్సన్ వెళ్లారు. తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ పంపిన ఆహ్వానాన్ని అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో జరుగుతున్న అన్యాయం గురించి ఈసందర్భంగా చర్చించుకున్నారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావును కలిశారు. అలాగే సీనియర్ మంత్రి పొన్ముడి, ఎంపీ అబ్దుల్లా కర్ణాటకకు వెళ్లారు. అక్కడి సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ ఇద్దరితో కాసేపు సమావేశమయ్యారు. అన్ని వివరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లను కలిసేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏవీవేలు, విల్సన్ భేటీ సిద్ధరామయ్య, శివకుమార్తో పొన్ముడి భేటీ నవీన్ పట్నాయక్ గ్రీన్సిగ్నల్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన సభల హోరు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయాన్ని నిరసిస్తూ జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్రెడ్డితో డీఎంకే మంత్రి ఏవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారం భేటీ అయ్యారు. ఈమేరకు గురువారం ఏపీలోని తాడేపల్లిలో కలిసి ఆహ్వానం పలికారు. అలాగే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా ప్రత్యేక బృందాలు ఆహ్వాన పత్రాలు అందించాయి. కేంద్రం కుట్రలను ఛేదిస్తాం.. రాష్ట్రానికి కేంద్రం తలబెడుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే విధంగా బుధవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరసన సభలు జరిగాయి. వేలూరులో సీనియర్మంత్రి దురై మురుగన్, తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రులతో పాటూ ఆయా జిల్లాల మంత్రులు, కార్యదర్శుల నేతృత్వంలో నిరసన సభలు జరిగాయి. హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను, లోక్ సభ స్థానాల సంఖ్యను తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలను, తమళనాడుకు నిధులను కేటాయించడంలో కేంద్రం చూపుతున్న వైఖరిని ప్రజలకు వివరించే విధంగా నిరసన సభలు జరిగాయి. తిరువళ్లూరులో జరిగిన నిరసన సభలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ అనాగరికానికి కేరాఫ్ అడ్రస్సు మీరే అంటూ కేంద్రంలోని పాలకులపై శివాలెత్తారు. తమిళనాడును సర్వనాశనం చేయడం లక్ష్యంగా, విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే ధ్యేయంగా ఈ కేంద్రం పాలకులు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఇక, ఽకేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విద్యామంత్రి అన్బిల్ మహేశ్ లెక్కల పద్దులతో వివరాలను పంపించారు. తమిళనాడులో 1.8 కోట్ల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇందులో సీబీఎస్ఈ బడులలో 15 లక్షల మంది వరకు చదువుతున్నారని వివరించారు. మిగిలిన వారంతా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలో స్టేట్ సిలబస్ను అభ్యసిస్తున్నారని వివరించారు. దీనిని బట్టి తమరే అర్థం చేసుకోవాలని ఇక్కడ ఏ విద్యావిధానం అమల్లో ఉండాలో అన్నది అంటూ హితవు పలికారు. తమిళనాడులో విద్యా వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేయడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ధ్వజమెత్తారు. ఇక, డీఎంకే ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. -
నిశ్చితార్థం కోసం వధువును సైకిల్ పై తీసుకొచ్చిన వరుడు
అన్నానగర్: కాంచీపురం సమీపంలో మంగళవారం పెళ్లి నిశ్చితార్థానికి వధువును సైకిల్ పై ఊరేగింపుగా తీసుకొచ్చాడు వరుడు. నలుగురు సోదరులు పల్లకి పై తీసుకెళ్లారు. వివరాలు.. కాంచీపురం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని అయ్యప్ప నగర్ ప్రాంతానికి చెందిన వడివేల్. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఆయన కుమార్తె వివాహ వేడుక జరిగింది. రజినీ కాంత్ నటించిన అన్నామలై సినిమాలోని రెక్క కట్టి పరుకుదయ్య అన్నామలై సైకిల్ పాటలోని సీనన్లో కనిపించిన వరుడు మనోజ్ పెళ్లి మండపం సమీపంలోని శివాలయం నుంచి వధువు యోగలక్ష్మిని సైకిల్పై ఊరేగింపుగా తీసుకొచ్చాడు. రోడ్డుపై సైకిల్ తొక్కుతున్న వధూవరులను చూసి అటుగా వెళ్తున్న జనం ఆశ్చర్యపోయారు. కళ్యాణ మండపానికి చేరుకున్న యోగలక్ష్మిని నలుగురు సోదరులు వధూవరులకు స్వాగతం పలికారు. వీరు యోధుల వేషధారణలో యోగలక్ష్మి పల్లకిపై ఎక్కించుకుని నలుగురూ సినిమా పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. నిశ్చితార్థ వేడుకలో కళా ప్రదర్శనలు కూడా జరిగాయి. -
యూట్యూబర్లపై గూండా యాక్ట్
సేలం : చిన్నారులను హోటల్కు రప్పించి, లైంగికంగా వేధించి, అసభ్యకరమైన సినిమా తీసిన వ్యవహారంలో మహిళా యూట్యుబర్లు దివ్యా, చిత్రతో పాటూ ముగ్గురిపై పోలీసులు గూండా చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో ఉన్న హోటల్లో చిన్నారులను లైంగికంగా వేధించి, వారితో అసభ్యకరమైన సినిమాలు చేయించిన కేసులో ప్రముఖ మహిళా యూట్యుబర్లు దివ్య (30), చిత్రా (54) అనే ఇద్దరు కొన్ని వారాల క్రితం అరెస్టు అయ్యారు. వీరికి సహకారంగా ఉన్న మరో యూట్యుబర్ కార్తీ (31), ఆనంద్ (24) జైలులో ఉన్నారు. ఈ స్థితిలో వీరు జామీన్ కోరుతూ పలుమార్లు శ్రీవిల్లిపుత్తూర్ కోర్టులో కోరారు. ఆ పిటిషన్లను రద్దు చేశారు. ఈ క్రమంలో యూట్యుబర్లు దివ్యా, చిత్ర, కార్తీక్ల పై మోపబడిన నేరారోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముగ్గురిపై గూండా చట్టం నమోదు చేస్తూ శ్రీవిల్లిపుత్తూర్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజా, విరుదునగర్ జిల్లా సూపరింటెండెంట్ తదితరులు సిఫార్సు చేశారు. అందుకు అంగీకరించిన విరుదునగర్ జిల్లా కలెక్టర్ జయశీలన్, య్యూట్యూబర్లు చిత్ర, దివ్య, కార్తీలను గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నకళ్లను సంబంధిత జైలులో ముగ్గురికి మంగళవారం అందజేశారు. -
ఘనంగా డబ్ల్యూవీఎస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు (డబ్ల్యూవీఎస్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె చేట్ పేట మేయర్ వీఆర్ రామనాథన్ రోడ్ లోని వాలంటరీ సర్వీస్ కేంద్రంలో జరిగిన ఈ వేడుకలకు ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ యశోద షణ్ముఖ సుందరం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ రేణుకా మోహన్ రావు పాల్గొని మహిళాదినోత్సవం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, చేనేత ప్రదర్శనలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అచీవర్ అవార్థులతో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాజాయింట్ డైరెక్టర్ (రిటైర్డ్), శాస్త్రవేత్త డాక్టర్.కె.రెమా దేవి, చోళమండలం ఆర్టిస్ట్ జి.లతా గోపాల్ లను ఘనంగా సత్కరించారు. ఇటీవల సీఎం స్టాలిన్ చేతులమీదుగా అవ్వయార్ అవార్డ్ అందుకున్న ప్రొఫెసర్ డాక్టర్ యశోద షణ్ముఖ సుందరం అవార్డు కింద అందుకున్న రూ.1,50,000 మొత్తాన్ని ఉమెనన్స్ వాలంటరీ సర్వీస్ ఆఫ్ తమిళనాడుకి విరాళంగా అందించారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ ఊర్మిళ, కోశాధికారి శ్రీలక్ష్మీ మోహనరావు , ఉపాధ్యక్షులు సరోజిని , సభ్యులు డాక్టర్ ఎం భానుప్రియా తదితరులు పాల్గొన్నారు.పలు సందేశాత్మక పెంయింటింగ్ ఆకట్టుకున్నాయి. -
మంత్రిపై బురదచల్లిన బీజేపీ మహిళా నేత అరెస్టు
● బెయిల్ కోరిన మరో నిందితుడు ● నివేదిక ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు సేలం : తిరువైన్నెనల్లూర్ సమీపంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి పొన్ముడిపై బురద చల్లిన బీజేపీ మహిళా నేతను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. వివరాలు.. విల్లుపురం జిల్లా తిరువైన్నెనల్లూర్లో ఫెంగల్ తుపాను కారణంగా తిరువైన్నెనల్లూర్ వంటి 100కుపైగా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాంతాలలో బాధితులను పరామర్శించడానికి గత డిసెంబర్ 3వ తేది మంత్రి పొన్ముడి వెళ్లారు. ఆయనతో పాటూ అప్పటి కలెక్టర్ పళని, మాజీ ఎంపీ గౌతమ శిఖామణి తదితరులు కూడా ఉన్నారు. అప్పుడు మంత్రి, అధికారులను ఒక మహిళ దూషించి, వారిపై బురద చల్లి బెదిరించినట్టు, విధులు నిర్వహించనియ్యకుండా అడ్డుకున్నట్టు తిరువైన్నెనల్లూర్ పోలీసు స్టేషన్లో ప్రత్యేక సబ్ ఇన్స్పెక్టర్ రుల్దాస్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇరువేల్పట్టు గ్రామానికి చెందిన రామకృష్ణన్, బీజేపీ నేత విజయరాణి అనే ఇద్దరిపై పోలీసులు సహాయక ఇన్స్పెక్టర్ బాలసింగం కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తూ వచ్చారు. గత ఫిబ్రవరి 21వ తేదీన రామకృష్ణన్ను ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన విజయరాణి మంగళవారం రాత్రి తిరువైన్నెనల్లూర్లో పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. బెయిల్ పిటిషన్ ఈ కేసులో బెయిల్ కోరుతూ రామకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్లో తనపై తప్పుడు కేసు నమోదైనట్టు తెలిపారు. 20 రోజులకు పైగా జైలులో ఉండడం వల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుందర్ మోహన్ దీనిపై పోలీసు శాఖ సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను 17 తేదీకి వాయిదా వేశారు. -
అవ్నీ మూవీస్, బెంజ్ మీడియా సంస్థల కొత్త చిత్రం
తమిళసినిమా: నటి కుష్భూకు చెందిన అవ్నీ మూవీస్. ఆర్.మదన్కుమార్కు చెందిన బెంజ్ మీడియాతో కలసి నిర్మిస్తున్న నూతన చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్, 24 ఏఎం.స్టూడియోస్ వంటి పలు చిత్ర నిర్మాణ సంస్థలో దర్శకత్వం శాఖల్లో పని చేసిన అశ్విన్ కందసామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు సంతోష్, రేష్మా వెంకటేశ్, వినోద్ కిషన్, సమ్యుక్త విశ్వనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శాంతకుమార్ చక్రవర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర వివరాలను మీడియాకు విడదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది సరికొత్త కంటెంట్తో కూడిన వినోదంతో కూడిన ఫాంటసీ, ప్రేమకథా చిత్రంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా ఓ విచిత్రమైన జీవితం గురించి చెప్పే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. భిన్నమనస్తత్వాలు కలిగిన ఒక పాత్రతో పయనించే కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్ర టైటిల్ను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. అన్వేషణ, లక్ష్యసాధన, ఆకర్షణ వంటి అంశాలతో కూడిన చిత్రం ఇదని చెప్పారు. కాగా దర్శకుడు, నటి కుష్బూ భర్త సుందర్.సీ లేకుండా అవ్నీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
ఘనంగా కోళాత్తమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: తమిళనాడు– ఆంధ్ర రాష్ట్రాలకు సరిహద్దులోని గ్రామంలో కోళాత్తమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం కోలాహలంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వివరాలు..పళ్లిపట్టు సమీపం ఆంధ్ర సరిహద్దులోని తమిళనాడు గ్రామం కుమారమంగళం. ఈగ్రామంలో శ్రీ కోళాత్తమ్మన్కు పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన ఆలయం నిర్మించాలని గ్రామీణులు నిర్ణయించారు. ఇందుకోసం నూతన ఆలయ నిర్మాణ పనులు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కోళత్తమ్మన్ ఆలయ విమాన గోపురం సన్నిధి, వినాయకుడి సన్నిధి, నాగాలమ్మన్ సన్నిధి, నవగ్రహ సన్నిధి సహా రాతి మండపం, నిర్మాణపు పనులు పూర్తి చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటూ మహాకుంభాభిషేకం సందర్భంగా గ్రామ వీధులు, ఆలయం విద్యుద్దీపాలతో సర్వాంసుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో యాగశాలలు ఏర్పాటు చేసి నిత్య హామగుండ పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం మహాపూర్ణాహుతి, గోపూజ అనంతరం తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేళతాళాల నడుమ కలచాలు బయల్దేరి విమాన గోపురానికి పవిత్ర తీర్ధాలతో మహాకుంభాభిషేకం దీపారాధన చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేక పూజలతో దీపారాధన చేపట్టి భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తులందరికీ అన్నదానం పంపిణీ చేశారు. రాత్రి అమ్మవారు బాణసంచా వేడుకల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగారు. -
ఘనంగా అగ్ని గుండ మహోత్సవం
సేలం : నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్ లోని ప్రసిద్ధ చిన్న ఓంకాళియమ్మన్ ఆలయంలో, మాసి అగ్ని గుండ మహోత్సవం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40,000 మందికి పైగా భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని ప్రసిద్ధ చిన్న ఓంకాళియమ్మన్ ఆలయంలో మాసి అగ్నిగుండ ఉత్సవం గత నెల 28న పూల సమర్పణతో ప్రారంభమైంది. పుష్పాల సమర్పణ తర్వాత, దేవతను ఆవాహన చేయడం, శక్తి కరగం తీయడం, అగ్ని కరగం, శూలాలు గుచ్చడం, దీప పూజ, 108 శంఖాభిషేకం, పుష్పాలంకరణ వంటి వివిధ కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య ఘట్టమైన మాసి అగ్ని గుండ మహోత్సవం సందర్భంగా ఆలయం ముందు 60 అడుగుల పొడవైన అగ్ని గుండంను మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. బుధవారం వేకువజామున 4.30 గంటలకు మాలధారణ భక్తులు గంగ స్నానం ఆచరించారు. అనంతరం పూజారి, అతని కుటుంబం ముందుగా అగ్ని గుండ ప్రవేశం చేశారు. తరువాత పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు సహా 40 వేల మంది భక్తులు నిప్పులు తొక్కి మొక్కులు తీర్చుకున్నారు. అగ్నిగుండ ప్రవేశం చేసిన 40 వేల మంది భక్తులు -
బ్లాక్బస్టర్ దిశగా మర్మర్
