Tamil Nadu
-
హైదరాబాద్ వేదికగా ‘ఢీ’లిమిటేషన్
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు. -
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్ రెడ్డి
Delimitation JAC meeting Updates..👉కేటీఆర్ కామెంట్స్: ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది...కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈ రోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.👉దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.👉దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది👉ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.👉1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈ రోజు డీలిమిటేషన్లో లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.👉తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ కారణంగా పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్ శ్రేయస్సుకు భంగం కలుగుతుంది. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. 👉తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్స్..‘దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలుకాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా?. న్యాయబద్దం కాని డీలిమిటేషన్పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్పేయి కూడా లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ.. వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్ రూపాయి పన్ను కడితే.. ఆరు రూపాయాలు పోతున్నాయి. యూపీకి రూపాయికి రెండు రూపాయల మూడు పైసలు వెనక్కు వస్తున్నాయి. దక్షిణాది రాజకీయంగా గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోతుంది. మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతాం. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి.👉తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ దూరంగా ఉంది.👉ఇక, ఈ సమావేశంలో డీలిమిటేషన్పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. சென்னையில் நடைபெறும் கூட்டு நடவடிக்கை குழு ஆலோசனைக் கூட்டத்தில் பங்கேற்க வருகை தந்த அனைத்து தலைவர்களையும் மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு @mkstalin அவர்கள் வரவேற்றார். #FairDelimitation pic.twitter.com/0Ject5TUiA— DMK (@arivalayam) March 22, 2025 👉అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. Honourable Chief Minister of Telangana Thiru @revanth_anumula Avl arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/mhhpbaUH8b— DMK (@arivalayam) March 21, 2025Honourable Chief Minister of Punjab Thiru. @BhagwantMann arrives in Chennai ahead of the crucial JAC meeting against unfair delimitation. Leaders from 14+ parties will unite tomorrow to discuss the pressing issue of delimitation and its impact on state rights.… pic.twitter.com/g2uo33Tw5i— DMK (@arivalayam) March 21, 2025 -
ప్రగతి లక్ష్యంగా ట్రావెల్ ఫెయిర్
సాక్షి,చైన్నె: తమిళనాడులో పర్యాటక శాఖ తొలిసారిగా పర్యాటక ప్రగతిని కాంక్షిస్తూ తమిళనాడు ట్రావెల్ ఫెయిర్ను చైన్నెలో ఏర్పాటు చేసింది. నందంబాక్కం వర్తక కేంద్రంలో ఈ ఫెయిర్ను పర్యాటక మంత్రి ఆర్. రాజేంద్రన్ శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ వేడుక జరగనుంది. 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రజలు ఫెయిర్ సందర్శనకు అనుమతించనున్నారు. రాష్ట్రంలోని గొప్ప, విభిన్నమైన పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి , పరిశ్రమ సహకారాన్ని పెంపొందించడానికి, పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రధాన వేదికగా దీనిని తీర్చిదిద్దారు. తమిళనాడు ట్రావెల్ ఫెయిర్ వేదిక, ట్రావెల్ ఫెయిర్ను ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ సంస్థ ద్వారా నిర్వహించారు. తెలంగాణ, ఉత్తరాఖండ్ , తమిళనాడు, నేపాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, కేరళ, పంజాబ్ టూరిజం వంటి రాష్ట్రాల ప్రభుత్వ పర్యాటక విభాగాలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం స్థిరమైన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి ఈ వేదిక ద్వారా గణనీయమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్ కె.మణివాసన్, కమిషనర్ శిల్పా ప్రభాకర్ సతీష్, పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ డైరెక్టర్ (దక్షిణ) డి.వెంకటేశన్ పాల్గొన్నారు. -
నియోజకవర్గాల్లో డీఎంకే సర్వే
సాక్షి, చైన్నె : 2026 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులపై డీఎంకే సర్వే చేపట్టి ఉండడం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా జరిగిన ఈసర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 50 స్థానాల్లో భారీ ఆధిక్యతతో డీఎంకేకు గెలుపు ఖాయం అన్నది స్పష్టమైంది. అలాగే, మరికొన్ని స్థానాల్లో కూటమి గెలుపు ఖాయం అన్నది తేలింది. అదే సమయంలో కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీతో గెలుపు ధ్రువీకరించడం గమనార్హం. మళ్లీ అధికారం లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెట్టిన విషయం తెలిసింది. ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా ఉండడమే కాకుండా హోరా హోరీ అనేది అనేక నియోజకవర్గాలలో ఉండవచ్చు అన్న సంకేతాలు నెలకొన్నాయి. తమిళగ వెట్రి కళగంతో రాజకీయ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో యువత, నవతరం ఓట్లు చీలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అభిమానుల సంఖ్య అధికం కావడంతో ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించబోతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో గత కొన్ని నెలలుగా సర్వే నిర్వహించి ఉండడం గమనార్హం. తమ ఓటు బ్యాంక్కు ఢోకా లేదన్నట్టుగా ఈ సర్వే స్పష్టం చేసినట్టు సమాచారం. గెలుపు రేసులోనే.... రాష్ట్రంలోని 234 స్థానాల్లో ఈ సర్వే నిర్వహించారు. గత ఎన్నికల్లో 130కు పైగా స్థానాలలో డీఎంకే గెలిచింది. ఈ నియోజకవర్గాలలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానంగా సర్వే చేశారు. ఇందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 50 చోట్ల భారీ ఆధిక్యంతో గెలుపు ఖాయం అన్నది సర్వేలో తేలింది. అలాగే, మరికొన్ని చోట్ల డీఎంకే సిట్టింగ్లపై అసంతృప్తి రగులుతోంది. వీరికి బదులుగా ఇతరులను పోటీలో నిలబెట్టిన పక్షంలో గెలుపు ఖాయం అని తేలింది. ఇంకొన్ని స్థానాల్లో గెలుపు హోరాహోరీగా ఉంటుందని, స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఇక, మిగిలిన నియోజకవర్గాలలో డీఎంకే బలం ఏ మేరకు ఉందో అని సర్వే చేశారు. ఇందులో కొన్ని కూటమి పార్టీలకు గెలుపు అవకాశాలు ఉన్నా, మరి కొన్ని చోట్ల కూటమి అభ్యర్థులకన్నా డీఎంకే అభ్యర్థి పోటీలో ఉండాలన్న నినాదం కొనసాగడం గమనార్హం. ఈ సర్వే ఆధారంగా మరింతగా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టబోతున్నారు. సిట్టింగ్ల పనితీరు అసంతృప్తికరంగా ఉన్న చోట్ల కొత్త వారిని ఇన్చార్జ్లుగా నియమించి ఈ ఏడాది కాలం పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పనులు వేగవంతం చేయడానికి డీఎంకే అధిష్టానం వ్యూహరచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, ఈసారి అనేక మంది సిట్టింగ్లకు సీట్లు చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
30న చైన్నెకి బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్స్
– నెహ్రూ స్టేడియంలో పోటీసాక్షి, చైన్నె: బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్స్ టూర్ ఖరారైంది. భారతదేశంలో ఫుట్బాల్ అభివృద్ధికి తోడ్పాటు కల్పించే విధంగా బ్రెజిల్ లెజెండ్స్ చైన్నెకు రానున్నారు. ఈనెల 30న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఫుట్బాల్ ఆడనున్నారు. ఫుట్బాల్ ప్లస్ అకాడమీ నిర్వహించే ఈ పర్యటనకు చైన్నె జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. చైన్నెకు రానున్న బ్రెజిల్ లెజెండ్స్లో రొనాల్డిన్హో, రివాల్డో, లూసియో, గిల్బెర్టో సిల్వా వంటి దిగ్గజ క్రీడాకారులు ఉన్నారు. వీరు ఇండియన్ ఆల్–స్టార్స్ విజయన్, మెహతాబ్ హుస్సేన్, కరణ్జిత్ సింగ్ క్రీడాకారులతో ఫుట్బాల్ మ్యాచ్లో తలబడనున్నారు. ఈ మ్యాచ్ తర్వాత, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో చైన్నెలో జరిగే రెండు రోజుల ఫుట్బాల్ సమ్మిట్లో ప్రపంచ కప్ విజేతలతో వర్క్షాప్లు, చర్చలు, ముఖాముఖి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ లెజెండ్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ టికెట్లను బుక్ మై షో ద్వారా అందిస్తున్నామని ఫుట్బాల్ ప్లస్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది. చైన్నెకి రానున్న లెజెండ్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్ తెలుసా?
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నటి త్రిష నాయకిగా నటించిన ఇందులో నటుడు ప్రసన్న, అర్జున్దాస్ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న తెరపైకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు హైలెట్స్ ఇప్పుటికే విడుదలై అంచనాలు పెంచేశాయి. చిత్రంలో అజిత్ గెటప్ నుంచి, టైటిల్, టీజర్, ఫస్ట్లుక్ పోస్టర్ వంటివి అజిత్ అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. అసలు ఇందులో అజిత్ ఎన్ని పాత్రలు పోషించారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య సాగే కథా చిత్రంగా ఉంటుందని తాజా సమాచారం. ఇందులో అజిత్ కొడుకుగా నటుడు తెలుగు నటుడు కార్తీకేయ నటించినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలిసింది. కాగా చాలా కాలం క్రితం అజిత్ కథానాయకుడిగా నటించిన వరలారు చిత్రంలో కార్తీకేయ బాలనటుడిగా నటించారు. ఆ తరువాత ఇటీవల విడుదలైన వలిమై చిత్రంలో అజిత్కు విలన్గా నటించారు. తాజాగా మరోసారి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటించారన్నమాట. కాగా అజిత్ నటించిన విడాముయర్చి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. -
కటింగ్ చేస్తే రూ.లక్షే!
తమిళసినిమా: జీవితంలో ఏదైనా జరగవచ్చు. సాధారణ వృత్తి అనుకున్న దానిలో కూడా లక్షలు గడించవచ్చు. అందరూ చేసే అదే వృత్తిలో కొందరు మాత్రమే పాపులర్ అవుతుంటారు. దీన్నే లక్ అంటారనుకుంటా. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మె పరిస్థితి అంటారు. అయితే దీనికి పూర్తి గా వ్యతిరేకంగా జరిగే సంఘటనలను చూస్తుంటాం. అందుకు చిన్న ఉదాహరణ ఆలీమ్ హకీమ్. సాధారణంగా ఒక సెలూన్ షాప్నకు వెళితే అక్కడ ఒక మనిషి హెయిర్ కటింగ్కు రూ.150 తీసుకుంటారు. ఎయిర్ కండిషన్ సెలూన్ దుకాణాల్లో మహా అయితే రూ.500 తీసుకుంటారు. ఇక సెలబ్రిటీస్కు ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తుండవచ్చు. అయితే ఒక్కసారి కటింగ్కు చెల్లించడం అనేది ఎప్పుడైనా విని ఉంటామా? మనం విని ఉండకపోవచ్చు. ఇది జరుగుతున్న వాస్తవం. ఆలీమ్ హకీమ్ అనే హెయిర్స్టర్ గురించే ఇదంతా. ఇతను హాలీవుడ్ హెయిర్స్టర్. మొదట్లో ఒకరికి హెయిర్ కట్ చేస్తే రూ.20 తీసుకునేవారట. ఆ తరువాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ లక్ష రూపాయల వర కూ తీసుకుంటున్నారని సమాచారం. ఏంటి ఒకసారి జుత్తు కట్ చేస్తే లక్ష ఎవరు చెల్లిస్తారు ? అని ఆశ్చర్యపోతున్నారా. ఆలీమ్ హకీమ్ ఇప్పుడు సాదారణ హెయిరిస్ట్ కాదు. సెలబ్రిటీల హెయిరిస్ట్. అదీ మామూలు సెలబ్రిటీలకు కాదు. సూపర్స్టార్స్కు హెయిర్స్టర్. ఈయన తల మీద కత్తెర పెట్టారంటే అక్షరాలు లక్ష చెల్లించాల్సిందేనట. హాలీవుడ్కు చెందిన ఈయనకు కస్టమర్స్ అందరూ ఇండియాకు చెందిన వారే కావడం విశేషం. ఈయనకు సినీ, క్రికెట్ క్రీడాకారుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఈయన కస్టమర్లంతా సినీస్టార్స్, క్రికెట్స్టార్స్ వంటి వారే. అందులో సూపర్స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు, క్రికెట్ స్టార్ ఎంఎస్.ధోని, విరాట్ కోహ్లీ వంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. రజనీకాంత్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు హెయిర్స్టర్గా పని చేసింది ఆలీమ్ హకీమే. అటువంటింది ఆయన హెయిర్స్టైల్ పని తనం. ఏదైనా ఒక్కసారి పాపులర్ అయితే ఆ తరువాత పేరైనా, డబ్బైనా వెతుక్కుంటూ వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. -
తిరువలంగాడులో యువకుడి హత్య
–పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు తిరుత్తణి: తిరువలంగాడులో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. సంఘటనకు సంబంధించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువలంగాడు సమీపంలోని నార్తవాడ గ్రామ శివార్లలో ముళ్ల కంపల వద్ద ఓ యువకుడిని హత్య చేసినట్లు ఆ ప్రాంత వాసులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరువలంగాడు పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా శరీరంలో 20కు పైగా కత్తిపోట్లతో నరికి హత్య చేసినట్లు గుర్తించారు. వెంటనే సంఘటన ప్రాంతం చేరుకున్న ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్, తిరుత్తణి డీఎస్పీ కందన్ హత్యకు సంబంధించి విచారణ జరిపారు. అలాగే డాగ్ స్క్వాడ్ బృందం, వేలిముద్రల క్లూస్ టీం సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసుల విచారణలో పూండికి చెందిన లోకేష్(19) అనే యువకుడు డిప్లొమో ఫార్మసీ చదువుకుని మెడికల్ షాపులో పని చేసేవాడని తెలిసింది. పది రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు లోకేష్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తెలిసింది. హత్యకు సంబందించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
గంజాయి కేసులో యువతి అరెస్టు
అన్నానగర్: ఇన్స్ట్రాగామ్ ద్వారా టీనేజర్లకు వల వేసి, వారిని గంజాయి వ్యాపారులుగా మార్చిన ఉత్తరప్రదేశ్కు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె పల్లవరం సమీపంలోని త్రిసూ లం రైల్వేగేటు వద్ద పల్లవరం పోలీసులు గురువారం రాత్రి నిఘా పెట్టారు. ఓ యువతి చేతిలో పెద్ద బ్యాగ్ తో ఆ ప్రాంతంలో తిరుగుతోంది. దీంతో అనుమానించిన పోలీసులు యువతిని ఆపి, బ్యాగ్ను పరిశీలించారు. అందులో 3 కిలోల గంజాయి ఉండగా గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు షాక్కు గుర య్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. త్రిపురలోని ఉదయ్పూర్కు చెందిన యువతి పాయల్దాస్( 25) విలాసవంత జీవనానికి అలవాటుపడింది. ఈ క్రమంలో చైన్నెలో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం త్రిపుర నుంచి గంజాయిని కొనుగోలు చేసి చైన్నెకి తీసుకొచ్చి విక్రయించింది. ఒంటరిగా అమ్మలేనని గ్రహించిన పా యల్ దాస్ తన పేరుతో ఇన్ స్ట్రాగామ్ పేజీని ప్రారంభించి తన సెక్సీ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. తాను పెళ్లి కాని యువతినని, కాలేజీలో చదువుతున్నానని పోస్ట్ చేసి, పరిచయం పెంచుకుని గంజాయిని విక్రయించడానికి వారిని ఉపయోగించుకుంది. ఇలా మూడేళ్లుగా గంజా యి విక్రయిస్తున్న పాయల్దాస్ ఒక్కసారి కూడా పోలీసులకు దొరక్కపోవడం గమనార్హం. పోలీసులు ఆమైపె కేసు నమోదు చేసి తాంబరం కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
పోలీస్ స్టేషన్ ముట్టడి
వేలూరు: కళాశాలలో మ హిళా ఫ్రొఫెసర్ను లైంగి కంగా వేధించిన వైస్ ప్రిన్సిపల్ను వెంటనే అరెస్టు చే యాలని కోరుతూ విద్యార్థు లు పోలీస్ స్టేషన్ను ముట్టడించి, ధర్నా చేశారు. వే లూరు అన్నారోడ్డులోని ఊ రీస్ కళాశాలలో చిత్తూరు జి ల్లా గుడిపాల మండలం రాసనపల్లెకు చెందిన అన్బయగన్ వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఇతను అదే కళాశాలలో పనిచేస్తున్న మహిళా ప్రొఫెసర్ను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ మహిళా ప్రొఫెసర్ ఐదు రోజుల కిందట వేలూరులోని మహి ళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసు కున్న వైస్ ప్రిన్సిపల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని ఎ వరికీ కనిపించకుండా తల దాచుకున్నాడు. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసి ఐదు రోజులవుతున్నా పోలీసు లు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహించిన కళాశాల విద్యార్థులు సుమారు 500 మందికి పైగా కళాశాల ముఖ ద్వారాన్ని ముట్టడించి, ధర్నా నిర్వహించారు. విషయం తెలుసకున్న కళాశాల సిబ్బంది కళాశాలకు వచ్చే రెండు గేట్లకు తాళం వేశారు. ఆ గ్రహించిన విద్యార్థులు గేట్లును ధ్వంసం చేసి, వైస్ ప్రిన్సిపల్ను అరెస్ట్ చేయాలని కోరుతూ ర్యాలీగా మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుని స్టేషన్ను ముట్టడించారు. విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ చంద్రదశరథన్, పోలీస్ ఇన్స్పెక్టర్లులత, శ్రీనివాసన్, పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకుని, విద్యార్థులతో చర్చలు జరిపి కళాశాలకు పంపి వేశారు. -
ఏలగిరి కొండకు దివ్యాంగ విద్యార్థులు
వేలూరు: దివ్యాంగుల విద్యార్థుల్లో సంతోషం తీసుకొచ్చేందుకే తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి కొండకు ఒక్కరోజు పర్యాటకానికి పంపుతున్నట్లు కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బధిర పాఠశాల నడుస్తోంది. ఇందులో 48 మంది విద్యార్థులు విద్యను అభ్యసించడంతో పాటు శిక్షణ పొందుతున్నారు. వీరు ఒకే చోట ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతన్నారని ఉద్దేశంతో ఒక్కరోజు పర్యాటకాన్ని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థుల బస్సును కలెక్టర్ సుబ్బలక్ష్మి ప్రారంభించి విద్యార్థులకు పుష్పగుచ్ఛం ఇచ్చి పంపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బధిర విద్యార్థుల ఒక్క రోజు పర్యాటకం కోసం ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఆహారం, బస్సు వసతి ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగుల శాఖ సంక్షేమ శాఖ అధికారి శరవణన్ పాల్గొన్నారు. -
ఘనంగా బాలమురుగన్ వార్షికోత్సవం
వేలూరు: రాణిపేట జిల్లా రత్నగిరి బాలమురుగన్ స్వామిజీ వార్షికోత్సవం, 58వ అన్నదాన కార్యక్రమం ఆలయ ఆవరణలో జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇందులోభాగంగా ఆలయంలోని శ్రీవళ్లి, దేవయాని సమేతబాల మురుగన్స్వామికి పారంపర్య ధర్మకర్త బాల మురుగన్ స్వాములు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, దీపారాధన, పుష్పాభిషేక పూజలు చేసి ప్రత్యేక అన్నదానం చేశారు. ఇందులో కలవై సచ్చిదానం స్వామిజీ, బ్రహ్మపురం ఆధీనం సిద్ధంజి మేగానంద స్వామిజీ, కార్యనిర్వహణ అధికారి శంకర్, రాణిపేట జీకే ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ సంతోష్గాంఽధీ, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి సుకుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పుష్పాలంకరణలో ఉన్న స్వామివారిని ఊరేగించారు. -
18 కిలోల గంజాయి స్వాధీనం
–ఇద్దరి అరెస్టు తిరువళ్లూరు: అంబత్తూరు బస్టాండ్ నుంచి ఆటోలో తరలిస్తున్న 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరు బస్టాండులో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో కూర్చుని అనుమానాస్పదంగా ప్రవ ర్తిస్తుండడంతో స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానం కలిగిన పోలీసులు వారిద్దరి బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి అక్కడ విచారణ జరిపారు. విచారణలో వ్యక్తులు చెంగల్పట్టు జిల్లా కోవలం గ్రామానికి చెందిన కాళేషా మస్తాన్(25), కాంచీపురం జిల్లా కళిపట్టూరు గ్రామానికి చెందిన రామ్కుమార్ కుమారుడు భరత్కుమార్(23)గా గుర్తించారు. వీరు ఆంధ్ర నుంచి రైలులో గంజాయిని జనసంచార ప్రాంతాలే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
కారుణ్యలో వార్షిక టెక్ ఫెస్ట్
కొరుక్కుపేట: కారుణ్య వర్సిటీ ఆధ్వర్యంలో మైండ్క్రాఫ్ట్ 2025 పేరుతో వార్షిక టెక్ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకను బ్రాడ్లైన్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆర్ముగం ముర్కియా ప్రారంభించారు. చైన్నె కారుణ్య యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ ప్రిన్న్స్ అరుల్రాజ్ మాట్లాడుతూ 100కి పైగా ఈవెంట్లు, రూ.10 లక్షల విలువైన బహుమతులతో ఈవెంట్ అద్భుతమైన పరిశోధన, టెక్టాక్లు, వర్క్షాప్లను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. ముందుగా ఆర్ముగం ముర్కియా విద్యార్థులు వారి ఆవిష్కరణలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రశంసించారు. -
అభిమానులే నా ప్రేమికులు
తమిళసినిమా: సినిమాల కోసం శ్రమించే చియాన్ విక్రమ్ ఆ శ్రమ అంతా అభిమానుల సంతోషం కోసమే అంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం వీర ధీర శూరన్ 2. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియాశిబు నిర్మించిన ఈ చిత్రానికి చిత్రా చిత్ర ఫేమ్ ఎస్యూ.అరుణ్కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. నటి దుషారావిజయన్ నాయకిగా నటించిన ఇందులో ఎస్జే.సూర్య, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. తేనీఈశ్వర్ చాయాగ్రహణం, జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నె, ఆవడిలోని వేల్స్టెక్ యూనివర్సిటీ ఆవరణలో వేలాది మంది విద్యార్థులు, సినీ ప్రముఖుల మధ్య ఆడియో, ప్రీ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇది హాలీవుడ్ స్థాయిలో తమిళగడ్డపై తెరకెక్కించిన తమిళ చిత్రం అని అన్నారు. తమిళసినిమా గౌరవం అని ఎస్జే.సూర్య పేర్కొన్నారు. దర్శకుడు అరుణ్కుమార్ మాట్లాడుతూ నిర్మాతలు శిబు, రియా శిబులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. తాను, విక్రమ్ నటించిన దూళ్ చిత్రాన్ని మదురైలోని చింతామణి థియేటర్లో చూశానని, ఇప్పుడు ఆయన నటించిన చిత్రానికి దర్శకత్వం వహించడం విక్రమ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. వీర ధీర శూరన్ తన జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం అని దుషారావిజయన్ పేర్కొన్నారు. విక్రమ్ మాట్లాడుతూ అభిమానులు విక్రమ్ వేరే కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారని, అరుణ్కుమార్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పానన్నారు. తమ ఇద్దరి భావజాలం ఒకేలా ఉండడంతో వీర ధీర శూరన్ ప్రేక్షకులకు రగడ చిత్రంగా ఉంటుందన్నారు. ఈచిత్రం తన అభిమానుల కోసం అని, వారే తన ప్రియమైన అభిమానులు అని విక్రమ్ పేర్కొన్నారు. -
చైన్నెలో రౌడీ, చిదంబరంలో దొంగ అరెస్టు
సేలం: చైన్నె పోలీసులపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పేరు మోసిన రౌడీని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్చి, అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకు డి నుంచి చైన్నెకి వచ్చి ఆదంబాక్కంలోని ఒక ఆభరణాల దుకాణం యజ మాని కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి కుట్ర పన్నిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. తూత్తుకుడికి చెందిన పేరుమోసిన రౌడీ మహారాజా (31) తిరునల్వేలి ప్రాంతంలో దాక్కున్నాడని అందిన సమాచారం ఆధారంగా, గిండి స్పెష ల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తిరునల్వేలి మార్కెట్ ప్రాంతంలో దాక్కు న్న రౌడీ మహారాజును అరెస్టు చేసి చైన్నెకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నేరానికిఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని తిరిగి పొందడానికి పోలీసులు వెళ్లగా అతను దాచిపెట్టిన తుపాకీతో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. ఒక పోలీసు అధికారిపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రౌడీ మహారాజాను సబ్ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్ తుపాకీతో కాల్చి, అరెస్టు చేశాడు. దీంతో గాయపడిన రౌడీ మహారాజా చైన్నె ప్రభు త్వ రాయపేట ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై గిండి పోలీసులు, వేలచ్చేరి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిదంబరంలో దొంగ అరెస్టు పోలీసును కత్తితో నరికి తప్పించుకునేందుకు ప్రయత్నించిన పేరుమోసిన దొంగను పోలీసులు కాల్చి పట్టుకున్న ఘటన చిదంబరంలో కలకలం రేపింది. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని వల్లంపడుగై సిధాన్ సలై నివాసి గజేంద్రన్ (35) ఇంట్లో గత 18వ తేదీన ఒక గుర్తుతెలియని వ్యక్తి బంగారు నగలను దొంగిలించాడు. ఫిర్యాదు ఆధారంగా, అన్నామలై నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, గురువారం రాత్రి చిదంబరం నుంచి ఆస్పత్రికి వెళ్లే ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీ చేశారు. ఆ సమయంలో వారు బైక్పై హెల్మెట్ ధరించి వేగంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి ప్రశ్నించారు. అతను కన్యాకుమారి జిల్లాలోని కట్టువిలై సమీపంలోని పిల్లయర్గుణం ప్రాంతానికి చెందిన స్టీఫెన్ (38) అని, గజేంద్రన్ ఇంట్లో నగలు దొంగిలించాడని తేలింది. దీని తరువాత, అన్నామలై నగర్ పోలీసులు స్టీఫెన్ను అరెస్టు చేసి, 10 సవర్ల్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో, చోరీకి ఉపయోగించిన ఆయుధాలను చిత్తలపాడి రోడ్డు పక్కన ఉన్న ఒక తాటి చెట్టు దగ్గర పాతి పెట్టినట్లు స్టీఫెన్ చెప్పినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఇన్స్పెక్టర్ అంబేడ్కర్, పోలీసులు గురువారం స్టీఫెన్తో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. చిత్తలపాడి రోడ్డులోని ముళ్లపొద వద్ద ఒక్క తాటి చెట్టు రాగానే, స్టీఫెన్ అకస్మాత్తుగా తాను దాచిన కత్తితో పోలీసు జ్ఞానప్రకాష్ చేతిని నరికి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అంబేడ్కర్ ఆత్మరక్షణ కోసం తుపాకీతో స్టీఫెన్ కాలిపై కాల్చాడు. మోకాలి కింద బుల్లెట్ దిగడంతో స్టీఫెన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని రక్షించి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన పోలీసు జ్ఞానప్రకాష్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు
● మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ తిరువళ్లూరు: జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాముఖ్యత ప్రాతిపదికన నివేదికను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి నాజర్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి ఏప్రి ల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ రానున్నారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష మందికి పట్టా, పింఛన్, పక్కా గృహాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై అన్ని శాఖలకు చెందిన అధికారులతో మంత్రి నాజర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పను లు, శంకుస్థాపన చేసి ప్రారంభం కాని పనులు, మధ్యలో ఆగిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యంగా సాగడానికి గల కారణాలను తెలుసుకోవడంతోపాటు సాధ్యమైన మేర కు పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రాక సందర్భంగా జిల్లాకు అవసరమైన పనులపై సైతం ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రయారిటీ ఆధారంగా పనులను ఎంపిక చేయాలని సైతం కోరారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, ఆవడి మేయర్ ఉదయకుమార్, కమిషనర్ కందస్వామి, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి నడిపిన బస్సు కింద పడి కుమారుడి మృతి
సేలం: ఆత్తూర్లోని ప్రైవేటు పాఠశాల బస్సును తండ్రి రివర్స్ తీసుకున్న సమయంలో ఆ బస్సు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న కీరిపట్టి మేల్ కనవాయ్ ప్రాంతా నికి చెందిన వ్యక్తి రాజవేల్ (24) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి కుమారుడు యోకిత్ రాజ్ (ఒకటిన్నర వయస్సు) ఉ న్నాడు. రాజవేల్ ఎప్పటిలాగే బుధవారం సాయంత్రం విద్యార్థులను ఇళ్లలో దిగిబెట్టి రాత్రి తన ఇంటికి వెళ్లాడు. తర్వాత గురువారం ఉదయం పాఠశాలకు విద్యార్థులను తీసుకువెళ్లడానికి ఇంటి ముందు ఉంచిన బస్సును రాజవేల్ తీశాడు. ఆ సమయంలో బ స్సును రివర్స్ తీయగా బస్సు వెనుక ఉన్న కుమారుడు యో కిత్ రాజ్ దాని కిందపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా కన్న తండ్రి చేతిలోనే కుమారుడు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది. -
సత్తా చాటిన క్రీడాకారులు
సాక్షి,చైన్నె: డ్రీమ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ 15వ టేబుల్ టెన్నిస్ పోటీల్లో దివ్యాన్షి, అనన్య, సైన్ తమ ప్రతిభను చాటారు. చైన్నెలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డ్రీమ్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ టేబుల్ టెన్నిస్ పోటీలు ఉత్తేజకరంగా కొనసాగాయి. బాలురు, బాలికల విభాగాల్లో గ్రూప్ మ్యాచ్లలో అద్భుత ప్రతిభను క్రీడాకారులు ప్రదర్శించారు. బాలికల విభాగంలో భౌమిక్ దివ్యాన్షి గ్రూప్ ఏ–1లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఆమె తన ప్రత్యర్థులందరిపై 3–0 తేడాతో విజ యం సాధించారు. మురళీధరన్ అనన్య గ్రూప్ఏ–2లో ఆధిపత్యం చెలాయించారు. గ్రూప్–4లో శ్రేయ అసాధారణ ఫామ్ను ప్రదర్శించారు. ఒక్క సెట్ను కోల్పోకుండా తన అన్ని మ్యాచ్లను గెలుచుకున్నారు. బాలుర జట్టులో రిత్విక్ గుప్తా, సాహి ల్ రావత్ ఆధిపత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు, వారి గ్రూప్ మ్యాచ్లను 3–0 విజయాలతో కై వసం చేసుకున్నారు. నవరంగ్ అధర్వ, సురపురెడ్డి త్రిషల్ రాజ్కుమార్ కూడా వారి మ్యాచ్లలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వోహ్రా త్రిజల్, భివాండ్కర్ పరమ్ మధ్య జరిగిన ఐదు సెట్ల పోరాటం (9–11, 11–5, 7–11, 16–14, 12–14) అద్భుత క్రీడకు నిదర్శనంగా నిలిచింది. ఈ టోర్నమెంట్ రెండు విభాగాల్లోనూ ఆశాజనకంగా యువ ప్రతిభను హైలెట్ చేశారు. కిన్లే జియా, రే అహోనా, పాల్ దివిజా, దాస్ అన్వేష వంటి ఆటగాళ్లు కూడా బలమైన ప్రదర్శన ఇచ్చారు. శనివారం సాయంత్రం జరిగే ఫైనల్స్తో చాంపియన్స్కు క్రీడల శాఖకార్యదర్శి అతుల్యమిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి, క్రీడాకారులు శరత్కమల్ బహుమతులను ప్రదానం చేయనున్నారు. -
