Tamil Nadu
-
పాపం కమల్ హాసన్.. సిద్ధరామయ్య సెటైర్లు
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్పై స్పందించారు.కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు. ‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన. చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం -
గ్యాస్ లీక్తో మంటలు
అన్నానగర్: వ్యాసర్పాడిలో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చైన్నెలోని వ్యాసర్పాడి సత్యమూర్తి నగర్ ప్రధాన రహదారిపై 20కి పైగా గుడిసెలు ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున అక్కడ ఒక గుడిసెలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. గాలి రావడంతో మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ఇళ్లు కాలిపోయాయి. ఇళ్లలోని ప్రజలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఆ మంటల్లో ఒక ఇంట్లో ఉన్న సిలిండర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వ్యాసర్పాడి, కొరుక్కుపేట, వాషర్మెన్పేట, ఎస్ప్లనేడు, వీఓసీ నగర్ సహా అగ్నిమాపక కేంద్రాల నుంచి ఆరు అగ్నిమాపక సిబ్బంది, అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఇందులో 20కి పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. వంటగదిలోని టీవీ, రిఫ్రిజిరేటర్ సహా వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం, గాయాలు సంభవించలేదు. ఇల్లు కోల్పోయిన వారికి వ్యాసర్పాడిలోని ఒక పాఠశాలలో వసతి కల్పించారు. ఈ విషయంపై ఎంకేబీ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ● 20 గుడిసెలు దగ్ధం -
పన్నులు తగ్గించాలి
తిరువళ్లూరు: భవన నిర్మాణ రంగాలకు ఉపయోగించే ఇనుము, సిమెంట్ తదితర వస్తువులపై వసూలు చేసే జీఎస్టీ పన్నులు తగ్గించాలని కార్మికుల సంఘం మహానాడులో డిమాండ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా భవన నిర్మాణ రంగం కార్మికుల మహానాడు కవరపేటలో మంగళవారం ఉదయం జరిగింది. మహనాడుకు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నటరాజన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపకార్యదర్శి ఏ.నటరాజన్ హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా నటరాజన్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో జీవనం సాగిస్తూ 60 ఏళ్ల దాటిన కార్మికులకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్ను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు ఇనుము, సిమెంట్, ఇటుకరాయి తదితర వస్తువులపై విఽధించే జీఎస్టీ పన్నుల తగ్గించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో పనులు లేని సమయంలో భవన నిర్మాణ కార్మికులకు ప్రతి నెలా రూ.5వేలు మంజూరు చేయాలన్నారు. కార్మికులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహానాడులో పలు డిమాండ్లను తీర్మానం చేసి, కార్మిక సంక్షేమశాఖ మంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించారు. ఈ మహనాడులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు విజయన్, జిల్లా కార్యదర్శి రాజేంద్రన్, కోశాధికారి నిత్యానందం, ఉపాధ్యక్షుడు అర్జుణన్ పాల్గొన్నారు. -
● ఎమర్జన్సీ డ్రిల్
ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చైన్నె ఓఎంఆర్లోని ఐశ్వర్య సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన సేవల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాద సమయాలు, క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసరంగా ఎలా స్పందించాన్న విషయం వివరిస్తూ వైద్యులు, అంబులెన్స్, ఇతర సిబ్బంది మాక్డ్రిల్ నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉత్కంఠగా జరిగిన ఈ డ్రిల్ను డాక్టర్ జనార్దనన్, ఆస్పత్రి ఎండీ డాక్టర్ అరుణ్ ముతువేల్ పర్యవేక్షించారు. – సాక్షి, చైన్నె -
జూన్లో విశేష ఉత్సవాలు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో జూన్ నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 06, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. 7వ తేదీ నుంచి 11 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు, 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధుల్లో గజ వాహనంపై అమ్మవారు విహారం ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి అనుబంధంగా వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో జూన్ 5న శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరగనుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో జూన్ 17 నుంచి 19 వరకు శ్రీ సుందరరాజ స్వామి వారి అవతారోత్సవాలు జరుగుతాయి. జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై దర్శనమిస్తారు. అమ్మవారి ఆలయంలో వెలసిన శ్రీబాలకృష్ణ స్వామివారికి 24న తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
అత్త మందలించిదని కోడలు ఆత్మహత్య
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించడంతో మనస్తాపం చెందిన కోడలు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పుళల్ సమీపంలో కలకలం రేపింది. వివాహం జరిగి రెండున్నరేళ్లు మాత్రమే అయిన క్రమంలో ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ చేయనున్నారు. తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియ అనే యువతిని ప్రేమించి రెండున్నరేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది. అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. వివాహమై రెండున్నరేళ్లు మాత్రమే అయిన క్రమంలో ఆర్డీఓ విచారణ చేయనున్నారు. పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పది కిలోల గంజాయి స్వాధీనం
● గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు తిరువళ్లూరు: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు కోలాడి చెరువు వద్ద వ్యక్తి యువతే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ సుభాషిణి, సబ్ ఇన్స్పెక్టర్ భువనేశ్వరికి రహస్య సమాచారం అందింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ బ్యాగుతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి తంజావూరు జిల్లా సేదుభావసత్రం గ్రామానికి చెందిన బాలగురు కుమారుడు పళణివేల్(46)గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని రైలులో తీసుకొచ్చి తిరువేర్కాడులో విక్రయిస్తున్నట్టు నిర్ధారించి, పళణివేల్ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడి వద్ద పది కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించడంతో అతడ్ని పుళల్ జైలుకు తరలించారు. -
ప్రాణరక్షణలో అంబులెన్స్ పాత్ర కీలకం
● అసిస్టెంట్ పోలీసు కమీషనర్ చొక్కయ్య వ్యాఖ్యకొరుక్కుపేట: అత్యవసర సమయంలో నిండు ప్రాణాలను కాపాడడంలో అంబులెన్స్ల పాత్ర కీలకమని ట్రిఫ్లికేన్ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్ )చొక్కయ్య కొనియాడారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చైన్నెలోని అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో 1066 అత్యవసర సేవలపై దృష్టి సారించేలా ఫ్లీట్ ఆఫ్ హోప్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చొక్కయ్య అంబులెన్స్లకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ప్రాణాలను కాపాడడంలో అంబులెన్స్ సేవలను తీసుకునిరావడం అభినందనీయమన్నారు. రెండు దశాబ్దాల క్రితం తాను ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉంటే అంబులెన్స్ తన ప్రాణాలను కాపాడిందని, అనంతరం తేనంపేట అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందానని చెప్పారు. తన జీవితంలో అపోలో ఆస్పత్రిని మరిచిపోలేనన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీస్ చీఫ్ డాక్టర్ రోహిణి శ్రీధర్, అపోలో ఆస్పత్రి చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి, అపోలో హాస్పిటల్ దక్షిణ ప్రాంతాలోని అత్యవసర విభాగాల ప్రాంతీయ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ధవపళని, హెల్త్కేర్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ డాక్టర్ రామకృష్ణ విజయ్వర్మ పాల్గొన్ని మాట్లాడారు. -
● అబద్ధాలు చెప్పేవారికి సమాధానం ఇవ్వబోను ● సీఎం స్టాలిన్ స్పష్టీకరణ ● కొళత్తూరులో విస్తృతంగా పర్యటన ● సంక్షేమ పథకాల పంపిణీ ● చైన్నె, నెల్లై, దిండుగల్లో వృద్ధాశ్రమాలు
సాక్షి, చైన్నె: కొళత్తూరు నియోజకవర్గం రాజాజీ నగర్లో జరిగిన కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ నేతృత్వంలో చైన్నె కొళత్తూరు, దిండుగల్ జిల్లా పళని, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలో సీనియర్ సిటిజన్ హోమ్లు(వృద్ధాశ్రమాలు) ఏర్పాటుకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. రూ. 22.61 కోట్ల వ్యయంతో చైన్నెలో 75 మంది, పళణిలో 100 మంది, పాళయంకోట్టైలో 50 మంది చొప్పున వృద్ధులకు బసతో పాటుగా అన్ని సౌకార్యలు కల్పించే విధంగా ఈ ఆశ్రమాలను నిర్మించనున్నారు. ఇక్కడ చిన్న గ్రంథాలయం, వైద్య సేవలకు అంబులెన్స్ సేవతో పాటుగా చిన్న క్లినిక్ను సైతం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రూ. 4.36 కోట్లతో అభివృద్ధి చేసిన కుమార మంగళం చెరువు, రూ. 91.36 కోట్లతో తనికాచలం నగర్ పార్కు, వర్షపు నీటి కాలువలను లను ప్రారంభించారు. అలాగే, అనిత అచీవర్స్ అకాడమీలో శిక్షణ పొందిన 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్లను సీఎం పంపిణీ చేశారు. జి.కె.ఎం కాలనీ 2 కోట్ల 89 లక్షల 40 వేల రూపాయలతో అభివృద్ధి చేసిన కుమారమంగళం చెరువును పరిశీలించారు. వాకింగ్ నిమిత్తం ఇక్కడ రూపొందించిన ట్రాక్ను ప్రారంభించారు. రూ. 1.47 లక్షలతో సిద్ధం చేసినరూ. ఖర్చుతో మూలధన నిధుల కింద 1 కోటి 47 లక్షలు బ్యాడ్మింటన్ కోర్టు, యోగా వేదిక, కృత్రిమ జలపాతాలను ప్రారంభించారు. వీటిని ప్రజల ఉపయోగం కోసం తీసుకు రావడమే కాకుండా ఆ పరిసరాలను ఉద్యన వనంగా తీర్చిదిద్దారు. సహాయకాల పంపిణీ.. కొళత్తూరు శాసన సభా కార్యాలయానికి చేరుకుని విద్యార్థులకు విద్యా ఉపకరణాలను, దివ్యాంగులకు స్కూటర్లు పంపిణీ చేశారు. పది, ప్లస్టూ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన 318 మంది విద్యార్థులకు పుస్తకాల బ్యాగ్, విద్యా సామాగ్రిని అందజేశారు. పెరియర్ నగర్కు చేరుకున్న సీఎం అక్కడ 150 మంది దివ్యాంగులకు రూ. కోటి 47 లక్షల నగదు ప్రోత్సాహం పంపిణీ చేశారు. 131 మంది మహిళకు కుట్టుమిషన్లు అందజేశారు. తనికాచలం నగర్ కాలువ , కుమరన్ నగర్లోని 80 అడుగుల రోడ్డులో వర్షాకాలంలో వరద నష్టం జరగకుండా రూ. 36 కోట్లతో నిర్మించిన ఓపెన్ కెనాల్ ను పరిశీలించారు. ఈ కెనాల్ మార్గంలో తొమ్మిది చోట్ల చిన్న వంతెనల నిర్మాణాలు పూర్తి చేశారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం స్టాలిన్కు ఘన స్వాగతం పలికే విధంగా అక్కడి నేతలు ఏర్పాట్లు చేశారు. సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు హోరెత్తించారు. 2026లో మళ్లీ సీఎం అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆలయాలలో భక్తి గీతాలపన నిమిత్తం ఓ అందురాలికి ఉద్యోగ నియామక ఉత్తర్వు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, శేఖర్బాబు, మేయర్ ప్రియ, ఎంపీ కళానిధి వీరాస్వామి, గిరిరాజన్, ఎమ్మెల్యేలు తాయగం కవి, జోసెఫ్ శామ్యూల్, ఎస్. సుదర్శనం, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, చైన్నె కార్పొరేషన్ కమిషనర్ కుమర గురుబరన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు విజయ్ ప్రోత్సాహకం
● మూడు విడతలుగా టాపర్లకు సత్కారంసాక్షి, చైన్నె: పదో తరగతి, ప్లస్–2 పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించడమే కాకుండా వారికి ప్రోత్సాహక నగదు అందజేయడానికి తమిళగ వెట్రి కళగం నేత, సినీనటుడు విజయ్ నిర్ణయించారు. కమిళగ వెట్రి కళగం పార్టీని గత ఏడాది ప్రకటించినానంతరం తొలి కార్యక్రమంగా ప్లస్టూ, పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన టాపర్లను నియోజకవర్గాల వారీగా సత్కరించేందుకు విజయ్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. విద్యార్థులకు వజ్రాలు, బంగారు ఉంగరాలు, నాణెలతో పాటూ నగదు ప్రోత్సాహకాలను విజయ్ అందజేశారు. ఈ ఏడాది పార్టీ పరంగా కార్యక్రమాలను వేగవంతం చేసిన విజయ్ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను సిద్ధంచేసుకుంటున్నారు. పనిలో పనిగా ఈ ఏడాది ప్లస్టూ, పదో తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసి సత్కరించేందుకు సిద్ధమయ్యారు. 30న మహాబలిపురంలో తొలి కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధం చేసి ఉన్నాయి. ఈనెల 30వ తేదీ నుంచి మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంఽఽధించి తొలి విడుత కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో ఆయా జిల్లాల కార్యదర్శులకు అనుమతి కార్డులను మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ అందజేశారు. ఈ మేరకు 30వ తేదీన మహాబలిపురంలోని షెరటాన్ హోటల్లో కార్యక్రమం జరగనుంది. తొలి విడతగా అరియలూరు, కడలూరు, కళ్లకురిచ్చి, కన్యాకుమారి, చెంగల్పట్టు, శివగంగై, దిండుగల్, చైన్నె, తిరువళ్లురు, తేని, నాగపట్నం, పుదుకోట్టై, పెరంబలూరు, వేలూరు, జిల్లాలోని 88 అసెంబ్లీ నియోజకవర్గాలలోని టాపర్లను సత్కరించనున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు టాపర్లు, వారి తల్లిదండ్రులను చైన్నెకు పిలిపించి విజయ్ చేతుల మీదుగా సత్కారం, కానుకల పంపిణీకి చర్యలు చేపట్టారు. మలి విడతగా జూన్ మొదటి వారంలో, మూడో విడతగా రెండో వారంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, మిగిలిన విడతలలో ఒకటి మదురైలో , ఇంకొకటి సేలంలో ఉండవచ్చు అన్న సమాచారాలు వెలువడ్డాయి. -
వారి మాదిరి పేరు తెచ్చుకోవాలి
తమిళసినిమా: బిగ్బాస్ రియాలిటీ గేమ్ షో చాలా మంది కొత్త వారి కలలను నిజం చేస్తోందనే చెప్పాలి. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది సినిమాల్లో నటిస్తున్నారు. అలా తాజాగా మరో బిగ్బాస్ బ్యూటీ కథానాయకిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పేరు అర్చన. ఆ గేమ్ షోలో తాను నేర్చుకున్న విషయాలను అర్చన పేర్కొంటూ బిగ్బాస్ గేమ్షో తనకుంటూ ఒక గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. ఎలాంటి మాస్క్ లేకుండా తన నిజ ముఖాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిందన్నారు. ఆ కార్యక్రమం నుంచి తాను తెలుసుకున్న మరో విషయం ఎక్కువగా మాట్లాడే తనకు ఎప్పుడు? ఎలా? ఎంత వరకూ మాట్లాడాలన్నది తెలుసుకున్నానన్నారు. తాను ఐటీలో గానీ, యూపీఎస్సీలో గానీ చేరవచ్చని, ఎందుకంట తాను ఐఏఎస్ కావాలన్నది తన తండ్రి కల అని చెప్పారు. అయితే తానిప్పుడు సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. అయితే సాధారణ కథా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదన్నారు. బలమైన నటనకు అవకాశం ఉన్న ఎమోషనల్తో కూడిన కథా పాత్రల్లోనే నటించాలని భావిస్తున్నానన్నారు. అలాగే కథ బాగుంటే సినిమాల్లోనైనా, ఓటీటీ చిత్రాల్లోనైనా నటించడానికి రెడీ అన్నారు. మాస్ పాత్రలకంటే అర్ధవంతమైన, అదే సమయంలో ప్రేక్షకుల మనసులను హత్తుకునే కథా పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నటీమణులు షభానా ఆజ్మీ, స్మితా పాటిల్, అర్చన, శోభన, నందితాదాస్ తనకు ఇష్టమైన తారలని చెప్పారు. వారంతా కథానాయకలుగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, అలాగే తానూ ప్రత్యేకత చాటుకోవాలని ఆశిస్తున్నట్లు బిగ్బాస్ అర్చన పేర్కొన్నారు. -
మురుగన్ సేవలో నటీ స్నేహ, ప్రసన్న దంపతులు
తిరుత్తణి: నటి స్నేహ, నటుడు ప్రసన్న దంపతులు మంగళవారం ఉదయం అభిషేకం సమయంలో సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి మంగళవారం అనువైన రోజు కావడంతో నటి స్నేహ, నటుడు ప్రసన్న దంపతులు ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం సమయంలో తిరుత్తణి కొండ ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయాధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న నటీ స్నేహ, ప్రసన్న దంపతులు అపత్సహాయక వినాయకుడు, షణ్ముఖర్ను దర్శించుకుని మూలవర్ల సన్నిధిలో అభిషేకం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, దీవెనలు పొందారు. అలాగే శ్రీవల్లి దేవసేన, ఉత్సవర్లను దర్శించుకున్నారు. ఆలయం తరఫున వారికి పువ్వుల మాల వేసి విభూది ప్రసాదాలు అందజేసి, ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. నటి స్నేహ, నటుడు ప్రసన్నను గుర్తించిన భక్తులు పోటాపోటీతో వారితో సెల్పీ తీసుకున్నారు. దీంతో ఉదయం తిరుత్తణి కొండ ఆలయంలో కాసేపు హడావుడి చోటుచేసుకుంది. -
చేసిన అప్పునకు వడ్డీ కడుతున్నాను!
తమిళసినిమా: సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న తరుణంలో కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన విజయ్ ఆంటోని, ఆ తరువాత నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా మారిని విషయం తెలిసిందే. కాగా కథానాయకుడిగా నాన్, పిచ్చైక్కారన్ వంటి పలు విజయాలను అందుకున్న ఈయన ఇటీవల మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా విజయ్ ఆంటోని సంగీతం అందించి, కథానాయకుడిగా నటించిన చిత్రం మార్గన్. విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ పతాకంపై మీరా విజయ్ఆంటోని నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్ లియో జాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మార్గన్ చిత్రం జూన్ 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ దర్శకుడు లియో జాన్ చెప్పిన కథ నచ్చడంలో ఆయన్నే దర్శకుడిగా పరిచయం చేసినట్లు చెప్పారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇది వృత్తంగా సాగే ఈ చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. తాను లియోజాన్కు ఇచ్చే సలహా ఒక్కటేనన్నారు. మీకు ఎడిటర్గా మంచి పేరు ఉందని, దాన్ని విస్మరించవద్దని చెప్పారు. తాను చేసిన తప్పును మీరు చేయవద్దన్నారు. సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్న తాను కథానాయకుడిగా మారిన తరువాత సంగీత దర్శకత్వం వహించడం తగ్గించానన్నారు. కాగా ఇప్పుడు మళ్లీ సంగీత దర్శకత్వాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా తాను అప్పు చేసి చిత్రాలు నిర్మిస్తున్నానని, ఆ అప్పునకు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నానని చెప్పారు. -
27 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
కొరుక్కుపేట: తాంబరం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ల్లో పనిచేస్తున్న 27 మంది పోలీసు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ తాంబరం నగర పోలీసు కమిషనర్ అభిన్ దినేష్ మోదక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాంబరం నగర పోలీసు కమిషనరేట్ ఒక ప్రకటనలో పేర్కొంటూ క్రోమ్పేట లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ను సెమ్మన్ చేరి లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్గా, కన్నగినగర్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ దయాల్ను క్రోమ్పేట లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్గా, అలాగే పల్లికరనై ప్రోహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ నటరాజ్ను కన్నగి నగర్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్గా, పల్లావరం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ దినేష్ను పల్లికరనై ప్రొహిబిషన్ ఎన్ ఫోర్స్మెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. అలాగే రాణిపేట ప్రాంతానికి చెందిన పళనివేలు అనే వ్యక్తిని పల్లావరం లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్గా నియమించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ● నెల్లై విశ్వ విద్యాలయ పరీక్ష రద్దు తిరువొత్తియూరు: నెల్లై మనోన్మయం సుందరనార్ విశ్వ విద్యాలయం పరీక్షలకు సంబంధించి బీకాం ప్రశ్నాపత్రం లీక్ అయిందనే సమాచారం మేరకు మంగళవారం జరగాల్సిన ఒక సబ్జెక్టు పరీక్షను రద్దు చేశారు. నెల్లై మనోన్మణియం సుందరనార్ విశ్వ విద్యాలయం నియంత్రణలో వున్న నెల్లై, తూత్తుకుడి, తెన్కాశి, కుమరి అనే నాలుగు జిల్లాలలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాలలకు సెమిస్టర్ పరీక్షలు 99 కేంద్రాలలో జరుగుతున్నాయి. మంగళవారం బీకాం ఇండస్ట్రియల్ లా పరీక్ష నిర్వహించుటకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్టు వార్తలు వ్యాపించాయి. దీంతో పరీక్షను రద్దు చేసినట్లు విశ్వ విద్యాలయ పరీక్షా కంట్రోలర్ ప్రకటించారు. విశ్వ విద్యాలయం కమిటీ సమావేశమై తరువాత ఈ పరీక్షకు కొత్త తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా ప్రశ్నాపత్రం లీక్కు సంబంధించిన సమాచారంపై వైస్ చాన్స్లర్ చంద్రశేఖర్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ గురించిన సమాచారం విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో కలకలం రేపింది. ఉద్యోగ కల్పన లక్ష్యంగా విస్తృత ప్రణాళిక సాక్షి, చైన్నె: ఉద్యోగ కల్పన లక్ష్యంగా విస్తృత ప్రణాళికతో ముందుకెళుతున్నామని సీఐఈఎల్ హెచ్ సర్వీసెస్ చైర్మన్ కే పాండియరాజన్ ప్రకటించారు. ఉద్యోగ మేళాలు, క్యాంపస్ సెలక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని, ఇందులో భాగంగా డీప్ టెక్ పేరిట ఆరు కొత్త సర్వీసులు, ఆరు కొత్త వేదికతో ముందుకెళ్లనున్నామని తెలిపారు. మంగళవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఉద్యోగి జీవిత చక్రాన్ని రూపొందించడం, సాంకేతికతతో నడిచే హెచ్ఆర్ పరిష్కారాల దిశగా ముందుకెళుతున్న సీఐఈఎల్ హెచ్ సర్వీసు 2024 వార్షిక ఆదాయ వివరాలను ఆయన ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1504 కోట్లు ఆదాయం పెరిగిందని, ఇది 38.57 శాతం వృద్ధి అని వివరించారు. అటానమస్ ఏఐ ఏజెంట్లు, మెసిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ, బ్లాక్ చెయిన్తో సహా అత్యాధునిక డిప్ టెక్ను ఉపయోగించుకునే ఏఐ ఏజెంట్ ప్లాట్ ఫామ్లను తాము సిద్ధం చేస్తున్నామన్నారు. నిరంతర పరిశోధన, అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల మార్పునకు, హెచ్ఆర్ పరిష్కాలకు విస్తృత ప్రణాళికతో ముందుకెళుతున్నామని వివరించారు. ఐటీ, ఈపీఎస్,హెల్త్ రంగాల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇన్ఫినిటీ స్కిల్ వంటి అంశాలు, సాంకేతిక ఆధారితంగా ఉద్యోగ కల్పనలను విస్తృతం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ ఎండీ ఆదిత్యనారాయణ్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు దురైస్వామి రాజీవ్ కృష్ణన్, ఇతర ప్రతినిధులు సౌరబ్ మోరీ, డిజిటల్ అధికారి నెల్సన్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు సీజే కేఆర్ శ్రీరామ్ బదిలీ ●కొత్త సీజేగా శ్రీవత్సవ్ ●కొలీజియం సిఫారసు సాక్షి, చైన్నె : మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న కేఆర్ శ్రీరామ్ను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొత్త సీజేగా ఎంఎం శ్రీవత్సవను నియమిస్తూ సిఫారసు చేశారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ వచ్చిన ఎస్వీ గంగాపూర్వాల గత ఏడాది పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా సీనియర్ న్యాయవాది మహాదేవన్ వ్యవహరించారు. ఆయన్ని పదోన్నతిపై సుప్రీం కోర్టుకు పంపించడంతో మరో సీనియర్ కృష్ణకుమార్ హైకోర్టు ఇన్చార్జ్ సీజేగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు కొన్ని నెలల అనంతరం పూర్తి స్థాయిలో ప్రధాన న్యాయమూర్తిగా ముంబై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి కేఆర్ శ్రీరామ్ను గత ఏడాది సెప్టెంబర్లో నియమించారు. మద్రాసు హైకోర్టు 34వ ప్రధాన న్యాయమూర్తిగా కేఆర్ శ్రీరామ్ కొనసాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయన్ని రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అలాగే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా చత్తీష్గడ్ సీజే ఎంఎం శ్రీవత్సవను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించగానే ఈ సిఫారసులు అమల్లోకి రానున్నాయి. -
రజనీకాంత్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకోవాలి
తమిళసినిమా: సునితమైన ప్రేమ కథా చిత్రాలను, ఎమోషనల్తో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైన్ కథా చిత్రాలను తెరకెక్కించడంతో దిట్ట దర్శకుడు మణిరత్నం. ఈయన ఇంతకు ముందు తెరకెక్కించిన బాంబే, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, చెలియా, నాయకన్, దళపతి ఇలా వేటికి అవే భిన్నమైన కథా చిత్రాలే. ఇక పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రాలను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. తాజాగా గజ దొంగల నేపథ్యంలో కమలహాసన్, శింబు, త్రిష వంటి ప్రముఖ తారాగణంతో థగ్ లైఫ్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో మణిరత్నం తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాగా తదుపరి ఆయన టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా ఒక యూత్పుల్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా తాజాగా థగ్లైఫ్ చిత్రం తరువాత రజనీకాంత్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. కాగా రజనీకాంత్తో చిత్రం చేసే విషయమై దర్శకుడు మణిరత్నం ఇటీవల ఒక బేటీలో స్పందిస్తూ ఈ విషయం గురించి రజనీకాంత్నే అడగండి అని పేర్కొన్నారు. అదే సమయంలో ఆయనకు తగ్గ కథ ఉంటే, ఆయనకు కథ వినే సమయం ఉంటే, కచ్చితంగా తాను ఆయన్ని అడుగుతానని చెప్పారు. పెద్ద స్టార్తో చిత్రం అంటే అందుకు తగిన కథ ఉండాలన్నారు. తాను సాధారణ కథను పెద్ద స్టార్ వద్దకు వెళ్లకూడదు అన్నారు. ఆయన ఇంతకు ముందు చేసిన చిత్రాలకు భిన్నమైన కథ ఉంటే, అదే సమయంలో ఆయన మార్కెట్కు దృష్టిలో పెట్టుకోవాలని దర్శకుడు మణిరత్నం పేర్కొన్నారు. కాగా ఈయన ఒక యూత్పుల్ కథతో పాటు, కమర్శియల్ అంశాలతో కూడిన కథను రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు మణిరత్నం ఏ విషయంలోనూ తొందర పడే వ్యక్తి కాదు. ప్రస్తుతం థగ్లైఫ్ చిత్రం ప్రమోషన్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన తరువాతనే తన నూతన చిత్రం గురించి ప్రకటించే అవకాశం ఉంది. -
చెస్ పోటీలతో సృజనాత్మక ఆలోచనలు
కాట్పాడిలో ఎడపాడి పళణిస్వామి జన్మదినం వేలూరు: చెస్ పోటీలు మానవుని మేధాశక్తిని పెంచుతాయని తిరుపత్తూరు జిల్లా అదనపు ఎస్పీ గోవిందరాజు అన్నారు. తిరుపత్తూరులోని ప్రైవేటు పాఠశాల ఆవరణంలో పైడ్ రేటడ్ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు తిరుపత్తూరు జిల్లా చెస్ అసోసియేషన్, తమిళనాడు చెస్ అసోసియేషన్, కాట్పాడి రాయ వేలూరు జిల్లా చెస్ అసోసియేషన్ సంయుక్తంగా విద్యార్థులకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు పాఠశాల విద్యార్థులు, పెద్దలకు వేర్వేరుగా నిర్వహించారు. వీటికి కాట్పాడి తాలుకా చెస్ అసోషియేషన్ కార్యదర్శి మనోహరన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. పాఠశాల విద్యార్థులు తరచూ ఇటువంటి చెస్ పోటీల్లో కలుసుకునే విధంగా తల్లిదండ్రులు పోత్సహించాలన్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ విద్యపై శ్రద్ధ వహిస్తున్నారని విద్యార్థులకు క్రీడలపై కూడా ఆశక్తి పెరిగే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాయ వేలూరు చెస్ అసోసియేషన్ సభ్యులు ఆనందబాబు, రాజశంకర్, చంద్రశేఖరన్, తమిళనాడు చెస్ అసోషియేషన్ ప్రదాన కార్యదర్శి స్టీబన్ బాలాస్వామి, జాయింట్ కార్యదర్శి రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు. అశ్లీల ఫొటోలను చూపించి నగదు వసూలు అన్నానగర్: చైన్నెలోని మదురవాయిల్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యాపారవేత్త. ఇతని భార్య, పిల్లలు కోయంబత్తూరులో నివసిస్తున్నారు. అతను ప్రతి వారం తన భార్య పిల్లలను చూడటానికి కోయంబత్తూరుకు వచ్చేవాడు. ఈ పరిస్థితిలో గత నెలలో అతని సెల్ఫోన్ నెంబర్కు యాప్ ద్వారా కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన మర్మమైన వ్యక్తి వ్యాపారవేత్తను తన భార్య, పిల్లలను చూడటానికి కోయంబత్తూరుకు రావద్దని, వస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో షాక్ అయిన వ్యాపారవేత్త కాల్ వచ్చిన నెంబర్ కోసం దర్యాప్తు చేశాడు. అందులో మిర్రాట్ యాప్ ద్వారా కాల్ చేసింది కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడని తెలిసింది. దీనికి సంబంధించి వ్యాపారవేత్త చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ఇందులో నారాయణన్ పేరుతో ఒక సిమ్కార్డు తీసుకున్నారని, ఆ సిమ్ కార్డు స్వీట్ సన్ వ్యాపారవేత్తను బెదిరించడానికి ఉపయోగించాడని తేలింది. దీని తరువాత చైన్నె స్పెషల్ పోలీసులు రత్తినపురిలోని స్వీట్ సన్ ఇంటికి చేరుకుని అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు పోలీసులను చూసిన స్వీట్ సన్ ఇంటి కిటికీ పగులగొట్టి పారిపోయాడు. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దీనిపై పోలీసులు మాట్లాడుతూ కోయంబత్తూరులోని రత్నపురానికి చెందిన స్వీట్ సన్ శరవణంపట్టి ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో సంగీత విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అతను సింగనల్లూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్నప్పుడు చైన్నెకు చెందిన వ్యాపారవేత్త భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ అలవాటును ఆసరగా చేసుకుని వ్యాపారవేత్త భార్యతో సన్నిహితంగా ఫొటోలు దిగాడు. తర్వాత స్వీట్ సన్ ఆమెకు అశ్లీల ఫొటోలను చూసించి డబ్బు, నగలు అడిగి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. వేలూరు: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళణిస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాట్పాడిలోని కాంగనెల్లూరు గ్రామంలోని ఆలయంలో కార్పొరేషన్ 10వ వార్డు కార్పొరేటర్ కేపీ రమేష్ అధ్యక్షతన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు, మాజీ జిల్లా కార్యదర్శి రాములు ముఖ్య అథిదిగా హాజరై ఆ ప్రాంతంలోని వల్లిదైవాని సమేత శ్రీసుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఎడపాడి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆలయం వెలుపుల భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంజీఆర్ మండ్రం జిల్లా కార్యదర్శి నారాయణన్, వండ్రంతాంగల్ సర్పంచ్ రాకేష్ రెడ్డి, సేన్బాక్కం మాజీ కార్పొరేటర్ మేగనాధన్, అమరనాద్, దాస్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నీటి వసతి కోసం గ్రామీణుల రాస్తారోకో
పళ్ళిపట్టు: తాగునీటి వసతి కల్పించాలని కోరుతూ మహిళలు ప్రభుత్వ బస్సు దిగ్భందించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తిరుత్తణి యూనియన్లోని కన్నికాపురం పంచాయతీలోని బీసీఎన్ కండ్రిగ దళితవాడలో వందకు పైగా కుటుంబాలున్నాయన్నారు. గ్రామానికి పంచాయతీ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో పది రోజులుగా గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొందని, అయితే పంచాయతీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో రాకపోకలకు అంతరాయం కలగడంతో తిరుత్తణి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో చర్చించి, తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. తాగునీటి ఎద్దడిపై బీడీఓ సంతానం మాట్లాడుతూ మోటారుతో పాటు పైపులైన్లు విరగడంతో తాగునీటి సమస్య తలెత్తెందని, వెంటనే పనులు చేపట్టేందుకు పంచాయతీలోని నిధులు లేకపోవడంతో యూనియన్ జనరల్ నిధులు కేటాయించి పనులు ప్రారంభించామని, బుధవారం నాటికి తాగునీటి సమస్య పరిష్కరించి, గ్రామస్తులకు తాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. -
బెంగళూరు ప్రభుత్వ బస్సు సేవలు కల్పించాలి
పళ్ళిపట్టు: నొచ్చిలి నుంచి బెంగళూరుకు ప్రభుత్వ బస్సు సేవలను కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే చంద్రన్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం నొచ్చిలిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రన్ను నొచ్చిలికి చెందిన సంజీవిరాజు, సునీల్కుమార్ తదితరులు వినితిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పళ్లిపట్టు సమీపంలోని నొచ్చిలి పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది బెంగళూరులో స్థిరపడిన వారితో పాటు రోజు వారి కూలీ పనులకు వెళ్లి వచ్చేవారి సంఖ్య వందల్లో ఉందన్నారు. దీంతో బెంగళూరు నుంచి బలిజకండ్రిగ వరకు కర్ణాటక బస్సు నడుస్తుందన్నారు. అయితే నొచ్చిలి నుంచి బస్సు సేవలు లేకపోవడంతో గ్రామీణులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో చాలా కాలంగా ప్రభుత్వ బస్సు సేవల కోసం తమిళనాడులోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. -
Kamal Haasan: రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖరారయినట్లే!. తమిళనాడు నుంచి ఆయనకు ఈ పదవి దక్కనుంది. కమల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ డీఎంకే బుధవారం అధికారిక ప్రకటన చేసింది.రాజ్యసభలో ఖాళీగా ఉన్న 8 స్థానాలకుగానూ వచ్చే నెల(జూన్) 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు నుంచి, రెండు అసోం నుంచి ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే.. డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు సీట్లలో నాలుగింటిని డీఎంకే.. మరో రెండింటిని అన్నాడీఎంకే దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.నలుగురు అభ్యర్థుల్ని డీఎంకే(DMK) ఇవాళ ప్రకటించగా.. అందులో కమల్ హాసన్(70) కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు.. సిట్టింగ్ ఎంపీ విల్సన్, తమిళ రచయిత సల్మా, డీఎంకే నేత ఎస్ ఆర్ శివలింగం. దీంతో కమల్ రాజ్యసభకు వెళ్లడం లాంఛనమే కానుంది.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి(INDIA Alliance)కి కమల్ పార్టీ ఎంఎన్ఎం మద్దతు ప్రకటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డీఎంకే ఎంఎన్ఎం మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తమిళ మీడియా వర్గాలు కథనాలు ఇచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేదంటే రాజ్యసభకు వెళ్లడమా? అనే ఛాయిస్ కమల్కు డీఎంకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభకే మొగ్గు చూపినట్లు ఆ కథనాల సారాంశం.ఇదీ చదవండి: కమల్ వ్యాఖ్యలపై కన్నడనాట దుమారం -
అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఆత్మ రక్షణ విద్య అవశ్యకతను తెలిపే వేంబు