తల్లి నటించిన చిత్ర సీక్వెల్లో తనయతమిళసినిమా: అనూహ్య ఘటనలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదే త్వరలో జరగబోతోంది. దీని గురించి ఇంత నమ్మకంగా చెప్పడానికి కారణం స్పష్టమైన ప్రకటన రావడమే. ఇకపోతే దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. పుట్టుకుతోనే పువ్వు వికసిస్తుందంటారు. అలా బాలతారగానే భళా అనిపించుకున్న శ్రీదేవి కథానాయకిగానూ ఇండియన్ సినిమాకు తనదైన అందమైన నటనను అందించి ప్రేక్షకులను పరవశింపజేశారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించి ఎవర్గ్రీన్ హీరోయిన్గా వెలిగారు. అలా శ్వాస ఉన్నంత వరకూ నటిగా కళామతల్లికి సేవలందించిన అద్భుత నటి శ్రీదేవి. బాలీవుడ్ చిత్ర నిర్మాత బోనీకపూర్ను పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరు రత్నాలాంటి కూతుర్లను సినీ కళామతల్లికి అందించారు. వారిలో నటి జాన్వీకపూర్ ఇప్పటికే హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ విజయపథంలో సాగుతున్నారు. రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హిందీ చిత్రాల్లో గత రెండేళ్లుగా కథానాయకిగా నటిస్తున్నారు. కాగా వీరిద్దరూ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. నటి జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్కు జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. కాగా రెండో కూతురు ఖుషీ కపూర్ తన తల్లి శ్రీదేవి కథానాయకిగా నటించిన మామ్ చిత్రానికి సీక్వెల్ నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్నే స్వయంగా పేర్కొన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన చెబుతూ 2017లో తన భార్య,నటి శ్రీదేవి కథానాయకిగా నటించిన మామ్ చిత్రానికి సీక్వెల్ను రూపొందించనున్నట్లు చెప్పారు. అందులో తన రెండవ కూతురు ఖుషీ కపూర్ ముఖ్య పాత్రలో నటించనున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మామ్ చిత్రానికి సీక్వెల్ అంటే ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదునటి ఖుషీ కపూర్ నూతన చిత్ర ప్రారంభోత్సవంలో నటుడు శశికుమార్, భరత్తో యూనిట్ సభ్యులు తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాల హీరోగా పేరు గాంచిన నటుడు శశికుమార్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు సత్యరాజ్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో నటి మెఘాశెట్టి, మాళవిక నాయకిలుగా పరిచయం అవుతున్నారు. వీరితో పాటూ ఎంఎస్.భాస్కర్, ఆడుగళం నరేన్, శరవణన్, గంజాకరుప్పు, ఇందుమతి, జోమల్లేరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఎం.గురు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఆర్.శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. జంబారా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ధర్మరాజ్ వేలుసామి, విజయకుమార్తో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్ఆర్.సతీశ్కుమార్ ఛాయాగ్రహణంను, ఎన్ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్వకుడు తెలుపుతూ ఒక బలమైన కథా,కథనాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదనీ,కుటుంబ అనుబంధాలు, బావోద్రేకాలతో జరరంజకంగా చిత్రం ఉంటుందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ను పట్టుకోట్టై, మన్నార్కుడి , పుదుకోట్టై, తంజావూర్, వేదారణ్యం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయడానికి ప్రణాళికను రచించినట్లు చెప్పారు. తమిళసినిమా: ఎస్పీకే.పిక్చర్స్ పతాకంపై ప్రభాకరన్ స్టాండ్ ఎలోన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం మర్మర్. హేమనాథ్ నారాయణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో రిచ్చీకపూర్, దేవరాజ్ ఆర్ముగం, నటి సుకన్య షణ్ముగం, యూవీకా రాజేంద్రన్,ఆరియా సెల్వరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో ఫస్ట్ పౌండ్ ఫుటేజ్ హార్రర్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై సక్సెస్పుల్గా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత ప్రభాకరన్ మాట్లాడుతూ మర్మర్ చిత్ర విజయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ చిత్రం కోసం అందరు చాలా శ్రమించారన్నారు. దర్శకుడు హేమనాథ్ నారాయణన్ కొత్త ట్రెండింగ్ కథతో దీన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారన్నారు. మర్మర్ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన ఎస్ఆర్ పిక్చర్స్ సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. కొత్తవారు చేసిన పని ముందుగా చేదుగా ఉంటుందని, ఆ తరువాత మధురంగానూ, ఆపై అంతా వ్యాపిస్తుందని, అలానే కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, సాంకేతిక వర్గం పని చేసిన మర్మర్ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుందని తాను చెప్పడం కాదని, డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారని అన్నారు. తాను ఎస్పీకే సంస్థను ప్రారంభించి 12 ఏళ్లు అవుతుందని, ఇప్పటి వరకూ తన యూనిట్ సభ్యులు ఆదివారాల్లో గానీ, రెండవ శనివారాల్లోగాని పని చేయలేదని, అలాంటిది ఈ చిత్రం కోసం గత ఐదారు రోజులుగా రేయింబవళ్లు పని చేశారని, వారే తన బలం అని నిర్మాత ప్రభాకరన్ పేర్కొన్నారు. మర్మర్ చిత్రానికి మరింత విజయాన్ని చేకూర్చాలని, అప్పుడు మరిన్ని చిత్రాలు రూపొందే అవకాశం ఉంటుందని చిత్ర దర్శకుడు హేమంత్ నారాయణన్ పేర్కొన్నారు -
పంట బీమా కేటాయింపులో నిర్లక్ష్యం తగదు
తిరువళ్లూరు: జిల్లాలోని రైతులకు పంటల బీమాను అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి(స్టాటస్టిక్ విభాగం) జయ అఽధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా కోరమంగళం గ్రామంలోని వరి పంటలను అధికారులతో కలిసి పరిశీలించారు. పంట బీమా కోసం నమోదయిన రైతుల వివరాలు, పంటల విస్తీర్ణం, సాగు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్కాడుకుప్పంలోని మహోన్నత పాఠశాలలో సహాయకుడి సాయంతో పరీక్షలు రాస్తున్న విద్యార్దుల డేటా సేకరించి దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూండి యూనియన్ రామంజేరి 11వ వ్యవసాయ స్టాటస్టిక్స్ వివరాల సేకరణ ఫేస్–2, 3తదితర పనులను పరిశీలించి అధికారుల వద్ద సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ, రైతులకు ఇవ్వాల్సిన బీమా విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. పంటల సాగు నమోదు, రైతుల వివరాల నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ భారతి, చైన్నె మండల స్టాటస్టిక్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ ఉమారాణి పాల్గొన్నారు. -
వైభవంగా అరుణాచలేశ్వరుని తీర్థవారి
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ తండ్రి వల్లల మహారాజుకు మాసి మాస పౌర్ణమిని పురష్కరించుకుని దర్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి రాజగోపురం దారిలో స్వామివారిని తిరువణ్ణామలైలోని పళ్లిగొండ పట్టు గ్రామం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. బుధవారం ఉదయం శివాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామి వారిని ఊరేగింపుగా గౌతమి నది వద్దకు తీసుకొచ్చి దర్పణ పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి శివాచార్యుల వేద మంత్రాల నడుమ తీర్థవారి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. గిరివలయం సమయం ప్రకటన ఈనెల పౌర్ణమి సమయాన్ని ఆలయ అధికారులు ప్రకటించారు. గురువారం ఉదయం 11.40 గంటల నుంచి శుక్రవారం ఉదయం 12.57 గంటల వరకు పౌర్ణమి ఉంటుందని ఆ సమయంలో గిరివలయం వెళ్ల వచ్చునని ఆలయ అధికారులు ప్రకటించారు. -
నిధుల కేటాయింపుపై వాగ్వాదం
వేలూరు: వేలూరు కార్పొరేషన్ సమావేశంలో నిధుల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం వేలూరు కార్పొరేషన్ సమావేశం మేయర్ సుజాత అధ్యక్షతన జరిగింది. ముందుగా కార్పొరేటర్లకు బడ్జెట్కు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. అందులో గత సంవత్సరం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ జోన్కు సక్రమంగా కేటాయించక పోవడంతో పాటు నిధులు కేటాయించినట్లు చిత్ర పటాలను ముద్రించారని కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. దీంతో కమిషనర్ జానికి వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ అన్బు మాట్లాడుతూ కార్పొరేషన్లోని 60 వార్డుల్లోను ఆస్తి పన్ను రూ.200 చెల్లించే వారికి కూడా ప్రస్తుతం రూ.4 వేలు వస్తున్నాయని వీటిని నిరుపేదలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పన్నులు చెల్లించకుంటే కార్పొరేషన్ అధికారులు అపరాధం విధిస్తున్నారని ఇదేం న్యాయమన్నారు. వీటిపై విచారణ చేస్తామని కమిషనర్ తెలిపారు. అనంతరం మేయర్ సుజాత 2024–25 సంవత్సరపు బడ్జెట్ను దాఖలు చేశారు. ఆ సమయంలో వేలూరు కార్పొరేషన్లో పలు కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు జరిగినట్లు అందులో ప్రకటించారని అయితే కాట్పాడి డివిజన్కు ఎటువంటి నిధులు కేటాయించకుండా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా తమ ప్రాంతంపై శవతి ప్రేమ చూపుతున్నారని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆరోపించారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే కార్తికేయన్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సమావేశం సద్దు మనిగింది. డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, కార్పొరేషన్ కమిషనర్ జానికి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
బిడ్డలను కనండి.. తమిళ పేర్లు పెట్టండి
సాక్షి, చైన్నె: తక్షణం బిడ్దలను కనండి.. తమిళ పేర్లు పెట్టండి అని నవ వధూవరులకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పిలుపు నిచ్చారు. చైన్నె కలైవానర్ అరంగంలో సీఎం ఎంకే స్టాలిన్ 72వ బర్త్డే వేడుకలలో భాగంగా 72 జంటలకు వివాహ వేడుక బుధవారం జరిగింది. అత్యంత వేడుకగా జరిగిన ఈ వివాహంలో నవ దంపతులకు 50 రకాల సారెలను అందజేశారు. వధువరులకు తాళి బొట్లను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి శేఖర్బాబు పూర్తి సమయం రాజకీయ నేత అని కితాబు ఇచ్చారు. అన్ని చోట్ల ఆయనే ఉంటారని, అందరికి సింహస్వప్నంగా మారి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మూడేళ్లలో ఆయన నేతృత్వంలో 1700 వివాహాలు జరిగి ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇందులో అనేక కులాంతర, ప్రేమ వివాహాలు ఉన్నాయని వివరించారు. తనది కూడా ప్రేమ వివాహమేనని గుర్తు చేస్తూ, తన కుటుంబంలో అనేక ప్రేమ వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రేమకు తమ కుటుంబ పెద్దలు వ్యతిరేకులు కాదు అని స్పష్టం చేశారు. పెద్దలు కుదిర్చిన వివాహం తక్కువేనని, రెండు తరాలలో ప్రేమ వివాహాలే ఎక్కువ అని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కొత్త జీవితంలో అడుగు పెడుతున్న దంపతులు తక్షనం బిడ్దలను కనాలని, ఎక్కవ మందిని కనాలని, వారందరికి తమిళ పేర్లు పెట్టాలని పిలుపు నిచ్చారు. కుటుంబ నియంత్రణను విజయవంతం చేసినందుకు గాను తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప శిక్ష విధించే పనిలో పడిందని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించేందుకు సిద్ధమయ్యారని, వీరి కుట్రలకు చెక్పెట్టడం లక్ష్యంగా ద్రావిడ మోడల్ సీఎం స్టాలిన్ దూకుడు పెంచి ఉన్నారన్నారు. ఇందుకు అందరం అండగా నిలబడుదామంటూ, ఆలస్యం చేయకుండా నవదంపతులు బిడ్డలను కనాలని మరో మారు విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు శేఖర్బాబు, ఎం సుబ్రమణియన్ , మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు. -
40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత
దాదాపు 40 ఏళ్ల చరిత్ర గల మరో థియేటర్ నేలమట్టమైంది. సూపర్స్టార్ రజనీ కాంత్ చేతులమీదుగా 1985లో చెన్నైలో ప్రారంభమైన బృందా థియేటర్.. దశాబ్దాల పాటూ అభిమానులను ఎంతో అలరించింది. కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఈ థియేటర్ ఇక కనుమరుగు కానుంది. ఇప్పటికే సినిమాలను ప్రదర్శించడం ఆగిపోయింది. గత కొన్నేళ్లుగా సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. దీనికి ప్రతిగా తమిళనాడు వ్యాప్తంగా ఐకానిక్ థియేటర్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే చైన్నెలో పాపులర్ అయిన అగస్త్య, కామథేను, కృష్ణ వేణితదితర ఎన్నో థియేటర్లు నేలమట్టమయ్యాయి. ఈ స్థితిలో ఉత్తర చైన్నెకి ల్యాండ్మార్క్గా నిలిచిన పెరంబూర్ బృందా థియేటర్ చరిత్ర సోమవారంతో ముగిసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)1985 ఏప్రిల్ 14న సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులమీదుగా బృందా థియేటర్ని ప్రారంభించారు. అప్పుడు లోగనాథన్ చెట్టియార్ దాని యజమాని. అతని మరణానంతరం, అతని వారసులు విశ్వనాథన్, చంద్రశేఖర్ దీనిని కొనసాగించారు. ఈ మంగళవారం నుంచి ప్రదర్శనలు నిలిపివేశారు. ఈ థియేటర్ను కూల్చివేయనున్నారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ స్థలాన్ని కొనుగోలు చేసిందని, త్వరలోనే భవనాన్ని కూల్చివేసి అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్లు చెబుతున్నారు. 40 ఏళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మా థియేటర్కి బృందా థియేటర్ అని పేరు పెట్టినా రజనీ థియేటర్ అని పిలుస్తారని, రజనీ ఈ థియేటర్ని ప్రారంభించారు.. రజనీ సినిమాలన్నీ ఇక్కడ ప్రదర్శితమయ్యాయని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
వైఎస్ జగన్ను కలిసిన తమిళనాడు మంత్రి ఈవీ వేలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్కు డీఎంకే నేతలు అందజేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం పంపించారు. -
నాట్రంబల్లిలో భారీ చోరీ