20 లక్షల మందికి ల్యాప్టాప్లు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతతో కూడిన ల్యాప్టాప్లు అందించనున్నామని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. ఇందు కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భా గంగా శుక్రవారం ఉదయం స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 3 వేల రేషన్ దు కాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి పెరియకరుప్పన్ తెలిపారు. అన్ని రేషన్ దుకాణాల వద్ద ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తామని మంత్రి చక్రపాణి తెలిపారు. 2,686 ఆరోగ్యకేంద్రా ల్లో పాము, కుక్క కాటుకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని రకాల మందులు పూర్తి స్థాయి లో నిల్వ ఉంచామని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. అన్యాక్రాంతమైన ఆలయ స్థలాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఏ ఒక్క స్థలాన్ని వదలుకునే ప్రసక్తే లేదని మంత్రి శేఖర్బాబు తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు అనుబంధ బడ్జెట్ ను దాఖలు చేశారు. 2024–25 ఏడాదిలో పెట్టిన ఖర్చులు, ఆదాయ వివరాలను ప్రకటించారు. అదనపు నిధులు.. 2024–25లో అనుబంధంగా రూ.19,287 కోట్లతో బడ్జెట్ను దాఖలు చేశారు. రెవెన్యూ రూ.12,639 కోట్లు, మూలధనం రూ.6,429, రుణం రూ.218 కోట్లుగా లెక్కలు చూపించారు. కొత్త సేవలు, అందుకు అవసరమైన సాధానాల కొనుగోలుకు నిధుల మంజూరు గురించి ప్రస్తావించారు. ఆహార భద్రత, వినియోగదారుల విభాగానికి రూ.2 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,400 కోట్లు, విద్యుత్బాకాయిల చెల్లింపునకు రూ.1,036 కోట్లు, రవాణా సంస్థకు రూ.1000 కోట్లు, ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎదురైన నష్టాన్ని భర్తీ చేయడానికి రూ. 901 కోట్లు కేటాయించినట్టు పద్దులు చూపించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రకట న చేశారు. 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించనున్నామని ప్రకటించారు. ఇందు కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఒక్కో ల్యాప్టాప్ రూ.20 వేల విలువతో నాణ్యత తో కూడుకున్నదిగా, విద్యార్థులు మరీ ఉపయోగించుకునేలా కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. నాణ్యత గురించి ఆందోళన వద్దు అని, ముందుగా తమరి లెక్కల గురించి ఓసారి చూసుకోండి అని అన్నాడీఎంకే వర్గాలను ఉద్దేశించి చేసిన లెక్కల పద్దు పెద్ద చర్చకే సభలో దారితీసింది. లెక్కల చర్చ.. అన్నాడీఎంకే కార్యాచరణను బీజేపీ రూపకల్పన చేస్తున్నట్టుగా మంత్రి తంగం తెన్నరసు ఎద్దేవా చేశారు. తమరి కార్యకర్తల భవిష్యత్తు లెక్కలను ఎక్కడో కూర్చుని(ఢిల్లీ)లో వేసుకుంటున్నారని చాణుక్యతంత్రాలు జరుగుతున్నాయని, తమరి బలాన్ని లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారంటూ చమత్కరించారు. లెక్కల్లో జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్తు కష్టతరమే అని హెచ్చరించారు. ఇందుకు అన్నాడీఎంకే సభ్యులు ఎదురు దాడికి దిగగా, చివరగా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, లెక్కల్లో తప్పులుంటే శుభాకాంక్షలు అని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇక, మీడియాతో అన్నాడీఎంకే ప్రధాన కార్య దర్శి పళణిస్వామి మాట్లాడుతూ, తమ లెక్కలు తమకు ఉన్నాయని, ముందుగా వారి కూటమి లెక్కలు తప్పకుండా చూసుకోమనండి అని డీఎంకే ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. లెక్కల్లో తాము పర్ఫెక్ట్ అని, వారి లెక్కలు వారు సక్రమంగా చూసుకుంటే మంచిదని హితవు పలికారు. రూ.2 వేల కోట్ల కేటాయింపు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి వెల్లడి అనుబంధ బడ్జెట్ దాఖలు సభలో లెక్కల చర్చ -
తిరుచ్చిలో కలైంజ్ఞర్ విజ్ఞాన కేంద్రం
సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ కరుణానిధి స్మారక బ్రహ్మాండ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రాన్ని తిరుచ్చిలో ఏర్పాటు చేయనున్నారు. రూ.290 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు శుక్రవారం సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే, ఆలయాలలో ఏకకాల పూజల నిమిత్తం నిధులు అందజేశారు. సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. హిందూ మత ధర్మాదాయ శాఖ నేతృత్వంలో ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 17 వేల ఆలయాల్లో ఏక కాల పూజల కోసం రూ.85 కోట్లు, విస్తరణ కింద అదనంగా 1000 ఆలయాలలో ఏక కాల పూజల నిమిత్తం డిపాజిట్ నిధిగా ఒక్కో ఆలయానికి రూ.2.50 లక్షలను సీఎం స్టాలిన్ అందజేశారు. మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.110 కోట్లు పంపిణీ చేశారు. దేవాలయాల్లో పనిచేసే పూజారుల పిల్లల సంక్షేమం కోసం, వారి ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్గా గత 2 సంవత్సరాల్లో 900 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందించారు. మంత్రి శేఖర్బాబు, సీఎస్ మురుగానందంఅదనపు ప్రధాన కార్యదర్శి డా.కె. మణివాసన్, దేవదాయ శాఖ కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ సి.పళని, జాయింట్ కమిషనర్ పి. జయరామన్ పాల్గొన్నారు. తిరుచ్చిలో.. తిరుచ్చిలో రూ.290 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి హంగులతో కలైంజ్ఞర్ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకు స్థాపన చేశారు. కావేరి నదీ తీరంలోని తిరుచ్చి నగరంలో బ్రహ్మాండ హంగులతో ఈ భవనం నిర్మించనున్నారు. 1,97,337 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులతో లైబ్రరీ భవనం రూ.235 కోట్ల అంచనా వ్యయంతో తీర్చిదిద్దనున్నారు. రూ.50 కోట్లతో పుస్తకాలు, రూ. 5 కోట్లతో ఇతర టెక్నాలజీ సంబంధిత అంశాలను కొలువు దీర్చనున్నారు.1000 సీట్లతో ఆడిటోరియం సైతం రూపుదిద్దుకోనున్నది. చిన్న పిల్లల కోసం థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. రెండవ అంతస్తులో పరిశోధన కేంద్రం, వర్క్ షాపు, నాల్గవ అంతస్తు రోబోటిక్స్, డిజిటల్ సంబంధించిన అంశాలు, ఐదవ అంతస్తులో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కానున్నది. అరుదైన పుస్తకాల కోసం ఒక విభాగం ..డిజిటలైజేషన్ ప్రాంతం, డిజిటల్ స్టూడియో, పోటీ పరీక్షకు అవసరమయ్యే పుస్తకాలతో ఒక విభాగం, సెమినార్ హాల్స్ వంటి అనేక హంగులతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు. -
తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
సేలం: షార్జా నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి అక్రమంగా తరలించిన రూ.70 లక్షల విలువ చేసే బంగారాన్ని అధికారులు గురువారం రాత్రి స్వాధీ నం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయానికి షార్జా నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికుల విమానం గురువారం రాత్రి వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికులను విమానాశ్రయ ఇంటలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఒక ప్రయాణికుడి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు తన శరీరంలో 780 గ్రాముల బరువు గల రూ.71లక్షల విలువ చేసే బంగారం ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 211 నక్షత్ర తాబేళ్ల్లు స్వాధీనం అన్నానగర్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 211 నక్షత్ర తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ సమావేశం జరుగుతుండడంతో చైన్నె పోర్ట్ ప్రాంతంలో పోలీసులు నిత్యం వాహన తనిఖీలు నిర్వహిస్త్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అసిస్టెంట్ కమిషనర్ రాజా, ఇన్స్పెక్టర్ లోకేశ్వరి నేతృత్వంలో పోలీసులు ఆర్బీఐ కార్యాలయం సమీపంలోని రాజాజీ రోడ్డులో వాహన తనిఖీలు చేశారు. ఆ సమయంలో పోలీసులు వేగంగా వస్తున్న ఆటోను ఆపి, సోదాలు చేశారు. ఆటోలో రెండు బస్తాలు ఉన్నట్టు గుర్తించి తనిఖీ చేశారు. అందులో 211 నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో యాసిన్ను అరెస్టు చేశారు. అనంతరం నక్షత్ర తాబేళ్లతోపాటు, నిందితుడిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆకట్టుకున్న అర్జున తపస్సు పళ్లిపట్టు: పొదటూరుపేటలోని ద్రౌపదీ దేవి ఆలయంలో అగ్నిగుండ వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అర్జున తపస్సు ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో గ్రామీణులు పాల్గొన్నారు. అర్జున వేషధారి మెట్టు మెట్టుకూ ప ద్యాలు పాడుతూ ఈశ్వరుడి కోసం అర్జునుడి తపస్సు ఆకట్టుకుంది. చివరగా అర్జునుడు తనతో తీసుకెళ్లిన నిమ్మకాయలు, పండ్లు, విబూది ప్రసాదాలను భక్తులపై చల్లారు. వాటి కోసం సంతానప్రాప్తి లేని మహిళలు తడిబట్టలతో వరపడ్డారు. ఆదివారం అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా భక్తులు కంకణాలు ధరించి దీక్షలు చేపట్టారు. 103 కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరి అరెస్టు అన్నానగర్: పల్లావరం సమీపంలో గురువారం రాత్రి కారులో అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ నుంచి చైన్నె మీదుగా విలాసవంతమైన కారులో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు శంకర్ నగర్ పోలీసులకు గురువారం రాత్రి పక్కా సమాచారం అందింది. దాని ఆధారంగా తాంబరం–మధురవాయల్ బైపాస్లోని అనగపుత్తూరు వంతెనపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటు వైపు వస్తున్న కర్ణాటక నంబర్ ప్లేట్ ఉన్న ఓ లగ్జరీ కారును పోలీసులు అడ్డుకుని సోదాలు చేశారు. కారులో పెద్ద బ్యాగులో 103 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. శంకర్ నగర్ పోలీసులు కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో మదురై జిల్లా ఉసిలంబట్టి అమ్మన్ కోవిల్ వీధికి చెందిన డేనియల్ రాజా (34), పాండియన్ నగర్, మేలమడై, మదురై రెండో వీధికి చెందిన పరమన్ (45) నిందితులుగా గుర్తించారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి తక్కువ ధరకు గంజాయిని పెద్దమొత్తంలో కొనుగోలు చేసి తమిళనాడు అంతటా రవాణా చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ స్మగ్లింగ్లో ఎవరెవరున్నారనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే పూందమల్లి పక్కనే ఉన్న సెన్నీరుకుప్పం ప్రాంతంలో ఆటో నడుపుతున్నట్లు నటించి కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న అదే ప్రాంతానికి చెందిన శంకర్ (23), అతని స్నేహితులు ఆకాష్ (21), ప్రవీణ్ (24), సయ్యద్ ఇసాక్ (19)లను పోలీసులు అరెస్టు చేశారు. -
కండలేరు నీటిని విడుదల చేయండి
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి, చెమరంబాక్కం, పుళల్లో నీటిమట్టం తగ్గుతున్న క్రమంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేయాలని తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ క్రమంలో లేఖకు ఆంధ్ర అధికారులు స్పందిస్తూ ఏప్రిల్ మొదటి వారంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాధానమిచ్చారు. చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కు ఆంధ్రా నుంచి వచ్చే కృష్ణాజలాలతో పాటు వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరే ప్రధాన ఆధారం. రెండు రాష్ట్రాల మధ్య జల ఒప్పందంలో భాగంగా ప్రతి ఏటా కండలేరు నుంచి 12 టీఎంసీల నీటిని విడతల వారిగా విడుదల చేయాల్సి వుంది. కండలేరు నుంచి వచ్చే నీటిని పూండిలో నిల్వ వుంచి అక్కడి నుంచి చెమరంబాక్కం, పుళల్కు తరలించి అక్కడ శుద్ధీకరణ చేసిన తరువాత చైన్నె ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల రిజర్వాయర్ల నీటి మట్టం వేగంగా తగ్గింది. దీంతో భవిష్యత్తులో చైన్నె తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాఽశఽం వుందని భావిస్తున్న అధికారులు కండలేరు నుంచి నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఏప్రిల్ మొదటి వారంలో కండలేరు నుంచి నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ గ్రామానికి చెందిన ఐటీఐ విద్యార్థి శబరినాథన్(19). వెంగల్ సమీపంలోని ఆవాజీపేట గ్రామానికి చెందిన ప్లస్ఒన్ విద్యార్థి జగదీష్(16). ఇద్దరూ పాక్కంలోని సేవాలయ విద్యాసంస్థలో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ద్విచక్ర వాహనంలో పాక్కం నుంచి వెంగల్కు బయలుదేరారు. తామరపాక్కం క్రాస్రోడ్డు వద్ద వెళుతుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. అదేసమయంలో పెద్దపాళ్యం నుంచి వెంగల్ వైపు వస్తున్న లారీ వారి పైకి దూసుకెళ్లడంతో సంఘటన స్థలంలోనే ఇద్దరూ మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు. లిఫ్ట్ వైర్ తెగిన ప్రమాదంలో ఒకరు: లిఫ్ట్వైర్ తెగి పడడంతో కార్మికుడు మృతి చెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ కారణినిజాంపట్టు గ్రామానికి చెందిన మణిగండన్(33). ఇతడికి మీనా అనే భార్య, లలిత్(03), భవ్యశ్రీ(01) అనే ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతను ముగ్గుపిండి, ఉప్పు సైకిల్పై గ్రామాల్లో విక్రయించడం, రాత్రి కారణినిజాంపట్టులోని విజయ మెటల్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి కంపెనీలో పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా లిఫ్ట్ వైర్ తెగి మణిగండన్పై పడడంతో మృతిచెందాడు. గ్రామస్తులు కంపెనీ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. బైక్ చోరీ చోరీ చేసి పారిపోతూ.. బైక్ చోరీ చేసి తప్పించుకునే క్రమంలో వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైన యువకుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి సమీపంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడపడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురై మృతి చెందాడు. విచారణలో ద్విచక్ర వాహనం కడంబత్తూరుకు చెందిన గోపినాఽథ్కు చెందిందని నిర్ధారించి దర్యాప్తును ప్రారంబించారు. గోపినాఽథ్కు చెందిన వాహనాన్ని రాణిపేటకు చెందిన ఆర్ముగం చోరీ చేసి తప్పించుకునే క్రమంలో వేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురై మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
వేలూరు: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు డీజీపీ డేవిడ్సన్ ఆశీర్వాదం పోలీసులను ఆదేశించారు. గురువారం వేలూరు వచ్చిన ఆయన డీఐజీ కార్యాలయాన్ని తనఖీ చేశారు. అనంతరం పోలీసుల బదిలీల ఫైల్, కేసుల వివరాలను డీఐజీ దేవరాణి, ఎస్పీ మదివాణన్లతో సమీక్షించారు. ఆ సమయంలో డీఐజీ కార్యాలయానికి వచ్చిన ఒక కుటుంబాన్ని ఆయన విచారణ జరిపారు. ఆ సమయంలో తన భర్త తనను మోసం చేసి ఇంట్లో ఉన్న బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని వేరే మహిళను వివాహం చేసుకున్నాడని, దీనిపై గత జూలై మాసంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. వినతిని స్వీకరించిన ఏడీజీపీ వెంటనే వీటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం, కాట్పాడి, అనకట్టు, గుడియాత్తం వంటి పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సాయంత్రం వేలూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని సీఐలతో శాంతి భద్రతలపై సమీక్షించారు. -
కొత్త చిత్రానికి విశాల్ రెడీ!
తమిళసినిమా: నటుడు విశాల్ జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. 2023లో మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన విశాల్ ఆ తర్వాత నటించిన రత్నం చిత్రం 2024లో విడుదలై పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఆ లోటు భర్తీ చేసే విధంగా గత 12 ఏళ్ల క్రితం కథానాయకుడుగా నటించిన మదగజరాజా చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విశాల్ తుప్పరివాలన్–2 చిత్ర రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అదేవిధంగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే విశాల్ ముందుగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో నటిస్తారా, లేక రవి అరసు దర్శకత్వంలో నటిస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తుప్పరివాలన్ –2 చిత్రం తర్వాతే మరో చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవల విశాల్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనపై రకరకాల ట్రోల్స్ చేశారు. అయితే చాలా త్వరగా రికవరీ అయిన విశాల్ మళ్లీ షూటింగ్తో బిజీ కావడం ద్వారా తన గురించి కామెంట్ చేసిన వారికి స్ట్రాంగ్గా బదులు ఇచ్చారనే చెప్పాలి. విశాల్, దర్శకుడు రవి అరసు -
పాముకాటుతో పాములు పట్టే వ్యక్తి మృతి
– కోవైలో కలకలం సేలం : ఎన్ని పాలు పోసి పెంచినా చివరికి పాము కాటు వేస్తుందనే చందంగా పాములను పట్టి సురక్షితంగా అడవి ప్రాంతాలలో వదిలే వీరుడు పాము కాటుకు గురైన ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన కోవైలో కలకలం రేపింది. కోయంబత్తూరు జిల్లా మరుదమలై సమీపంలో ఉన్న వడవల్లి ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ (39). ఇతని నివాస ప్రాంతాలలోకి చొరబటే పాములను పట్టి సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టే పని చేస్తూ వచ్చారు. 20 ఏళ్లకు పైగా పలు ప్రాంతాలు, ఇళ్లలో చొరబడిన విషపూరిత నాగుపాముతో సహా అనేక రకాల పాములను సంతోష్ పట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈనేపథ్యం గత 17వ తేదీ ఉదయం కోవై తొండాముత్తూర్ నాల్రోడ్డు ప్రాంతంలో ఉన్న ఒక నివాస ప్రాంతంలో నాగుపాము ఉన్నట్టు సమాచారం అందడంతో సంతోష్ అక్కడికి వెళ్లారు. నాగుపామును పడుతుండగా అకస్మాత్తుగా అది సంతోష్ను కాటువేసింది. స్పృహ తప్పి పడిపోయిన సంతోష్ను స్థానికులు కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి వైద్యులు తీవ్ర చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ స్థితిలో బుధవారం చికిత్స ఫలించగా సంతోష్ మృతి చెందాడు. కాగా సంతోష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నివాస ప్రాంతాలలోకి చొరబడే పాము కాటు బారిన పడకుండా అటు ప్రజలను, ప్రజల బారి నుంచి పాములను కాపాడుతూ వచ్చిన సంతోష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మత్తు పదార్థాల విక్రయం
● ఐదుగురి అరెస్ట్ వేలూరు: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ప్రాంతంలో గంజాయి, హాన్స్, గుట్కా వంటి మత్తు పదార్థాలు దుకాణాల్లో జోరుగా విక్రయాలు సాగుతున్నట్లు ఎస్పీ శ్రేయో గుప్తాకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించి వీటిపై విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పోలీసులు నేతాజీ నగర్లో వాహన తనికీలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన అదే ప్రాంతానికి చెందిన గౌతమ్, సంతోష్, సెల్వన్, వినాయకం, రాజేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో వీరు సిగిరెట్లో గంజాయి పెట్టి విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం వారు వద్ద ఉన్న రెండు కిలోల గంజాయి, హాన్స్, గుట్కా, రూ.10,500 వేల నగదు, తొమ్మిది సెల్ఫోన్లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఐదుగురు కలిసి ప్రతిరోజూ రైల్యేస్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో ప్రయాణికులకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి ఆంబూరు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. -
ఆవిష్కరణలకు వేదికగా ఐసీసీ ఐడియా
సాక్షి, చైన్నె: కొత్త ఆవిష్కరణలు, ప్రోత్సాహం, భవిష్యత్తు నిర్మాణానికి పరిశోధకులకు ఐసీసీ ఐడియా ఒక వేదికగా నిలిచింది. ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టె క్నాలజీలో గురువారం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్స్–2025 కార్యక్రమం జరిగింది. పపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు , పరిశ్రమ నిపుణులను ఈ కార్యక్రమం ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది. ఎస్ఆర్ఎం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. పొన్నుసామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హాజరైన ముంబైకి చెందిన ఐసీఐ అధ్యక్షుడు డాక్టర్ వి. రామచంద్ర తన ప్రసంగంలో ఇంజినీరింగ్ అభివృద్ధి, సిమెంట్ టెక్నాలజీలో స్థిరమైన నిర్మాణ పద్ధతులు , ఆవిష్కరణల పాత్రను వివరించారు. పరిశ్రమ–విద్యా సహకారం , మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భవిష్యత్తు పురోగతిపై విలువైన ధృక్పథాలను విశదీకరించారు. కొచ్చిన్లోని జియో స్ట్రక్చరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ జోసెఫ్ మాట్లాడుతూ, సివిల్ ఇంజనీరింగ్ , స్థిరమైన మౌలిక సదుపాయాలలో పురోగతి గురించి వివరించారు. నిర్మాణ పరిశ్రమ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, 3డీ ప్రింటింగ్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతల పెరుగుతున్న ప్రభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ దిసానాయకే, డాక్టర్ అంజయ్ కుమార్ మిశ్రా, డాక్టర్ అయోతిరామన్ ఆర్., మరియు ఎర్. జయశంకర్ కె. వంటి ప్రముఖులు తమన ప్రసంగాలలో అత్యాధునిక పరిశోధన, పరిణామాలపై వ్యాఖ్యలు చేశారు.శ్రీలంకలోని కొలంబోలోని కర్టిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ రంజిత్ దిసానాయకే తన ప్రసంగంలో వినూత్న నిర్మాణ పద్ధతులు , స్థితిస్థాపక మౌలిక సదుపాయాల భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేశారు. భద్రత , నాణ్యత, పెంచడానికి ఆధునిక మౌలిక సదుపాయాలు, భూకంప నిరోధక డిజైన్లను సమగ్రపరచడం గురించి చెప్పారు.అలాగే, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం గురించి కూడా చర్చించారు. నేపాల్లోని మాధేష్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అంజయ్ కుమార్ మిశ్రా డీన్ నిర్మాణ పనితీరును పెంపొందించడంలో అధునాతన పదార్థాల పాత్రను హైలైట్ చేశారు, ఐఐటీ తిరుపతి నుంచి వచ్చిన డాక్టర్ అయోద్య రామన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో పురోగతి గురించి చర్చించారు, మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి వినూత్నమైన భూ మెరుగుదల పద్ధతులు, భూకంప ఉపశమన వ్యూహాలపై దృష్టి సారించారు. ముంబైలోని అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎర్. జయశంకర్ మాట్లాడుతూ, నిర్మాణ పద్ధతులు, ప్రాజెక్ట్ నిర్వహణలో పురోగతిపై ప్రసంగం చేశారు.ఈ సమావేశం ఇంజనీరింగ్, టెక్నాలజీలో మార్గదర్శక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసే వివిధ సాంకేతిక సెషన్లు , చర్చలను నిర్వహించారు. -
ఎల్–2 ఎంపురాన్ యూనిట్కు ప్రశంసలు
తమిళసినిమా: మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఎల్ 2 ఎంపురాన్. నటి మంజుమోహన్, పృథ్వీరాజ్, టోవినో థామస్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్న్స్ సంస్థ నిర్మించిన తొలి మలయాళ చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈచిత్రాన్ని ఈనెల 27న మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు మోహన్లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన లూసీఫర్ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్నే ఎల్ 2 ఎంపురాన్. రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా నటుడు పృథ్వీరాజ్ ఇటీవల రజనీకాంత్ను కలిశారు. ఈ సందర్భంగా ఎల్ 2 ఎంపురాన్ చిత్ర ట్రైలర్ను రజనీకాంత్కు చూపించారు. ట్రైలర్ చూసిన రజనీకాంత్ చాలా బాగుంది అంటూ ప్రశంసించడంతో చిత్రం మంచి విజయాన్ని సాధించాలని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపిన పథ్వీరాజ్ రజనీకాంత్ను కలవడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. యూఏ సెన్సార్ సర్టిఫికెట్తో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తిరుత్తణిలో ఆక్రమణల తొలగింపు
తిరుత్తణి: తిరుత్తణి పట్టణంలోని ప్రధాన రోడ్లు ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను హైవే శాఖ అధికారులు గురువారం తొలగించారు. తిరుత్తణి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా హైవే శాఖ ద్వారా ప్రధాన రోడ్లు విస్తరణ చేపట్టి తారురోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా కాలంగా ఇరుకై న రోడ్లతో ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యేవారు. ఈ క్రమంలో హైవే శాఖ ద్వారా పట్టణంలోని చిత్తూరు రోడ్డు, బైపాస్ రోడ్డు, అరక్కోణం రోడ్డు, ఎంపీసీ రోడ్డు సహా ప్రధాన రోడ్లలో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో గురువారం మార్కెట్ వద్ద రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన తాత్కాలిక దుకాణాలతో పాటు బస్టాండు సమీపం సుందరవినాయర్ ఆలయానికి ఎదురుగా వుంచిన దుకాణాలను పోలీసుల బందోబస్తు నడుమ హైవే శాఖ డివిజినల్ సహాయ ఇంజినీరు రఘురామన్, సహాయ ఇంజినీరు జ్ఞాణఅరుల్రాజ్ సమక్షంలో ఆక్రమణ దుకాణాలు తొలగించారు. -
నిషేధిత తాబేళ్ల అక్రమ రవాణా
సేలం: బ్యాంకాక్ నుంచి శ్రీలంక మార్గంగా మదురైకి శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం వచ్చింది. అందులో వచ్చిన 100 మందికి పైగా ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు. అప్పుడు వేలూరుకు చెందిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అందులో అటవీ శాఖ నిషేధిత అరుదైన తాబేళ్లు 52, బల్లులు 4, చిన్న పాములు 8 ఉన్నట్టు గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ఆ ప్రయాణికుడి వద్ద విచారించగా, అతను శ్రీలంక నుంచి బయలుదేరే సమయంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద ఈ లగేజీలో చాక్లెట్లు ఉన్నట్టుగాను, మదురై విమానాశ్రయం వద్ద ఉండే వ్యక్తికి అప్పగించాలని కోరాడని విచారణలో తెలిపాడు. -
రూ.7లక్షలతో డ్రోన్
తిరువళ్లూరు: పది నిమిషాల్లో రెండు ఎకరాల భూమికి పురుగుల మందు చల్లే సామర్థ్యం వున్న యంత్రాన్ని కలెక్టర్ ప్రతాప్ రైతుకు గురువారం ఉదయం అందజేశారు. తిరువళ్లూరు జిల్లాలోని రైతులు ఎక్కువగా వరి పంటలను సాగు చేస్తున్నారు. అయితే వ్యవసాయానికి కూలీలు దొరక్కపోవడంతో వరినాటు, కోత, పురుగుల మందు చల్లడానికి యంత్రాల సాయాన్ని తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే భారత్దేశానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ యంత్రాన్ని కలెక్టర్ ప్రతాప్ రైతుకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పురుగుల మందు చల్లడానికి డ్రోన్ పరికరాన్ని వాడనున్నట్టు తెలిపారు. డ్రోన్లో 16 లీటర్ల పురుగుల మందును కలిపి పది నిమిషాల్లో రెండు ఎకరాలకు మందును చల్లవచ్చని తెలిపారు. ఈయంత్రాన్ని వాడడం ద్వారా ఖర్చు తక్కువ కావడంతో పాటు పనులు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశం వుందని వ్యాఖ్యానించారు. యంత్రాన్ని ఎకరరాకు రూ.500 చొప్పున చెల్లించి ఆసక్తి వున్న రైతులు అద్దెకు కూడా తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. -
విజయవంతంగా అధునాతన నేత్ర శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిలో పిన్హోల్ పపిల్లోప్లాస్టీని కార్నియల్ స్క్లెరల్ రిపేర్, ఇంట్రాకోక్యులర్ కణజాలాల రీపోజిషనింగ్ వంటి బహుళ శస్త్రచికిత్సా విధానాలతో కలిపి ఒకే సిట్టింగ్లో విజయవంతం చేశారు. ఈ అధునాతన నేత్ర సంరక్షణలో పురోగతిని సాధించారు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కుడి కంటిలో తీవ్ర గాయాల పాలైన ఒక సీనియర్ పౌరుడి దృష్టిన పునరుద్ధరించడానికి పిన్హోల్ పపిల్లోప్లాస్టీని కార్నియల్, స్క్లెరల్ రిపేర్తో కలిపి సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ అగర్వాల్స్ ఆస్పత్రి ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ వివరించారు. అత్యవసర జోక్యం కార్నియల్ మార్పిడి అవసరాన్ని ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా నివారించిందన్నారు.ఇన్ఫెక్షన్లు , గ్రాఫ్ట్ తిరస్కరణ ప్రమాదాలను గణనీయంగా తగ్గించిందన్నారు. సురక్షితమైన , మరింత ప్రభావవంతమైన దృష్టి పునర్దురణను నిర్దాంచామన్నారు.పీపీపీ బహుళ శస్త్రచికిత్సా విధానాలతో అనుసంధానించడంలో రోగికి ముందుగా ఉన్న కంటి శుక్లంను పరిష్కరించడానికి కంటిలోని కణజాల పునఃస్థాపన చేశామన్నారు. హాస్పిటల్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో 54శాతం కంటే ఎక్కువ కంటి సంబంధిత సమస్యలు, 32శాతం అంధత్వ కేసులు గాయం వల్ల సంభవిస్తున్నాయన్నారు. ఇవి తరచుగా కార్నియల్ మచ్చలు, అస్పష్టతలు ఆస్టిగ్మాటిజంకు దారితీస్తాయన్నారు. ఇలాంటి కేసులలో పీపీపీ విధానం శ్రేయస్కరం అని తాము చాటి చెప్పినట్టు ధీమా వ్యక్తంచేశారు. క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ ఎస్. సౌందరి మాట్లాడుతూ, కార్నియా దృష్టిని కేంద్రీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల ఇది దెబ్బతింటుందని పేర్కొంటూ, పీపీపీ విధానంతో ఒకే సిట్టింగ్తో బహుళ సమస్యలను పరిష్కరించేందుకు మార్గంగా మారిందన్నారు. -
23న ప్రభుత్వ ఉద్యోగుల దీక్ష
సాక్షి, చైన్నె: తమ డిమాండ్ల సాధన నినాదంతో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు జాక్టో – జియో వేదికగా ఈనెల 23న నిరాహర దీక్షకు నిర్ణయించాయి. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులు సమ్మె గంట మోగిస్తామన్న హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. వీరితో మంత్రులతో కూడిన కమిటీ జరిపిన చర్చలు ఫలించ లేదు. బుధవారం ఒకరోజు విధులను బహిష్కరించి ఆందోళనకు సైతం దిగారు. విధులకు రాని వారిని గుర్తించి ఒక రోజు వేతనం కోతకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించారు. ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షకు సిద్ధమయ్యాయి. ఈ నిరసనలతో నైనా పాలకులు స్పందిస్తే సరి లేని పక్షంలో సమ్మే గంట మోగించే దిశగా కార్యాచరణలో ఉన్నాయి. చైన్నె వేదికగా బిజ్ ఫెయిర్ 2025 సాక్షి, చైన్నె : చైన్నె వేదికగా బిజ్ ఫెయిర్ 2025 ఎక్స్పోకు ఏర్పాట్లు చేశారు. ప్రిమియర్ బిజినెస్ నెట్ వర్కింగ్ మహోత్సవం నినాదంతో ఈనెల 22,23 తేదీలలో తేనాంపేట రీజియన్సీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఎక్స్పో జరగనుంది. ఇందులో 80కు పైగా పవర్ ప్యాక్డ్ స్టాల్స్ కొలువు దీర్చనున్నారు. వీటిలో విభిన్న శ్రేణి ఉత్పత్తులను, వివిధ సేవలను కొలువు దీర్చనున్నారు. ఇందులో పాల్గొనే వారికి వివిధ లక్కీడిప్ల ద్వారా బహుమతులను సైతం అందించనున్నారు. డ్రైవర్, కండక్టర్పోస్టుల భర్తీకి ఆదేశాలు సాక్షి, చైన్నె: ప్రభుత్వ రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,274 డ్రైవర్ , కండెక్టర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం జారీ అయ్యాయి. ఈ పోస్టులకు గాను శుక్రవారం నుంచి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. చైన్నె సహా 8 జోన్ల పరిధిలోని 25 ప్రాంతాల్లో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కుంభకోణంలో 756, సేలంలో 486, చైన్నెలో 364, నైల్లెలో 362 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగాఅన్నా గ్రామాభివృద్ధి పథకం మేరకు 2329 కుగ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1087 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సీఎం గృహ నిర్మాణ పథకంమేరకు 25 వేల గృహాల నిర్మాణానికిరూ. 600 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, మహిళలకు సురక్షిత ప్రయాణం కల్పించే విధంగా ప్రవేశ పెట్టిన పింక్ ఆటో పథకానికి గాను అర్హులైన మహిళా డ్రైవర్లు దరఖాస్తులు చేసుకోవచ్చు అనిప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్డీపీఐ నేత ఇంట్లో ఈడీ సోదాలు సాక్షి, చైన్నె: కోయంబత్తూరులోని ఎస్డీపీఐ నేత ఇంట్లో గురువారం ఈడీసోదాలు జరిగాయి. కోయబబత్తూరు మేట్టు పాళయం అన్నాజీ రావ్ నగర్కు చెందిన రజాక్ అహ్మద్ ఎస్డీపీఐ పార్టీ కోయంబత్తూరు ఉత్తర జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పాత సామాన్ల దుకాణాలతో పాటుగా కార్ల విడి భాగాల అమ్మకాల దుకాణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గురువారం ఉదయాన్నే ఒక మహిళా అధికారిణితో పాటుగా ఐదుగురు సిబ్బందితో ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. సీఆర్పీఎఫ్ భద్రతతో అక్కడికి ఈడీ అఽధికారులు వచ్చిన సమాచారంతో ఎస్డీపీఐ పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సోదాలు జరిగాయి. రజాక్ వద్ద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినానంతరం అధికారులు వెనుదిరిగారు. విద్యారాణికి ఎన్టీకేలో పదవి సాక్షి, చైన్నె : వీరప్పన్ కుమార్తె విద్యారాణికి నామ్ తమిళర్ కట్చిలో పదవి దక్కింది. ఆమెకు యువజన పాసరై కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ఆ పార్టీ నేత సీమాన్ నిర్ణయించారు. చందనపు స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది వరకు బీజేపీలో కొంత కాలం పనిచేశారు. తర్వాత సామాజిక సేవ అంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం నామ్ తమిళర్ కట్చిలో ఆమె చేరారు. పార్టీలో చురుగ్గా రాణిస్తున్న ఆమెకు యువజన విభాగం పాసరై కన్వీనర్ పదవిని సీమాన్ అప్పగించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
విజయ్ సేతుపతి తాజా చిత్రం టైటిల్ ఇదేనా?