తమిళసినిమా: హరికృష్ణ, షీలా రాజ్కుమార్ జంటగా నటించిన చిత్రం వేంబు. మంజల్ సినిమా సంస్థ సమర్పణలో గోల్డెన్ షుర్స్ పతాకంపై ఎస్.విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభు దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ప్రేమానుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మేనత్తా మేనమామల పిల్లలైన హరికృష్ణ,షీలా రాజ్ కుమార్లకు బాల్యం నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. తన మేనమామ కూతురు షీలా రాజ్కుమార్కు చిన్నతనం నుంచి ఏది కావాలన్నా ఇస్తాడు హరికృష్ణ. అతను పెద్ద అయిన తరువాత ఒక ఫొటో స్టూడియోను నడుపుతాడు. షీలా రాజ్కుమార్ మంచిగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాదించాలన్న లక్ష్యంతో ఉంటుంది. ఈమె చిన్న తనం నుంచి కర్రసాము విద్యను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతుంది. అలాంటిది యుక్త వయసు వచ్చిన తరువాత గ్రామ పెద్దల సలహాతో హరికృష్ణ,షీలా రాజ్కుమార్లకు వారి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించకుంటారు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, తండ్రి కోసం షీలా రాజ్కుమార్ పెళ్లి పీటలు ఎక్కుతుంది. పెళ్లి అయిన తరువాత జరిగిన ఒక దుర్ఘటనతో భర్త చూపుకోల్పోతాడు. దీంతో వారి సంసార జీవితం ఆర్ధిక సమస్యలో చిక్కుకుంటుంది. అందులోంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి షీలా రాజ్కుమార్ ఏం చేసింద్? తన లక్ష్యాన్ని చేరుకుందా? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వేంబు. ఇందులో ఆత్మరక్షణ విద్య అవశ్యత గురించి అవగాహన కలించే విధంగా పలు సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చిత్రాన్ని చక్కని సందేశాత్మకంగా దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకోవడం విశేషం. కాగా వేంబు చిత్రం ఈ శుక్రవారం తెరపైకి వచ్చింది. -
పర్యాటకుల కోసం టూరిస్టు కార్డులు
సాక్షి, చైన్నె: మాస్కో పర్యటనకు వచ్చే భారతీయ పర్యాటకుల కోసం కటింగ్–ఎడ్జ్ టూరిస్ట్ సెంటర్లో నగదు రహిత చెల్లింపులకు మాస్కో ఆఫర్స్ టూరిస్ట్ కార్డులను అందజేస్తున్నామని అక్కడి పర్యాటక విభాగం అధికార వర్గాలు సోమవారం స్థానికంగా ప్రకటించాయి. చైన్నెలోని రష్య కల్చరల్ సెంటర్, మాస్కో టూరిజం నేతత్వంలో తమ దేశంలోని పర్యటక వివరాలు, పర్యాటకులకు అందజేసే సౌకర్యాలు, టూరిస్టు కార్డుల గురించి ప్రతినిధులు వివరించారు. మాస్కోకు వెళ్లే భారతీయ పర్యాటకులకు ఇక మీదట రెడ్ స్క్వేర్ నుంచి చాలా దూరంలో ఉన్న బోల్షాయ డిమిట్రోవ్కా స్ట్రీట్లోని నగర కేంద్రంలో ఉన్న అతిపెద్ద రష్యన్ బ్యాంక్ అయిన స్బెర్ లో కొత్త ట్రావెల్, బ్యాంకింగ్ కార్యాలయంలో టూరిస్ట్ కార్డును పొందవచ్చు అని వివరించారు. స్బెర్ కొత్త ట్రావెల్ అండ్ బ్యాంకింగ్ కార్యాలయం, స్బెర్ బ్యాంకింగ్ కార్యాలయం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సామర్థ్యాలను మిళితం చేస్తుందన్నారు. ఇది తమ అతిథులకు బహుళ సౌకర్యాలు కల్పించే ప్రదేశం అని, ఇక్కడ పర్యాటకులు మాస్కో సందర్శన కోసం అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడే ప్రయాణికులు ప్లాస్టిక్ టూరిస్ట్ కార్డును తీసుకోవచ్చు అని, అవసరమైన చెల్లింపులు చేయవచ్చు అని, , కరెన్సీ మార్పిడి , బదిలీలు చేయవచ్చు అని వివరించారు. అనేక భాషలలో సంప్రదింపులు ఇక్కడ సాధ్యమే అని, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిపుణులు రష్యన్, ఇంగ్లీష్, అరబిక్లోనూ మాట్లాడుతారని, సమాచారాలు అందజేస్తారని పేర్కొన్నారు. టూరిస్ట్ కార్డ్ విదేశీ సందర్శకులు నగదు రహిత చెల్లింపులు చేయడానికి సహాయపడే కొత్త చెల్లింపు పరిష్కారం అని వివరించారు. -
అరుణాచలేశ్వరునికి దోష నివృత్తి యాగ పూజలు
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో అగ్ని నక్షత్రాన్ని పురష్కరించుకొని ఆలయంలో గత మూడు రోజులుగా అగ్ని నక్షత్ర దోష నివృత్తి యాగశాల పూజలను శివాచార్యులు వేద మత్రాల నడుమ చేస్తున్నారు. ముందగా అమ్మన్ సన్నిధి వద్దనున్న మండపంలో 1008 కళశాలను ఉంచి శివాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ప్రార్థనలు చేశారు. ఎండ వేడిమి నుంచి ప్రజలను కాపాడాలని, వర్షాలు కురవాలని, రైతులు పంటలు పండించాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అగ్ని నక్షత్రంతో పాటూ అమావాస్యను పురస్కరించుకుని శివాచార్యులు అమ్మన్ సన్నది వద్దనున్న కళశాలను ఊరేగింపుగా మేళ తాళాల నడుమ అరుణాచలేశ్వరుని సన్నది వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మూడు రోజుల పాటు కలశాలను ఉంచి పూజలు చేసిన పుణిత నీటిని స్వామి వారికి అభిషేకం చేసి పుష్పాలంకరణలు చేశారు. ఈ సందర్భంగా శివాచార్యులు ప్రత్యేక వేద మంత్రాలు చదివి వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. అనంతరం దోష నివర్థి యాగ శాల పూజలు చేశారు. ఈ యాగశాల పూజా కార్యక్రమంలో ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్, వాచార్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గ్రీవెన్స్డేలో 504 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 504 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. గ్రీవెన్స్డేకు అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకాగా, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పట్టాలు కోసం 120 వినతులు, పక్కాగృహల కోసం 65, ఉపాధి కోసం 62, మౌలిక సదుపాయాలతో సహా ఇతర వాటి కోసం 136 వినతులతో కలిపి మొత్తం 504 వినతులు వచ్చింది. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం దాదాపు గంట పాటు అధికారులతో గత వారం స్వీకరించిన వినతులపై సమీక్ష నిర్వహించారు. పరిస్కరించిన వినతులు, పెండింగ్ వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్తో పాటూ గ్రీవెన్స్డేకు రెవెన్యూ, పోలీసులు, పీడబ్లూడీ, గ్రామీణభివృద్ధి, అగ్నిమాపశాఖ, ఎడ్యుకేషన్, సర్వేయర్ విభాగంతో పాటూ అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. దాడిపై కలెక్టర్కు ఫిర్యాదు తిరువళ్లూరు: వ్యక్తిగత అవసరాల కోసం 20 వేల రూపాయలు అప్పుగా తీసుకుంటే వడ్డీ అసలుతో కలిపి రెండు లక్షల రూపాయలను ఇవ్వాలని తమపై బయటి వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారని ఓ మహిళ వాపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ప్రతాప్కు సంచార కులాలకు చెందిన మహిళలు వినతి పత్రం సమర్పించారు. కాగా విచారణ చేయాలని డీఎస్పీని ఆదేశించారు. -
ఘనంగా అర్ధనారీశ్వరుడి రథోత్సవం
సేలం: తిరుచెంగోడ్లో అర్ధనారీశ్వరస్వామి రథోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని తిరుచెంగోడ్ ఎమ్మెల్యే ఈశ్వరన్ ప్రారంభించారు. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్లో వైకాసి విశాఖ ఉత్సవాలు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు ఆ హ్వానంగా రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం ఐదు గంటల నుంచే అర్ధరారీశ్వరుడి ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరిగింది. తిరుచెంగోడ్ ఎమ్మెల్యే ఈశ్వరన్ రథాన్ని లాగి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు నళిని సురేష్బాబు, రమణి కంఠన్ ఉత్సవాల్లో భాగంగా దీక్షలను ప్రారంభించారు. అంతకు ముందు భద్రకాళియమ్మన్ ఆలయంలో అమ్మవారికి కల్యాణోత్సవం జరిగింది. -
అభివృద్ధి పనులు వేగవంతం
– మంత్రి దురైమురుగన్ వేలూరు: కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అద్యక్షతన కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ వేలూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం నాలుగు జోన్లు, 60 వార్డులున్నాయని అయితే ప్రస్తుతం ఈ వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఈ పనులు ఎంత వరకు వచ్చింది, ఎప్పటిలోపు పనులను పూర్తి చేస్తారనే విషయాలను కార్పొరేషన్ అధికారులు పూర్తి నివేదికను అందజేయాలన్నారు. ప్రస్తుతం కార్పొరేషన్లోని 2,531 రోడ్డు పనులు జరుగుతున్నాయని అందులో 771 పనులు పూర్తి చేసినట్లు ఇస్తున్నారన్నారు. అదే విధంగా అన్ని వార్డుల్లోను తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలన్నారు. కొన్ని వార్డుల్లో భూగర్బ డ్రైనేజీ పనులు నత్త నడకన జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచి వెంటనే పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మొదటగా అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షించి ఎక్కడ పనులు నత్త నడకన జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయనే వాటిపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను న్యాయశాఖ మంత్రిగా బాద్యతలు తీసుకున్నానని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టులు, పోలీస్ స్టేషన్లకు సొంత కట్టడాలు కట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్. కార్పొరేషన్ కమిషనర్ జానికి, జోన్ చైర్మన్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఇంజినీరింగ్, అధికారులు పాల్గొన్నారు. -
215 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ
పళ్ళిపట్టు: మండలంలో 215 కుటుంబాలకు ఉచి తంగా ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే చంద్రన్ సోమ వారం పంపిణీ చేశారు. పదేళ్లకు పైగా పోరంబోకు స్థలాల్లో, నివాసముంటున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారు. దీంతో తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీకి సంబంధించి అర్హులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు మండలంలోని అర్హులూన వారిలో తొలి విడతగా 215 కుటుంబాకులకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. కొళత్తూరు, కుమారాజుపేట, బొమ్మరాజుపేట, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, నెడిగళ్లు, కీచ్చళం, నొచ్చిలి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో అర్హులకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రన్ మాట్లాడుతూ పేదలు చాలా కాలంగా ఇళ్ల పట్టాలు కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీకి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు అన్బళగన్, రవికుమార్, డీఎంకే మండల కార్యదర్శులు శ్రీనివాసన్, చంద్రన్, మండల మాజీ కార్యదర్శి పీ రవీంద్రనాఽథ్రెడ్డి, డీఎంకే నాయకులుల సెంథిల్కుమార్, గోపి, దేవరాజ్, బాబురెడ్డి, లోకనాథం, నాగరాజ్, మీసై వెంకటేశన్, నేతాజీ, సంజీవిరాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్యూటీ కాంటెస్ట్ విజేత రాయపురం ఎలక్ట్రిక్ లోకోషెడ్ జట్టు
కొరుక్కుపేట: బ్యూటీ కాంటెస్ట్లో రాయపురం ఎలక్ట్రిక్ లోకోషెడ్ జట్టు మొదటి బహుమతి సాధించి, విజేతగా నిలించింది. బనారస్ లోకో మోటివ్ వర్క్స్ (బీఎల్డబ్ల్యూ)లో జరిగిన 42వ ఎలక్ట్రిక్ లోకో మెయింటెనెన్స్ స్టడీ గ్రూప్ సమావేశంలో రైల్వేబోర్డు భారతరైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ బ్యూటీ కాంటెస్ట్ను నిర్వహించింది. ప్రతిష్టాత్మక లోకో పోటీల్లో 16 రైల్వేజోన్లు, 3 ప్రొడెక్షన్ యూ నిట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో సదరన్ రైల్వేలోని చైన్నెరాయపురం ఎలక్ట్రిక్లోకో షెడ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ బహుమతిని రాయపురంలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ నాగశ్రీనివాస్ అందుకున్నారు. ఈ మేరకు సదరన్ రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా కొరుక్కుపేట: చైన్నెలోని కాశీమేడు ఫిషింగ్ హార్బర్ లో ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా బీజేపీ తిరంగా ర్యాలీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఫిషింగ్ బోర్డు పార్కింగ్ ప్రాంతంలో ప డవలను తిరంగాలతో అలంకరించి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ ఈ తిరంగా కార్యక్రమం సముద్రంలోని పరిమిత ప్రాంతంలో జరిగింది. ఈ ర్యాలీని తమిళనాడు బీజేపీ రాష్ట్రకార్యదర్శి సతీష్ కు మార్ నిర్వహించారు. తమిళనాడు బీజేపీ మత్స్యకార విభాగం అధ్యక్షుడు మునుస్వామి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు నాగరాజు నాయకత్వం వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తమిళనాడు, క ర్ణాటక రాష్ట్రాల బీజేపీ జాతీయ సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా తమిళనాడు బీజేపీ రాష్ట్రఅధికార ప్రతినిధి ఎఎన్ఎస్ ప్ర సాద్, స్పోర్ట్స్ వింగ్ అధ్యక్షుడు అమర్ ప్రసాద్రెడ్డి, ఉత్తర చైన్నె తూర్పు జిల్లా అధ్యక్షుడు ఎన్ఎల్ నాగరాజ్తోపాటు స్థానిక ప్రజలు, మత్స్యకారులు పా ల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైతన్య వంతమైన నాయకత్వంలో భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రశంసించారు. తిరంగ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. సా యుధ దళాలు, కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు. ర్యాలీ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న మత్స్యకారులు, వారు కుటుంబాలతో కలసి ప్రధాని మోదీ ప్రసంగం విన్నారు. దేశ వారసత్వం, సంస్కృతి, ఐక్యతను ప్రోత్సహించడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. -
కువైట్ విమానం రద్దు
కొరుక్కుపేట: ఇంజిన్ వైఫల్యం కారణంగా కువైట్ విమానం రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం తెల్లవారు జామున 1.50 గంటలకు చైన్నె నుంచి కువైట్ వెళ్లే విమానం 155 మంది ప్రయాణికులతో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. విమానం రన్ వేపైకి వెళ్లగానే పైలట్ విమానం ఇంజిన్ వైఫల్యం చెందిందని గుర్తించారు. దీంతో విమానాన్ని నిలిపివేశారు. సిబ్బంది ఇంజిన్ మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు. అయితే సాధ్యం కాలేదు. దీంతో కువైట్ వెళ్లాల్సిన విమానం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులందరికీ చైన్నెలోని వివిధ హోటళ్లలో వసతి కల్పించారు. సోమవారం రాత్రి విమానం మళ్లీ కువైట్కు బయలుదేరుతుందని ప్రకటించారు. కారు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు తిరువొత్తియూరు: చైన్నెలోని ప్రైవేటు ఎంటర్టైన్మెంట్ కేంద్రం వద్ద కారు ఢీకొని కార్మికుడితో సహా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె ఈచంబాకం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ప్రైవేటు ఎంటర్టైన్మెంట్ కేంద్రం ఉంది. శనివారం రాత్రి ఇద్దరూ మద్యం మత్తులో మద్యం తాగి కారు నడిపారు. ఆ సమయంలో కారు అదుపు తప్పి రోడ్డుపై నడిచి వెళుతున్న ఈచంబాకం ప్రాంతానికి చెందిన ఓండివీరన్ (65), పాండియన్ (32)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చైన్నె రాయ పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడిపిన మూర్తి (32), మునుస్వామి (46)ను అరెస్టు చేశారు. శరవేగంగా నేమం చెరువు కరకట్ట పనులు తిరువళ్లూరు: నేమం చెరువు కరకట్ట మరమ్మతు పనులు సుమారు రూ.15 కోట్ల వ్యయంతో శరవేగంగా చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా నేమంలో పెద్ద చెరువు ఉంది. ఈ చెరువు కింద 450 హెక్టార్ల ఆయకట్టు ఉంది. అలాగే నేమం చెరువు మిగులు జలాలను చెమరంబాక్కం రిజర్వాయర్కు తరలిస్తారు. ఏళ్ల కిందట నిర్మించిన చెరువు కరకట్ట పాక్షికంగా దెబ్బతింది. దీంతో అదనపు నీటిని నిల్వ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో దెబ్బతిన్న కరకట్టను బలోపేతం చేయడం, నేమం చెరువు నుంచి చెమరంబాక్కం రిజర్వాయర్కు వెళ్లే కాలువలో పూడికతీత, చెరువులో ముళ్ల పొదల తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు కేటాయించాలని కోరుతూ నివేదికను పంపారు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో కరకట్ట మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ పనులను మరో రెండు నెలలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. -
ఔరా.. పెంపుడు శునకంకు బేబీ షవర్
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా కల్పక్కం సమీపం కూవత్తూరు ప్రాంతానికి చెందిన భరణి (62), కుమారి (58) దంపతులు. వీరికి కామేష్, సిబిరాజన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భరణి, కుమారికి రియా అనే ఆడ శునకం ఉంది. వారు దానిని ప్రేమగా పెంచారు. ప్రస్తుతం గర్భవతి అయిన తమ కుక్కకు బేబీ షవర్ ఏర్పాటు చేసి జరుపుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సోమవారం వారు శునకం ను ఒక కాటన్ పరుపు మీద కూర్చోబెట్టి, పట్టు చీర కట్టి, దండ వేసి, దానిని సంతోషంగా ఉంచడానికి ఒక హారం ధరింపజేశారు. అక్కడికి వచ్చిన సీ్త్రలకు తమలపాకులు మరియు జామ పండ్లతో తాబూలం ఇచ్చారు. కుమారి తమ్ముడు కార్తీక్ కుక్కకు దండ వేసి, మేనమామ చేసే ఆచారాలు నిర్వహించి సంతోషపడ్డారు. ఆచారం పూర్తి చేసిన తర్వాత, గర్భిణీ కుక్కకు బిస్కెట్లు, బిర్యానీ ఇచ్చారు. తరువాత భరణి, వేడుకకు వచ్చిన స్నేహితులు మరియు బంధువులకు బిర్యానీ విందును ఏర్పాటు చేశాడు. -
మా అమ్మాయి కథానాయకి అవుతోంది!
తమిళసినిమా: కోలీవుడ్లో బోల్డ్ అండ్ డేరింగ్ నటి ఎవరైనా ఉన్నారంటే అది వనితా విజయ్కుమార్నే అవుతారు. ధైర్యానికి మారు పేరు ఈమె అని అనవచ్చు. వివాదాస్పద నటిగానూ ముద్ర వేసుకున్నారు. కాగా తాజాగా వనితా విజయ్కుమార్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి కథానాయకిగా నటించిన చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. నృత్య దర్శకుడు రాబర్ట్ కథానాయకుడిగా నటించిన ఇందులో సిమ్రాన్, షకీలా, సెఫ్ దాము,ఆర్తీగణేశ్, పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రాన్ని నటి వనితా విజయ్కుమార్ వారసురాలు జోవికా విజయ్కుమార్ వనితా ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడం విశేషం. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ముందుగా వనితా విజయ్కుమార్, ఆమె కూతురు జోవిక విజయ్కుమార్లో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో నటి వనితా విజయ్కుమార్, జోవిక విజయ్కుమార్తో పాటూ షకీలా, అంబికా, పాతిమాబాబు, పవర్స్టార్ శ్రీనివాసన్, ఆర్తి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పాల్గొన్ప అతిథులు నటి వనితా విజయ్కుమార్ ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఒంటరి మహిళగా ఆమె ఎదురోడ్డి నిలిచి విషయాలను ప్రస్తావించారు. నటి ,చిత్ర దర్శకురాలు వనితా విజయ్కుమార్ మాట్లాడుతూ తన కూతురు జోవిక విజయ్కుమార్ తండ్రి ఎవరని చాలా మంది అడుగుతున్నారని, తాను వివాహనంతరం ఎదుర్కొన్న సమస్య గురించి ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదని, అయితే తాను మూడు నెలల గర్భిణిగా ఉన్న తరుణంలో తన తండ్రి విజయ్కుమార్ ధైర్యం చెప్పి అమెరికాకు పంపారని చెప్పారు. అక్కడే జోవిక పుట్టిందన్నారు. ఇకపోతే నటి కూతురు జోవిక బిగ్బాస్ రియాలిటీ గేమ్షోలో పాల్గొని సంపాదించిన డబ్బుతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ను అధిక భాగం మలేషియాలో నిర్వహించినట్లు చెప్పారు. ఇది మంచి ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాగా జోవిక విజయ్కుమార్ త్వరలోనే హీరోయిన్ కానున్నారని, తను ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలను కమిట్ అయ్యినట్లు చెప్పారు. -
విల్ చిత్ర టీజర్ విడుదల
తమిళసినిమా: నటుడు విక్రాంత్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం విల్. అలేఖ్య, పదం వేణుకుమార్, మోహన్ రామన్, లొల్లుసభ స్వామినాథన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫుట్స్టెప్స్ ప్రొడక్షన్స్, కొత్తారి మెడ్రాస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఎస్.శివరామన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం న్యాయస్థానం నేపధ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. తాను 25 ఏళ్ల పాటు న్యాయవాదిగా బాధ్యతలను నిర్వహించినట్లు చెప్పారు. దీంతదో న్యాయస్థాఽనం గురించి, దాని విధి విధానాల గురించి యధార్ధంగా తెరపై ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వాక్స్వాతంత్య్రం గురించి వివరించనున్నట్లు చెప్పారు. ఒకరు తన ఆస్తులను చట్టబద్ధంగా ఎలా కాపాడుకోవాలి వంటి పలు విషయాలను చర్చించినట్లు చెప్పారు. కాగా దీనికి నటి సోనియా అగర్వాల్ సోదరుడు సౌరబ్ అగర్వాల్ సంగీతాన్ని అందించడం విశేషం. టీఎస్.ప్రసన్న ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. దీన్ని నటుడు అరుణ్ విజయ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందనే ఆనందాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, ఒక పాటను విడుదల చేయగా సామాజిక మాధ్యమాలో వైరల్ అవుతూ మంచి ఆదరణను పొందుతున్నాయని చెప్పారు. నటి సోనియా అగర్వాల్కు సూచనలు ఇస్తున్న దర్శకుడు ఎస్.శివరామన్ -
నేమ్ బోర్డులపై వివరణ ఇవ్వండి
● చైన్నె కార్పొరేషన్కు హైకోర్టు ఆదేశం కొరుక్కుపేట: తమిళంలో షాపు నేమ్ బోర్డుల పిటిషన్పై నాలుగు వారాల్లోపు వివరణ ఇవ్వాలని చైన్నె కార్పొరేషన్కు చైన్నె హైకోర్టు అదేశించింది. గత ఏప్రిల్లో చైన్నె కార్పొరేషన్ సహా తమిళనాడులోని అన్ని ప్రాంతాలలోని దుకాణాలకు తమిళంలో నేమ్ బోర్డులు ఉండాలని ఆదేశించారు. ఈనెల 30 నాటికి దుకాణాల నేమ్ బోర్డులు తమిళంలో ఉండాలని, తమిళ పేర్లతో ఇంగ్లీష్ పేర్లను కలిగి ఉండవచ్చని, లేని పక్షంలో రూ. జరిమానా విధించవచ్చని ఆ ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఉత్తర్వును వెంటనే అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలోని ఇండియన్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రేడ్మార్క్ల ఆధారంగా నేమ్ప్లేట్లను ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొంది. వాటిని మార్చడం వల్ల కస్టమర్లకు గందరగోళం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆర్థిక కారణాల వల్ల అది వెంటనే సాధ్యం కాదు. నేమ్ప్లేట్లను మార్చడం సాధ్యం కాదని, వాటిని మార్చడానికి అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ చైన్నె కార్పొరేషన్ , తమిళనాడు ప్రభుత్వానికి ఓ పిటిషన్ పంపారు. చైన్నె కార్పొరేషన్ , తమిళనాడు ప్రభుత్వం ఈ పిటిషన్ను పరిశీలించి తగిన ఉత్తర్వు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ముందు విచారణకు వచ్చినప్పుడు, పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో నేమ్ప్లేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలు. నేమ్ప్లేట్లను మార్చడం వల్ల అదనపు ఖర్చులు వస్తాయని ఆయన వాదించారు. పిటిషనర్ అసోసియేషన్ పిటిషన్ను 4 వారాల్లోగా పరిగణించాలని చైన్నె కార్పొరేషన్ను న్యాయమూర్తి ఆదేశించారు అప్పటి వరకు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకూడదని కోర్టు అదేశించింది. -
విస్తరించిన పవనాలు
● నీలగిరుల్ని వీడని వాన ● 35 సెం.మీ వర్షం ● పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సేలం : నైరుతి రుతు పవనాలు పశ్చిమ కనుమలలో విస్తరించాయి. ఈతీరం వెంబడి తమిళ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నీలగిరుల్ని అయితే వర్షం వీడటం లేదు. ఇక్కడి అవలాంజిలో 35 సెం.మీ వర్షం పడింది. చిన్న కల్లార్లో 21 సెం.మీ వాన కురిసింది. వివరాలు.. నైరుతి రుతు పవనాల రాకతో నీలగిరులలో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పక్కనే ఉన్న కోయంబత్తూరును సైతం పవనాలు చుట్టుముట్టాయి.ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్నది. నీలగిరి అవలాంజిలో గడిచిన 24 గంటలలో 35 సెం.మీ, కోయంబత్తూరుజిల్లా వాల్పారై సమీపంలోని చిన్న కల్లారులో 21 సెం.మీ వర్షం పడింది. ఇక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బాధితులను ముందుగానే శిబిరాలకు తరలించారు. ఈ జిల్లాలోని నొయ్యల్నిది, వాల్పారై కులంగల్ నది, నడుమలై నది, కోయంబత్తూరు జిల్లాలోని భవానీ నది పొంగిపొర్లుతున్నాయి. నీలగిరులలో ఎటు చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మేట్టుపాళయంలోని పిల్లురు డ్యాం , సిరువాని ఆనకట్ట, అలియార్ ఆనకట్టలలోకి పూర్తి స్థాయిలోకి నేరు చేరింది. పిల్లూరు రిజర్వాయర్ నీటి మట్టం 97 అడుగులకు చేరడంతో గేట్లను ఎత్తి వేశారు. డ్యాం నుంచి సెకనుకు 18 వేల క్యూబిక్ అడుగుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీరు మేట్టుపాళయంలో భవానీ నదిలో కలస్తుండటంతో ఆ తీర ప్రజలను అప్రమత్తం చేశారు. నీలగిరులలో వరద ఉధృతికి జన జీవనం స్తంభించింది. పర్యాటకులు హోటళ్లకే పరిమితమయ్యారు.అ న్ని పర్యాటక కేంద్రాలను మూసివేశారు. విలవిల.. నీలగిరులలోని అటవీ గ్రామాల ప్రజలు విల విల లాడుతున్నారు. వాగులు , వంకలు పొంగి పొర్లుతుండటంతో అటు వైపుగా అధికారులు వెళ్ల లేని పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల మట్టి, కొండ చరియలు విరిగి పడి ఉండడంతో సహాయక చర్యలు ముమ్మరంచేశారు. ఇక, నైరుతి పవనాలు తెన్కాశి జిల్లాను చుట్టుముట్టాయి. ఇక్కడి పశ్చిమ పర్వత శ్రేణులలో కురిసిన వర్షానికి కుట్రాలం జలపాతం పొంగి పొర్లుతోంది. ఇక్కడకు సందర్శకులకు నిషేధం విధించారు. తెన్కాశి జిల్లాకు రెండు రోజుల పాటుగా ఆరంజ్ అలర్ట ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో రాగల 25 గంటలలో బంగాళాఖాతంలో అల్పపీడనం బయలు దేరనున్నడంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైన్నె, శివారు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాలలో మోస్తారుగా వర్షాలుపడుతాయని ప్రకటించారు. ఇదిలా ఉండగా చైన్నెలో గత అనుభవాల దృష్ట్యా, ముందు జాగ్రత్తల మీద అధికారులు దృష్టి పెట్టారు. ఇక్కడ ఏదేని వరద విలయం చోటు చేసుకున్న పక్షంలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి 78 మందితో జాతీయ,రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేసి, ఇక్కడే తిష్ట వేసే విదంగా చర్యలు తీసుకున్నారు. భవానీ తీరంలో అలర్ట్ వాల్పరైలో భారీ వర్షాల కారణంగా చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై సమీపంలోని సోలైయర్ ఎస్టేట్లోని మునీశ్వరన్ ఆలయం సమీపంలోని ఒక చెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. ఇదేవిధంగా అనేక చోట్ల చెట్లు నేల కొరగడంతో సహాయక బృందాలు ఉరకలు తీశాయి. పిల్లూరు జలాశయం నుంచి నీటి విడుదలతో ఆ తీరం వెంబడి గ్రామాలలో అధికారులు ఉరకలుతీశారు. ప్రజల్ని అప్రమత్తం చేశారు.కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్తికేయన్ నేతృత్వంలోని అధికారులు మేట్టు పాళయం, భవానీ నదులలో నీటిఉధృతిని పరిశీలించారు. మరింత అప్రమత్తంగా ఉండాలని రెస్యూ బృందాలను ఆదేశించారు. -
యోగా ఉత్సవ బ్యానర్లపై తమిళం లేకపోవడంపై నిరసన
కొరుక్కుపేట: కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థ తరపున పుదుచ్చేరిలో మంగళవారం అంతర్జాతీయ యోగా ఉత్సవం జరగనుంది. పుదుచ్చేరి బీచ్ రోడ్డులో జరిగే ఈ ఉత్సవానికి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు హాజరవుతారు. దీనికోసం పుదుచ్చేరి అంతటా ప్రకటన బ్యానర్లు ఏర్పాటు చేయబడ్డాయి.ఈ ప్రకటనల బ్యానర్లను అజంతా సిగ్నల్, రాజా జంక్షన్, అన్నా విగ్రహం, కామరాజ్ విగ్రహం, ఇందిరా గాంధీ విగ్రహం, రాజీవ్ విగ్రహం, కూడళ్లు వంటి ప్రధాన రోడ్డు జంక్షన్లలో, గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తమిళంలో ఎక్కడ చూసినా ప్రకటనల బ్యానర్లు లేవు .ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి రంగసామి మాట్లాడుతూ, వాణిజ్య సంస్థల నేమ్ప్లేట్లు తమిళంలో ఉండా లని ఆదేశించారు. అయితే ఆయుష్ ఈ ఆదేశాన్ని పాటించలేదు. ఇదేసమయంలో యోగా ఉత్సవంలో బ్యానర్ల ప్రకటనలో తమిళాన్ని చేర్చక పో వడం తమిళ కార్యకర్తలలో తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ స్థితిలో యోగా ఉత్సవ బ్యానర్లపై ఉన్న హిందీ , ఇంగ్లీషు పదాలపై సిరాతో చెరి పేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమిళ భాషను నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తూ నినాదాలు కూడా చేశారు. ఐఐటీలో కొత్త కోర్సులు సాక్షి, చైన్నె: 2025–26 విద్యా సంవత్సరానికి ఐఐటీ మద్రాస్ అనేక కొత్త కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. తాజాగా విద్యా , ఆటోమోటివ్ పరిశ్రమ రెండింటిలోనూ సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వ పాత్రలకు గ్రాడ్యుయేట్లను సిద్ధం చేయడం లక్ష్యంగా కొత్త కోర్సుల ను ప్రవేశ పెట్టింది. ఈ వివరాలను సోమవారం స్థానికంగా ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. బీఎస్ కెమిస్ట్రీ, ఎంటెక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోర్సులు ఇందులో ఉన్నాయి. 2025 – 26 విద్యా సంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రా మ్లకు ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎక్సెలెన్స్ ప్రవేశాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా లలిత కళలు సంస్కృతిలో రాణించిన విద్యార్థులకు బహుమతు లు, ప్రోత్సహం దిశగా ఎఫ్ఏసీఈ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ పోర్టల్ ద్వారా కాకుండా ప్రత్యేక పోర్టల్ (https://ugadmissions.iitm.ac.in/face/)లో జరుగుతుందని ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్లకు దరఖాస్తు గురించి ఐఐటీ మద్రాసు డీన్ (అకడమిక్ కోర్సులు) ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ మాట్లాడుతూ, ఈ కొత్త కోర్సులు పరిశ్రమ, విద్యా సంస్థల అవసరాలు , విద్యా ర్థుల ఆకాంక్షలను దృష్టి లో ఉంచుకుని ప్రవేశపెట్టబడ్డాయని వివరిచారు. ఈ సంవత్సరం ప్రారంభించబడిన కొత్త ప్రోగ్రామ్లుగా బీఎస్ (కెమిస్ట్రీ) ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తామన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎంటెక్ – గేట్ ద్వా రా ప్రవేశం ఉంటుందని ప్రకటించారు. అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం లో రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లకు జేఈఈ ద్వారా ప్రవేశం ఉంటుందని వివరించారు. కంప్యూటేషనల్ ఇంజినీరింగ్ మెకానిక్స్లో బిటెక్ ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇంజినీరింగ్ అనేది 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు గా ఉంటుందని, ఇది కెమిస్ట్రీలో ఎంఎస్కు అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కలిగి ఉంటుందన్నారు. ఇది విద్యార్థులకు కెమిస్ట్రీ, అనుబంధ సైన్స్ సబ్జెక్టులలో బలమైన పునాదిగా ఉంటుందన్నారు. విస్తృతంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలు సాక్షి, చైన్నె: ఆయూష్ వైద్య విలువలను విస్తతం చేసి , సమగ్ర ఆరోగ్య సేవల మీద దృష్టి పెట్టనున్నామని దక్షిణ ప్రాంతీయ సమావేశంలో నిపుణు లు వ్యాఖ్యానించారు. ఆయుష్ వైద్య విలువలపై దక్షిణ ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశం చైన్నెలోని హిల్టన్లో సోమవారం జరిగింది. ఆయూష్ ప్ర యాణం, లక్ష్యాలను సాధించే దిశగా ఒక ముఖ్యౖ మెన అడుగుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవల విస్తృతం, ప్రపంచ కేంద్రంగా ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ – ప్రమోటింగ్ వెల్నెస్’ కార్యక్రమాల నిర్వహణకుఇందులో నిర్ణయించారు. ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడం గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలోని పంచకర్మ కేంద్రాల గొప్ప వారసత్వం, తమిళనాడు, కర్ణాటకలో సిద్ధ, ప్రకృతి వైద్య సేవల విస్తృతం, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిశోధన , వెల్నెస్ మౌలిక సదుపాయాలు, దేశవ్యాప్తంగా సమగ్ర సంరక్షణకు పుదుచ్చేరిని ఒక వేదికగా ఎంపిక చేసుకునే విధంగా ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయూష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయూష్ సంయుక్త కార్యదర్శి మోనాలి షా దాస్, ఫిక్కీ ఆయూష్ కమిటీ వర్గాలు శ్రీనివాసరావు చింత పాల్గొన్నారు. -
నిధుల సేకరణకు ఆర్థిక సెక్యూరిటీలు
– గ్రేటర్ చైన్నెలో రూ.200 కోట్లు షేర్ల జారీ సాక్షి, చైన్నె: నిధుల సేకరణలో భాగంగా గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో రూ. 200 కోట్లతో పట్టణాభివృద్ధిని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో (ఎన్ఎస్ఈ) ఆర్థిక సెక్యూరిటీల జాబితా (లిస్టింగ్)లోకి చేర్చారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సహాయం కోసం వివిధ వినూత్న నిధుల సేకరణ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో, మెట్రోపాలిటన్ చైన్నె మున్సిపల్ బాండ్ల ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి నిర్ణయించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ 10 సంవత్సరాల కాలానికి, సంవత్సరానికి 7.97 శాతం చాలా తక్కువ వడ్డీ రేటుకు రూ.200 కోట్ల అర్బన్ ఫైనాన్స్ సౌకర్యం లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. 2025లో దేశంలోనే అతిపెద్ద బాండ్గా దీనిని జారీ చేశారు. దీని ఆధారంగా పెట్టుబడిదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కుశస్థలి ప్రగతికి నిధులు.. ప్రాథమిక ఇష్యూ మొత్తం రూ. 100 కోట్లు కాగా, 421 కోట్ల విలువైన వేలం జరిగినట్టు, ఇది 4.21 రెట్లు ఎక్కువగా ప్రకటించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎలక్ట్రానిక్ వేలం ద్వారా దీనిని పొందినట్టు, ఇది మహానగర చైన్నె కార్పొరేషన్ బలమైన ఆర్థిక నిర్వహణ, ప్రణాళిక నిర్మాణంపై పెట్టుబడిదారులలో బలమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నట్టు వివరించారు. ఈ అర్బన్ ఫైనాన్స్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులను కుశస్థలి నదీ పరివాహక ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ వర్షపు నీటి పారుదల సిస్టమ్(ఐఎస్డబ్ల్యూడీ) కోసం ఉపయోగించనున్నారు. ఇది ఒక ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అని, కుశస్థలి నదీ ప్రాంతంలో 8 పెద్ద సరస్సులు , 71 చిన్న సరస్సులు ఉన్నాయని వివరించారు. వీటినిఅ భివృద్ధి పరిచి నీటిని నిల్వ ఉంచడం ద్వారా వేసవిలో తాగునీ టి అవసరాలను తీర్చేందుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఇందు కోసం నిధుల సేకరణ మీద దృష్టి పెట్టే విధంగా కలైవానర్ అరంగంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రూ. 200 కోట్ల విలువైన అర్బన్ బాండ్లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్లో చేర్చే కార్యక్రమం జరిగింది. బాండ్ ఇష్యూలోని అన్ని షేర్లును ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఏజెంట్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్. నెహ్రూ, పి.కె. శేఖర్ బాబు, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, ఎమ్మెల్యే ఎం.కె. మోహన్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, చీఫ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆర్థికవేత్త డాక్టర్ తీర్థంకర్ పట్నాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉదయచంద్రన్, నీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ కార్తికేయన్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కమిషనర్ జె. కుమారగురుబరన్ పాల్గొన్నారు. -
మోగిన రాజ్యసభ నగారా!
● రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న ఆరు స్థానాలు ● జూన్ 2 నుంచి నామినేషన్లు ● 19న ఎన్నికలు ● ఈసారి కమల్కు ఛాన్స్ ● వైగోకు అవకాశం దక్కేనా? ● అన్నాడీఎంకేలో సీటు కుస్తీ రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ పదవుల భర్తీకి ఎన్నికల నగారా సోమవారం ఢిల్లీలో మోగింది. ఆరు స్థానాలలో నాలుగు డీఎంకే ఖాతాలో చేరడం ఖాయం. ఈ దృష్ట్యా ఆ కూటమి తరపున మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక, ఈ కూటమిలోని ఎండీఎంకే నేత వైగోకు ఈ సారి ఛాన్స్ దక్కేనా..? అన్నది అనుమానంగా మారింది. చంద్రశేఖర్ అబ్దుల్లా షణ్ముగం విల్సన్ వైగోఅన్బుమణి సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో 18 మంది సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో డీఎంకేకు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ కూటమిలోని కాంగ్రెస్కు చెందిన ఒకరు, ఎండీఎంకేకు చెందిన మరొకరు సభ్యులుగా రాజ్యసభకు వెళ్లారు. ఇక అన్నాడీఎంకేకు చెందిన నలుగురు సభ్యులుగా ఉన్నారు. గతంలో తమ కూ టమిలో ఉన్న పీఎంకే ఒకటి, తమిళ మానిల కాంగ్రెస్కు ఒకటి చొప్పున రాజ్యసభను అన్నాడీఎంకే కేటాయించింది. ప్రస్తుతం ఈ 18 మందిలో ఆరు గురి పదవీ కాలం జూలైలలో ముగియనున్నది. ఆరుగురు వీరే.. జూలై 24వ తేదీతో రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న వారిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ పదవుల భర్తీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఢిల్లీ వేదికగా నగారా మోగించింది. నాలుగు డీఎంకేకు గ్యారంటీ డీఎంకే కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఖాళీ కానున్న వాటిలో నాలుగు స్థానాలు మళ్లీ ఖాతాలో ఏకగ్రీవంగా పడడం ఖాయం. రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సంఖ్య 234గా ఉంది. ఆ మేరకు ఒక్కో రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవశ్యం. అసెంబ్లీలో డీఎంకే కూటమి సంఖ్యా బలం 159గా ఉంది. ఇందులో డీఎంకే– 134, కాంగ్రెస్–17, సీపీఐ–2, సీపీఎం –2, వీసీకే–4 ఉండడంతో వీరి ఖాతాలో నాలుగు రాజ్యసభ పదవులు మళ్లీ పడ్డట్టే. అయితే ఈ నాలుగు స్థానాలు ఎవ్వరెవ్వరికి దక్కేనో అన్న చర్చ మొదలైంది. డీఎంకే పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి సీనియర్ న్యాయవాదిగా విల్సన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఆయనకు మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఇక, షణ్ముగం, అబ్దుల్లా స్థానంలో ఈ సారి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే సీఎం స్టాలిన్ అధికంగా మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. యువతకు ఈసారి రాజ్య సభ సీటు దక్కవచ్చు అన్న చర్చ డీఎంకేలో సాగుతోంది. ఇక, డీఎంకే కూటమిలోని ఎండీఎంకే నేత వైగోకు ఈసారి ఛాన్స్ అనుమానంగా మారింది. ఈ సీటును లోక్సభ ఎన్నికల పొత్తు కసరత్తులలో భాగంగా కూటమి ధర్మంగా మక్కల్ నీది మయ్యంకు అప్పగించడం ఖాయం. ఇప్పటికే కమల్ను రాజ్యసభకు పంపించాలన్న నినాదం మిన్నంటుతోంది. ఈ దృష్ట్యా, సీటు కమల్కు రిజర్వుడ్ అయినట్టే. అయితే, ఆయన రాజ్యసభకు వెళ్తారా? లేదా తన ప్రతినిధిని పంపిస్తారా? అన్న చర్చ కూడా మక్కల్ నీది మయ్యంలో సాగుతుండడం గమనార్హం. వైగో విషయానికి వస్తే, ఆయన వారసుడు దురై వయ్యాపురి డీఎంకే కూటమి తరపున తిరుచ్చి నుంచి లోక్సభ సభ్యుడిగా గత ఏడాది ఎన్నికయ్యారు. ఈ దృష్ట్యా, 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార పిరంగిగా వైగోను ఉపయోగించుకునే దిశగా ఈ సారికి ఆయన పేరును రాజ్యసభకు పరిశీలించే అవకాశాలు ఉండక పోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో సీటుపై సందిగ్ధత అన్నాడీఎంకే ఖాతాలో ఓ సీటు చేరడం ఖాయం. ఈ స్థానం మీద ఇప్పటికే మాజీ మంత్రి, సీనియర్ నేత జయకుమార్ గురి పెట్టి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే మరో సీటు విషయంలో సందిగ్ధత తప్పడం లేదు. అన్నాడీఎంకేకు 66 మంది సభ్యులు ఉన్నా, ఆ పార్టీలో చీలిక పుణ్యమా పలువురు ఎమ్మెల్యేలు మాజీ సీఎం పన్నీరు వెన్నంటి ఉన్నారు. ఇంకొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ దృష్ట్యా, మరో అభ్యర్థి విషయంలో కనీసం అదనంగా ఐదారుగురు ఎమ్మెల్యే బలాన్ని కలిగి ఉండాల్సిన అవశ్యంగా నెలకొంది. ఇక, ఈ కూటమిలోని బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. ఇదే అదనుగా ఆ స్థానాన్ని తమకు అప్పగించాలని అన్నాడీఎంకేపై బీజేపీ పెద్దలు ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో గతంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకేకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ పార్టీకి చెందిన అన్బుమణి పరిస్థితి తాజాగా అగమ్యగోచరమే. ఒక వేళ మళ్లీ అన్నాడీఎంకే కూటమిలోకి పీఎంకే చేరిన పక్షంలో ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. ఇక, లోక్సభ ఎన్నికల కూటమి ధర్మం మేరకు తమకు రాజ్యసభ ఇస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చినట్టు డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ పట్టుబడుతూ వస్తున్నారు. ప్రస్తుతం డీఎండీకే అన్నాడీఎంకే కూటమిలో లేదు. ఈ కారణంగా వారికి ఆ సీటు ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో మెగా కూటమి దిశగా వ్యూహాలకు పదును పెడుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఈ రెండో సీటు విషయంగా ఎలాంటి కసరత్తు చేస్తారో? వేచి చూడాల్సిందే. జూన్ 19న ఎన్నిక ఖాళీ కానున్న ఆరు స్థానాలకు గాను జూన్ 19న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఈ ఎన్నికలలో పోటీ చేయనున్న వారు జూన్ 2వ తేదీ నుంచి 9వ తేది వరకు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన వద్దే నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 12వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు. సాధారణంగా రాజ్యసభ ఎన్నికలు ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఆయా కూటములు ఏకగ్రీవంగానే కై వసం చేసుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే, ఎన్నికలలో పోటీ అనివార్యమైన పక్షంలో జూన్ 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది -
ఆంబూరు సమీపంలో ప్రభుత్వ బస్సు– లారీ ఢీ
వేలూరు: ప్రభుత్వ బస్సు, లారీ అతివేగంగా ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణం చేస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైన ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు నుంచి పేర్నంబట్టుకు ప్రభుత్వ బస్సు ఉదయం బయలుదేరింది. బస్సు తుత్తిపట్టు గ్రామంలోని ప్రైవేటు షూ కంపెనీ వద్ద వెళ్తున్న సమయంలో ఆంబూరు నుంచి తోను ఎక్కించుకొని వస్తున్న లారీ, ప్రభుత్వ బస్సు అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ రాజతో పాటూ 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైంది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొన్న క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం విషయం తెలుసుకున్న ఎస్పీ శ్రేయ గుప్తా, కలెక్టర్ శివ సౌందరవల్లి, డీఎస్పీ కుమార్ ప్రమాద స్థలంతో పాటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరమర్శించి వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందజేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిలో సుమారు నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరగైన చికిత్స కోసం వేలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆంబూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు -
11 కొత్త ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలు
– ప్రారంభించిన సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మరింతగా సీట్లను దరిచేర్చే విధంగా 11 కొత్త ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. వీటిని సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా పరంగా విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ బడులలోచదువుకుని ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్ధిని విద్యార్థులకు నెలకు రూ.1000 నగదు ప్రోత్సహం అందిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో విద్యార్థులకు ఇంజినీరింగ్, వైద్య పరంగా అదనపు సీట్లను రాష్ట్రానికి రాబట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్సైన్స్ కోర్సులకు ఉన్న డిమాండ్ను పరిగణించి ఈ విద్యా సంవత్సరం అదనంగా 11 కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కడలూరు జిల్లా – బన్రూట్టి, నీలగిరి జిల్లా – కూనూర్, దిండిగల్ జిల్లా – నత్తం, చైన్నె జిల్లా – అలందూర్, విల్లుపురం జిల్లా – విక్రవాండి, చెంగల్పట్టు జిల్లా – సెయ్యూరు, శివగంగ జిల్లా – మనమదురై, తిరువారూర్ జిల్లా – ముత్తుపేటై, తంజావూరు జిల్లా – తిరువిడైమరుదూర్, పెరంబలూరు జిల్లా – కోలకన్నతం , తూత్తుకుడి జిల్లాలో ఒట్టపిడారంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఏర్పాట్లు చేశారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడులో ఉన్నత విద్యను మెరుగుపరిచే ఉద్దేశంతో, మరిన్ని అనేక ఉన్నత విద్యా సంస్థలను ప్రారంభించినట్టు ప్రభుత్వం ఈసందర్భంగా ప్రకటించింది. పరిశోధన, ఆవిష్కరణ , సాంకేతిక అభివద్ధి ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని స్పష్టం చేశారు. ఈ 11 కొత్త ఈ కొత్త కళాశాలల్లో తొలి విడతగా ఐదు చొప్పున కోర్సులను అందించనున్నారు. ప్రతి కళాశాలలో 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు , 132 బోధనేతర పోస్టులు ,11 బోధనా మరో 154 ఇతర పోస్టులను సృష్టించారు. మొత్తం రూ. 25 కోట్ల 27 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ కళాశాలల ద్వారా 9,150 మంది విద్యార్థులు ఐదు కోర్సులలో 3 సంవత్సరాల పాటు ప్రయోజనం పొందనున్నారు. ఈ కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల సంఖ్య 176కు చేరింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ కోవి చెలియన్, పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహం , వాణిజ్య మంత్రి డాక్టర్ టి.ఆర్.పి. రాజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం, విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి, కళాశాల విద్య కమిషనర్ సుందర వల్లి, తదితరులు పాల్గొన్నారు. -
సినీ సాహిత్యానికి ఎన్సైక్లోపీడియా వెన్నెలకంటి
కొరుక్కుపేట: సినీ సాహిత్యానికి ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి ఎన్సైక్లోపీడియా అని మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు విస్తాలి శంకర రావు కొనియాడారు. ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం, ఒక చమత్కారం, ఒక స్నేహం, ఒక అనువాద విజ్ఞానం అని అభిప్రాయ పడ్డారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో ఆదివారం రాత్రి ఆస్కా వేదికగా వెన్నెలకంటి సాహిత్యం–సినీ వెన్నెల జలపాతం అనే అంశంపై. 161వ ఉపన్యాస కార్యక్రమం జరిగింది. వక్తగా విస్తాలి శంకర రావు పాల్గొని ప్రసంగించారు.సినిమా సాహిత్యం, సాహిత్యం కాదనే స్థాయి నుంచి అది ఒక విలక్షణమైన సాహిత్యం అనే స్థాయికి చేర్చి ఎందరో సినీ కవులు, రచయితలు చిరంజీవులుగా నిలిచారు, అటువంటి వారిలో ఒకరు ఒకవైపు సాహిత్యంలోనూ, మరోవైపు సినీ సాహిత్యంలోనూ, ఇంకోవైపు సినీ అనువాద సాహిత్యంలోనూ తనదైనశైలిలో ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుని సినీ, టీవీ రంగుల ప్రపంచంలో నిండు పున్నమి వెలుగై నిలిచిన అగ్రశ్రేణి రచయిత వెన్నెలకంటి గారిని కొనియాడారు. వెన్నెలకంటి 1957 నవంబర్ 30న వెన్నెలకంటి పద్మావతమ్మ, వెన్నెలకంటి కోటేశ్వరరావు దంపతులకు నెల్లూరు లో జన్మించారని, వీరి జీవన నేపధ్యం, పరిసరాలు వీరిని విశిష్టత కలిగిన కవిలా ఎదిగేలా చేశాయన్నారు. ఆ లక్షణమే వారిని బ్యాంకు ఉద్యోగం నుంచి సినిమా కవిగా మార్చేశాయని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, డబ్బింగ్ కింగ్ గా కీర్తిని ఆర్జించారని పేర్కొన్నారు. ఇక వారు సినీ సాహిత్యంలో ప్రదర్శించిన సాహితీ విన్యాసాలను అనేక పాటలు ద్వారా వివరిస్తూ, ఆ పాటల సృష్టిలోని దర్శకులు, నిర్మాత లు, సంగీత దర్శకులు, గాయనీ గాయకుల నేపథ్యాలను విపులంగా వివరించారు. ముందుగా స్వాగతోపన్యాసంను సెక్రెటరీ కందనూరు మధు చేయగా, అధ్యక్షులు జేకే రెడ్డి వక్తగా విచ్చేసిన విస్తాలి శంకర రావును సభకు పరిచయం చేసి ఘనంగా సత్కరించారు. -
ఆక్రమణల కూల్చివేత
తిరుత్తణి: రోడ్డుకు అడ్డంగా వున్న మరుగుదొడ్లను రెవెన్యూ శాఖ అధికారులు శనివారం తొలగించారు. తిరుత్తణి మున్సిపల్ పరిధిలోని కుమరన్నగర్లో 300కు పైగా కుటుంబాలు నివాసముంటున్నారు. ఆ ప్రాంతంకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న స్థానికుల కోర్కె మేరకు ఎమ్మెల్యే నియోజకవర్గ నిధుల నుంచి రూ. 10 లక్షలు కేటాయించారు. అయితే సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు రోడ్డుకు మధ్యలో ప్రయివేటు వ్యక్తి నిర్మించిన మరుగుదొడ్లు అడ్డురావడంతో తొలగించాలని కోరారు. అయితే ప్రయివేటు వ్యక్తి అంగీకరించకపోవడంతో ఆర్డీఓకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు సర్పే చేపి ఆక్రమిత మరుగుదొడ్లను జేసీబీతో తొలగించారు. సిమెంట్ రోడ్డు ఏర్పాటుకు సమస్య పరిష్కారం కావడంతో కుమరన్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.8 -
నేడు ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్పై సెమినార్
– మాజీ తెలంగాణ గవర్నర్ తమిళిసై కొరుక్కుపేట: దేశాభివృద్ధికే ఒకే దేశం, ఒకే ఎన్నిక (వన్ నేషన్, వన్ ఎలక్షన్) అని తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం చైన్నెలోని కమలాలయం వేదికగా విలేకరుల సమావేశంలో ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్ తమిళనాడు కన్వీనర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడారు. చైన్నెలోని తిరువాన్మయూర్లోని శ్రీరామచంద్ర కన్వెన్షన్ సెంటర్ వేదికగా సోమవారం ఉదయం 10 గంటలకు ఒకే దేశం, ఒకే ఎన్నిక –దేశవ్యాప్త అవగాహన సెమినార్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించే రీతిలో ఈ సెమినార్ జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు, మేధావులు తరలిరావాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. భావి తరాలకు మంచి దేశాన్నందించాలంటే ఒన్ నేషన్..ఒన్న్ ఎలక్షన్న్ చాలా అవసరమని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు.ఈ సెమినార్కు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేయనున్నట్టు తెలిపారు. సెమినార్ పూర్తిగా పార్టీలకతీతంగా జరుగుతుందని, ఈ సెమినార్ బీజేపీకి సంబంధం లేదని అన్నారు. సెమినార్ కో–కన్వీనర్లు నారాయణ తిరుపతి, అర్జున్మూర్తి, బీజేపీ అధికార మీడియా ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన తిరుత్తణి
తిరుత్తణి: వేసవి సెలవులు, ఆదివారం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు గంటల పాటు వేచివుండి భక్తులు స్వాఽమి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి పాఠశాలలకు వేసవి సెలవులు సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది. జూన్ 2న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న క్రమంలో ఆదివారం భక్తులు కొండకు పోటెత్తారు. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శన క్యూలు నిండగా మూడు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే రూ.వంద ప్రత్యేక దర్శన క్యూలో రెండు గంటల వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వేకువజామున స్వామికి అభిషేక పూజలు చేసి బంగారు కవచం, ఆభరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం ద్వారా తాగునీరు, ప్రసా దాలు పంపిణీ చేశారు. వేడి తగ్గి చల్లని వాతావరణంతో ఇబ్బందులు తలెత్తతకుండా భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో కానుకలు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 30 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
అన్నాడీఎంకే పథకాలపై కరపత్రాలు
పళ్లిపట్టు: అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలుపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఆదివారం ఆ పార్టీ శ్రేణులు అవగాహన కల్పించారు. అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వం రద్దు చేసి, సామాన్యుల జీవితాలతోపాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తూ అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలు పట్ల అవగాహన కల్పించే విధంగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు టౌన్ అన్నాడీఎంకే కన్వీనర్ జయవేలు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు, వాహన ఛోదకులు, ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ హరి పాల్గొని కరపత్రాలు అందజేశారు. పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వం అమ లు చేసిన పథకాలను డీఎంకే ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల వివాహ కానుక రద్దు చేసినట్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, పశువుల పంపిణీ పథకం రద్దు చేసినట్లు డీఎంకే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రజలు అన్నాడీఎంకే పాలన వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మండల అన్నాడీఎంకే కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, శ్రేణులు కన్నయ్య, పళని, పెరుమాళ్ పాల్గొన్నారు. -
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు
– 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు తిరువొత్తియూరు: శివకాశి సమీపంలో బాణాసంచా కర్మాగారంలో ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున పేలుడు చోటు చేసుకుంది. ఇందులో కర్మాగారం నేల మట్టమైనది. సుమారు 10 కిలోమీటర్ల దూరానికి భూమిలో కంపనాలు ఏర్పడడంతో ప్రజలు భయాందోళన చెందారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని అంబాపట్టిలో వేండు రాయపురంలో తంగపాండికి చెందిన బాణాసంచా కర్మాగారం ఉంది. చైన్నెలో లైసెన్సు పొంది ఉన్న ఈ పరిశ్రమంలో 15 గదులలో టపాసుల తయారీ జరుగుతోంది . ఈ కర్మాగారంలో శనివారం ఎప్పటిలాగే కార్మికులు పని చేసి సాయంత్రం ఇంటికి వెళ్లారు. పరిశ్రమలో గదులలో తయారు చేస్తున్న మందులు అక్కడక్కడ ఉంచారు. ఈ క్రమంలో శివకాశి ప్రాంతంలో ఆదివారం ఉదయం వర్షపు జల్లలు కురుస్తున్నాయి. ఈసమయంలో బాణాసంచా కర్మాగారం నుంచి ఉదయం 6.40 గంటల సమయంలో పేలుడు సంభవించి భారీ శబ్దాలు వచ్చాయి. కర్మాగారం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో స్వల్పంగా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో వినమ్ పట్టి, కాక శివనాపట్టి తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. శివకాశి అగ్నిమాపక సిబ్బంది, మారనేరి పోలీసులు మంటలు అదుపు చేయ పనిలో నిమగ్నమయ్యారు. కాగా పేలుడు కారణాలు, నష్టం అంచనాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పేలుడు చోటు చేసుకోవడంతో ఆ సమయంలో కర్మాగారంలో కార్మికులు లేరు. దీంతో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. -
అలరించిన గ్రాండ్ ఫ్యాషన్ వాక్
సాక్షి, చైన్నె: చైన్నె అమృత ఏవియేషన్ కళాశాల విద్యార్థులచే ఫ్యాషనిష్టా –2025 పేరుతో నిర్వహించిన గ్రాండ్ ఫ్యాషన్ వాక్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మీడియా సెలబ్రిటీ అందాల పోటీల ప్యానెలిస్ట్, నటి అనిత హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చుతూ, విద్యార్థులు క్యాబిన్ క్రూ యూనిఫాం ధరించి మోడల్ ఎయిర్క్రాఫ్ట్లుగా స్టైలిష్ ఫ్యాషన్ పరేడ్లో ర్యాంప్పై నడిచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అనితతో పాటు అంతర్జాతీయ మోడల్ థామస్ రాజ్, మిస్ పెర్ల్ ఐకాన్ ఆఫ్ ఇండియా 2025 అమృత్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. న్యాయనిర్ణేతలు నాలుగు గ్రూపుల నుంచి విజేత జట్టును ఎంపిక చేసి అనిత, న్యాయనిర్ణేతల బృందం ఈసందర్భంగా బహుమతులను అందజేసింది. -
తాగునీటి ఆదాపై మారథాన్తో అవగాహన
పళ్లిపట్టు: తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించే విధంగా అత్తిమాంజేరిపేటలో నిర్వహించిన మారథాన్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్తిమాంజేరిపేట నెల్లికుండ్రం మురుగన్ లయన్స్ క్లబ్ ద్వారా తాగునీటి పొదుపుపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం వాక్ మారథాన్ పోటీలకు ఏర్పాట్లు చేశారు. షోళింగర్ రోడ్డులోని కోరకుప్పం నుంచి అత్తిమాంజేరిపేట వరకు 6 కి.మీ దూరం మారథాన్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువతీ, యువకులు పేర్లు నమోదు చేసి పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన మారథాన్లో 500కు పైగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్తిమాంజేరిపేట సంత ప్రాంగణం వరకు 6 కిలోమీటర్ల దూరం సాగిన మారథాన్ పోటీల్లో విజేతగా కాంచీపురం జిల్లాకు చెందిన యువకుడు 17.37 నిమషాల్లో చేరుకున్నాడు. మారథాన్ విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎంకే.రామచంద్రన్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మెడిమిక్స్ కంపెనీ ప్రతినిధి సౌందర్, విద్యావేత్తలు గురుమూర్తి, పళని మొదటి బహుమతిగా పశ్చల పాఠశాల ద్వారా రూ. 10వేల గనదు, మెడల్, సర్టిఫికెట్ పంపిణీ చేశారు. రెండవ బహుమతిగా రూ.5వేలు, మూడవ బహుమతి రూ.3వేలు పంపిణీ చేసి సర్టిపికెట్లు, మెడల్తో అభినందించారు. అలాగే మారథాన్ల్లో పాల్గొన్న అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ నిర్వాహకులు మహేష్కుమార్, శివలింగం, కదిరవన్, సుందరం, శరవణన్, ప్రకాశం, భూపతి, మోహన్, రాజీవ్గాంధీ, శశికుమార్ పాల్గొన్నారు. -
200 స్థానాల్లో గెలుపే లక్ష్యం
● యువతే వెన్నెముక ● మరింతగా శ్రమిద్ధాం ● డీఎంకే యూత్ భేటీలో నిర్ణయం సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుంచి పనులు వేగవంతం చేయాలని డీఎంకే యువజన విభాగం తీర్మానించింది. పార్టీకి వెన్నెముకగా యూత్ ఉన్న దృష్ట్యా, మరింతగా శ్రమిద్దామని , మళ్లీ అధికారం చేజిక్కించుకుందామని ప్రతిజ్ఞ చేశారు. తిరుచ్చి వేదికగా ఆదివారం డీఎంకే యువజన సమావేశం జరిగింది. జిల్లా, నగర, రాష్ట్ర స్థాయి నిర్వాహకులు పెద్దఎత్తున ఈ భేటీకి తరలి వచ్చారు. డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటిలో మళ్లీ అధికారం దిశగా శ్రమించే విధంగా తీర్మానాలు చేశారు. డీఎంకే యువజన నేతలు జోయల్, ఎన్.ఇళయరాజా, పి.అబ్దుల్ మాలిక్, కె.ఇ. ప్రకాష్, ప్రభు గజేంద్రన్, పి.ఎస్. శ్రీనివాసన్, జి.పి. రాజా, సి. ఆనందకుమార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాలు ● పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి నివాళి. బాధితకుటుంబాలకు సంతాపం. ఆపరేషన్ సిందూర్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి. ● గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేయడంపై సుప్రీం కోర్టు స్పందించి ఇచ్చిన చారితాత్మక తీర్పుకు కృతజ్ఞతలు .ఈ తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు స్పందించడాన్ని ఖండిస్తూ, సమైక్య తత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే రాజకీయ శక్తుల తీరును ఖండిస్తూ తీర్మానం. ● కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరమైన పోరాటాలు చేస్తున్న సీఎం స్టాలిన్కు సంపూర్ణ మద్దతు. ● దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దే విధంగా పథకాలు అమలు చేస్తున్న సీఎంకు అభినందనలు. ● సివిల్ సర్వీసు పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి అభినందనలు. ● పొల్లాచ్చి లైంగిక కేసులో కోర్టు ఇచ్చిన తీర్పునకు అభినందనలు. ● తమిళనాడు చరిత్రను దాచిపెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిరసన. ● కలై ంజ్ఞర్ కరుణానిధి జయంతిని శ్రీశాసీ్త్రయ భాషా దినోత్సవంగా జరుపుకునేందుకు ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం. ● క్షేత్ర స్థాయిలో క్షేత్ర కార్యకలాపాలు, జిల్లా కార్యదర్శుల సిఫార్సులు , వివిధ కార్యక్రమాల అమలుకు యూనియన్, నగరం, పట్టణ స్థాయిలో నిర్వాహకులు , ఉప నిర్వాహకులు ఎంపిక, యువజన విభాగం బలోపేతం లక్ష్యంగా నిర్వాహకుల నియామకానికి తీసుకున్న చర్యలు,కొత్తగా నియమించ బడ్డ వారికి ఆహ్వానాలు. ● తమిళుల సంక్షేమం కోసం శ్రమించిన కలైంజ్ఞర్ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే విధంగా కార్యక్రమాల నిర్వహణ, సీఎం స్టాలిన్ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా రచ్చ బండ ప్రచార కార్యక్రమాల నిర్వహణకు తీర్మానం. ● ప్రజా క్షేత్రంలోనే కాదు, సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా నిర్ణయం. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారాలకు చర్యలు. ● యువజన భవిష్యత్తు లక్ష్యంగా తమిళనాడు వ్యాప్తంగా 76 జిల్లాల కమిటీల నేతృత్వంలో ఇంటింటా ప్రజాహిత కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నిర్ణయం. ● 2026 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ ద్రావిడ మోడల్ పాలన లక్ష్యంగా శ్రమించేందుకు తీర్మానం. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా యువజన బృందాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం. 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా చరిత్ర సృష్టించేందుకు తీర్మానం చేశారు. -
ఏర్కాడులో ఆకట్టుకున్న డాగ్ షో
సేలం: సేలం జిల్లాలోని ఏర్కాడులో వేసవి పండుగ పూల ప్రదర్శనతో కలిపి పశువైద్య శాఖ తరఫున ఆదివారం పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. పెంపుడు జంతువుల ప్రదర్శనలో అల్సేషన్, జర్మన్ షెపర్డ్, డాబర్మాన్, లేబర్ డాగ్, గొంప, రాజపాలయం వంటి జాతులకు చెందిన 80కి పైగా పెంపుడు జంతువులను ఆహ్వానించారు. పోలీసు కుక్కలు పోలీసులకు ఎంత ప్రభావవంతంగా సహాయపడతాయో వివరించడానికి పోలీసులు పోలీసు స్నిఫర్ డాగ్స్ను కూడా ఈ ప్రదర్శనకు తీసుకొచ్చారు. దీంతో పాటూ పిల్లులు, ఆవులను కూడా తీసుకువచ్చి పర్యాటకులు, ప్రజలు చూడటానికి ప్రదర్శించారు. ఇందులో సేలం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గౌతమ్ గోయల్ పెంచుకున్న పెంపుడు జర్మన్ షెపర్డ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. రెండవ బహుమతిని సేలం నగర పోలీసు స్నిఫర్ డాగ్ గెలుచుకుంది. సేలంలోని శీలనాయకన్ పట్టికి చెందిన పీఈటీ సురేష్కు చెందిన కుక్కకు తృతీయ బహుమతి లభించింది. గెలిచిన పెంపుడు జంతువులకు సంబంధించిన యజమానులకు సావనీర్ సర్టిఫికెట్లు అందజేశారు. -
స్కూల్ పిల్లలకు ఉచితం
తమిళసినిమా: నటుడు యోగిబాబు, దర్శకుడు కేఎస్.రవికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం స్కూల్ క్వాంటం ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్కే విద్యాధరన్ దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా పాఠశాల ఆవరణలో జరిగే కథతో తెరకెక్కిన కథా చిత్రం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎలా పోరాడి గెలవాలి అన్న చక్కని సందేశంతో రూపొందిన చిత్రం స్కూల్. పిల్లలు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వారిని ఎలా పెంచి, భావిపౌరులుగా తీర్చిదిద్దాలి అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం, వారిలో ఒత్తిడిని పెంచడం వంటి విషయాల వల్ల విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవుతారు, దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటి వంటి పలు అవగాహనతో కూడిన అంశాలతో రూపొందిన స్కూల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 23న తెరపైకి వచ్చింది. ఇది ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం కావడంతో వారందరూ చూసే విధంగా థియేటర్లో ఉచితంగా టికెట్లను అందిస్తున్నట్లు చిత్రవర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి చిత్రం చూడడానికి వచ్చే పిల్లలు 9514799128 నంబర్కు ఫోన్ చేసి ఉచిత టికెట్లు పొందవచ్చునని వారు అందులో పేర్కొన్నారు. -
30న కరాటే కిడ్: లెజెండ్స్
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రాలకు భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి, ఆదరణ ఉంటుంది. అలా ఇంతకుముందు వచ్చిన కరాటే కిడ్ 5 ఫ్రాంచైజ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆలరించాయి. తాజాగా ఆ కోవలో వస్తున్న చిత్రం కరాటే కిడ్: లెజెండ్స్. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇందులో డేనియల్ లారుస్స గా ప్రధాన పాత్రను పోషించిన రాల్ఫ్ మాచియో తన భావాలను పంచుకుంటూ కరాటే కిడ్: లెజెండ్స్ చిత్రంలో మరోసారి లారుస్సో పాత్రలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో జాకీచాన్, మిస్టర్ హాన్లతో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. ఒక నటుడుగా, ఎంటర్టైనర్గా జాకీచాన్ పట్ల తనకు ఎంతో గౌరవం అన్నారు. ఈ రంగంలో ఆయన ఒక లెజెండ్ అని, చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్, కామెడీ సన్నివేశాల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. అదే విధంగా మిస్టర్ మియాగి అంటే కూడా తనకు చాలా గౌరవం అని రాల్ఫ్ మాచియో చెప్పారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్ ,తమిళం, తెలుగు భాషల్లో 30వ తేదీన తెరపైకి రానుంది. -
విలువిద్య విజేతలకు బహుమతులు
తిరువళ్లూరు: జిల్లా ఇండోర్, అవుట్ డోర్ విలువిద్య అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా జిల్లా ఇండోర్, అవుట్డోర్ విలువిద్య అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఏడాది విలువిద్య పోటీలను తిరువళ్లూరు జిల్లా కాకలూరులోని క్రీడామైదానంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించారు. పోటీలను సంఘం అధ్యక్షుడు కమాండో భాస్కరన్, కాకలూరు మాజీ పంచాయతీ అధ్యక్షురాలు సుభద్ర, మున్సిపల్ కౌన్సిలర్ సుమిత్ర, పారిశ్రామికవేత్త వెంకటేషన్ ప్రారంభించారు. పోటీలకు వందకు పైగా క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. పోటీల్లో ఐదు నుంచి 8, 10, 13, 15, 18, 21 వయస్సు గల క్రీడాకారులకు ఒక విభాగంలోనూ, 25 నుంచి 45 వయస్సు వున్న క్రీడాకారులకు మరో విభాగంలో పోటీలను నిర్వహించారు. పోటీల్లో 10మీ, 20మీ, 30 మీటర్ల దూరం లక్ష్యంతో నిర్వహించారు. పోటీల్లో అధిక పాయింట్లు సాధించిన వారికి రూ.10వేలు విలువ చేసే సైకిల్, బంగారు పతకం, సర్టిఫికెట్, మెడల్స్ అందజేశారు. పంచాయతీ ఉపాధ్యక్షుడు శివరామకృష్ణన్ పాల్గొన్నారు. -
వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
వేలూరు: వైద్యశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తమిళనాడు ప్రభుత్వ మందుల విక్రయాల సంఘం రాష్ట్ర అద్యక్షుడు విజయకుమరన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో ఆ సంఘం రాష్ట్ర మూడవ మహానాడు సంఘం జిల్లా కార్యదర్శి జోసి అధ్యక్షతన జరిగింది. మహానాడులో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 700 మందుల విక్రయదారుల కాళీ పోస్టులను భర్తీ చేయాలని, కొత్త పింఛన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,385 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ సూపరింటెండెంట్ అదనపు మందుల విక్రయదారుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సంఘంలో తీర్మానం చేశారు. అనంతరం మహానాడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రిష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు షణ్ముగం, తమిళనాడు ఓకేషనల్ టీచర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్, సంఘం నిర్వాహకులు దేవేంద్రన్, బాలమురుగన్, గోవిందరాజ్, సుబ్రమణియన్ పాల్గొన్నారు. -
ఘనంగా కాంచీపురం సహకార బ్యాంకు వార్షికోత్సవం
తిరువళ్లూరు: కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు 111వ వార్షికోత్సవ వేడుకలను సెంగుడ్రం బ్రాంచీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంచీపురం కేంద్ర సహాకార బ్యాంకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు తదితర మూడు జిల్లాలో ఐదు లక్షల మంది ఖాతాదారులతో లావాదేవీలను నిర్వహిస్తూవుంది. గత 110 సంవత్సరాలుగా కాంచీపురం సహకర బ్యాంకు ద్వారా రుణాలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులకు రుణాల, హౌసింగ్, గోల్డ్ రుణాలను అందజేస్తున్న విష యం తెలిసిందే. ప్రతి సంవత్సరం బ్యాంకు వార్షిక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న క్రమంలో 111వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు రిజిస్ట్రార్ మేనేజింగ్ డైరెక్టర్ శివమలర్ హాజరై 122 మంది లబ్ధిదారులకు 74.70 లక్షల రూపాయల రుణాలను అందజేశారు. స్వయం ఉపాధి సంఘాలు తమ పొదుపు స్థాయిని పెంచుకోవడంతో పాటూ రుణాలను సక్రమంగా చెల్లించాలని సూచించారు. రుణాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంఘాలు తమ ఆర్థిక పురోగతిని సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. -
మూడో కేటగిరి జీవితాల్లో వెలుగు