వేలూరు: నాట్రంబల్లిలో భారీ చోరీ జరిగింది. తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని అగ్రావరం గ్రామంలో ఓంశక్తి నగర్కు చెందిన ముత్తు మేకల వ్యాపారి. ఇతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ముత్తు సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక ఉన్న తలుపులు, కిటికీ కమ్మీలు తీసి ఇంట్లోకి చొరబడి 40 సవర్ల బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ముత్తు ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వేలి ముద్రలు స్వీకరించారు. అదేవిధంగా వేలూరు పట్టణ నడిబొడ్డున ఉన్న సున్నపు వీధిలో మూడు దుకాణాల్లో చోరీ చోటుచేసుకుంది. -
కోలాహలం..సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం
వేలూరు: కాట్పాడి సమీపంలోని వళ్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని మంగళవారం కోలాహలంగా నిర్వహించారు. వేలూరు జిల్లాలోనే వళ్లిమలై సుబ్రమణ్యస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆలయంలో మాసి మాసం పురష్కరించుకుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. రథోత్సవాన్ని రాష్ట్ర మంత్రి దురై మురుగన్, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ మహారథోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై రథంపై బొరుగులు, మిర్యాలు చల్లి రథాన్ని లాగుతూ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని పురష్కరించుకుని వళ్లిమలై ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఉదయం ఆలయంలో స్వామి వార్లకు తిరుకల్యాణోత్సవం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక అలంకరణలు చేసి రథంలో స్వామివారిని ఆశీనులను చేశారు. -
కనులపండువగా తిరుమలీశ్వరర్ మహాకుంభాభిషేకం
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపంలో 1,500 సంవత్సరాల చరిత్ర కల్గిన తిరుమలీశ్వరర్ ఆలయ మహాకుంభాభిషేకాన్ని సోమవారం కనులపండువగా నిర్వహించారు. పళ్లిపట్టు సమీపంలోని కొళత్తూరులో కుశస్థలినది తీరంలో 1,500 ఏళ్ల కిందట వశ్రీ కృష్ణదేవరాయులు త్రిపురసుందరి సమేత తిరుమలేశ్వరర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఈక్రమంలో పదేళ్ల కిందట తిరుత్తణికి చెందిన శేషన్, యగ్నప్రియ దంపతులు ఆలయం జీర్ణోద్ధరణ చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణుల సహకారంతో పదేళ్ల నుంచి ఆలయ పునఃనిర్మాణ పనులు జరిగాయి. రాజ, విమాన గోపురం, సన్నధులు, రాళ్ల మండపాలు, ఆలయ రాతి ప్రహరీ గోడలు, రాతి ఽ ధ్వజస్తంభం పనులు చేసి సర్వాంగసుందరంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేశారు. దీంతో గురువారం నుంచి సోమవారం వరకు ఐదురోజుల పాటు మహాకుంభాభిషేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం మేళ తాళాల నడుమ పవిత్రపుణ్య తీర్థాలను కలశాలతో తీసుకెళ్లి రాజగోపురం, విమాన గోపురాలకు శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు శివనామస్మరణతో స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులపై పవిత్ర తీర్థజలాలు వెదజెల్లారు. సాయంత్రం స్వామి వారి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామీణులు మహాకుంభాభిషేకం ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కనుల పండువగా రథోత్సవం
సేలం : విరుదాచలం విరుద్ధగిరీశ్వరర్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగి మొక్కులు తూర్చుకున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా విరుదాచలంలో సుమారు 1800 సంవత్సరాల పురాతనమైన విరుద్దాంబికై , బాలాంబికై ల సమేత విరుద్దగిరీశ్వర్ స్వామి ఆలయం ఉంది. 5 గోపురాలు, 5 నందిలు, 5 ప్రాకారాలు, 5 తీర్థాలు, 5 రథాలు అంటూ అన్ని ఐదు అంకెతో ప్రత్యేకాంశాలు కలిగిన ఆలయం ఇది. ఏటా లాగేనే ఈ ఏడాది మాస ఉత్సవాలు గత 3వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం మంగళవారం ఉదయం 5.50 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రమణ్య స్వామి, విరుద్దగిరీశ్వరర్, విరుద్దాంబికై , చండికేశ్వరర్ వంటి పంచమూర్తులకు పాలు, పెరుగు, పన్నీరు, కొబ్బరి నీరు, తేనె, పంచామృతం వంటి పలు ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి, పూజలు నిర్వహించారు. అనంతరం పంచ మూర్తుల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక ఐదు రథాలపై ఊరేగించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి రధాలను పట్టి లాగారు. నాలుగు మాడ వీధులను ఊరేగిన అనంతరం ఐదు రధాలు ఆలయానికి చేరుకున్నాయి. కాగా ఉత్సవాలలో 10వ రోజు బుధవారం మాసి మహా తీర్థవారి, గురువారం తెప్పోత్సవం, 14వ తేది చండికేశ్వరర్ ఉత్సవం, 15వ తేది ధ్వజ అవరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయం వద్ద నుంచి బయలుదేరుతున్న పంచ మూర్తుల రధాలు -
తిరువళ్లూరులో భారీ వర్షం
తిరువళ్లూరు: పట్టణంలో మంగళవారం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎండల దంచికొడుకున్నాయి. ఉక్కపోత, భారీగా ఎండల తీవ్రత పెరిగిన క్రమంలో మంగళవారం నుంచి జిల్లాలోని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లు జలమయంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సీఎం బహిరంగసభ కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంల కటౌట్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది రోజులుగా ఉక్కపోత ఎండతో ఇబ్బంది పడుతున్న జనానికి మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాతావరణం చల్లబడి కాస్తా ఊరటనిచ్చింది. -
సీఎం రాకకు భారీ ఏర్పాట్లు
తిరువళ్లూరు: రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు డీఎంకే పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం తిరువళ్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం డీఎంకే నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న కేంఽద్ర ప్రభుత్వం తీరుతో పాటు పార్లమెంట్లో తమిళనాడు ఎంపీలను కించపరిచేలా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ డీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ద్వారా ఽనిరసన వ్యక్తం చేయాలని డీఎంకే అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రతి జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్చార్జ్లుగా నియమించి తమ గళాన్ని గట్టిగా వినిపించాలని సూచించారు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో జరిగే నిరసన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ హాజరుకానున్నారు. ఇందుకోసం భారీ స్టేజీతో పాటు 20 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే రోడ్లకు ఇరువైపులా పార్టీ జెండాలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు సభ ప్రారంభమై పది గంటల వరకు జరిగే అవకాశం వుంది. సభకు భారీగా జనాన్ని సమీకరణ చేయాలని నేతలు నిర్ణయించి కృషిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పార్టీ నేత అన్బగం కలై, మంత్రి నాజర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, కృష్ణస్వామి, తిరుత్తణి చంద్రన్ మంగళవారం పరిశీలించారు. అయితే మంగళవారం మోస్తరు వర్షం కురవడంతో ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. సభా ప్రాంగణం వద్ద నీరు నిలిచిపోయింది. 40 నిమిషాల పాటు కురిసిన వర్షం తెరిపి ఇవ్వడంతో ఏర్పాట్లను మళ్లీ ప్రారంభించి శరవేగంగా చేస్తున్నారు. -
వీఐటీ, స్వామినాథన్ ఫౌండేషన్ ఒప్పందం
కొరుక్కుపేట: చైన్నెలోని వీఐటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్న్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఐటీ, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య డ్రోన్న్లపై సహకార పరిశోధన, ఇతర పర్యావరణ కాలుష్య అధ్యయనాల కోసం అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో వీఐటీ వ్యవస్థాపకుడు విశ్వనాథన్, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్పర్సన్ సౌమ్య స్వామినాథన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. సౌమ్యస్వామినాథన్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, రక్షణ కోసం తమిళనాడు గొప్ప చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. వీఐటీ చాన్స్లర్ మాట్లాడుతూ 2047 నాటికి భారత్ అభివృద్ధ చెందిన దేశంగా మారాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని గుర్తు చేశారు. ప్రత్యేక అతిథులుగా శ్రీలంక రక్షణ శాఖ సహాయ కార్యదర్శి సచిని దిసనాయకే, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం, కెప్టెన్ లక్ష్మీ, వీఐటీ సలహాదారు కల్యాణి, వీఐటీ అసోసియేట్ వైస్ చాన్స్లర్ త్యాగరాజన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం హాజరయ్యారు. -
సదరన్ రైల్వేలో విజయవంతంగా మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27 నుంచి పక్షం రోజులు పాటూ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారంతో విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకలు మంగళవారం ఉదయం సదరన్ రైల్వే ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సదరన్ రైల్వే మహిళా ప్రధాన కార్యాలయ సంస్థ (ఎస్ఆర్డబ్ల్యూ హెచ్క్యూవో) అధ్యక్షురాలు సోనియాసింగ్ ప్రత్యేక అతిథులుగా ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు రేఖ కౌశల్ , సదరన్ రైల్వే ప్రదాన ఆర్థిక సలహాదారు మాలాబికా ఘోష్ హాజరయ్యారు. పక్షం రోజులు పాటూ మహిళా ఉద్యోగులు అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అతిథులు మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనే భావన 20 వ శతాబ్దం ప్రారంభంలో కార్మికుల ఉద్యమాలు, మెరుగైన పని పరిస్థితులు, ఓటు హక్కులు, సమాన అవకాశాల కోసం డిమాండ్ల నుంచి ఉద్భవించిందని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళల అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ భారతీయ రైల్వేలు అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చురుకుగా పాటిస్తోందని తెలిపారు. -
తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్ రద్దు
సాక్షి, చైన్నె: తమిళంలో పేరు బోర్డులు లేకపోతే లైసెన్స్లు రద్దు చేయడానికి చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. చైన్నె, కోవై, తిరునెల్వేలి వంటి ముఖ్య నగరాలలో తమిళంలో పేరు బోర్డులు కచ్చితంగా ఉంచాలని, దాన్ని క్రమంగా పాటించాలని, ఆ విధంగా పాటించని దుకాణాలపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది . చైన్నె నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు, మాల్స్ తదితర అన్ని రకాల వ్యాపార సంబంధిత కార్యాలయాల నేమ్ బోర్డుల్లో పేర్లు పెద్దవిగా తమిళ అక్షరాలలోను, దానికంటే చిన్న అక్షరాలలో ఆంగ్లం లేదా ఇతర భాషలు ఉండాలన్న ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీన్ని వ్యాపారులు పాటించడం లేదు. అయితే తమిళ అక్షరాలు అతి చిన్నవిగాను, ఇంగ్లీషు అక్షరాలు అతి పెద్దవిగాను అనేక నేమ్ బోర్డులు నగరంలో కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి కార్పొరేషన్కు ఫిర్యాదులు చేరాయి. చైన్నె కార్పొరేషన్లో 70 వేల దుకాణాలు లైసెన్స్ పొంది నినర్వహిస్తున్నాయి.ుు. వీటిలో ప్యారిస్, సౌకార్పేట వంటి ప్రాంతాలలో ఉన్న దుకాణాలలో తమిళ నేమ్ బోర్డులు లేనట్టు సమాచారం. తమిళంలో నేమ్ బోర్డులు పెట్టని దుకాణాలకు వివరణ కోరుతూ నోటీసులు పంపించాలని చైన్నె కార్పొరేషన్ నిర్ణయించింది. ఏడు రోజుల్లోపు బోర్డులను సరి చేయకుంటే వాటి లైసెన్స్ను రద్దు చేసే విధంగా నిర్ణయించారు. సంబంధించి కార్పొరేషన్ అధికారుల అధ్యక్షతన సమావేశం నిర్వహించి తమిళంలో పేర్ల బోర్డులు పెట్టే విధంగా దుకాణాలకు నోటీసులు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె కార్పొరేషన్లో ఇందుకుగాను సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో తమిళంలో పేర్ల బోర్డులు లేని దుకాణాలపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కార్పొరేషన్ కార్పొరేటర్లు తమ తమ ప్రాంతాలలో ఉన్న దుకాణాల గురించి సమాచారం తెలపాలని అఽధికారులు సూచించారు. ● చైన్నె కార్పొరేషన్ నిర్ణయం -
వినియోగదారులకు ఏఐ ఆధారిత సేవలు
సాక్షి, చైన్నె: వినియోగదారులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెటింగ్, సేవా పరిష్కారాలను మెరుగుపరచడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టినట్టు పోతీస్ స్వర్ణ మహల్ డైరెక్టర్ అశోక్ పోతీ తెలిపారు. ఈ సహకారం అన్నది సేల్స్ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్ ద్వారా వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోతీస్ స్వర్ణ మహల్ డిజిటల్–ఫస్ట్ భవిష్యత్తును పరిగణించిందన్నారు. ఇందులో భాగంగా ఈ– మెయిల్, మెసేజింగ్, వాట్సాప్, వీడియో, చాట్, సోషల్ మీడియా నోటిఫికేషన్లలో కస్టమర్లు పరస్పరం సజావుగా అనుసంధానించే బహుళ–ఛానల్ వ్యూహాన్ని లవలంబించినట్టు వివరించారు. సేల్స్ఫోర్స్ ఏఐ –ఆధారిత పరిష్కారాలను సమగ్రపరచడం ద్వారా రిటర్న్–టు–స్టోర్ ప్రచారాలు, రియల్–టైమ్ ప్రమోషన్లు మెరుగు పడుతుదన్నారు. ఆన్లైన్ , ఆఫ్లైన్ టచ్పాయింట్లలో స్థిరమైన , సమర్థవంతమైన అనుభవాన్ని నిర్ధారించడానికి, కస్టమర్ సంబంధాలను బలోపేతం చేయడానికి, దక్షిణ భారతదేశం అంతటా వ్యాపార వృద్ధిని నడిపించడానికి ఓమ్నిఛానల్ వ్యూహాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఏఐ, ఆటోమేషన్ ద్వారా కార్యాచరణ నైపుణ్యాన్ని మరింతగా పెంచేందుకు వీలుందన్నారు. సేల్స్ఫోర్స్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ – కన్స్యూమర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ మన్కిరణ్ చౌహాన్ మాట్లాడుతూ, డిజిటల్–ఫస్ట్ ప్రపంచంలో వ్యాపారాల అభివృద్ధి , అధునాతనమైన, వ్యక్తిగతీకరించిన కస్టమర్ అనుభవాలను అందించడం తమకు కీలకంగా పేర్కొన్నారు. రిటైల్ అనుభవాలను మార్చడం ఏఐ–ఆధారిత పరిష్కారాల శక్తికి నిదర్శనం అని వివరించారు. సేల్స్ఫోర్స్ మార్కెటింగ్ క్లౌడ్ , సర్వీస్ క్లౌడ్ , కామర్స్ క్లౌడ్ను ఉపయోగించడం ద్వారా వినియోగ దారులకు మరింత చేరువ అయ్యేందుకు మార్గం సులభతరంగా కాకుండా, ఆధునీకరించే విధంగా ఉంటుందన్నారు. -