తమిళసినిమా: ౖవెవిధ్య భరితమైన కథా చిత్రాలకు కేరాఫ్గా మారిన నటుడు విజయ్ సేతుపతి. ఈయన తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా దేనికై నా రెడీ అనే విజయ్ సేతుపతి తన 50వ చిత్రం మహారాజాతో సూపర్ హిట్ కొట్టారు. అదే విధంగా ఈయన హిందీలో ప్రతినాయకుడిగా నటించిన జవాన్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. కాగా విజయ్ సేతుపతి తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఒకటి. ఇందులో నటి నిత్యామీనన్ నాయకిగా నటిస్తుండగా యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చక్కని కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా దీనికి ఆకాశం వీరన్ అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. ఇకపోతే చిత్రాన్ని ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా చిత్రం ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్మడు పోయినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాగా నటుడు విజయ్ సేతుపతి తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు న్యూస్. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇప్పటికే తెలుగులో పలు చిత్రాల్లో నటించినా, హీరోగా నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. -
ఇళయరాజాకు సేవాదళ్ అభినందన
లండన్లో జరిగిన వలియంట్ సింఫోనిలో పాల్గొని చైన్నెకు వచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇలయరాజాకు అభినందనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ తరపున తమిళనాడు వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ గురువారం ఇళయరాజను కలిసి పుష్పగుచ్చం, శాలువతో సత్కరించారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. – సాక్షి, చైన్నె ముగ్గురు ఐపీఎస్ల బదిలీ సాక్షి, చైన్నె: ముగ్గురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ హోంశాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ చైన్నె శాంతి భద్రతల విభాగం నార్త్ విభాగం ఐజీ కేఎస్ నరేంద్రన్నాయర్ను ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఐజీగా స్థాన చలనం కల్పించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్. లక్ష్మిని చైన్నె సీఐడీ విభాగం ఐజీగా బదిలీ చేశారు. ఇక్కడున్న పర్వేష్కుమార్ను గ్రేటర్చైన్నె నార్త్ శాంతి భద్రతల విభాగానికి స్థానం చలనం కల్పించారు. -
లంక చెర నుంచి 13 మంది జాలర్లు విడుదల
సేలం : హద్దులుదాటి చేపలు పట్టారని ఆరోపిస్తూ లంక సేనలు అరెస్టు చేసిన తమిళ జాలర్లు 13 మందిని శ్రీలంక కోర్టు విడుదల చేసింది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ పాస్పోర్టు ద్వారా శ్రీలంక నుంచి చైన్నెకి వచ్చిన జాలర్లను సొంత ఊర్లకు ప్రభుత్వ అధికారులు పంపించారు. వివరాలు.. రాష్ట్రం నుంచి గత జనవరి నెల 27వ తేది మైలాడుదురై జాలర్లు ముగ్గురు, నాగపట్నం జాలర్లు నలుగురు, కారైక్కాల్ జాలర్లు ఆరుగురు సహా మొత్తం 13 మంది రెండు మర పడవల్లో సముద్రంలో చేపల వేటకు వెల్లారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి గస్తీకి వచ్చిన శ్రీలంక సముద్రతీర బలగాలు హద్దులుదాటి చేపలు పట్టారని ఆరోపిస్తూ 13 మందిని అరెస్టు చేసి, రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీలంక బలగాలు జరిపిన కాల్పుల్లో కారైకల్కు చెందిన జాలరి సెంతమిళ్ (27) గాయపడినట్టు తెల్తస్తోంది. తర్వాత జాలర్లను శ్రీలంక కోర్టులో హాజరుపరిచి జైలులో బంధించారు. అనంతరం 13 మంది జాలర్లను విడుదల చేయాలని సీఎం స్టాలిన్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశాలు. ఈ క్రమంలో 13 మంది జాలర్లను శ్రీలంక కోర్టు విడుదల చేసింది. దీంతో వారిని శ్రీలంకలో ఉన్న భారత దౌత్యాధికారులకు అప్పగించారు. అయితే 13 మంది జాలర్లకు పాస్పోర్టులు లేకపోవడం వల్ల భారత దౌత్యాధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్, విమాన టిక్కెట్లను ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో బుధవారం అర్థరాత్రి శ్రీలంక నుంచి విమానంలో 13 మంది జాలర్లు చైన్నెకి వచ్చారు. చైన్నె విమానాశ్రయానికి చేరుకున్న 13 మంది తమిళ జాలర్లను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లంక సేనల తుపాకీ కాల్పుల్లో గాయపడిన సెంతమిళ్ను అంబులెన్స్ ద్వారా చైన్నెలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు తరలించారు. 12 మంది జాలర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం ద్వారా సొంత ఊర్లకు పంపించారు. కాగా గురువారం తెల్లవారుజామున రెండు నాటు పడవల్లో చేపల వేటకు వెళ్లిన పదిమంది జాలర్లను శ్రీలంక దళాలు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. -
ఈడీకి హైకోర్టు చెక్
● టాస్మాక్ విచారణపై స్టే ● మధ్యంతర ఉత్తర్వుల జారీ హైకోర్టు సాక్షి, చైన్నె: టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈడీ విచారణకు స్టే విధిస్తూ న్యాయమూర్తులు గురువారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 6వ తేది నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈసోదాలలో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్దమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. కోర్టుకు టాస్మాక్.. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా అధికారులు, సిబ్బందిని విచారణ పేరిట వేధించేందుకు ఈడీ చేస్తున్న ప్రయత్నాలకు స్టే విధించాలని ఓ పిటిషన్లో కోరారు. టాస్మాక్ వ్యవహారాలు మనీ లాండరింగ్ పరిధిలోకి రాదు అని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జరుగుతున్న ఈ విచారణకు స్టే విధించాలని మిగిలిన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ గురువారం న్యాయమూర్తులు ఎంఎస్రమేష్, సెంథిల్కుమార్ బెంచ్లో జరిగింది. ఓ వైపు ఈడీ తరపున వాదనలు,మరో వైపు టాస్మాక్ తరపున వాదనలు, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదులు జోరుగా కోర్టులో సాగాయి. విచారణ సమయంలో న్యాయమూర్తులు సైతం ఈడీకి అంక్షింతలు వేసే విధంగా స్పందించారు. సిబ్బందిని, అధికారులను రేయింబవళ్లు మూడు రోజులు కార్యాలయంలో బంధించే అధికారం ఈడీకి ఉందా? అనిప్రశ్నించారు. ఈ మూడురోజులు జరిగిన సోదాలకు సంబంధించి సమగ్ర వీడియో ఆధారాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా సోదాలు చేశారన్న ప్రశ్నకు తాము నోటీసులు ఇచ్చినట్టు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదన అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ ఈడీ తదుపరి చర్యలకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 25వ తేదీ వరకు టాస్మాక్ వ్యవహారంలో అధికారులపై ఎలాంటి చర్యలు , విచారణ వంటి అంశాలపై దృష్టి పెట్ట కూడదని, సమగ్ర వివరణతో నివేదికను సమర్పించాలని ఈడీని న్యాయమూర్తులు ఆదేశించారు. -
ఐఐటీ మద్రాస్కు పూర్వ విద్యార్థి రూ.5 కోట్లు
సాక్షి, చెన్నై: ఐఐటీ మద్రాస్కు పూర్వ విద్యార్థి డాక్టర్ పరశురామ్ బాల సుబ్రమణియన్ రూ.5 కోట్లు విరాళంగా అందజేశారు. ఆక్వామాప్ పరిశోధన కేంద్రానికి ఈ మొత్తాన్ని అందించారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీ ఆయన్ను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ఆక్వామాప్ పరివర్తనాత్మక నీటి నిర్వహణ, విధానాల పరిష్కారాల కోసం పనిచేస్తుంది. ఈ కేంద్రం భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు(పీఎస్ఏ) కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2022లో డాక్టర్ పరశురామ్ బాలసుబ్రమణియన్, ఇతిహాస రీసెర్చ్ అండ్ డిజిటల్ అధ్యక్షుడు శ్రీకృష్ణన్ నారాయణన్ కలిసి ఆక్వా మాప్ను స్థాపించారు. పరశురామ్ ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్, మేనేజ్మెంట్లో పట్టభద్రుడయ్యారు. -
ప్రభుత్వ బస్సులో మంటలు
అన్నానగర్: పుదుచ్చేరి నుంచి బుధవారం ఉదయం చైన్నె కోయంబేడుకు ప్రభుత్వ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు బయలుదేరింది. మరమ్మతుకు గురైన బస్సులో మెయింటెనెన్స్ పనుల నిమిత్తం డ్రైవర్ త్యాగరాజన్ కోయంబేడు వర్క్షాప్నకు మధ్యాహం నడుపుతూ వెళ్లాడు. బస్సులో ప్రయాణికులు లేరు. కండక్టర్ మనోహరన్ మాత్రమే ఉన్నారు. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో కూవతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బస్సు వెళ్తుండగా బస్సు ముందు వైపు నుంచి పొగలు వచ్చాయి. త్యాగరాజన్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపాడు. బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ కిందకు దిగారు. ఆపై మంటలు ఇంజిన్ నుంచి నల్లటి పొగతో వేగంగా వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫోర్స్ సిబ్బంది, సెయ్యూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది అరగంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై కూవటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఓ ప్రభుత్వ బస్సులో మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
వేసవి పర్యాటక ప్రచారానికి కేరళ శ్రీకారం
కేరళ సంప్రదాయనృత్య ప్రదర్శన సాక్షి, చైన్నె : వేసవి సెలవులలో దేశీయ పర్యటకులను ఆకర్షించేందుకు కేరళ టూరిజం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం స్థానికంగా వేసవి పర్యాటక ఆహ్వాన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర కేరళ, బెకల్, వాయనార్, కన్నూర్, కోలీకోడ్తో పాటూ పర్యాటక ప్రాంతాలన్నీ పర్యాటక ఆకర్షణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ‘కేరళ పర్యాటక రంగాన్ని ఒక ఉత్తేజకరమైన సంస్థగా మార్చడంలో భాగంగా, బలోపేతం దిశగా పాన్ ఇండియా ప్రచారాలకు చైన్నె నుంచి శ్రీకారం చుట్టినట్టు కేరళ పర్యాటక మంత్రి మహ్మద్ రియాజ్ తెలిపారు. కేరళ పర్యాటక డైరెక్టర్ సురేంద్రన్ మాట్లాడుతూ, శాశ్వత ఆకర్షణను నిలుపుకోవడమే కాకుండా, వినూత్న ఉత్పత్తులు, అభివృద్ధిపై దృష్టి పెడుతూ, అన్ని సీజన్లలో పర్యాటకులు తరలి వచ్చేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కేరళ పర్యాటక రంగంలో దేశీయ సందర్శకులు గణనీయమైన వాటాను కలిగి ఉన్నందున,పాఠశాలలకు వేసవి సెలవుల్లో పర్యాటక సంఖ్య పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న వాటాదారులతో భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఫెస్టివల్కు శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 23 వరకు ఇడిక్కిలో ఈ వేడుక జరుగుతుందన్నారు. మార్చి 28 నుంచి 30 వరకు వయనాడ్లోని మనంతవాడిలో మౌంటెన్ బైకింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయన్నారు. ప్రయాణ ప్రియులకు హౌస్బోట్లు, కారవాన్ బసలు, తోటల సందర్శనలు, అడవి రిసార్ట్లు, హోమ్స్టేలు, ఆయుర్వేద ఆధారిత వెల్నెస్ సొల్యూషన్స్, సాహస కార్యకలాపాలు, గ్రామీణ నడకలు, పచ్చని కొండలకు ట్రెక్కింగ్ వంటి విభిన్న అనుభవాలను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కేరళ సంప్రదాయ సంగీత, నాట్య ప్రదర్శనలు మిన్నంటనున్నాయన్నారు. -
కొనుగోలు ధరను పెంచాలి
అన్నానగర్: తమిళనాడులో ఆవిన్ తరఫున పాల ఉత్పత్తిదారుల నుంచి లీటర్ ఆవు పాలను లీటరుకు గరిష్ట ధర రూ.32, గేదె పాలను లీటరుకు రూ.42 నాణ్యత ఆధారంగా కొనుగోలు చేస్తారు. పాల కొనుగోలు ధరను ఆవు పాలకు రూ.45, గేదె పాలకు రూ.51గా నిర్ణయించాలని కూడా పాల ఉత్పత్తిదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కొనుగోలు ధర పెంపు సహా పలు డిమాండ్లను నొక్కి చెబుతూ తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘం తరఫున రోడ్డుపై పాలు పోసి నిరసన చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే బుధవారం దిండుగల్ జిల్లాలో 9 చోట్ల పాల ఉత్పత్తిదారులు నిరసనలో పాల్గొన్నారు. చానార్పట్టి సమీపంలోని మరునూతు గ్రామంలో పాల ఉత్పత్తిదారులు నిరసన తెలిపారు. డబ్బాల్లో తెచ్చిన పాలను రోడ్డుపై పోసి తమ డిమాండ్ల కోసం నినాదాలు చేయడంతో కలకలం ఏర్పడింది. వేడసందూర్ పూడు రోడ్డు, పళని సమీపంలోని తొప్పంపట్టి బస్టాప్, ఊతం ఛత్రంలోని రామపట్టినంబదూర్, కన్నివాడి, వీరూవీడు వద్ద పాల ఉత్పత్తిదారులు ఆందోళనలలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డుపై పాలు పోసి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. -
విజయవంతంగా సైటోరెడక్టివ్ శస్త్రచికిత్స
సాక్షి, చైన్నె: అధునాతన అపెండిక్స్ క్యాన్సర్ కోసం హెచ్ఐపీఈసీతో సంక్లిష్ట కణ పునరుత్పత్తి ( సైటోరెడక్టివ్) శస్త్ర చికిత్సను పూందమల్లిలోని బీవెల్ ఆస్పత్రి వైద్యులు విజయవంతం చేశారు. పది గంటల పాటూ ఈ శస్త్ర చికిత్స జరిగింది. బుధవారం ఈ వివరాలను బీ వెల్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శబరీసన్ మీడియాకు వివరించారు.ప్రమీల దయాలు (47 ) మహిళకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు జరిగిన వైద్య పరిశోధనలతో వ్యాధి వ్యాప్తి పరిధి కారణంగా ఈ కేసు సవాలుగా మారిందన్నారు. ఇందుకు సమన్వయంతో కూడిన శస్త్రచికిత్సా విధానం, తాజా హెచ్ఐపీఈసీ సాంకేతికతతో సైటో రిడక్షన్ను సాధించామన్నారు. ఇది అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించే చికిత్స అని వివరించారు. బీ వెల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ సిజె వెట్రివెల్ మాట్లాడుతూ, 12 ప్రదేశాలలో సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడానికి తాము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నామన్నారు. అధునాతన వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొంటూ తాజా శస్త్ర చికిత్స పది గంటల పాటుగా జరిగిందన్నారు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో కుడి హెమికోలెక్టమీ, మిడ్ ఇలియల్ రిసెక్షన్ , సుప్రాకోలిక్ కంప్లీట్ ఒమెంటెక్టమీ, టోటల్ అబ్డామినల్ హిస్టెరెక్టమీ, బైలేటరల్ సాల్పింగో–ఓఫోరెక్టమీ, పెల్విక్ పెరిటోనెక్టమీ, టోటల్ ప్యారిటల్ పెరిటోనెక్టమీ, పెల్విక్ నోడల్ డిసెక్షన్, ఇలియోస్టమీ ఉన్నాయన్నారు. డాక్టర్లు శబరీసన్, అజయ్ కుమార్, ముహమ్మద్ ఒవైసీ, గుణ శేఖర్, సుధాకర్, ప్రవీణ్ కుమార్, విమల, క్రిస్ నిశాంత్ వంటి నిపుణులైన సర్జన్ల బృందంతో పాటూ అనస్తీషియా డాక్టర్ దేవేంద్రకుమార్ నేతృత్వంలో నర్సింగ్ బృందం వినోద్ కుమార్, జయంతి, జయశ్రీ, మోహన్ రాజ్, మహిమై దాస్, సత్యరాజ్, మణికండన్ వైద్య సేవలు అందించారని తెలిపారు. -
రెట్రో కోసం థాయ్ల్యాండ్కు సూర్య
తమిళసినిమా: పాత్రల కోసం ప్రాణం పెట్టే అతి కొద్ది మంది కోలీవుడ్ నటుల్లో సూర్య ఒకరు. ఆయన ఇంతకుముందు నటించిన జైభీమ్, సూరరై పోట్రు, కంగువ వంటి చిత్రాలే ఉదాహరణ. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెట్రో ఒకటి. ఇది ఆయన నటిస్తున్న 44వ చిత్రం కావడం గమనార్హం. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెయిన్మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్ బెంచ్ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. నటి పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఇందులో జయరామ్, కరుణాకరన్, జోజూజార్జ్, సుజిత్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం సూర్య ఇటీవల థాయ్ల్యాండ్ వెళ్లొచ్చారట. ఎందుకో తెలుసా? అక్కడ ఆత్మరక్షణ విలువిద్యలు నేర్చుకోవడానికి. అవును రెట్రో చిత్రంలోని ఫైట్ సన్నివేశాలు మామూలుగా కాకుండా, సహజత్వంగానూ, వైవిధ్యంగానూ ఉండాలని యూనిట్ వర్గాలు భావించారట. ఇందు కోసం థాయ్ల్యాండ్కు చెందిన స్టంట్మాస్టర్ కేచా ఖమ్పక్డీని ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్గా ఎంపిక చేశారు. ఈయన ఇంతకు ముందు బాహుబలి 2, జవాన్, విశ్వరూపం చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. రెట్రో చిత్రంలో ఫైట్ సన్నివేశాల కోసం సూర్య ఇటీవల థాయ్ల్యాండ్ వెళ్లి కేచా ఖుమ్పక్డీ వద్ద కొన్ని ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందారని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ పుట్టిన రోజు సందర్బంగా రెట్రో చిత్రంలోని వర్కింగ్ సన్నివేశాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు. ఇది ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా మే డే రోజున తెరపైకి రానుంది. -
70 శాతం ఆటో సేవలు బంద్
● పలుచోట్ల నిరసనలు సాక్షి, చైన్నె: ఆటోచార్జీల పెంపునకు డిమాండ్ చేస్తూ చైన్నె, శివారు జిల్లాలో బుధవారం 70 శాతం ఆటో సేవలు బంద్ అయ్యాయి. ఆటో కార్మిక సంఘాల నేతృత్వంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు.. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలను ఆటోవాలా పక్కన పెట్టేసి చాలా కాలం అయింది. మళ్లీ యథారాజా తధాప్రజా అన్నట్టుగా తాము నిర్ణయించిందే చార్జీ అని ఆటోవాల వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆటో సంఘాలు కొత్త చార్జీల జాబితాను ప్రకటించాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దీంతో ఆటో కార్మిక సంఘాలు ఒక రోజు బంద్కు పిలుపు నిచ్చాయి. దీంతో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలోని ఆటో సంఘాలు ఒక రోజు తమ సేవలను నిలుపుదల చేశాయి. 70 శాతం మేరకుఆ టోల సేవలు ఆగాయి. మరో 30 శాతం ఆటోలు రోడ్డెక్కాయి. అయితే ఆటోల బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అన్నది కలగలేదు. ర్యాపిడో, ఊబర్ వంటి సేవలు కొనసాగడంతో ప్రయాణికులకు రవాణా కష్టాలు ఎదురుకాలేదు. సేవలను నిలుపుదల చేసిన ఆటో కార్మికులు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆటోచార్జీలను త్వరితగతిన నిర్ణయిచాలని, ఆన్లైన్ ప్రైవేటు రవాణా సేవలను నిలుపుదల చేయాలని నినదించారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 23,487 మంది స్వామిని దర్శించుకున్నారు. 23,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన వారు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని బుధవారం ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. -
పుదుచ్చేరిలో మహిళకు వరాలు
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి సీఎం రంగస్వామి మహిళలకు అసెంబ్లీ వేదికగా బుధవారం వరాలు కురిపించారు. పసుపు వర్ణ రేషన్ కార్డు(కుటుంబ కార్డు) కలిగిన కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు రూ.1000, రెడ్ కార్డు కలిగిన కుటుంబాల్లోని వారికి రూ.2,500 నగదు ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయించారు. అలాగే, ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీకి ఆదేశించారు. కుమారుడు మృతిచెందాడని తల్లి ఆత్మహత్య తిరువొత్తియూరు: ఈరోడ్లో కుమారుడు మృతి చెందిన దుఃఖంలో ఉన్నటువంటి తల్లి ఆవేదనతో విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ కరుంగల్ పాలయం కమలానగర్కు చెందిన మాధవన్ కూలీ. ఇతని భార్య అమ్ములు (42) వీరికి ఇద్దరు కుమార్తెలు, చెల్లదురై అనే కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు వివాహమై భర్తతో నివాసం ఉంటుంది. ఇక చిన్న కుమార్తె పాలకాటులో ఉన్న ఒక పాఠశాలలో 10 వతరగతి చదువుతోంది. చెల్లదురై 12వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత కాకపోవడంతో అతను గత జనవరి నెల 24వ తేదీ చెల్లదురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం మాధయ్యన్ పూందురై కట్టడ పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అమ్ములు హఠాత్తుగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విచారణలో కుమారుడు మృతి చెందిన దుఃఖంలో అమ్ములు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియ వచ్చింది. ఇంటి తాళం పగులగొట్టి చోరీ ●వ్యక్తి అరెస్టు, 35 సవర్ల బంగారం స్వాదీనం కొరుక్కుపేట: చైన్నెలోని చూలైమేడులో ఓ ఇంటి తాళం పగులగొట్టి డబ్బు, బంగారు నగలు దోచుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 35 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు చూలైమేడు గిల్ నగర్కు చెందిన వెంకట సుబ్రమణియన్ ఎయిర్పోర్టులో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 15న ఇంటికి తాళం వేసి ఉదయం 10.30 గంటలకు నుంగంబాక్కం, అక్కడి నుంచి టి.నగర్ వెళ్లి తిరిగి మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడం చూసి షాక్ అయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న నగదుతోపాటు బంగారం చోరీ చేసినట్టు గుర్తించారు. ఎఫ్–5 చూలైమేడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల రికార్డింగ్లను నిరంతరం పరిశీలించి ఈ కేసుకు సంబంధించి వెస్ట్ మాంబలం లక్ష్మీపురం డాక్టర్ అంబేడ్కర్ వీధికి చెందిన విజయకుమార్ కుమారుడు విక్కీని బుధవారం అరెస్టు చేశారు. నేరానిఇన అంగీకరించాడు. అతని నుంచి 35 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు అన్నానగర్: పొల్లాచ్చి సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ఓ ఇంట్లోకి అదుపుతప్పి ఓ కారు దూసుకెళ్లింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పొల్లాచ్చి సమీపంలోని మాకినంబట్టి మీదుగా మంగళవారం రాత్రి ఓ కారు వేగంగా వెళుతోంది. కారు రోడ్డు మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు ఓ ఇంటి లోపలికి దూసుకెళ్లింది. ఇంటి ప్రహరీ గోడ గోడ కూలిపోయింది. తర్వాత ప్రమాదానికి కారణమైన కారులో వచ్చిన ముగ్గురిని ఆ ప్రాంత ప్రజలు పట్టుకున్నారు. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. -
శ్రవణానందకరం గానామృతం
తిరుపతి కల్చరల్: త్యాగరాజ మండపంలో బుధవారం రాత్రి చైన్నెకి చెందిన ఎస్.ఐశ్వర్య, ఎస్.సౌందర్య అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా గానం చేసి సభికులను శ్రవణానందభరితుల్ని చేశారు. శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ మండపంలో చేపట్టిన అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు బుధవారంతో రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వీరు అన్నమయ్య కీర్తనల స్వలాపనతో భక్తులను అలరింపజేశారు. వీరికి మృదంగంపై కొత్తపల్లి రమేష్, ఘటంపై ఎల్.స్రసాద్, వయోలిన్పై కొమండూరి కృష్ణ చక్కటి సహకారం అందించి రక్తి కట్టించారు. -
ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకోండి
కొరుక్కుపేట: ప్రజలు నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను నగర పోలీసు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల శిబిరంలో ప్రజల నుంచి 26 అర్జీలు అందాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన 26 మంది ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు కమిషనర్ అరుణ్ వారిలో భరోసాను కల్పించారు. ఈక్రమంలో ఫిర్యాదులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ ( గార్డియన్ వెల్ఫేర్ అండ్ ఎస్టేట్ ) ఎస్ మగళిన్ జడాన్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రి ముట్టడి
వేలూరు: వేలూరు సమీపంలోని అడుక్కంబరైలో ప్రధాన ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ రోజూ వేల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తుంటారు. దీంతో ఆస్పత్రి నుంచి వేల లీటర్ల డ్రైనేజీ నీరు ప్రతి రోజూ బయటకు వెళ్లి ఈ నీరు పూర్తిగా డ్రైనేజీ కాలువ ద్వారా సప్తవిపురం చెరువులో కలుస్తుంది. అయితే గ్రామస్తులు ఆస్పత్రి నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని చెరువులో కలపరాదని పలు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ఆందోళనలు చేసినప్పటికీ వాటిని పరిష్కరించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఒక్కసారిగా బుధవారం ఉదయం ప్రభుత్వాస్పత్రి ముఖ ద్వారా వద్దకు చేరుకొని ముందుగా ధర్నా నిర్వహించి అనంతరం రాస్తారోకో చేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో డ్రైనేజీ నీరు చెరువులో కలపడం వల్ల తాము తాగే నీరు కలుషితంగా వస్తున్నాయని వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు. -
ఎగ్మూర్లో జాన్ మార్షల్ విగ్రహం
● ఆవిష్కరించిన సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె : తమిళనాడు న్యూస్ పబ్లిక్ రిలేషనన్స్ విభాగం నేతృత్వంలో ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలో రూ. 50 లక్షలతో సర్ జాన్ హుబర్డ్ మార్షల్ విగ్రహం ప్రతిష్టించారు. ఆయన జయంతి రోజైన బుధవారం ఈ విగ్రహాన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. సింధు లోయ నాగరికతను వెలుగులోకి తీసుకు రావడంతో పాటూ ద్రావిడ నాగరికత గురించి స్పష్టతను ఇచ్చిన బ్రిటీషు ఇండియా పురావస్తు శాస్త్ర వేత్త సర్ జాన్ హుబర్ట్ మార్షల్కు చైన్నెలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు సీఎం స్టాలిన్ గత ఏడాది జరిగిన సింధులోయ నాగరికత దినోత్సవంలో ప్రకటించారు. దీనిని సాకారం చేస్తూ ప్రస్తుతం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించారు. సర్ జాన్ హుబర్ట్ మార్షల్ ఇంగ్లండ్లోని చెస్టర్లో జన్మించారు. 26 ఏళ్ల వయస్సులో ఆయన పురావస్తు పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1924 సెప్టెంబర్ 20వ తేదీన చారిత్రాత్మక సింధు లోయ నాగరికతను ఆయన నేతృత్వంలోని బృందం ప్రపంచానికి చాటి చెప్పింది. సింధు లోయ సంస్కృతికి ద్రావిడ సంస్కృతికి మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నట్టు చాటారు. ఈ దృష్ట్యా, ఆయన్ను గౌరవించే విధంగా చైన్నెలోని ఎగ్మోర్ మ్యూజియం ఆవరణలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిని ఆవిష్కరించిన సీఎం స్టాలిన్ ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. సింధు లోయ నాగరికత గురించి మాట్లాడినంత కాలం జాన్ మార్షల్ గురించి మాట్లాడాల్సిందేనని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ద్రావిడ మోడల్ ప్రభుత్వం మరింత గౌరవాన్ని కల్పించిందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, స్వామినాథన్, ఎం. సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, ఎమ్మెల్యేలు పరందామన్, ప్రభాకర్ రాజా, సీఎస్ మురుగానందం, అదనపు కార్యదర్శి ఉదయ చంద్రన్, ప్రభుత్వ అధికారి రాజారామన్, ఐఏఎస్ కవితా రాము తదితరులు పాల్గొన్నారు. -
మామూలుగా లేదుగా..