● ట్రాన్స్ జెండర్ల కోసం బృహత్తర పథకాలు ● అద్భుత ప్రణాళికతో ముందుకు ● సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో ప్రగతి నివేదిక సాక్షి,చైన్నె : Í…VýS-Ð]l*-Ç-µyìl Ð]lÅMýS$¢ÌS iÑ-™éÌZÏ ÐðlË$VýS$ °…õ³ Ñ«§ýl…V> ç³° ^ólĶæ$-yýl…, º–çßæ-™èl¢Æý‡ ç³£ýl-M>-ÌS¯]l$ ÑçÜ–¢™èl… ^ólĶæ$yýl…ÌZ {§éÑyýl Ððl*yýlÌŒæ Ð]l¬…§ýl…-f…ÌZ E…§ýl° Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… {ç³MýS-sìæ…-_…-¨. ¯éË$-VóSâýæÏ yîlG…MóS ´ëÌS¯]lÌZ {sꯌSÞ gñæ…yýlÆý‡Ï MøçÜ… AÐ]l$Ë$ ^ólíܯ]l {sꯌSÞ gñæ…yýlÆŠ‡ ÐðlÌôæ¹ÆŠ‡ »ZÆý‡$z, ò³¯]lÛ-¯Œl, {ç³™ólÅMýS AÐé-Æý‡$zË$, çÜÓĶæ$… E´ë«¨ çÜ¼Þ yీ , ѧéÅ MýSÌSÌS {´ëgñæMýS$t Ððl¬§ýl-OÌñæ¯]lÑ A§ýl$Â-™èl-OÐðl$¯]l {ç³×êã-MýS-ÌS™ø °Ðól-¨-MýS¯]l$ ïÜG… ÝëtͯŒS B§ól-Ô>ÌS™ø B¨ÐéÆý‡… Ñyýl$§ýlÌS ^ólÔ>Æý‡$. D ç³£ýl-M>-ÌS™ø Í…VýS-Ð]l*-Ç-µyìl Ð]lÅMýS$¢Ë$ iÑ-™èl…ÌZ AÀ-Ð]l–¨® ÐólVýS… ç³#…k-MýS$-¯]l²r$t ÑÐ]l-Ç…^éÆý‡$. సమాజంలో సభ్యులే.. ఈ సమాజంలో సభ్యులే అని , రాష్ట్రంలో భాగంగా వారి సంక్షేమాన్ని నిర్ధారించడానికి తమిళనాడు అరవాణి సంక్షేమ బోర్డును 2008లో కలైంజ్ఞర్ కరుణానిధి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ సంక్షేమ పథకాలు ఈ బోర్డు ద్వారా అందిస్తూ వస్తున్నామని వివరించారు. అరవాణిల పేరు కూడా ట్రాన్స్జెండర్లుగా ప్రకటించామన్నారు. సంక్షేమ బోర్డును ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుగా నామకరణం చేశామని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డులో 15 మంది అధికారిక సభ్యులు ఉన్నారని వీరిలో 10 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్టు గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు, కుటుంబ కార్డులు, ఇంటి హక్కు పత్రం, వైద్య భీమా కార్డులు,కుట్టు యంత్రాలు, సొంత వ్యాపారం ప్రారంభించేందుక స్వయం సహాయ బృందాల ఏర్పాటు, శిక్షణ, సబ్సిడీ, పేదరికంలో ఉన్న 40 ఏళ్లు పైబడ్డని వారికి సదుపాయాలు, పెన్షన్లు వంటి వివిధ సంక్షేమ పథకాలతో సహకారం అందిస్తూ వస్తున్నామని వివరించారు. పేద ట్రాన్స్జెండర్లకు నెలకు రూ. 1000 నగదు ప్రోత్సహ పథకం విజయవంతంగా అమల్లో ఉన్నట్టు వివరించారు. 2022–2023లో 1,311, 2023–2024లో 1,482, 2024–2025లో 1,599 మంది ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లను అందించడం జరిగిందన్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి 1,760 మంది ట్రాన్స్జెండర్లు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. మొబైల్ యాప్.. ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి, అందరు ట్రాన్స్జెండర్లు వారి ప్రొఫైల్లను నమోదు చేసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రయత్నంగా 2021 సంవత్సరంలో ట్రాన్స్జెండర్ అనే మొబైల్ అప్లికేషన్ సృష్టించినట్టు వివరించారు. ట్రాన్స్ జెండర్ల వ్యక్తిగత వివరాలను నమోదు చేసి, గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతోందన్నారు. తద్వారా 10,153 మంది లింగమార్పిడి వ్యక్తులకు గుర్తింపు కార్డులు ఉన్నట్టు వివరించారు. ట్రాన్స్జెండర్లను ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. విద్యాపరంగా, వివిధ వృత్తుల పరంగా, వివిధ రంగాలలో పురోగతి సాధించడం, తమ సమాజాభ్యున్నతికి వారిలో సేవ చేస్తూ, ఆదర్శంగా నిలిచిన ఒక ట్రాన్స్జెండర్ మహిళకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న ట్రాన్స్జెండర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవార్డులతో రూ. లక్ష నగదుకు గాను చెక్కును అందజేస్తున్నామన్నారు. 2021లో తూత్తుకుడి జిల్లాకు చెందిన గ్రేస్ బాను అనే ట్రానన్స్జెండర్కు, 2022న విల్లుపురం జిల్లా ఎ. మర్లిమా అనే ట్రాన్స్జెండర్కు 2023లో వేలూరుక చెందిన బి. ఐశ్వర్యకి, 2024లో కన్యాకుమారికి చెందిన సంధ్యాదేవికి, 2025లో తూత్తుకుడికి చెందిన పొన్నీ, నామక్కల్కు చెందిన రేవతిలకు ఈ అవార్డులను అందజేసి సత్కరించామన్నారు. లింగమార్పిడి వ్యక్తుల జీవనోపాధిని ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపరచడానికి, వారికి గుర్తింపు ఇచ్చే లక్ష్యంతో, వారికి వారు స్వంత వారు వ్యాపారాన్ని ప్రారంభించడానికి సబ్సిడీలను అందించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. దీని ద్వారా రూ. 50 వేలు అందజేయడం జరుగుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 811 మంది ట్రాన్స్జెండర్లు స్వయం ఉపాధి పొందారని, వీరి కోసం విద్యాకలల ప్రాజెక్ట్ను సైతం దిగ్విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. తమిళనాడులో అందరినీ అన్నీఅన్నదే తమ నినాదం అని, లింగమార్పిడి సమాజం కూడా ఆత్మగౌరవంతో జీవించడానికి వివిధ ప్రత్యేక కార్యక్రమాలు మరింతగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివిధ కార్యక్రమాలు, స్వయం ఉపాధి తో ట్రాన్స్జెండర్లు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, ఇలాంటి బృహత్తర పథకాల ఉత్తమ ప్రభుత్వం తమది అని ధీమా వ్యక్తం చేశారు. -
నీలగిరుల్లో కుండపోత
● పర్యాటక ప్రాంతాలను మూసివేసిన ప్రభుత్వం ● కోవైలోనూ భారీ వర్షాలు ● మరో రోజు రెడ్ అలర్ట్ అమలు ● పశ్చిమ కనుమల్లో విస్తారంగా పవనాలు సాక్షి, చైన్నె: నైరుతి రుతు పవనాల రాకతో పశ్చిమ కనుమలు చల్లబడ్డాయి. వాతావరణం మేఘావృతంగా మారింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, దిండుగల్, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలపై ఈ పవనాలు ప్రభావం చూపిస్తున్నాయి. ఇందులో నీలగిరి, కోయంబత్తూరులో అత్యధికంగా వర్షం పడుతోంది. సోమ, మంగళవారం కూడా ఇక్కడ రెడ్ అలర్ట్ కొనసాగనుంది. యుద్ధ ప్రాతిపదికన నీలగిరులలో సహాయక చర్యలకు బృందాలు తిష్ట వేసి ఉన్నాయి. కొండ కోనలలో కురుస్తున్న వర్షాలకు నీలగిరులలోని జలపాతాలు, వాగులు, వంకలలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. మరింతగా వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వాగులు, వంకలు, నదుల వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత వాసులు శిబిరాలకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. నీలగిరులలో ప్రసిద్ధి చెందిన ఊటీ, పరిసరాలలోని అన్ని పర్యాటక కేంద్రాలన్ని మూసి వేశారు. వేసవి సెలవుల్ని ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులకు నిరాశే మిగిలింది. పర్యాటకులు హోటళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. రెండు రోజులకు సరిపడ్డ ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవాలని హోటళ్లకు, పర్యాటకులకు నీలగిరి జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అవలాంజి, కున్నురు, కూడలూరు పరిసరాలలో అనేక చోట్ల చెట్లు నేల కొరగడంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఎక్కడ కొండ, మట్టి చరియలు విరిగి పడకుండా ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. అవలాంజిలో అత్యధికంగా 21 సెం.మీ. వర్షం, మిగిలిన అనేక ప్రాంతాలలో 10 సెం.మీ నుంచి 15 సెం.మీ మేరకు నీలగిరులలో వర్షం పడింది. కూడలూరు సున్నాంబు కాలువ వాగు పొంగడంతో ఓ కారు అందులో చిక్కుకుంది. ఇందులో ఉన్న ముగ్గురు కేరళ వాసులను అతి కష్టం మీద రక్షించారు. ఇక, కోయంబత్తూరులోని అటవీ గ్రామాలు, వాల్పారై పరిసరాలలో నూవర్షం పడుతున్నది. ఏర్పాడులోనూ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుండడంతో ఈ జిల్లాల మీద అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాగులు , వంకలలో నీటిఉధృతి, రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుదల అంశాలపై మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరింత విస్తృతంగా.. 27వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం బయలుదేరనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా పవనాలు కదులుతున్నాయి. కన్యాకుమారి, దిండుగల్, తిరుప్పూర్కు సైతం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఆ జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. కోయంబత్తూరు, నీలగిరులలో వర్షాలు రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ కనుమలలోని జిల్లాల మరో నాలుగైదురోజులు వర్షాలు కురుస్తాయని వివరించారు. పవనాలు మరింత విస్తృతం కానున్నాయని, చైన్నె, శివారులలో రాత్రులలో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించారు. ముగ్గురు మృతి కోయంబత్తూరు, నీలగిరులో వర్షాలకు ముగ్గురు మరణించారు. కోయంబత్తూరు వెల్లింగిరి కొండకు వెళ్తున్న సమయంలో వాతావరణంలో మార్పు, వర్షం పడుతుండటంతో శ్వాస సమస్య తలెత్తిన ఆదివారం ఇద్దరు మరణించారు. దీంతో వెల్లంగిరి కొండలలోకి ఎవ్వర్ని అనుమతించకుండా మార్గాలను మూసి వేశారు. అలాగే నీలగిరి ఊటీలో చెట్టు నేల కొరగడంతో 15 ఏళ్ల బాలుడు మరణించాడు. -
నిఘా నీడలో యూపీఎస్సీ ప్రిలిమినరీ
●24 వేల మంది హాజరు సాక్షి, చైన్నె: యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో ఆదివారం నిఘా నీడలో జరిగింది. కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ అభ్యర్థులు పరీక్షక్షకు హాజరయ్యారు. చైన్నె, తిరుచ్చి, వేలూరు, కోయంబత్తూరు, మదురై కేంద్రాల్లో 24 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వివరాలు.. దేశంలో ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల భర్తీ నిమిత్తం యూపీఎస్సీ ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఐఎఎస్,ఐపీఎస్ కావాలన్న ఆశతో పరీక్ష నిమ్తితం అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ సైతం పొందారు. ఈ మేరకు ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరిగింది. రాష్ట్రంలో చైన్నె, మదురై, కోయంబత్తూరు, వేలూరు తిరుచ్చి నగరాల్లో ఎంపిక చేసిన సెంటర్లలో పరీక్షలు జరిగాయి. చైన్నెలో ఎగ్మూర్, విల్లివాక్కం, అన్నానగర్, పురసైవాక్కం పెరంబూరు, టీనగర్, ట్రిప్లికేన్, రాయపేట, వెప్పేరి తదితర కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 24 వేల మంది హాజరయ్యారు. కట్టుదిట్టంగా ఆంక్షలు ఉదయం ఏడున్నర గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు , మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు నిఘా నీడలో పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా నీడలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వని రీతిలో ఈపరీక్షలు జరిగాయి. ఇందులో ఉత్తీర్ణులయ్యే వారికి మెయిన్స్, ఆతదు పరి ఉతీర్ణత , మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలు సాగనున్నాయి. కాగా, ఆదివారం జరిగిన పరీక్షలు అనేక చోట్ల అభ్యర్థులను గందరగోళంలో పడేశాయి. కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద కేవలం హిందీలోమాత్రమే సమాచారాలు ఇవ్వడంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఇది తమిళనాట వివాదానికి దారితీసింది. అలాగే ఉదయం జరిగిన పరీక్షలో ఓ ప్రశ్నకు ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ పేరును ఈవీ రామస్వామి నాయకర్ అని పొందు పరచడం చర్చకు దారి తీసింది. మహిళా అభ్యన్నతి, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన పేరు ను కులం పేరుతో సహా ముద్రించడాన్ని తమిళ పార్టీలు, సంఘాలు వ్యతిరేకించే పనిలో పడ్డాయి. -
ప్రభుత్వ ఖాజీ సలాలుద్దీన్ కన్నుమూత
– సీఎం నివాళి సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధానఖాజీ సలాలుద్దీన్ మహ్మద్ అయూబ్(84) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈ సమాచారంతో గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్తీవ దేహానికి సీఎం స్టాలిన్ ఆదివారం ఉదయం నివాళులర్పించారు. కర్ణాటక నవాబు ఆస్థానంలో దివాన్గా పనిచేసిన కుటుంబ సంతతికి చెందిన సలాలుద్దీన్ అరబిక్ భాషలో ఎంఏ , ఎంఫీల్, పీహెచ్డీ పూర్తి చేశారు. ఈజిప్టులోని అల్ అజార్ వర్సిటీ నుంచి అల్ ఇజాజతుల్ ఆలియా డిగ్రీని కూడా పొందారు. అరబిక్ ప్రొఫెసర్గా తమిళనాడుప్రభుత్వ ప్రధాన ఖాజీగా ఎన్నో సంవత్సరాలుగా వ్యవహరిస్తూ వచ్చారు. మైనారిటీలకు సంబంధించిన సమగ్ర సమాచారాలను సలాలుద్దీన్ ద్వారానే ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చేవి. రంజాన్, బక్రీద్ పర్వ దినాలను నెలవంక ఆధారంగా ఎప్పుడు జరుపుకోవాలో అన్నది ఖాజీ ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా మైనారిటీలు అనుసరించడం జరుగుతూ వచ్చేది. ప్రస్తుతం వయోభారంతో ఉంటూ వచ్చిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ సమాచారంతో సీఎం స్టాలిన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. విజయ్ త మిళగ వెట్రికళగం తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నివాళులర్పించారు. ఖాజీ మరణ సమాచారంతో గవర్నర్ ఆర్ఎన్ రవి, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి తదితరులు తమ సాను భూతి తెలియజేశారు. సాయంత్రం ట్రిప్లికేన్లోని పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థన అనంతరం సలాలుద్దీన్ పార్తీవ దేహాన్ని ముస్లీం సంప్రదాయ బద్దంగా ఖననం చేశారు. 8 కిలోల గంజాయి సీజ్ కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వద్ద 8 కిలోల గంజాయిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. ఆదివారం ఉదయం చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమిషనర్ రామకష్ణన్ ఆదేశాల మేరకు, అసిస్టెంట్ కమిషనర్ రామమూర్తి పర్యవేక్షణలో ఏఎస్ఐలు జి. భారతీదాసన్, ఎ. అన్బుసెల్వం, కె. మహమ్మద్ అస్లాం, పోలీస్ అధికారులు రాజేష్ , ఎస్ఎస్ఐ ముత్తు వేలాయుధన్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్లోని 9వ ప్లాట్ఫారమ్ వద్దకు వచ్చింది. అప్పుడు పోలీసులు సీటు మాత్రమే ఉన్న రిజర్వు చేయబడిన కంపార్ట్మెంట్లో పడి ఉన్న ఆకుపచ్చ బ్యాగ్ను గమనించారు. దానిని తెరిచి పరిశీలించినప్పుడు ఆ కట్టల్లో 4 లక్షల రూపాయల విలువైన 4 కిలోల గంజాయి ఉన్నట్లు వెల్లడైంది. అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వ్యాన్లో మరో 4 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దాన్ని నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులకు అప్పగించారు. -
శరవేగంగా పాఠశాల భవనాల నిర్మాణం
తిరువళ్లూరు: పట్టణంలో రూ.7.50 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో మూడు నెలల్లో పనులను పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. తిరువళ్లూరు పట్టణంలోని రాజాజీ వీధిలో మున్సిపల్ హైయ్యర్ సెకండరీ పాఠశాలను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. పట్టణంలో ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న రూ.కోట్ల విలువైన 51 సెంట్ల భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని, పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. తరగతి గదులు, ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, రీడింగ్ రూమ్ను నిర్మిస్తున్నారు. -
పేరు మోసిన దొంగ అరెస్టు
సేలం: జిల్లాలోని ఓమలూరుకు చెందిన పేరు మోసిన దొంగ నరేష్(26)ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కాల్పులు జరపగా అతడి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన నరేష్పై 17 చోరీ కేసులతో పాటు హత్య, దోపిడీ కేసులున్నాయి. ఒంటరి వృద్ధులను టార్గెట్ చేసి, చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. ఈనెల 20న సేలం తీవట్టి పట్టి ప్రాంతంలో ఒక వృద్ధరాలిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగలు అపహరించుకెళ్లాడు. ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం సంఖగిరి సమీపంలోని కొండ ప్రాంతంలో నరేష్ తలదాచుకుని ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అతడిని చుట్టుముట్టడంతో వారిపై దాడి చేశాడు. దీంతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ విజయరాఘవన్, కానిస్టేబుల్ సెల్వకుమార్కు కత్తిపోట్లు అయ్యాయి. ఇన్స్పెక్టర్ సెంథిల్కుమార్, నరేష్ కుడికాలుపై కాల్చాడు. దీంతో నేలపై పడిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సంఖగిరి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ రాజేష్కన్నన్, డీఐజీ ఉమా సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ట్రక్కు ఢీకొని చిన్నారి మృతి అన్నానగర్: కృష్ణగిరి జిల్లా ఉత్తనపల్లి సమీపంలోని ఆలే సీపం గాంధీ నగర్కి చెందిన అజిత్ ఆర్థిక సంస్థ అధికారి. ఇతని కుమార్తె షణ్మిత (ఒకటిన్నర సంవత్సరం). ఈమె శుక్రవారం రాత్రి తన ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన ఆడుకుంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ట్రక్కు చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,374 మంది స్వామివారిని దర్శించుకోగా 37,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పుదుచ్చేరిలోనూ వార్
● నీతి ఆయోగ్కు రంగన్న దూరం ● ఈసారి విజయ్ వైపు చూపా? సాక్షి, చైన్నె: తమిళనాడు తరహాలో, తాజాగా పుదుచ్చేరిలోనూ అధికార వార్ బయలు దేరినట్టుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కై లాస్నాథన్ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నట్టు ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గా లు ఆరోపణలు అందుకున్నారు. ఇందుకు నిరసన గా తమ నేత , సీఎం రంగస్వామి ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించినట్టుగా ప్రకటించడం చర్చకు దారి తీసింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు పూర్తయినా కేంద్రం నుంచి సహకారం అన్నది లేదని ఇప్పటికే పలు సందర్భాలలో సీఎం రంగస్వామి తన ఆవేదనను వ్యక్తం చేసి ఉన్నారు. అదే సమయంలో తమ కూటమి పుణ్యమా బీజేపీ పుదుచ్చేరిలో గట్టెక్కినట్టుగా ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కొందరు బీజేపీ సభ్యులు, వారికి మద్దతు ఇచ్చే స్వతంత్ర సభ్యుల రూపంలో సీఎం రంగస్వామి ఇంటా బయట ఇరకాటాలను ఎదుర్కోవాల్సినపరిస్థితి తప్పడం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్తో వార్.. తొలుత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను తమిళిసై నిర్వహించారు. ఈ సమయంలో అధికార వార్ అన్నది చాప కింద నీరులా సాగినా, కేంద్ర ప్రభుత్వానికి అణిగిమనిగి ఉండాల్సిన పరిస్థితి రంగన్నకు తప్పలేదు. ఆమె స్థానంలో ప్రస్తుతం కై లాస్ నాథన్ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన అనేక ఫైల్స్ను ఆమోదించకుండా వెనక్కి పంపిస్తున్నట్టు సమాచారం. కేంద్ర హోంశాఖ సైతం తమప్రభుత్వ డిమాండ్లను పక్కన పెడుతూ రావడాన్ని సీఎం రంగస్వామి తీవ్రంగా పరిగణించినట్టు ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్రానికి నిధులు ఇవ్వక పోగా, రాష్ట్రహోదా ఇవ్వడంలోనూ కేంద్ర పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో 2026 ఎన్నికలలో బీజేపీని పక్కన పెట్టే దిశగా రంగన్న వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం అభిమాన సందోహం ఎక్కువే. ఈ దృష్ట్యా, విజయ్తో కలిసి ఆయన అడుగులు వేయడానికి వ్యూహ రచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గతంలో విజయ్ను రంగస్వామి కలిసిన సందర్భాలు కూడా ఉండడం గమనార్హం. ఈ పరిస్థితులలో ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ భేటీని రంగస్వామి బహిష్కరించారు. బీజేపీ కూటమి ప్రభుత్వానికి సీఎంగా ఉన్న రంగస్వామి నీతి అయోగ్కు దూరంగా ఉండటం చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఆ పార్టీ వర్గాలుపేర్కొంటూ, గవర్నర్ తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని, అనేక ఫైల్స్ను వెనక్కు పంపించి ఉన్నారని, కేంద్రం నుంచి నిధులు సక్రమంగా రాని దృష్ట్యా, నీతి అయోగ్ను తమ నేత బహిష్కరించినట్టుగా ఎన్ఆర్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటుండటంతో పుదుచ్చేరి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. -
ఉత్తీర్ణత పెంపునకు అందరూ కృషి చేయాలి
వేలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతి టీచర్ కష్టపడి పనిచేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ప్లస్–1, ప్లస్టూ పరీక్ష ఫలితాల్లో వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి, ప్లస్టూ పరీక్ష ఫలితాల్లో వేలూరు జిల్లా వెనుకంజలో ఉందని, జిల్లాను మొదటి స్థానానికి తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు చేసేందుకు సిద్ధంగా ఉందని, అయితే ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా విద్యాబోధన చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాస్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల హెచ్ఎంలను అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వందశాతం మార్కులు సాధించిన మొత్తం 1,325 మంది టీచర్లను కలెక్టర్ అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్, విద్యాశాఖ సీఈఓ దయాళన్ తదితరులు పాల్గొన్నారు. -
పొన్నేరి మున్సిపల్ అధికారులపై చర్యలు
తిరువళ్లూరు: ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో పర్యావరణానికి ముప్పు కలిగించేలా చెత్తకుప్పలను డంప్ చేస్తున్న పొన్నేరి మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రతాప్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ తిరువళ్లూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తకుప్పలను తొలగించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతివారం ప్రభుత్వ కార్యాలయాలు, నదీ పరివాహాక ప్రాంతాలు, సముద్రతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వస్తువులను తొలగించేందుకు స్వచ్ఛతిరువళ్లూరు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందించాలని పిలుపు నిచ్చారు. నీటి ఆధారిత ప్రాంతాలు, నదులు, సముద్రతీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు రోజుకు గంటైనా ప్లాస్టిక్ వస్తువులను తొలగించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో పొన్నేరి మున్సిపల్ అధికారులు చెత్తకుప్పలను డంప్ చేయడంతో పర్యావరణానికి పెనుసవాలుగా మారిందన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ నదులు, సముద్రతీర ప్రాంతాలు, నీటి ఆధారిత ప్రాంతాల్లో చెత్తకుప్పలను డంప్ చేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు. ఆరణి నదీ పరివాహక ప్రాంతాల్లో చెత్తకుప్పలను డంప్ చేస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నేరి సబ్కలెక్టర్ రవికుమార్, గుమ్మిడిపూండి పర్యావరణశాఖ అధికారి లివింగ్స్టన్, పొన్నేరి తహసీల్దార్ సోమసుందరం పాల్గొన్నారు. -
నకిలీ పత్రాల కేసులో ఇద్దరు..
తిరువళ్లూరు: రూ.కోట్ల విలువ చేసే భూమికి నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించిన వ్యవహరంలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు తాలుకా బమ్మా త్తకుళం గ్రామంలో చైన్నై కొడుంగైయూర్ ప్రాంతానికి చెందిన రీగన్పాల్కు రూ.కోట్ల విలువ చేసే 3.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2005లో అదే గ్రామానికి చెందిన హరిబాబు నుంచి కొనుగోలు చేసి, రెడ్హిల్స్ సబ్రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయడంతో పాటు రెవెన్యూ నుంచి పట్టాను సైతం పొందారు. ఈ క్రమంలో రీగన్కు చెందిన భూమిని వేప్పేరికి చెందిన వేపా మురారీ, కమలశర్మ, సదాశివం, రామకృష్ణన్, జ్ఞానమూర్తి తదితరులు నకిలీ పత్రాలను సృష్టించి విక్రయించడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. విషయాన్ని గుర్తించిన బాధితులు 2006లోనే పోలీసులకు ఫిర్యాదు చేసి, కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో వివాదం పెండింగ్లో ఉన్న క్రమంలో సంబంధిత భూమిని రామకృష్ణన్, జ్ఞానమూర్తి తదితరులు వేరే వ్యక్తులకు విక్రయించి పరారయ్యా రు. వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన క్రమంలో ఇద్దరిని పట్టుకోవడానికి ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, గాలించారు. ఇందులో భాగంగానే పరారీలో ఉన్న రామకృష్ణన్, జ్ఞానమూర్తిని డీసీబీ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
టీటీఎస్ఎల్ విజేత డీఆర్ఏ డ్రాగన్
– రన్నరప్గా వైబ్ విక్టర్స్ సాక్షి,చైన్నె : తమిళనాడు టేబుల్ టెన్నిస్ లీగ్(టీటీఎస్ఎల్) సీజన్ 4ను డీఆర్ఏ డ్రాగన్ కై వశం చేసుకుంది. వైబ్ విక్టర్స్ రన్నరప్గా నిలిచింది. స్పోర్టోరమా, తమిళనాడు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నేతృత్వంలో అంపా స్కైయోన్ మాల్ వేదికగా చైన్నె లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరుగుతూ వచ్చాయి. దేశంలోని యువ ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి, ఆరు జట్లుగా పోటీలను నిర్వహించారు. టైటిల్ను లక్ష్యంగా చేసుకుని ఆరు పోటీ ఫ్రాంచైజీలు ఉత్కంఠభరితంగా పోటీ పడడంతో మ్యాచ్లన్నీ ఆసక్తికరంగా మారాయి. ఫైనల్స్లో వైబ్ విక్టర్స్ నుంచి మహిళల, అండర్–19 బాలికల ఈవెంట్లలో బలమైన ప్రదర్శనకు వేదికగా మారింది. డీఆర్ఏ డ్రాగన్ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. పురుషుల సింగిల్స్, అండర్–19 బాలురు, అండర్–15, పురుషుల డబుల్స్ రాణించి చాంపియన్ షిప్ను కై వశం చేసుకుంది. టైటిల్ను కై వశం చేసుకున్న డీఆర్ఏ డ్రాగన్ రన్నరప్గా నిలిచిన వైబ్ విక్టర్ జట్లకు శనివారం నిర్వాహకులు ట్రోఫీలు బహూకరించారు. -
నిర్మాతగా మారిన యష్ తల్లి
తమిళసినిమా: కేజీఎఫ్1, 2 చిత్రాలతో పాన్ ఇండియా కథానాయకుడిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు యష్. కాగా ఈయన తల్లి పుష్పాఅరుణ్ కుమార్ ఇప్పుడు నిర్మాతగా అవతారం ఎత్తారు. ఇంతకుముందు దివంగత నటుడు రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్కుమార్ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే నటుడు యష్ తల్లి పుష్పాఅరుణ్ కుమార్ చిత్రం నిర్మాణాన్ని ప్రారంభించడం విశేషం. ఈ సంస్థలో యువ నటీనటులకు, నూతన సాంకేతిక వర్గానికి అవకాశాలు కల్పిస్తూ కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో జనరంజకమైన కథా చిత్రాలు నిర్మించడానికి సిద్ధమైనట్లు ఆమె మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తుండగా కావ్య షైలీ హీరోయిన్గా నటిస్తున్నారు. నటుడు గోపాల్ దేశ్ పాండే, రాజేష్ నటరంగ, అవినాష్, మన్సీ సుధీర్, రఘు రమణ గొప్పా, సేతన్ గాంధర్వ తదితరులు బుక్కి పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరాజ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే మూర్ఖత్వం, సెంటిమెంట్, యాక్షన్ వంటి కమర్షియల్ అంచాలతో జనరంజక కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని, తాజాగా టీజర్ను విడుదల చేసినట్టు చెప్పారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుందనే దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర విడుదల తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత పుష్పా అరుణ్ కుమార్ పేర్కొన్నారు. యష్ తల్లి పుష్పాఅరుణ్కుమార్ -
యాక్షన్ ఎంటర్టైనర్గా ‘ఏస్’
తమిళసినిమా: భిన్నమైన కథను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. ఇంతకుముందు ఈయన నటించిన మహారాజా, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఏస్. 7 సీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆర్ముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఇందులో నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటించగా యోగిబాబు, బబ్లూ పథ్విరాజ్, దివ్యపిళ్లై, అవినాష్ రాజ్కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కరణ్ బి.రావత్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకర్ సంగీతం, శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కావడం విశేషం. ఒక సమస్య కారణంగా దుబాయ్ నుంచి మలేషియా చేరుకున్న విజయ్ సేతుపతికి అక్కడే ఉంటున్న యోగి బాబు షెల్టర్ ఇస్తాడు. ఆయన ద్వారా నటి దివ్యపైళ్లె పరిచయం అవుతుంది. అలాగే నటి రుక్మిణి వసంత్ తారస పడుతుంది. ఇక్కడ ముఖ్య అంశం ఏమిటంటే విజయ్ సేతుపతితో పాటు నటి రుక్మిణి వసంత్, దివ్యపిళ్ళై కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక విజయ్ సేతుపతికి సహాయం చేసే ప్రయత్నంలో చిక్కుల్లో ఇరుక్కుటూ ఉంటాడు. అసలు వీరి సమస్యలు ఏమిటి? వాటి నుంచి బయట పడగలిగారా? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం ఏస్. ఇందులో విజయ్ సేతుపతి, యోగిబాబుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. అలాగే బబ్లూ పథ్వీరాజ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించారు. ఇక నటుడు విజయ్ సేతుపతి స్టైలిష్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంటూ కమర్షియల్ ఫార్మేట్లో రూపొందిన ఏస్ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. -
యువనటీనటులతో నటన ఉత్సాహాన్నిచ్చింది!
తమిళసినిమా: నటుడు ప్రభు, వెట్రి కలిసి నటించి న చిత్రం రాజపుత్తిరన్. నటి కృష్ణప్రియ నాయకిగా నటించిన ఇందులో కోమల్ కుమార్, దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్, జీఎం కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రీసెంట్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎం షఫీ నిర్మించిన ఈ చిత్రానికి మహాకందన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఐస్ నవ్పాల్రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని భరణి స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్ర ముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటుడు ప్రభు మాట్లాడుతూ ఇందులో తాను నటుడు వెట్రికి తండ్రిగా నటించానని చెప్పారు. చిత్రంలోని ఒక ఐటెం సాంగ్లో నటించమని కోరగా తాను కాదన్నానన్నారు. అయినా ఆ పాటలో తనను నటింపజేసినట్లు చెప్పారు. పలువురు యువ నటీనటులు నటించారని, వారితో కలిసి నటించడంతో తనకు ఉత్సాహం కలిగిందని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ప్రతిభావంతమైన దర్శకులు వస్తున్నారని, అలాంటి దర్శకుడు మహాకందన్ అన్నారు. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాలని ప్రశంసించారు. తాను ఇప్పటికీ 74 మంది కొత్త దర్శకులతో కలిసి పని చేశానని, ఇప్పటికీ నటిస్తున్నానని ప్రభు పేర్కొన్నారు. షూటింగ్ను కోయంబత్తూరు జిల్లా సొయల్ కుడి గ్రామంలో చిత్రీకరించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు తన తండ్రి శివాజీ గణేషన్ పైనా, తన పైన, తన కొడుకు విక్రమ్ ప్రభుపైన ఎంతో అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. ఇందులో దర్శకుడు ఆర్వీ ఉదయ్కుమార్, జీఎం కుమార్తో కలిసి నటించడం మంచి అనుభవంగా నటుడు ప్రభు పేర్కొన్నారు. -
గజరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం రాత్రి గజవాహనం , ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు హనుమంత వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి వసంతోత్సవం, ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని మాడ వీధులో ఊరేగించారు. అదే విధంగా సాయంత్రం ఊంజల్ సేవా కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిర్ వారు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. రాత్రి 7 గంటలకు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువు దీర్చారు. అనంతరం గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబుసురేష్, కంకణబట్టర్ తరుణ్కుమార్, వేద పండుతులు నారాయణ దాసరి, గోపాలాచారి, శభిరీష్, రమేష్, ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. -
పేర్నంబట్టు అటవీ ప్రాంతంలో ఏనుగుల సర్వే ప్రారంభం
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఏనుగుల సర్వే చేసే పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వేలూరు రీజినల్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో జిల్లా ఫారెస్ట్ అధికారి అశోక్కుమార్, అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ మణివన్నన్, పేర్నంబట్టు అటవీశాఖ అధికారి సతీష్కుమార్ అధ్యక్షతన అటవీశాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు టీమ్లుగా ఏర్పడి, పేర్పంబట్టు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల సర్వే పనులను ప్రారంభించారు. ఈ సర్వే పనులు రెండు రోజుల పాటు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. నేరుగా ఏనుగుల సర్వే చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతంలో ఎన్ని ఏనుగులున్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాలు తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఏనుగులు వచ్చి వెళ్లే దారి, అవి ఎక్కడ ఉంటున్నాయనే విషయాలను గుర్తించి, వాటికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను ప్రారంభించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. -
పేదలఊటీలో ఫ్లవర్ షో
సేలం: పర్యాటకులను ఆకర్షిచడంలోనూ, అందాలను విరబూయించడంలోనూ ఊటీని తలపించే ప్రదేశం ఏర్కాడు. ఇక్కడ ఫ్లవర్ షో మరింత వన్నె తెస్తోంది. శీతోష్ణస్థితులకు అనుగుణంగా వాతావరణాన్ని ఇట్టే అనునయించుకోగలిగి, ఊటీ అందాల్ని అచ్చంగా కళ్లకు కట్టినట్టు పేదల ముందు ఉంచిన సుందర ప్రదేశం ఈ ఏర్కాడు. సేలం నుంచి 30 కి. మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఏడాది పొడవున ఒకే రకంగా శీతోష్ట స్థితి ఉంటుంది. ఎతైన పర్వత శ్రేణులు, లోయలు, ఆహ్లాదాన్ని పంచే వాతావరణం, పలు రకా ల చెట్లతో సోయగాలు చిందించే ఈ ప్రాంతం అభివృద్ధికి 1820–1829 మధ్య కాలంలో అప్పటి సేలం జిల్లా కలెక్టర్గా ఉన్న సోటిష్ కృషి చేశారు. ఇక్కడి ప్రాధాన్యతను గుర్తించిన బ్రిటీషు గవర్నర్ థామస్ మురీ 1842లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఇక్కడ కాఫీ. ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్ద బడ్డ బోట్ హౌస్, చిల్డన్స్, అన్నా ఉద్యనవన వనాలు ప్రత్యేక ఆకర్షణ. 36 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ సిద్ధం చేసిన బొటానికల్ గార్డెన్ను మరో ఆకర్షణ. ఇక్కడ గ్యాలరీ, లాన్, బటర్ప్లవర్ గార్డెన్, యూ టవర్, వ్యూ పాయింట్, విజిటర్స్ షెల్టర్, కృత్రిమ నీటి ధార, మ్యూజికల్ ఫౌంటేన్లు పర్యటకులకు కనువిందు. అలాగే ఇక్కడి యాకుర్డ్ సరస్సు, లేడీస్ సీట్, కిల్లీయూర్ ఫాల్స్, సిల్క్ ఫాం, రోస్ గార్డెన్లు చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ పర్వతంపై కొలువు దీరిన సేర్వరాయన్ ఆలయం ఆధ్యాత్మికతకు నెలవు. ఊటి సందర్శనకు వచ్చే వాళ్లు ఇక్కడకు తప్పకుండా వస్తుంటారు. అలాగే ఊటీకి వెళ్లలేని వాళ్లు అక్కడి అందాల్ని ఏర్కాడు రూపంలో చూసి తరిస్తుంటారు. ఇక్కడ ప్రతి ఏటా వేసవి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేసవి ఉత్సవాల ఫ్లవర్ షో.... ఏర్కాడులో వేసవి ఉత్సవం పుష్ప ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈనెల 29వ తేదీ వరకు ఈ పుష్ప ప్రదర్శన జరగనుంది. సేలం జిల్లా కలెక్టర్ ఆర్ బృందా దేవి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవానికి మంత్రులు ఎంఆర్కే పన్నీరు సెల్వం, రాజకన్నప్పన్, రాజేంద్రన్లు హాజరయ్యా రు. వ్యవసాయం, అటవీ, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్, పట్టు అభివృద్ధి శాఖల సంయుక్త మిళితంగా ఈ ప్రదర్శన కొలువు దీరింది. ఏను గులు, అడవి గేదెలు, కుందేళ్ళు, కోతులు, పాములు, జింకలు , పులులు వంటి అడవి జంతువుల ఆకృతులను 50 వేల ఎరుపు, నారింజ, పసుపు , తెలుపు గులాబీలతో తీర్చిదిద్దారు. డెల్టా రైతుల వరప్రదాయిని మేట్టూరు జలాశయం తరహాలో ఆకృతిని తెలుపు, ఎరుపు,పసుపు వర్ణాలతో కూడిన 73 వేల గులాబీలతో రూపొందించారు. అంతే కాకుండా ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి 5,640 తెలుపు, పసుపు ఎరుపు తదితర వర్ణాలతో గులాబీల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన జీవి అయిన ఒంటి కొమ్ము గుర్రం చిత్రాన్ని 7,000 గులాబీ రేకులతో తీర్చిదిద్దారు. ప్రకృతి అందాల నడుమ ఏర్కాడు పోటెత్తుతున్న పర్యాటకులు -
ఈడీకే కాదు.. మోడీకీ భయపడం