బట్టీ విధానంతో విద్యార్థులు ఎదగలేరు
తిరువళ్లూరు: విద్యార్థులు బట్టీ పట్టి పరీక్షలు రాస్తే మార్కులు పెరుగుతాయే తప్ప భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు విద్యార్థులకు సూచించారు. తిరువళ్లూరులో పుస్తక ప్రదర్శన పది రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. బట్టీ విధానం వల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించారు. ఇరయన్బు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాక్టికల్ విధానం వల్లే ప్రయోజనం కలుగుతుందన్నారు. చాలా మంది విద్యార్థులు, విద్యాసంస్థలు మార్కుల కోసం బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పరీక్షకు ముందు రోజు వరకు పుస్తకాలతో కుస్తీ పడొద్దన్న ఆయన, పరీక్షలంటే భయం వద్దన్నారు. అనంతరం ప్రాక్టికల్ విధానం పట్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు. -
ఏనుగుదాడిలో యువకుడి మృతి
సేలం : నీలగిరి జిల్లాలో గత నెల మొత్తం అధిక మంచు కురిసినందువలన అడవి ప్రాంతంలో ఎండిగిపోయి కనిపిస్తోంది. అడవిలో ఉన్న నీటి ఆవాసాలు కూడా ఎండిపోయి కనిపించాయి. దీంతో అడవి ప్రాంతంలో నుంచి నీళ్లు, ఆహారం కోసం ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఈ స్థితిలో కున్నూర్ సమీపంలో దట్టమైన అడవి మధ్యలో సెంబక్కరై గ్రామంలో 50కి పైగా గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ క్రమానికి చెందిన ప్రజలు తమ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయడం కోసం రోజూ కున్నూర్ నగర ప్రాంతానికి వచ్చి వెళుతున్నారు. సేపాక్కం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (30), అతని స్నేహితుడు రవి ఇద్దరు సోమవారం రాత్రి నగరానికి వచ్చి అత్యవసర వస్తువులు కొనుగోలు చేశారు. అనంతరం వారు గ్రామానికి తిరిగి వెళుతుండగా అటువైపుగా వచ్చిన అడవి ఏనుగు అకస్మాత్తుగా విజయ్ కుమార్పై దాడికి పాల్పడింది. దీంతో విజయ్ కుమార్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న కున్నూర్ అటవీ రేంజర్ రవీంద్రనాధ్ అధ్యక్షతన అటవీ శాఖ వారు ఆ ప్రాంతానికి వెళ్లి విజయ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపంచనామా నిమిత్తం అంబులెన్స్ ద్వారా కున్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అడవి ఏనుగు దాడి గురించి కున్నూర్ అటవీ శాఖ అధికారులు, మేల్కున్నూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. రూ. 50 వేలు పరిహారం అందజేత.. అడవి ఏనుగు దాడితో మృతి చెందిన వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కొరడా కె.రామచంద్రన్ మంగళవారం ఆస్పత్రికి వెళ్లి బంధువులకు ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నష్ట పరిహారాన్ని త్వరగా అందే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది. అదేవిధంగా కున్నూర్ అటవీ శాఖ తరపున మృతి చెందిన యువకుడి కుటుంబానికి తక్షణ నష్టపరిహారంగా రూ. 50,000 అందజేశారు. -
పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్
తమిళసినిమా: స్టార్ హీరోయిన్లకు కెరీర్ పరంగా బ్రేక్ రావచ్చేమో గానీ, పుల్ స్టాప్ మాత్రం పడదు. ఉన్నత స్థాయిలో రాణించిన చాలా మంది కథానాయకిలు అప్ అండ్ డౌన్ చూసిన వారే. అలాంటి పరిస్థితులనే సెకెండ్ ఇన్నింగ్ అంటారు. అయితే అలా కెరీర్ డౌన్ అయినప్పుడు మాత్రం కామెంట్స్ ఎదుర్కోక తప్పదు. ఇందుకు నటి పూజా హెగ్డే అతీతం కాదు. ఇంతకు ముందు తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అలాంటిది ఈ భామ నటించిన కొన్ని తెలుగు, తమిళం, హిందీ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో కొత్త అవకాశాలు ముఖం చాటేసాయి. దీంతో పూజాహెగ్డే పని అయిపోయింది. ఇక మూట ముల్లె సర్దుకోవాల్సిందే అనే కామెంట్స్ హల్ చల్ చేశాయి. అయితే తాజాగా పూజ హెగ్డే చేతిలో మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉండటం విశేషం. దీన్ని ఆమెకు సెకండ్ ఇన్నింగ్ అంటారు లేక చిన్న గ్యాప్ అంటారు గాని పూజా హెగ్డే ను తాజాగా అందుకుంది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమనే అని చెప్పక తప్పదు. ఈమె మార్కెట్ బాగా పడిపోయిన సమయంలో నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్లోనూ నటించే లక్కీఛాన్స్ను పూజా హెగ్డేనే అందుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే నటుడు రాఘవ లారెనన్స్ పూజహెగ్డేకు మరో అవకాశం కల్పించారు. ఈ మూడు చిత్రాల్లో సూర్య జంటగా నటించిన రెట్రో చిత్రం ముందుగా తెరపైకి రానుంది. సక్సెస్ఫుల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఇందులో నటుడు జయరాం, కరుణాకరన్, జోజు జార్జ్, సుజిత్ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగులు పూర్తి చేసుకున్న రెట్రో చిత్రం ప్రస్తుతం నిర్మాణానాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రాన్ని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో తన పాత్రకు నటి పూజా హెగ్డే డబ్బింగ్ చెప్పుకున్నారన్నది. ఆమె డబ్బింగ్ చెబుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అవుతుంది. ఆ విధంగా నటి పూజా హెగ్డే కొత్త ఛాలెంజ్కు రెడీ అయ్యారన్నమాట. -
పేట కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒంట్లో హుషారు, మనిషిలో సత్తా ఉంటే వయసుతో పనేముంటుంది. నటుడు రజినీకాంత్ ఇందుకు ఓ ఉదాహరణ. ఏడు పదుల వయసు పైబడినా ఈయన ఇప్పటికీ యువ హీరోలతో పోటీపడే విషయములో తగ్గేదేలే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే వరుసగా చిత్రాలు చేస్తూ యువ నటులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకుండానే జైలర్ –2 చిత్రానికి సిద్ధమైపోవడం చూస్తేనే ఆయన స్పీడ్ ఎలా ఉందో తెలుస్తుంది. కాగా ఇటీవల రజనీకాంత్ యువ దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందు పా. రంజిత్ దర్శకత్వంలో కబాలి, కాలా వంటి సక్సెస్ నక్షత్రాల్లో నటించిన రజనీకాంత్ ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట, నెల్సన్ దర్శకత్వంలో జైలర్ ,అదేవిధంగా జైభీమ్ చిత్రం ఫేమ్ టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దశరత్వంలో కూలీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది దీంతో ఏమాత్రం విరామం లేకుండా మరోసారి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రంలో నటించటానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాగా ఈ చిత్రం ప్రారంభ దశలో ఉండగానే రజనీకాంత్ మరో చిత్రానికి పచ్చ జెండా ఊపారన్నది తాజా సమాచారం. ఈయన మరోసారి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో అవుతోంది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తెరపైకి వచ్చిన పేట చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. జైలర్– 2 చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న రెట్రో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన చిత్రం రజినీకాంత్తోనే అనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
జననాయగన్లో దళపతి బాయ్స్?
తమిళసినిమా: నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్. హెచ్ వినోద్ కథ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు నాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సరదాగా జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయ అంశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. లేకపోతే నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయన నటిస్తున్న చివరి చిత్రం ఇదే అవుతుందనే ప్రచారం జరుగుతుండటంతో జననాయకన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల మధ్య ఆసక్తిని పెంచేసాయి. దీంతో చిత్రంలోని తొలి పాటను విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా జన నాయకన్ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ నెలలో గాని, వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా గాని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్, అట్లీ సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ముగ్గురిని దళపతి బాయ్స్ అంటారు. కాగా తాజాగా ఈ దళపతి బాయ్స్ నటుడు విజయ్ చివరి చిత్రం అయినా జననాయకన్లో కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. -
ఇళయరాజకు బ్రహ్మరథం
● 000సాక్షి, చైన్నె: ఆసియాలోనే ఎవరూ సాధించని ఘనతను లండన్ వేదికగా లైవ్ సింఫోనితో సొంతం చేసుకుని చైన్నెలో అడుగు పెట్టిన సంగీతజ్ఞాని ఇళయరాజకు విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, అధికారులు అధికారిక ఆహ్వానం పలికారు. సంగీతజ్ఞాని ఇళయరాజ ఈనెల 8న లండన్లో తొలిసారిగా లైవ్ సింఫనీ కచ్చేరి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే ఎవ్వరూ సాధించని ఈ ఘనతను ఇళయరాజా సొంతం చేసుకోవడంతో ఆయనకు అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఉదయాన్నే చైన్నెకు చేరుకున్న సంగీత జ్ఞానికి విమానాశ్రయంలో ఘన స్వాతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఓ వైపు అధికారిక ఆహ్వానం పలికారు. మరోవైపు బీజేపీ, వీసీకే తదితర పార్టీలు, సంఘాలు, అభిమానులు దూసుకొచ్చి ఇళయరాజను అభినందిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇళయ రాజమాట్లాడుతూ, మనస్సు పులకించిందన్నారు. తనకు అధికారిక ఆహ్వానంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. సింఫోని లైవ్ మరో 13 దేశాలలో జరగనున్నాయని వివరించారు. అక్టోబరు 6న దుబాయ్లో, సెప్టెంబరు 6న ప్యారీస్లో ఆ తర్వాత జర్మన్ తదితర దేశాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నట్టు పేర్కొన్నారు. ఈ సంగీతం దీంతో ఆగదు అని, ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతుందన్నారు. తనకు 82 ఏళ్లు అవుతోందని, ఈ వయస్సులో ఏమిచేస్తాడో అని అనుకోవద్దని, పన్నైపురం నుంచి వచ్చినప్పడు చెప్పులు కూడా లేకుండా వచ్చి తన కాళ్లపై నిలబడ్డానని, ఇప్పుడు కూడా అలాగే నిలబడి ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత అర్థం చేసుకోవాలి.. దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారి వారి విభాగాలలో ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇక, తాను సంగీతకారుడిని అని, సంగీత దేవుడు అని తనను పిలవడం సబబుకాదన్నారు. తాను దేవుడ్ని కాదు.. సాధారణ మనిషిని అని వ్యాఖ్యానించారు. తనను దేవుడు అంటే, ఇళయరాజ స్థానానికి దేవుడిని తీసుకొచ్చేశారే అన్న భావన, వేదన కలుగుతోందన్నారు. త్వరలో తమిళనాడులోనూ సింఫోని జ్వలిస్తుందన్నారు. మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటడమేకాకుండా, సంగీత ప్రపంచంలో ఎవ్వరూ సాధించని ఘనతను ఇళయరాజ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
ఢిల్లీలో తమిళ ఎంపీల నిరసనల హోరు
సాక్షి, చైన్నె: పార్లమెంట్ వేదికగా తమిళ ఎంపీలను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, తమిళనాడుకు విద్యా నిధుల పంపిణీకి డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ ఆవరణలో డీఎంకే ఎంపీ కనిమొళి, ఎండీఎంకే ఎంపీ వైగో, వీసీకే ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ , వీసీకే తదితర రాష్ట్రానికి చెందిన 39 మందితోపాటూ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎంపీ ఈ నిరసనలో పాల్గొన్నారు. తమిళ ఎంపీలను కించపరిచిన ధర్మేంద్ర ప్రదాన్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఇదిలా ఉండగా ధర్మేంద్ర ప్రదాన్కు వ్యతిరేకంగా తమిళనాట నిరసనలు హోరెత్తాయి. ఆయన దిష్టిబొమ్మలను డీఎంకే వర్గాలు దగ్ధం చేశారు. ఈ నిరసనలలో పాల్గొన్న డీఎంకే వర్గాలు 11 వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అకాల వర్షంతో ఆహ్లాదం సాక్షి, చైన్నె: వేసవిలో అకాల వర్షం పలకరించింది. మంగవారం రాష్ట్రంలో పలు జిల్లాలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం చైన్నె, శివారు జిల్లాలతో పాటూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో అధికంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం తూత్తుకుడి, తెన్కాశి, తిరునల్వేలిలలో వాతావరణం చల్లబడినట్టు పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో మంగళవారం ఉదయం నుంచి చైన్నె, శివారులలో తెర పించి తెరపించి చిరుజల్లుల వాన పడింది. కొన్ని సందర్భాలలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. వర్షం కారణంగా భానుడు తెర మరుగయ్యాడు. వాతావరణం పూర్తిగా మారినట్లయ్యింది. ఇదే పరిస్థితి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి, కన్యాకుమారిలలో నెలకొంది. అక్కడక్కడ చెదురుముదురుగా వర్షం పడింది. మదురై, విరుదుగనర్, శివగంగైలతో పాటూ డెల్టా జిల్లాలు మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్లలో వర్షం పలకరించింది. ఈ వర్షాలు మరో రెండురోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రైలు బోల్తాకు కుట్ర? – కోవైలో కలకలం సేలం: సేలం రైల్వే డివిజన్ పరిధిలోని కోవై సింగానల్లూర్ రైల్వే స్టేషన్కు సోమవారం రాత్రి 10.15 గంటకు సేలం మార్గంలో తిరుపతి – కోవై ఎక్స్ప్రెస్ వెళ్లింది. అప్పుడు పక్కన వెళుతున్న కోవై – సేలం రైలు మార్గంలో రైల్వే ట్రాక్పై అది పెద్ద కాంక్రీట్ ఉండడాన్ని లోకో పైలెట్ గమనించారు. దిగ్భ్రాంతి చెందిన ఆయన కోవై రైల్వే స్టేషన్ మాస్టర్కు, సేలం రైల్వే డివిజన్ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. వెంటనే కోవై ఆర్పీఎఫ్ పోలీసులు, కోవై రైల్వే పోలీస్ డీఎస్పీ బాబు ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న సింగానల్లూర్ రైల్వే గేట్ కీపర్ పట్టాలపై ఉన్న ఆ సిమెంట్ స్లాబ్లను తొలగించాడు. ఈ మార్గంలో సోమవారం రాత్రి కోవై నుంచి సేలం మార్గంలో వెళ్లే బెంగళూరూ – చైన్నె ఎక్స్ప్రెస్, మేట్టుపాళయం – చైన్నె నీలగిరి ఎక్స్ప్రెస్, ఎర్నాకుళం – పాట్నా ఎక్స్ప్రెస్, కోవై – చైన్నై చేరన్ ఎక్స్ప్రెస్ వంటివి వరుసగా వస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రైలు బోల్తా కొట్టేందుకు పథకం వేసిన విషయం తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సేలం రైల్వే డివిజన్ ఆర్పీఎఫ్ సహాయ కమిషనర్ రతీష్ బాబు, డీఎస్పీ బాబు అధ్యక్షతన పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. సీబీసీఐడీ కార్యాలయంలో ఎడప్పాడి భద్రతాధికారి కొరుక్కుపేట: కొడనాడు హత్య దోపిడి కేసులో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామిలకు భద్రతాధికారిగా పనిచేసిన వీర పెరుమాళ్ మంగళవారం కోయంబత్తూరులోని సీబీసీఐడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోఠగిరి సమీపంలోని కోడనాథ్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, శశికళకు చెందిన ఎస్టేట్, రెండు బంగ్లాలు ఉన్నాయి. 2017 చివరి నెలలో 11 మంది సభ్యుల ముఠా ప్రవేశించి సెక్యూరిటీ గార్డును హత్య చేసి దోపిడీకి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. సీబీసీఐడీ పోలీసులు గత వారం రాజన్, అన్నాడీఎంకే ప్రముఖులు శంకర్లను మరోసారి విచారించారు. దీంతో జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న కాంచీపురం రిటైర్డ్ ఏడీఎస్పీ వీరపెరుమాళ్ను మంగళవారం హాజరుకావాలని సమన్లు సీబీసీఐడీ కోయంబత్తూరుకు పంపింది. తదనుగుణంగా అతను విచారణకు హాజరయ్యాడు. మంగళవారం ఉదయం 10 గంటలకు సీబీసీఐడీ అధికారులు అతడిని విచారించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వీడియోలో రికార్డయ్యాయి. అలాగే గురువారం (13వ తేదీ) జయలలిత సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన భవానీ నుంచి రిటైర్డ్ ఏడీఎస్పీ పెరుమాల్ను స్వయంగా హాజరుకావాలని సమన్లు పంపడం గమనార్హం. -