కయాడు లోహర్ జోరు తమిళసినిమా: ఏదైనా విజయం అందే వరకే. ఆ తరువాత క్రేజ్ దానంతట అదే వస్తుంది. ఇక అవకాశాల గురించి వేరే చెప్పాలా? వరుస కట్టేయవూ. ఇందుకు తాజా ఉదాహరణ నటి కయాడు లోహర్నే. గత రెండు నెలల క్రితం వరకూ ఈ అమ్మడు ( యువ కథానాయికల్లో ) గుంపులో గోవిందనే. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ అస్సామీ బ్యూటీ 2021లో ముగిల్పేటే అనే కన్నడ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో పతోన్పదం చిత్రం, తెలుగులో అల్లూరి చిత్రం, ప్రేమ్ యు అనే మరాఠి చిత్రం అంటూ ఒక్కో భాషలో ఒక్కో చిత్రంలో నటించింది. అయితే వీటిలో ఏ చిత్రానికి దక్కని విజయం ఇటీవల తమిళంలో నటించిన డ్రాగన్ చిత్రంతో వరించింది. అంతే కాదు ఈ చిత్రం విజయం కయాడు లోహర్ను క్రేజీ హీరోయిన్ను చేసింది. అంతే ఆ ఒక్క విజయం చాలు .మరిన్ని అవకాశాలు వచ్చి పడటానికి. ప్రస్తుతం అధర్వ సరసన ఇదయం మురళి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా తాజాగా మరో జాక్పాట్ ఈమెను వరించినట్లు సమాచారం. సంచలన నటుడు శింబు ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన థక్ లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రను పోషించారు. ఈయనకు జంటగా నటి త్రిష నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా నటుడు శింబు కథానాయకుడిగా నటించనున్న ఆయన 49వ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లినుంది. ఈ చిత్రానికి రామ్కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వమించనున్నారు. ఇందులో నటి కయాడు లోహర్ నాయకిగా నటించనున్నారన్నది తాజా సమాచారం. ఆమెతో పాటూ నటి మృణాల్ ఠాకూర్ కూడా నాయకిగా నటించనున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తెలుగు చిత్రం సీతారామమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాధి భామ ఇంతకు ముందు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు శింబు హీరోగా నటించే చిత్రం ద్వారా కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇకపోతే ఇందులో నటుడు సంతానం ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
● భారత సంతతి వ్యోమగామిపై సునీతా విలియమ్స్పై సభ్యుల ప్రశంసల జల్లు ● త్వరలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తామన్న మంత్రి
సాక్షి, చైన్నె : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. ఈ సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి చక్రపాణి మాట్లాడుతూ, ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానం త్వరలో అమలు చేయనున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పరిశీలన జరుగుతోందన్నారు. అలాగే అధికారులు విదేశాలకు వెళ్లనన్నారని, అక్కడి పౌరసరఫరాల పంపిణి వ్యవస్థను అధ్యయనం చేయనున్నారని వివరించారు. మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 2 లక్షల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి తొలి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మంత్రి నెహ్రు మాట్లాడుతూ చైన్నె, కోయంబత్తూరు, మదురై, నగరాలలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు పరిశీలన జరుగుతోందని, త్వరలో అమల్లోకి వస్తుందని ప్రకటించారు. చైన్నెలో రూ. 2 వేల కోట్లతో వాటర్ పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ, హిందూ మత దేవాదాయ శాఖ నేతృత్వంలో మరో 10 ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని, తిరుత్తణి ఆలయం కోసం ఏనుగును అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి ఎం.సుబ్రమణియన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అదనంగా ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోరితే కేంద్రం నుంచి ఇంత వరకు స్పందన లేదని అసహనం వ్యక్తంచేశారు. కుక్కకాటుకు పరిహారం అసెంబ్లీలో మంత్రి పెరియస్వామి మాట్లాడుతూ, ఇటీవల కాలంగా వీధి కుక్కల స్వైర వివారం గురించి ప్రస్తావించారు. వీధికుక్కుల దాడిలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదులు,కోళ్లు, పెంపుడు జంతువులు చనిపోతున్నట్టు వివరించారు. సీఎం ఎం.కె. స్టాలిన్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించి సమీక్షించామన్నారు. కుక్కకాటుతో మరణించిన మూగ జీవాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి పరిహారం అందించేందుకు నిర్ణయించామన్నారు. పశువులు మరణిస్తే రూ. 37,500, మేకలు, గొర్రెలకు రూ. 4 వేలు, కోడికి రూ. 100 నష్ట పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు కుక్కల దాడిలో మరణించి 1,149 జంతువులకు పరిహారంగా 42 లక్షలు అందించనుమన్నారు. అదే సమయంలో మేకలు, గొర్రెలకు ఇస్తున్న రూ. 4 వేలు ను రూ. 6 వేలకు, కోడికి ఇస్తున్న రూ.100 నుంచి రూ.200లుగా పెంచుతూ సీఎం స్టాలిన్ ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. సునీత అరుదైన వ్యక్తి.. అనంతరం సభలో సీఎం స్టాలిన్ ప్రత్యేక తీర్మానంతో వ్యోమగామి సునీతా విలియమ్స్తోపాటూ అంతరిరక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన నలుగురు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 287 రోజులు గడిపిన భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల గురించి గుర్తు చేశారు. సాంకేతిక లోపం కారణంగా, భూమికి తిరిగి రావడం అసాధ్యం కావడంతో అనేక మంది ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అయితే వారు ఆ అంతరిక్ష కేంద్రంలో అవిశ్రాంతంగా శ్రమిస్తూ, తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని తిరిగి భూమి మీదకు రావడం ఆనందకరం అని వ్యాఖ్యానించారు. ఫాల్కన్–9 రాకెట్ , డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్, అక్కడ ఉన్న మరో ఇద్దరు వ్యోమోగామీలు కలిసి ప్రయాణించి ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కావడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారనే వార్త మనందరినీ చాలా సంతోషంలో ముంచిందన్నారు. ఈ సమయంలో, సునీతా విలియమ్స్, బుచ్ తదితరులను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన వారందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా సభలో సభ్యులు కరతాళ ధ్వనులతో సునీత విలిమ్స్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి , ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి సైతం సునీతా విలిమ్స్ను ప్రశంసించారు. ఎల్లప్పుడూ తమ హృదయాల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. -
రగిలిన ప్రతీకారం
● రౌడీ దారుణ హత్య ప్రత్యర్థి ముఠా ఘాతుకం ● పోలీసు ఛేజింగ్లో కాల్పులు ● నలుగురు రౌడీలకు గాయాలు ●ఇద్దరు పోలీసులకు కూడా.. ●ఈరోడ్ సమీపంలో పట్టపగలు కలకలం సేలం: బెయిల్పై బయటకు వచ్చిన రౌడీని నడిరోడ్డులో ఓముఠా నరికి చంపేసింది. ఈ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు తుపాకులకు పని పెట్టారు. తమ మీద ఆ ముఠా దాడి చేయడంతో కాల్పులు జరిపారు. తుపాకీ తూటాలకు నలుగురి రౌడీలు గాయపడ్డారు. పోలీసులు ఇద్దరు సైతం ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు.. సేలం సుందర్ నగర్కు చెందిన జాన్ పేరు మోసిన రౌడీ. అనేక హత్య, దోపిడి , తదితర కేసులు ఇతడిపై ఉన్నాయి. ఇటీవల బెయిల్ మీద బయటకు జాన్ వచ్చాడు. బుధవారం ఉదయం కారులతో తన భార్య శరణ్యతో పాటూ పోలీసు స్టేషన్లో సంతకం పెట్టి తిరుప్పూర్కు తిరుగు ప్రయాణం అయ్యాడు. వీరిని రహస్యంగా మరోకారులో ముఠా వెంబడించింది. సేలం – ఈరోడ్ రహదారిలోని నషియనూరు వద్ద ఈ ముఠా తమ కారుతో జాన్ కారును ఢీ కొట్టింది. కారును జాన్ ఆపేలోపు ఆ ముఠా కత్తులతో దాడి చేసింది. భార్య శరణ్య కల్లెదుటే జాన్ను నరికి చంపేశారు. తర్వాత అక్కడి నుంచి ఆ ముఠా ఉడాయించింది. ఈ సమాచారం గస్తీలో ఉన్న పోలీసులకు చేరింది. దీంతో కారులో పరారీ అవుతున్న ముఠాను ఇన్స్పెక్టర్ రవి నేతృత్వంలోని పోలీసు ఛేజింగ్ చేశారు. పోలీసుల తమను వెంటాడుతుండటంతో ఓ ప్రాంతంలో కారును ఆపేసిన ఆ ముఠాలోని వారు పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలతో పోలీసులపై దాడిచేశారు. దీంతో ఇన్స్పెక్టర్ రవి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో తూటాల దాడికి నలుగురు రౌడీలు కింద పడ్డారు. వీరందరికి కాళ్ల కింది భాగంలో తూటాలు దిగాయి. సమాచారం అందుకున్న అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడ్డ ఇన్స్పెక్టర్ రవి, కానిస్టేబుల్ లోకనాథంతో పాటూ ఆముఠాకు చెందిన నలుగుర్ని ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు పరారైన సమాచారంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. పట్ట పగలే నడి రోడ్డులో ఈ ఘటన జరగడంతో ఆ పరిసరాలలోఉత్కంఠ నెలకొంది. తుపాకీ తూటాలకు గాయపడ్డ వారిలో రౌడీలు సతీష్, శరవణన్, భూపాలన్, కార్తికేయన్ ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇది ప్రతీకార హత్యగా విచారణలో తేలింది. సమాచారం అందుకున్న ఈరోడ్ ఎస్పీ జవహర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. అయితే తుపాకీకి పని పెట్టిన పోలీసులు సేలం జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. వీరు ఆ ముఠాను చేజింగ్ చేస్తూ కొన్ని కిలో మీటర్లు దూసుకొచ్చినట్టు తేలింది. -
జిల్లాలో అదనపు పోలింగ్ కేంద్రాలు
వేలూరు: వేలూరు జిల్లాలో 1,200 మంది ఓటర్లకు పైగా ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం వేలూరు కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా వివరాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు మార్పుచేయడంతో పాటు నకిలీ ఓటర్లను తొలగించాలని ఎన్నికల కమిషన్కు వినతి పత్రాలు సమర్పించారని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు ఇదివరకు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 1,200 మంది ఓటర్లు అదనంగా ఉంటే మరొక చోట అదనంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, చిరునామ వాటిని మార్పు చేసుకునేందుకు ఇప్పటికే ఆయా తాలుకా కేంద్రాలతో పాటు పోలింగ్ కేంద్రాల్లోనూ జాబితాను నోటీస్ బోర్డులో పెట్టామన్నారు. వేలూరు జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయని అయితే ఇందులోని ఓటర్ల జాబితాను 23 శాతం ఆధార్ కార్డులో లింక్ చేయకుంటే ఓటరు కార్డు యథావిధిగా తీసివేస్తామన్నారు. వీటిపై రాజకీయ పార్టీ ప్రతినిధులు దృష్టి సారించాలన్నారు. కార్పొరేషన్ కమిషనర్ జానకి, ఎన్నికల ప్రత్యేక అధికారి ముత్తయ్యన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్ పాల్గొన్నారు. -
శ్రీరంగనాథుడిని సేవలో వైజయంతి మాల
తమిళసినిమా: నటి వైజయంతిమాల. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది నటి అని కాదు. భరతనాట్య మయూరి అనే. ఈ అద్భుత నాట్యకళాకారిణి 1949లో ఏవీఎం సంస్థ నిర్మించిన వాళ్కై చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఇరుంబుతిరై, పార్థిబన్ కనవు, తేన్ నిలవు, బాగ్దాద్ తిరుడన్ వంటి పలు ఆణిముత్యాలాంటి చిత్రాల్లో నటించారు. వంజికోట్టై వాలిభన్ చిత్రంలో కన్నుమ్ కన్నుమ్ కలందు అనే పాటలో పద్మినితో కలిసి చేసిన నాట్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. చైన్నెలో పుట్టి పెరిగిన వైజయంతి మాల నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ ఎంపీగా ప్రజలకు విశేష సేవలు అందించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన వైజయంతిమాల గత ఏడాది పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా 90 ఏళ్ల నాట్య కళాకారిణి గత ఏడాది అయోధ్యలో భరతనాట్యం నృత్య ప్రదర్శనను ఇచ్చి భక్త జనులకు మధురానుభూతిని కలిగించారు. కాగా ప్రస్తుతం ఈమె వయసు 91 ఏళ్లు. కాగా ఇటీవల వైజయంతిమాల తనువు చాలించినట్లు వదంతులు దొల్లాయి. అయితే అవన్నీ వదంతులే అని ఆమె అనుచరులు కొట్టిపారేశారు. వైజయంతిమాల సోమవారం తిరుచ్చిలోని శ్రీరంగనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీరంగనాథుని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీరంగనాథుడిని, అమ్మవారిని దర్శించుకోవడం భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. తాను 13వ ఏట నుంచే భరతనాట్యంలో అరంగేట్రం చేశానని, కఠిన శ్రమతోనే పేరు, ప్రఖ్యాతలు పొందానని అన్నారు. అనుభూతులు, భక్తినే తనను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. యువత కఠినంగా శ్రమించాలని, శ్రమిస్తేనే ఉన్నత స్థాయికి ఎదగగలరని వైజయంతిమాల పేర్కొన్నారు. ఆలయంలో వైజయంతిమాలతో కుటుంబసభ్యులు -
ఇళయరాజాకు సూర్య అభినందనలు
తమిళసినిమా: వయసును జయించిన సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈయన వయస్సు జస్ట్ 81 సంవత్సరాలు మాత్రమే. నిత్యకృషీవలుడు. నేటికీ బిజీ సంగీత దర్శకుడు. కాగా సంగీతంలో ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన ఇళయరాజా తాజాగా లండన్లో వలియంట్ సింఫోని చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ప్రముఖ సినీ, రాజకీయ నేతలు అభినందల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు శివకుమార్, ఆయన కుమారుడు, సూర్య, కూతురు బృంద బుధవారం ఆయన్ని కలిసి పూలగుచ్ఛాన్ని అందించి అభినందించారు. ఆ పోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
రూ.5,145 కోట్లతో చైన్నె ప్రగతి బడ్జెట్
● దాఖలు చేసిన మేయర్ ప్రియ సాక్షి,చైన్నె: 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ బడ్జెట్ను మేయర్ ప్రియ బుధవారం దాఖలు చేశారు. రిప్పన్ బిల్డింగ్లో బడ్జెట్ దాఖలు నిమిత్తం పాలకమండలి సమావేశమైంది. డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ ఈ సమావేశాన్ని పర్యవేక్షించారు. రూ. 5145 కోట్లతో చైన్నెప్రగతిని కాంక్షిస్తూ బడ్జెట్లో నిధులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల విస్తృతం లక్ష్యంగా 3 ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించారు. నగరంలోని 80 వేల వీధులలో రూ. 3 కోట్లతో రేబిస్ టీకాలువేయడం లక్ష్యంగా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆస్తి పన్ను వసూళ్లు సులభతరం చేయడానికి కొత్త ఆన్లైన్ సేవలకు చర్యలు తీసుకున్నారు. నగరంలోకి బస్టాప్లను రూ. 30 కోట్లతోఅభివృద్ధి చేయనున్నారు. అలాగే,నగరంలోని నాలుగు బస్టాండ్లను ఆధునీకరించి సేవలను విస్తృతం చేయనున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రూ.20 కోట్లతో 150 క్రీడా మైదానాలను అన్ని రకాల క్రీడా ఉపకరణలతో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర చైన్నెలో 2 చోట్ల కొత్త ఇండోర్ వాలీబాల్ స్టేడియం నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు కేటాయించారు. చైన్నె నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశ ద్వారాలు, రోడ్డు జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలతో కూడిన కృతిమ నీటి ఫౌంటేన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. కార్పొరేషన్ సేవలను సులభతరం చేస్తూ, ఫిర్యాదుల స్వీకరణ,పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్సైట్, మొబైల్ యాప్ రూపకల్పనకు నిర్ణయించారు. ‘‘చైన్నె కార్పొరేషన్ వార్డుల అభివృద్ధి నిధులను రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచారు. మేయర్ అభివద్ధి నిధిని రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెంచారు. అన్ని శ్మశాన వాటికలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో జనరేటర్ ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీటి పారుదలపనులకు రూ. 1,032 కోట్లు కేటాయించారు. ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్లలో, కీలక ప్రాంత సుందరీకరణ రూ.42 కోట్లు కేటాయించారు. మనాలి, సాలిగ్రామం, తదితర నాలుగు బస్ టెర్మినల్స్లలో సౌకర్యాలను మెరుగు పరచనున్నారు. చైన్నెలో మూడు దశల్లో ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాగా, బడ్జెట్లో, ఆదాయం రూ.5145.52 కోట్లు ఆదాయ వ్యయం రూ.5214.09 కోట్లుగా చూపించారు. -
విజయవంతంగా సీఐఆర్ఈ సదస్సు
సాక్షి, చైన్నె: కావేరి హాస్పిటల్ నేతృత్వంలో కొలాబరేటివ్ ఆఫ్ ఇండియన్ రుమటాలజీ ఎడిటర్స్(సీఐఆర్ఈ) మెడికల్ అకాడెమిక్ పబ్లిషింగ్ పై మొదటి అంతర్జాతీయ సదస్సు మంగళవారం జరిగింది. ఆళ్వార్ పేటలోని కావేరిఆస్పత్రిలో జరిగిన ఈ సదస్సులో మెడికల్ అకడమిక్ పబ్లిషింగ్, వైద్య సంబంధిత అంశాలగురించి చర్చించి అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇందలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, పరిశోధకులు, నిపుణులను ఒకచోట చేర్చి వైద్య పరిశోధన , ప్రచురణలో తాజా పోకడలలో సవాళ్లను గురించి చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 250 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకుహాజరయ్యారు. నగర వైద్య కళాశాలల నుంచి యువ అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్ ఎడిటర్–ఇన్–చీఫ్ , తైవాన్లోని చుంగ్ షాన్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ , సీనియర్ డిజిటల్ హెల్త్ కన్సల్టెంట్లు, సింగపూర్లోని మెలాంజ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకులు తమ అనుభవాన్ని జ్ఞానాన్ని పంచుకున్నారు. భారతీయ నిపుణులలో డాక్టర్ సమిరాన్ పాండా ప్రత్యేక ప్రసంగంచేశారు. ఇక మాన్యుస్క్రిప్ట్ రచన. సమీక్షపై పాల్గొనేవారికి ఆచరణాత్మక అనుభవాన్ని అందించే రెండు చిన్న వర్క్షాప్లు నిర్వహించారు. కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ మోహిత్ గోయల్ నేతృత్వంలో సంపాదకీయ ప్రక్రియ, ప్రచురణ, వివిధ అంశాలను ప్రస్తావించారు. మొదటి అంతర్జాతీయ మెడికల్ అకాడెమిక్ పబ్లిషింగ్ సింపోజియంను నిర్వహించడం ఒక ప్రత్యేకమైన అనుభవం, ఎందుకంటే మేము ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్ నుంచి ఎడిటర్లను యువ మనస్సులతో (అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు) అలాగే వైద్య కళాశాలల నుంచి అధ్యాపకులతో సంభాషించడానికి తీసుకువచ్చామని ఈసందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కావేరీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ కుమార్, క్లినికల్ లీడ్ – చీఫ్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ శివరామ్ కన్నన్ అధ్యక్షత వహించారు. వీరు అంతర్జాతీయ అధ్యాపకులను సత్కరించారు. సహ వ్యవస్థాపకులు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తమ మొదటి అంతర్జాతీయ వైద్య విద్యా ప్రచురణపై సింపోజియంను విజయవంతంగా నిర్వహించడం గురించి వివరించారు. -
ప్రధాని అభినందనకు ముగ్ధుడినయ్యా!
తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంగీతానికి ఆయన అందిస్తున్న సేవ ఎనలేనిది. తమిళనాడు, తేని జిల్లాలోని పన్నైపురం అనే మారు మూల గ్రామానికి చెందిన ఇళయరాజా తన సంగీతాన్ని మాత్రమే నమ్ముకుని ఓ హార్మోని పెట్టెను చేత పట్టుకొని చైన్నె మహా నగరానికి చేరుకున్నారు. అలా పలు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలకు ఎక్కిన మెట్లు ఎక్కకుండా కాళ్లు అరిగేలా తిరిగి 1976లో అన్నకిళి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి ఇళయరాజా పాటలు నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి ఇక ఆ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. తమిళం తెలుగు హిందీ కన్నడ ఆంగ్లం భాషలో వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా ఎన్నో ఘనమైన అవార్డులను అందుకొని తన కీర్తి పతాకాన్ని ఎగరవేశారు . కాగా గత ఎనిమిదవ తేదీన లండన్లో వలియంట్ సింఫోనిని నిర్వహించి అరుదైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇళయరాజాను స్వయంగా కలిసి అభినందించారు. అంతేకాకుండా త్వరలో ఇళయరాజాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత జ్ఞాని ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయన నుంచి శుభాకాంక్షలు పొందారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో తీసుకున్న ఫొటోలను ఇళయరాజా తన ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో శ్ఙ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. నేను సమకూర్చిన సింపోనీ, తదితర విషయాల గురించి నరేంద్ర మోడీ, నేను మాట్లాడకున్నాం. ప్రధానమంత్రి అభినందనలు, ఆదరణకు నేను వినమృడినయ్యా శ్ఙ్రీ అని ఇళయరాజా పేర్కొన్నారు. -
రిటైర్డ్ ఎస్ఐ దారుణ హత్య
● ఇద్దరి అరెస్ట్ ● నైల్లెలో కలకలం సేలం: నైల్లెలో రిటైర్డ్ ఎస్ఐని కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నైల్లె టౌన్ తడివీరన్ ఆలయ వీధికి చెందిన జాకీర్ హుస్సేన్ బిజిలి (57). ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతని కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా జాకీర్ హుసేన్ చైన్నె పోలీసు శాఖలో ఎస్ఐగా విధులు నిర్వహించి వీఆర్సీ తీసుకున్నారు. ఈయన నెల్లై టౌన్ మూర్తిమ్ జైక్కాన్ తైక్కా నిర్వాహకుడిగా ఉంటున్నాడు. ప్రస్తుతం రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం పాటిస్తున్న స్థితిలో మంగళవారం వేకువజామున తైక్కాకు నమాస్ చేయడానికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని దక్షిణ మౌంట్రోడ్డులో నడిచి వెళుతుండగా ముగ్గురు యువకులు బైక్లో అతన్ని వెంబడించి కత్తులో దాడి చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణన్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా సమాచారం అందుకుని నెల్లై నగర వెస్ట్ మండల డిప్యూటీ పోలీసు కమిషనర్ గీత, టౌన్ డిప్యూటీ కమిషనర్ అజిత్కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మృతదేహంగా జాకీర్ హుసేన్ బిజిలి కనిపించాడు. అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టౌన్ కాట్చి మండపం సమీపంలో తొట్టిపాళం వీధి సమీపంలో ప్రధాన సాలైలో 36 సెంట్ల భూమి ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించి జాకీర్ ఊసేన్ బిజిలికి అదే ప్రాంతానికి చెందిన ఇస్లామ్ మహిళను వివాహం చేసుకున్న విషయంగా పట్టియల్ వర్గానికి చెందిన వ్యక్తితో గొడవలు ఉన్నట్టు తెలిసింది. అది తీవ్ర స్థాయికి చేరుకున్న స్థితిలో జనవరిలో జాకీర్ హుస్సేన్ బిజిలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీలపై దృష్టి సారించి చర్యలు
వేలూరు: జిల్లాలోని రౌడీలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని నార్త్జోన్ ఐజీ అస్రో కార్క్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాణిపేట, కాట్పాడి, పోలీస్స్టేషన్లను తనఖీ చేశారు. అనంతరం పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసు ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులను వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం వేలూరు ఎస్పీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా వచ్చే కేసులను వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు. తరచూ పలు నేరాలకు పాల్పడుతున్న నిందితులను గూండా చట్టంతో పాటు కఠినమైన శిక్షలు విధించే విధంగా కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్పీలు, డీఎస్పీలు తరచూ జిల్లాలోని పోలీస్స్టేషన్లో తనిఖీలు జరిపి పెండింగ్ కేసులపై ఆరా తీయాలన్నారు. వేలూరు జిల్లా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉండడం వల్ల మత్తు పదార్థా లు, గుట్కా వంటి వస్తువులు జిల్లాకు తరలించకుండా సరిహద్దు చెక్పోస్టులో బందోబస్తును పెంచాలన్నారు. అనంతరం వివిధ కేసులపై ఆరా తీశారు. వేలూరు డీఐజీ దేవరాణి, ఎస్పీ మదివాణన్, అదనపు ఎస్పీలు భాస్కరన్, అన్నాదురై, డీఎస్పీలు పాల్గొన్నారు. -
గుట్కా విక్రయిస్తే లైసెన్స్ రద్దు
తిరువళ్లూరు: విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు సమీపంలో గుట్కా, మాదక ద్రవ్యాలను విక్రయిస్తే దుకాణం లైసెన్సులను రద్దు చేస్తామని కలెక్టర్ ప్రతాప్ హెచ్చరించారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరిలోని ఉలగనాథన్ నారాణయస్వామి ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్ హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తిరువళ్లూరును తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు 500మీ దూరంలో గుట్కా, గంజాయిని విక్రయిస్తే మొదటి సారి 30 రోజుల పాటు దుకాణాన్ని సీజ్ చేస్తామని, రెండవ సారి విక్రయిస్తే శాశ్వతంగా దుకాణాల లైసెన్సును రద్దు చేస్తామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. గత నెల రోజుల్లో 1,300 ప్రాంతాల్లో పోలీసులు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు అవగాహనా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆవడి డిప్యూటీ కమిషనర్ పొన్శంకర్, ప్రిన్సిపల్ తిల్లైనాయగి, డిప్యూటీ కలెక్టర్ బాలమురుగన్, తహసీల్దార్ శివకుమార్ పాల్గొన్నారు. -
దుకాణాల వేలానికి తీర్మానం
పళ్లిపట్టు: పొదటూరుపేట టౌన్ పంచాయతీ సమావేశం మంగళవారం నిర్వహించారు. టౌన్ పంచాయతీ అధ్యక్షుడు రవిచంద్రన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైస్ చైర్మన్ రామకృష్ణన్, పట్టణ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొదటూరుపేట బస్టాండులో రూ.1.50 కోట్లతో నిర్మించిన దుకాణాల సముదాయ భవనంలోని 18 నూతన గదులను గతంలో వ్యాపారం చేసుకున్న వారికే కేటాయించాలన్న వ్యాపారుల డిమాండ్ మేరకు చర్చలు జరిగాయి. అందుకు టౌన్ పంచాయతీ చైర్మన్తో పాటు సభ్యులు అంగీకారం తెలిపినా, చట్ట నిబంధనలకు లోబడి దుకాణాలు వేలం ద్వారా మాత్రమే కేటాయించాలన్న ఈఓ వివరణతో వేలం నిర్వహించి కేటాయించాలని నిర్ణయించారు. -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరు
సేలం: సేలం సమీపంలో తండ్రి మరణించిన దుఃఖంతోనే ఓ విద్యార్థి ప్లస్– 2 పరీక్షకు హాజరయ్యాడు. అలాగే తంజావూరు సమీపంలో తన తల్లి మృతి విషయాన్ని తట్టుకుని ఓ కుమార్తె పరీక్షకు వెళ్లింది. వివరాలు..సేలం – సేలం సమీపంలోని అచ్చంకుట్టపట్టి సెంకరాడు ప్రాంతంలో నివసించే గణేషన్ కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య పేరు సరోజ, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మణికంఠన్ సుక్కంపట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. పన్నెండవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నందున, మంగళవారం చరిత్ర సబ్జెక్టు పరీక్ష జరిగింది. ఈ పరిస్థితిలో, తండ్రి గణేషన్ సోమవారం సాయంత్రం అనారోగ్య కారణాల వల్ల మరణించారు. తండ్రి మరణంతో కలిగే బాధను పక్కన పెడితే, తన తండ్రి కోరికను తీర్చడానికి పబ్లిక్ పరీక్షకు సిద్ధమవుతూ వలసయూర్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో మణికంఠన్ పరీక్ష రాశాడు. తంజావూరులో.. తంజావూరు జిల్లా పట్టుకోట సమీపంలోని వెట్టువాంకోట్టై గ్రామం, రామాపురానికి చెందిన రాజేంద్రన్ భార్య కలా. వీరి మూడవ కుమార్తె కావ్య (17) ఊరనిపురం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్ –2 చదువుతోంది. ఈ స్థితిలో కలా మంగళవారం ఉదయం గుండె పోటు ఏర్పడి అకస్మాత్తుగా మృతి చెందింది. ఆ బాధతోనే వెళ్లి పరీక్షకు హాజరైంది. -
చైన్నె వేదికగా కేవైఎన్ లైవ్ సంగీత విభావరి
సాక్షి,చైన్నె: చైన్నె వైఎంసీఏ మైదానం వేదికగా కేవైఎన్( నో యువర్ నైబర్ హుడ్) నేతృత్వంలో లైవ్ సంగీత విభావరికి ఏర్పాట్లు చేశారు. ఈనెల 29వ తేదీన అతి పెద్ద ఫ్యూజన్ కాన్సర్ట్తో ఈ కార్యక్రమం జరగనుంది. చైన్నెలోని ఫీనిక్స్ మార్కెట్సిటీలో మంగళవారం ఈ వివరాలను గాయని, సినీ నటి ఆండ్రియా జెరెమియా, కేవైఎన్ వ్యవస్థాపకురాలు గాయత్రి త్యాగరాజన్ ప్రకటించారు. కేవైఎన్ అనేది స్థానికులకు వారి పరిసరాల్లో ఏం జరుగుతుందో అనే విషయాలను– వార్తలు, ఈవెంట్లు, షాపింగ్, ఒప్పందాలు, కమ్యూనిటీల ద్వారా దరి చేర్చే వేదికగా పేర్కొన్నారు. ఈనెల 29న జరగనున్న సంగీత విభావరి తమ ఉత్సాహాన్ని పంచుకోవడానికి, అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి కళాకారులు సమయం కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్లేబ్యాక్ సింగర్ ఆండ్రియా మాట్లాడుతూ ఫ్యూజన్ కచేరీ అనేది ఒక కొత్త , ఉత్తేజకరమైన కాన్సెప్ట్ అని ఆమె వివరించారు. ఇది లైవ్ షోలో మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నారు. చైన్నెలో అతిపెద్ద ఫ్యూజన్ కచేరీ ఈనెల 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి నందనంలోని వైఎంసీఏ గ్రౌండ్స్లో జరుగుతుందన్నారు. -
ఏస్ చిత్రంలోని సింగిల్ సాంగ్ విడుదల
తమిళసినిమా: విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా. ఈ చిత్రం సమీప కాలంలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఏస్ ఒకటి. దర్శకుడు ఆరుముగ కుమార్ స్వీయ దర్శకత్వంలో తన 7సి ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇది .నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, పీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజకుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ బహుదూర్ రావత్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శన నిర్మాత ఆరుముగ కుమార్ తెలుపుతూ ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న కథా చిత్రమని చెప్పారు. చిత్ర షూటింగ్ మొత్తాన్ని మలేషియాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు.చిత్ర టైటిల్ను, టీజర్ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఏస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయన్నారు. కాగా తాజాగా చిత్రంలోని సింగిల్ సాంగ్ వీడియోలు చేసినట్లు చెప్పారు గాయని శ్రేయ ఘోషల్, గాయకుడు కపిల్ కపిలన్ పాడిన ఈ మెలోడీ సాంగ్ సంగీత పేరు నుంచి స్పందన వస్తోందని, చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సలహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మహారాజా వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న ఏస్ చిత్రంపై విజయ్ సేతుపతి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. దీని తర్వాత విజయ్ సేతుపతి నటిస్తున్న ట్రైన్ చిత్రం కూడా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
ఫ్యాషన్ వీక్లో మెరిసిన డిజైనర్లు
సాక్షి, చైన్నె: మాస్కో ఫ్యాషన్ వీక్లో భారతీయ డిజైనర్లు మెరిశారు. మానేజ్ సెంట్రల్ ఎగ్జిబిషన్ హాల్ నాల్గవ మాస్కో ఫ్యాషన్ వీక్ ఈనెల 13వ తేదీ నుంచి మంగళవారం వరకు జరిగాయి. ఇది రష్యన్, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఇందులో ప్రముఖ డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు , ఫ్యాషన్ ప్రియులు, మోడల్స్ ఒక చోట చేరి తమ ప్రతిభను, తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆలోచనలు, జ్ఞానం ,సృజనాత్మక పరిష్కారాల మీద దృష్టి పెట్టారు. ఇందులో భారతీయ డిజైనర్లు కీలక పాత్రను పోషించే విధంగా మెరిశారు. మాస్కో ఫ్యాషన్ వీక్లో భాగంగా, రష్యన్ , విదేశీ డిజైనర్ల కలెక్షన్లను ప్రదర్శించారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఫ్యాషన్ రంగాన్నిబలోపేతం చేసే విధంగా భారతీయ ఫ్యాషన్లో అత్యుత్తమంగా ఉన్న 400 మందికి పైగా సభ్యులను ప్రోత్సహిస్తూ ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు అద్భుతమైన హస్తకళ సాంప్రదాయ అంశాల ద్వారా భారత దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటారు. ఖాదీ స్థిరత్వం , మన్నికకు ప్రసిద్ధి చెందిన సహజ ఫైబర్ను ఆధునిక ఫ్యాషన్ అంశాలతో కలిపి ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలో భారత్తో పాటుగా అర్జెంటీనా, జర్మనీ, మెక్సికో, రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా నుంచి తాజా ఫ్యాషన్ పోకడలను ప్రదర్శించే లఘు చిత్రాలతో సహా నిర్దిష్ట అంశాలపై ఉపన్యాసాలు కూడా సాగాయి. ఈ చిత్రాలను ప్రపంచ ఫ్యాషన్ షార్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ఆర్ట్ప్లే డిజైన్ సెంటర్లో ప్రదర్శించారు. -
రెచ్చిపోతున్న వీధి కుక్కలు
● రెండున్నర నెలల్లో 1.18 లక్షల మందికి కుక్కకాట్లు ● ర్యాబిస్ సోకి నలుగురి మృతి ● మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా ● చైన్నె కార్పొరేషన్ వెల్లడి సేలం: ఇటీవల కాలంగా రాష్ట్రంలో శునకాల స్వైర వివారం చేస్తున్నాయి. రోడ్డు మీద వెళ్ల లేని పరిస్థితి అనేక చోట్ల ఉన్నాయి. పిల్లలు, ఒంటిరిగా వెళ్లే వారిని, ద్విచక్ర వాహనాలలో పయనించే వారిని శునకాలు వెంటాడుతున్నాయి. దాడులు చేస్తున్నా యి. ఇందులో కొందరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రులలో చేరుతున్నారు. గత రెండున్నర నెలల్లో రాష్ట్రంలో 1.18 లక్షలకు పైగా ప్రజలు కుక్కకాటుకు గురయ్యారు. వీరిలో రేబిస్ వ్యాధి సోకి నలుగురు మృతి చెందారు. తమిళనాడులో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు కాటు వేయడం వల్ల గాయాలయ్యే సంఘటనలు పెరుగుతుండటం కలరం రేపుతున్నది. దీంతో పెంపుడు జంతువులకు, వాటిని పెంచే వారికి రేబిస్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి టీకాలు వేయడం ఒక పరిష్కారంగా మారింది. పుట్టిన తర్వాత మొదటి సంవత్సరంలో కుక్కపిల్లకి రెండుసార్లు రాబిస్ టీకాలు వేయించాలి. సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయడం కొనసాగించాలి. అయితే, వీధి కుక్కలకు, కొన్ని చోట్ల పెంపుడు జంతువులకు సరైన టీకాలు వేయడం లేదు. దీంతో కుక్కకాటుకు గురయ్యే వారు రేబిస్ బారిన పడుతున్నారు. గత సంవత్సరం రూ. 4.80 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. అత్యధికంగా అరి యలూర్లో 37,023, కడలూరులో 23,997, ఈరోడ్లో 21,507 మంది, చైన్నెలో 24,088 మందికి ర్యాబిస్ సోకింది. సకాలంలో టీకాలు వేయకపోవడంతో నలుగురు రేబిస్ వ్యాధితో మరణించారు. ఈ సంవత్సరం కేవలం రెండున్నర నెలల్లో, లక్షా 18 వేల 764 మంది కుక్క కాటుకు గురయ్యారు. రేబిస్ వ్యాధితో నలుగురు మరణించగా, కన్యాకుమారిలో ఇద్దరు, రాణిపేట, నామక్కల్లలో తలా ఒకరి చొప్పున మరణించారు. టీకాలు తప్పనిసరి.. దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సెల్వవినాయగం మాట్లాడుతూ.. తమిళనాడులో ఏటా లక్షలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. అందరికీ రేబిస్ రాదు. కుక్క, పిల్లి, మేక, ఆవు, గుర్రం, కోతి, నక్క, ఉడుము, తోడేలు లేదా గబ్బిలం వంటి జంతువులు కరిచినప్పుడు రేబిస్ టీకాలు వేయడం అవసరం. ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో లక్షకు పైగా వ్యాక్సిన్లు స్టాక్లో ఉన్నాయి. కుక్కలు వంటి జంతువులు కరిచినట్లయితే, వాటికి మొదటి రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 28వ రోజున నాలుగు డోసుల వ్యాక్సిన్ ఇస్తారు. గాయం లోతుగా ఉంటే, అదనపు ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. అవగాహన లేకపోవడం, సరైన చికిత్స లేకపోవడం వల్ల కొంతమంది రేబిస్ వ్యాధితో మరణిస్తున్నారు. కాబట్టి, ఏదైనా జంతువు కాటు వేస్తే, వైద్యుల సలహా మేరకు మీరు సరిగ్గా టీకాలు వేయించుకోవాలి అనిలీసందర్భంగా ఆయన వెల్లడించారు. కాగా పెంపుడు కుక్కలను రోడ్లపై తీసుకెళ్లే సమయంలో మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా తప్పదని కార్పొరేషన్ అధికారులు ఈసందర్భంగా ప్రకటించారు. -
ద్విభాషా విధానమే ఉత్తమం
తిరువళ్లూరు: తమిళనాడుకు త్రిభాషా విధానం వద్దని ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ వైరముత్తు అన్నారు. తిరువళ్లూరులో 11 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన సోమవారం రాత్రి ముగిసింది. మొత్తం 11 రోజుల పాటు జరిగిన ఎగ్జిబిషన్లో 115 స్టాల్స్, 50 వేల రచయితలకు చెందిన పుస్తకాలను విక్రయాలకు వుంచారు. కాగా 11 రోజలు పాటు జరిగిన ఎగ్జిబిషన్లో రూ.52 లక్షలు విలువ చేసే పుస్తకాల విక్రయం జరిగింది. ఇది ఇలా వుండగా చివరి రోజు సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వైరముత్తు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో త్రిభాషా విధానం అమల్లోకి రావడం వల్ల మాతృభాష దెబ్బతినే ప్రమాదం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలో హిందీ మాత్రమే వుందని అయితే తమిళనాడులో తమిళంతో పాటు ఇంగ్లిషు చదువుతున్నారని వివరించారు. రాజకీయ లబ్ధికోసమే మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఎదుగుదల కోసం తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ ప్రతాప్, డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా హ్యూమానిటేరియన్ అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: ప్రముఖ సామాజిక కార్యకర్త అప్సరరెడ్డి నేతృత్వంలో వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలకు హ్యూమానిటేరియన్ అవార్డుతో సత్కరించే కార్యక్రమం చైన్నెలో ఘనంగా జరిగింది. ఎన్ఏసీ సంస్థ సమర్పణలో జరిగిన వేడుకలో అప్సరరెడ్డి నిర్వహించే హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ ఉమెన్స్ ఎక్సలెన్స్ పేరుతో అవార్డులను ప్రదానం చేశారు. నిర్మాణ దార్శనికురాలు గౌరీ అడప్ప, విద్యావేత్త సింధుర అరవింద్, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేకప్ ఆర్టిస్ట్ కార్తీక, పిల్లల దంత వైద్య నిపుణురాలు నిలయ, తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు సభ్యురాలు శ్రుతి,విద్యావేత్త శుభదాదా, కోటా చీరల వారసత్వ విజేత పూజా సింఘి, సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ఎస్ లత, రెడ్వుడ్ మాంటిస్సోరి మధుర విశ్వేశ్వరన్, టారో నిపుణురాలు అన్నపూర్ణ అభినేష్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అప్సర రెడ్డి మాట్లాడుతూ విభిన్న రంగాలలో రాణించడమే కాకుండా సమాజానికి అర్థవంతంగా దోహదపడే మహిళలను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమకు సహకరిస్తున్న ఎన్ఏసీ ఆనంద్ రామానుజంకు ధన్యవాదాలు తెలిపారు. -
డీఎంకే ఎమ్మెల్యేకు ఊరట
సాక్షి, చైన్నె : డీఎంకే ఎమ్మెల్యే అన్నియూరు శివకు హైకోర్టు రూపంలో ఊరట కలిగింది. ఆయన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఎమ్మెల్యే పుగలేంది మరణంతో గత ఏడాది విల్లుపురం జిల్లా విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివ 67 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈగెలుపును వ్యతిరేకిస్తూ మక్కల్శక్తి కట్చికి చెందిన అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలలో అక్రమాలు జరిగినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, దీనిని రద్దుచేయాలని కోరుతూ శివ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం విచారణ అనంతరం అన్నియూరు శివ గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను న్యాయమూర్తి ఇలంథిరియన్ తోసి పుచ్చారు. దీంతో శివకు ఊరట కలిగినట్లయ్యింది. -
దర్శకుడు శంకర్ వారసుడి తెరంగేట్రం?