– డిప్యూటీ సీఎం ఉదయనిధి సాక్షి, చైన్నె: ఈడీకే కాదు...మోడీకీ భయపడం అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. పుదుకోట్టై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 1,175 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ సహాయకాల పంపిణీ శనివారం జరిగింది. కలైంజ్ఞర్ డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ కింద గృహ నిర్మాణాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వెయ్యి గృహాలను నిర్మించనున్నారు. డ్రీమ్ హౌస్ పథకం కింద ఒక్కొక్కరికి 3.50 లక్షలు అందించనున్నారు. 50 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు రఘుపతి, పెరియకరుప్పన్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, శివ వీ మెయ్యనాథన్, ఎంపీలు ఎం. ఎం. అబ్దుల్లా, దురై వైకో, జ్యోతి మణి, ఎమ్మెల్యేలు ముత్తురాజా, చిన్నతు రై, రామచంద్రన్, జిల్లా కలెక్టర్ ఎం. అరుణ తది తరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉదయనిధి స్టాలిన్మీడియాతో మాట్లాడుతూ, ఈడీకే కాదు..మోడీకి భయపడం అని వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే భయపడాలన్నారు. తమ ప్రభుత్వంలో ఏతప్పునకూ ఆస్కారం లేదన్నారు. అయితే, తమను ఎలాగైనా బెదిరించి, భయ పెట్టి దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని, తామేమీ బానిస పార్టీ కాదని అన్నాడీఎంకేను ఉద్దేశించి చురకలు అంటించారు. డీఎంకే చరిత్ర ఏమిటో అందరికీ తెలుసునని, తాము ఎవ్వరికి భయపడం అని స్పష్టం చేశారు. 2026 ఎన్నికలలో డీఎంకే కూట మి 200 స్థానాలలో గెలిచి అధికార పగ్గాలను చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో పటిష్టత అవశ్యం – జిల్లాల నేతలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు సాక్షి, చైన్నె : రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి బలోపేతం, పటిష్ట నాయకత్వం అవశ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలిపారు. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుని, ముందుకెళ్లాలని ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బీజేపీ జాతీయ కోఇన్చార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ తమిళనాడు జాతీయ ఇన్చార్జ్ అరవింద్ మీనన్ నేతృత్వంలో శనివారం చైన్నెలో తమిళనాడులోని పార్టీ జిల్లా అధ్యక్షుల ముఖ్య సంస్థాగత సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఇందులో ప్రసంగించారు. డీఎంకే ప్రభుత్వ దుష్పరిపాలనను ఎదుర్కోవడంలో ఐక్యత అవసరాన్ని వివరించారు. స్థానిక సమస్యలను హైలైట్ చేయడం, పోలింగ్ బూత్–స్థాయిలో నిర్వహణను బలోపేతం చేయడం, ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ విజయాలు, పథకాలను ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. తద్వారా డీఎంకే ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. అధికార డీఎంకే పార్టీ వైఫల్యాలను బయటపెట్టడమే కాకుండా, 2026 ఎన్నికల్లో తమిళ ప్రజల హృదయాలను గెలుచుకోవడం లక్ష్యంగా బీజేపీ వర్గాలు ముందుకు సాగాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో తమిళనాడును వీక్షిత్ భారత్ గుప్పిట్లోకి తీసుకురావడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. డాక్టర్ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 450 కిలోల నాటు పేలుడు పదార్థాలు స్వాధీనం అన్నానగర్: తంజావూరు జిల్లాలోని నైవేలి తేన్పతి గ్రామంలో పర్మిట్ లేకుండా ఇంట్లో క్రాకర్లు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన తర్వాత జిల్లా అంతటా పనిచేస్తున్న క్రాకర్ ఫ్యాక్టరీలు, విక్రేతలను తనిఖీ చేయాలని కలెక్టర్ ప్రియాంక పంకజం ఉత్తర్వు జారీ చేశారు. దీంతో శనివారం తంజావూరు జిల్లా పట్టుకోట్టై తాలూకా కీళకురిచ్చి ప్రాంతంలోని అంబికాపతి (45) తన ఇంట్లో అనుమతి లేకుండా 450 కిలోల దేశీయ పేలుడు పదార్థాలను పట్టుకోట్టై తహశీల్దార్ ధర్మేంద్ర, డిప్యూటీ తహశీల్దార్ షేక్ ఉమర్ షా సీజ్ చేశారు. అంబికాపతిని అరెస్టు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినట్టే
● ముమ్మరంగా రుతుపవనాల విస్తరణ ● నీలగిరి, కోవైకు రెడ్ అలర్ట్ ● పశ్చిమ కనుమల్లో కుండపోత చైన్నె శివారులలో వాన కుట్రాలంలో జలకళసాక్షి, చైన్నె: ఏటా నైరుతి రుతు పవనాల రూపంలో తమిళనాడుకు వర్షాలు తక్కువే. అయితే పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో ఈ పవనాల ప్రభావం అధికంగా ఉంటాయి. ఈ పవనాల రూపంలోనే ఇక్కడి జలాశయాలు, వాగులు వంకలు, నదులు పొంగి పొర్లుతుంటాయి. అలాగే, కర్ణాటక నుంచి కావేరి పరవళ్లు తొక్కుతూ డెల్టా వరప్రదాయిని మేట్టూరు జలాశయానికి పుష్కలంగా నీటిని తీసుకొచ్చేలా చేస్తాయి. గత ఏడాది ఈ పవనాల రూపంలో ఆశాజనకంగానే ప్రభావం కనిపించింది. కాగాఈ ఏడాది సాధారణంగానే వర్ష పాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది వేసవిలో వచ్చే అగ్ని నక్షత్రం వేళ అకాల వర్షాలు పుష్కలంగా తమిళనాట పలు జిల్లాలలో కురిశాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో అకాల వర్షం రూపంలో సాధారణంగా 11 సెం.మీ వర్షం పడుతుంది. అయితే, ఈఏడాది 21 సెం.మీ వర్షం పడింది. అదే సమయంలో గతవారం అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకడంతో చెదరుముదురు వర్షాలు పడుతూ వచ్చాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం ఓ వైపు ఉంటే, మరో వైపు బంగాళాఖాతంలో ఈనెల 27న అల్పపీడనానికి అవకాశాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో వారం ముందుగానే నైరుతి పవనాలు ప్రవేశించినట్టుగా శనివారం పరిస్థితులు నెలకొన్నాయి. వారం ముందుగానే.. జూన్ ఒకటి లేదా రెండు తేదీలలో సాధారణంగా నైరుతి రుతు పవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత తమిళనాడులోకి విస్తరిస్తాయి. అయితే, 16 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది వారం రోజులకు ముందుగానే కేరళతో పాటూ తమిళనాడులోకి సైతం ఈ పవనాలు ప్రవేశించినట్టు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే పశ్చిమ కనుమలలో కేరళకు సరిహద్దులో ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ పవనాలు రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల వెంబడి జిల్లాలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, దిండుగల్, కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ , తిరుప్పూర్ జిల్లాలో వాతావరణం మారింది. ప్రస్తుతం తిరునల్వేలి, తెన్కాశిలో వర్షం పడుతుండగా కోయంబత్తూరు, నీలగిరులలోకి సైతం పవనాలు ప్రవేశించాయి. ఆదివారం, సోమవారం అతిభారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోయంబత్తూరు, నీలగిరులకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. గడిచిన 24 గంటలలో నీలగిరి జిల్లా అవలాంజి కొండలలో 11 సెం.మీ, పందలూరులో 11 సెం.మీ, చిన్న కల్లారులోని 9 సె.మీ దేవాలలో 8 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి జిల్లా ఊత్తు, నాలుముక్కులలో 7 సెం.మీ వర్షం పడింది. ఇక చైన్నె శివారులలోకుండపోతగా వర్షం పడింది. మడిపాక్కం, మేడవాక్కంలో 5 సెం.మీ వర్షం నమోదైందని వాతావరణ శాఖ దక్షిణ రీజియన్ అధికారి అముదా తెలిపారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా ప్రస్తుతం అధికారికంగా లెకించడం కష్టమేనని, అయితే, పశ్చిమ కనుమలలో విస్తృతంగా వర్షాలుపడుతాయని, కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, కన్యాకుమారిలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి అరటి పంట దెబ్బ తింది. నాగర్ కోయిల్లో ఓ ఉ పాధ్యాయుడి ఇంటిపై సెల్ టవర్ నేల కొరిగింది. అదృష్ట వశాత్తూ ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కులశేఖరంలో చెట్టు కొమ్మలు విరిగి పడడంతో కృష్ణన్(75) మరణించాడు. చైన్నె శివారులలో వర్షంకన్యాకుమారి – నైల్లె రహదారిలో వాన ముందు జాగ్రత్తలు.. కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, కోయంబత్తూరు,నీలగిరి జిల్లాలోని జలపాతాలలో నీటి ధార ఇప్పటికే కొంత మేరకు కొనసాగుతోంది. జలాశయాలలో నీటిమట్టం కొంత మేరకు పెరిగి ఉంది. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల రాక కారణంగా వర్షాలు పడే అవకాశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ మురుగానందం అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తలు విస్తృతం చేయించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ తీర పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జలాశయాలలోకి నీటి రాకను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల తీవ్రత మరింతగా పెరిగిన పక్షంలో సహాయక చర్యల కోసం అన్ని విభాగాలతో సమన్వయ కమిటీలను సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్దీప్సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న గగన్దీప్సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. కల సాకారం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు. తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. -
కోదండరామునికి ‘కియోస్క్’ బహూకరణ
తిరుపతి కల్చరల్ : శ్రీకోదండరామస్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని సౌత్ ఇండియన్ బ్యాంక్ విరాళంగా అందించింది. ఈ క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్లో రూ.లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియా బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించారు. కియోస్క్ మిషన్లను తిరుమల అన్నదానం, పద్మావతి గెస్ట్ హౌస్, సీఆర్ఓ ఆఫీస్, దేవుని కడప, శ్రీగోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటి మిట్ట ,శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడలో టీటీడీ వినియోగిస్తోంది. కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఏవీ నిరంజన్, ఆర్.వెంకటరావు, డి.అశోక్ వర్ధన్, ఆలయ డిప్యూటీ ఈఓ బి.నాగరత్న, ఐటీ డీజీఎం బి.వెంకటేశ్వర్లు ,ఏఈఓ బి.రవి, సూపరింటెండెంట్ డి.మునిశంకర్ పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించండి
● కలెక్టర్కు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ వినతి తిరువళ్లూరు: నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు నిధులను కేటాయించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్ తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శుక్రవారం కోరారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తిరువళ్లూరు నియోజవర్గంలోని సమస్యలు, ప్రజలు ఇచ్చిన వినతుల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ కలెక్టర్ ప్రతాప్తో దాదాపు గంట సమయం చర్చించారు. ప్రజల నుంచి పింఛన్, పక్కాగృహాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల వినతులను కలెక్టర్కు సమర్పించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిస్కరించాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారు. రోడ్లు, రవాణా సదుపాయం, పక్కాగృహాలు, వీదిధీపాల ఏర్పాటు తదితర వాటికి అవసరమైన నిధులను తన ఫండ్ నుంచి కేటాయించాలని కోరారు. పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్న క్రమంలో పుస్తకాలు, యూనిఫామ్ను సైతం సకాలంలో అందజేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రత్యేకంగా గత నాలుగేళ్లలో ముఖ్యమంత్రి సహకారంతో ధీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. భవిషత్తులోనూ మరిన్ని అభివృద్ధి పనులను చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్రావిడ భక్తన్, యూనియన్ కార్యదర్శులు గూలూరు రాజేంద్రన్, కొండంజేరి రమేష్, మహాలింగం, యూనియన్ ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్, వర్తక విభాగం ఆర్గనైజర్ వీఎస్ నేతాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్ పొన్పాండ్యన్, యువజన విభాగం జిల్లా ఉప కార్యదర్శి మోతీలాల్, ఎన్ఆర్ఐ వింగ్ జిల్లా కార్యదర్శి జయకృష్ణ పాల్గొన్నారు. -
భూ ఆక్రమణకు యత్నం
● ఎస్పీకి ఫిర్యాదు తిరువళ్లూరు: రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు శుక్రవారం ఉదయం ఎస్పీ శ్రీనివాస పెరుమాల్కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ నుంగబాక్కంలో 1996వ సంవత్సరంలో కొందరు ప్లాట్లు వేసి విక్రయించారు. ఈ క్రమంలో వేర్వేరు ప్రాంతాలకు చెందిన 13 మంది ప్లాట్లను కొనుగోలు చేసి, మనవాలనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నారు. అనంతరం రెవెన్యూ ద్వారా పట్టాలు సైతం పొందారు. ఈ క్రమంలో కొందరు సంబంధిత స్థలాన్ని శుభ్రం చేసి ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించి, పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు సంబంధిత భూమి తమదని బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ స్థలంలో ఇళ్లు నిర్మించవద్దని హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు శుక్రవారం ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. వినతి పత్రం స్వీకరించిన ఎస్పీ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
పండ్ల ప్రదర్శన అదుర్స్
పనస పండ్ల చేపలు సేలం: నీలగిరి జిల్లా ఊటీ కున్నూరు స్విమ్స్ పార్కు 65వ పండ్ల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి వివిధ పండ్లతో పలురకాల ఆకృతులను తీర్చిదిద్ది ఉద్యాన వనవిభాగం కొలువుదీర్చింది. ఈనెల 26వ తేదీ వరకు ఈ ప్రదర్శనను సందర్శకులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రదర్శనను నీలగిరి కలెక్టర్ లక్ష్మీభవ్య ప్రారంభించారు. నాలుగు టన్నుల వివిధ పండ్లను ఈ ప్రదర్శనకు ఉపయోగించారు. నిమ్మకాలతో ప్రవేశ మార్గం, ఆరెంజ్ పండ్లతో కప్, చెర్రీ పండ్లతో విజిల్, బత్తాయిలతో కారు, పనసతో చేప లు, మామిడిపండ్లతో పాము, ద్రాక్ష, స్ట్రాబెర్రీలతో ఐఎస్క్రీం, కేక్ వంటి ఆకృతులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. -
ఘనంగా సత్వచ్చారి గంగమ్మ జాతర
వేలూరు: పట్టణంలోని సత్వచ్చారిలో ఉన్న రోడ్డు గంగమ్మ జాతర శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. తొలుత అమ్మవారి శిరస్సును మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేసి, విశేషాలంకరణ చేసి, రథంలో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు మేళ తాళాల నడుమ రథం ఊరేగింపుగా సత్వచ్చారిలోని ముఖ్యమైన వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి రధాన్ని లాగారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు చల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం లేని మహిళలు తడి దుస్తులతో వచ్చి, అమ్మవారికి కర్పూర హారతులిచ్చి, మొక్కుకున్నారు. అనంతరం అమ్మవారి రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సు ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పొంగుళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించారు. వివిధ వేషాధారణ ధరించి, అమ్మవారికి అంబిలి, పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మధ్యాహ్నం భక్తులందరికీ బిర్యాని, అన్నదానంతోపాటు నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. -
ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీ
తిరువళ్లూరు: ఉగ్రవాదులను తుదముట్టించిన భారత సైన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరువళ్లూరులో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరువళ్లూరులోని కామరాజర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ బజారువీధి, నేతాజీ రోడ్డు, మార్కెట్ వీధి మీదు సాగింది. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం సాగిన ఈ ర్యాలీలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా దిశ కమిటీ సభ్యుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ హాజరయ్యారు. ఉగ్రపోరులో భారత సైన్యం చేసిన పోరాటం ఫలితంగానే ప్రపంచ దేశాలకు భారత్ సత్తా తెలిసిందన్నారు. భవిషత్తులోనూ భారత సైన్యం ఉగ్రపోరులో ముందుంటుందన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజ్కుమార్, జిల్లా కార్యదర్శి పన్నీర్సెల్వం, మండల మాజీ అధ్యక్షుడు సతీష్కుమార్, పార్టీ నేత ములైజ్ఞానం తదితరులు పాల్గొన్నారు. -
● 19 ఆలయాల్లో రూ.1,770 కోట్లు ● 13 ఆలయాల్లో నిత్య అన్నదానం ● 1,800 జంటలకు సామూహిక వివాహాలు ● నాలుగేళ్ల హిందూ మత ధార్మిక శాఖ ప్రగతి నివేదిక
సాక్షి, చైన్నె: భక్తులు, సాధారణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలయాల ప్రగతి, నిత్య పూజలు విస్తృతం చేశామని హిందూ మత ధార్మిక దేవదాయశాఖ ప్రగతి నివేదికలో సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. 19 ఆలయాలకు రూ.1,770 కోట్లతో మాస్టర్ప్లాన్ అమల్లో ఉన్నట్టు వివరించారు. 2,967 ఆలయాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. 1,800 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్టు, అన్యాక్రాంతమైన రూ.7,671 కోట్ల విలువగల ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నామని, 13 ఆలయాల్లో నిత్యాన్నదానం, 18 వేల ఆలయాల్లో ఏక కాల పూజలకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. పది వేల గ్రామీణ ఆలయాలకు మరమ్మతులు, ఒకే ఏడాదిలో 274 ఆలయాల్లో పునరుద్ధరణ పనులు జరిగినట్టు పేర్కొన్నారు. రూ.201 కోట్లతో కొండ మీదున్న ఆలయాలకు కేబుల్ కార్, లిఫ్ట్ సౌకర్యాలు కల్పించామన్నారు. డీఎంకే ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినానంతరం దేవదాయశాఖను హిందూ మత ధార్మిక, దేవదాయ శాఖగా పేరు మార్చేశారు. ఆ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు తనకు ఉన్న భక్తిభావంతో నిత్యం ఆలయాల వెంట తిరుగుతూ వాటి అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవల దిశగా ముందుకెళ్తూ వస్తున్నారు. నాలుగేళ్ల పాటు ఈ శాఖలో జరిగిన సమగ్ర వివరాలతో కూడిన నివేదికను శుక్రవారం ప్రకటించారు. మాస్టర్ప్లాన్ రాష్ట్రంలో తిరుచెందూర్, పళని, తిరుత్తణి, సమయపురం, రామేశ్వరంతో పాటు 19 ఆలయాల పునరుద్ధరణ, సమగ్రాభివృద్ధికి కాంక్షించే విధంగా రూ.1,770కోట్లతో మాస్టర్ ప్లాన్ అమల్లో ఉన్నట్టు చెప్పారు. 2,967 ఆలయాల పునరుద్ధరణ పనులు జరిగాయని, మరో 119 ఆలయాల్లో పనులు ముగింపు దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. నాగపట్నం తిరుపుగలూరు అరుల్మిగు ఆగ్నేశ్వర స్వామి జూన్ 5న కుంబాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇవేకాకుండా రూ.5,970 కోట్లతో 25,813 ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వ హిందూ మత ధార్మిక శాఖ పనితీరుపై తనకు నమ్మకం ఉన్నట్టు నివేదిక ప్రకటనలో సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. భక్తుల నుంచి విరాళాల ద్వారా రూ.1,350 కోట్లు సేకరించామని, వీటి ద్వారా 10,610 పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 12,104 దేవాలయాల పునరుద్ధరణకు రాష్ట్ర నిపుణుల కమిటీ తాజాగా ఆమోదించిందన్నారు. ఆలయాల తరఫున నాలుగు సంవత్సరాలలో 1,800 జంటలకు వివాహం చేశామని, ప్రతి జంటకు 4గ్రాముల బంగారు తాళి, పట్టుచీర, పట్టు పంచ అందజేశామని వివరించారు. 971 ఆలయాలకు చెందిన రూ.7,671 కోట్ల విలువగల 7,560 ఎకరాల భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.● ఆలయ రికార్డుల సంరక్షణ లక్ష్యంగా ఎల్కాట్ కంపెనీ డాక్యుమెంట్ చేసి భద్రపరిచాం. ● శ్రీరంగం పళని, తిరుచెందూర్, తిరుత్తణి, సమయపురం, మదురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, పెరియపాళయం, మేల్మలయనూరు, ఆనమలై, కళ్లలగర్, మదురమలైలలో 13 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేస్తున్నాం. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ద్వారా 523 ఆలయాలకు నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు లభించాయి. ● మానససరోవర్ ముక్తినాథ్ ఆధ్యాత్మిక ప్రయాణం లక్ష్యంగా భక్తులకు ప్రతి ఏటా 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన 2 వేల మందిని ప్రభుత్వ సబ్సిడీతో పంపిస్తున్నాం. రామేశ్వరం, ఆరుపడై వీడుల సందర్శన, అమ్మ ఆలయాల ఆధ్యాత్మిక పయనం కాశీ ఆధ్యాత్మికత యాత్ర అంటూ భక్తుల కోసం ప్రత్యేక ఆధ్యాత్మిక పయనం విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ● గత ఏడాది పళణిలో అంతర్జాతీయ ముత్తమిళ్ మురుగన్ మహానాడును జయప్రదం చేయడమే కాకుండా, ఆలయాలలో పూజారులు, మహిళా పూజారుల నియామకం నిమిత్తం శిక్షణ కార్యక్రమాలు విస్తృతంచేశాం. ● ఆదాయం లేని 12,959 ఆలయాలకు తలా రూ.లక్ష పెట్టుబడితో పూజకు అయ్యే ఖర్చులకు చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం లక్షను రూ.2.50 లక్షలకు పెంచినట్టు ప్రకటించారు. ● ఏక కాల పూజల పథకం పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న 18 వేల మంది పూజారులను ఎంపిక చేసి ప్రతినెలా రూ.1000 నగదు ప్రోత్సాహం అందిస్తున్నాం. 900 మంది పూజారుల పిల్లల ఉన్నత విద్య కోసం తలా రూ. 10 వేలు అందిస్తున్నారు. ● ఆది ద్రావిడ, గిరిజ ప్రాంతాలలోని 3,750 దేవాలయాలకు తలా రూ. 2 లక్షలతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో 1,250 ఆలయాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.2.50 లక్షలు కేటాయించాం. ● రత్నగిరి అయ్యర్ మలై, షోళింగర్ నరసింహస్వామి ఆలయాలకు కేబుల్కార్ సేవలు, పళని కొండ, ఇడుంబన్ కొండ మధ్య రూ.90 కోట్లు అంచనాతో, తిరునీర్మలై, తిరుకళి కుండ్రం, తిరుప్పరకుండ్రం, కేబుల్ కార్ సేవలకు చర్యలు తీసుకున్నామని వివరించారు. కుంభకోణం సమీపంలోని స్వామిమలైలో లిఫ్ట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ● మాతృభాష తమిళంలో పూజలు జరిపే విధంగా చర్యలు తీసుకోవడమే కాదు, వల్లలార్ అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు, అవ్వయ్యార్ కోసం మణిమండపం ఏర్పాటుకు చర్యలు ● ఇరుకన్ కుడి, పెరియపాళయం, సమయపురం, పళణి, తిరువేర్కాడు, మాంగాడు, తిరుచెందూరుసహా 21 ఆలయాలలో భక్తులు కానుకగా సమర్పించిన బంగారం, నాణేలను రిటైర్డ్ న్యాయమూర్తుల పర్యవేక్షణలో కరిగించి, స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చాం. 1,074 కిలోల బంగారాన్ని పలు జాతీయ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టి ఉన్నాం. ● 25 ఆలయాల్లో రోజంతా ప్రసాదాల పంపిణి, 19 ఆలయాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆధ్యాత్మిక పుస్తకాలను మళ్లీ ముద్రించి భక్తులకు అందజేస్తున్నాం. ఈ నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం చేస్తున్న ఆధ్యాత్మిక సేవకు తమిళ సంస్కృతి గర్వపడుతోందని, భక్తుల గౌరవాన్ని నిలబెట్టామని, భక్తులు, సాధారణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఆలయాల ప్రగతి పయనం కొనసాగిస్తున్నామని ప్రకటించారు.సమయపురంలో భక్తుల కోసం నిర్మించిన మండపం -
పెళ్లి రద్దుకు నేను కారణమా?
తమిళసినిమా: నటుడు రవిమోహన్, ఆర్తిల మధ్య వివాదం, వివాహ రద్దుకు తీసిన విధం గురించి పత్రికల్లో , సామాజిక మాధ్యమాల్లో కాస్త ఎక్కువగానే ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా, రవిమోహన్, ఆర్తి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మధ్యలో గాయని కెనిషా ఫ్రాన్సిస్ను లాగుతున్నారు. అసలు రవిమోహన్, ఆర్తి వివాహ రద్దు వరకూ వెళ్లడానికి కెనిషానే కారణం అని కొందరు ఆమైపె మాటల యుద్ధం చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆర్తి చెప్పడమే కారణం. ఈ వ్యవహారంపై కెనిషా స్పందించారు. ఆమె తన ఇన్స్టాలో పేర్కొంటూ ‘నేను నాపై వస్తున్న కామెంట్స్ను ఆపే ప్రయత్నం చేయను. ఎక్కడికీ పారిపోను.ఈ వ్యవహారంలో దాచేదేమీ లేదు కూడా. నా చర్యలపై ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న దేనికై నా నేను కారణం అనిపిస్తే నన్ను కోర్టుకు తీసుకెళ్లండి. నిజాలేమిటో చట్టపరంగా వెలువడినప్పుడు మీకు అర్థం అవుతుంది’ అని గాయని కెనిషా పేర్కొన్నారు. రవిమోహన్, ఆర్తిల వ్యవహారంపై ఇకపై ఎవరూ కామెంట్స్ చేయరాదని న్యాయస్థానం హెచ్చరించిందన్నది గమనార్హం. దీంతో వీరి విషయంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.వీఎంఎల్ఎస్లో ఘనంగా ఓపెన్ డే 2025సాక్షి, చైన్నె: వినాయక మిషన్ లా స్కూల్లో విజయవంతంగా ఓపెన్ డే 2025 కార్యక్రమం జరిగింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో పయనూరు క్యాంపస్కు విద్యార్థులు తరలి వచ్చారు. విద్యా దృక్పథం, మౌలిక సదుపాయాలు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు, వివిధ ప్రదర్శనలతో పాటు విద్యార్థులకు సమగ్ర సమాచారాలను తెలియజేశారు. ఆ విద్యా సంస్థ చాన్సలర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధ, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జె సురేష్ శామ్యూల్ ఈసందర్భంగా న్యాయ విద్యలో అత్యుత్తమ ప్రమాణాల గురించి వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటరాక్టివ్ సెషన్లలో తమకు కావాల్సిన సమాచారాలను రాబట్టారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్ మాట్లాడుతూ న్యాయవిద్య అభివృద్ధి, న్యాయ రంగంలోకి విస్తృత శ్రేణి అవకాశాలు, తమ కోర్సులు, విద్యా సహకారం గురించి వివరించారు. చెంగల్పట్టు బార్ అసోసియేషన్ న్యాయవాది మునీశ్వరన్, సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎఫ్రాన్సిస్ జులియన్, తదితరులు విద్యార్థులకు ఓపెన్ డేలో తమ సూచనలు,సలహాలు ఇచ్చారు.డీఎంకే అధికారాన్నికోల్పోవడం ఖాయంకొరుక్కుపేట: ప్రస్తుతం ప్రజలు అన్నాడీఎంకే వైపు ఉన్నారు. అందువల్ల, 2026 ఎన్నికల్లో డీఎంకే అధికారం కోల్పోవడం ఖాయమని మాజీ మంత్రి ఆర్.పి.ఉదయకుమార్ అన్నారు. తమిళనాడులో పెరుగుతున్న లైంగికదాడులను నిరోధించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఖండిస్తూ శుక్రవారం తంజావూరులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఉదయకుమార్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ గత మూడేళ్లుగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని, తనను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కానీ స్టాలిన్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నారని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ కేసులో నిందితులను రక్షించడానికే ఆయన ఢిల్లీ వెళ్లారనే అనుమానం ఉందన్నారు. -
కథానాయకుడైన నిర్మాత
తమిళసినిమా: తాజాగా మరో నిర్మాత కథానాయకుడిగా అవతారమెత్తారు. ఇంతకు ముందు అరమ్, క/పే.రణసింగం, డాక్టర్, అయలాన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ ఇప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రానికి అంగీకారం అనే టైటిల్ను నిర్ణయించారు. స్వస్తిక్ విజన్ పతాకంపై ప్రసాద్, అజిత్ భాస్కర్, అరుణ్మురుగన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జేపీ.తెన్పాదియాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది పలు యథార్థ సంఘటనలతో కూడిన అథ్లెటిక్ క్రీడా నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. క్రీడాకారుల కష్టాలు, ఆ శాఖలో జరిగే అవకతవకలను తెరపై ఆవిష్కరించే చిత్రంగా అంగీకారం ఉంటుందని చెప్పారు. ఇందులో సింధూరి విశ్వనాఽథ్, వీజీ వెంకటేశ్, ఆంథోని, మన్సూర్ అలీఖాన్, మోహన్రామ్, రంగరాజ్పాండే ముఖ్య పాత్రలు పోషించారని చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఈచిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని, ఏ.విశ్వనాఽథ్ చాయాగ్రహణం అందిస్తున్నారు. అంగీకారం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
వేలుమణికి హత్యా బెదిరింపులు
● కోవై కమిషనర్కు ఫిర్యాదుసాక్షి, చైన్నె: మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి హత్యా బెదిరింపులు రావడంతో భద్రత కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆయనకు బెదిరింపు ఇచ్చిన వారిని గుర్తించాలని, భద్రత కల్పించాలని కోయంబత్తూరు కమిషనరేట్లో ఎస్పీ వేలుమణి మద్దతుదారులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, తొండముత్తురు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ వేలుమణి కోయంబత్తూరు కునియాముత్తూరులో నివాసం ఉన్నారు. ఆయన ఇంటికి వచ్చిన పోస్టల్ బెదిరింపు లేఖ కలకలం రేపింది. ఎస్పీ వేలుమణిని హతమార్చనున్నామన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్య కలియపెరుమాల్ కొలను సమీపంలోని చెత్త డంప్యార్డ్ వద్ద రూ.కోటి నగదు ఉంచి వెళ్లాలని, లేకుంటే మూడు నెలల్లో ఎస్పీ వేలుమణి, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామని ఆ లేఖలో ఉండడంతో మద్దతుదారులు వెంటనే స్పందించారు. వేలుమణి తరఫున ఆయన మద్దతుదారు దామోదరన్ నేతృత్వంలోని బృందం కోయంబత్తూరు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ వేలుమణికి, ఆయన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం కొంగు మండలంలో అత్యంత కీలక నేతగా వేలుమణి ఉన్నారు. పార్టీ పరంగా ఆయన కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈసమయంలో బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయో అనే దిశగా అన్నాడీఎంకే వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి. -
20 లక్షల మందికి ల్యాప్ టాప్లు
● అంతర్జాతీయ స్థాయి సంస్థలకు పిలుపు ● టెండర్ల ఉత్తర్వుల జారీ సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులు 20 లక్షల మందికి ల్యాప్టాప్ల పంపిణీకి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సంస్థలకు ఈల్యాప్టాప్ కొనుగోలు నిమిత్తం టెండర్లను ఆహ్వానిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత సీఎం జే జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకే ప్రభుత్వం గతంలో ప్లస్–1 ముగించి ప్లస్టూ వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ల పంపిణీ జరిగేది. అయితే ఆమె మరణంతో ఈ పథకం మూలన పడింది. డీఎంకే సైతం ఈ పథకం మీద దృష్టి పెట్ట లేదు. అయితే ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో పాలకులు ల్యాప్టాప్ ప్రస్తావనను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సారి ప్రభుత్వ పరిధిలోని కళాశాలలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ ల్యాప్టాప్ల పంపిణీ నిమిత్తం రెండురోజుల క్రితం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం సైతం నిర్వహించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి, ఉన్నత స్థాయి ప్రభుత్వాధికారులు, అన్నా విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్, కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, తమిళనాడు ఇ–గవర్నెన్న్స్ ఏజెన్సీ, టెక్నాలజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడు తదితర వాటిలోని నిపుణులతో సాంకేతిక ప్రమాణాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద అందించే ల్యాప్టాప్ల పనితీరు, మెమరీ (స్టోరేజ్), సాఫ్ట్వేర్, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్వేర్తో సహా సాంకేతిక పరికరాల సమగ్ర సమాచారాలను సిద్ధం చేశారు. మరిన్ని సమాచార సాంకేతికత, సాఫ్ట్వేర్ సంబంధిత డిజిటల్ సేవల పరిశ్రమ నుంచి ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపారు. టెండర్లు పిలుపు 2025–26 విద్యా సంవత్సరంలో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్లను పంపిణీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ పథకంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ముందు జాగ్రత్తగా టెండర్లకు సైతం ఓ కమిటీని నియమించారు. కళాశాలల ద్వారా విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించారు. టెండర్లలో ల్యాప్టాప్ల గురించి సమగ్ర సమాచారాలను సైతం వివరించేలా ఆదేశించారు. ఈ మేరకు 8 జీబీ ర్యాం, 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్డిస్క్, 15.6 ఇంచ్ స్క్రీన్, హెడ్ కెమెరా, నాలుగు నుంచి ఐదు గంటల పాటుగా పనిచేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీ, వారంటీ వంటి వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విద్యార్థులకు సమస్య ఎదురైన పక్షంలో ఫిర్యాదులకు సంబంధించి, పరిష్కారానికి సంబంధించిన కాల్ సెంటర్ల వివరాలను కూడా టెండర్ల ప్రక్రియలో పొందు పరిచేలా ఆదేశాలు జారీ చేశారు. అంతర్జాతీయ సంస్థలకు సైతం ఆహ్వానాలు పలికారు. జూన్ 26వ తేదీలోపు ఈ టెండర్లను సమర్పించాలని సూచించారు. ఆ తరువాత త్వరితగతిన టెండర్ల ఖరారుతో ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు ల్యాప్ టాప్లను అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. -
ఢిల్లీలో స్టాలిన్ బిజీ బిజీ
సాక్షి, చైన్నె: ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీకొట్టే దిశగా నీతి ఆయోగ్ భేటీకి స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు డీఎంకే వర్గాలు ఘనస్వాగతం పలికాయి. ఎంపీలు, ముఖ్యులతో సమావేశమయ్యారు. తమిళనాడు భవన్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో భేటీ అయ్యారు. తమిళనాడుకు విడుదల చేయాల్సిన నిధుల్లో పక్షపాత ధోరణిని కేంద్రం అనుసరిస్తున్నట్టు మొదటి నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాము వ్యతిరేకిస్తున్న పథకాలను అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తీసుకురావడాన్ని డీఎంకే పాలకులు ఇప్పటికే తీవ్రంగా పరిగణించారు. అలాగే, లోక్సభ పునర్విభజన వ్యవహారంలో, నిధుల విడుదల విషయంలో ప్రధాని మోదీని ఎంపీల బృందంతో వెళ్లి కలిసేందుకు అనుమతి కోరినా, ఇంతవరకు అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితులలో శనివారం ఢిల్లీ వేదికగా నీతి ఆయోగ్ భేటీ జరుగుతుండడంతో సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఇదివరకు జరిగిన నాలుగు సమావేశాల్లో మూడు సమావేశాలకు సీఎం వెళ్ల లేదు. ఆయన తరఫున ఆర్థిక మంత్రి హాజరయ్యారు. గత ఏడాది జరిగిన సమావేశాన్ని బహిష్కరించారు. ఢిల్లీ పయనం ఈసారి నీతి ఆయోగ్ భేటీకి తానే స్వయంగా వెళ్లే విధంగా సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం చైన్నె నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు డీఎంకే వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఎంపీలు టీఆర్బాలు, తిరుచ్చిశివ పుష్పగుచ్ఛాలను అందజేశారు. విమానాశ్రయం ఆవరణలో తన కోసం వేచి ఉన్న జనాన్ని సీఎం పలకరించారు. అక్కడి నుంచి నేరుగా తమిళనాడు భవన్కు చేరుకున్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్ భేటీలో వ్యవహరించాల్సిన అంశాల గురించి ఎంపీలు, ముఖ్య అధికారులతో సమీక్షించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును ఈ సమావేశం ద్వారా ఎండగట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ నివాసానికి సీఎం స్టాలిన్ వెళ్లారు. మర్యాదపూర్వక భేటీగా సాగినా, కేంద్రం అనుసరిస్తున్న తీరు గురించి, తమిళనాడు రాజకీయ పరిస్థితులు, కూటమి వంటి అంశాల గురించి ఇందులో చర్చించినట్టు సమాచారం. ఇక, నీతి ఆయోగ్ భేటీకి రానున్న కేరళ, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ తదితర బీజేపీ యేతర ప్రభుత్వాలసీఎంలు, ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యేందుకు స్టాలిన్ నిర్ణయించినట్టు తెలిసిందే. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు బీజేపీ యేతర ప్రభుత్వాలు సిద్ధం కావాలని పిలుపునివ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన ఆయా రాష్ట్ర సీఎంలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. తాము చేస్తున్న న్యాయపోరాటాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ భేటీలు జరుగుతున్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ భేటీ గురించి సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. సోనియా, రాహుల్గాంఽధీలను ఢిల్లీలో కలిసినట్టు, ఒక ప్రత్యేక ఆప్యాయత, కుటుంబాన్ని కలిసిన అనుభూతి కలిగినట్టు చెప్పారు. సోనియా, రాహుల్గాంధీతో భేటీ నేడు తొలిసారిగా నీతి ఆయోగ్ భేటీకి హాజరు -
ఆగకడవన!