సమన్వయానికి.. కసరత్తు!
● శశికళ, టీటీవీ, వైద్యలింగం భేటీ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే వర్గాలను సమన్వయ పరిచే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు శిబిరంలో కీలక నేతగా ఉన్న వైద్యలింగంలు భేటీ అయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణిస్వామి పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. 2026 ఎన్నికల ద్వారా అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. అలాగే, పార్టీ బలోపేతం దిశగా కసరత్తుల వేగాన్ని పళణిస్వామి పెంచారు. రాష్ట్రంలోని యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ , అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం మళ్లీ అందర్నీ ఏకం చేస్తాం.... సమష్టి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటామన్న నినాదంతో గత కొంత కాలంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో అందర్నీ సమన్వయ పరిచే కసరత్తులు వేగవంతం చేసే విధంగా వ్యూహాలకు వీరు పదును పెట్టినట్టున్నారు. ఇందులో భాగంగా తంజావూరులోని ఒరత్తనాడు వేదికగా ఓ సమావేశం జరిగి ఉండటం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఒరత్తనాడులోని వైద్యలింగం నివాసంకు తొలుత దినకరన్, ఆతర్వాత శశికళ రావడం గమనార్హం. వైద్యలింగంకు పరామర్శ అని భావించినా, దీని వెనుక అన్నాడీఎంకే రాజకీయ చర్చ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా అన్నాడీఎంకేలో అందర్నీ సమన్వయ పరిచి, సమష్టి వేదికపైకి తీసుకొచ్చే వ్యూహాన్ని రచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు త్వరలో మాజీ సీఎం పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్లు ఒకే వేదిక మీద కనిపించ బోతున్నారు. ఆ తదుపరి అన్నాడీఎంకేలోని కేడర్, నేతలను ఏకం చేసే విధంగా వ్యూహాలకు పదును పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ భేటీ గురించి దినకరన్ పేర్కొంటూ, వైద్యలింగం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారని, ఆయన్ని పరామర్శించినట్టు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా మాట్లాడుకున్నామని పేర్కొన్నారు. అలాగే చిన్నమ్మ శశికళను ప్రశ్నించగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలని, అప్పుడే పార్టీకి బలం , అధికారం తథ్యం అన్నది గుర్తించాలని సూచించారు. 2026 ఎన్నికలలో అందరూ ఒకే వేదిక మీదకు వస్తారన్న నమ్మకం ఉందన్నారు. -
యమకాతగి విజయం సంతృప్తి నిచ్చింది
తమిళసినిమా: నైసాట్ మీడియా వర్క్స్ పతాకంపై శ్రీనివాసరావు జలగం నిర్మించిన చిత్రం యమకాతగి. అరుణ శ్రీ ఎంటర్టైనర్ సంస్థ భాగస్వామ్యంలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ రాహుల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. పెప్పిన్ జార్జ్ జయశీలన్ కథ, బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటి రూప కడువయుర్ ,నరేంద్ర ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించగా, గీత కై లాసం, రాజు రాజప్పన్, సుభాష్ రామస్వామి, హరిత తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి సుజిత్ సార్ ఛాయాగ్రహణం, జెసిన్ జార్జ్ సంగీతాన్ని అందించారు. కాగా జాతి వివక్షత, గ్రామీణ రాజకీయాలు ఇతివతంగా రూపొందిన ఈ చిత్రం గత ఏడవ తేదీన తెరపైకి వచ్చింది. దీన్ని తమిళనాడులో యశ్వా పిక్చర్స్ సంస్థ విడుదల చేసింది. కాగా చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నేపథ్యంలో యూనిట్ వర్గాలు థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు పెప్పిన్ జార్జ్ జయశీలన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాతలకు ఒక్క పేజీ లో రాసిన ఐడియాలు మాత్రమే చెప్పానని వెంటనే వారు బాగుంది కథను డెవలప్ చేయమని చెప్పడం వల్లే ఈ చిత్రం రూపొందడం, విజయం సాధించడం జరిగిందని పేర్కొన్నారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్ రాహుల్ మాట్లాడుతూ తను కథానాయకుడు కావాలి అని 20 ఏళ్ల క్రితం చిత్రపశ్రం లోకి వచ్చానని ఒక చిత్రంలో హీరోగా నటించాలని చెప్పారు. ఆ తర్వాత తగిన అవకాశాలు తాగడంతో తానే ఇతరులకు అవకాశాలు కల్పించాలన్న భావనతో చిత్ర నిర్మాణం సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా చి యమకాతగి చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ చిత్ర విజయం మరిన్ని చిత్రాలను నిర్మించడానికి దోహదపడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాత శ్రీనివాసరావు జలగం మాట్లాడుతూ తమ తొలి ప్రయత్నానికి యూనిట్ సభ్యులందరూ ఎంతగానో సహకరించారని, వారందరికీ విచిత్రాన్ని విజయవంతం చేస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. యమకాతగి చిత్రం విజయం సంతప్తినిచ్చిందని, థియేటర్లు ఫుల్ అవుతున్నాయని అయితే ఈ చిత్రానికి మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా వేదికపై యూనిట్ సభ్యులు మహిళ పాత్రికేయుల సమక్షంలో కేక్ కట్ చేసి చిత్ర విజయానందాన్ని పంచుకున్నారు. -
ఫెంగల్ బాధితులను ఆదుకోండి
● డీఎంకే, కాంగ్రెస్ డిమాండ్సాక్షి, చైన్నె : ఫెంగల్ తుపాన్ సృష్టించిన విలయతాండవం మంగళవారం పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఇంత వరకు బాధితులకు నష్ట పరిహారం చెల్లించని పుదుచ్చేరి పాలకులు, కేంద్రంలోని ఏన్డీఏ పాలకుల తీరును ఖండిస్తూ డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వివరాలు.. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం లెప్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రసంగంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజైన మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. సీఎం రంగస్వామి ప్రసంగించేందుకు సిద్ధం కాగా ప్రధాన ప్రతి పక్ష నేత (డీఎంకే)శివ లేచి ఫెంగల్ తుపాన్ బాధితులకు నష్ట పరిహారం మాటేంటి? అని ప్రశ్నించారు. ఇది సమయం కాదంటూ స్పీకర్ ఎన్బలం సెల్వం వారించారు. అయితే, డీఎంకే సభ్యులందరూ లేచి బాధితులకు నష్ట పరిహారం చెల్లించడంలో విఫలమైన ఈ పాలకుల తీరును ఖండిస్తున్నామని నినాదించారు. డీఎంకే నినాదాలతో కాంగ్రెస్ సభ్యులు సైతం తోడయ్యారు. దీంతో సభలో నినాదాలతో హోరెత్తియి. గందరగోళం నెలకొంది. సభను గాడిలో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినా, డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. ఫెంగల్ రూపంలో రైతులు తీవ్ర నష్టాలు, కష్టాలను ఎదుర్కొంటున్నా, ఇంత వరకు నష్ట పరిహారం అన్నది ఇవ్వక పోవడాన్ని ఖండిస్తున్నామని, కేంద్రంలోని ఎన్డీఏ పాలకులు ఈ వ్యవహారంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి వెలుపలకు వచ్చేశారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక, సభలో బుధవారం సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేయనున్నారు. 2025–26 సంవత్సరంకు గాను పూర్తిస్థాయి బడ్జెట్దాఖలు కానుంది. 2026 ఎన్నికలకు సిద్ధం అయ్యేవిధంగా ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
తిరుక్కురల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
తిరువళ్లూరు: మహిళ దినోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన తిరుక్కురల్ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తిరువళ్లూరు జిల్లా సెండ్రాన్పాల్యం గ్రామంలో కలాం పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులకు తిరుక్కురల్, డ్రాయింగ్ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రిన్సిపల్ పారాణ, అన్బు ట్రస్టు నిర్వాహకులు నవీన తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయుడు గోకుల్రాజ్, కార్తీక్రాజ్కుమార్, భరణీకుమార్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది. -
తండ్రి మృతదేహం సాక్షిగా వివాహం
సాక్షి, చెన్నై: మరికొన్ని గంటల్లో కుమారుడి వివాహం జరగబోనుండగా.. తండ్రి గుండెపోటుతో(Heart attack) కుప్పకూలిపోయాడు. సాధారణంగా అయితే వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. అంతటి దుఃఖంలోనూ వరుడి తల్లి స్పందించి.. తన భర్త నిర్ణయాన్ని అమలు చేశారు. ఆయన మృత దేహం సాక్షిగా కుమారుడి వివాహం జరిపించారు. వివరాలు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పేరుగోపనపల్లికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేస్తుండగా.. అతని భార్య మంజుల గృహిణి. వీరి కుమారుడు మనీశ్కు బర్గూరు చెందిన గోవిందరాజులు, శివశంకరిల కుమార్తె కావ్య ప్రియకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి వివాహానికి సంబంధించిన వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వరుడి తండ్రి వరదరాజ్ హఠాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి.. వరద రాజ్ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. దీంతో వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. వివాహాన్ని వాయిదా వేద్దా మంటూ సలహాలు ఇచ్చారు. కానీ వరుడి తల్లి మంజుల స్పందించి.. పెళ్లి (marriage) కుదరగానే తన భర్త ఎంతో సంతోషించాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన నిర్ణయం ప్రకారం వివాహ తంతు పూర్తి చేస్తే.. తన భర్త ఆత్మకు శాంతి కలుగు తుందన్నారు. దీంతో గ్రామ పెద్దలు, వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు చర్చించుకొని.. వివాహానికి అంగీకారం తెలిపారు. అనంతరం వరదరాజ్ మృతదేహం సాక్షిగా వరుడు మనీశ్ వధువు మెడలో తాళి కట్టాడు. అనంతరం వరదరాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.Video Credit To Polimer News -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చింది
అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
సేలం(తమిళనాడు): కోతిని(monkey) నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
ఖాళీలన్నీ త్వరలో భర్తీ
● పుదుచ్చేరి ఎల్జీ కై లాస్నాథన్ సాక్షి, చైన్నె: ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని పుదుచ్చేరి అసెంబ్లీలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్ నాథన్ ప్రకటించారు. పుదుచ్చేరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడ బడ్జెట్ సమావేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసగంతో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ దిశగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో తన తొలి ప్రసంగాన్ని అందించేందుకు అసెంబ్లీకి కై లాష్నాథన్ ఉదయం వచ్చారు. పుదుచ్చేరి ఎల్జీగా బాధ్యతలు స్వీకరించినానంతరం ఆయనకు ప్రసంగించే అవకాశాలు ఇప్పడే వచ్చింది. దీంతో సభకు వచ్చిన ఆయనకు స్పీకర్ ఎన్బళం సెల్వం,సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆహ్వానం పలికారు. ప్రతిపక్ష సభ్యులు సైతంగవర్నర్కు సాదర ఆహ్వానం పలికారు. సభలో గవర్నర్ తమిళంలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో పుదుచ్చేరి మాత్రమే అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు విజయవతంగా అందిస్తున్నదని వివరించారు. నాలుగు సంవత్సరాలలో 2,444 ఖాళీలను భర్తీ చేసారని, త్వరలో అన్నిఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఏడాది కాలంగా రంగస్వామి ప్రభుత్వం చేసిన ప్రగతి పనులు, పథకాలు, సంక్షేమకార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఎల్జీ తనప్రసంగాన్ని ముగించారు. దీంతో సభను స్పీకర్ ఎన్బలం సెల్వం మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఎల్జీ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. బుధవారం అసెంబ్లీలో 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్ను సీఎం రంగస్వామి దాఖలు చేశారు. -
ఐఐటీ మద్రాసులో.. గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం
● ప్రతి ప్రోగ్రాంకు రెండు సీట్ల కేటాయింపుసాక్షి, చైన్నె: వివిధ విద్యాపరమైన సబ్జెక్టులు, నైపుణ్యాలలో విద్యార్థులను అంచనా వేసి, జాతీయ, అంతర్జాతీయ ఒలంపియాడ్స్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాసు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలను ప్రారంభించింది. ‘సైన్స్ ఒలంపియాడ్ ఎక్స్లెన్స్గా పిలువబడే, ఈ ప్రవేశం 2025–2026 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ (అడ్వాన్స్డ్) వ్యవస్థకు వెలుపుల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు ఐఐటీ మద్రాసు సోమవారం ప్రకటించింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్లు, ఫైనార్ట్స్, కల్చర్ ఎక్సలెన్స్ మోడ్స్ ద్వారా జరిగే ప్రవేశాల మాదిరిగానే సైన్స్ ఒలంపియాడ్ ఎక్సలెన్స్లో ప్రతి ప్రోగాంకు రెండు సూపర్ న్యూమరీ సీట్లు ఉంటాయని, ఇందులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయించినట్టు ప్రకటించారు.ఈ ప్రవేశం నిమిత్తం 12వ తరగతి ఉత్తీర్ణత, అర్హత ప్రమాణం, వయస్సులు సంబంధిత సంవత్సరం కోసం జేఈఈ (అడ్వాన్స్డ్) తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇది వరకు ఐఐటీ ప్రవేశాల పొంది ఉండేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నామని , సమగ్ర వివరాలు htt pr://ufadmirrionr.iitm.ac.in/rcope వెబ్ సైట్లో లభిస్తాయని వివరించారు. ఈసందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత గొప్పవైన పజిల్స్ అనేవి పాఠ్య పుస్తకాలను గుర్తు పెట్టుకోవడం ద్వారా పరిష్కరించబడలేదన్నారు. అయితే, ఒక్కొక్క భాగాన్ని విడదీయడానికి సాహసం చేసి, భవిష్య తరాల కోసం కొత్త అద్భుతాలను సృష్టించడం ద్వారా పరిష్కరించ బడ్డాయని పేర్కొన్నారు. ఈ కలతో సైన్స్ ఒలంపియాడ్స్లో శ్రేష్టతను ప్రదర్శించిన అభ్యర్థుల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ప్రవేశాలు అందించడం ద్వారా ఐఐటి మద్రాస్ మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేయవలసిందిగా ఒలంపియాడ్స్లో విజయం సాధించిన దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పిలుపునిస్తున్నామన్నారు కాగా, ఏరో స్పెస్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్,ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, భౌతికశాస్త్రం, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషన్ ఇంజినీరింగ్,వైద్య శాస్త్రం, సాంకేతికత, రసాయన శాస్త్రంలలో ప్రతి విభాగంలోనూ రెండు చొప్పున కేటాయించారు. -
ధర్మేంద్రతో ఢీ...!
● నోరు జారిన కేంద్ర మంత్రి ● కనిమొళి అసహనం ● సీఎం ఆగ్రహంసాక్షి, చైన్నె: కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో డీఎంకే ఎంపీలు పార్లమెంట్ వేదికగా సోమవారం ఢీ కొట్టారు. ఈ సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను తమిళనాడులోని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆయన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. వారణాసిలో గత నెల జరిగిన కాశీ తమిళ సంఘం సమావేశానంతరం మీడియాతో కేంద్ర ఉన్నతవిద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ డీఎంకే కూటమి పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ నిధులు అడిగితే, జాతీయ విద్యావిధానం మేరకు త్రిభాషను అమలు చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తారా? అంటూ పార్లమెంట్ వేదికగా డీఎంకే ఎంపీలు కేంద్ర మంత్రిని నిలదీశారు. డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆదివారం తీసుకున్న నిర్ణయంమేరకు కేంద్రంతో ఢీకొట్టే విధంగాపార్లమెంట్ సెకండ్ సెషన్స్ తొలిరోజే డీఎంకే ఎంపీలు దూకుడుగా ముందుకెళ్లారు. సర్వ శిక్ష అభియాన్ నిధులకు బ్రేక్ వేయడాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే ఎంపీ తమిళళచ్చి తంగ పాండియన్ సభలో వ్యాఖ్యల తూటాలను అందుకోగా, కేంద్ర మంత్రి ఏమాత్రం తగ్గకుండా ఎదురు దాడి చేశారు. అయితే డీఎంకే ఎంపీలను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్య వివాదానికి దారి తీసింది. తమను అనాగరికులతో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి సభలో తీవ్రంగా ఖండించడమే కాకుండా తమ నిరసనను ఆ పార్టీ ఎంపీలు తెలియజేయడంతో సభా వ్యవహారాలు స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఢిల్లీ వేదికగా జరిగితే, తమ ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకండా డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని అందుకున్నాయి. ఇదేనా నాగరికం అని వ్యాఖ్యల తూటాలు పేల్చాయి. అదే సమయంలో ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా, తమిళులలో మాత్రం ఆగ్రహం తగ్గడం లేదు. సీఎం ఫైర్.. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను సీఎం స్టాలిన్తో పాటూ డీఎంకే కూటమిపార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమం వేదికగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, తనను తాను రాజుగా భావించి అహంకారంతో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్నట్లుందని మండిపడ్డారు. తమిళనాడుకు నిధులు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుందా, తమ ఎంపీలతో దురుసుగా ప్రవర్తిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలను పదే పదే అవమానిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ దీనిని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలు చేస్తామని ఏ సమయంలోనూ తాము చెప్పలేదని, ఆదిలోనే తిరస్కరించామన్న విషయాన్ని మంత్రి గుర్తెరగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారాలు ఇవ్వడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. తాముప్రజల గురించి ఆలోచిస్తున్నామని, తమ విద్యార్థుల సంక్షేమమే ముఖ్యం అని పేర్కొంటూ, మళ్లీ మళ్లీ అవమానించినా, మోసాలు చేసే ప్రయత్నం చేసినా తమ ఆగ్రహాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ, త్రిభాషా విధానాన్ని సీఎం అంగీకరించినట్టు, సూపర్ సీఎం అడ్డు పడినట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు చేశారని, ఇంతకీ ఆ సూపర్ సీఎం ఎవరో ఆయన స్పష్టం చేయాలని డిమాండ్చేశారు. ఇదే అంశాన్ని తమిళనాడులోని డీఎంకే, కూటమి పార్టీల నేతలందరూ నినాదిస్తూ సూపర్ సీఎం ఎవరో అన్నది మంత్రే చెప్పాలని నినాదాలు అందుకున్నారు. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ, కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ వ్యాఖ్యలను మళ్లీ తెర మీదకు తీసుకు రావడం నాగరికమా.. అని డీఎంకే వర్గాలను, సీఎంను ఉద్దేశించి ప్రశ్నించడం గమనార్హం. -
పురాతన భవనం పునరుద్ధరణ
సాక్షి, చైన్నె: చైన్నెలోని జార్జ్టౌన్లో రూ. 9.85తో పురాతన భవనాన్ని పునరుద్ధరించారు. ఇందులో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సేవలను మళ్లీ ప్రారంభించారు. 160 ఏళ్ల నాటి ఈ పురాతన భవనం జార్జ్టౌన్లోని రాజాజీ రోడ్డులో ఉంది. ఈ భవనాన్ని 1864లో నిర్మించారు. ఈ నిర్మాణ శైలిలో అద్భుతంగానూ, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుది. ఈ పురాతన భవనాన్ని మద్రాస్ టెర్రస్ అని కూడా పిలుస్తారు. 24,908 చదరపు అడుగుల విస్తీర్ణంలో, టేకు కలపతో అప్పట్లో ఈ భవనం తీర్చిదిద్దారు. ఈ భవనం పురాతనత చెక్క చెదరకుండా ప్రస్తుతం తీర్చిద్దారు. ఇక్కడ రిజిష్ట్రేషన్ల సేవల పనరుద్ధరణ కార్యక్రమం సోమవారం జరగ్గా, ఇందులో వాణిజ్య పన్ను రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మూర్తి, హిందూ ధర్మాదాయ శాఖమంత్రి శేఖర్బాబు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి కుమార్ జయంత్, రిజిస్ట్రేషన్ల విభాగం హెడ్ దినేష్ పొన్రాజ్, చైన్నె జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ జగ్డే తదితరులు పాల్గొన్నారు. బీజేపీ బహిరంగ సభలు సాక్షి,చైన్నె : త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డీఎంకే ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు భిన్నంగా త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ నేతృత్వంలో బహిరంగ సభలకు ఆ పార్టీ అధ్యక్షుడు అన్నామలై పిలుపు నిచ్చారు. ప్రస్తుతం ఈ విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణను మరింత విస్తృతం చేస్తూ, మద్దతుగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 23న తిరుచ్చి, 25న తిరునల్వేలి, ఏప్రిల్ 5న వేలూరు, 12న కాంచీపురం, 19న సేలం, 26వ తేదీన చైన్నె, మే 3వ తేది మదురై, మే 11న కోయంబత్తూరులలో బహిరంగ సభలను నిర్వహించి త్రిభాషా విధానం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించనున్నారు. అలాగే, ఇక్కడకు తరలి వచ్చి ప్రజల మద్దతును సంకతాల సేకరణ ద్వారా కూడగట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మానవ భద్రత లక్ష్యంగా ఒప్పందాలు సాక్షి, చైన్నె : మానవ భద్రతే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్పెల్బీ ఇంటర్నేషనల్ నిర్వహించింది. తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్, సైన్స్(డబ్ల్యూఏఏ)తో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో వివరాలను వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అధ్యక్షుడు డాక్టర్ గ్యారీ జాకబ్ ప్రకటించారు. మానవ భద్రతా విద్యను పాఠశాలల్లోకి అనుసంధానించడంలో సహకారం ఓ ప్రధాన అడుగును సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు, మానవ భద్రతా అవగాహనతో భవిష్యత్ నాయకులకు సాధికారత కల్పించడం తమ అవగాహన లక్ష్యంగా పేర్కొన్నారు. మానవ భద్రతా పరిజ్ఞానంతో తమ భాగస్వామ్యం సూత్రాలను నిర్ధారిస్తామన్నారు. మానవ భద్రత భారతదేశం అంతటా వేలాది మంది విద్యార్థులను చేరుకుంటుందని, వారిని సిద్ధం చేస్తుందన్నారు. స్పెల్బీ ఇంటర్నేషనల్ మానవ హక్కులను విస్తరించడానికి కట్టుబడి ఉందని, విద్యాలయాలలో ఈవెంట్లు, వెబ్నార్లు, సెమినార్లు, పోటీలు , ప్రచారాలు సర్వేలు, పరిశోధన కార్యక్రమాలు, కళ, వ్యాసాలు , వక్తృత్వ తదితర పోటీలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు వివరించారు. బస్సు ప్రమాదంలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని కేజీ కండ్రిగలో ప్రభుత్వ టౌన్ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో అమ్మయార్కుప్పంకు చెందిన కార్మికులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలతో చైన్నెలోని రాజీవ్గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన అమ్మయార్కుప్పం గ్రామానికి చెందిన జ్యోతి కుమారుడు అరసు(22) సోమవారం మృతి చెందాడు. దీంతో బస్సు ప్రమాద మృతుల సంఖ్య ఐదుకు చేరింది. -
విజయవంతంగా తమిళ న్యాయ సదస్సు
సాక్షి,చైన్నె : చైన్నెలో రెండు రోజుల పాటుగా అంతర్జాతీయ తమిళ న్యాయ సదస్సు –2025 విజయంతంగా జరిగింది. వినాయక మిషన్ లా స్కూల్, గ్లోబల్ తమిళ లా సెంటర్ లు అంతర్జాతీయ తమిళ న్యాయసదస్సును పయనూర్లోని క్యాంపస్లో నిర్వహించాయి. తమిళ భాష, సంస్కృతి, ప్రపంచీకరణ యుగంలో చట్టపరమైన అంశాల గురించి న్యాయ నిపుణులు, ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించారు. తమిళ న్యాయ సంప్రదాయాల పరిణామ పాత్రను చర్చించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, నిపుణుల ప్యానెల్ చర్చలు, ముఖ్య ఉపన్యాసాలు, వంటి అనేక అంశాలను ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండురోజుల సదస్సులో సాంఘిక సంక్షేమ శాఖమంత్రి గీతా జీవన్, ఆ విద్యా సంస్థ డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్, మనోన్మణియం సుందరనార్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ కె. చోక్క లింగం, డాక్టర్ అబ్దుల్ కలాం విజన్స్ 2020 అధ్యక్షుడు తిరుచంద్రన్, తమిళనాడు రాష్ట్ర అధికార భాషా కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం. ముత్తువేల్, ప్రముఖ న్యాయ నిపుణులు మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పి. విల్సన్, మద్రాస్ హైకోర్టుకు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ ఎస్. విమల తదితరులు హాజరయ్యారు. ముగింపు సమావేశంలో ఉత్తమ ఐదు ఉత్తమ ప్రజెంటర్లను గుర్తించి, సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ చాన్స్లర్ డాక్టర్ ఏఎస్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధ గణేషన్, బోర్డుసభ్యులు సురేష్ శామ్యుల్, అసిస్టెంట్ డీన్ ఫౌమినా, అసిస్టెంట్ ప్రొఫెసర్ శరవణన్ రవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిపై కత్తులతో దాడి
సేలం : తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలో ఉన్న అరియనాయకిపురానికి చెందిన తంగ గణేష్. ఇతని కుమారుడు దేవేంద్రన్ (17). ఇతను నెల్లైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లడం కోసం ఊరిలో ఉన్న బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి శ్రీవైకుంఠంకు బయలుదేరాడు. అరియనాయకిపురం తర్వాత ఊరు రెడ్డియమ్మాల్పురం ప్రాంతంలో బస్సు వెళుతుండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ముగ్గురు బస్సును అడ్డుకుని, బస్సులో ఎక్కారు. ఆ ముఠా బస్సులో ఉన్న దేవేంద్రన్ను కిందకు లాగి కత్తులతో తల, చేతులు, కాళ్ల, శరీరంపై నరికారు. తీవ్రంగా గాయపడిన దేవేంద్రన్ రక్తపు మడుగులో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న శ్రీవైకుంఠం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలకు పోరాడుతున్న దేవేంద్రన్ను చికిత్స నిమిత్తం శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతనికి అక్కడ ప్రాధమిక చికిత్స చేసి, ఉన్నత చికిత్స నిమిత్తం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి 108 అంబులెన్స్లో తరలించారు. అక్కడ తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు కోణాలలో విచారణ జరుపుతూ, ముగ్గురు ముఠా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
కోతిని తుపాకీతో కాల్చి వండి తినేశారు!