తమిళసినిమా: ఇండియన్ సినిమాలో పరిచయం లేని దర్శకుడు శంకర్. బ్రహ్మాండ చిత్రాలకు కేరాఫ్గా పేరుగాంచిన ఇటీవల దర్శకత్వం వహించిన ఇండియన్ –2, టాలీవుడ్ చిత్రం గేమ్ చేంజర్ నిరాశ పరిచినా తాజాగా మరో బ్రహ్మాండ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది చారిత్రక కథాచిత్రంగా ఉండబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి డీజే పాటలు పయనిస్తున్న విషయం తెలిసిందే. ఈమె కార్తీకదీపం పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే కథానాయకిగా, గాయనీగా విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మావీరన్ చిత్రంలో శివకార్తికేయన్ తో జత కట్టి మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల నటించిన నేశిప్పాయా చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా తాజాగా టాలీవుడ్లోనూ ఈ భామ ఎంట్రీ ఇచ్చారు. లేకపోతే ఈమె సోదరుడు దర్శకుడు శంకర్ వారసుడు అర్జిత్ శంకర్ కూడా హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈయన ప్రస్తుతం దర్శకుడు ఏఆర్.మురుగదాస్ వద్ద సహాయ దర్శకుడుగా పనిచేస్తున్నారు. కాగా త్వరలో డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న చిత్రం ద్వారా అర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో టాక్ వైరల్ అవుతోంది. కాగా ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నటుడు సురేష్ రీఎంట్రీ షురూ
తమిళసినిమా: కోలీవుడ్లో పన్నీర్ పుష్పంగల్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు సురేష్. 1981లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈయన పన్నీర్ పుష్పంగల్ సురేష్గా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సురేష్ తమిళంతో పాటూ తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను వైవిధ్య భరిత కథా పాత్రల్లో నటిస్తున్న సురేష్ పలు టీవీ సీరియల్ లోను నటించారు. కాగా 61 ఏళ్ల ఈయన తాజాగా మరోసారి ప్రధాన పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి విజయశ్రీ జి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ఈయన 87 ఏళ్ల చారుహాసన్ ప్రధాన పాత్రలో దాదా 87 అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఆ తర్వాత సినీ పీఆర్ఓ నిఖిల్ మురుగన్ను కథానాయకుడిగా పరిచయం చేసి పౌడర్ అనే చిత్రాన్ని, మరో సీనియర్ నటుడు మోహన్ కథానాయకుడిగా హర అనే చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకున్నారు. తాజాగా 61 ఏళ్ల నటుడు సురేష్ ప్రధాన పాత్రలో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మలేషియాకు చెందిన దత్తో గణేష్ ప్రసాద్ జీవి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో మలేషియా రజనీకాంత్ అలియాస్ దత్తో గణేష్, అనిత్ర నాయర్, దీప, మొట్టై రాజేంద్రన్, సింగం పులి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. చిత్ర షూటింగులు మలేషియా, ఇండియాలో నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్ర టైటిల్ను టీజర్ను ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాగా 61 ఏళ్ల సురేష్ మళ్లీ ప్రధాన పాత్రను పోషించనుండడంతో ఈ చిత్రంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. సురేష్తో దర్శకుడు విజయశ్రీ జీ -
ఆసక్తికరంగా బడ్జెట్ చర్చ!
బడ్జెట్ చర్చ.. జరిమానాల జోరునేడు ఆటోవాలాల బంద్ ● రెండున్నర నెలలో 82 వేల కేసులు సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో సోమవారం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం చర్చ సాగిన విషయం తెలిసిందే. ఇందులో స్పీకర్ నెగ్గారు. ఈ పరిస్థితుల లో మంగళవారం సభ ప్రారంభం కాగానే, స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించా రు. ఈసందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, శేఖర్ బాబు, ఏవీ వేలు, అన్బరసన్, స్వామినాథన్, తంగం తెన్నరసు, సెంథిల్ బాలాజీ, గీతాజీవన్ తదితరులు సమాధానాలు ఇచ్చారు. చెక్ డ్యాంల నిర్మాణాలు, రిజర్వాయర్లకు మరమ్మతులు వంటి అనేక అంశాలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి దురైమురుగన్ సమాధానం ఇస్తూ, పరిశీలిస్తామని, అమలు చేస్తామని పేర్కొన్నారు. తామర భరణి నదీ తీరంలో చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మంత్రి ఏవీ వేలు పేర్కొంటూ, రహదారులలో పెట్రోల్ బంకుల రూపంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, అందుకే ఆయా ప్రాంతాలలో డివైడర్లను ఏర్పాటు చేసి, కొంత దూరం తర్వాత యూటర్న్కు అవకాశం కల్పిస్తున్నామని ఓ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మదురైలోని కప్పలూరు టోల్గేట్ ఎత్తివేత లక్ష్యంగా కేంద్రంతో తాము సైతం పోరాడుతూనే ఉన్నామని, ఈ ప్రయత్నం కొనసాగుతుందని అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత ఆర్బీ ఉదయకుమార్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి అన్బరసన్ పేర్కొంటూ, మునగ పౌడర్ తయారీ నిమిత్తం పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు సంపూర్ణ మద్దతును ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వెయ్యేళ్ల పురాతన ఆలయాలన్నింటికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 100 కోట్లుకేటాయించిందని మంత్రి శేఖర్బాబు వివరించారు. అవ్వ‘యార్’.. సభలో తమిళ కవయిత్రి అవ్వైయార్ చర్చ ఆసక్తికరంగా జరిగింది. అన్నాడీఎంకే సీనియర్ సభ్యుడు ఓఎస్ మణియన్ తన ప్రసంగంలో తన నియోజకవర్గం పరిధిలోని తులసీయా పట్నంలో అవ్వైయార్కు రూ. 13 కోట్లతో మణి మండపం పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇక్కడ అవ్వై విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి స్వామినాథన్ సమాధానం ఇస్తూ, నిధుల ఆధారంగా తదుపరి చర్యలు అని వ్యాఖ్యానించారు. ఇందుకు నిధులు అవశ్యం లేదని పుస్తకాలు ఉంటే చాలంటూ ఓఎస్ మణియన్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అవ్వయార్( అవ్వ ఎవరు) అన్న చర్చ ఊపందుకుంది. ఓఎస్ మణియన్ వ్యాఖ్యలకు మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ అందరి ఇళ్లల్లో ఉండే అవ్వ అంటూ చమత్కరించారు. అవ్వైయార్ ఒకరు కాదు..ఐదుగురు అని పరిశోధకులు పేర్కొంటున్నారని, ఇప్పుడు ఏ అవ్వైయార్ గురించి చెబుతున్నారో అని చలోక్తులు విసిరారు. తన నియోజకవర్గంలో ఏ అవ్వైయార్కు మణి మండపం నిర్మిస్తున్నారో ఆమెకే అంటూ ఓఎస్ మణియన్ సమాధానం ఇచ్చారు. అలాగే అప్పట్లో భక్తి పాటులు, కవితలు రాసే పురుషులను పులవర్లు అని పిలిచే వారని, అదే విధంగా మహిళలను అవ్వైయార్ అని పిలిచే వారని గుర్తు చేశారు. ఈసమయంలో మంత్రి తంగం తెన్నరసు జోక్యం చేసుకుని, ప్రస్తుతం కొత్త చర్చ తెర మీదకు వచ్చిందని, అవ్వైయార్ అన్నది పక్కన నెట్టబడి అవ్వ యార్ అన్న ప్రశ్నల నెలకొందన్నారు. అయితే అవ్వైయార్ అన్నది మహిళలకు ఒక చిహ్నం అని ఆ పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు అవశ్యం ఉందన్నారు. సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈసందర్భంగా మైనారిటీ నేత, ఎమ్మెల్యే జవహిరుల్లా తన నియోజకవర్గం పరిధిలోని స్వామి మలై మురుగన్ ఆలయంలో లిప్ట్ ఏర్పాటు పనులు ఎప్పుడు ముగుస్తాయో అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి శేఖర్బాబు సమాధానం ఇస్తూ, జూన్ నాటికి అందరం కలిసి ప్రారంబ్ధిద్దామన్నారు. మైనారిటీ ఎమ్మెల్యే హిందీ ఆలయం అభివృద్ధి విషయంలో ప్రశ్నించారని, ఇదే తమిళనాడులో ఉన్న ఐక్య త అని మంత్రి వ్యాఖ్యానించారు. న్యూస్రీల్ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం కొరుక్కుపేట: చైన్నె నుంచి బయలుదేరి ఢిల్లీ విమానంలో ఆకస్మిక సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం రన్ వే పైనే ఆగిపోయింది. వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు చైన్నె నుంచి బయలుదేరిన ఈ విమానంలో 142 మంది ప్రయాణికులుతో కలిపి 148 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ ప్రారంభించగానే విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే విమానాన్ని రన్ వేపై అత్యవసరంగా నిలిపివేసి, ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దీని తర్వాత టోయింగ్ వాహనంతో పార్కింగ్ స్థలం వద్దకు తీసుకొచ్చి ఆపారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో విమానం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. దీంతో ప్రయాణికులు సమయానికి వెళ్లలేక అవస్థలు పడ్డారు. లండన్, హైదరాబాద్లకు విమానాలు రద్దు అదే విధంగా లండన్ నుంచి రోజూ తెల్లవారుజామున 5.35 గంటలకు బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది.. ఈ క్రమంలో లండన్ నుంచి మంగళవారం చైన్నె చేరుకోవాల్సిన బ్రిటిష్ ఎయిర్ విమానం అకస్మాత్తుగా రద్దయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా బ్రిటిష్ ఎయిర్వేస్ రోజూ ఉదయం 7.45 గంటలకు చైన్నె నుంచి లండన్కు బయలుదేరుతుంది. మంగళవారం ప్యాసింజర్ ఫ్లైట్ కూడా రద్దు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి చైన్నె దేశీయ విమానాశ్రయానికి ఉదయం 11.10 గంటలకు అలయన్స్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం కూడా మంగళవారం బయలుదేరుతుంది. ఈ విమానం కూడా అధికారులు రద్దు చేశారు. అదే విధంగా చైన్నె నుంచి మధ్యాహ్నం 12 గంట లకు హైదరాబాద్కు వెళ్లే ఫ్లైట్ కూడా రద్దయ్యింది. కాగా ఈమేరకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చైన్నె విమానాశ్రయ అధికారులు తెలిపారు. అధికార, ప్రతి పక్షాల మధ్య ఛలోక్తులు అవ్వ‘యార్’ అంటూ కొత్త చర్చ తెరమీదికి మళ్లీ ధర్మాకోల్ అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజు ఆసక్తికర అంశాలతో చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలతో సభ రసవత్తరంగా సాగింది. కవయిత్రి అవ్వ‘యార్’ (అవ్వైయార్) గురించి కొత్త చర్చను తెరమీదకు తెచ్చారు. అలాగే నీటిపై ధర్మాకోల్ పరిచినంతంగా విమానాశ్రయ నిర్మాణం సులభతరం కాదన్న వ్యాఖ్యల తూటాలు పేలాయి. బడ్జెట్ చర్చ సమయంలో మరింత ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోగ్యకరమైన చలోక్తులను విసురుకున్నారు. ఈసమయంలో అన్నాడీఎంకే సీనియర్ నేత సెల్లూరు రాజు వ్యాఖ్యలకు మంత్రి టీఆర్బీ రాజ ఓ విషయంగా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. నీరు ఆవిరి కాకుండా రిజర్వాయర్లో ధర్మా కోల్ పరిచినంత సులభంగా విమానాశ్రయాన్ని నిర్మించ లేమంటూ చమత్కరించారు. ఇందుకు సెల్లూరు రాజు పేర్కొంటూ, ఆ సమయంలో తాను అధికారులకు చెప్పే థర్మాకోల్ పరిచేందుకు వెళ్లినట్టు పేర్కొంటూ సభలో హాస్యపు జల్లులను పూయించారు. తర్వాత కాసేపు సెల్లూరురాజు, పలువురు మంత్రుల మధ్య ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చ వాడీవేడిగా సాగింది. ఈసమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి జోక్యం చేసుకుని విద్యా శాఖ అంశాలలో మాజీ విద్యాశాఖ మంత్రి, తమ పార్టీ సభ్యుడు సెంగోట్టయన్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్కు విన్నవించడం విశేషం. ఈ పరిణామంతో పళణి, సెంగోట్టయ్యన్ మధ్య సాగుతూ వచ్చిన వివాదం సమసినట్లయ్యింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ పరిసరాలలో గతంలో లేని విధంగా భద్రతను తాజాగా కట్టుదిట్టంచేశారు. టాస్మాక్లో ఈడీ దాడులు ఓ వైపు, దీనిపై సమగ్ర విచారణకు పట్టుబడుతూ బీజేపి ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఈ భద్రతను పెంచారు. ఈడీ అధికారులు గానీ, బీజేపీ వర్గాలు గానీ సచివాలయం వైపుగా రాకుండా నిఘా పటిష్టం చేశారు. గట్టి తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. -
టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, చైన్నె: డ్రీమ్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ నవీన్ ఫెర్నాండెజ్, దీపక్ మాలిక్ ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మంగళవారం అనలిటిక్స్ ఓరియెంటేషన్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. యువ అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తేజకరమైన పోటీకి వేదికను ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు అండర్–15 బాలుర విభాగంలో కె.అక్షయ్భూష్, చక్రవర్తి శ్రేష్ట అద్భుత ప్రదర్శనను ఇచ్చారు. బాలికల విభాగంలోశ్రేయ,జత్నాదఉంజిత్ ఆధిపత్యం చూపించారు. భవిష్యత్ ప్రకాశవంతం: ప్రేమలత సాక్షి, చైన్నె : 2026 రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ప్రకాశవంతమైన సంవత్సరంగా డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. ప్రేమలత విజయకాంత్ జన్మదినం సందర్భంగా మంగళవారం విరుగంబాక్కంలో డీఎండీకే నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. పలు చలి వేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రేమలతకు ఆమె కుమారుడు విజయప్రభాకరన్ కేక్ తినిపించి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సోదరుడు, పార్టీ నేత సుదీష్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈసందర్భంగాప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, తాను ఎప్పడు బర్తడేలు చేసుకోలేదన్నారు. విజయకాంత్ అందర్నీ వీడినానంతరం తాను ఎలాంటి వేడుకలు చేసుకోవడం లేదని, హాజరు కావడం లేదన్నారు. డీఎండీకే వర్గాల విజ్ఞప్తి మేరకు తాను ఇక్కడకు వచ్చినట్టు పేర్కొంటూ, 2026 ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రకాశవంతంగా మలిచే సంవత్సరంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ప్రేమలత విజయకాంత్కు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపించారు. తమిళం తప్పనిసరి – సీఎం రంగన్న స్పష్టీకరణ సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని అన్ని దుకాణాలు, వర్తక వాణిజ్య సముదాయాలు, మాల్స్అంటూ అన్నింటా తమిళ బోర్డులను తప్పని సరి చేశారు. అసెంబ్లీ వేదికగా మంగళవా రం సీఎంరంగస్వామి ప్రకటించారు. ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు వంటి వ్యవహారాలన్నీ తమిళంలోనే జరగాలని ఆదేశించారు. పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఉదయం స్వతంత్ర ఎమ్మెల్యే నెహ్రు ప్రసంగిస్తూ మాతృ భాష పరిరక్షణ గురించి వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలు వారి వారి మాతృ భాషకు పెద్ద పీట వేస్తున్నాయని, పరి రక్షించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణల తో ముందుకెళ్తున్నాయని వివరించాయి. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ భాషా ను పరి రక్షించుకునేందుకు పాలకులు తీవ్ర పోరాటం మొదలెట్టి ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం తమిళ భాష పరిరక్షించ బడాలని డిమాండ్ చేశారు. ఇందుకు సీఎం రంగస్వామి సమాధానం ఇస్తూ, అన్ని వర్తక వాణిజ్య సముదాయాలు, దుకాణాలలో త మిళంలోనే బోర్డులు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్వవహారాలు, ఆహ్వానాలు తదితర అంశాలలోనూ తమిళం తప్పనిసరి అని స్పష్టంచేశారు. అన్నింటా తమిళం ముద్రించ బడాలని, తమిళం వికసించే విధంగా బోర్డులు కనిపించాలని ఆదేశించారు. లంక సేనల దాష్టీకం – ముగ్గురు జాలర్ల అరెస్టు సేలం : కచ్చతీవు సమీపంలో చేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళం రామేశ్వరానికి చెందిన ముగ్గు రు జాలర్లను అదుపులోకి తీసుకుని వారి పడవలను స్వాధీనం చేసుకుంది. సరిహద్దు దాటి చేపలు పడుతున్నారనే ఆరోపణలతో శ్రీలంక నావికాదళం తమిళనాడు జాలర్లను నిర్బంధిస్తూనే ఉంది. దీనిని ఆపాలని మత్స్యకారులు, తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతున్నాయి. అయితే, తమిళనాడు మత్స్యకారుల అరెస్టు కొనసాగుతోంది. రామేశ్వరం ప్రాంతానికి చెందిన జాలర్లు మంగళవారం తెల్లవారుజామున లోతైన సముద్రంలో చేపలు పడుతున్నారు. ఆ సమయంలో, సరిహద్దు దాటి చేపలు పట్టారనే ఆరోపణల తో 3 మంది మత్స్యకారులను వారి ఫిషింగ్ బోట్ తో సహా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మత్స్యకారులను శ్రీలంక నావికాదళం కాంగేశం క్యాంప్కు తరలించారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే జాలర్లను విడిపించే చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి జయ శంకర్కు లేఖను రాశారు. -
‘జేఏసీ’కి 20 పార్టీల మద్దతు
● 22న చైన్నెలో భేటీకి ఏర్పాట్లు సాక్షి, చైన్నె: జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములయ్యేందుకు 20 పార్టీలు తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులు తమిళనాడుకు రానున్నారు. వీరికోసం గిండిలోని ఓస్టార్ హోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలు.. చైన్నెలో ఈనెల 5వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో లోక్సభ పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. పునర్విభజన పేరిట రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యనుతగ్గించేందుకు కేంద్రంచేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే, నియోజకవర్గ పునర్విభజనతో సమస్యకు గురయ్యే రాష్ట్రాల్లోని పార్టీల ఎంపీలను, ప్రతినిధులను ఈ ఉమ్మడి కార్యాచరణ కమిటీలోకి ఆహ్వానించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు స్టాలిన్ లేఖ రాశారు. అలాగే, ఆయా పార్టీలలోని ముఖ్య నేతలకు సైతం ఇదే లేఖలను పంపించారు. అంతే కాకుండా మంత్రులు, ఎంపీలతో కూడిన బృందాలు ఆయా రాష్ట్రాలకు వెవెళ్లి స్వయంగా నేతలను ఆహ్వానించారు. రాష్ట్రాల పురోగతికి ఆటంకం కలిగించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. లోక్ సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీకి హాజరు కావాలని ఆహ్వానించారు. 20 పార్టీల మద్దతు.. పునర్విభజన పేరిట కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కసరత్తులకు 20 పార్టీలు మద్దతు ప్రకటించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడు అధికారులకు ఈమేరకు సమాచారం అందింది. తమ ప్రతినిధులు ఈసమావేశానికి హాజరు అవుతారని కబురు పంపించారు. ఆయా పార్టీల నుంచి ఇద్దరు ఎంపీలు లేదా ముఖ్య ప్రతినిధి చైన్నెకు రానున్నారు. దీంతో ఈనెల 22వ తేదిన జరిగే జేఏసీ భేటీకి వేదికగా గిండిలోని అతిపెద్ద స్టార్ హోటల్ను ఎంపిక చేసి ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. విమానాశ్రయానికి సమీపంలో ఈహోటల్ ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అలాగే, ఆయా పార్టీల నేతలను ఆహ్వానించేందుకు డీఎంకే మంత్రులు, ఎంపీలతో కూడిన కమిటీలను రంగంలోకి దించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. తమ ప్రతినిధులు జేఏసీ భేటీకి హాజరు అవుతారని ఆయా రాష్ట్రాల నుంచి సీఎం స్టాలిన్కు సమాచారం సైతం చేరడం విశేషం. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
అన్నానగర్: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్ షాక్కు గురయ్యాడు. ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో భూపాలన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆరీ్టఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు. -
ఎల్ఐసీ ఏజెంట్ రెండో పెళ్లి.. నువ్వంటే ఇష్టం లేదు..!
అన్నానగర్: రాజామంగళం సమీపం ఎల్ఐసీ ఏజెంట్ ఇంట్లో వరుడుని చూడటానికి వచ్చినట్లు నటించి, 8 తులాల నగలు అపహరించిన ఘట వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా రాజామంగళం ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అభిప్రాయ బేధాల కారణంగా ఆరేళ్ల కిందట భార్య అతడితో విడిపోయింది.ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అతనిని చూసుకోవడానికి ఎల్ఐ సీ ఏజెంట్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూసి మధురై చెందిన మురుగేశ్వరి అనే మహిళ ఎల్ఐసీ ఏజెంట్ని సంప్రదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా చూడబోతున్నట్లు కూడా తెలిపింది. మురుగేశ్వరి, అతని చెల్లెలు కార్తిగైయాయిని(28), ముత్తులక్షి్మ(45), పోదుమ్ పొన్ను (43) ఎల్ఐసీ ఏజెంట్ ఇంటికి వచ్చారు.అక్కడ ఎల్ఐసీ ఏజెంట్తోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకుంటే ఎల్ఐసీ ఏజెంట్ 8 తులాల బంగారు గాజులు, ఉంగరాలు లాంటి నగలను అమ్మాయికి ఇస్తామని తెలిపాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలు దీన్ని నిశితంగా గమనించారు. దీంతో ఎల్ఐసీ ఆ నగలను టేబుల్ డ్రాయర్లో ఉంచి వచ్చిన వారిని గమనించడంలో నిమగ్నం అయ్యా డు. వరుడిని చూసేందుకు వచ్చిన నలుగురు మహిళలు రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎల్ఐసీ ఏజెంట్ టేబుల్పై ఉన్న నగలను పరిశీలించగా అవి కనిపించలేదు. దీంతో షాక్కు గురైన అతను తన కొడుకు, కుమార్తెకు సమాచారం ఇచ్చాడు.వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలే చోరీ చేసి ఉంటారని ఎల్ఐసీ ఎజెంట్ అనుమానించి వెంటనే మురుగేశ్వరిని సెల్ఫోన్లో సంప్రదించగా అది స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత మురుగేశ్వరితో పాటు వచ్చిన మరో అమ్మాయికి ఫోన్ చేయగా.. నువ్వంటే ఇష్టం లేదని అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఆభరణాల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఎల్ఐసీ ఏజెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధురైకి చెందిన నలుగురు మహిళలను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నగలు చోరీ చేసినట్లు తేలింది. అనంతరం మురుగేశ్వరి, కార్తిగైయాయిని, ముత్తులక్షి్మ, పోదుమ్ పొన్ను అనే నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. -
అవిశ్వాసంలో
అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్లో స్పీకర్ అప్పావు నెగ్గారు. 154 మంది సభ్యులు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు. డీఎంకే కూటమి సభ్యులు ఇచ్చిన మెజారిటీతో స్పీకర్ అసెంబ్లీలోని తన సీటులో మళ్లీ కూర్చున్నారు. అంతర్గత వార్ కప్పి పుచ్చుకునేందుకే.. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్, స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి సాక్షి, చైన్నె: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు ఆర్థిక బడ్జెట్ను ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు సభలో దాఖలు చేశారు. రెండోరోజైన శనివారం వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం సభకు సమర్పించారు. ఆదివారం సెలవు తదుపరి సోమవారం సభ ప్రారంభమైంది. తొలుత స్పీకర్ అప్పావు నేతృత్వంలో ప్రశ్నోత్తరాలు సాగాయి. ఈసందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి ఏవీ వేలు సమాధానం ఇస్తూ, పోలూరు – జమునాముత్తరు మధ్య రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈరోడ్– గోబి చెట్టి పాళయం మధ్య ఫోర్ వే పనులు జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను తన శాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చసమయంలో ప్రకటిస్తానన్నారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ, ఈ ఏడాది కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో రూ. 950 కోట్లతో వర్షపు నీటి కాలువతో పాటూ రోడ్లు పునరుద్దరణ పనులు చేపట్టనున్నామన్నారు. చైన్నె ఎగ్మూర్, షోళింగనల్లూరు డివిజన్లను విభజించే విషయంగా త్వరలో పరిశీలిస్తామని మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. ఉత్తర మేరు వద్ద పాలరు నదీ తీరంలో రూ. 70 కోట్లతో చెక్ డ్యాం నిర్మించనున్నామని మంత్రి దురై మురుగన్ ప్రకటించారు. రామనాధపురం, విరుదునగర్, మదురై, శివగంగై జిల్లాలోని 2,500 ఎకరాలలో తుమ్మ చెట్లను తొలగించడం, రూ.11 కోట్లతో మిరప పంటపై దృష్టి పెట్టే విధంగా కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం వివరించారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి శేఖర్ బాబు మాంత్రీకం అన్న పదాన్ని ఉపయోగించడంతో దానికి సమధానం ఇవ్వాలని మాజీ సీఎం పన్నీరు సెల్వం పట్టుబట్టారు. పరిహార మండపం అనే బదులు మాంత్రీకం అన్న పదం వాడినట్టు మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటూ పలువురు ప్రముఖులు, ప్రముఖ డాక్టర్ చెరియన్ల మృతికి సంతాపం తెలియజేశారు. అనంతరం సభలో స్పీకర్ అప్పావుకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు తీసుకున్నారు. ఈ సమయంలో స్పీకర్ అప్పావు తన సీటు నుంచి కిందకి దిగి వెళ్లి పోయారు. సభను డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి నడిపించారు. పక్షపాతం చూపుతున్నారు.. అవిశ్వాస తీర్మానం చర్చలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి మాట్లాడుతూ, స్పీకర్ పక్షపాతి, అన్నాడీఎంకే గళాన్ని నొక్కేస్తున్నారని మండిపడ్డారు. సభలో ఆయన చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఆయన సభలో నడుచుకుంటున్నారో ఏమో .. అని అసహనం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే వర్గాలను ప్రసంగించకుండా ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ, అడ్డుకోవడం, వాకౌట్ చేసే సమయాలలో హేళన చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సభా వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారం గాల్లోకి వదిలి పెట్టారని, ఏడాదికి వంద రోజులు సభను నిర్వహిస్తామన్న హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో 400 రోజులు సభ జరగాల్సి ఉండగా, కేవలం 114 రోజులు మాత్రమే నిర్వహించారని, స్పీకర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు.వీగిన తీర్మానం.. అప్పావుకు 154 మంది సభ్యుల మద్దతు అంతర్గత వార్ కప్పి పుచ్చుకునేందుకే తీర్మానం అన్నాడీఎంకేపై సీఎం స్టాలిన్ ఫైర్ అప్పావు పక్షపాతి.. మండిపడ్డ పళని స్వామి స్పీకర్ అప్పావుకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీసుకొచ్చిన తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మండి పడ్డారు. వాస్తవానికి ఈ తీర్మానంపై ప్రజలు పరిహాసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడు శాసనసభ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, స్పీకర్కు వ్యతిరేకంగా ఈ తీర్మానం విచారకరం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని అవమాన పరిచేందుకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును ఈ విధంగా వాడుకోవడం హేయనీయమన్నారు. గతంలో ఇదే విధంగా తీర్మానం విషయంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ, అప్పటి స్పీకర్, ప్రస్తుత సభ స్పీకర్ పని తీరు మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత స్పీకర్ నిష్పాక్షికంగా విధులను నిర్వహిస్తున్నారని , గతంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి స్పీకర్ వ్యవహరిస్తున్నారని, నిజాయితీతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. తటస్థంగా ఉంటూ, అందర్నీ చిరు నవ్వులతో కలుపుకెళ్తున్నారని వివరించారు. ఉపాధ్యాయుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన స్పీకర్ అప్పావు ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ సభ్యులందరూ, ప్రతినిధులందరూ ఒకటేనని పేర్కొంటూ, సమానంగా చూస్తున్నారన్నారు. అధికార పక్షానికంటే ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని పేర్కొంటూ, తమ ప్రభుత్వ పనితీరును విమర్శించేందుకు అస్త్రం దొరక్క, చివరకు స్పీకర్పై అవిశ్వాసంను ఎంపిక చేసుకున్నారని మండిపడ్డారు. వారి పార్టీలో సాగుతున్న అంతర్గత సమరాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఈ తీర్మానం తెర మీదకు తెచ్చానని అన్నాడీఎంకేపై విరుచుకు పడ్డారు. ఒక మంచి వ్యక్తిపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నామే అని అన్నాడీఎంకే వర్గాలను భవిష్యత్లో మనస్సాక్షి కలవరపెడుతుందని , తాజాగా సందించిన ఈ అస్త్రంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డీఎంకే కూటమి పార్టీలకు చెందిన నేతలందరూ తమ ప్రసంగాలలో స్పీకర్కు మద్దతుగా నిలబడ్డారు.చివరకు సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. సమావేశ మందిరం మార్గాలన్నీ మూసి వేశారు. తొలుత సభ్యులు గొంతుక ఆధారంగా ఓటింగ్ నిర్వహించారు. అనంతరం డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. తొలుత మద్దతు ఇచ్చేవారంతా తమ గళాన్ని వినిపించారు. అనంతరం లేచి నిలబడి డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈరెండింటిలోనూ అన్నాడీఎంకేకు ఓటమి తప్పలేదు. డీఎంకే , కూటమి పార్టీల మద్దతుతో స్పీకర్ అప్పావు నెగ్గారు. అప్పావుకు మద్దతుగా 154 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 63 ఓట్లు పడ్డాయి. దీంతో అన్నాడీఎంకే తీర్మానం వీగింది. అయితే, అన్నాడీఎంకే తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ నుంచి బహిష్కరించ బడ్ద మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ఆయన మద్దతు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సెంగోట్టయన్ సైతం స్పీకర్కు వ్యతిరేకంగానే ఓటు వేశారు. అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు ధనపాల్, ఇసిక్క సుబ్బయ్య, కందస్వామి ఓటింగ్కు హాజరు కాలేదు. బీజేపీ, పీఎంకే సభ్యులు సభకు హాజరు కాలేదు. తాను స్పీకర్కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం అన్నాడీఎంకే జారీ చేసిన విప్ అని పన్నీరు సెల్వం పేర్కొన్నారు. తాము అన్నాడీఎంకే సభ్యులుగానే సభలో ఉన్నామని, ఆ పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో తాము పార్టీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్నాడీఎంకే తీర్మానం వీగి పోవడంతో స్పీకర్ అప్పావు మళ్లీ తన సీటులో కూర్చుని సభా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో గొంతుక , డివిజన్ రూపంలో ఓటింగ్ విషయంగా పళని స్వామితో సెంగోట్టయన్ సభలో మాట్లాడే సమయంలో వివరించడం గమనార్హం. -
ప్రభుత్వ పథకాలపై అవగాహన
తిరువళ్లూరు: ప్రత్యేక ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వేర్వేరు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడానికి కళాకారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అవగాహన కల్పిస్తున్నారు. ఇందు కోసం ఆరుగురితో కూడిన కళాకారులను బృందంగా ఏ ర్పాటు చేశారు. ఈ బృందాల వాహనాన్ని కలెక్టర్ ప్ర తాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కళాకారులు వీఽధినాటకం, గ్రీవెన్స్డేకు 672 వినతులు సోమవారం ఉదయం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 672 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్డే నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన ప్రజలు వేర్వేరు సమస్యలను పరిస్కరించాలని కోరుతూ కలెక్టర్ ప్రతాప్కు వినతిపత్రాలు సమర్పించారు. ఇళ్ల పట్టాల కోసం 187 వినతులు, సాంఘిక సంక్షేమ శాఖకు 153 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 83, ఉపాధి కల్పనకు 127 వినతులతో సహా మొత్తం 627 విన తులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. అనంతరం ఐదుగురు వికలాంగులకు రూ.5.9 లక్షల విలువ చేసే స్కూటర్లను అందజేశారు. డీఆ ర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ తిరువళ్లూరు జిల్లా వికలాంగుల సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
దక్షిణాదిలో సత్తాచాటుతున్న యువకెరటం
తమిళసినిమా: ప్రతిభ ఎక్కడ ఉన్నా సినిమా గుర్తిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. అలా చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటున్న యువ సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్. సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఈయన 9 ఏళ్ల వయసులోనే కీబోర్డుతో సరాగాలు పలికించడం ప్రారంభించారు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ ప్రారంభించిన కేఎస్.కన్ట్ర్వెట్టరీ సంగీత పాఠశాలలో సౌండ్ ఇంజనీర్గా శిక్షణ పొందారు. దీంతో పలు చిత్రాలకు కీబోర్డ్ ప్లేయర్గా పని చేసిన జోహన్ శివనేశ్కు దివంగత ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం నుంచి ఇళయరాజా వరకూ పలువురు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అలా 2008లో ఇళయరాజా నిర్వహించిన రాజా వన్మేన్ షో కచ్చేరిలో కీబోర్డ్ ప్లేయర్గా పని చేశారు. కాగా 2012లో కొల్లైక్కారన్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత మెట్రో చిత్రానికి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆళ్, ఉరు, అగడు, ఆయిరం పొర్కాసుగళ్, వైట్ రోస్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఈయన కబడ్డీ అనే చిత్రం ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. అలా తన పేరును దక్షిణాదిలో విస్తరించుకుంటున్న జోహన్ శివనేశ్ తాజాగా ఇటీవల తెరపైకి వచ్చిన రాబర్ చిత్రానికి అందించిన సంగీతం ప్రశంసలు అందకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి అందించిన నేపధ్య సంగీతం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. దీంతో సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఈయన పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నారు. సంగీతదర్శకుడు జోహన్ శివనేశ్ -
స్వీట్హార్ట్ చిత్ర యూనిట్కు అభినందనలు
తమిళసినిమా: ప్రముఖ సంగీతదర్శకుడు యువన్ శంకర్రాజా వైఎస్ఆర్ ఫిలింస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి మంచి యూత్ ఫిలింస్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈయన తాజాగా సంగీతాన్ని అందించి నిర్మించిన చిత్రం స్వీట్హార్ట్. రియోరాజ్ , గోపిక రమేశ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా స్వినీత్ ఎస్. సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రేమికుల మధ్య మోహం, మోదం వంటి పలు అంశాలతో యూత్ఫుల్ ఎంటర్టెయినర్ రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత 14వ తేధీన విడుదలై ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. దీంతో తాను పని చేస్తున్న చిత్ర కార్యక్రమాల కోసం విదేశం వెళ్లిన స్వీట్హార్ట్ చిత్ర నిర్మాత, సంగీతదర్శకుడు తన చిత్రానికి వస్తున్న పాజిటివ్ రిజల్ట్ గురించి తెలుసుకుని ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటూ తన చిత్ర యూనిట్ సభ్యులకు వాట్సాప్ పోన్ ద్వారా ఆ ఆనందాన్ని పంచుకున్నారు. స్వీట్హార్ట్ చిత్రం బాగుందనే మౌత్టాక్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుండడంతో మంచి విజయాన్ని అందించినందుకు ఆయన చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. దీని గురించి చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర ప్రారంభ దశలో యువన్శంకర్ రాజా సంగీత కచేరిలో చిత్ర హీరోహీరోయిన్లు కలుసుకునే వంటి పలు సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనీ, చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత యువన్ శంకర్రాజా తమకు అభినందనలు తెలపడం మరచిపోలేని అనుభవం అని పేర్కొన్నారు. యువన్శంకర్రాజాతో స్వీట్హార్ట్ చిత్ర యూనిట్ -
టైలరింగ్పై పన్నుల భారం వద్దు
వేలూరు: టైలరింగ్ వృత్తిపై పన్నుల భారం మోపవద్దని మహిళలు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన గ్రీవెన్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. వినతులను స్వీకరించిన కలెక్టర్ ఆయా శాఖల ఉన్నతాధికారులకు సిఫారసు చేసి, వెంటనే వీటిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తమిళనాడు కుట్టు మిషన్ల సంక్షేమ శాఖ సంఘం సభ్యులు అందజేసిన వినతిలో తమపై పన్నుభారం మోపవద్దని కోరారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో అద్దె భవనాల్లో టైలరింగ్ దుకాణం నడుపడంతోపాటు అందులోనే తాము కుట్టిన దుస్తులను అక్కడే ఉంచి రెడిమేడ్ వ్యాపారం చేస్తున్నామని, అయితే కార్పొరేషన్ అఽధికారులు తమపై పన్నులు విధించి తప్పనిసరిగా చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారని వారిచ్చిన వినతి పేర్కొన్నారు. తమకు వచ్చే ఆదాయమే అరకొరాగా ఉందని, దాంతో కుటుంబాలను కూడా పోషించలేక తీవ్ర ఇబ్బందులు పుడుతున్నామని వాపోయారు. వీటిపై విచారణ జరి పి తమకు పన్నులు విధించకుండా చూడాలన్నారు. వినతిని స్వీకరించిన కలెక్టర్ వీటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివి ధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి పాల్గొన్నారు. -
ఘాటి అంచనాలను అందుకుంటుందా?
తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి అనుష్క. తెలుగులో తొలుత కథానాయకిగా రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్గా రాణించారు. మొదట్లో చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే గ్లామర్ను నమ్ముకున్న అనుష్కను అరుంధతి చిత్రం ఆమె కెరీర్నే మార్చేసింది. ఆ చిత్రంలో అనుష్క రౌద్రమైన నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాల విజయాలకు తన నటన అదనపు బలంగా మారింది. బరువు పెరగడం తదితర అంశాల కారణంగా సినిమాలు తగ్గాయనే చెప్పాలి. అనుష్క చివరిగా నటించిన చిత్రం మిస్శెట్టి మీస్టర్ పొలిశెట్టి 2023లో విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. కాగా ఆ తరువాత రెండేళ్ల గ్యాప్ తరువాత అనుష్క నటించిన ఘాటి చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీన్ని టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన వేదం చిత్రం 2010లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఘాటి చిత్రంతో ఈ కాంబో రిపీట్ కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా తమిళ నటుడు విక్రమ్ ప్రభు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఘాటి చిత్రం తమిళంతో పాటూ మలయాళం,తెలుగు, కన్నడం,హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. కాగా ఈ చిత్ర టైటిల్, టీజర్లు ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. కాగా చిత్రాన్ని ఎప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటించిన ప్రకారం ఘాటి చిత్రం తెరపైకి వస్తుందా? అనే ప్రశ్న సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం అంచనాలను అధిగమిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ 44 ఏళ్ల భామ తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కత్తనార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఘాటి చిత్రంలో నటి అనుష్క -
తొలి హైడ్రోజన్ రైలు 80 శాతం పూర్తి
అన్నానగర్: భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలు ఉత్పత్తి 80 శాతం పూర్తయింది. వచ్చే నెలలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రపంచ దేశాలతో సమానంగా రైల్వే రంగాన్ని మెరుగుపరిచేందుకు సెంట్రల్ రైల్వే బోర్డు హైడ్రోజన్ రైలును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక వేసింది. దీని ప్రకారం గతేడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించి రూ.2,300 కోట్లు కేటాయించారు. చైన్నె పెరంబూరులోని ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో హైడ్రోజన్ రైలు కోచ్ల ఉత్పత్తి గత సంవత్సరం ప్రారంభమైంది. ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ఉత్పత్తి చివరి దశకు చేరుకుంది. పెయింటింగ్, హైడ్రోజన్ సిలిండర్ల అనుసంధానం, సాంకేతిక పనులు జరుగుతున్నాయి. ఈ పనులు త్వరలో పూర్తవుతాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి వచ్చే నెలలో ట్రయల్ రన్కు పంపనున్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యాణాలోని జింద్–సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల దూరం నడవనుంది. ఈ మార్గంలోనే వచ్చే నెలలో ట్రయల్రన్ కూడా జరగనుంది. రైలులో 1,200 మంది ప్రయాణించేలా శక్తివంతమైన ఇంజిన్తో అమర్చారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ఈ రైలును రూపొందించారు. ఏప్రిల్ చివరి నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ పెరంబూర్లో తయారు చేస్తున్న హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన రైలు అన్నారు. ఇతర దేశాల్లో గరిష్టంగా 5 కోచ్లు మాత్రమే ఉంటాయి. అయితే, తొలిసారిగా 10 కోచ్ల హైడ్రోజన్ రైలు సర్వీసును భారతదేశంలో నడపబోతున్నారు. ప్రపంచ దేశాలకు ఇదో ఉదాహరణ అన్నారు. ఒక్కో రైలును రూ.80 కోట్లతో తయారు చేయనున్నట్లు తెలిపారు. కార్ల ఎగ్జాస్ట్ ఉద్గారాల కాలుష్యాన్ని నివారించడానికి పర్వత ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలును నడపాలని యోచిస్తున్నట్లు తెలిపారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
వేలూరు: క్రీడలు విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్ను అందిస్తాయని జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలమురుగన్ అన్నారు. వేలూరు ధనబాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవం, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి మణినాథన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బాల మురుగన్ మాట్లాడుతూ యుక్త వయస్సులో ఉన్న మీరందరూ విద్యపైనే ద్యేష పెట్టకుండా క్రీడలపైనా ఆసక్తి చూపాలన్నారు. ప్రస్తుతం క్రీడా సర్టిఫికెట్లతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం ఇవ్వడంతో పాటూ వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలదన్నారు. గతంలో మహిళలు అన్ని రంగాల్లో ఉండే వారు కాదని నేడు అన్ని రంగాల్లోను మహిళలున్నారన్నారు. ఫేస్బుక్, వాట్స్ఆఫ్ల మోజులో పడకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడున్న వారు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో మీ తల్లి దండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారని వారిని ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగ మించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో చాంపియన్ షిఫ్ సాధించిన విద్యార్థినులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బానుమతి. కళాశాల పిజికల్ ఫిట్నెస్ అధికారి లోకేశ్వరి, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు. -
బీజేపీ నిరసనల హోరు
● ఎక్కడికక్కడ నేతల అరెస్టు ● ఉద్రిక్తత సాక్షి, చైన్నె: టాస్మాక్ మద్యం అక్రమాలపై బీజేపీ నేతృత్వంలో చైన్నెలో పలుచోట్ల సోమవారం నిరసనలు హోరెత్తాయి. ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యనేతలను గృహ నిర్బంధంలో ఉంచారు.దీంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. గత వారం టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో సాగిన ఈడీ సోదాల గురించి తెలిసిందే. ఇందులో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలు వెలుగు చూసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణకు పట్టుబడుతూ సీఎం సమాధానం ఇవ్వాలని నినాదిస్తూ పోరుబాటకు పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ నేతృత్వంలో ఎగ్మూర్లోని టాస్మాక్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.దీంతో నిషేదాజ్ఞలను ఉల్లంఘించి పోరు బాటకు బీజేపీనేతలు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా, నిరసనలు, ఆందోళనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు బీజేపీ ఆందోళనను భగ్నం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడిక్కడ నేతలను అరెస్టు చేశారు. ఈ నిరసనకు తన నివాసం నుంచిబయలు దేరిన మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను మార్గ మధ్యలో అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. అలాగే,బీజేపీ మహిళా మోర్చా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ను, యువజన నేత వినోజ్ పి సెల్వం, పొన్ రాధాకృష్ణన్, హెచ్ రాజాలతోపాటుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను సైతం మార్గ మధ్యలోనే ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఈ అరెస్టులను బీజేపీ వర్గాలు అడ్డుకునేప్రయత్నం చేశారు. బీజేపీ ముఖ్య నేతలందర్నీ ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్థానికంగా ఉన్నకల్యాణ మండపాలలో ఉంచారు. అన్నామలైను అక్కరైలోని ఓ రిసార్ట్లో ఉంచారు. ఎగ్ముర్రాజరత్నం స్టేడియం వద్దకు చేరుకున్న మహిళా నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి సమీపంలోని కల్యాణ మండపంకు తరలించారు. అయితే నిరసనకారులు పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. కల్యాణమండపాలలో కనీస సౌకర్యాలు కూడా లేవని మండిపడ్డారు. మధ్యాహ్నం తర్వాత నిరసనకారులను విడుదల చేశారు. తన అరెస్టును అన్నామలై తీవ్రంగా ఖండింంచారు. ఇప్పుడు అడ్డుకుని ఉండవచ్చు అని, మరోమారు తమను అడ్డుకోలేరన్నారు. ఈసారి తేదీ ప్రకటించకుండా నిరసనకు దిగుతామన్నారు. టాస్మాక్ అక్రమాలలో ఏ–1 సీఎం స్టాలిన్ అని, నిందితుడు ఏ– 2 మంత్రి సెంథిల్ బాలాజీ అని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కో– ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ, తమ వారిని బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుతంగా నిరసనకు దిగిన వారితో పోలీసులను ఉసిగొల్పి అరెస్టులు చేయించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మద్యం కుంభకోణానికి సీఎం స్టాలిన్ నైతిక బాధ్యత వహించాలని, ఎకై ్సజ్ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
● ఐఐటీ మద్రాస్లో రూపకల్పన ● ప్రారంభించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్
సాక్షి, చైన్నె: అధునాతన రీతిలో ఐఐటీ మద్రాసులో తదుపరి తరం అంతరిక్ష నౌక, ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాలకు అవసరమైన ఉష్ణ బదిలీ, శీతలీకరణ వ్యవస్థలు, ద్రవ డైనమిక్స్పై పరిశోధనలకు నోడల్ కేంద్రం ఏర్పాటైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ఈ కొత్త పరిశోధన కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు మద్దతు ఇచ్చే విధంగా ఎస్. రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెనన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైనన్స్ రీసెర్చ్ పేరిట ఈ కేంద్రం రూపుదిద్దుకుందని అధికారులు ప్రకటించారు. అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాలలో స్వావలంబనను ప్రోత్సహించడం, ప్రపంచ ప్రతిభ , పరిశోధన నిధులను ఆకర్షించడం, అంతరిక్ష అనువర్తనాల కోసం థర్మల్ సైన్సెస్ పరిశోధనలో ఈ కేంద్రం అగ్రగామిగా నిలిచే విధంగా చర్యలు తీసుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఈ అత్యాధునిక పరిశోధనా కేంద్రం, అంతరిక్ష నౌక, ప్రయోగ వాహన ఉష్ణ నిర్వహణలో కీలకమైన పురోగతిపై దృష్టి పెడుతుంది. ఇది భారతదేశం లో విస్తరిస్తున్న అంతరిక్ష ఆశయాలకు కీలకమైన రంగంగా మారనున్నది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెనన్స్ (సీఓఈ)లో పరిశోధన చంద్ర, అంగారక, డీప్–స్పేస్ మిషన్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేయనుంది. భారతదేశం అంతరిక్ష సాంకేతికతలో ముందంజలోకి తీసుకెళ్లనుంది. ఈ ల్యాబ్ను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రారంభించారు. అనంతరం ఆర్కాట్ రామచంద్రన్ సెమినార్ హాల్’ను ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సమక్షంలో ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత హీట్ ట్రానన్స్ఫర్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ ఆర్కాట్ రామచంద్రన్ (1923 – 2018) 1967 – 1973 మధ్య ఐఐటీ మద్రాస్ డైరెక్టర్గా పనిచేశారు. ఐఐటీ మద్రాస్లో హీట్ ట్రానన్స్ఫర్, థర్మల్ పవర్ ల్యాబ్ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, ఇస్రో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. సోమనాథ్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అరవింద్ పట్టమట్ట, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ పి. చంద్రమౌళి, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాక్టీస్ ప్రొఫెసర్ డాక్టర్ పివి వెంకటకృష్ణన్, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.పూర్తి మద్దతు.. కేంద్రం పనితీరు ఇలా.. అంతరిక్ష నౌక, వాహక నౌకల ఉష్ణ నిర్వహణ– ఉపగ్రహాలు, వాహక నౌకలలో ఉష్ణ వెదజల్లే సవాళ్లను పరిష్కరించడం. శీతలీకరణ వ్యవస్థలపై ప్రయోగాత్మక అధ్యయనాలు – మైక్రో హీట్ పైపులు, స్ప్రే కూలింగ్, ఆవిరి గదులు, రెండు దశల ఉష్ణ బదిలీ పరికరాలను ఉపయోగించి సమర్థవంతమైన శీతలీకరణ పరిష్కారాలను అభివృద్ది చేయడం లక్ష్యం ఈ కేంద్రం పనిచేయనుంది. హై–ఫిడిలిటీ సిమ్యులేషన్ – టెస్టింగ్ సౌకర్యాలు – వాస్తవ ప్రపంచ ధ్రువీకరణ కోసం అత్యాధునిక కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సిమ్యులేషనన్లు, ప్రయోగాత్మక సెటప్లను ఉపయోగించడంతో పాటూ సామర్థ్య నిర్మాణం – శిక్షణ, పరిశ్రమ–విద్యా రంగాల సహకారాన్ని పెంపొందించుకుంటూ, ఐఐటీ మద్రాస్లో అధునాతన డిగ్రీలను అభ్యసించడానికి, ఇస్రో శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం. ఈ కొత్త పరిశోధన కేంద్రం నుంచి ఫలితాలను ఆశిస్తున్నామని ఐఐటీ మద్రాస్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సమన్వయకర్త ప్రొఫెసర్ అరవింద్ పట్టమట్ట వివరించారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించేలా పరిశోధన కేంద్రంఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం మన వద్ద మూడు వేర్వేరు ఇంజిన్లు ఉన్నాయన్నారు. మూడవది మానవ–రేటింగ్ పొందిందన్నారు. ప్రపంచంలోని ఆరు దేశాలలో మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని, ఈ టెక్నాలజీలో తాము మూడు ప్రపంచ రికార్డులు సృిష్టించా మన్నారు. ఈ ప్రయత్నం గురించి వివరిస్తూ, ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రొఫెసర్ వి. కామకోటి నాయకత్వంలో ఈ సంస్థ గొప్ప పని చేస్తోందన్నారు. ఇది రెండు నోబెల్ బహుమతులను లక్ష్యంగా ముందుకు సాగాలని, ఈ ప్రయత్నాలన్నింటిలోనూ పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఎస్ రామకృష్ణన్తో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా నారాయణన్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక సాంకేతిక నిపుణుడు మాత్రమే కాదని, గొప్ప మేనేజర్ కూడా అని కొనియాడారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ, ‘అంతరిక్షాన్ని మరింతగా అన్వేషిస్తున్నామని పేర్కొంటూ థర్మల్ , శీతలీకరణ అవసరాలను నిర్వహించగల సాంకేతికతల అవసరం పెరుగుతోందన్నారు. ప్రతిపాదిత కేంద్రం ఇస్రోతో సంయుక్తంగా చాలా ప్రభావవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేస్తుందన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. సోమనాథ్, ఇస్రో ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. చంద్రమౌళి, ఐఐటీ మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాక్టీస్ ప్రొఫెసర్ డాక్టర్ పివి వెంకటకృష్ణన్లు కూడా ప్రసంగించారు. -
విద్యార్థులకు అత్యున్నత శిక్షణ లక్ష్యం
సాక్షి, చైన్నె : నీట్, జేఈఈ తదితర పరీక్షలకు విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేయడానికి అత్యున్నత శిక్షణ అందించడం తమ లక్ష్యం అని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్ – బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కొత్త లెర్నింగ్ సెంటర్ను టీఎన్ హెచ్బీ 3682 – తిరువళ్లూరు బైపాస్ రోడ్డులోని కాకలూరులో ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని ధీరజ్కుమార్ మిశ్రాతోపాటు రాష్ట్రహెడ్ శివప్రసాద్, డిప్యూటీ ఆర్ఎస్జీహెచ్ రాంకీలు హాజరై ప్రారంభించారు. ఈ సెంటర్లో ఎనిమిది తరగతి గదులను ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం బ్యాచ్లలో శిక్షణ అందించనున్నారు. ఈసందర్భంగా ధీరజ్ కుమార్ మాట్లాడుతూ జేఈఈ, నీట్తోపాటు ఈ కేంద్రం ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం, వారి విద్యా ప్రాథమికాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను కూడా అందిస్తుందన్నారు. ఇది విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశామన్నారు. బలమైన విద్యా పునాదులు, భావనాత్మక స్పష్టత , వివిధ పోటీ పరీక్షలలో రాణించడానికి ఆత్మవిశ్వాసంతో విద్యార్థులను శక్తివంతం చేయడంపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. -
క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు
హెచ్డీ ఎఫ్సీ ఎర్గొ ఇన్సూరన్స్ అవేర్ నెస్ అవార్డుల జూనియర్ గ్రాండ్ ఫినాలే క్విజ్ పోటీలు తమిళనాడు,పుదుచ్చేరిలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించారు. ఈ క్విజ్లో 42 ప్రాంతాలలోని తమిళ మీడియం ప్రభుత్వ పాఠశాలల నుంచి 530కు పైగా జట్లు పాల్గొన్నాయి. ఇందులో క్విజ్ విజేతలకు రూ.1.50 లక్షలు చెక్కును చీఫ్ ఆపరేటింగ్ డైరెక్టర్ అంకుర్ బహోరే సోమవారం అందజేశారు. అలాగే రన్నరప్ వరుసగా రూ. 90 వేలు రూ. 60 వేలు అందజేశారు. మరో ఐదుజట్లకు తలారూ. 30 వేలు అందజేశారు. –సాక్షి, చైన్నె -
హీరోగా మరో దర్శకుడు
తమిళసినిమా: హీరో అంటే ఎర్రగా, ఆరడుగుల బుల్లెట్గా ఉండాలి అనే ఆనవాయితీని మొదట బ్రేక్ చేసింది తమిళసినిమానే అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతిభనే కొలమానం. అది ఉంటే ఎవరైనా హీరో కావచ్చు. ప్రేక్షకుల ఆదరణ పొందవచ్చు. ఇలా ఇప్పటికే చాలా మంది సినిమా రంగంలో ఇతర శాఖలకు చెందిన వారు హీరోలుగా అవతారమెత్తి రాణిస్తున్నారు. తాజాగా దర్శకుడు కేబీ.జగన్ ఈ పట్టికలో చేరారు. ఈయన ఇంతకు ముందు పుదియ గీతై,కోడంబాక్కమ్, రామన్ తేడియ సీతై వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా రోజా మల్లీ కనకాంబరం అనే చిత్రం ద్వారా హీరోగా పరిచపయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను ఈయనే నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, టీజర్ కోసం షూటింగ్ను ఆదివారం ఉదయం తిరుచెందూర్లోని శాస్తా ఆలయంలో నిర్వహించారు. కాగా ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు కేజీ.జగన్ తెలిపారు. ఇది తన జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని తెలిపారు. ఇంతకు ముందు మాయాండి కుటుంబత్తార్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యునైటెడ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్కే.సెల్వకుమార్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
మక్కళ్ నీతి మయ్యం ఆధ్వర్యంలో వేసవిలో ఆంగ్ల ఉచ్ఛారణ తరగతులు
తమిళసినిమా: నటుడు, మక్కళ్ నీతి మయ్యం పార్టీ ధ్యక్షుడు కమలహాసన్ ఆలోచనలు దూర దృష్టితో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా తన మక్కళ్ నీతి మయ్యం పార్టీ తరపున వేసవి సెలవులలో విద్యార్ధులకు ఆంగ్ల భాషలో సరళంగా మాట్లాడటాకి మన పాఠశాలు పేరుతో ఉచిత విద్యా తరగతులను నిర్వహించతలపెట్టారు. విద్యార్ధుల భవిష్యత్కు ఉపయోగపడే విధంగా ఈ ఉచిత ఆంగ్ల భాషా ఉచ్చరణ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టారు. అందులో భాగంగా మదురై, అరుప్పుకోట్టై, పరమకుడి ప్రాంతాల్లో మన పాఠశాలలు పేరుతో ఆంగ్ల ఉచ్ఛారణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న పరీక్షల్లో విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని మక్కళ్ నీతి మయ్యం పార్టీ నిర్వాహకులు పేర్కొన్నారు. కమలహాసన్ పన్బాట్టు మయ్యం ( కమలహాసన్ సంప్రదాయ కేంద్రం) మన పాఠశాలలు పేరుతో నిర్వహించనున్నారు. ఈ ఉచిత ఆంగ్ల ఉచ్ఛారణ తరగతుల్లో ఉచిత పుస్తకాలు, ఉచిత వైఫై సౌకర్యాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికాలోని ఉన్నత పాఠశాల విద్యార్దుల చేత లీప్ అనే సంస్థ ఇండియాలో ఉచిత ఆంగ్ర భాష బోధనలు నిర్వహిస్తోందని, కాగా ఆ సంస్థతో కలిసి మన పాఠఽశాలలు విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచిత ఆంగ్ల భాష ఉచ్చరణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తరగతులను ఏప్రిల్ నెల నుంచీ జూన్ వరకూ, అంటే ఆరువారాల పాటు జరుగుతాయని మక్కళ్ నీతి మయ్యం పార్టీ నిర్వాహకులు పేర్కొన్నారు. రూ.20 కోట్లు మోసం ● ముగ్గురు ఉద్యోగుల అరెస్ట్ అన్నానగర్: చైన్నె, కోయంబత్తూరుతో సహా తమిళనాడు అంతటా 52 శాఖలతో పనిచేస్తున్న సంస్థ దీనా కలర్ల్యాబ్. ఈ కంపెనీ మేనేజర్ జయవేల్ చైన్నె సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో ఫిర్యాదు చేశారు. మా కంపెనీకి చెందిన చైన్నె ఎల్లీస్ రోడ్, కోయంబత్తూరు బ్రాంచిల్లో పనిచేసిన గోపాలకృష్ణన్(40), కృష్ణమూర్తి (42), గౌతమ్ (30) రూ.20 కోట్ల వరకు దుర్వినియోగం చేశారని, వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి అర్ధకేజీ బంగారు ఆభరణాలు, 600 గ్రాముల వెండి వస్తువులు, రూ.30 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, విలాసవంతమైన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. 21 నుంచి పర్యాటక ఉత్సవం సాక్షి, చైన్నె: పర్యాటక శాఖ నేతృత్వంలో మార్చి 21 నుంచి 23 వరకు పర్యాటక ఉత్సవం నిర్వహించనున్నారు. వందకు పైగా స్టాల్స్ను ఈ ఉత్సవం నిమ్తితం నందంబాక్కం వర్తకకేంద్రంలో ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర సంపద, విభిన్న పర్యాటక అవకాశాలను ప్రదర్శించడానికి, పర్యాటక పరిశ్రమ ప్రోత్సహం, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ వేడుక జరగనుంది. కార్యక్రమంలో, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఆతిథ్య నిపుణులు , పెట్టుబడిదారులు దేశీయ , అంతర్జాతీయ పర్యాటక వ్యవస్థాపకులు, సంస్థలతో సహా రాష్ట్ర సమగ్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భాగస్వాములు అవకాశాలను గుర్తించనున్నారు. అలాగే, సాంప్రదాయ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, వెల్నెస్ టూరిజం , సమావేశాలు, ప్రోత్సాహకాలు, సమావేశాలు ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సెంగోట్టయన్కు బుజ్జగింపు సాక్షి, చైన్నె: సీనియర్ నేత సెంగోట్టయన్ను బుజ్జగించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి సిద్ధమైనట్టున్నారు. ఇందుకు అనుగుణంగా సోమవారం పరిణాలు చోటు చేసుకున్నాయి. సెంగోట్టయన్ను అసెంబ్లీ ఆవరణలో పార్టీ నేతలు తంగమణి, వేలుమణి, కేపి మునుస్వామి,కడంబూరు రాజులు రంగంలోకి దిగారు.సెంగ్టోయన్తో చాలా సేపు వీరు మాట్లాడారు. ఆయన్ని బుజ్జగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో అసెంబ్లీలో కడంబూరు రాజుతో పదేపదే సెంగోట్టయన్ మాట్లాడుతుండటం గమనార్హం. కాగా, గత కొంత కాలంగా అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళణిస్వామికి దూరంగా సెంగోట్టయన్ ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. పార్టీ కార్యాక్రమాలకు, పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి సైతం సెంగోట్టయన్దూరంగానే ఉన్నారు. ఈ సమయంలో సోమవారం ఉదయం ఓ ప్రచారం ఊపందుకుంది. సెంగోట్టయన్ ద్వారా అన్నాడీఎంకేను కూటమిలోకి ఆహ్వానించడం, పళణి పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంగోట్టయన్ కూటమి సీఎం అభ్యర్థిగా బీజేపీ ఢిల్లీ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టుగా వచ్చిన ఈ ప్రచారంతో అన్నాడీఎంకే సీనియర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సెంగోట్టయన్ను బుజ్జగించే పనిలో పడటం గమనార్హం. అదే సమయలంలో సెంగోట్టయన్ విషయంగా ప్రశ్నలు సందిస్తే దాట వేసిన పళణి స్వామితాజాగా పార్టీలో ఎలాంటి అంతర్గత సమరాలు లేవు అని, అందరూ ఐక్యతతో ఉన్నామని వ్యాఖ్యలు చేశారు. -
రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
సాక్షి, చైన్నె : అఖిల భారత రైఫిల్ షూటింగ్పోటీలు చైన్నెలో సోమవారం ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగాపోలీసు అధికారులు ఈ పోటీలకు తరలి వచ్చారు. అఖిల భారత పోలీసు విభాగం, తమిళనాడుపోలీసు సంయుక్తంగా చెంగల్పట్టు జిల్లా ఒత్తివాక్కంలోని తమిళనాడు కమాండో బలగాల శిక్షణా కేంద్రంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 22వ తేదీ వరకు ఈపోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనేందుకు 704 మంది పోలీసు అధికారులు, రైఫిల్ షూటింగ్లో నిష్ణాతులుగాఉన్న పోలీసులు తరలి వచ్చారు. 3 కేటగిరిలలో 13 బ్యాచ్లుగా ఈ పోటీలు జరగనున్నాయి. కలెక్టరేట్లో వానరాల బెడద తిరువళ్లూరు: కలెక్టరేట్లో వానరాల బెడద అధికంగా ఉందని, వీటిని పట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కలెక్టరేట్లో వానరాల బెడదతో కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగులు, ప్రజలు పార్కింగ్ చేసే వాహనాల, లంచ్బాక్సులను సైతం చిందరవందరగా చేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్న వానరాలను పట్టి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఎన్నూరులో ఆదిపరాశక్తిసిద్ధర్ పీఠాలకు కుంభాభిషేకం కొరుక్కుపేట: చైన్నె ఎన్నూరు కత్తివాక్కం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆదిపరాశక్తి సిద్ధర్ శక్తి పీఠం, సాలిగ్రామంలోని సిద్ధర్ శక్తిపీఠంల కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక ఉద్యమ ఉపాధ్యక్షులు గోపీ సెంథిల్ కుమార్ పాల్గొని గోపురం కలశాలపై పవిత్రజలం పోసి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో ఆదిపరాశక్తి అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజలు చేపట్టారు. అలాగే సాలిగ్రామంలో జరిగిన కుంభాభిషేకం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొనగా అందరికీ అన్నదానం చేశారు. ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలర్ 85వ అవతారోత్సవం సందర్భంగా 85 మందికి వస్త్రదానం చేశారు. ముత్తు రామలింగం వృద్ధాశ్రమానికి నెలకు సరిపడా సరుకులు అందజేశారు. ఏర్పాట్లను ఎన్నూరు సిద్ధర్ శక్తి పీఠం అధ్యక్షులు మాధవన్ తదితరులు పర్యవేక్షించారు. నవవధువు ఆత్మహత్య అన్నానగర్: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్ షాక్కు గురయ్యాడు. ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో భూపాలన్కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆర్టీఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు. -
అసిస్టెంట్ కమిషనర్ కన్నన్కు ప్రశంసలు
కొరుక్కుపేట: హత్యాయత్నం కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులకు నాలుగు సంవత్సరాలు శిక్షపడేలా చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బ్యాంక్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఎన్ కన్నన్పై ప్రసంశలు కురిపించారు. సోమవారం నేరుగా చైన్నె నగర పోలీసు కమీషనర్ అరుణ్ తన కార్యాలయానికి ఆహ్వానించి ఎన్.కన్నన్ సేవలను ప్రశంసిస్తూ రివార్డుతో అభినందించారు. వివరాలు.. చైన్నె టి.నగర్కు చెందిన అల్లి – అయ్యనార్లు టినగర్ నార్త్ ఉస్మాన్ రోడ్డులోని ఫుట్పాత్పై షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో 2023 సంవత్సరం మే1వ తేదీన వెంకటేశన్తోపాటూ మరో ముగ్గురు వ్యక్తులు అక్కడి వచ్చి అల్లి అనే మహిళను మీభర్త ఎక్కడ అని అగిడి గొడవకు దిగారు. వారిమధ్య వాగ్వాదం జరిగి పక్కకు నెట్టి వేశారు. ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ నలుగురు వ్యక్తులు షాపులోని సరుకులు పగులగొట్టి అల్లి నుంచి రూ.1,000 తీసుకుని ఆటోలో పరారయ్యారు. పై ఘటనపై అల్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, హత్యాయత్నం సహా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులు వెంకటేశన్,వినోద్ శ్రీనివాసన్, మణివన్ అనే నలుగురిని కన్నన్ నేతృత్వంలోని పోలీసు బృందం అరెస్టు చేసింది. విచారణ అనంతరం నలుగురు దోషులకు ఒక్కొక్కరికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ 14.03.2025 న కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసు కమిషనర్ అరుణ్ స్వయంగా కన్నన్ను ఆహ్వానించి అభినందించారు. -
వేడుకగా కారైక్కాల్ అమ్మయార్ ఉత్సవం
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు అనుసందానంలోని తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుడు నాట్య ప్రదర్శన చేసిన ఐదు సభల్లో తొలి సభ రత్నసభగా ప్రసిద్ధి చెందిన తిరువలంగాడు ఆలయంకు కారైక్కాల్ అమ్మవారు తల సాయంతో చేరుకుని స్వామిని దర్శించుకున్నట్లు, దీంతో ఆమెను సాక్షాత్తూ శివుడు అమ్మయార్ అని పిలిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. దీంతో కారైక్కాల్ అమ్మవారు అని పేరు ప్రసిద్ధి చెందింది. కారైక్కాల్ అమ్మవారి వేడుకల వివరాలను అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆదివారం నుంచి సోమవారం వరకు రెండు రోజుల పాటూ ృవేడుకలు తిరువలంగాడు వడారన్నేశ్వరర్ ఆలయంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆదివారం రాత్రి కారైక్కాల్ అమ్మవారికి అభిషేక పూజలు చేపట్టి పుష్ప అలంకరణలో ఆలయ రాజగోపురం వద్ద ఊంజల్ సేవ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి సైతం రెండవ రోజు అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. -
కరుణకు విగ్రహం
● రంగన్న ● పుదుచ్చేరి సభలో రచ్చ ● టేబుల్ మీదకు ఎక్కిన మహిళా ఎమ్మెల్యేసాక్షి, చైన్నె :పుదుచ్చేరిలో దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రంగస్వామి స్పష్టంచేశారు. కాగా సభలో ఓ వివాదం సమయంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక తన కుర్చీ నుంచి లేచి, దాని మీద నిలబడి నినాదాలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్ర పాలిత ప్రాంతంపుదుచ్చేరిలో అసెంబ్లీ సమావేశాలు 10వ తేదీ నుంచి జరుగుతున్నవిషయం తెలిసిందే. 12వ తేదీ సభలో సీఎం రంగస్వామి బడ్జెట్ దాఖలు చేశారు. బడ్జెట్పై సభలో చర్చ జరుగుతోంది. సోమవారం సభ ప్రారంభం కాగానే, డీఎంకే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. ఎన్నికల వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదనిధ్వజమెత్తారు.అ న్నింటా ఈపాలకులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. తమ నేత కలైంజ్ఞర్ విగ్రహంతో కూడిన స్మారక మందిరం పనులు కూడా ఇంత వరకు చేపట్ట లేదని నిలదీశారు. దీంతో అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ ఎమ్మెల్యేలు, డీఎంకే – కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ నుంచి ప్రతి పక్షాలు వాకౌట్ చేశాయి. ఈ సమయంలో సభలో సాగుతున్న వివాదంనేపథ్యంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రప్రియాంక ఆగ్రహంతో తన సీటు నుంచి లేచ్చారు. తన కూర్చీపైకి ఎక్కేసి నిలబడి ఏదో మాట్లాడుతూ తన నిరసనను వ్యక్తంచేసే విధంగా ముందుకెళ్లారు. దీంతో ఆమెను స్పీకర్ ఎన్బలంసెల్వం వారించారు. అనంతరం సీఎం రంగస్వామిమాట్లాడుతూ కలైంజ్ఞర్ కరుణానిధి అంటే అందరికీ గౌరవం అని, తమిళంకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని, రాజకీయాలలో గొప్ప నేతల అని కొనియాడుతూ ఆయనకు పుదుచ్చేరిలో విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఇదిత్వరలో జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు. -
పెళ్లి చూపుల పేరిట నగల అపహరణ
● నలుగురు మహిళల అరెస్టుఅన్నానగర్: రాజామంగళం సమీపం ఎల్ఐసీ ఏజెంట్ ఇంట్లో వరుడుని చూడటానికి వచ్చినట్లు నటించి, 8 తులాల నగలు అపహరించిన ఘట వెలుగు చూసింది. ఈ కేసులో నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా రాజామంగళం ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే అభిప్రాయ బేధాల కారణంగా ఆరేళ్ల కిందట భార్య అతడితో విడిపోయింది. ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అతనిని చూసుకోవడానికి ఎల్ఐ సీ ఏజెంట్ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆన్న్లైన్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూసి మధురై చెందిన మురుగేశ్వరి అనే మహిళ ఎల్ఐసీ ఏజెంట్ని సంప్రదించి అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా చూడబోతున్నట్లు కూడా తెలిపింది. మురుగేశ్వరి, అతని చెల్లెలు కార్తిగైయాయిని(28), ముత్తులక్ష్మి(45), పోదుమ్ పొన్ను (43) ఎల్ఐసీ ఏజెంట్ ఇంటికి వచ్చారు. అక్కడ ఎల్ఐసీ ఏజెంట్తోపాటు బంధువులు కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లికి ఒప్పుకుంటే ఎల్ఐసీ ఏజెంట్ 8 తులాల బంగారు గాజులు, ఉంగరాలు లాంటి నగలను అమ్మాయికి ఇస్తామని తెలిపాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలు దీన్ని నిశితంగా గమనించారు. దీంతో ఎల్ఐసీ ఆ నగలను టేబుల్ డ్రాయర్లో ఉంచి వచ్చిన వారిని గమనించడంలో నిమగ్నం అయ్యా డు. వరుడిని చూసేందుకు వచ్చిన నలుగురు మహిళలు రాత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఎల్ఐసీ ఏజెంట్ టేబుల్పై ఉన్న నగలను పరిశీలించగా అవి కనిపించలేదు. దీంతో షాక్కు గురైన అతను తన కొడుకు, కుమార్తెకు సమాచారం ఇచ్చాడు. వరుడిని చూసేందుకు వచ్చిన మహిళలే చోరీ చేసి ఉంటారని ఎల్ఐసీ ఎజెంట్ అనుమానించి వెంటనే మురుగేశ్వరిని సెల్ఫోన్లో సంప్రదించగా అది స్విచ్ఛాఫ్ అయింది. ఆ తర్వాత మురుగేశ్వరితో పాటు వచ్చిన మరో అమ్మాయికి ఫోన్ చేయగా.. నువ్వంటే ఇష్టం లేదని అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పింది. అలాగే ఆధ్యాత్మిక ఆభరణాల గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఎల్ఐసీ ఏజెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధురైకి చెందిన నలుగురు మహిళలను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నగలు చోరీ చేసినట్లు తేలింది. అనంతరం మురుగేశ్వరి, కార్తిగైయాయిని, ముత్తులక్ష్మి, పోదుమ్ పొన్ను అనే నలుగురుని పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