మహిళా తారలు లేకుండా కమలహాసన్తో అన్బరివ్ల ద్వయం తమిళసినిమా: సినిమా అనగానే నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్, రొమాన్స్, కామెడీ వంటి అంశాలు తప్పకుండా ఉండాలి. అప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే సినిమా ట్రెండ్ మారిపోతోంది. కొత్త టాలెంట్ డిఫెరెంట్గా ఆలోచిస్తున్నారు. ట్రెండ్ను సెట్ చేస్తున్నారు. సినిమా ఇలానే ఉండాలి అనేదాన్ని బ్రేక్ చేస్తున్నారు. అలా సరికొత్త పంథాలో తెరకెక్కిన చిత్రం ఆగకడవన. చిత్ర టైటిలే కొత్తగా ఉంది కదూ. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కథానాయకి ఉండదు. పాటలు ఉండవు. వినోదం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో మహిళా తారలే లేరు. అయితే కథ, కథఽనాలు ఆసక్తిగా సాగుతాయి. ఇలా మూస ఫార్ములాను బ్రేక్ చేసి తెరకెక్కించిన చిత్రం ఆగకడవన. ఇది ప్రపంచ విధి అన్న కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం. ముగ్గురు స్నేహితులు స్వయంకృషితో ఎదగాలనే ప్రయత్నంతో ఒక మెడికల్ షాప్ను నిర్వహించడానికి సిద్ధం అవుతారు. అయితే అందకు సిద్ధం చేసుకున్న డబ్బు చోరీకి గురవుతుంది. దీంతో మరో ప్రయత్నంగా అమ్మ నాన్న, కుటుంబ సభ్యుల సాయం కోసం సొంత ఊరికి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రం కథ. చిత్రం ఆధ్యంతం యథార్థాన్ని మీర కుండా సాగుతుంది. సారా కలైకూడమ్ పతాకంపై అనిత లియో, లియో వి.రాజా నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటుడు ఆదిరన్ సురేశ్, విన్సెంట్ ఎస్.సీఆర్.రాహుల్, మైఖెల్ ఎస్. సతీశ్ రామదాస్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రానికి చాయాగ్రహణం లియో వి.రాజా, సంగీతాన్ని శాంతన్ అనే బజగనే అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
ఐఐటీ గణిత విభాగానికి సిల్వర్ గుర్తింపు
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాస్ గణిత శాస్త్ర విభాగానికి క్యాజువాలిటీ యాక్చురియల్ సొసైటీ నుంచి సిల్వర్–లెవల్ గుర్తింపు దక్కింది. గణిత శాస్త్ర విభాగం సహకారం, విద్యను ముందుకు తీసుకెళ్లడం, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈ ప్రతిష్టాత్మక గౌరవం, ఆస్తి, ప్రమాద బీమా, రిస్క్ మేనేజ్మెంట్లో కెరీర్కు విద్యార్థులను సిద్ధం చేయడంలో ఐఐటీ మద్రాసు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సీఏ పాఠ్యాంశాలతో బలమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నది.ఐఐటీ మద్రాస్లోని గణిత విభాగం స్వచ్ఛమైన, అనువర్తిత గణితం, గణాంకాలు, ఆర్థిక నమూనాలలో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్లతో విభిన్న పోర్ట్ఫోలియోను అందిస్తున్నది. కఠినమైన పరిశోధన, బోధనా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ విభాగం, విద్యారంగం, ఆర్థికం, సాంకేతికత , యాక్చురియల్ ప్రాక్టీస్లో నాయకత్వ పాత్రలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి, పరిశ్రమ భాగస్వాములతో సన్నిహిత సహకారాన్ని నిర్వహిస్తున్నదని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ నీలేష్ ఎస్. ఉపాధ్యాయ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆధునిక యాక్చురియల్ సైన్న్స్కు గుండెకాయ లాంటి యాదృచ్ఛిక ప్రక్రియలు, తిరోగమనం, ఆర్థిక గణితం, డేటా విశ్లేషణలలో తమ విభాగం ధృడంగా ఉన్నట్టు తెలిపారు. ఈ గుర్తింపు అవకాశం దక్కడంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ వర్క్షాప్లు, విద్యార్థుల వేసవి కార్యక్రమ నియామకాలు, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాల సహకారం లభించిందన్నారు. సిల్వర్–లెవల్ భాగస్వామిగా, ఐఐటీ మద్రాస్ అనేక ప్రయోజనాలు పొందుతుందన్నారు. సీఏఎస్ వేసవి కార్యక్రమాల్లో విద్యార్థులకు ప్రాధాన్యత నియామకాలు, బోధనా సామగ్రి , కేస్–స్టడీ లైబ్రరీలకు ప్రాధాన్యత, వార్షిక జనరల్ ఇన్సూరెన్న్స్ టీచర్స్ కాన్ఫరెనన్స్కు ఆహ్వానాలు, నిపుణులతో క్యాంపస్ ఈవెంట్లు, వర్చువల్ ప్రెజెంటేషన్ను స్పాన్సర్ చేయనున్నారని తెలిపారు. సీఏఎస్ యూనివర్సిటీ గుర్తింపు కార్యక్రమాల ద్వారా ఐఐటీ మద్రాసు సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. -
బస్ షెల్టర్ ఏర్పాటు
వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్లోని కాట్పాడి, చిత్తూరు మార్గంలో వెళ్లే బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు తరచూ ఎండలో నిలవాల్సి వచ్చేదని, దీంతో ప్రత్యేక బస్ షెల్టర్ను నిర్మించినట్లు ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. కొత్త బస్టాండ్లో ఏటీఎం, బస్ షెల్టర్ వసతి ఏర్పాటు చేయాలని ప్రజలు పలుమార్లు తన వద్ద విన్న వించారన్నారు. దీంతోనే నియోజక వర్గ నిధుల నుంచి రూ.15 లక్షలతో ప్రస్తుతం బస్ షెల్టర్ను నిర్మించి ప్రారంభించాదన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేయర్ సుజాత, కార్పొరేషన్ నాల్గవ జోన్ చైర్మన్ వెంకటేశన్, కార్పొరేటర్లు కాంచన, మురుగన్, మహేంద్రన్, డీఎంకే ప్రతినిధులు సుందర్ విజీ, బాలమురళీక్రిష్ణపాల్గొన్నారు. -
రోబోటిక్ సర్జరీలో కొత్త ఒరవడి
● ఐదేళ్ల బాలుడికి రోబోటిక్తో కాలేయ మార్పిడి సాక్షి,చైన్నె: రోబోటిక్ సర్జరీలో సరికొత్త ఒరవడిని చైన్నెలోని రెలా ఆస్పత్రి సృష్టించింది. ఐదేళ్ల బాలుడికి ప్రపథమంగా రోబోటిక్ విధానంలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయంతంచేశారు. ఐదు సంవత్సరాల చిన్నారికి రోబోటిక్ లివర్ ట్రానన్స్ప్లాంట్ను ఇంత వరకు ఎక్కడా జరగలేదని, ఈ చారిత్రాత్మక శస్త్రచికిత్స రోబోటిక్, పీడియాట్రిక్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ రంగంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని డాక్టర్ మహ్మద్ రెలా ప్రకటించారు. అత్యాధునిక సాంకేతికతను సంక్లిష్ట శస్త్రచికిత్స నైపుణ్యంతో కలిపి మెరుగైన ఫలితాలను సాధించామన్నారు. గురువారం చైన్నెలో ఈ శస్త్ర చికిత్స గురించి డాక్టర్ రెలా మాట్లాడుతూ యూరియా సైకిల్ డిఫెక్ట్ అనే అరుదైన జన్యు పరమైన సమస్యతో బాధ పడుతున్న ఐదు సంవత్సరాల బాలుడికి ఆహారం నుంచి ప్రోటీన్లను కాలేయం సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోవడంతో రక్తంలో అమ్మోనియా హానికరంగా పేరుకుపోతూ రావడాన్నిగుర్తించామన్నారు. ఈ పరిస్థితుల్లో మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చిందని,చివరకు కాలేయ మార్పిడికి నిర్ణయించామన్నారు. రోబోటిక్ విధానంతో.. కాలేయ మార్పిడి కచ్చితమైన నివారణను అందించిందన్నారు. శస్త్రచికిత్స ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా సాగి, బాలుడిని వారంలోనే డిశ్చార్జ్ చేశామన్నారు. సాధారణంగా సాంప్రదాయిక విధానంలో రోగి 14 నుంచి 21 రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే, తాము ప్రపథమంగా రోబోటిక్ సర్జరీని ఒక పిల్లవాడిపై నిర్వహించి విజయం సాధించామన్నారు. దాతగా ఉన్న ఆ బాలుడి తల్లికి సైతం శస్త్ర చికిత్స రోబోటిక్ విధానంలోనే జరిగిందన్నారు. రోబొటిక్ ద్వారా తల్లి నుంచి సేకరించి కాలేయం కొంత భాగాన్ని అదే విధానంతో ఆ బాలుడికి అమర్చి విజయవంతంచేశామన్నారు. రోబోటిక్ విధానం కారణంగా ఐదు రోజులలోనే డిశ్చార్జ్ చేశామన్నారు. రోబోటిక్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి పిల్లల కాలేయ మార్పిడి విజయవంతంగా నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారిగా పేర్కొంటూ ఇది శస్త్రచికిత్స రంగంలోనే ఒక ప్రధాన మైలురాయి అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో క్లినికల్ లీడ్ , సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజేష్ రాజలింగం సీనియర్ కన్సల్టెంట్– పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ – హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ నరేష్ షణ్ముగంలతో పాటుగా ఆ బాలుడు, అతడి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
వేలూరు: కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లును తమిళనాడుకు కారులో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.. పేర్నంబట్టు మీదుగా కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం ప్యాకెట్లు తరలిస్తున్నట్లు ఎకై ్సజ్ పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో గుడియాత్తం సమీపంలోని వి.కోట క్రాస్ రోడ్డు వద్ద ఎకై ్సజ్ పోలీసులు వాహణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏసీ కారును అడ్డుకొని తనిఖీ చేయగా అందులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కారును నడుపుతున్న వేలూరు జిల్లా పేర్నంబట్టు ప్రాంతానికి చెందిన బయాస్ అహ్మద్ను అదుపులోకి తీసుకొని కారులో ఉన్న 29 బాక్సుల్లో ఉన్న మొత్తం 1,800 కర్ణాటక మద్యం ఫ్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కారుతో పాటు మద్యం ప్యాకెట్లును స్వాధీనం చేసుకొని పరారీ అయిన చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సంతోష్కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు పేర్నంబట్టు ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
52 వేల శునకాలకు టీకాలు వేయడమే లక్ష్యం
వేలూరు: వేలూరు జిల్లాలోని మొత్తం 52 వేల శునకాలకు టీకాలు వేయనున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా తొర్రపాడిలోని పశు సంవవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేలూరు జిల్లాలోని వీఽధి శునకాల ద్వారా ప్రజలకు, పలు చోట్ల ట్రాఫిక్ సమస్యతో పాటూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటి, మేజర్ పంచాయతీ, కార్పొరేషన్లో మొదటి విడతగా శునకాలకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ టీకాలు వేయడం ద్వారా వీధి శునకాలు ఎవరినైనా కరిచినా ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. అదేవిధంగా చైన్నెకి చెందిన శిక్షణ డాక్టర్లచే రాష్ట్రవ్యాప్తంగా శునకాలకు కు.ని ఆపరేషన్లు చేస్తున్నారని వారు ప్రస్తుతం తిరిచ్చి జిల్లాలో చేస్తున్నారని త్వరలోనే వేలూరు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. వారు వచ్చిన వెంటనే జిల్లావ్యాప్తంగా ఉన్న వీధి శునకాలకు కుటుంబ నియంత్రన ఆఫరేషన్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం వద్ద శునకాలకు కు.ని ఆపరేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుమారన్, డాక్టర్ పాండియన్, కార్పొరేషన్ కమిషనర్ జానికి, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘జైలర్–2’ డిసెంబర్కు పూర్తి
తమిళసినిమా: రజనీకాంత్ ఇది పేరు కాదు తమిళ సినిమా బ్రాండ్. 50 వసంతాల సినిమా అసాధారణ పయనం. నేటికీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. ఈయన తాజాగా కూలీ చిత్రాలు పూర్తి చేశారు. లోకేష్ కనకరాజు కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని తలుపు విచ్చేస్తున్న భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇందులో క్రేజీ నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషించగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ యువ సామ్రాట్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇలా పలువురు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. కూలీ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. కాగా ఆగస్టు 15వ తేదీతో రజనీకాంత్ నటుడుగా 50వ ఏట అడుగుపెట్టబోతున్నారన్నది గమనార్హం. దీంతో కూలి చిత్రం ప్రత్యేకత సంతరించుకుంది. కాగా తాజాగా రజనీకాంత్ జైలర్–2 చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రజకాంత్ నటిస్తున్న 172వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రం షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో కొంత భాగాన్ని జరుపుకుని ప్రస్తుతం కేరళలో జరుపుకుంటుంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని గురువారం ఉదయం చైన్నెకి తిరిగి వచ్చిన రజనీకాంత్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ అద్భుతంగా వస్తోందని, దర్శకుడు నెల్సన్ చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ డిసెంబర్ పూర్తి అవుతుందని చెప్పారు. కాగా దీని తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రం ఏమిటన్న ప్రశ్నకు ఆయన ఒక టాలీవుడ్ యువ దర్శకుడితో చిత్రం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. జైలర్ – 2 చిత్రంలో రజనీకాంత్ -
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
కొరుక్కుపేట: శ్రీఆంధ్ర కళా స్రవంతి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. చైన్నె కొరట్టూరు అగ్రహారంలోని కోదండ రామాలయంలో టీటీడీ దేవస్థానం క్యాలెండర్ ప్రకారం శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి నేతృత్వంలో వివిధ రకాల హోమాలు, పూర్ణాహుతి నిర్వహించగా సుమారు 200 మందికి పైగా భక్తులు పాల్గొని, హనుమాన్ సేవలో తరించారు. హనుమంతునికి 108 కేజీల వివిధ రకాల ఫల, పుష్పాలు, వడమాల, తమలపాకు, వెన్న అలంకరించారు. అనంతరం అర్చన, అభిషేకాలు చేశారు. 108 భిన్నమైన శ్రావ్య రాగాలతో–హనుమాన్ చాలీసా పఠనం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి, శ్రీ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తీక్ టిఫిన్ సెంటర్ రవిచంద్రన్ మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్కిటెక్ట్ బీఎన్ గుప్త కుటుంబం, ఫార్మాసూటికల్ ఎండీ వి భాస్కరరావు పాల్గొనగా, శ్రీఆంధ్ర కళా స్రవంతి తరఫున కోశాధికారి జీవీ రమణ, ఇ. బాలాజీ, వీఎన్ హరినాథ్, సురేంద్ర, దామోదరన్ పాల్గొన్నారు. -
క్లాస్ మేట్తో గ్రాండ్ మాస్టర్స్ భాగస్వామ్యం...
సాక్షి, చైన్నె: చెస్ గ్రాండ్ మాస్టర్స్ ప్రజ్ఞానంద, వైశాలితో ప్రముఖ నోట్బుక్ల తయారీ సంస్థ క్లాస్మేట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతి విద్యార్థిలోనూ పదునైన ఆలోచనను ప్రేరేపించడానికి ఎడ్యుగేమ్ కోసం 30 నగరాల్లో ప్రచారం ప్రారంభించారు. విద్యార్థులు ప్రతిరోజూ ఎడ్యుగేమ్ ద్వారా ఇన్ఫినిటీ ఆడవచ్చని, ఇది ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్లతో క్లాస్మేట్ నోట్బుక్ల నుంచి ప్రసిద్ధ చివరి పేజీ పజిల్ను కలిగి ఉంటుందని ప్రకటించారు. గురువారం స్థానికంగా జరిగిన ఐటీసీ క్లాస్మేట్, విద్యతో ఆటను సజావుగా మిళితం చేసే వినూత్నమైన గేమిఫైడ్ నోట్బుక్ అయిన ఎడ్యుగేమ్ ఇన్ఫినిటీని విడుదల చేశారు. గ్రాండ్ మాస్టర్స్ దీనిని ఆవిష్కరించారు. ఇది అభ్యాసాన్ని ఆనందకర అనుభవంగా మార్చే లక్ష్యంతో ఒక ఆహ్లాదకరమైన, ఆకర్షణీయమైన చొరవను కలిగి ఉంటుందని, దీని ద్వారా హాంకాంగ్ డిస్నీల్యాండ్ను సందర్శించే అవకాశం లభిస్తుందన్నారు. ఇది జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్లాస్మేట్ నేతృత్వంలో మే 24 నుంచి 30 నగరాల్లో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులను క్లాస్మేట్ నోట్బుక్ కొని ఎడ్యుగేమ్స్ ఇన్ఫినిటీ ఆడే రీతిలో ఈ ప్రచారం సాగనుంది.చెస్ గ్రాండ్ మాస్టర్లు, ఆర్ ప్రజ్ఞానంద, ఆర్ వైశాలి 30 రోజుల పాటు ఎడ్యుగేమ్ ఇన్ఫినిటీలో లీనం కానున్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్లతో పాటుగా ఐటీసీ విద్య, స్టేషనరీ ఉత్పత్తుల విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ వికాస్ గుప్త, జీఎం అయాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
అబ్దుల్ కలామ్ బయోపిక్లో ధనుష్
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా చిత్రాల అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న అతి కొద్ది మంది నటుల్లో ధనుష్ ఒకరు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించే సత్తా కలిగిన నటుడు ధనుష్. ఈయన తన వయసుకు మించిన పాత్రల్లో నైనా నటించగలరని అసురన్, కెప్టెన్ మిల్లర్ చిత్రాలు నిరూపించాయి. కాగా ఆ మధ్య సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లో నటించడానికి సిద్ధం అయ్యారు. అయితే దానికి సంబంధించిన అప్ డేట్ ఇంకా రాలేదు. కాగా తాజాగా దివంగత ప్రఖ్యాత శాస్త్రవేత్త, పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అబ్దుల్ కలామ్ రాసిన అగ్ని సిరైగల్ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆదిపురుష్ చిత్రం ఫేమ్ ఓం రావత్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి కలామ్ మిసైల్ మెన్ ఆఫ్ ఇండియా అనే పేరును నిర్ణయించారు. ఇది కచ్చితంగా పాన్ వరల్డ్ చిత్రం అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని ఇంతకు ముందు కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అధినేత అభిషేక్ అగర్వాల్, టీ సిరీస్ సంస్థ అధినేత భూషణ్కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. దీని గురించి చిత్ర వర్గాలు కాస్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ప్రకటించారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది? ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం జూన్ నెల 20వ తేదీన తెరపైకి రానుంది. ఆ తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఒక హిందీ చిత్రంలో నటిస్తున్న ధనుష్ వెట్రిమారన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అబ్దుల్ కలాం బయోపిక్లో నటించే చిత్రం ఎప్పుడు సెట్ పైకి వెళ్లనుందన్న అంశం ఆసక్తిగా మారింది. -
సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలి
తమిళసినిమా: బిగ్బాస్ రియాల్టీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు ముగెన్ రావ్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్. భవ్య ట్రిఖా నాయకిగా నటించిన ఇందులో రాధారవి, బాలా శరవణన్, ఇమాన్ అన్నాచ్చి, నందు ఆనంద్, వడివుక్కరసి, నిళల్ గళ్ రవి, వినోదిని జార్జ్ విజయ్, రిత్విక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఫెయిరీ టేల్ పిక్చర్స్, ఏఆర్.టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి టీఆర్ బాలా దర్శక నిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు.వివేక్–మెర్విన్ లో ద్వయం సంగీతాన్ని అందించిన జిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఇందులో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, ఆర్ వీ.ఉదయ్ కుమార్,పేరరసు, జాగ్వర్ తంగం మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర ఆడియోను విడుదల చేసిన అనంతరం ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ ‘‘నిర్మాతల సంఘం సభ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మునిగిపోతున్న నావలా మారింది.సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి సంఘం నిర్వాహకులు కృషి చేయాలి. నిర్మాతలు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. కార్మికులకు పని ఉంటుందని భావించే వ్యక్తిని నేను. అయితే నిర్మాతల సంఘానికి చెందిన కొందరు స్వార్థపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలి. తాను తన కార్మికుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తాను. నా చర్యల్లో తప్పు ఉంటే ఈ వేదికపై ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత, పూర్వ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, పూర్వ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కేఆర్ ఉన్నారు. ఆయన చెబితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధం’’ అని అన్నారు. ఇకపోతే ‘‘జిన్ చిత్రం ట్రైలర్ బాగుంది.పొటలు ఇంకా బాగున్నాయి. చిత్ర దర్శక నిర్మాత టీఆర్.బాలాకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆర్కే.సెల్వమణి పేర్కొన్నారు. -
అయర్టన్ చెన్నాకు అజిత్ నివాళి
తమిళసినిమా: నటుడు అజిత్ ప్రస్తుతం కార్ రేస్లపై పూర్తిగా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. అలా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ఈయన ఇటీవల అంతర్జాతీయ స్థాయి కార్ రేసుల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. కార్ రేస్ అన్నది తను చిన్ననాటి కల అని ఇటీవల పేర్కొన్నారు. కాగా అజిత్ ఇటీవల బ్రెజిల్ దేశానికి చెందిన దివంగత ప్రఖ్యాత ఫొర్ములా 1 కారు రేస్ క్రీడాకారుడు అయర్టన్ చెన్నా స్మారక చిహ్నన్ని సందర్శించి ఆ శిలా విగ్రహం పాదాలను స్పృశించి అభివందనం చేశారు. అయర్టన్ చెన్నా 1988, 1990, 1991 ప్రాంతంలో ఫార్ములా 1 కార్ రేస్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించారు. అదేవిధంగా 1994లో శాన్ మరినో గ్రాండ్ ప్రియల్ విలియమ్స్ జట్టు కోసం ఆడి ప్రమాదవశాత్తు 34 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం బ్రెజిల్ లో పేద విద్యార్థుల విద్య కోసం చెన్నా పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశారు. -
టాస్మాక్ దుకాణం వద్దని వినతి
తిరువళ్లూరు: ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఏర్పాటు చేసిన టాస్మాక్ దుకాణాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ పీఎంకే నేతలు స్థానికులతో కలిసి కలెక్టర్ ప్రతాప్కు వినతిపత్రం సమర్పించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి యూనియన్ పట్టాభిరామపురం గ్రామంలో ప్రభుత్వ టాస్మాక్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సమీపంలో దుకాణం ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న క్రమంలో టాస్మాక్ దుకాణం ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. అయితే గురువారం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి దుకాణాన్ని ప్రారంభించారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్కు పీఎంకే నేతలతో కలిసి స్థానికులు వినతిపత్రం సమర్పించారు. టాస్మాక్ దుకాణాన్ని తొలగించకుంటే ఆందోళననూ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుత్తణిలో... తిరుత్తణి: తిరుత్తణి శివారు చైన్నె తిరుపతి జాతీయ రహదారి ప్రాంతం పట్టాభిరామాపురం పంచాయతీ పరిధిలో గొళ్లకుప్పం ప్రాంతంలోని టాస్మాక్ మద్యం షాపును కొత్తగా మార్చి ఉంచారు. అయితే తమ ప్రాంతంలో మద్యం షాపు ప్రారంభానికి అనుమతించబోమని పట్టాభిరామాపురం ప్రాంతం ప్రజలు రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈక్రమంలో గురువారం డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో 60 మంది పోలీసులు టాస్మాక్ దుకాణం వద్ద మొహరించారు. దీంతో అక్కడ హడావుడి చోటుచేసుకుంది. అనుమతి మీరి టాస్మాక్ దుకాణం వద్ద పోరాటం చేపడితే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికతో గ్రామీణులు పోరాటం నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
వ్యక్తి ఆత్మహత్య
అన్నానగర్: ఇద్దరు కుమారులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్న బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా అన్నపట్టి సమీపంలోని కుప్పండం పాళయం పంచాయతీ వన్నియార్ కోవిల్ మేడు ప్రాంతానికి చెందిన కపిల్ ఆనంద్ (41) డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య నదియా, హరి రంజిత్, విఘ్నేష్ అనే ఇద్దరు కుమారులున్నారు. తిరుచెంగోడ్ ప్రభుత్వ పురుషుల హయ్యర్ సెకండరీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న హరి రంజిత్, అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విఘ్నేష్ కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ప్లస్–2, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. కపిల్ ఆనంద్ తన ఇద్దరు కుమారులు పాస్ కాకపోవడంతో మనస్తాపంతో చెందుతూ వచ్చాడు. ఈ స్థితిలో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం కొరుక్కుపేట: సింగపూర్ నుంచి కోయంబత్తూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్లు విలువైన అధిక నాణ్యత గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి కోయంబత్తూరుకు వెళుతున్న విమానంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెనన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కోయంబత్తూరు విమానాశ్రయానికి వచ్చిన సింగపూర్ ప్రయాణికులను అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో, ఒక ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా అందులో దాదాపు 100 గ్రాముల హై–గ్రేడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేసి, గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా వచ్చాడని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 25 మందికి సాయం తిరువళ్లూరు: ఉలుందై పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్దులు వందశాతం ఉత్తీర్ణత సాధించిన క్రమంలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం 25 మందికి తన సొంత నిధులతో 2.50 లక్షల రూపాయలను పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఎంకే.రమేష్ అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందైలో ప్రభుత్వ హైస్కూల్ వుంది. ఇక్కడ ఇటీవల నిర్వహించిన పదవ తరగతి పరిక్షలకు పాఠశాల నుంచి 25 మంది హాజరుకాగా, వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం పది వేల రూపాయల చొప్పున 25 మందికి అందించాలని నిర్ణయించారు. కాగా గత ఐదు సంవత్సరాల కాలంలో 8 నుంచి పదవ తరగతి వరకు చదివిన విద్యార్దులకు ఉచిత సైకిల్, ఉచిత మెడికల్ క్యాంపులు, పాఠశాలకు అదనపు తరగతి గదిని సొంత నిధులతో రూ.40 లక్షలతో నిర్మాణం తదితర పలు సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. కాగా పదవ తరగతి విద్యార్దుల ఉన్నత విద్యకు పంచాయతీ మాజీ అధ్యక్షుడు చేసిన ఆర్థిక సాయంపై పలువురు అభినందించారు. అక్రమ ఇళ్ల కూల్చివేత కొరుక్కుపేట: అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడంతో 150 కుటుంబాల ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు అనకాపుత్తూరు అడయార్ నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేత బుధవారం ప్రారంభమైంది. ప్రజలు దీనిపై నిరసన తెలిపారు. రెవెన్యూ శాఖ, పోలీసుల సహాయంతో వారిని ఖాళీ చేయించి, ఆక్రమణలకు గురైన ఇళ్లను కూల్చివేసింది. నామ్ తమిళ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ బాధితులను కలిసి, తన సంఘీభావం తెలిపారు. గురువారం ఉదయం వరకు దాదాపు 150 కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి, తమ వస్తువులను తీసుకుని, కన్నీళ్లతో వెళ్లిపోయాయి. వారికి హౌసింగ్ బోర్డు అపార్ట్మెంట్లలో ఇళ్లు కేటాయించి, టోకెన్లు ఇచ్చారు. అడయార్ నది ఒడ్డున ఉన్న సుమారు 600 అక్రమ ఇళ్లను ఇప్పటికే సర్వే చేసి, వాటికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. -
తిరువళ్లూరులో ఆగిన ఎక్స్ప్రెస్ రైళ్లు
ప్రయాణికుల ఇక్కట్లు తిరువళ్లూరు: అరక్కోణం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో చైన్నె నుంచి అరక్కోణం మీదుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు ఎక్స్ప్రెస్, లోకల్ రైళ్లు దాదాపు రెండు గంటల పాటు తిరువళ్లూరు తదితర ప్రాంతాల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం రైల్వేస్టేషన్ నుంచి వాలాజ రోడ్డుకు గూడ్స్ రైలు గురువారం మద్యాహ్నం బయలుదేరింది. అరక్కోణం సమీపంలో వెళ్ళుతున్న సమయంలో ఇంజిన్ నుంచి మొదటి నాలుగు కార్లు పట్టాలు తప్పడంతో ప్రమాదం ఏర్పడింది. దీంతో చైన్నె నుంచి వేలూరు, తిరుపతి, తిరుత్తణి, అరక్కోణం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన లాల్బాగ్, హుబ్లీ, జోలార్పేట, గరుడాద్రితో పాటూ పలు రైళ్లను తిరువళ్లూరులో నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు గంటల తరువాత తిరువళ్లూరులో ఆగిన పలు రైళ్లను కొనసాగించారు. -
ఈడీ దూకుడుకు బ్రేక్
సాక్షి, చైన్నె: టాస్మాక్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. సోదాలు, విచారణలకు చెక్ పెడుతూ గురువారం స్టే విధించింది. అలాగే, ఈడీ తీరుపై న్యాయమూర్తులు అక్షింతలు వేశారు. వివరాలు.. చైన్నెలోని తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ప్రధాన కార్యాలయంలో మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలు, కొనుగోలు, టెండర్ల ప్రక్రియలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా, అధికారులు, సిబ్బందిని విచారణ, సోదాల పేరిట వేధిస్తున్నట్టు వాదనలు కోర్టుకు చేరాయి. సోదాల సమయంలో మహిళా అధికారిణులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారన్న టాస్మాక్ తరపున వాదన కేసులో కీలకంగా మారింది. అదే సమయంలో తొలుత ఓ బెంచ్, ఆతర్వాత మరో బెంచ్ కేసును విచారించడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయమూర్తులు ఎస్ఎం సుబ్రమణియన్, రాజశేఖరన్ బెంచ్ ఈడీకి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈడీ తరపు వాదనలను పరిగణించి, తదుపరి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దూకుడుతో సుప్రీంకోర్టుకు.. దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తున్నట్టు న్యాయమూర్తులు ప్రకటించారు. దీంతో ఈడీ దూకుడు పెంచింది. విచారణను వేగవంతం చేసింది. గత వారం చైన్నెలోని టాస్మాక్ డైరెక్టర్ విశాఖన్తో పాటూ పారిశ్రామిక వేత్తలు, డిప్యూటీ డైరెక్టర్లు, టాస్మాక్ అధికారులను ఈడీ టార్గెట్ చేసి సోదాలు విస్తృతంగా నిర్వహించింది. తమకు లభించిన ఆధారాలతో సంబంధిత అధికారులను విచారించే పనిలో పడింది. అదే సమయంలో ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈకేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నట్టు ఆది నుంచి డీఎంకే పాలకులు పేర్కొంటూ వచ్చారు. చివరకు ఈడీ దూకుడుకు కల్లెం వేయడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. టాస్మాక్లో రూ. 1000 కోట్ల స్కాం అన్నప్పుడు అస్సలు మూల కేసు ఎక్కడ? అని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనార్హం. ఈడీ అన్ని నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తుండడం స్పష్టమవుతోందని న్యాయమూర్తులు అక్షింతలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమైఖ్య పాలనను చిన్నా భిన్నం చేసే విధంగా ఈడీ చర్యలు ఉన్నట్టుందని అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఏకంగా ఓ సంస్థను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ, ఈడీ విచారణకు స్టే విధించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులతో తమిళనాడు ప్రభుత్వానికి మరో విజయం దక్కినట్లయ్యింది. విచారణపై స్టే.. అధికారుల తీరుపై ఆగ్రహం టాస్మాక్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఈడీకి చెంపపెట్టుగా అభివర్ణించిన డీఎంకే కూటమి రెండో విజయం.. ఇటీవల పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తమిళనాడుకు విజయాన్ని చేకూర్చింది. తాజాగా టాస్మాక్లో అక్రమాలు అంటూ సాగుతున్న పరిణామాలకు సుప్రీం కోర్టుచెక్ పె ట్టడంతో మరో విజయం దక్కినట్టైంది. ఈ ఉత్తర్వులు ఈడీకి చెంప పెట్టు అని డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టే ఈ ఉత్తర్వులను ఆహ్వానిస్తున్నామన్నారు. డీఎంకే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతూ వచ్చాయని ధ్వజమెత్తారు. సీపీఐ నేత ముత్తరసన్ పేర్కొంటూ, బీజేపీ ఆశలను, కోరికలను తీర్చే సంస్థగా ఈడీ మారి ఉందని ధ్వజమెత్తారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ రాజకీయ కక్ష సాధింపునకు అస్త్రంగా మారి ఉండడం సిగ్గు చేటు అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, ఈడీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రం సాగిస్తూ వస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఈ ఉత్తర్వులు ఒక చెంప పెట్టు అని సూచించారు. ఇదిలా ఉండగా వీసీల నియామకం వ్యవహారానికి సంబందించి చట్టంలోని సెక్షన్లకు స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు బెంచ్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు డీఎంకే పాలకులు సిద్ధమవుతున్నారు. -
కొలువు దీరిన ఆస్కా
● అధ్యక్షుడిగా శశిధర్రెడ్డి బాధ్యతల స్వీకరణ ●అప్పగించిన సుబ్బారెడ్డి ●ఆవేశంతో కాదు..ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచన సాక్షి, చైన్నె : ఎట్టకేలకు ఆస్కాకు కొత్త కార్యవర్గం కొలువు దీరింది. ఎన్నికలలో విజయ కేతనం ఎగుర వేసిన జీ శశిధర్రెడ్డి నాయకత్వంలోని ప్యానెల్ గురువారం బాధ్యతలను స్వీకరించింది. వీరికి పూర్వపు అధ్యక్షుడు సుబ్బారెడ్డి బాధ్యతలను అప్పగించారు. చైన్నె టీ నగర్లోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)కు ఎట్టకేలకు తొమ్మిదేళ్ల అనంతరం ఎన్నికల ద్వారా కొత్త కార్యవర్గం ఆదివారం ఎంపికై న విషయం తెలిసిందే. ఎం ప్రతాప్రెడ్డి సారధ్యంలోని ట్రెండ్ సెట్టర్స్ జట్టును ఓడించి జీ శశిధర్రెడ్డి సారధ్యంలో మెంబర్స్ వాయిస్ ఆస్కాను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. బాధ్యతల స్వీకరణ ఆస్కా గోదావరి హాల్లో గురువారం పూర్వపు అధ్యక్షుడు సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా శశిధర్రెడ్డి, కార్యదర్శిగా వడ్లమూడి దిలీప్కుమార్, ఉపాధ్యక్షుడిగా వై రాజేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా మాదాల వెంకట సుబ్బారావు, కోశాధికారిగా ఎల్ శాంతకుమార్, కల్చరల్ సెక్రటరీగా సినీ నటుడు భాను చందర్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా ఎం చలపతి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, రవిచంద్రన్, ఎస్కే దుర్గా ప్రసాద్, రమేష్రెడ్డి, టీ రాజేష్, జే. మదనగోపాల్ రావు, ఎస్పీ శ్రీనివాస్, ట్రస్టీలుగా కోటారెడ్డి వేమిరెడ్డి, వీ విజయేంద్రరావు, ఎం శ్రీనివాసరావు, పీ సంతోష్కుమార్, బీవీఎస్ కోటేశ్వరరావు, మనోహర్రెడ్డి, ఎన్ఎన్ భిక్షం, వీ బాలాజీ, వీ. ప్రశాంత్, ట్రెండ్ సెట్టర్స్ తరఫున పోటీ చేసి, సభ్యుడిగా గెలిచిన గోపాల్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు తన వద్ద ఉన్న ఆస్కా అధికారాలు, బాధ్యతల నుంచి సుబ్బారెడ్డి తప్పుకుని, కొత్త కార్యవర్గానికి అప్పగించారు. కొత్త కార్యవర్గాన్ని శాలువతో సత్కరించారు. తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, ఆస్కా సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త కమిటీని శాలువలు, పూల మాలలతో సత్కరించి అభినందించారు. ఆస్కా మాజీ అధ్యక్షుడు ఆదిశేషయ్య, మాజీ కోశాధికారి జేకే రెడ్డి, మాజీ సంయుక్త కార్యదర్శిగా కృష్ణ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ, జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, సంగీత దర్శకుడు సాలూరి వాసురావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కమిటీ హాల్లో జరిగిన తొలి సమావేశంలో ఆస్కా అభివృద్ధిపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆవేశంతో కాదు..ఆలోచనతో.. సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోర్టులో వ్యవహారం పెండింగ్లో ఉన్నప్పటికీ , ఎన్నికలు జరుగుతాయా లేదా..? అన్న సందిగ్ధం ఉన్నప్పటికీ, మెజారిటీ శాతం సభ్యులందరి అంగీకారం మేరకు ఎన్నికలను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. సమస్యలున్నా, అందరి సహకారం ఉందన్నారు. ఇన్నాళ్లు ఆస్కా గౌరవం, విలువలను కాపాడినట్టు పేర్కొంటూ, సమస్యలు వస్తే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆవేశంలో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దని, స్వయంకృతాపరాధం కారణంగా ఇప్పటికే పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆస్కా వెనుకబడినట్లు అయ్యిందన్నారు. అందరూ సమష్టిగా సోదర భావంతో ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. శశిధర్రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఇది పదవి కాదని, బాధ్యత అని, అందరి సహకారంతో కలిసి పనిచేస్తామన్నారు. భానుచందర్ మాట్లాడుతూ, అందరూ మెచ్చుకునేలా పనిచేసి చూపిస్తానని వ్యాఖ్యలు చేశారు. -
అమృత్ స్టేషన్లు
ఆధునిక హంగులతో..ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా మరింత సులభతరం చేస్తూ,రైలు సేవల విస్తృతం దిశగా ఇక్కడి స్టేషన్ను రూ. 8.27 కోట్ల తో మెరుగైన సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. పోలూరులో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాణి షణ్ముగం హాజరయ్యారు. తిరువణ్ణామలై పరిసరాలకు పోలూరు స్టేషన్ కీలకం కావడంతో రూ. 6.15 కోట్లతో ఆధునీకరించారు. చిదంబరంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ తిరుమావళవన్, ఎమ్మెల్యే సిందనై సెల్వన్ హాజరయ్యారు. ఆథ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన చిదంబరం నటరాజ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కుమరింత మెరుగైన సేవల దిశగా రూ. 5.96 కోట్లతో ఈ స్టేషన్ను ఆధునీకరించారు. విరుదాలం స్టేషన్ రూ. 9.17 కోట్లతో అప్ గ్రేడ్ చేసి ప్రారంభించారు. మన్నార్ కుడిలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ ఎస్ మురసోలి. మున్సిపల్ చైర్మన్ మన్నై టి. చోళరాజన్ హాజరయ్యారు. డెల్టా జిల్లాలో ప్రధాన ప్రాంతంగా మన్నార్కుడి స్టేషన్ను రూ. 4.69 కోట్లతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అలాగే, దక్షిణ రైల్వే పరిధిలోని పాలక్కాడు డివిజన్లో ఉన్న వడకరా , మాహే స్టేషన్లను కూడా ఆధునీకరించారు. మాహేలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్నాథన్, మాహే ఎమ్మెల్యే శ్రీ రమేష్ పరంబత్ హాజరయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి సేవలందిస్తున్న మాహే స్టేషన్ రూ 18.50 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు. ఇక, తిరువనంతపురం డివిజన్లోని చిరాయింకీజ్, కన్యాకుమారి జిల్లా కులితురై స్టేషన్లను కూడా ఆధునీకరించి ప్రారంభించారు. కులితురైలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తారగై, ఎంఆర్ గాంధి, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్లు హాజరయ్యారు. కేరళ – తమిళనాడు మధ్య ఉన్న కులితురై స్టేషన్ణు రూ. 5.96 కోట్లతో ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ అమత్ స్టేషన్లలో ప్రతి ఒక్కటి బహుళ–మోడల్ ఇంటిగ్రేషన్, ఆధునిక సౌకర్యాలు , ప్రాంతీయ సాంస్కృతి ప్రతిబంబించే విధంగా, మెరుగైన మౌలిక సదుపాయాల తో స్టేషన్ల అప్గ్రేడ్ ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా ప్రాంతీయ రవాణా నెట్వర్క్కు మరింత బలాన్ని చేకూర్చే విధంగా తీర్చిదిద్దారు. సాక్షి, చైన్నె: చైన్నె డివిజన్లో సెయింట్ థామస్ మౌంట్ స్టేషన్ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార – ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, తమిళనాడు ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల టిఎం అన్బరసన్, దక్షిణ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ కౌశల్ కిషోర్ , చైన్నె డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రతాప్ సింగ్, సాయుధ దళాల అధికారులు , పద్మ అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చైన్నె నగరంలో సబర్బన్, మెట్రో ప్రయాణికులకు సేవలు అందించే ఇంటర్ చేంజ్ హబ్గా రూ. 11.05 కోట్ల వ్యయంతో సెయింట్ థామస్ మౌంట్ను పునరాభివృద్ది చేసి ఆధునీకరించారు. ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, ఆధునిక సౌకార్యాలు కల్పించారు. సేలం డివిజన్ సామల్పట్టి స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ఎంపీ గోపీనాథ్, ఎమ్మెల్యే తమిళ్సెల్వం, సేలం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ పన్నాలాల్ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. సేలం–జోలార్పేటై లైన్లోని కనెక్టింగ్ స్టేషన్గా సామల్పట్టి స్టేషన్ను రూ. 8 కోట్లతో అభివృద్ధి చేశారు. తిరుచ్చి డివిజన్లో శ్రీరంగం, తిరువణ్ణామలై, పోలూర్, చిదంబరం, విరుదాచలం మన్నార్గుడి స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు.శ్రీరంగంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ దురై వైకో, ఎమ్మెల్యే పళనియండి , తిరుచ్చి డివిజనల్ రైల్వే మేనేజర్ ఎంఎస్ అన్బళగన్లు హాజరయ్యారు. రంగనాథస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు సేవలు అందించే విధంగా రూ. 6.77కోట్లతో శ్రీరంగం స్టేషన్ను అప్గ్రేడ్ చేశారు. తిరువణ్ణామలైలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ అన్నాదురై, కార్పొరేషన్ మేయర్ నిర్మల హజరయ్యారు. సేలంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానం తిరువణ్ణామలై స్టేషన్.. దక్షిణ రైల్వేలో 13 స్టేషన్ల పునరాభివృద్ధి సుందరంగా రూపుదిద్దుకున్న నిర్మాణాలు -