●ఇద్దరు నిందితుల అరెస్ట్ సేలం : కోతిని నాటు తుపాకీతో కాల్చి వండి తిన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు..దిండుగల్ జిల్లా వీరసిన్నంపట్టి ప్రాంతానికి చెందిన రాజారాంకు అదే ప్రాంతంలో మామిడి, కొబ్బరి తో ఉంది. కోతకు వచ్చిన మామిడి కాయలను ఆరగిస్తూ కోతులు నష్టం కలిగించసాగాయి. దీంతో రాజారాం గ్రామానికి చెందిన జయమణికి రూ. 1000 ఇచ్చి కోతుల బెడద లేకుండా చేయాలని కోరారు. దీంతో జయమణి నాటు తుపాకీతో ఒక కోతిని కాల్చి, దాన్ని వండుకుని తిన్నట్టు తేలింది. ఇది తెలుసుకున్న సిరుమలై అటవీ శాఖ పోలీసులు రాజారాం, జయమణిలను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
అబుదాబి వెళ్లే విమానంలో సాంకేతిక లోపం
సేలం : చైన్నె విమానాశ్రయం నుంచి సోమవారం వేకువజామున అబుదాబికి వెళ్లాల్సిన ఎత్తియాట్ విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం చోటు చేసుకుంది. దీంతో ఆ విమానం రన్వే పైనే నిలిపివేశారు. ఆ విమానంలో 168 మంది ప్రయాణికులతో పాటూ 178 మంది అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నారు. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ నుంచి సోమవారం వేకువజామున 4 గంటలకు అబుదాబికి వెళ్లే ఎత్తియట్ విమానం బయలుదేరడానికి సిద్ధమైంది. అందులో 168 ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బందితో పాటూ 178 మంది ఉన్నారు. విమానం రన్వేపై బయలుదేరింది. ఆ సమయంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం ఉన్నట్టు పైలెట్ గుర్తించి, అకస్మాత్తుగా రన్వే పైనే విమానాన్ని నిలిపివేశాడు. అనంతరం ఆ విమానాన్ని రన్వైపై నుంచి పక్కకు తప్పించి సాంకేతిక నిపుణులు వచ్చి లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 6 గంటలు అయినప్పటికీ సరిచేయడం వీలుకాకపోవడంతో ప్రయాణికులను విమానంలో నుంచి కిందకి దిపివేశారు. తర్వాత వారిని చైన్నె నగరంలోని పలు హెటళ్లలో బస చేయించారు. కాగా పైలెట్ గుర్తించడంతో 178 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. రన్ వే పై నిలిపివేత.. 178 మంది ప్రయాణికులు సురక్షితం -
కదిలిన మగ్గాలు
● ఫలితం పొందకనే 20 రోజుల సమ్మె విరమణ తిరుత్తణి: కూలి పెంచాలనే డిమాండ్తో మరమగ్గ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను విరమించారు. సోమవారం నుంచి తిరిగి పనులకు వెళ్లడంతో మరమగ్గాలు వేగం అందుకున్నాయి. తిరుత్తణి సమీపంలోని పలు ప్రాంతాల్లో లక్షకు పైబడిన ప్రజలు దాదాపు 50 వేల మరమగ్గాలతో లుంగీలు ఉత్పత్తి చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఇస్తున్న కూలీ తక్కువగా ఉందని, దీనిని పెంచాలనే డిమాండ్తో గత నెల 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా వారితో చర్చించేందుకు మాస్టర్ వీవర్స్ ముందుకు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. దీంతో గత్యంతరం లేక కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. -
ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్తను కడతేర్చిన మహిళ
● వేలంకన్నిలో పెళ్లి చేసుకుని ప్రియుడితో భర్త హత్యకు స్కెచ్ ● నిందితురాలితో సహా ప్రియుడు, మైనర్ బాలుడు అరెస్ట్ అన్నానగర్: తన మరో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిందో మహిళ. వివరాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన జనార్థన (22). అదే ప్రాంతానికి చెందిన ఎలన్ మేరీ(21) కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని వీరిద్దరూ నాగై జిల్లాలోని వేలంగన్నికి వచ్చి మాతా గుడిలో పెళ్లి చేసుకుని లాడ్జిలో ఉంటున్నారు. అయితే ఆదివారం జనార్థన వేలంగన్ని రైల్వే స్టేషన్ సమీపంలో శవమై వెలుగులోకి రావడం కలకలం రేపింది. అయితే జనార్థన, మేరీతో కలిసి ఉంటున్న ఇద్దరు వ్యక్తులు రైలులో తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని విచారణ చేశారు. వారు బెంగళూరు శివమొగ్గ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్య కుమారుడు జీవన్ (19), 15 ఏళ్ల బాలుడు అని తేలింది. జనార్థనను పక్కా ప్లాన్ చేసి కడతేర్చారని తేలింది. ఎలన్మేరీ ఓ వైపు జనార్థన ప్రేమిస్తూనే, మరోవైపు జీవన్తో కూడా ప్రేమాయణం వెలగబెడుతున్నట్టు వెల్లడైంది. తమకు అడ్డుగా ఉన్న జనార్థనను కడతేర్చాలని ఎలన్ మేరి, జీవన్ వ్యూహం పన్నారు. దీని ప్రకారం వేలంగన్నిలో జనార్థనను వివాహం చేసుకున్న ఎలన్ మేరి, తన ప్రియుడు జీవన్తో కలిసి అతడిని హత్య చేసింది. వాస్తవానికి ఆమెకు రెండేళ్ల క్రితమే ధర్మపురిలో వివాహమైంది. ఆ తర్వాత జనార్థనను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత జీవన్న్ను పెళ్లిచేసుకునేందుకు హత్యకు స్కెచ్ వేసింది. ఈ హత్యకు సంబంధించి ఎలన్ మేరి, జీవన్తోపాటు 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
చైన్నె నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, తూత్తుకుడిలకు అదనపు విమానాలు నడుపనున్నట్టు విమానాశ్రయ అఽధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి తూత్తుకుడికి ఇప్పటికే 8 విమానాలు నడుస్తున్నాయి. ఈ నెల 30వ తేది నుంచి వీటిని 12కు పెంచనున్నారు. అలాగే తిరుచ్చికి ఈ నెల 22 నుంచి 16 సర్వీసులను పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇదలా ఉంచితే తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో సౌకర్యాలు లేకపోవడంతో బస్సుల్లో వారాంతం రోజుల్లో అక్కడికి వెళ్లే ప్రైవేట్ ఓమ్నీ చార్జీలు విమాన చార్జీలతో సమానంగా వసూలు చేస్తున్నారు. దీంతో విమానాల్లో వెళ్లడం బెటరని చైన్నె విమానాశ్రయం నుంచి తిరుచ్చి, మధురై, సేలం, తూత్తుకుడి వెళ్లే విమానాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని అధికారులు వెల్లడించారు. హౌసింగ్ బోర్డులో ఇల్లు పేరిట మోసం తిరువొత్తియూరు: చైన్నె, సేతుపట్టులో స్లం క్లియరెన్న్స్ విభాగంలో ఇల్లు తీసిస్తానని ఒక మహిళ వద్ద రూ 2.2 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె సేతుపట్టు జగన్నాధపురం రెండవ వీధికి చెందిన దేవిక (40 చింతాద్రి పేటలో నివాసముంటున్న సమయంలో వినోద్ కుమార్ అనే అతను పరిచయమయ్యాడు. చైన్నె కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇల్లు తీసిస్తామని సమ్మబలికి, ఆమె నుంచి వినోద్ కుమార్ రూ 2.2 లక్షలు రెండు విడతలుగా తీసుకున్నాడు. అయితే ఏళ్లు గడిచినా ఇల్లు తీసివ్వకపోవడం, నగదు తిరిగి ఇవ్వాలని కోరినా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు చింతాద్రిపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వినోద్ కుమార్ను ఆదివారం అరెస్టు చేశారు. పెదనాన్నను హత్య కేసులో యువకుడి అరెస్టు సేలం : పెదనాన్నను హత్య చేసిన యువకుడిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. చెంగల్పట్టు జిల్లా చెన్నేరి గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి రవి (45). రెండురోజుల క్రితం రవిని తమ్ముడి కుమారుడు కామేష్ (23) కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రవి రక్తపు మడుగులో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అడ్డుకున్న రవి స్నేహితుడు నరసిమ్మన్ (70) కూడా కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో కామేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన విచారణలో మత్తుకు అలవాటుపడిన కామేష్ చెన్నేరి అడవి ప్రాంతంలో దాగి ఉన్నట్టు తెలిసింది. ఈక్రమంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వేమన పద్యాలతో ఆకట్టుకున్న చిన్నారులు కొరుక్కుపేట: వేమన పద్యాలతో, సైన్స్ ప్రశ్నావళి పోటీల్లో చిన్నారులు తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చైన్నె తిరువోత్తియూర్లో ఉన్న ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణా ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు పోటీలను నిర్వహించారు. తెలుగు వెలుగు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో చిన్నారులకు వేమన పద్యాల పోటీ, సైన్స్ ప్రశ్నావళి పోటీలను నిర్వహించగా , చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పద్యాలతో ఆలరించగా , సైన్స్ ప్రశ్నావళిలోనూ ప్రతిభను చాటుకున్నారు . విజేతలకు బహుమతులతోపాటు పాఠశాలోని ప్రతీ విద్యార్థికి కథలు పుస్తకాలు , స్వీట్లు పంచిపెట్టిన అల్లింగం రాజశేఖర్ మాతృభాషావికాసానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు . తెలుగు మాధ్యమంలో చదివించేందుకు తల్లిదండ్రులను కోరారు. తనవంతుగా ప్రతీ స్కూల్లో తెలుగు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు . కార్యక్రమంలోభాగంగా స్కూల్ ఉపాధ్యాయురాలు బి. శ్వేతకు పార్వతీ పరమేశ్వరుని ఫొటోని బహుకరించి సత్కరించారు. ఇందులో ప్రదానోపాధ్యాయురాలు అపర్ణ , విద్యార్థులు పాల్గొన్నారు. -
‘గ్రీవెన్స్డే’లో 447 వినతులు
తిరువళ్లూరు: తమ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేలో 447 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ వెల్లడించారు. సోమవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్డేకు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.ఇంటి పట్టాల కోసం 8, సాంఘిక సంక్షేమ శాఖకు 78, మౌలిక వసతులు కల్పించాలని 50, ఉపాధి కల్పించాలని 127 వినతులతో సహా మొత్తం 447 వినతులు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న మహిళలు
కొరుక్కుపేట: మహిళలు అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్నారని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రిటైర్డ్ జనరల్ మేనేజర్ రేణుకా మోహన్ రావు అన్నారు. సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని, ధైర్యంగా అడుగులు వేస్తే విజయపథంలో దూసుకుపోతారని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీ ఉమెన్స్ అసోసియేషన్ మద్రాసు ( యూడబ్ల్యూఏఎం) ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా సోమవారం జరుపుకున్నారు. దీనికి చైన్నె టి.నగర్లోని ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రదాన కార్యాలయం వేదికై ంది. అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకార్లు సభకు స్వాగతం పలికి అసోసియేషన్ తరపున విద్యార్థులకు అందిస్తున్న సేవలను సభకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రేణుకా మోహన్ రావు ప్రసంగంలో సీ్త్రలకు అపారమైన శక్తి ఉందని దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం నుంచి అవ్వయార్ అవార్డు పొందిన అసోసియేషన్ సీనియర్ సభ్యురాలు యశోద షణ్ముగసుందరం., అలాగే సీనియర్ ఛాంపియన్న్షిప్లో వివిధ పతకాలు గెలుచుకున్నందుకు సంఘ కార్యదర్శి రుక్మిణికి అభినందనలు తెలిపి గౌరవించారు. అలాగే పరిశోధన చేస్తున్న ఐదుగురు విద్యార్థులకు రూ.25,000 విలువైన మొత్తాన్ని స్కాలర్షిప్లుగా అందజేశారు.ఇంకా వివిధ నగర కళాశాలలకు చెందిన పేద విద్యార్థులు 20 మందికి రూ. 10,000 వార్షిక స్కాలర్షిప్లను అసోసియేషన్ అధ్యక్షురాలు వైజయంతి భాష్యకర్లు పంపిణీ చేశారు. -
భగవన్నామస్మరణతోనే ఈశ్వరానుగ్రహం
కొరుక్కుపేట:చైన్నెలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మూడు రోజుల ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఆదివారం రాత్రి ముగిశాయి. శర్వాణి సంగీత సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో టి.నగర్ వెంకటనారాయణ రోడ్డులోని శృంగేరి భారతీ విద్యాశ్రమం ఆడిటోరియం ప్రవచనాలకు వేదికై ంది. ‘విష్ణు సహస్రనామ సారవైభవం’ అనే అంశం తన ప్రవచనాలతో షణ్ముఖవర్మ ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించారు. చివరి రోజు ఆదివారం శివ పదం పేరుతో నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరిలో ప్రముఖ గాయకులు నిహాల్, వెంకట నాగరాజన్ గానానికి సుదర్శనం (వయోలిన్), ఎస్. విజేంద్రన్ (మృదంగం), కల్యాణ కుమార్ (కీబోర్డు) వాయిద్య సహకారం అందించారు. అనంతరం ప్రవచన కార్యక్రమం సాగింది. తొలుత సామ వేదం షణ్ముఖశర్మ దంపతులను నిర్వాహకులతోపాటు పీవీఆర్ కృష్ణారావు , ఊరా ఆంజనేయులు, ఊరా లక్ష్మీనరసింహారావు, ఊరా శ్రీమన్నారాయణ, చైన్నె కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ కేఎస్ఎస్వీ ప్రసాద్, సంగీత విద్వన్మణి డాక్టర్ తాడేపల్లి లోకనాధశర్మ సహా పలువురు తెలుగు ప్రముఖులు సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు . కర్మకొద్దీ వచ్చేవి మనుషుల జన్మలని, భగవన్నామ స్మరణతో మానవాళి పయనిస్తేనే ఈశ్వరుని అనుగ్రహం పొందుతారన్నారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. -
తుపాకీ లైసెన్సులు ఇవ్వాలని కలెక్టర్కు వినతి
తిరువళ్లూరు: జీవనోపాధి కోసం సంచార కులాలకు చెందిన వ్యక్తులకు నాటు తుపాకీ లైసెన్సులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ఉదయం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సబ్డివిజన్ పరిధిలో సుమారు రెండువేల సంచార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరు ఆంధ్ర, తెలంగాణా, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి చేపలు, రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. చెరువుల వద్దకు కాకులు వస్తే వాటిని తరమడానికి నాటు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టేవారు. ఈ క్రమంలో గత ఏడాది జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకులను ఎన్నికల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకుని తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వాటిని తమకు తిరిగి ఇవ్వడంతో పాటు లైసెన్సులు ఇస్తే ఎప్పటిలాగే తాము పనులు చేసుకుంటామని కలెక్టర్ ప్రతాప్కు విజ్ఞప్తి చేశారు.ర్ లైసెన్సు ఇచ్చే వ్యవహరంపై తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి ఆర్డీఓను కలెక్టర్ అదేశించారు. -
బ్రేకప్కు కారణం ఇదేనా?