తమిళనాడు: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్స్టేష¯Œన్కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది. దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగి్నమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమిళనాడులో ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి(liquor scandal) వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) సారధ్యంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును కోరుతూ, నిరసనకు దిగబోతున్నామని ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వం సహా తమిళనాడు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాష్ట్ర బీజేపీ నేతలు(BJP leaders) సోమవారం ఉదయం 11 గంటలకు నిరసన చేపట్టనున్న తరుణంలో అందుకు ముందుగానే పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేత సౌందరరాజన్ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ ‘వారు మమ్మల్ని ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వడం లేదు. మా కార్యకర్తలలో మూడు వందల మందిని ఒక కల్యాణ మండపంలో నిర్బంధించారు. టీఏఎస్ఎంఏసీలో జరిగిన వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నామని’ అన్నారు.Many Tamil Nadu BJP leaders have been arrested by Tamil Nadu Police for organizing a protest against TASMAC scam worth 1000 cr by DMK gang.This is the same scam they want to cover up by diverting attention to the language issue.This is what real dictatorship looks like!! pic.twitter.com/L14GjJE54f— Mr Sinha (@MrSinha_) March 17, 2025రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై(State BJP chief Annamalai) ఈ నిర్బంధాలను ఖండించారు. డీఎంకే ప్రభుత్వం భయంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ‘ఎక్స్’ పోస్ట్ లో ఆయన ఇలా రాశారు..‘డీఎంకే ప్రభుత్వం భయంతో వణికిపోతోంది. అందుకే బీజేపీ నేతలైన తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పి సెల్వన్ రాష్ట్ర జిల్లా నిర్వాహకులను గృహ నిర్బంధంలో ఉంచింది. వారు నిరసనలో పాల్గొనకుండా నిర్బంధించింది. తేదీ ప్రకటించకుండా అకస్మాత్తుగా నిరసన ప్రారంభిస్తే ఏమి చేయగలరు?’ అని అన్నామలై ప్రశ్నించారు. కాగా డీఎంకే ప్రభుత్వం బీజేపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షం నేతృత్వంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని, కేంద్ర సంస్థలు పనిచేస్తున్నాయని డీఎంకే నేతలు ఆరోపించారు.Unlawful arrest by Dictator CM @mkstalin! You looted Tamil Nadu, and now you want to silence BJP. We will not back down!We have been arrested along with Sr Leader Thiru @PonnaarrBJP anna.DMK Liquor Scam 😡 1000 Crores Corruption. @annamalai_k @blsanthosh pic.twitter.com/INhAFM5Vsh— Amar Prasad Reddy (@amarprasadreddy) March 17, 2025ఇది కూడా చదవండి: పాక్లో మరో హత్య: జమీయత్ ఉలేమా నేత ముఫ్తీ అబ్దుల్ హతం -
మరి మీరు చేసిందేంటి?.. నిర్మలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులు కేంద్రం వర్సెస్ స్టాలిన్ అనే విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించడం మరింత చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి స్టాలిన్ కౌంటరిచ్చారు.తాజాగా ఓ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ..‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆంగ్ల ‘రూ’కి బదులుగా తమిళంలోని ‘రూ’ అనే అర్థం సూచించే అక్షరాన్ని వినియోగించారు. మరి ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించడం కూడా సరైనదే కదా. ప్రస్తుతం భాషపై జరుగుతున్న వివాదంలో మా వైఖరిని మేము తెలియజేస్తున్నాం. మా మాతృ భాషను రక్షించుకుంటున్నాం. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించాలనుకునే వారు కేంద్రమంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’ అని ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని ఆయన మండిపడ్డారు. దీంతో, ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఇదిలా ఉండగా.. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్రం మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రూపాయి విషయంలో స్టాలిన్ నిర్ణయాలన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
● బైక్ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు ● తల్లి, తండ్రి, కుమార్తె దుర్మరణంసేలం : సెంజి సమీపంలో ఉన్న రాజంపుల్లియూర్ గ్రామానికి చెందిన దురైకన్ను (50) ఇటుక పని చేసే కార్మికుడు. చైన్నెలోని మదురవాయల్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన భార్య పచ్చయ్యమ్మాళ్ (46). వీరికి కుమార్తె గోపిక (18), కుమారుడు గుణశేఖర్ (21) ఉన్నారు. ఈ పరిస్థితిలో, మరణించిన దురైకన్ను సోదరుడు నందగోపాల్ అంత్యక్రియలకు హాజరు కావడానికి దురైకన్ను, గుణశేఖర్ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రెండు బైక్లో సెంజికి బయలుదేరారు. దురైకన్ను, అతని భార్య పచ్చయ్యమ్మాళ్, కూతురు గోపిక బైక్పై వస్తుండగా, గుణశేఖర్ మరో బైక్ మీద వెళ్లాడు. వారు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో, విల్లుపురం జిల్లా సెంజి తిండివనం రోడ్డులోని వల్లం తొండియట్టు వంతెన వద్దకు చేరుకుంటుండగా, తిరువణ్ణామలై నుంచి చైన్నె వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న దురైకన్ను, పచ్చయమ్మాళ్, గోపికలు ముగ్గురు కింద పడి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సెంజి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మరణించిన ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సెంజి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెమరీస్ అండ్ మైల్ స్టోన్స్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా 60 వసంతాలను గుర్తు చేస్తూ జ్ఞాపకాలు, మైలురాళ్లపై చరిత్రకారుడు వి. శ్రీరామ్, లక్ష్మణ్ల మెమరీస్ అండ్ మైల్ స్టోన్స్ పుస్తకాన్ని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ ప్రకాష్, జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా సంజయ్ గాంధీ, తమిళనాడు ప్రభుత్వ మాజీ అడ్వకేట్ జనరల్ ఎ.ఎల్. సోమయాజిలు ఆవిష్కరించారు. ఆదివారం జరిగిన వేడుకలో 1964లో మొదటిసారిగా బ్లూ క్రాస్ ఆఫ్ ఇండి యా రిజిస్ట్రేషన్ చేయబడినప్పటి నుంచి స్వచ్ఛందంగా పనిచేసిన, పనిచేస్తున్న దేశంలో అత్యంత చురుకై న జంతు సంక్షేమ సమూహంగా అవతరించే వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా బ్లూ క్రాస్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్ని కృష్ణ మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా ఏదైనా సంస్థను నడపడం కష్టం అని, అది కూడా జంతు సంక్షేమ రంగంలో ఒక సంస్థను నడపడం చాలా కష్టమైన పనిగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సేవలు సాగాయని, మరెన్నో కొనసాగుతున్నాయని వివరించారు. జంతు సంరక్షణలో తాము నిరంతర సేవకులు అని వ్యాఖ్యానించారు. అంగన్వాడీలలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ – 7,783 పోస్టులకు నోటిఫికేషన్సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని అంగన్వాడీలలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు 7,783 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో అంగన్ వాడీలలో ఖాళీలు పేరుకు పోతున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు హోరెత్తిన విషయం తెలిసిందే. పేద పిల్లలకు ప్రాథమికంగా విద్యా అడుగు పడేందుకు వేదికగా ఈ అంగన్వాడీలు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో పేరుకుపోతున్న ఖాళీలను భర్తీ చేయాలన్న డిమాండ్ గత కొంత కాలంగా వినిపిస్తూ వచ్చింది. ఈ పరిస్థితులలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కొన్ని మార్గదర్శకాలను మాత్రం రూపొందించారు. వాటికి అనుగుణంగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్యూల ఆధారంగా జిల్లాల వారీగా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు 3,886 పోస్టులు అంగన్వాడీ ఉద్యోగి, 305 మినీ అంగన్వాడీ ఉద్యోగి, 3592 అంగన్వాడీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ..గుర్తు మార్పులో తప్పేముంది! ● తమిళం నచ్చని వారికే సమస్య ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ ఆదివారం మీలో ఒకడ్ని అంటూ సామాజిక మాధ్యమం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వీడియో ద్వారా అన్ని వివరాలను విశదీకరించారు. ఇందులో బడ్జెట్ లోగోలో తమిళంలో రూ. అక్షరం చర్చకు దారి తీసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఆర్ఎస్.. అని ఆంగ్లంలో ఉపయోగిస్తున్న పదాన్ని తాము తమిళంలో రూ. అని పేర్కొన్నట్టు వివరించారు. భాషా విధానానికి ఏ మేరకు కట్టుబడి ఉన్నామో చాటే విధంగా తమిళంలో రూ. అని పొందు పరిచామన్నారు. అయితే, తమిళం అంటే నచ్చని వారికి ఇది పెద్ద సమస్యగా అనిపించినట్టుందన్నారు. దీనిని వివాదంగా వార్తల్లోకి ఎక్కించారని పేర్కొన్నారు. తాను కేంద్రం నుంచి రావాల్సిననిధుల విడుదల విషయంగా ప్రస్తావిస్తూ లేఖలు రాసినప్పుడు గానీయండి, ఆర్థిక మంత్రి అనేక సందర్భాలలో రూ. అని ఇంగ్లీషు రాసి ఉన్నారన్నవిషయాన్ని ఈసందర్భంగా తాను గుర్తు చేస్తున్నట్టు వివరించారు. అందరూ రూపాయలే అని రాయడం లేదు. కొన్ని సందర్భాలలో సాధారణంగా రూ. అనే రాస్తున్నా రని పేర్కొన్నారు. అయితే, భారత దేశ స్థాయి లో తమ తమ బడ్జెట్ హిట్, తమిళం కూడా హిట్ అని వ్యాఖ్యానించారు. అనంతరం బడ్జెట్ రూపకల్పన గురించిన ప్రశ్నకు ఆర్థిక సలహా మండలిలోని నిపుణుల సలహాలు సూచనలను గుర్తు చేశారు. సచివాలయంలో చాలా రోజులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మంత్రులు, అధికారులు కూర్చుని ఈ బడ్జెట్ గురించి సమీక్షించి, చర్చించి సిద్ధం చేశామన్నారు. ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఆరోపణలను బడ్జెట్తో నోళ్లు మూయించామన్నా రు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ పెంపు, అన్నింటా నంబర్ వన్ అనే లక్ష్యాన్ని సాధించడానికి తన ప్రయాణం విస్తృతం అవుతుందన్నారు. -
ఇక సమరమే!
● నేటి నుంచి పూర్తిస్థాయిలోసభా కార్యకలాపాలు ● అధికార పక్షాన్ని ఢీకొనేందుకు సిద్ధమైన ప్రతిపక్షాలు ● అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న విపక్ష నాయకులు ● స్పీకర్పై అవిశ్వాసం నోటీసు ● ఓటింగ్కు అవకాశం స్పీకర్పై అవిశ్వాసం నోటీసు స్పీకర్ అప్పావును అన్నాడీఎంకే టార్గెట్ చేసింది. సభా వ్యవహారాలలో తమకు అన్యాయం చేస్తున్నారన్న ఆగ్రహంతో కన్నెర్ర చేసింది. తమ ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు కావడం లేదని, తమకు సమయం కేటాయించడం లేదన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్కు అన్నాడీఎంకే స్పీకర్పై అవిశ్వాస నోటీసు జారీ చేసింది. దీనిపై సోమవారం ఓటింగ్కు అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా, స్పీకర్ అప్పావుకు బదులుగా డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి సభను నడిపించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ విషయంగా స్పీకర్ అప్పావును ప్రశ్నించగా, వారి అవిశ్వాస తీర్మానంను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నా రు. గత సమావేశాలలో కొన్ని సాంకేతిక కారణాలతో సమస్యలు ఎదురయ్యాయని, అవి ఇక పు నరావృతం కాకుండా చూసుకుంటామన్నా రు. కాగా, అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన పక్షంలో డీఎంకే మెజారిటీ ఆధారంగా అది వీగి పోయే అవకాశాలు అధికంగా ఉండడం గమనార్హం. సాక్షి, చైన్నె: అసెంబ్లీలో బడ్జెట్ల దాఖల పర్వం ముగిసింది. ఇక, నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, వివిధ తీర్మానాలపై జరగనుంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నాడీఎంకే , బీజేపీ, పీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అస్త్రాలతో అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి సభా పర్వం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ అప్పావుపై అవిశ్వాస తీర్మానం నోటీసును అన్నాడీఎంకే జారీచేసిన దృష్ట్యా, ఓటింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు.. 2025–26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్, రైతు సంక్షేమాన్ని కాంక్షించే వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీ ముందుకు చేరింది. ఆ శాఖల మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్కే పన్నీరు సెల్వం తమ పద్దులను సభ ముందు ఉంచారు. ఈ రెండు రోజుల ప్రక్రియ ముగియడంతో సోమవారం నుంచి బడ్జెట్ మీద చర్చ జరగనుంది. సంతాప తీర్మానాల తర్వాత ఈ చర్చ మొదలు కానుంది. 18, 19, 20 తేదీలలోనూఈ రెండు బడ్జెట్లపై చర్చ కొనసాగనుంది. 21వ తేదీన సభలో ఆదాయ వ్యయాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఖర్చులతో అనుబంధ పద్దును ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సభ ముందు గణాంకాలతో సహా ఉంచనున్నారు. 22, 23 శని, ఆదివారాలు సెలవు కావడంతో ఈనెల 24వ తేదీ నుంచి సభలో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ప్రగతి ప్రాజెక్టులు, వివిధ అంశాలపై చర్చలు హోరెత్తనున్నాయి. నీటి పారుదల శాఖ నుంచి మొదలు.. ఈనెల 24వ తేదీన నీటి పారుదల శాఖ, 25న నగరాభివృద్ధి శాఖ, 26న గ్రామీణాభివృద్ధి, 27న ప్రత్యేక పథకాలు, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ, 28న ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, అటవీ, పర్యావరణ శాఖలకు నిధులు కేటాయింపుల చర్చ,సమీక్షలు జరగనున్నాయి. ఈనెల 29, 30 శని ఆదివారాలు, 31న రంజాన్ సెలవు తర్వాత సభ ఏప్రిల్ 1వ తేది పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున రహదారులు, చిన్న హార్బర్లు, ప్రజా పనుల శాఖ, 2న వ్యవసాయం, మత్స్య, పశు సంవర్ధక శాఖలు, 3వ తేదీ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ, 4న న్యాయం, జైళ్లు శాఖ చర్చ జరగనున్నది. 5, 6 సెలవు దినాలు కావడంతో 7వ తేదిన గృహ నిర్మాణం, 8న సహకారం, ఆహార భద్రత శాఖ,9న ఎంఎస్ఎంఈల శాఖ చర్చ, 10వ తేదీ మహావీర్ జయంతి తర్వాత 11, 12, 13, 14 తేదీల సెలవుతో 15వ తేదీ సభ పునర్ ప్రారంభం కానుంది. ఆ రోజున సమాచారం, తమిళాభివృద్ధి శాఖ, 16వ తేదీ దివ్యాంగుల సంక్షేమం, మహిళా సంక్షేమం, హక్కుల శాఖ, 17వ తేదిన పర్యాటకం, హిందూ దేవాదాయ ఽశాఖ, చర్చ తర్వాత 18న గుడ్ ఫ్రైడే, 19,20 శని, ఆదివారాల సెలవుతో 21వ తేదిన విద్యుత్, ఎకై ్సజ్, 22న వైద్యం,ఆరోగ్య శాఖ, 23న వాణిజ్య పనులు, 24న విద్యా శాఖ, 25న ఐటీ ,26న వెనుకబడిన సంక్షేమం,మైనారిటీశాఖ చర్చ లు హోరెత్తనున్నాయి. 27న సెలవు దినం కావడంతో 28వ తేదీన అసెంబ్లీ వ్యవహారాలతోపాటూ ఆయా శాఖల మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. 29, 30 తేదీలలో సీఎం స్టాలిన్ పరిధిలోని హోంశాఖపై చర్చ, సీఎం ప్రత్యేక ప్రసంగాలు జరగనున్నాయి. ఈ ప్రక్రియలన్నీ ఓ వైపు ఉంటే,మరో వైపు అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. సై అంటే సై.. టాస్మాక్ స్కాం, కేరళకు ఖనిజ సంపదల అక్రమ రవాణా,రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విచ్చల విడిగాసాగుతున్న గంజాయి వంటి మాధక ద్రవ్యాల విక్రయాలు, బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాలు వంటిఅంశాలను ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకున్నాయి. డీఎంకే పాలన అవినీతిమయం అని చాటే దిశగా అధికార పక్షాన్ని డీకొట్టే విధంగా సభా వేదికగా సమరానికి అన్నాడీఎంకే కాలుదువ్వేపనిలో పడింది. బీజేపీ, పీఎంకేలు సైతం తమ దైన బాణిలో అస్త్రాలు సిద్ధంచేసుకున్నాయి. త్రిభాషా విధానం, లోక్సభ పునర్విభజన పేరిట డీఎంకే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇక తమకు రిజర్వేషన్ అమలు, కులగణనకు పట్టుబట్టే విధంగా పీఎంకే పోరుకు సిద్ధమైంది. ఈ దృష్ట్యా, అసెంబ్లీలో సభా పర్వం వేడెక్కనుంది. తామేమీ తక్కువ కాదన్నట్టుగా డీఎంకే సైతం ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ శాసన సభా పక్షం సమావేశం జరిగింది.ఇందులో సభలో వ్యవహరించాల్సిన అంశాల గురించి చర్చించి వ్యూహాలను రచించి ఉన్నారు. -
ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ
●టీఎన్సీసీ నిర్ణయం ●నేతలతో ఇన్చార్జ్ల సమాలోచన సాక్షి, చైన్నె: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆదివారం టీఎన్సీసీ నేతలతో సమావేశంలో ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చైన్నెలో సత్యమూర్తి భవన్ రాష్ట్ర కార్యాలయంగా ఉంది. అలాగే తేనాంపేటలో కామరాజర్ అరంగం ఉంది. 200 గ్రౌండ్లస్థలంతో ఆడిటోరియం ఉంది. ఇక చైన్నె నగరంలో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటూ రాష్ట్రంలో రూ. 500 కోట్లు విలువైన ఆస్తులు పలు జిల్లాలో ఉన్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. కామరాజర్ సీఎంగా ఉన్న కాలంలో కాంగ్రెస్కు అప్పట్లో విరాళాలు అధికంగా వచ్చేవి. పార్టీ కార్యాలయాల కోసం భవనాలు, ఖర్చుల కోసం పంట పొలాలను, అందులో సాగుబడి అయ్యే ఉత్పత్తులను విరాళంగా ఇచ్చేన వారు ఎక్కువే. అయితే ఇందులో అనేకం అన్యాక్రాంతమై ఉన్నాయి. వీటిని గుర్తించి స్వాధీనం చేసుకుని, పరిరక్షించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు సిద్ధమయ్యారు. అనేక ఆస్తులను పార్టీ వారే స్వాహా చేసి చేతులు మార్చినట్టుగా ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితులలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన గిరిశీ చడన్కర్, ఏఐసీసీ కార్యదర్శి సూరజ్ ఎంఎన్ హెగ్డేలు ఆదివారం చైన్నెలోని సత్యమూర్తి భవన్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆస్తుల మీద చర్చ జరిగింది. ఉన్నవాటిని పరిక్షించుకోవడం, అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టే విధంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ ఆస్తుల పరిరక్షణకు గతంలో నియమించిన కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై, మాజీ అధ్యక్షులు తంగబాలు, తిరునావుక్కరసర్ వంటి నేతలతో పాటూ రాష్ట్ర కమిటీ, జిల్లాలో ముఖ్యులైన నేతలు పాల్గొన్నారు. అదే సమయంలో ఏఐసీసీ పెద్దలను చైన్నె కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిశారు. వారికి తమ తరపున వినతి పత్రం సమర్పించారు. చైన్నె జిల్లా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మహిళలకు పెద్ద పీట వేయాలని కోరారు. ప్రస్తుత అధ్యక్షుడు మహిళలకు విలువనివ్వడం లేదని, కార్పొరేటర్లను ఏ ఒక్క సమావేశానికి పిలవడం లేదని ఆరోపించారు. -
న్యాయ వ్యవస్థకు.. సంపూర్ణ సహకారం
న్యాయ వ్యవస్థకు అన్ని రకాల సదుపాయాల కల్పన, మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుందని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలో సుప్రీం కోర్టు శాఖ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఈమేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు శాఖ కోసం.. విద్యావంతులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, తన ప్రభుత్వం రాజ్యాంగంలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు నుంచి, న్యాయ శాఖ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయవిద్య కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం ఏటా తమిళనాడు న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 10 కోట్లు విరాళంగా ఇస్తోందని, మరణించిన న్యాయవాదుల చట్టపరమైన వారసులకు అందించే స్కాలర్షిప్ను రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచామన్నారు. పెండింగ్లో ఉన్న అదనపు సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 20 కోట్ల విరాళంగా ఇవ్వనున్నామన్నారు. న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటున్నదని, సంపూర్ణ సహకారం, మద్దతును ఇస్తున్నట్టు వివరించారు. తాము అధికారంలోకి వచ్చినానంతరం 6 జిల్లా , సెషన్స్ కోర్టులు, 5 అదనపు జిల్లా కోర్టులు, 13 సబార్డినేట్ కోర్టులు, 2 అదనపు సబార్డినేట్ కోర్టులు, 7 ప్రాథమిక క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 18 జిల్లా సివిల్ , క్రిమినల్ ఆర్బిట్రేషన్ కోర్టులు, 3 జిల్లా సివిల్ కోర్టులు, 1 క్రిమినల్ జస్టిస్ ఆర్బిట్రేషన్ కోర్టు, 7 వాణిజ్య కోర్టులు, 9 ప్రత్యేక కోర్టులు, 2 కుటుంబ సంక్షేమ కోర్టులతో సహా 73 కొత్త కోర్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. న్యాయమూర్తుల కోసం కొత్త కోర్టు భవనాల నిర్మాణం నివాస భవనాలు, పాత కోర్టు భవనాల పునరుద్ధరణ, మద్రాసు హైకోర్టు, మధురై ధర్మాసనంలో కంప్యూటర్ సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామన్నారు. వివిధ స్థాయిలో జిల్లా, కింది కోర్టులలో ఉద్యోగాలను సృష్టించామని, ఖాళీలను భర్తీ చేశామని, న్యాయ కళాశాలల ఏర్పాటు విస్తృతం చేశామన్నారు. ఇలా.. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పన, మెరుగుపరచడంలో తమిళనాడు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్న దృష్ట్యా, మరోసారి గుర్తుచేయాల్సి బాధ్యతతో చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఈ శాఖ ఏర్పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాజ్యాంగం న్యాయవాదుల చేతుల్లో ఉంది.. దీనిని ఒక పత్రంగా పరిగణించ వద్దు.. ఇది మన జీవితం ప్రయాణం.. మన జీవన నాణ్యతను తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఒక వాహనం, ఇది ఎల్లప్పుడూ ఈ భూమికి ఆత్మ... అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రకటనగా ఉటంకిస్తూ ప్రసంగాన్ని ముగించారు. ముందుగా పలువురు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులకు పురస్కారాలను ప్రదానం చేశారు. బార్ అసోసియేషన్ ఘనతను చాటే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: భారత సుప్రీంకోర్టు రాజ్యాంగం ఆమోదించబడి 75 వసంతాలు కావడంతో శనివారం రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో వార్షికోత్సవం జరిగింది. అలాగే చైన్నె బార్ అసోసియేషన్ 160వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సీఎం స్టాలిన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ మహాదేవన్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ శ్రీరామ్, న్యాయశాఖ మంత్రి రఘుపతి, హిందూ మత ధార్మిక ధార్మిక శాఖ మంత్రి శేఖర్ బాబు, ఎంపీలు ఎన్.ఆర్. ఇళంగో, విల్సన్, గిరిరాజన్, అదనపు సొలిసిటర్ జనరల్ సుందరేశన్, చైన్నె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి తిరువెంగడమ్, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఇందులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ ముందుగా తాను ఒక విషయం చెప్ప దలచుకున్నట్టు పేర్కొంటూ, ఓ న్యాయమూర్తి తమిళంలో ఇక్కడ ప్రసంగిస్తారనుకుంటే, ఆంగ్లంలో మాట్లాడారని గుర్తు చేశారు. అదే మరో న్యాయమూర్తి ఆంగ్లంలో మాట్లాడుతారనుకుంటే తమిళంలో మాట్లాడేశారని పేర్కొంటూ, ఇదే ద్విభాషా విధానం అని వ్యాఖ్యానించారు. ఇది తమిళనాడుకు కష్టమైన పరిస్థితి కాదని, చాలా మంచి పరిస్థితి అని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీరామ్, తమిళనాడు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లిన ఆర్. మహాదేవన్, కె.వి. విశ్వనాథన్, ఎం.ఎం. సుందరేష్ అందించిన సేవలను కొనియాడారు. మద్రాసు హైకోర్టు చరిత్రను గుర్తు చేస్తూ బార్ అసోసియేషన్ 160 వసంతాల ప్రయాణాన్ని వివరించారు. సమాజంలోని అన్యాయం అనే వ్యాధిని నయం చేసేది న్యాయవాదులే అని, సామాజిక న్యాయం, వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో ప్రాథమిక సంస్థగా కూడా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ వ్యాఖ్య చైన్నెలో సుప్రీం కోర్టు శాఖకు వినతిచట్టం ఓ చీకటి గది. చట్టం ఒక చీకటి గది... అందులో న్యాయవాది వాద న ఒక దీపం.. అని మహా పండితుడు అన్న వ్యాఖ్య లను గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో న్యాయవాదులు న్యాయమూర్తుల సహకారాన్ని అభినందిస్తున్నామన్నారు. మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు మొదలెట్టిన న్యాయవాదులు ఎందరో తమ వాదన నైపుణ్యాలతో జాతీయస్థాయికి ఎదిగి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి మన న్యాయమూర్తులు అనేక జ్ఞానోదయమైన తీర్పులు ఇచ్చారని, అందించారని వివరించారు. ఇందులో మద్రాస హైకోర్టు బార అసోసియేషన్ సహకారం కూడా గుర్తుచేసుకోవాల్సి ఉందన్నారు. రాజ్యాంగం సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి ఒక సాధనం అని పేర్కొంటూ ప్రభుత్వ స్వేచ్ఛ, జీవిత సూత్రం, సమానత్వం, సోదరభావం గుర్తింపునకు ఒక పద్ధతి అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చేసిన వ్యాఖ్య లు గుర్తుచేశారు. రాజ్యాంగపరంగా, భారతదేశం ఒక ప్రజాస్వామ్య – సోషలిస్ట్ –లౌకిక – సార్వభౌమ గణ తంత్రం అని, భారత రాజ్యాంగ ప్రవేశికలో చెప్పినట్లుగా న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అని వివరించారు. రాజ్యాంగం ప్రభుత్వ నిర్మాణం, విధానాలను నిర్వచిస్తున్నారు. అధికారాలకు మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం, ప్రాథమిక హక్కులు, ప్రధాన సూత్రాలు, దేశం, పౌరుల విధులను కూడా నిర్వచిస్తుందన్నారు. భారతదేశంలో విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులు, విధానాలు రా జ్యాంగంలో సజీవంగా ఉంటుందన్నారు. రాజ్యాంగంపై జరిగే ఏ దాడికై నా వ్యతిరేకంగా స్వతంత్ర న్యాయవ్యవస్థ, అద్భుతమైన న్యాయమూర్తులు, దృఢమైన స్తంభాలుగా నిలుస్తున్నారన్నారు. రాజ్యాంగానికి న్యాయవాదుల సహకారం గురించి ప్రస్తావిస్తూ, ఆర్థికం, విద్య వంటి అనేక విషయాలను వివరించారు. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని నిర్ధారించడంలో, న్యాయవ్యవస్థ రాష్ట్రాల హక్కులను కాపాడుతూనే ఉందన్నారు. -
ఒత్తిడి లేకుండా పనిచేయాలి
వేలూరు: రేషన్ దుకాణ కార్మికులు పని ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే విధంగా చూడాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్లో కో–ఆపరేటివ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ రేషన్ దుకాణంలో పనిచేసే సేల్స్మన్లు, కార్మికులకు ఆదివారం ఒక్కరోజు శిక్షణ తరగతులు కోఆపరేటివ్ సంఘాల అసిస్టెంట్ డైరెక్టర్ తిరుగుణ అయ్యప్పదురై అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణకు కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణంలో పనిచేసే కార్మికులకు తరచూ ప్రజలతో ఉండడం వల్ల పలు పని ఒత్తిడి ఉండవచ్చునని అన్నారు. అయినప్పటికీ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు పని ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. హోమియోపతి డాక్టర్ అరుణ్ విక్రయ దారులకు పని ఒత్తిడి నుంచి తమను ఏ విధంగా కాపాడుకోవాలనే వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం రేషన్ దుకాణాల్లో విశిష్ట సేవలు అందజేసిన సేల్స్మన్లకు, విక్రయ దారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కో–ఆపరేటివ్ విభాగం మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణన్, జిల్లాలోని సేల్స్మన్లు, విక్రయదారులు పాల్గొన్నారు. -
థర్మల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
● విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత ● ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలు సేలం: తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో మంటలు అదుపుచేయడానికి వెళ్లిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయాలపాలయ్యారు. తూత్తుకుడి థర్మల్ పవర్ ప్లాంట్లో 12 గంటలకుపైగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి మూడు జిల్లాల నుండి 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయి. తూత్తుకుడిలో తమిళనాడు ప్రభుత్వానికి చెందిన థర్మల్ పవర్ ప్లాంట్ పనిచేస్తోంది. ఇక్కడ 5 యూనిట్ల ద్వారా 1,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పరిస్థితిలో, థర్మల్ పవర్ ప్లాంట్ అన్ని భాగాలను అనుసంధానించే వైర్లు వెళ్లే థర్మల్ పవర్ ప్లాంట్ శీతలీకరణ ప్రాంతానికి సమీపంలో, కేబుల్ గ్యాలరీ అని పిలువబడే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు నెమ్మదిగా అన్ని విభాగాలకు వ్యాపించాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల నుంచి 20కి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. గాయపడ్డ ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో కప్పబడి ఉండడం వల్ల మంటలను ఆర్పడం కష్టమవుతోంది. పొగలో చిక్కుకున్న తర్వాత ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా, థర్మల్ పవర్ ప్లాంట్లోని 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీని కారణంగా 630 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రభావితమైంది. ఆధునిక పరికరాలు లేకపోవడం వల్ల అగ్నిమాపక చర్యలకు ఆటంకం కలిగింది. థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.కోట్ల విలువైన కేబుల్ వైర్లు, పరికరాలు, సామగ్రి దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆదివారం రాత్రి వరకు నిప్పును ఆర్పే పనుల్లో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమయ్యారు. 18 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మూడు యూనిట్లలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి కష్టతరంగా మారిందని థర్మల్ విద్యుత్ కేంద్ర వర్గాలు వెల్లడించాయి, -
అత్తిమాంజేరిపేటలో బిరియానీ పంపిణీ
పళ్లిపట్టు: పళ్లిపట్టు సమీపం అత్తిమాంజేరిపేటలో సీఎం స్టాలిన్ 72వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం డీఎంకే ఆధ్వర్యంలో వేడుకగా జరుపుకున్నారు. తిరువళ్లూరు వెస్ట్ జిల్లా డీఎంకే నేత విభాగం ఉప కార్యదర్శి రామచంద్రన్ అధ్యక్షతన చేపట్టిన వేడుకల్లో ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 500 మందికి బిరియానీ పంపిణీ చేశారు. ఇందులో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బిరియానీ పోటాపోటీ పడ్డారు. డీఎంకే జిల్లా వర్తక విభాగం ఉప కార్యదర్శి కదిరవన్, మండల నాయకులు అన్బళగన్, గురునాథన్, జయవేలు, రాజేంద్రనాయుడు, రామస్వామి, శేఖర్ పాల్గొన్నారు. -
తిరుచెందూర్ ఆలయంలో భక్తుడి మృతి
సేలం: తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనం కోసం క్యూలో నిలిచి ఉన్న భక్తుడు అకస్మాత్తుగా శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడి మృతిచెందాడు. కారైకుడికి చెందిన ఓంకుమార్ (50) అనే భక్తుడు ఆదివారం ఆలయంలో రూ.100ల క్యూలో దర్శనం కోసం నిలిచి ఉన్నాడు. ఆదివారం సేలవు రోజు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా ఓంకుమార్కు శ్వాస సమస్య ఏర్పడి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆలయ సిబ్బంది అతడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఓంకుమార్ మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. -
పుస్తకాలు పఠిస్తే జీవితం గాడినపడినట్టే!