విజయ్ చిహ్నం కుస్తీ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల ద్వారా సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉన్న తమిళగ వెట్రి కళగంకు ప్రస్తుతం చిహ్నం ఎంపిక సమస్యగా మారి ఉంది. విజిల్ లేదా క్రికెట్బ్యాట్ను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతున్నాయి. తమిళగ వెట్రి కళగంతో ప్రజలలోకి చొచ్చుకెళ్లే దిశగా సినీ నటుడు విజయ్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ కార్యవర్గాలు, ఇతర రూపురేఖల నిర్మాణాలను పూర్తిచేశారు. మరి కొద్దిరోజులలో పూర్తిస్థాయిలో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చిహ్నంగా ప్రజలలోకి దేనిని తీసుకెళ్లాలో అన్న డైలమాలో నేతలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ పార్టీ కంటూ ఇరు వైపులా ఏనుగు, మధ్యలో పుష్పం అంటూ ఓ చిహ్నం ఉంది. అయితే, ఏనుగులను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఎస్పీ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ కేటాయించే చిహ్నాలలో ఏదో ఒక దానిని తమ పార్టీ ఎన్నికల గర్తుగా ఎంపిక చేసుకుని ప్రజలలోకి వెళ్లే దిశగా కసరత్తుపై విజయ్ దృష్టి పెట్టారు. ఎన్నికల కమిషన్ వద్ద ప్రస్తుతం ఏ పార్టీకి చెందకుండా విజిల్, క్రికెట్ బ్యాట్, మైక్, డైమండ్, రింగ్ ఉన్నట్టు తేలింది. ఇందులో విజిల్ను ఎంపిక చేసుకునే దిశగా పరిశీలన జరుగుతోంది. విజయ్ నటించిన బిగిల్చిత్రం అశేష ప్రేక్షకాదరణ పొంది ఉండడం గమనార్హం. అలాగే, క్రికెట్ బ్యాట్ను విజయ్ అనేక చిత్రాలలో ఉపయోగించిన నేపథ్యంలో ఈరెండింటిలో ఒకదాన్ని పార్టీ ఎన్నికల చిహ్నంగాఎంపిక చేసుకుని ప్రజలలోకి వెళ్లేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అదే సమయంలో 2026 ఎన్నికలలో 1,10,000 వేల ఓట్ల ఆధిక్యంతో విజయ్ విజయ ఢంకా మోగించడమే కాకుండా సంపూర్ణ ఆధిక్యంతో అధికార పగ్గాలు చేపట్టినట్టుగా రాష్ట్రంలో అనేక చోట్ల అభిమానులు పోస్టర్లను హోరెత్తించడం గమనార్హం. -
హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి. -
వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్ గాంధీకి తప్పిన ప్రమాదం
తిరువన్నామలై: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీకి ప్రమాదం తప్పింది. అరుణాచలం వెళ్లి తిరిగి వస్తుండగా కారు డివైడర్ను ఢీకొట్టింది. కొండా రాజీవ్ సహా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తిరువన్నామలై వద్ద ప్రమాదం జరిగింది.కొండా రాజీవ్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో పరామర్శించారు. తిరువణ్ణామలై వద్ద రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన కొండా రాజీవ్తో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజీవ్కి తగిన సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల సూచించారు. -
చనిపోయిన భార్యకు గుడి కట్టించిన భర్త
కొరుక్కుపేట(తమిళనాడు): అరియలూరుకి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ తన భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించి, పూజలు చేస్తున్నాడు. అరియలూర్కు చెందిన విజయకుమార్, కవిత అనే మహిళను 16 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వారి వివాహం తర్వాత, అతను కవితను కాలేజీకి తీసుకెళ్లి, చదివించాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, కవిత తన భర్త విజయకుమార్ను ‘ఆసియుమ్మ‘ (కోరిక) అని పిలుస్తూనే ఉంది. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పటికీ, వారి తల్లిదండ్రుల నుంచి కఠినమైన మాటలకు గురయ్యారు. ఒక సమయంలో ఆమె తన భర్త విజయకుమార్తో కలిసి తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లారు. 2022లో, తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన కవిత, కృత్రిమ గర్భధారణ శస్త్రచికిత్స చేయించుకుంటున్న సమయంలో ఔషధం అధిక మోతాదు కారణంగా మరణించింది. రోజులు గడిచే కొద్దీ, భార్యపై అతనికి ప్రేమ తగ్గలేదు. ఆమెతో గడిపిన రోజులను లెక్కించుకుంటూ జీవిస్తున్న విజయకుమార్, తన ప్రియమైన భార్యకు గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఇలంగేరి గ్రామంలో తన భార్య కవితకు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించాడు. నాలుగు రోజులకొకసారి, విజయకుమార్ పనికి వెళ్లే ముందు, ఆమెకు పూజలు చేస్తున్నాడు. విజయకుమార్ ను అతని అత్తమామలు, బంధువులు మళ్లీ వివాహం చేసుకోమని చెప్పినప్పటికీ, తన భార్య కవితతో తన జీవితం ముగిసిందని, కానీ ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని చెబుతాడు. ఆయన మాట్లాడుతూ కవిత తనతో చాలా ప్రేమగా ఉండేదన్నారు. ఆ అభిమానానికి అవధులు లేవన్నారు. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ, అది తమకు చాలా పెద్ద విషయం, తాము ఒకరికొకరు పిల్లలుగానే జీవించామని చెప్పారు. View this post on Instagram A post shared by Thanthi TV (@thanthitv) -
కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. సుప్రీంలో పిటిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 2024–2025 సంవత్సరానికి రూ.2,151 కోట్లకు పైగా నిధులను నిలిపేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020ని డీఎంకే ప్రభుత్వం అమలుచేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వ శిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. జాతీయ విద్యా విధానం అమలుతోనే నిధులు వస్తాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ నిధులను జాతీయ విద్యావిధానాన్ని అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ పెట్టిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం కేంద్ర నిధులపై పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. -
జమాబందిలోనే గ్రామీణ సమస్యల పరిష్కారం
వేలూరు: జమబందీల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని ఆరు తాలూకా కార్యాలయాల్లో బుధవారం ఉదయం వెళితే వినతి పత్రాలు స్వీకరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా గుడియాత్తం తాలూకా కార్యాలయంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు అధికంగా పింఛన్, ఇళ్ల పట్టాలు, బ్యాంకు రుణాల కోసం విన్నవించడంతో వాటిపై విచారణ జరిపి 15 రోజుల్లోపు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి వారం రోజులపాటు జమాబందీ కార్యక్రమం నిర్వహించడంతో తాలూకా కార్యాలయం ఎదుట అర్జీదారులు బార్లు తీరారు. ఆనకట్ట తాలూకా కార్యాలయంలో డీఆర్వో మాలతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తహసీల్దార్ వెండా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తిరువళ్లూరు: రైతుల కోసం కై వండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్లోని కై వండూరులో రైతుల కోసం ప్రత్యక్షంగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, కలెక్టర్ ప్రతాప్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగానే కై వండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజా సభ్యురాలు శివశంకరి, డీఎంకే ఉపకార్యదర్శి కాంచీపాడి శరవణన్, డీఎంకే ఎన్ఆర్ఐ వింగ్ జిల్లా కార్యదర్శి జైకృష్ణ, డీఎంకే యువజన విభాగం ఉప కార్యదర్శి మోతీలాల్, చిట్టిబాబు, కన్నదాసన్, తిరుత్తువరాజ్ పాల్గొన్నారు. -
యువత అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: యుక్తవయస్సులో యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా చిన్నపిల్లల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరై, ప్రసంగించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఆశ్రమాల్లో ఉన్న యువతీయువకులు, చిన్నారులు, విద్యార్థులకు శరీరంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. యుక్త వయస్సులో హార్మోన్ల ద్వారా వచ్చే మార్పుల ఫలితంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అయితే శరీరం, ఆలోచన విధానాన్ని అదుపులో వుంచుకోవాలని పిలుపునిచ్చారు. యుక్తవయస్సులో పౌష్టికాహారం తీసుకోకపోతే భవిషత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. -
నెలకు రూ.40 లక్షలు భరణం
● కోర్టులో నటుడు రవిమోహన్ పై భార్య పిటిషన్ తమిళసినిమా: పలు విజయవంతమైన చిత్రాలు చేసి ప్రముఖ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న జయంరవి. ఈయన 2009లో ఆర్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా వీరి సంసార జీవితంలో ముసలం పుట్టింది. కారణాలేమైనా విడిపోయారు. విడాకుల కోసం కోర్టుకెక్కారు . జయం రవి తన పేరును రవిమోహన్గా మార్చుకున్నారు. వీరి వ్యవహారం గత కొంత కాలంగా టీవీ.సీరియల్గా సాగుతోంది. భార్య ఆర్తితో తలెత్తిన విభేదాల కారణంగా నటుడు రవిమోహన్ ఇటీవల ఆమె నుంచి విడాకులు కోరుతూ చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్దానం ఇద్దరి మధ్య సామరస్య చర్చలతో పరిష్కారానికి పలు మార్లు అవకాశం కల్పించింది. అయితే చర్చలు సఫలం కాలేదు. తనకు విడాకులు కావాలని నటుడు రవిమోహన్ పట్టుబట్టారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. తన సంపాదనంతా ఆర్తి తన ఆడంబరాలకే ఖర్చు చేసిందని రవిమోహన్ ఆరోపిస్తే, తమ మధ్య విడాకులకు కారణం గాయని కనిష్కా ఫ్రాన్సిస్ అని, ఆమెతో తన భర్త కలిసి తిరుగుతున్నారని ఆర్తి విమర్శించారు. కాగా బుధవారం నటుడు రవిమోహన్, ఆర్తి విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భరణంగా రవిమోహన్ తనకు నెలకు 40 లక్షలు చెల్లించేవిధంగా ఆదేశించాలని కోరుతూ ఆర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె పిటిషన్పై బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తి రవిమోహన్కు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు. -
మా మధ్య విభేదాలు లేవు
● రాందాసు ● త్వరలో తైలాపురంకు అన్బుమణిసాక్షి, చైన్నె: అన్భుమణితో తనకు ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేవు అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. పీఎంకేలో అధ్యక్ష పదవీ వార్ తండ్రి రాందాసు , తనయుడు అన్బుమణి మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా తైలాపురం తోట్టంలో జరిగిన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నేతలు, వన్నియర్ సంఘాల నేతల భేటిని అన్బుమణి బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమావేశాలకు అన్బుమణితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. దీనిని రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు, త్వరలో అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త పీఎంకేలో మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాందాసు మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేవు అని స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టకు అన్బుమణి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు అన్ని సమసినట్టే అని వ్యాఖ్యలు చేశారు. రాందాసు తదుపరి అన్బుమణి పార్టీకి నాయకత్వం వహిస్తారని పేర్కొంటూ, త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వెళ్తారని స్పష్టం చేశారు. పీఎంకేలో అందరూ ఒక్కటేనని, అందరూ సమానంగానే, ఐక్యతతోనే ఉన్నారని, పార్టీలో కొన్ని సమస్యలు సహజమేనని, అవన్నీ సమసినట్టే అని వ్యాఖ్యానించారు. -
మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ
పళ్లిపట్టు: మహిషాసురమర్దిని అలంకరణలో కొళ్లాపురమ్మ కనువిందు చేశారు. పళ్లిపట్టు గంగజాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామ దేవత కొళ్లాపురమ్మకు మహిషాసురమర్దిని అలంకరణలో కొలువుదీర్చి, మేళతాళాలు, బాణసంచా సంబరాలు నడుమ పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం గంగమ్మ తల్లి గ్రామ వీధుల్లో ఊరేగి నడివీధిలో కొలువుదీరారు. మహిళలు కుంభం సమర్పించి దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు సందర్భంగా యువత విభిన్న వేషధారణలో పట్టణంలో సందడి చేశారు. అశేష జనవాహిని నడుమ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి కుశస్థలినదిలో నిమజ్జనం చేశారు. -
● కిడ్స్ గేమ్స్
మేడవాక్కంలోని నవీన్స్ స్టార్వుడ్ టవర్స్లో 6–13 సంవత్సరాల పిల్లల కోసం బుధవారం ఇంటరాక్టివ్ గేమ్, మాక్ టెయిల్స్, మ్యూజిక్ మార్క్ కిడ్స్ పూల్ పార్టీ కార్యాక్రమం జరిగింది. ఇందులో నవీన్స్ డైరెక్టర్ క్షీర్ వసుధకుమార్, సీఓఓ కల్యాణ రామన్తో పాటుగా పెద్ద సంఖ్యలో పిల్లలు ఇక్కడ జరిగిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. – సాక్షి, చైన్నె ● ఆవిష్కరణ ప్రోక్టాలజీ సంరక్షణలో స్పెక్ట్రా ఆస్పత్రిగా పురోగతిని సాధిస్తూ అపోలో స్పెక్ట్రా ఏర్పాటైంది. రాఫెలో ప్రొసీజర్తో హెమోరాయిడ్స్ కోసం అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేషివ్ రేడియే ఫ్రీక్వెన్నీ థెరపిని పరిచయం చేసింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కొలొరెక్టల్ సర్జన్ డాక్టర్ వాణి విజయ్, సినీ నటి పార్వతి నాయర్, ఏహెచ్ఎల్ఎల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆర్ నిశాంత్ మిశ్రా, మెడికల్ డైరెక్టర్ డాక్టర్విజయ్ అగర్వాల్ తదితరులు ఈ విధానం గురించి బ్రోచ్ర్ను ఆవిష్కరించారు. – సాక్షి, చైన్నె తిరుత్తణిలో రెండోరోజు జమాబందీ తిరుత్తణి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జమాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ ప్రతాప్ అందజేశారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి జమాబందీ శిబిరాలు ప్రారంభమైయ్యాయి. తిరుత్తణి తహసీల్దార్ కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన శిబిరంలో కృష్ణసముద్రం, మద్దూరు, సూర్యనగరం, సహా పది గ్రామాల నుంచి ప్రజలు పాల్గొని, అర్జీలు అందజేశారు. కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో వినతిపత్రాలపై విచారణ జరిపి, అర్హులైన పది మందికి ఉచితంగా ఇంటి పట్టాలు, కుల సర్టిఫికెట్లు, వృద్ధాప్య పింఛన్లు, పట్టా మార్పిడి సర్టిఫికెట్లు సంబంధించి ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేశారు. రెండో రోజు 268 మంది వినతిపత్రాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. 24 వరకు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉన్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్/కన్వీనర్ వి.శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ‘‘ఐటీఐ.ఏపీ.జీఓవి.ఇన్’’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను మే 26వ తేదీలోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో పరిశీలన చేయించుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94928 61369, 85000 21856, 94908 06942, 93989 62635 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
మృగరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్య వేణుగోపాలుడుగా ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరారు. ఉదయం సింహ వాహనంపై వేణుగోపాలుడు భక్తులను అనుగ్రహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు నరసింహ అవతారంలో స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలోని శ్రీవేణుగోపాలుడికి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో టీటీడీ బృందం గాత్ర కచేరితో కనులపండువగా ఊంజల్సేవ నిర్వహించారు, ఉభయ నాంచార్లుతో వేణుగోపాలుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీవేణుగోపాలుడు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి చిన్నారుల కోలాటాలు, మహిళల చెక్కభజనల, మంగళ వాయిద్యాలు, నడుమ అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో స్వామి వారిని పవళింప జేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అధికారి సురేష్కుమార్, షరాబ్ బాబు సురేష్, కంకణభట్టర్ తరుణ్కుమార్, వేద పండితులు నారాయణదాసరథి, గోపాలాచార్యులు, రమేష్, శభరీష్, అలంకార పండితులు మోహన్బట్టాచార్యులు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం కార్వేటినగరంలో జరుగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
మైక్రో ఇరిగేషన్ పరికరాలపై అవగాహన
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు మైక్రో ఇరిగేషన్ పరికరాలపై అవగాహన కల్పించే కార్యక్రమం బుధవారం జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటలో జరిగిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణేషన్ పాల్గొని, రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గణేషన్ మాట్లాడుతూ రైతులు మైక్రో ఇరిగేషన్ విధానంపై అవగాహన కలిగి ఉంటే, నీటిని ఆదా చేసుకోవడంతోపాటు సాగుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మైక్రో ఇరిగేషన్కు ఉపయోగించే వస్తువులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయకుమార్, ఇంజినీర్ రమేష్, హార్టికల్చర్ అధికారి మహేంద్రన్ పాల్గొన్నారు. -
దిశ కమిటీ రాష్ట్ర సభ్యుడిగా కరుణాకరన్
తిరువళ్లూరు: రాష్ట్ర దిశ కమిటీ సభ్యుడిగా తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మానిటరింగ్ చేయడానికి రాష్ట్రస్థాయిలో డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పని చేస్తోంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ క్రమంలో కమిటీకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సభ్యులుగా సిఫార్సు చేసింది. ఇందులో తిరువళ్లూరుకు చెందిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ కరుణాకరన్ పేరును ప్రకటించింది. కాగా దిశ కమిటిలో చోటు దక్కించుకున్న కరుణాకరన్కు కేంఽద్రమంత్రి ఎల్. మురుగన్, రాష్ట్ర అధ్యక్షుడు నాయినార్ నాగ్రేందన్ అభినందనలు తెలిపారు. -
పశ్చాత్తాపంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహుతి
సాక్షి, చైన్నె: మద్యం మత్తుతో తాను చేసిన ప్రమాదానికి పశ్చాత్తాపంతో చైన్నె తరమణిలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మాహతి చేసుకున్నాడు. వివరాలు.. తరమణి స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా సెంథిల్ పనిచేస్తున్నాడు. మంగళవారం గిండిసమీపంలోని మడువంకరై వంతెనపై కారు – మోటారు సైకిల్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సెంథిల్ కారణంగా విచారణలో తేలింది. మద్యం మత్తుతో అతి వేగంగా కారును నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో పెరుంగుడికి చెందిన మురుగన్ గాయపడ్డట్టు వెలుగు చూసింది. మత్తులో ఉన్న సెంథిల్ను ఆ పరిసర వాసులు చితక్కొట్టిన వీడియో సైతం వైరల్గా మారింది. తన మీద కేసు నమోదు కావడంతో తీవ్ర ఆందోళనకు సెంథిల్ గురయ్యాడు. అలాగే, మద్యం మత్తుతో తానుచేసిన ప్రమాదానికి పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ బుధవారం ఉదయం తరమణి ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్ వంతెన కింద ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. వంతెన కింద ఎవరో తగల బడుతున్నట్టు గుర్తించిన స్థానికలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సెంథిల్ సజీవ దహనం అయ్యాడు. సమాచారం అందుకున్న తరమణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న కారు ● ముగ్గురి దుర్మరణం సాక్షి, చైన్నె: అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ముగ్గురు మరణించారు. కన్యాకుమారి సమీంలోని సూరంకొడి గ్రామానికి చెందిన బాల ప్రభు, తన భార్య, రెండేళ్ల కుమార్తె, మామ కరుప్పు స్వామితో కారులో చైన్నెకు బయలు దేరారు. మార్గంమధ్యలో పాడలూరు వద్ద బుధవారం ఉదయం కారు అతి వేగం కారణంగా అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న చెట్టును ఢీ కొట్టి ఫల్టీలు కొట్టింది. ఈప్రమాదంతో అటు వైపుగా వెళుతున్న వాహనదారులు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో బాల ప్రభు, కరుప్పుస్వామి, రెండేళ్ల కుమార్తె మరణించారు. బాల ప్రభు సతీమణి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సలో ఉన్నారు. మాజీ మంత్రి బంధువు మృతి అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ బంధువు అరుణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేరళలోని మూనారు పర్యటనకు వెళ్లి శివకాశికి తిరుగు ప్రయాణంలో ఉన్న ఆయన కారు మార్గంమధ్యలోని బోడి సమీపంలో అదుపు తప్పింది. ఘటనా స్థలంలోనే అ రు ణ్ మరణించారు. అరుణ్ మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ మేన కోడలి భర్త కావడంతో ఆయ న కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. త్యాగ భూమిలో కాంగ్రెస్ నేతల నివాళి సాక్షి, చైన్నె: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశంగా శ్రీపెరంబదూరులోని త్యాగ భూమిలో కాంగ్రెస్ నేతలు బుధవారం ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధి 34వ వర్ధంతి సందర్భంగా అక్కడున్న ఆయన విగ్రహానికి, చిత్ర పటానికి నేతలు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుతొంగై నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలు తరలి వచ్చినివాళులర్పించారు. అనంతరం ఉగ్ర వాదాన్ని తరిమి కొట్టడం లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలోనూ రాజీవ్ చిత్ర పటానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దామని, అమర వీరుల కలలను సాకారం చేద్దామని వ్యాఖ్యలు చేశారు. కౌన్సిలర్ శారద డీఎంకే నుంచి బహిష్కరణ స్టాలిన్ ఆదేశాలు కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ 65వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు శారద. ఆమె కొళత్తూర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చైన్నె తూర్పు జిల్లా డీఎంకే సభ్యులు. ఆమైపె పార్టీ నాయకత్వానికి వివిధ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల అసంతృప్తికి కారణమైన ఈమెకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా ఆమె ధోరణిలో మార్పు లేదు. దీంతో ఆమైపె చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ఆదేశించారు. శారదను పార్టీ నుంచి బహిష్కరించారు. దీనికి సంబంధించి డీఎంకే జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ఓ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. శారద పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని, పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నందున ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవుల నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
హిట్ కాంబో రిపీట్?
తమిళసినిమా: ఒక సూపర్హిట్ చిత్రం తరువాత మళ్లీ అదే కాంబినేషన్లో చిత్రం వస్తుందంటే కచ్చితంగా ఆ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కాంబో రిపీట్ కానుందనేది తాజా సమాచారం. ఇటీవల ఏ పత్రికలో చూసినా, సామాజిక మాధ్యమాల్లో చూసినా నటుడు విశాల్ పెళ్లి వార్తలే. ఆయన నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త ప్రత్యేకంగా మారింది. కాగా ఇప్పుడు విశాల్ తదుపరి చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విశాల్, దర్శకుడు సుందర్.సీ దర్శకత్వంలో రూపొందిన మదగజరాజా చిత్రం 12 ఏళ్ల తరువాత సమీప కాలంలో తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ సుందర్.సీ దర్శకత్వంలో నటించనున్నట్లు విశాల్ ప్రకటించారు. అదే సమయంలో తన స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాలేదు. కాగా తాజాగా విశాల్ తాజా చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కాంబోలో ఇంతకు ముందు ఇరుంబుతిరై అనే సూపర్హిట్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మంచనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇటీవల అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా విశాల్, దర్శకుడు పీఎస్.మిత్రన్ ల కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
ధనుష్, వెట్రిమారన్ కాంబోలో మరోచిత్రం
తమిళసినిమా: నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్లది సూపర్హిట్ కాంబినేషన్ అన్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇంతకు ముందు పొల్లాదవన్, ఆడుగళం, వడచెన్న, అసురన్ మొదలగు సక్సెస్పుల్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. కాగా తాజాగా మరో చిత్రానికి ఈ కాంబో సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం నటుడు సూర్య హీరోగా వాడివాసల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. జల్లికట్టు క్రీడ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నారు. దీని తరువాత ధనుష్ హీరోగా నటించే చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇది వడచైన్నెకి సీక్వెల్నా లేక వేరే కథా చిత్రమా అన్నది వేచి చూడాలి. విశేషం ఏమిటంటే ఈయన ఇప్పటికే ధనుష్ హీరోగా రెండు చిత్రాలను నిర్మించనున్నారు. అందులో ఒక చిత్రానికి విఘ్నేశ్ రాజా, మరో చిత్రానికి మారిసెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. కాగా నటుడు ధనుష్ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థలో మూడు చిత్రాలు కమిట్ అయ్యారన్నమాట. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాఽశం ఉంది. -
వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ గాంధీ వర్ధంతి
వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు, వేసి నివాళులర్పించారు. అలాగే వేలూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్బాషా అధ్యక్షతన రాజీవ్ చిత్ర పటాన్ని ఉంచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాహీద్బాషా మాట్లాడుతూ రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. నిరుపేద ప్రజలకు అవసరమైన పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. దేశంలో తీవ్ర వాద శక్తులు లేకుండా చేసేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, జిల్లా మాజీ అధ్యక్షుడు కదిర్వేలన్, మాజీ కౌన్సిలర్ కోదండపాణి, మూడో డివిజన్ అధ్యక్షుడు రఘు, ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్, జానకీరామన్, జీకే మోహన్, కప్పల్మణి, కోణి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరుపత్తూరు,రాణిపేట,తిరువణ్ణామలై జిల్లాల్లో తీవ్ర వాదానికి వ్యతిరేకంగా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. -
సెప్టెంబర్లో సెట్పైకి గాడ్ ఆఫ్ లవ్
తమిళసినిమా: సంచలన నటుడు శింబు తన చిత్రాల విషయంలో స్వీడ్ పెంచారు. ఈయన కమలహాసన్తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్లైఫ్ చిత్రం జూన్ 5న తెరపైకి రానుంది. ఇది ఆయన నటించిన 48వ చిత్రం. కాగా శింబు తన 49,50,51వ చిత్రాలను ఇటీవల ప్రకటించారు. అందులో 49వ చిత్రాన్ని పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటి కయాదు లోహర్ నాయకిగా నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. అదేవిధంగా 50వ చిత్రానికి దేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. కాగా శింబు నటించనున్న 51వ చిత్రానికి ఒమై కడవులే, డ్రాగన్ చిత్రాల ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. దీనికి గాడ్ ఆఫ్ లైవ్ అనే టైటిల్ను నిర్ణయించారు.ఈ చిత్రం గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్జన కల్పాత్తి పేర్కొంటూ శింబు హీరోగా చేస్తున్న చిత్రం చాలా పెద్ద బడ్జెట్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర కథే చాలా ఆసక్తిగా ఉంటుందన్నారు. ఇది శింబు అభిమానులకు చాలా సంతృప్తిని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో నటించే కథానాయకిని ఎంపిక చేసినట్లు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు. దీంతో ఈ చిత్ర వివరాల కోసం శింబు అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శింబుతో దర్శకుడు అశ్వద్ మారిముత్తు -
ఒకే ట్రాక్లో రెండు ఈవీఎంలు
సాక్షి, చైన్నె: చైన్నెలో సాగే ఎలక్ట్రిక్ రైలు సేవలకు అర గంటకు పైగా అంతరాయం బుధవారం ఏర్పడింది. ఇందుకు కారణం ఒకేట్రాక్పై రెండు రైళ్లు ఆగటమే. ఈ ఘటన కాసేపు కలకలం రేపినా ఆతర్వాత రైలు సేవలను పునరుద్దరించారు. చైన్నె తాంబరం నుంచి బీచ్ వైపుగా ఉదయం సుమారు 8.40 గంటలకు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఈ రైలు పల్లావరం స్టేషన్కు 5.50 గంటల సమయంలో చేరుకుంది. ఈ రైలు ఒకట వ నెంబరు ప్లాట్ పాం నుంచి బయలు దేరే సమయంలో హఠాత్తుగా ఓ బోగి వద్ద పొగ రావడాన్ని డ్రైవర్గుర్తించి ఆపేశాడు. అదే సమయంలో ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్లోకి మరో రైలు వెనుకే రావడంతో ఉత్కంఠ నెలకొంది. తక్షణం ఆ రైలును కూత వేటు దూరంలో ఆపేశారు. ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ఆగడంతోకలకలం రేగింది. హఠాత్తుగా రైళ్లు ఆగడంతో ఉదయాన్నే పనుల నిమిత్తం వెళ్లే వారికి ఇబ్బందులు తప్పలేదు. ముందుగా వెళ్తున్న రైలు బ్రేక్ షడన్గా వేయడం వల్లే పొగ వచ్చినట్టు భావించారు. దీంతో ఆ రైలులలో ఉన్నవారందర్నీ దించేశారు. ఆరైలును తాంబరం యార్డ్కు పంపించారు. ఈ ప్రక్రియ కారణంగా తాంబరం టూ బీచ్ మధ్య అర గంట పాటుగా సేవలకు ఆటంకం తప్పలేదు. పల్లావరం వద్ద పొగ కలకలం -
5 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనకు ఇకపై జరిమానా
సాక్షి, చైన్నె: మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించక పోవడం వంటి ఐదురకాల ఉల్లంఘనలకు ప్రాధాన్యత ఇస్తూ ఇక చైన్నెలో జరీమానాల వడ్డనకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బుధవారం గ్రేటర్ చైన్నె పోలీసు కమిషనర్ అరుణ్ జారీ చేశారు. వివరాలు.. చైన్నె నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పీక్ అవర్స్లలో కూడా ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ పోలీసులు వాహన దారుల భరతం పట్టేవిధంగా ముందుకెళ్తున్నారు.. తమ వద్ద ఉన్న మొబైల్ పోన్ తరహా ప్రత్యేక పరికరం ఆధారంగా పట్టుబడే వారికి జరిమానా విధిస్తూ , తక్షణం రశీదులను అందజేస్తూ వస్తున్నారు. అలాగే చైన్నె నగరంలోని ప్రధాన మార్గాలలో ఉన్న కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారి భరతం పడుతున్నారు. ఎవ్వరెవ్వరూ నిబంధనలు ఉల్లంఘిస్తారో వారి మొబైల్ నంబర్లకు ఆటోమెటిక్గా జరిమాన సమాచారాలు వెళ్తుంటాయి. జరిమానాలను ట్రాఫిక్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్ల వద్దకు వెళ్లి కట్టాల్సిన పరిస్థితి. అయితే, అనేక మంది తమకు జరిమానా కెమెరాల ద్వారా పడ్డా,వాటిని ఖాతరు చేయడం లేదు. జరీమాన కట్టేందుకు ముందుకు రావడం లేదు. అదే సమయంలో పోలీసులు ఇష్టానుసారంగా కెమెరాల ఆధారంగా, తమ వద్ద ఉన్న స్కానర్ల ద్వారా జరిమానాలను విధించి సమాచారాలను ఎస్ఎంఎస్ ద్వారా పంపించేస్తున్నారన్న విమర్శలు బయలుదేరాయి. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఇక, స్పాట్ ఫైన్ జరీమానల విధించే ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపే వారు, హెల్మెట్ లేకుండా వాహనంనడిపేవాళ్లు, త్రిబుల్స్ రైడింగ్,అతి వేగం వంటి ఐదు రకాల నిబంధనల ఉల్లంఘనకు ప్రాధాన్యత ఇస్తూ ఇక, జరీమాన వడ్డన మోగనున్నది. సీటు బెల్టూ ధరించక పోవడం, సెల్ పోన్ డ్రైవింగ్లకు నిఘా నేత్రాల ద్వారా జరీమాన వడ్డన మోగనుంది. అయితే, సిగ్నల్స్ గిర్ర కాస్తదాటి వచ్చినా, ఇతర నిబంధనలకు జరిమాన నుంచి కాస్త ఉపశమనం కలగనున్నది. అయితే పైనపేర్కొన్న ఐదు నిబంధనలు ఉల్లంఘించే వారే చైన్నె నగరంలో అత్యధికంగా ఉండటం గమనార్హం. -
పాదాలకు చెక్క కర్రలతో చెన్నిమలై మురుగన్ దర్శనం
సేలం: ఈరోడ్లోని ఉజవాన్ కలైకుగు అనే సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలురు, బాలికలు చెన్నిమలై మురుగన్ ఆలయంలోని 1,320 మెట్లను ఎక్కి కొండ ఆలయానికి చేరుకున్నారు, వారి పాదాలకు 2 అడుగుల పొడవైన చెక్క కరల్రు కట్టుకున్నారు. తరువాత అక్కడి నుంచి మెట్ల ద్వారా బేస్ కు తిరిగి వచ్చారు. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వల్లి గుమ్మి నృత్యం, సాలంగై యాట్టం, పెరుంజలంగై యాట్టం వంటి కళా ప్రదర్శనలలో కాళ్లను తాళ్లతో కట్టి పాల్గొనేలా శిక్షణ అందిస్తున్నామని కళా బృందం నిర్వాహకులు తెలిపారు. చెన్నిమలై మెట్లు ఎక్కిన అబ్బాయిలు, అమ్మాయిలను కాళ్లుకు కట్టి, మెట్ల గుండా వెళుతున్న భక్తులు ఆసక్తిగా గమనించారు. -
పది విమానాల సేవల రద్దు
సాక్షి, చైన్నె : చైన్నె నుంచి కొచ్చి, హైదరాబాద్, ఢిల్లీ, పుణె తదితర ప్రాంతాలకు బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి వరకు బయలు దేరాల్సిన పది విమానాల సేవలను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సేవలను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్వహణా కారణాలతోనే వీటి సేవలను రద్దు చేసినట్టు విమానాశ్రయ వర్గాలు పేర్కొంటున్నాయి. రద్దయిన విమానాలలో చైన్నె నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ బయలు దేరాల్సిన విమానం, రాత్రి 8.35కు కొచ్చి బయలు దేరాల్సిన విమానం, 9.20కు పుణె బయలు దేరాల్సిన విమానం, 9.45కు ఢిల్లీ, 9.50కు హైదరాబాద్ బయలు దేరాల్సిన విమానాలు ఉండటం గమనార్హం. రద్దయిన విమానాలలో ఏర్పాట్లు చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. -
మా మధ్య విభేదాలు లేవు
● రాందాసు ● త్వరలో తైలాపురంకు అన్బుమణిసాక్షి, చైన్నె: అన్భుమణితో తనకు ఎలాంటి విభేదాలు, విద్వేషాలు లేవు అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. పీఎంకేలో అధ్యక్ష పదవీ వార్ తండ్రి రాందాసు , తనయుడు అన్బుమణి మధ్య చిచ్చు రగిల్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా తైలాపురం తోట్టంలో జరిగిన పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, యువజన నేతలు, వన్నియర్ సంఘాల నేతల భేటిని అన్బుమణి బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమావేశాలకు అన్బుమణితో పాటుగా ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. దీనిని రాందాసు తీవ్రంగా పరిగణించినట్టు, త్వరలో అన్బుమణిని పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇది కాస్త పీఎంకేలో మరింత గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం రాందాసు మీడియా ముందుకు వచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు, విద్వేషాలు లేవు అని స్పష్టం చేశారు. త్వరలో తైలాపురం తోట్టకు అన్బుమణి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్టీ గౌరవ అధ్యక్షుడు జీకేమణి మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులు అన్ని సమసినట్టే అని వ్యాఖ్యలు చేశారు. రాందాసు తదుపరి అన్బుమణి పార్టీకి నాయకత్వం వహిస్తారని పేర్కొంటూ, త్వరలో తైలాపురం తోట్టంకు అన్బుమణి వెళ్తారని స్పష్టం చేశారు. పీఎంకేలో అందరూ ఒక్కటేనని, అందరూ సమానంగానే, ఐక్యతతోనే ఉన్నారని, పార్టీలో కొన్ని సమస్యలు సహజమేనని, అవన్నీ సమసినట్టే అని వ్యాఖ్యానించారు. -
రుక్మిణి వసంత్కు లక్కీఛాన్స్
తమిళసినిమా: లక్కు ఉంటే అవకాశాల కిక్కే వేరు. కొందరు అవకాశాల కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి కొందరికి ఒక్క హిట్ వస్తే ఆ తరువాత అవకాశాలు వరుస కడుతుంటాయి. ఇక్కడ నటి రుక్మిణి వసంత్ కథే వేరు. ఈ కన్నడ భామ తమిళంలో నటించిన ఒక్క చిత్రం కూడా ఇంకా తెరపైకి రాలేదు. అదేంటో వరుసగా క్రేజీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈమె శివకార్తీకేయన్కు జంటగా నటిస్తున్న మదరాశీ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే అంతకంటే ముందు విజయ్ సేతుపతి సరసన నటించిన ఏస్ చిత్రం ఈ నెల 23వ తేదీన తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ అవకాశం వరించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీఛాన్స్. నటుడు కమలహాసన్ కథానాయకుడిగా శింబు, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన థగ్లైఫ్ చిత్రాన్ని మణిరత్నం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో మణిరత్నం కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం చాలా రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ద్విభాషా(తమిళం, తెలుగు) చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే సాయిపల్లవి విషయం ఏమైందో గానీ ఇప్పుడు ఈ చిత్రంలో నటించే అదృష్టం నటి రుక్మిణి వసంత్ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. కాగా కమలహాసన్, శింబు, త్రిషలో భారీ గ్యాంగ్స్టర్స్ కథా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తదుపరి ఫ్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఈ అమ్మడు తెలుగులోనూ క్రేజీ అవకాశాలను అందుకుంటున్నారు. ఇప్పటికే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్తో జత కట్టే లక్కీఛాన్స్ను అందుకున్నట్లు తెలిసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిని చుట్టేస్తున్నారన్నమాట.నటి రుక్మిణి వసంత్ -
మళ్లీ పెరగనున్న వేడి!
● వారం పాటు సాధారణంగానే వానలు సాక్షి, చైన్నె: రాష్ట్రంలో వాతావరణంలో మళ్లీ మార్పు చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం పుణ్యమాని గాలిలో తేమ తగ్గి మళ్లీ భానుడి ప్రతాపం పెరగనుంది. వారం రోజుల పాటు అక్కడక్కడ సాధారణం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు అండమాన్ తీరాన్ని తాకినానంతరం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చెదరు మదురుగా, మరికొన్ని జిల్లాలో అనేక చోట్ల భారీ గా వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కోయంబత్తూరు, నీలగిరి, వేలూరు, రాణిపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరుగా వర్షం కురిసింది. రాణిపేట జిల్లా ఆర్కాడులో అత్యధికంగా 14 సెంటీమీటర్ల, అరక్కోణంలో 12 సె.మీ., వేలూరు జిల్లా పరిధిలోని అనైకట్టులో 10 సె.మీ వర్షం పడింది. చైన్నె శివారులో తేలిక పాటి వర్షం కురిసింది. వర్షాలు ఇంకా కొనసాగుతాయని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందుగా ప్రకటించింది. అయితే, అరేబియా సముద్రంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఇది వాయుగుండంగా, ఆ తర్వాత తుపాన్గా మారే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడి గాలిలో తేమ తగ్గనుంది. ఈ కారణంగా రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగానే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే, నీలగిరి, కోయంబత్తూరు, కృష్ణగిరి, ధర్మపురితోపాటుగా పశ్చిమ కనుమల వెంబడి జిల్లాలో మోస్తరుగా వర్షం, ఇతర ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అరేబియా సముద్రంలో నెలకొనే అల్పపీడనం ప్రయాణించే మార్గం ఆధారంగా పరిస్థితులు మారవచ్చని పేర్కొనడం గమనార్హం. -
విస్తృతంగా తోళి!