అక్యూస్ట్ చిత్ర షూటింగ్ పూర్తి తమిళసినిమా: తారల ప్రేమ, బ్రేకప్ల వంటి వ్యవహారాలకు సినిమారంగంలో సౌండ్ ఎక్కువ. అయితే ఇందులో తప్పెవరిది అని చెప్పడం అంత సులభం కాదు. నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెత ఉన్నా, ఇక్కడ పొగ రాకున్నా నిప్పు రాజేస్తారు. ఇకపోతే నటీనటులు తమ ప్రేమ వ్యవహారాన్ని కొంత కాలం గుట్టుగా ఉంచుకున్నా, ఏదో సందర్బంగా దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తారు. అలాంటి సంఘటనలు సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. విఫలం అయితేనే చర్చ అవుతుంది. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి ఇలాంటిదే. నిజం చెప్పాలంటే పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందిన తమన్నా గ్లామరస్ పాత్రల్లో మాత్రం హద్దులను చెరిపేస్తారు. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రేమ వ్యవహారాలకు చాలా కాలం దూరంగానే ఉంటూ వచ్చారు. అలాంటిది రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు.ఈ విషాయన్ని చాలా గుంభనంగానే ఉంచారు. అయితే నిజం చాలా కాలం దాచబడదు అన్నట్లుగా ఒక వేడుకలో పాల్గొన్న తమన్నా, విజయ్ వర్మలు బహిరంగంగా సుంభనాలు పెట్టుకున్నారు. అలా నెటిజన్లకు చిక్కడంతో తమ ప్రేమ విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పక తప్పులేదు. అవును మేం ప్రేమలో పడ్డాం అని ఇద్దరూ ప్రకటనలు ఇచ్చారు. అంతే కాదు ఆ తరువాత ఈ ప్రేమ జంట మరింతగా సన్నిహితంగా మెలగసాగారు. పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా రెండేళ్లు సాగిన తరువాత ఇప్పుడు సడన్గా నటి తమన్నా ప్రియుడితో బ్రేకప్ అంటూ ప్రచారం రచ్చ రచ్చగా మారింది. వీరి బ్రేకప్ వ్యవహారాన్ని వారి సన్నిహిత వర్గాలు దృవపరిచారు కూడా. అయితే నటి తమన్నా, నటుడు విజయ్వర్మల ప్రేమ ముగియడానికి కారణం ఏమిటన్న దాని గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. హిందీ నటుడు విజయ్వర్మ ప్రేమపై నమ్మకం పెంచుకున్న తమన్నా ఆయనతో కలిసి ఏడడుగులు వేసి జీవితంలో సెటిల్ అవ్వాలని భావించారట. దీంతో ఆ విషయంపై ఆమె ప్రియుడు విజయ్వర్మతో పలు మార్లు మాట్లాడినట్లు, అయితే అందుకు నటుడు విజయ్వర్మ సిద్ధంగా లేకపోవడమే వీరి బ్రేకప్కు కారణం అని సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇటు తమన్నా గానీ, అటు నటుడు విజయ్వర్మ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. తమిళసినిమా: జసన్ స్టూడియోస్, సచిన్ సినిమాస్ సంస్థలతో కలిసి శ్రీ దయాకరన్ సినీ ప్రొడక్షన్స్, ఏఐవై స్టూడియోస్ సంస్థల అధినేతలు ఏఎల్.ఉదయ, దయ.ఎన్.పన్నీర్సెల్వం, ఎం.తంగవేల్ కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం అక్యూస్ట్. నటుడు ఉదయ, అజ్మల్, యోగిబాబు, దర్శకుడు ప్రభుసాలమన్, నిర్మాత టీ.శివ,ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో కన్నడ నటి జాన్విక నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రభు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ప్రణాళిక ప్రకారం చిత్ర షూటింగ్ను జనవరి 2వ తేదీన చైన్నెలోని ఆల్బర్ట్ ధియేటర్లో ప్రారంభించి ఏకధాటిగా 54 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. సేలం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను సేలంలోని మోడరన్ థియేటర్ వద్ద నిర్వహించిన షూటింగ్తో పూర్తి చేసినట్లు చెప్పారు. ఇది నటుడు ఉదయ కేరీర్లోనే భారీ బడ్జెట్ కథా చిత్రంగా నిలిచిపోతుందన్నారు. నరేన్ బాలకుమారన్ సంగీతాన్ని అందించిన ఇందులో మూడు ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకుంటాయని చెప్పారు. ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్ కుమార్ పాడటం విశేషం అని పేర్కొన్నారు. నిందుతులందరూ నేరస్తులు కాదనీ, అలా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎలా దాదాలుగా మారుతున్నారనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం అక్యూస్ట్ అని చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయన్నారు. ప్రస్తుతం నిర్మానాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయనీ దర్శకుడు తెలిపారు. అక్యూస్ట్ చిత్ర యూనిట్ -
అన్ని డ్యామ్లలో కాలువ మరమ్మతులు
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డ్యామ్లలోని కాలువల పూడిక తీత పనులతో పాటూ మరమ్మతు పనులు చేయనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని మోర్థాన డ్యామ్లో రూ.2.50 కోట్ల వ్యయంతో కుడి, ఎడమల కాలువల్లో పూడిక తీత పనులకు కలెక్టర్ సుబ్బలక్ష్మి అద్యక్షతన సోమవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోర్ధాన డ్యామ్ నుంచి గుడియాత్తం, కేవీకుప్పం వరకు సుమారు 31,850 మీటర్ల వరకు పూడిక తీత పనులు చేసేందుకు ప్రస్తుతం అనుమతి పొందడం జరిగిందన్నారు. వీటి ద్వారా గుడియాత్తం, కేవీ కుప్పం, లత్తేరి వంటి ప్రాంతాల్లోని రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలోనే రైతులు పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసూం తాము పలు పథకాలను ప్రవేశ పెడుతున్నామని వాటి ద్వారా ప్రజలు అభివృద్ది చెందాలన్నారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, అములు, యూనియన్ చైర్మన్ రవిచంద్రన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీఎంకే మాదిరి బడ్జెట్ విడుదల
సాక్షి, చైన్నె: పీఎంకే నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మాదిరి బడ్జెట్ను సోమవారం విడుదల చేశారు. దిండివనంలోని పార్టీ కార్యాలయంలో ఈ బడ్జెట్ను ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ప్రకటించారు. 2025–26లో తమిళనాడు ఆదాయ వసూళ్లు రూ.5,43,442 కోట్లుగా పేర్కొన్నారు. ఇది గత సంవత్సరం ఆదాయం కంటే రూ.1,91,602 కోట్లు ఎక్కువ అని వివరించారు. ఖనిజ వనరుల సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా రూ .2,02,010 కోట్ల పన్నుయేతర ఆదాయాన్ని సాధించాలన్న ప్రణాళిక పెరుగుదలకు కారణంగా పద్దులు చూపించారు. తమిళనాడులో 1.20 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా, గత 4 సంవత్సరాలలో 70,000 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. వీరిలో 37,026 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగాలు ఇవ్వగా , 33,655 మందికి తాత్కాలిక , కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. తమిళనాడులోని ప్రభుత్వ విభాగాల్లో 6.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ, వీటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. రవాణా ప్రణాళిక , వైద్య సేవలు, విద్యా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, మాన వనరుల పెంపులక్ష్యంగా 6వ తరగతి నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనాభా లెక్కలు నిర్వహించడానికి రూ . 400 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంటూ, జూలై 2025 నుంచి తమిళనాడులో కులాల వారీగా జనాభా గణన ప్రారంభించాలన్నారు. వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదిక ఆధారంగావ వన్నియర్లకు రిజర్వేషన్ కల్పన, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను మాదిరి బడ్జెట్లో వివరించారు.. తమిళనాడులోని స్టేట్బోర్డు పాఠశాలల్లో 10వ తరగతి వరకు తమిళాన్ని తప్పనిసరి బోధనా మాధ్యమంగా మార్చడానికి ఒక చట్టం అమలు చేయడం, తమిళంలో నేమ్ బోర్డులు లేని దుకాణాలకు రూ . 10,000 జరిమానా విధించడం, వ్యాపార లైసెన్స్లు రద్దు చేయడం, పిల్లలకు పేర్లు పెట్టడంకోసం ప్రత్యేక తమిళ పేర్ల జాబితాను విడుదల చేయడం,ప్రభుత్వ ఉద్యోగాలు తమిళ మాధ్యమంలో చదివిన వారికి మాత్రమే ప్రాధాన్యత, తమిళ మాధ్యమంలో చదువుకున్న వారికి ఉన్నత విద్యలో 30 శాతం రిజర్వేషన్లు అమలు వంటి సూచనలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి పాత పెన్షన్ పథకం అమలు, ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత , తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం వంటి 73 అంశాలతో పలు సూచనలు,సలహాలు, ఆర్థిక సంబంధిత నివేదికలు, పథకాలను ఈ మాదిరి బడ్జెట్లో పేర్కొన్నారు. -
ఘనంగా వావ్ వండర్ ఉమెన్ అవార్డులు
సాక్షి, చైన్నె: జియో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వావ్ వండర్ ఉమెన్ అవార్డ్స్ – 2025 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన 13 మంది మహిళా ప్రముఖులను వావ్ వండర్ అవార్డులతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం జియో ఇండియా ఫౌండేషన్ నేతృత్వంలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శారద రమణి, యాస్మీన్ జవహర్ అలీ, ఐపీఎస్ డాక్టర్ ఎం.సి. సారంగన్ , నటి ఇనియాలు హజరయ్యారు. ఈ అవార్డులను అభిరామి మెగా మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నల్లమై రామనాథన్, హైకోర్టు న్యాయవాది సితార అరంగన్, పాప్ సింగర్ షాలిని సింగ్ బాలాజీ, కర్ణాటిక్ గాయని అక్షయ, రేడియో జాకీ ఆర్జే మిరుదుల ఇంకా మల్లికా చౌదరి, జి శ్రీవిద్య, మహాలక్ష్మీ అశ్విన్, విష్ణుప్రియా హెచ్ భట్ తదితరుల అందుకున్నారు. కార్యక్రమంలో జియోఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రియా జెమీమా, జియో ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన గిరిజన మహిళల కోసం టైలరింగ్ మెషీన్లను విరాళంగా అందజేశారు. -
టీవీకే ఆధ్వర్యంలో ధర్నా
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైగింక వేధింపులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తమిళగ వెట్రికళగం ఆధ్వంర్యంలో తిరువళ్లూరు మెడికల్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పార్టీ జిల్లా కన్వీనర్ కుట్టి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కుట్టి మాట్లాడుతూ విద్యార్ధినులపై లైంగిక దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోడం దారుణమన్నారు. అన్నావర్సిటీలో విద్యార్ధినిపై అత్యాచారం జరిగితే నిందితులను కాపాడడానికి మంత్రులే రంగంలోకి దిగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.