● 38.15 కోట్లతో 3 చోట్ల నిర్మాణాలు పూర్తి ● మరో 14 చోట్ల రూ.176 కోట్లతో పనులు ● సీఎం శంకుస్థాపన వర్కింగ్ ఉమెన్స్ కోసం తోళి (ఫ్రెండ్స్ హాస్టల్ ) హాస్టళ్ల నిర్మాణాలను ప్రభుత్వం వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. రూ. 38.15 కోట్లతో పరింగిమలై, హోసూరు, తిరువణ్ణామలైలలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న తోళి హాస్టళ్లను బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. మరో 14 చోట్ల రూ. 176 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం మహిళలకు పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం, నెలకు రూ. 1000 నగదు పంపిణి నిమిత్తం కలైంజ్ఞర్ మగళీర్ ఉరిమై తిట్టం, విద్యార్ధినులకు నెలకు రూ. 1000 ఉన్నత విద్యా ప్రోత్సాహం వంటి పథకాలు విస్తృతంగా అమల్లో ఉన్నాయి. అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి చైన్నెతో పాటుగా పలు నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు, యువతులకు భద్రత పరంగా , అన్ని రకాల వసతులతో సురక్షితంగా, తక్కువ అద్దెతో బస కల్పించే విధంగా తోళి (ఫ్రెండ్ హాస్టల్స్) నిర్మాణాలను సాంఘీక సంక్షేమం, మహిళా శాఖ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చైన్నె, తిరువళ్లూరు, కోయంబత్తూరు. చెంగల్పట్టు, తిరుచ్చి, తంజావూరు, వేలూరు, సేలం, విల్లుపురం, తిరునెల్వేలి, పెరంబలూరు, పుదుక్కోట్టై, తూత్తుకుడి సహా 13 జిల్లాలలో 14 హాస్టళ్లను నిర్మించారు. ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న మహిళలు, యువతులకు ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు సురక్షితంగా మారాయి. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉండటంతో ఆదరణ పెరిగింది. మరింతగా నిర్మాణాలు ఫ్రెండ్స్ హాస్టళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతుండటంతో మహిళకు మరింత సహకారం అందించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వ నేతృత్వంలో మరింతగా నిర్మాణాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అదనంగా చైన్నె – పరింగిమలై, హోసూరు, తిరువణ్ణామలైలో 38 కోట్ల 15 లక్షలతో 442 పడకలతో 3 కొత్త హాస్టళ్లు నిర్మించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వీటిని సచివాలయం నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, చైన్నె తరమణి, చేపాక్, మధురై, కోయంబత్తూర్, నాగపట్నం, కృష్ణగిరి, ఈరోడ్, కాంచీపురం, కడలూరు, ధర్మపురి, తేని, శివగంగై, రాణిపేట, కరూర్ లలో రూ. 176.93 కోట్లతో 2 వేల పడకలతో 14 హాస్టళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ హాస్టళ్లలో బయోమెట్రిక్ ఎంట్రీ, 24 గంటల భద్రత, వై–ఫై సౌకర్యం, సీసీటీవీ ద్వారా నిఘా, శుద్ధి చేసిన తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం, టెలివిజన్, వేడి నీటి సౌకర్యం, వాషింగ్ మెషిన్, ఇసీ్త్ర సౌకర్యం, పార్కింగ్ వంటి సౌకర్యాలు తక్కువ అద్దెకు వర్కింగ్ ఉమెన్స్కు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ మహిళా హక్కుల శాఖ మంత్రి గీతా జీవన్, ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కుల శాఖ కార్యదర్శి జయశ్రీ మురళీధరన్, అదనపు కార్యదర్శి , తోళి ఎండీ ఎస్.వలర్మతి తదితర అధికారులు పాల్గొన్నారు.ఆర్థిక హక్కుల కోసం ఢిల్లీ వెళ్తున్నా... ఢిల్లీలో ఈనెల 24వ తేదీన నీతి ఆయోగ్ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనాలని ఈసారి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీనిపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొన్ని ప్రశ్నలు సంధించారు. టాస్మాక్ అక్రమాలలో తన వాళ్లను రక్షించుకునేందుకే ఈసారి ఢిల్లీ పర్యటనకు సీఎం వెళ్తున్నారని ఆరోపించారు. అలాగే ఈ అక్రమాలలో ఆ తమ్ముడు ఎవరో? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా సీఎం స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడుకు న్యాయపరంగా దక్కాల్సిన నిధులు, ఆర్థిక హక్కులను రక్షించుకునేందుకే తాను వెళ్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. శశికళ నుంచి అమిత్ షా వరకు బల్ల కింద కాళ్లు పట్టుకునే అలవాటు ఉన్న ప్రతి పక్ష నేతకు తన ఢిల్లీ పర్యటన మీద ఎందుకు అంత ఈర్ష్య అని ప్రశ్నించారు. పులిలా గర్జించిన పులికేసి , చివరకు ఒక్క దండయాత్రతో పిల్లలా మారి తెల్ల జెండాను పట్టిన పళణి స్వామి తన ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీతో పొత్తే లేదంటూ వీరావేశంతో వ్యాఖ్యలు చేసి , చివరకు తమరు ఏం చేశారో అందరికి తెలుసు అని చురకలంటించారు. కారుణ్య నియామకాలు అనంతరం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాలకు చెందిన వారసులు 115 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులను సీఎం అందజేశారు. ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్, పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్ట్ వంటి పోస్టులు ఇందులో ఉన్నారు. మరణించిన పోలీసు అధికారుల వారసులు 1,132 మంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుంచి 41 పోలీసు అసిస్టెంట్ సూపరింటెండెంట్, 444 మంది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు, 16,199 మంది గ్రేడ్ 2 కానిస్టేబుళ్లు, 472 మంది అసిస్టెంట్లు, 215 మంది జూనియర్ అసిస్టెంట్లు, 42 టైపిస్టుల పోస్టులు, 42 షార్ట్ హ్యాండ్ టైపిస్టుల పోస్టులు అంటూ మొత్తంగా 17,436 మందికి నియామక ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసినట్టు ఈసందర్భంగా సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురుగానందం, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్, డీజీపీ శంకర్ జివాల్, పోలీస్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ వినీత్ దేవ్ వాంఖడే, పోలీసు సూపరింటెండెంట్ (సంక్షేమం) సత్యప్రియ పాల్గొన్నారు. -
అపోలో ఆస్పత్రిలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్
సాక్షి, చైన్నె: కీళ్లు సంరక్షణకు చైన్నెలోని అపోలో ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసింది. కొత్తగా అపోలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్టు ఆ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోఫెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ కన్నన్ తెలిపారు. స్థానికంగా మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు పురుషుల క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ ఎంఎం సెంథిల్ నాథన్ పాల్గొని చైన్నెలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అరుణ్ కన్నన్ మాట్లాడుతూ ఆర్థోపెడిక్ కేర్లో గణనీయమైన మార్పును సూచించే సమగ్రమైన జాయింట్ ఫ్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమం రోగులు కీళ్ల పనితీరును నిర్వహించడానికి, అనవసరమైన శస్త్రచికిత్సలను నివారించడానికి , చురుకై న జీవితాలను కొనసాగించడానికి సహాయపడడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కీళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే నాన్–ఇన్వాసివ్ , మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్సలను ముందుకు తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుందన్నారు. అనంతరం తమిళనాడు పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ సెంథిల్ నాథన్ మాట్లాడుతూ, క్రికెట్ ఆటగాళ్ల నుంచి వారి దైనందిన జీవితాన్ని గడిపే సాధారణ వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన కీళ్లు చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో చైన్నెలోని అపోలో హాస్పిటల్స్ కిచెందిన సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, డాక్టర్ ఎన్. చిదంబరనాథన్, డాక్టర్ నవలాడి శంకర్, డాక్టర్ కె.పి. కోసిగన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు
వేలూరు: జిల్లాలో కరోనా వ్యాపించకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం వేలూరు తొర్రపాడిలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో రూ.2.33 కోట్ల వ్యయంతో తరగతి గదుల నిర్మాణం కోసం సీఎం స్టాలిన్ చైన్నె సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. దీంతో కలెక్టర్ సుబ్బలక్ష్మి వేలూరులో పూజలు చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్షించి, డెంగీ, మలేరియా, తదితర వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బందితో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కరోనా వ్యాపిస్తుందని సమాచారం వచ్చిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం వద్ద నుంచి ఇంత వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని, వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని వైద్యాధికారులతో సంప్రదించి, నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున పంటలు, వంకలు, వాగులు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత అఽధికారులతో సమీక్షించి, అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, అధికారులు పాల్గొన్నారు. -
షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ..
స్పృహతప్పి పడి ఆర్మీ అధికారి మృతి అన్నానగర్: కశ్మీర్కు చెందిన ఉమాంగర్ (28) పరంగిమలైలోని ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. ఈనెల 16న అతను మీనంబాక్కంలోని కేంద్రంలో షూటింగ్ శిక్షణలో పాల్గొన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఉమాంగర్ స్పృహతప్పి పడిపోయాడు. ఇతర సైనిక అధికారులు వెంటనే అతన్ని చికిత్స కోసం బరంగేహిల్లోని సైనిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఉమాంగర్ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఎండదెబ్బ ప్రభావం వల్ల శరీరంలో డీహైడ్రేషన్కు గురై అతడు చెందినట్లు తెలుస్తుంది. మీనంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదు ● ప్రజలు భయపడాల్సిన పనిలేదు కొరుక్కుపేట: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిలేదని ప్రజలు భయపడవద్దని తమిళనాడు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన కరోనా, ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలుతోపాటూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించడం, టీకాలు విస్తృతంగా అందించడం ద్వారా, కరోనా మహమ్మారిని తరిమికొట్టామన్నారు. కాగా ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా, ప్రభావితమైన వ్యక్తులలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనిపించలేదు. కరోనా వైరస్ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదన్నారు. అయితే సాధారణ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలి, సరైన ఇన్ఫెక్షన్ నివారణ చర్యలను పాటించాలి. లక్షణాలు ఉన్నవారు, ముఖ్యంగా జ్వరం, దగ్గుతో బాధ పడుతున్నవారు సమీపంలోని వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందాలని కోరారు. పది, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22 నుంచి దరఖాస్తులు కొరుక్కుపేట: పదో తరగతి, ప్లస్–1 సప్లిమెంటరీ పరీక్షకు 22వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి, ప్లస్–1 తరగతుల విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు జూలై 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షకు పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు ఈనెల 22వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దరఖాస్తులు అందజేయడానికి జూన్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపింది. విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు జిల్లాల వారీగా ప్రభుత్వ పరీక్షా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పరీక్ష రుసుం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రుసుం నగదు రూపంలో చెల్లించాలని పేర్కొంది. అలాగే స్పెషల్ అడ్మిషన్ స్కీమ్ (తత్కాల్) కోసం దరఖాస్తులను జూన్ 5, 6 తేదీలలో పాఠశాల సేవా కేంద్రాలలో తగిన రుసుముతో ఆన్లైన్లో సమర్పించవచ్చని పేర్కొంది. ప్రత్యేక ప్రవేశ రుసుం పదో తరగతికి రూ.500, ప్లస్–1కు రూ.1000గా నిర్ణయించారు. ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారికి ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంటుందని డైరెక్టరేట్ పేర్కొంది. ఇతర వివరాలకు www.dfe.in.gov.in అనే వెబ్సైట్లో సంప్రదించాలని తెలిపింది. అద్దకం పరిశ్రమలో విషవాయువుకు ముగ్గురు బలి కొరుక్కుపేట: తిరుప్పూరులో ఓ అద్దకం పరిశ్రమలో విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం సమీపంలోని కరైప్పుదూర్లో ఒక ప్రైవేట్ అద్దకం కర్మాగారం పనిచేస్తోంది. ఈ కర్మాగారంలోని డై వేస్ట్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడానికి కంపెనీలో పనిచేస్తున్న శరవణన్ (30), వేణుగోపాల్ (31), హరి (26), చిన్నస్వామి (36) అనే నలుగురు వ్యక్తులు దాదాపు 6 అడుగుల లోతున ఉన్న మురుగునీటి ట్యాంక్లోకి దిగారు. ట్యాంక్లోకి దిగిన కొద్దిసేపటికే, చిన్నస్వామికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది మొదలైంది. దీంతో బయటకు వచ్చేశారు. శరవణన్, వేణుగోపాల్, హరి శుభ్రపరిచే పనిలో కొనసాగారు. చిన్నస్వామి పైనుంచి దీన్ని పర్యవేక్షిస్తున్నాడు. విషపూరిత వాయువుకు శరవణన్, వేణుగోపాల్, హరి స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ముగ్గురినీ రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ శరవణన్, వేణుగోపాల్ మరణించారు. హరి ప్రాణాపాయ స్థితిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి బాలుడి మృతి
సేలం: బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సేలం సమీపంలోని నీల్వరపట్టి ప్రాంతానికి చెందిన శక్తివేల్ దినసరి కూలీ. ఇతనికి నిషాంత్ (8) కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో షాక్కు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. మంగళవారం ఉదయం వెతుకులాట కొనసాగించగా, అక్కడి సమీపంలోని ఓ బావిలో అతని మృతదేహం కనిపించింది. ఈ విషయమై మల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి, సేలం ప్రభుత్వాస్పత్రికి పంపారు. శవపరీక్ష తర్వాతే బాలుడు ఎలా చనిపోయాడో తెలుస్తుంది. అతను బావిలో పడి చనిపోయాడా?, లేక ఎవరైనా అతన్ని చంపి బావిలో పడేశారా? అనే విషయంలో మిస్టరీ కొనసాగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం దుకాణం ప్రారంభించొద్దు
నిరసన తెలుపుతున్న పట్టాభిరామాపురం మహిళలుతిరుత్తణి: పట్టన శివారులో మద్యం దుకాణం ప్రారంభించవద్దని మహిళలు ఆందోళన చేపట్టారు. తిరుత్తణి సమీపం చైన్నె తిరుపతి జాతీయ రహ దారి సమీపంలో పట్టాభిరామాపురం పంచాయతీ పరిధిలో కొత్తగా టాస్మాక్ మద్యం షాపు ప్రారంభానికి టాస్మాక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త మద్యం షాపు ప్రా రంభాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆర్డీఓ, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో మంగళవా రం పట్టాభిరామాపురం గ్రామానికి చెందిన మహిళలు వంద మందికి పైగా మద్యం షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. దీంతో పట్టణ సీఐ మదియరసన్ మహిళలతో చర్చలు జరిపారు. గ్రామీణుల వ్య తిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టాస్మాక్ దుకాణం మరో ప్రాంతానికి తరలించేందుకు చర్చలు తీసుకుంటామని, గ్రామస్తులు ఆందోళన విరమించాలని కోరారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తుల హోరు
● 1,61,324 మంది నమోదుసాక్షి, చైన్నె : రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులకు దరఖాస్తులు హోరెత్తాయి. 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడంతో సీట్లకు డిమాండ్ నెలకొన్నట్లు అయ్యింది. రాష్ట్రంలో 165 ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు సంబంధించి సుమారు 1.08 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ నిమిత్తం నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 1,61,324 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 46,691 మంది విద్యార్థులు, 75,959 మంది విద్యార్థినులు, మిగిలిన వారు మూడో కేటగిరికి చెందిన వారు ఉన్నారు. వీరిలో 1,22,698 మంది విద్యార్థులు దరఖాస్తు రుసుం సైతం చెల్లించి ఉన్నారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఈ దృష్ట్యా, రెండు లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల కోసం ఉన్నత విద్యాశాఖ హెల్ప్–డెస్క్, విద్యార్థులకు మార్గదర్శకం, అడ్మిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లు తదితర వివరాలను తెలియజేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం విద్యార్థులు 044–24342911 నంబర్కు కాల్ చేసి సమాచారం పొందేలా టోల్ ఫ్రీ నంబర్ను మంగళవారం ప్రకటించింది. అలాగే, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సైనన్స్ కళాశాలల్లో ఉపాధి అవకాశాల కల్పన దిశగా ప్రత్యేక కోర్సులను సైతం అందించనున్నారు. కోర్సులు... కళాశాలలు కాలేజ్ రెగ్యులర్ ఆర్ట్స్ అండ్ సైనన్స్, మేనేజ్మెంట్ కోర్సులతో కూడిన ప్రత్యేకమైన కోర్సులు క్వీన్ మేరీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) అందించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. బ్యాచిలర్ ఆఫ్ జియోగ్రఫీ, టూరిజం, గృహ ఆర్థిక శాస్త్రం, పోషకాహారం, ఆహారసేవ నిర్వహణ, హోమియోపతి, వైద్య పోషకాహారం, ఆహార నియమాలు (హోం సైన్న్స్ – క్లినికల్ న్యూట్రిషన్, డైటెటిక్స్), భారతీయ సంగీతం తదితర కోర్సులను కూడా అందించనున్నారు. నందనం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వ్యాసార్పాడిలోని డాక్టర్ అంబేడ్కర్ గవర్నమెంట్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్– న్యూట్రిషన్, ఆహార సేవా నిర్వహణ, ఆహార వ్యవస్థ (హోం సైన్స్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సర్వీస్ నిర్వహణ ఆహార నియంత్రణ), బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, విజువల్ కమ్యూనికేష్న్లో బ్యాచిలర్ డిగ్రీ కమ్యూనికేషన్), కాయిదే ఏ మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో బ్యాచిలర్ ఆఫ్ హోమ్ సైన్స్, ఆలందూరు ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ, చైన్నె రాజధాని కళాశాలలో బీఏ భూగర్భ శాస్త్రం, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం బి.కామ్ ,బి.కాం(హియరింగ్ ఇంపెయిర్డ్), బీసీఏ(హియరింగ్) వంటి కోర్సులను అందించనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. కాగా, విద్యా పరంగా కొత్త కోర్సులను ప్రకటించినా, అదనపు సీట్లను పెంచినా, ఈ సారి దరఖాస్తులు హోరెత్తుతుండడం చూస్తుంటే, డిగ్రీ కోర్సులకు డిమాండ్ మరింతగా పెరగడం ఖాయమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సీట్లకు డిమాండ్ పెరిగిన పక్షంలో ఇంజినీరింగ్కు తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. -
చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి
తిరువళ్లూరు: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తిరువళ్లూరు సమీపంలోని పోలీవా క్కం గ్రామంలో విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కం గ్రామానికి చెందిన అమల్రాజ్(42). ఇతడికి భార్య పిల్లలు ఉన్నారు. వికలాంగుడైన అమల్రాజ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొన్నిమ్మన్ ఆలయం వద్ద వున్న కొలనులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట సాగిస్తున్న సమయంలో ఫిట్స్ రావడంతో కొలనులో పడిపోయాడు. ఈ సమయంలో సాయం కోసం గట్టిగా అరవడంతో చుట్టుపక్కలనున్న వారు అమల్రాజ్ను రక్షించి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అతడ్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య ఇందిర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. -
17 ఏళ్లుగా పోరాడుతున్నాం..!
యోగిడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై యూనిట్ సభ్యులు తమిళసినిమా: ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సెంథిల్ కుమార్ నిర్మాతగా మారి శ్రీ మౌనిక సినీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం యోగిడా. నటి సాయి ధన్సిక ఫవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించిన ఈ చిత్రంలో షాయాజీ షిండే, మనోబాల, కబీర్ తుహాన్ సింగ్, ఎస్థర్, రాజ్ కపూర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ కృష్ణ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి ఎస్కేఏ.భూపతి ఛాయా గ్రహణం, దీపక్ దేవ్ నేపథ్య సంగీతాన్ని, అస్వమిత్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యా బ్లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు విశాల్, దర్శకుడు ఆర్ వీ.ఉదయ్ కుమార్, పేరరసు, రాధా రవి, మీరా కధిరవన్, మిత్రన్ ఆర్.జవహర్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటి సాయి ధన్సిక మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతూనే ఉన్నామన్నారు. శ్రమను మాత్రమే నమ్మి ఈ రంగంలో ఇంతకాలం పయనించడం వల్ల యోగిడా చిత్రం వరకు వచ్చానన్నారు. నటుడు విశాల్ తనకు 15 ఏళ్ల క్రితమే తెలుసని చెప్పారు. ఆయన తాను ఆగస్టు 29వ తేదీన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నటుడు విశాల్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందని ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలు బ్రహ్మాండంగా కుదిరాయని చెప్పారని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సాయి ధన్సిక తాను ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. యోగిడా చిత్రంలో ఫైట్స్ సన్నివేశాల్లో నటి సాయి ధన్సిక అద్భుతంగా నటించారని విశాల్ ప్రశంసించారు. -
ఆక్రమ ఇళ్ల తొలగింపు
కొరుక్కుపేట: అడయార్ నదిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. సాయుధ పోలీసులు మోహరింపుతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పల్లవరం పక్కనే ఉన్న అనకాపుత్తూరులో అడయార్ నది ఉంది. ఈ నదీ తీరంలో క్వాయిడ్–ఎ–అజంమిల్లత్ నగర్, శాంతి నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 600 ఇళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ అడయార్ నది ఒడ్డున ఉన్న పరీవాహక ప్రాంతంలో స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. మొదటి దశలో 81 కుటుంబాలను ఖాళీ చేయించి, తమిళనాడు హౌసింగ్ బోర్డు రూ.100 కోట్లతో నిర్మించిన అపార్ట్మెంట్లలో ఇళ్లు ఇచ్చారు. చైన్నె పెరుంబాక్కం, గూడూవాంచేరి, కీరప్పక్కం, కిష్కింధ సెల్లం రోడ్ ప్రాంతాల్లో రూ.30 లక్షలు విలువచేసే గృహాలను అందించారు. ఈ పరిస్థితిలో ఈ నెల 12వ తేదీన రెవెన్యూ శాఖ అధికారులకు మిగిలిన ఆక్రమణల గురించి సమాచారం అందించారు. ఆ ప్రాంతం నుంచి వంద మందికి పైగా ప్రజలు గుమిగూడి, చేతుల్లో బ్యానర్లు పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఆక్రమణ తొలగింపు పనిని వదిలేశారు. ఈ పరిస్థితిలో మంగళవారం ఉదయం చెంగల్పట్టు కలెక్టర్ అరుణ అధ్యక్షతన మళ్లీ రెవెన్యూ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనకాపుత్తూర్ అడయార్ నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను తొలగించడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం వంద మందికి పైగా సాయుధ పోలీసు అధికారులు ముందుగానే మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరువాత, అధికారులు ప్రజలతో నిర్వహించిన చర్చలో 20 కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వం కేటాయించిన అపార్ట్మెంట్లలోకి మారడానికి అంగీకరించాయి. తరువాత, అధికారులు ప్రొకై ్లయిన్తో ఇళ్లను తొలిగించారు. -
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
తిరువళ్లూరు: భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉత్తర ప్రదేశ్కు చెందిన యువకుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తిరువళ్లూ జిల్లా మహిళ కోర్టు న్యాయమూర్తి రేవతి తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరీష్ (29) తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు టీచర్ కాలనీలో భార్య రజియాకాట్టు(36)తో కలిసి నివాసమున్నాడు. ఈ క్రమంలో భార్యపై హరీష్కు అను మానం ఉండేది. ఈ విషయమై ఇద్దరి మధ్య తర చూ మనస్పర్థలు రావడంతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో 2022 మే1న హరీష్ భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనపై మృతు రాలి బంధువు అంబత్తూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు మహిళ కోర్టులో సాగింది. నేరం రుజువు కావడంతో హరీష్కు యావజ్జీవశిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రేవతి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
సీఎం స్టాలిన్
‘నీతి ఆయోగ్’కు● 23న హస్తిన పర్యటన ● జాతీయ స్థాయి నేతలతో భేటీకి ఏర్పాట్లు సాక్షి, చైన్నె: నిధుల విడుదలలో తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి అనుసరిస్తున్నట్టు ఆది నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము వ్యతిరేకిస్తున్న పథకాలను సైతం అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తీసుకు రావడాన్ని డీఎంకే పాలకులు ఇప్పటికే తీవ్రంగా పరిగణించి ఉన్నారు. అలాగే లోక్సభ పునర్విభజన వ్యవహారంలో గానీయండి, నిధుల విడుదల విషయంలో గానీయండి ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీల బృందంతో వెళ్లి కలిసేందుకు అనుమతి కోరినా, ఇంత వరకు అవకాశం అన్నది సీఎం స్టాలిన్కు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా నీతి అయోగ్ భేటీ జరుగుతుండడంతో ఈ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో డీఎంకే పాలకులు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తమ గళాన్ని వినిపించడం లేదా నిరసనను తెలియజేయడానికి అవకాశం దక్కినట్టుగా భావిస్తున్నారు. ఇది వరకు నీతి అయోగ్ భేటీకి ఆర్థిక మంత్రి వెళ్లేవారు. గత ఏడాది అయితే ఏకంగా భేటీని బహిష్కరించారు. అయితే, ఈసారి మాత్రం స్వయంగా తానే ఈ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టి ఉన్నారు. ఈనెల 23వ తేదీన సీఎం ఢిల్లీ వెళ్లనున్నారు. నీతి అయోగ్ భేటీతో పాటూ ఈ సమావేశానికి వచ్చే బీజేపీయేతర ప్రభుత్వాల సీఎంలను ప్రత్యేకంగా భేటీకి కసరత్తులలో ఉన్నారు. పది ముసాయిదాల వ్యవహరంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి 14 ప్రశ్నలను సంధిస్తూ లేఖ రాయడాన్ని వ్యతిరేకించే విధంగా బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే స్టాలిన్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జరగనున్న నీతి అయోగ్కు హాజరయ్యే వివిధ రాష్ట్రాల సీఎంలను ఏకం చేసే దిశగా తన పర్యటనకు స్టాలిన్ సన్నద్ధం అవుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.క్వీన్ మేరీ కళాశాలలో.. ప్రారంభోత్సవాలతో బిజీబిజీ ఢిల్లీ పర్యటన కసరత్తులు ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు మంగళవారం సీఎం స్టాలిన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలలో బిజీ అయ్యారు. తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు తరపున రూ. 527.84 కోట్లతో నిర్మించిన బహుళ అంతస్తుల తరహాలోని 4,978 ప్లాట్లను ప్రారంభించారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు నేతృత్వంలో రూ. 207 కోట్లతో నిర్మించిన నాలుగు బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలను ప్రారంభించారు. ఇందులో అందరికీ గృహనిర్మాణ పథకం కింద చైన్నెలోని కై లాసపురం 14 అంతస్తులతో కూడిన 392 ప్లాట్లు , విరుదునగర్ నగర్లో మూడు అంతస్తులతో కూడిన పలు టవర్ల అపార్ట్మెంట్లలో 864 ప్లాట్లు, మధురై జిల్లాలోని ఉచ్చపట్టిలో మూడు అంతస్తుల కూడిన పలు టవర్ల అపార్ట్మెంట్లలో 672 ప్లాట్లు కళ్లకురిచ్చిలో 512, తిరుప్పూర్ 432, కాంచీపురం సాలమంగళంలో 420 ప్లాట్లు ఉన్నాయి. అలాగే, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైన్నె నెర్కుండ్రం, సీఐటీ నగర్, మదురై, తోప్పూర్లో నిర్మించిన బహుళ అంతస్తులతో కూడిన వాణిజ్య సముదాయ భవనాలు కూడా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు ముత్తుస్వామి, అన్బరసన్, సీఎస్ మురుగానందం, అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తమిళనాడు హౌసింగ్ బోర్డు చైర్మన్ పూచ్చి ఎస్మురుగన్, తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్మెంట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ మిశ్రా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. విజయకార్తికేయన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. సమీరన్ పాల్గొన్నారు. అనంతరం చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున రూ. 14.66 కోట్లతో పూర్తి చేసిన ఐదుప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే, రూ.255.60 కోట్లతో చేపట్టనున్న 20 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు.చైన్నె క్వీన్ మేరీ కళాశాలలో ఉన్నత విద్యా శాఖ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి సీఎం స్టాలిన్ హాజరు అయ్యారు. రూ. 42 కోట్లతో కొత్తగా నిర్మించిన విద్యార్థుల హాస్టల్ భవనంతో సహా ఉన్నత విద్యాశాఖ తరపున 120.02 కోట్లుతో నిరిచిన భవనాలను ప్రారంభించారు. రూ. 207.82 కోట్లు నిర్మించనున్న కొత్త భవనాల స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి కోవి చెలియన్, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, విల్సన్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి తదితరులు పాల్గొన్నారు.ముందుగా వాల్ టాక్స్ రోడ్డులోని బకింగ్ హాం కాలువలో పూడిక తీత పనులను సీఎం పరిశీలించారు. వర్షాల సీజన్ ఆరంభంలోపు పనులు ముగించాలని అధికారులను ఆదేశించారు. కాగా సచివాలయంలో సీఎం స్టాలిన్ను కశ్మీర్ నుంచి వచ్చిన విద్యార్థులు కలిశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కశ్మీర్, సరిహద్దు రాష్ట్రాలలోని విద్యా సంస్థలలో చిక్కుకున్న తమిళ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా ఇక్కడకు రప్పించిన విషయం తెలిసిందే. తమను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చిన సీఎంకు సచివాలయంలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేసిన ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతె అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కన్నూరు కళంబేడు ప్రాంతంలో ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సమీపంలోని ప్రైవేటు కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను భారీగా డంప్ చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడాయి. అలాగే ఆ ప్రాంతంలో పొగ కమ్ముకోవడంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. -
ఏర్కాడు పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు
సేలం: ఏర్కాడులో పర్యాటకులకు ప్రాథమిక సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారుల ను జిల్లా కలెక్టర్ ఇరా బృందాదేవి ఆదేశించారు. ఈనెల 23వ తేదీన ప్రారంభం కానున్న 48వ వేసవి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ప్రసిద్ధ వేసవి హిల్ స్టేషన్లలో ఒకటైన ఏర్కాడులో ప్రతి సంవత్సరం ఏర్కాడు వేసవి ఉత్సవం జరుగుతుందని, వేసవి కాలాన్ని జరుపుకోవడానికి పాఠశాల పిల్లలు, పర్యాటకులు ఇతర ప్రజా సందర్శకులు ఏర్కాడు కొండలకు వస్తార న్నారు. ఈ 48వ ఏర్కాడు వేసవి ఉత్సవం ఈ నెల 23న ప్రారంభమై 29వ తేదీ వరకు 7 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ఏర్కాడు వే సవి ఉత్సవానికి పర్యాటకులను ఆకర్షించడానికి, ఉద్యానవన శాఖ అన్నాపార్క్లో 1.50 లక్షల పూల తో పూల ప్రదర్శన, చేతిపనుల ప్రదర్శన, కూరగాయల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. అలాగే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రో గ్రామ్, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఉమెన్స్ ప్రోగ్రామ్ వంటి విభాగాల తరపున వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేసవి ఉత్సవంలో ప్రతిరోజూ వివిధ కళా, సంగీత ప్రదర్శనలు, పెంపుడు జంతువుల ప్రదర్శనలు, పడవ పందేలు తదితర కార్యక్రమాలు జరుగుతా యని వెల్లడించారు. అలాగే ఏర్కాడు పర్వత మా ర్గంలో రోడ్డు భద్రత గురించి పర్యాటకులలో అవగాహన కల్పించడానికి రవాణా శాఖ అవగాహన కో సం బ్యానర్లు, గోడ ప్రకటనలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు, పాదచారులు రోడ్డు నియమాలను, జిల్లా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. కలెక్టర్ ఇరా బృందాదేవి -
ఐదుగురిని బలిగొన్న క్వారీ
సాక్షి, చైన్నె: శివగంగైలో ఓ క్వారీలో మట్టి చరియలు విరిగిపడ్డాయి. ఐదుగురు కార్మికులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు సమీపంలోని మలకోట్టై గ్రామంలో మేఘ వర్ణం అనే వ్యక్తి క్రషర్ క్వారీని నిర్వహిస్తున్నాడు. ఇక్కడ మంగళవారం ఉదయం కార్మికులు విధులలో ఉన్నారు. ఇందులో ఆరుగురు కార్మికులు ఓ చోట పనిచేస్తుండగా హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఇందులో ఒకరు పెట్టిన కేకలతో మిగిలిన వారు పరుగులు తీశారు. మట్టి చరియలు పెద్ద ఎత్తునపడడంతో సహాయక చర్యలకు సంక్లిష్టంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గుర్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరు చికిత్స ఫలించక మరణించారు. మరో ముగ్గురు మట్టి చరియల శిథిలాల క్రింద మరణించారు. వీరి మృతదేహాలను అతి కష్టంపై వెలికి తీశారు. ఈ ఘటన సమాచారంతో మంత్రి పెరియకరుప్పన్, జిల్లా కలెక్టర్ ఆశా అజిత్లతో పాటుగా అధికారులుసంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మరణించిన వారిలో స్థానికుడైన ఆండి చామి, గణేషన్ ఉన్నారు. మిగిలిన వారు ఒడిశ్వా కార్మికులుగా భావిస్తున్నారు. వీరి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ● మట్టి చరియలు విరిగి పడడంతో ఘటన -
ఇళ్లకు వడ్డన ఇల్లే!
● అన్ని రాయితీలు కొనసాగుతాయి ● మంత్రి శివ శంకర్ స్పష్టంసాక్షి, చైన్నె: గృహాలకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, అన్ని రకాల రాయితీలు కొనసాగుతాయని విద్యుత్, రవాణాశాఖ మంత్రి ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా జూలైలో విద్యుత్ చార్జీలను వడ్డిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు పెంపు నుంచి మినహాయించారు. 2024 లోక్ సభ ఎన్నికల అనంతరం జూలైలో 4.83 శాతం చార్జీలను వడ్డించారు. ఈ పరిస్థితులలో తాజాగా 3.16 శాతం చార్జీలను వడ్డించే విధంగా విద్యుత్ బోర్డు కసరత్తులు చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే ప్రభుత్వానికి ఈ పెంపు కసరత్తులు ఇరకాటంలో పడేశాయి. ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారంటూ ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. దీంతో విద్యుత్ మంత్రి శివశంకర్ స్పందించారు. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు మంత్రి శివశంకర్ పేర్కొంటూ, గత కొన్ని రోజులుగా విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ వస్తున్న సమాచారాలను ఖండించారు. ఇవన్నీ అనధికారికం అని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. తమిళనాడు విద్యుత్ నియంత్రణ కమిషన్ ద్వారా కూడా ఎలాంటి సిఫారసులు, కసరత్తులు జరగ లేదని వివరించారు. అయితే, విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించి రెగ్యులేటరీ కమిషన్ ఒక ఉత్తర్వులు సిద్ధం చేసేటప్పుడు గానీ, అమలు చేసేటప్పుడు గానీ, గృహ విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి పెంపు అన్నది ఉండదన్నారు. గృహాలకు ఎలాంటి పెంపు అన్నది ఉండదని, ఉచిత, ఇతర రాయితీలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
నీట్ మరో విద్యార్థిని మింగేసింది!
● ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య సేలం: సేలంలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థి ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. రాష్ట్రంలో నీట్ భయంతో బలన్మరణానికి పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నీట్ రద్దుకు పాలకులు ఆది నుంచి పట్టుపడుతున్నా ఫలితం శూన్యం. దీంతో మరో బలి దానం తప్పలేదు. సేలం నరసొత్తి పట్టి ప్రాంతానికి చెందిన రంగన్ మెకానిక్ వర్క్షాప్ నడుపుతున్నాడు. ఆయన కుమారుడు గౌతమ్ (21) గతంలో రెండుసార్లు నీట్ పరీక్షకు హాజరయ్యాడు. తగినన్ని మార్కులు సాధించకపోవడంతో అతను ప్రస్తుతం మూడోసారి నీట్ పరీక్ష రాశాడు. గౌతమ్ ఈ పరీక్ష సరిగ్గా రాయలేదని చెబుతూవచ్చాడు. కొన్ని రోజులుగా ఫెయిల్ అవుతానన్న భయంతో ఇంట్లో విచారంగా ఉంటూ వచ్చాడు. ఈ పరిస్థితిలో సోమవారం రాత్రి, అతని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గౌతమ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. మంగళశారం ఈ విషయం తెలుసుకున్న సూరమంగళం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్యాప్తులో, గౌతమ్ నీట్లో ఫెయిల్ అవుతానన్న భయంతో బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. కాగా, నీట్ మరణాలు పెరుగుతుండడంతో విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక నైనా నీట్ రద్దుకు పాలకులు సరైన మార్గంలో పయనించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు డిమాండ్ చేశారు. -
‘నైరుతి’ ఆశలు..
● ఆశాజనకంగా పవనాల కదలిక ● 24న రాష్ట్రాన్ని తాకే అవకాశం ● కావేరి పరవళ్లు ● మేట్టూరులోకి పెరిగిన నీటి రాక ● గోడ కూలి..ముగ్గురి మృతి సాక్షి, చైన్నె : నైరుతి రుతు పవనాల కదలిక ఆశాజనకంగా మారింది. ఈ రుతు పవనాలు ఈ నెల 24వ తేదీన లేదా 25వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఇందుకు శుభసూచకంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా, మరికొన్ని జిల్లాల్లో కుండ పోతగా వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో ఏటా నైరుతి రుతు పవనాల ప్రభావం అంతంత మాత్రమే. అయితే కేరళ, కర్ణాటకల్లో ఈ పవనాల రూపంలో వర్షాలు పడితే తమిళనాడులోని అన్నదాతలకు ఆనందమే. కేరళ నుంచి ముల్లై పెరియార్, వైగై, భవానీ సాగర్ జలాశయాలకు నీటి రాక పెరుగుతుంది. కర్ణాటకలో వర్షాలు కురిస్తే, కావేరి పరవళ్లు తొక్కినట్టే. అదే సమయంలో ఈ ఏడాది భానుడి ప్రతాపం మరీ ఎక్కువగానే రాష్ట్రంలో ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ దృష్ట్యా జల వనరులలో ప్రస్తుతం నీటి శాతం కూడా తగ్గి ఉంది. దీంతో నైరుతిపై ఆశలు మొదలయ్యాయి. సంవృద్ధిగా ఈ సారైనా వర్షాలు కురవాలని ప్రజలు ఎదురు చూశారు. ఇందుకు అనుగుణంగానే సమాచారాలు వెలువడ్డాయి. ముందుగానే నైరుతి ప్రవేశం నైరుతి రుతు పవనాలు ఇప్పటికే అండమాన్ తీరాన్ని తాకాయి. ఆశాజనకంగా ఈ పవనాలు కదులుతూ కేరళ తీరాన్ని మరికొద్ది రోజుల్లో తాకనున్నాయి. ఈ పవనాలు ఈనెల 28వ తేదీ తర్వాత తమిళనాడులోకి ప్రవేశించవచ్చని భావించారు. అయితే, ముందుగానే ఈనెల 24 లేదా 25 తేదీల్లో పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. ఈ పవనాలతో తమిళనాడు– కేరళ సరిహద్దుల్లోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్ కాశి, తేని, కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ జిల్లాల్లో వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి చెదరుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అలాగే, పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు, ఈరోడ్, నీలగిరి జిల్లాల్లోనూ బుధవారం నుంచి మరింతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. డెల్టా, పశ్చిమ కనుమలతో పాటుగా 12 జిల్లాలో వర్షాలు పడనున్నాయి. కావేరి నదిలో నీటి ఉధృతి పెరిగింది. మేట్టూరు జలాశయంలోకి సెకనుకు పది వేల క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తుంది. దీంతో జలాశయం నీటి మట్టం బుధవారం నాటికి 110 అడుగులకు చేరనుంది. కర్ణాటకలో మరింతగా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి నుంచి నీటి రాక కావేరిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కావేరి తీరంలో అలర్ట్ ప్రకటించారు. చైన్నె శివారులో.. చైన్నె శివారులో మంగళవారం భారీ వర్షం కురిసింది. విమానాశ్రయం పరిసరాల నుంచి తాంబరం, చెంగల్పట్టు వైపుగా, కాంచీపురం వైపుగా గంటకు పైగా కుండ పోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదలా నీరు పారింది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వాతావరణం అనుకూలించక పోవడంతో చైన్నెలో ల్యాండ్ కావాల్సిన పది విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. వాతావరణం మారిన అనంతరం ల్యాండింగ్ అయ్యాయి. మదురై పరిసరాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మదురై తిరుప్పర కుండ్రం సమీపంలోని పెరుంగుడి గ్రామంలో ఓ ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో ఉన్న అమ్మా పిల్లై(65), వెంకటి(55)తో పాటుగా వీరమణి అనే బాలుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.