తిరువళ్లూరు: పుస్తక పఠనం పెరిగితే జీవితం గాడినపడినట్టేనని సినీనిర్మాత మారిసెల్వరాజ్ స్పష్టం చేశారు. తిరువళ్లూరు జిల్లా కేంద్రంలో పుస్తక ప్రదర్శన పది రోజుల పాటు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శనివారం రాత్రి జరిగిన కార్యక్రమానికి సినీనిర్మాత మారిసెల్వరాజ్, సినీగాయని సెంథిల్గణేష్ రాజ్యలక్ష్మి హాజరయ్యారు. మొదట సెంథిల్ గణేష్, రాజ్యలక్ష్మి బృందం నిర్వహించిన కచ్చేరి అందరినీ ఆకట్టుకుంది. పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, గ్రామీణ కళలు, సంప్రదాయాలపై పాడిన ప్రత్యేక పాటలు అలరించాయి. అనంతరం మారి సెల్వరాజ్ మాట్లాడుతూ పుస్తక అభ్యసనం ప్రతి జీవితంలోనూ మార్పులు తెస్తుందన్నారు. పుస్తక పఠనాన్ని ప్రాథమిక దశ నుంచే అలవరుచుకోవాలన్న ఆయన, యువత విద్యార్థులు పుస్తకాలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు. పుస్తకాలను చదవడం ద్వారా తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవడంతో పాటు చెడు అలవాట్లకు సైతం దూరంగా వుండొచ్చన్నారు. విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ
సాక్షి, చైన్నె: చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ నేతృత్వంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చైన్నెలో ఆదివారం ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ డాక్టర్ శైలేంద్ర బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఏ అరుణ్, ఆదేశాలతో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్బ్రాంచ్ , శ్రీ రామచంద్ర ఉన్నత విద్య సంస్థ, సైబర్ క్రైమ్ యూనిట్, పరిశోధనా సంస్థతో పాటూ కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాలు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, వివాహాల పేరిట ఆన్లైన్ మోసాలు, ఆనన్లైన్ పార్ట్–టైమ్ ఉద్యోగాల పేరిట మోసాలు సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్లకార్డులను చేత బట్టి అవగాహన ర్యాలీ నిర్వహించారు. బెసెంట్నగర్లోని ఎలియట్స్ బీచ్ పోలీస్ సహాయ కేంద్రం నుంచి పలు ప్రాంతాల గుండా ర్యాలీ జరిగింది. మాజీ డీజీపీ శైలేంద్ర బాబు, విద్యార్థులతో కలిసి రంగురంగుల బెలూన్లను ఎగుర వేశారు. ఈ ర్యాలీలో సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930ని ప్రదర్శించారు. సైబర్ నేరాల అవగాహన గురించి మరింత సమాచారంలో రాణించిన శ్రీరామచంద్ర ఉన్నత విద్య, పరిశోధనా సంస్థకు చెందిన 10 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీసులు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అదనపు కమిషనర్ ఎ. రాధిక, జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (సౌత్) బండి గంగాధర్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్లు, ఎస్. ఆరోగ్య, వి.వి. గీతాంజలి. జి. వనిత, పోలీస్ అధికారు లు, ప్రజలు పాల్గొన్నారు. సైబర్ నేరాల మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండడం, తక్షణ సహాయం కోసం 1930ను సంప్రదించడం, సైబ ర్ నేరాలను నిరోధించడం, నివారణ, వేగవంతమైన చర్యను నిర్ధారించడం, ఫిర్యాదులు చేయాల్సిన www.cybercrime.gov.in వెబ్ సైట్ గురించి ఈ ర్యాలీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. -
తిరుత్తణిలో సాధారణ రద్దీ
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాదిగా భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుంటుంటారు. శుభముహూర్తం రోజులు, పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల తాకిడి పెరుగుతుంది. దీంతో మూడు నుంచి ఐదు గంటల పాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకోవాల్సి వుండేది. అయితే వేసవి ఎండలతో పాటు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న క్రమంలో భక్తులు రాక తగ్గింది. కొండ ఆలయంలో ఆదివారం సెలవు రోజున కూడా రద్దీ తక్కువగా వుంది. దీంతో ఉచిత దర్శనం క్యూలు ఖాళీగా కనిపించాయి. గంట వ్యవధిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవడంతో ఆనందం చెందారు. భక్తుల సౌకర్యార్థం ఎండల నేపథ్యంలో మాడ వీధిలో మ్యాట్ ఏర్పాటు చేసి మంచినీటిని చల్లి చల్లగా వుంచారు. మాడ వీధిలో నడిచి వెళ్లిన భక్తులు ఇబ్బందులకు గురికాకుండా స్వామి దర్శనానికి వెళ్లేలా ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు. రచయిత నారుంపూనాథన్ మృతి సేలం: ప్రముఖ రచయిత నారుంపూనాథన్ ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా మృతిచెందారు. తూత్తుకుడి జిల్లా కళుగుమలైకు చెందిన ప్రముఖ రచయిత నారుంపూనాథన్ (64). ఈయన బ్యాంకులో పని చేశారు. ఈయనకు భార్య శివగామ సుందరి, ఒక కుమారుడు ఉన్నారు. శివగామ సుందరి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దీపక్ విదేశాల్లో ఉంటున్నారు. నెల్లై చంద్రనగర్లో నివసిస్తున్న నారుంపూనాథన్ కలైంజర్ సంఘం నిర్వాహకునిగా కూడా పనిచేశారు. ఈ స్థితిలో నారుంపూనాథన్ ఆదివారం వాకింగ్కు వెళ్లిన సమయంలో ఆయనకు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడింది. వెంటనే ఆయన్ను నెల్లై వన్నారపేటలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే నారుంపూనాథన్ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని చంద్రనాగర్లో ఉన్న ఇంట్లో ఉంచారు. ఆయన భాతికకాయానికి రచయితలు పలువురు అంజలి ఘటించారు. పలు గ్రంథాలు, పుస్తకాలను రచించిన నారుంపూనాథన్ తమిళ సాహిత్యం, తమిళ భాషాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఈయనకు రాష్ట్ర ప్రభుత్వం 2022లో ఉ.వె.స్ అవార్డును అందజేసింది. కాగా నారుంపూనాథన్ మృతికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, పలువురు రచయితలు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మృతి తిరువొత్తియూరు: తేనె కోసం కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్షాక్కు గురై ఓ ఎలుగుబంటి మృతిచెందింది. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని నాన్సాచ్ ప్రాంతంలో తేయాకు తోట ఉంది. ఈ తోటలోని విద్యుత్ స్తంభంపై తేనెతుట్టె ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ఎలుగుబంటి పిల్లలతో టీ తోటలోకి వచ్చింది. తేనెతుట్టె ఉన్న విద్యుత్స్తంభాన్ని ఎలుగుబంటి ఎక్కుంది. అప్పుడు హఠాత్తుగా ఎలుగుబంటి కరెంట్షాక్కు గురై కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలిసి స్థానికులు కున్నూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఎలుగుబంటి కళేబరాన్ని పరిశీలించారు అనంతరం పశువైద్యుడిని పిలిపించి ఎలుగుబంటికి శవపరీక్ష నిర్వహించారు. దీనిపై అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బైక్ అదుపుతప్పి కార్మికుడు దుర్మరణం తిరువళ్లూరు: నిత్యావసర వస్తువులు కొనడానికి వెళ్లిన ఒడిశా కార్మికుడు బైక్ అదుపుతప్పి కిందపడడంతో దుర్మరణం చెందాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సిబాడాకు(33). ఇతను భార్య ఫాతిమాడాకు(28)తో కలిసి ఇటీవల వలస వచ్చారు. ఇద్దరు కలిసి తిరువళ్లూరు జిల్లా విశ్వనాథపురంలో నివాసం వుంటూ స్థానికంగా వున్న ఫేనా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి విశ్వనాథపురం నుంచి మప్పేడుకు ద్విచక్ర వాహనంలో వెళ్లిన సీబాడాకు అక్కడ నిత్యావసర వస్తువులను కొనుక్కుని తిరుగు ప్రయాణమయ్యాడు. మప్పేడు సమీపంలో వెళుతుండగా ఎదురుగా పశువులు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. గాయపడ్డ ఇతన్ని 108 వాహనంలో తరలిస్తుండగా మృతిచెందాడు. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు?
–బావిలో తోసి హత్య – యువకుడి అరెస్టు సేలం: ప్రియురాలిని బావిలో తోసి ప్రియుడు కడతేర్చాడు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కంకు చెందిన వేల్మురుగన్ కుమార్తె రోషిణి (21). ఈమె తన కళాశాల చదువు పూర్తి చేసి, పోలీసు దళంలో చేరడానికి ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రంలో చదువుతోంది. అలనార్కమంగళం గ్రామానికి చెందిన పరశురామన్ కుమారుడు శక్తివేల్ (29) కూడా అదే శిక్షణ కేంద్రంలో చదువుతున్నాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ క్రమంలో రోషిణి, శక్తివేల్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో శిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిద్దరు మన్సూరాబాద్ రోడ్డులో నడిచి వెళుతుండగా వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన శక్తివేల్ రోషిణిపై దాడి చేశాడు. ఆమెను సమీపంలోని బావిలో తోసేశాడు. అనంతరం శక్తివేల్ అర్ధరాత్రి పోలూరు పోలీస్స్టేషన్న్కు వెళ్లి లొంగిపోయాడు. తరువాత, అతను పోలీసులకు, ‘రోషిణి, నేను ప్రేమించుకున్నాం’అని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి వరుడి కోసం వెతుకుతున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందమని రోషిణికి చెప్పాను. కానీ రోషిణి నిరాకరించింది. దీంతో తమ మధ్య వివాదం చెలరేగింది. దీనికి కోపంగా, తాను ఆమె చెంప మీద కొట్టాను. ‘ఫలితంగా, రోషిణి సమీపంలోని బావిలోకి దూకింది’ అని అతను చెప్పాడు. ఆ తరువాత, సంఘటన జరిగిన ప్రాంతం మంగళం పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు మంగళం పోలీసులకు సమాచారం అందించారు. మంగళం పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లగా, రోషిణి బావిలో చనిపోయి పడి ఉండడాన్ని వారు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు శక్తివేల్ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పన్నులు వంద శాతం వసూలు చేయాలి
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి, తాగునీరు, ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయాలని కలెక్టర్ ప్రతాప్ సిబ్బందిని ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పన్నులు వసూలు చేయడానికి శని, ఆదివారం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. రెండవ రోజైన ఆదివారం పేరంబాక్కంలో జరిగిన శిబిరాన్ని కలెక్టర్ ప్రతాప్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పన్నులను వందశాతం వసూలు చేయాలన్నారు. అక్రమాలను నిరోధించడానికి డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు కూడా వ్యాఖ్యానించారు. పన్నుల చెల్లింపుపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కోలాహలం.. ఆణికులతమ్మ రథోత్సవం
వేలూరు: వేలూరు వేలపాడిలోని గ్రామ దేవతైన శ్రీ ఆణికులతమ్మ అమ్మవారి రథోత్సవం ఆదివారం ఉదయం కోలాహలంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు అములు, డాక్టర్ అయ్యప్పన్, వేణు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల సమయంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని రఽథంలో ఆశీనులు చేసి దీపారాధన పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణాల మధ్య రథాన్ని లాగారు. ఈ రథం వేలపాడిలోని పలు వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడంతో ప్రతి ఇంటి ముందు మహిళలు బొరుగులు, ఉప్పు, మిర్యాలు, పూలు చల్లడంతో పాటు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఎండ వేడిమిని కూడా పట్టించుకోకుండా రథోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతలు, పారిశ్రామిక వేత్తలు వీధుల్లో మజ్జిగ, తాగునీటిని సరఫరా చేయడంతో పాటు భక్తులకు అన్నదానం చేశారు. ఈ రథోత్సవం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నధికి చేరుకుంది. -
మూగజీవుల లెక్కింపు పనులు షురూ
తిరుత్తణి: తిరువళ్లూరు జిల్లాలో వ్యవసాయం, పశు పోషణ ప్రజల ప్రధాన జీవనాధారంగా వుంది. జిల్లాలోని తిరువళ్లూరు, తిరుత్తణి, పొన్నేరి, అంబత్తూరు డివిజన్లలో 21వ మూగజీవుల లెక్కింపు గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభమై ఫిబ్రవరి 28 వరకు నిర్వహించారు. మూగజీవుల లెక్కింపు పనుల్లో 45 మంది అధికారుల సమక్షంలో 210 మంది మూగజీవుల లెక్కింపు పనులు చేపట్టారు. జిల్లాలో 6, 47,838 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు చేపట్టారు. మిగిలిన 1,01,905 కుటుంబాల్లో మూగజీవుల లెక్కింపు పనులు పూర్తి చేసేందుకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చారు. దీంతో మూగజీవుల లెక్కింపు పనుల్లో సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పశుసంవర్థక శాఖ అదనపు డైరెక్టర్ నవనీతకృష్ణన్ జిల్లాలో మూగజీవుల లెక్కింపు పనులను ఆదివారం తనిఖీ చేశారుపశుసంవర్థక శాఖ మండల అదనపు డైరెక్టర్ జయంతి, ఉప డైరెక్టర్ శీనివేలన్, సహాయ డైరెక్టర్లు దామోదరన్, అనిత, పశుసంవర్థక శాఖ వైద్యులు, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. -
స్పీకర్ అప్పావుతో సెంగోట్టయన్ భేటీ
● అన్నాడీఎంకేను దూరం పెట్టేలా చర్యలు ● పన్నీరుకు చిరునవ్వుతో పలకరింపు సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత సెంగోట్టయన్ స్పీకర్ అప్పావును అసెంబ్లీ ఛాంబర్లో కలవడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు దూరంగా ఆయన చర్యలు ఉండటమే కాకుండా అసెంబ్లీ లాబీలో మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరునవ్వుతో పలకరించి ముందుకెళ్లారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి వ్యతిరేకంగా సీనియర్ నేత సెంగోట్టయన్ ఇటీవల పెదవి విప్పడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత సమరంమళ్లీముదిరినట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, తాను అన్నాడీఎంకేలోనే ఉన్నట్టు సెంగోట్టయన్ చెప్పుకుంటూ వచ్చినా పళణి స్వామిని నేరుగా కలిసిన సందర్భం లేదు. ఈ పరిస్థితులలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన చర్చలు మరింత చర్చకు తెరలేపాయి. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన అన్నాడీఎంకే సభ్యులందరికి దూరంగా ఉన్నారు. రెండవ రోజు శనివారం సభకు రాగానే స్పీకర్ అప్పావు ఛాంబర్కు వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడి బయటకు వచ్చారు. ఈ సమయంలో తనకు లాబీలో ఎదురు పడ్డ మాజీ సీఎం పన్నీరు సెల్వంను చిరు నవ్వుతో పలకరిస్తూ ముందుకెళ్లారు. సాధారణంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సభ్యులు సభకు 4వ నెంబర్ ప్రవేశ మార్గం నుంచి లోపలకు రావడం జరుగుతుంది. అయితే, సెంగ్టోటయన్ ఆ పార్టీ సభ్యులకు దూరంగా ఉండటమేకాకుండా, వారు వెళ్లిన మార్గంలో కూడా లోనికి వెళ్ల లేదు. పదవ నెంబరు గేట్ మార్గం గుండా అసెంబ్లీలోకి వెళ్లారు. అన్నాడీఎంకే సభ్యుల ఛాంబర్ వైపుగా కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లి పోయారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకేలో మరింత చర్చకు తెరలేపాయి. సెంగోట్టయన్ చర్యల గురించి పళణి స్వామిని మీడియా ప్రశ్నించగా, ఆయన్ని అడగాల్సిన ప్రశ్న తనను అడిగితే ఎలా? అని ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగ వద్దు అని వారించారు. వ్యక్తిగత సమస్య గురించి మాట్లాడే వేదిక ఇక్కడ కాదని సూచించారు. తాము 62 మంది సభ్యులం అని, అందరూ ఇక్కడ ఉన్నారా? అంటే, కొందరు రాలేక పోయి ఉండ వచ్చు..!, వారికి ఏదైనా పని ఉండవచ్చు...! అంటూ దాట వేయడం గమనార్హం. -
అన్నదాతపై.. వరాల జల్లు
వ్యవసాయ బడ్జెట్లో ముఖ్యాంశాలు ..కష్టించే అన్నదాతకు ఆసరగా ఉండేందుకు.. ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్లో ప్రత్యేక కసరత్తు చేసింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అందించే పంటల బీమాకు భారీగా నిధులు కేటాయించింది. మొత్తం మీద దుక్కి దున్ని..నాట్లు వేసి పొలంలో చెమటోడ్చి పంటల సాగుబడితో అందరికీ అన్నం పెట్టే అన్నదాత సంక్షేమాన్ని కాంక్షించే విధంగా వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం శనివారం వ్యవసాయ పద్దును అసెంబ్లీలో దాఖలు చేశారు. పాత పథకాలకు 2025–26 సంవత్సరానికి గాను వివిధ ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా రూ. 45,661 కోట్ల నిధులను కేటాయించారు. సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజున ఆర్థిక బడ్జెట్ను ఆ శాఖ మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేశారు. రెండవ రోజున శనివారం వ్యవసాయ బడ్జెట్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ బడ్జెట్ రూపకల్పనలతో తనకు మద్దతుగా నిలిచిన అధికారులతో కలిసి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం తొలుత మెరీనా తీరంలోని అన్నా, కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుని సీఎం స్టాలిన్కు పేపర్ రహితంగా రూపకల్పన చేసిన బడ్జెట్ను ట్యాబ్ను అందజేశారు. అనంతరం సీఎం స్టాలిన్తో కలిసి అసెంబ్లీలో ఎంఆర్కే పన్నీరుసెల్వం అడుగు పెట్టారు. స్పీకర్ అప్పావు సభభలో రైతు బడ్జెట్ దాఖలకు అవకాశం కల్పించారు. దీంతో ఎంఆర్కే పన్నీరు సెల్వం బడ్జెట్ పద్దును వివరిస్తూ ప్రసంగించారు. సభకు వచ్చిన డీఎంకే సభ్యులు అందరూ తామంతా రైతులమే అని చాటే విధంగా రైతు ధరించే తువ్వాలను కండువగా రూపంలో ధరించి సభభలో కూర్చున్నారు. అయితే, సీఎం స్టాలిన్, సీనియర్ మంత్రి దురై మురుగన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధిలు మాత్రం సాధారణంగానే కూర్చున్నారు. రైతుల కీర్తి ప్రతిష్టలతో.. దేశానికి వెన్నెముకగా నిలిచి అందరికీ అన్నం పెట్టే అన్నదాత కీర్తి ప్రతిష్టల గురించి తమిళ మహాకవి తిరువళ్లువర్ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని ఎంఆర్కే పన్నీరు సెల్వం అందుకున్నారు. రైతుల జీవన పరిస్థితుల మెరుగు , వ్యవసాయ రంగంలో ఆధునికతను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. 2021 నుంచి నాలుగు సార్లు వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేశానని, ఇది ఐదోసారి బడ్జెట్ అంటూ, ఇప్పటి వరకు ఇచ్చిన వాగ్దానం, చేసిన ప్రకటనల మేరకు ప్రాజెక్టులు అద్భుతమైన రీతిలో అమలు చేశామని వివరించారు. ప్రస్తుతానికి వ్యవసాయం ఒక శాస్త్రం, సాంకేతికత అని పేర్కొంటూ, ఇందుకు మద్దతు ఇవ్వడం, అభివృద్ధి పరచడం గురించి వివరించారు. డిజిటల్ వ్యవసాయం గురించి ప్రస్తావిస్తూ కృత్రిమ మేధస్సు– వెబ్సైట్ సెన్సార్ టెక్నాలజీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)తో రైతు శాసీ్త్రయ సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నట్టు విశదీకరించారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, ఆధునీకత, వివిధ రకాల పంటల పై ప్రత్యేక దృష్టి వంటి అంశాలపై గత నాలుగేళ్లుగా తాము సాధించిన ఘనతను గుర్తుచేశారు. వ్యవసాయ యంత్రాల వినియోగం, విత్తనాలు, పంట కోత, గిడ్డంగులు, కొనుగోళ్లు వంటి అంశాలతో పాటుగా ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, వెచ్చించిన విధానం గురించి వివరించారు. శ్రీభవిష్యత్తు యువత చేతుల్లో ఉందని పేర్కొంటూ, యువతలో వ్యవసాయంపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యచరణను విస్తృతం చేశామన్నారు.10,187 గ్రామాలలో యువత , రైతు సహకారంతో సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఆది ద్రావిడ, గిరిజన , చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం, సమీకృత వ్యవసాయం, గ్రీన్ హౌస్లు వంటి ప్రాజెక్టుల ద్వారా ఉపయోగకర అంశాలను ప్రస్తావించారు. వరి ఉత్పత్తి పెంపు, దిగుబడి పెంపు, చెరకు రైతుకు తోడ్పాటు, మద్దతు ధర గురించి గుర్తు చేస్తూ, రైతులకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా బడ్జెట్లో నిధులను కేటాయించామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎదురైన నష్టాలు, కష్టాలను గుర్తుచేస్తూ, నష్టాన్ని భర్తీ చేయడానికి 1,631 కోట్ల 53 లక్షల రూపాయలు నిధులు గత నాలుగు సంవత్సరాలలో కేటాయించామని, తద్వారా పంటల భీమా పరిహారం రూ. 5,242 కోట్లు రైతులకు దరి చేరిందన్నారు. చైన్నె ఆర్కే సాలైలలో కలైంజ్ఞర్ శత జయంతి స్మారకంగా ఏర్పాటు చేసిన బ్రహ్మాండ ఉద్యాన వనం గురించి గుర్తుచేస్తూ, ఇది అన్నదాత ప్రయోజనార్థం పూర్తి స్థాయిలోరూ.45,661 కోట్లతో తీర్చిదిద్దిన బడ్జెట్ అని ప్రకటించారు. 1.40 గంటల సేపు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. నాలుగేళ్లలో 1.86 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లను అందచేశామని ప్రకటించారు. రూ.1427 కోట్ల రుణాలను రద్దు చేశామని గుర్తు చేశారు. కేంద్రాలలో వ్యవసాయ వర్తకం నిర్వహణకు ఏర్పాట్లు. నియంత్రిత మార్కెట్లలో రైతులు, తయారీ సంస్థలకు ఉత్పాదక రుణాలు. రూ.10 లక్షల వరకు అందించేందుకు నిర్ణయం. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొత్త ఆవిష్కరణకు హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పరిశోధన నిఽధి కోసం రూ. కోటి కేటాయింపు. రైతు కూలీలు ప్రమాద వశాత్తు మరణిస్తే ఇచ్చే రూ. లక్ష పరిహారాన్ని రూ. 2 లక్షలకు పెంపు. గాయాల పాలయ్యే వారికి రూ. లక్ష వరకు పంపిణీ. వ్యవసాయంలో అధిక ఉత్పత్తికి , సాంకేతిక పనితీరుకు గాను మొదటి ముగ్గురు రైతులకు నగదు బహుమతి. మొదటి బహుమతి రూ. 2 లక్షల 50 వేలు. అలాగే, వివిధ 33 రకాల బహుమతులు ప్రదానం లక్ష్యగా రూ. 55 లక్షలు కేటాయించారు. ఉత్తమ సేంద్రీయ రైతుకు నమ్మాళ్వార్ అవార్డు. విదేశీ పరిజ్ఞానంపై అవగాహనకు వంద మంది రైతులకు విదేశీ పర్యటనకు అవకాశం. సభలో వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేసిన మంత్రి పన్నీర్ సెల్వం రైతు తరహాలో పచ్చ తువాలతో సభకు డీఎంకే సభ్యులు రూ. 45,661 కోట్ల నిధుల కేటాయింపు డెల్టా యేతర జిల్లాలలో సాగుకు ప్రత్యేక దృష్టి పాడి ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంపునకు కార్యాచరణ మహిళా జాలర్లకు శిక్షణ విదేశీ పరిజ్ఞానంపై అధ్యయనానికి టూర్ ఇంటి పంటకు తోడ్పాటు రైతులకు వ్యవసాయ సలహాలు ఇవ్వడం లక్ష్యంగా గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ హోల్డర్లు ద్వారా 1000 సేవా కేంద్రాల ఏర్పాటుకు రూ. 42 కోట్లు కేటాయింపు. వరి ఉత్పత్తి పెంపునకు రూ. 160 కోట్లు. ఇందులో 102 కోట్లు ప్రపథమంగా డెల్టా యేతర జిల్లాలో 34 లక్షల ఎకరాలలో , మరో రూ. 58 కోట్లతో డెల్టాలో 18 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తికి నిర్ణయం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎదురయ్యే కష్టాల నుంచి రైతుకు జీవనోపాధినికల్పించే విధంగా పంట భీమాగా రూ. 841 కోట్లు కేటాయింపు. 2024–25 సీజన్లో 1 లక్ష 30 వేలు చెరకు రైతులకు ఒక టన్నుకు గాను రూ. 349 ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు వీలుగా రూ. 297కోట్లు కేటాయింపు. 3 లక్షల ఎకరాల వర్షాధార భూములలో ముందుగానే దుక్కి దున్నడానికి సబ్సిడీగా రూ. 24 కోట్లు. సూక్ష్మ నీటి పారుదల ప్రాజెక్టు ను 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అమలు చేయడానికి రూ. రూ. 1,168 కోట్ల కేటాయింపు. తమిళనాడులో తొలిసారిగా జీడిపప్పు ఉత్పత్తుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు రూ. 10 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో ప్రపథమంగా 20 రైతు బజార్ల ద్వారా ఆన్లైన్ డోర్ డెలివరి లక్ష్యంగా స్థానిక ఇంటర్నెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు. వ్యవసాయ ఉత్పత్తులకు నల్లూరు వరగు (కుడలూర్), వేదారణ్యం ముల్లై (నాగపట్టణం), నత్తం చింతపండు (దిండిగల్), ఆయకుడి జామ (దిండిగల్), కల్పట్టి చెరకు మునగ(దిండిగల్)లకు భౌగోళిక గుర్తింపునకు చర్యలు. 17,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రంగం యాంత్రీకరణ ప్రాజెక్టుకు రూ. 215 కోట్ల 80 లక్షలు కేటాయింపు. అటవీ గ్రామాలలోని 63 వేల గిరిజన రైతుల కోసం రూ. 22.80 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టు అమలు. రూ. 142 కోట్లతో ముఖ్యమంత్రి భూ సంరక్షణ పథకంలో 15 ప్రాజెక్టు అను అదనంగా చేర్చి అమలు చేయడానికి నిర్ణయం. గ్రామ పంచాయతీలలో 2,338 మంది రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రూ. 269 కోట్ల 50 లక్షలతో ప్రత్యేక కార్యాచరణ. కలైంజర్ ఆల్ విలేజ్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ ప్రణాళిక అమలు. వ్యవసాయ ఉత్పత్తులకు 100 శాతం విలువతో యూనిట్లను ఏర్పాటు చేయడానికి మొదటి దశలో రూ. 50 కోట్లు కేటాయింపు. ఒక్కొ యూనిట్కు గరిష్టంగా రూ. 1.50 కోట్లు రాయితీ ఇవ్వనున్నారు. రూ. 50 కోట్ల 79 లక్షల అంచనా వ్యయంలో 11 చోట్ల వ్యవసాయ ఉత్పత్తి విక్రయ కేంద్రాలలో మౌలిక సదుపాయాల మెరుగుకు చర్యలు. మొక్కజొన్న రైతులకు ఎక్కువ ఆదాయం లభించే విధంగా 1,87,000 ఎకరాల విస్తీర్ణంలో రూ. 40 కోట్లతో మొక్కజొన్న ఉత్పత్తి అభివృద్ధి ప్రాజెక్టుకు నిర్ణయం. వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెలు విత్తనాలు పండించే 90 వేల మంది రైతుల కోసం రూ.108 కోట్లు 6 లక్షలతో నూనె విత్తనాల ఇయక్కం ఏర్పాటు.. తమిళనాడు చిరు ధాన్యాల ఇయక్కం అమలుకు రూ.52 కోట్లు 44 లక్షల కేటాయింపు. సేంద్రీయ వ్యవసాయం వికేంద్రీకరణకు రూ.12 కోట్లు కేటాయించారు. పాఠశాల , కళాశాల విద్యార్థుల కోసం వ్యవసాయ పర్యటనలు అవగాహన శిబిరాలకు ప్రోత్సాహకాలు, రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు. ఆది ద్రావిడ, గిరిజన చిన్న సన్నకారు రైతులకు అదనపు సబ్సిడీ కోసం రూ. 21 కోట్లు కేటాయింపు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలను ప్రోత్సహించండి రూ. 12 కోట్ల 50 లక్షల కేటాయింపుతో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక పథకం అమలుకు నిర్ణయం. ఆరోగ్యకరమైన పంటల లక్ష్యంగా నాణ్యమైన విత్తనం ఉత్పత్తికి రూ. 250 కోట్లు కేటాయింపు రూ. 12 కోట్ల 21 లక్షలతో పత్తి ఉత్పత్తి విస్తరణ ప్రణాళిక. ‘తమిళనాడు ఆగ్రోఫారెస్ట్రీ పాలసీ’ ఆవిష్కరణ – చెట్లను పెంచడం, వాటిని నమోదు, అమ్మకం వంటి అన్ని విధానాలను సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు .గ్రీన్ తమిళనాడు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ. రూ. 125 కోట్లతో పోషక వ్యవసాయ మిషన్. ఇంటి తోట కోసం – కూరగాయల విత్తనాలు ,25 లక్షల పండ్ల మొక్కలు. పప్పుధాన్యాలు , ప్యాకేజీ డెలివరీ నిర్ణయం. 4,000 మొబైల్ పండ్లు కూరగాయల దుకాణాలకు సబ్సిడీ. ఇంటిగ్రేటెడ్ కొబ్బరి అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.35.26 కోట్లు కేటాయింపు. రూ. 10. 50 కోట్లతో 130 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాల ఏర్పాటు. కావేరి, వెన్నారు, వెల్లారు నదీ పరివాహక ప్రాంతాలు, కల్లనైలోని సీ, డీ, ఈ కాలువల పూడికతీతకు నిర్ణయం. మొత్తం 2,925 కి.మీ దూరం పూడికతీతకు రూ.13.80 కోట్ల కేటాయింపు. ముఖ్యమంత్రి సౌర పంపు సెట్ల పథకానకి రూ. 24 కోట్లు కేటాయింపు. 1000 మంది రైతులకు పంపు సెట్లను అందించేందుకు నిర్ణయం. వరి, మొక్కజొన్న, అరటి, వేరుశనగ, మినుములు తదితర పంటలకు 1500 ఎకరాలలో విత్తడం నుంచి పంట కోత వరకు సాగులో యాంత్రీకరణ కు రూ. 3 కోట్లుతో (డెమోన్ స్టేషన్ ప్లాట్స్)కు ప్రణాళిక. రూ. 20 కోట్ల అంచనా వ్యయంతో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 9 గిడ్డంగులు, అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. 56 నియంత్రిత అవుట్ లెట్లను రూ.39. 20 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్ నేషనల్ వ్యవసాయ మార్కెట్తో కొత్తగా విలీనం చేయనున్నారు. తద్వారా రైతులు జాతీయ స్థాయిలో వర్తకం చేసుకునేందుకు వీలు కల్పించారు. అదనపు ఆదాయం కల్పనకు జాతీయ స్థాయి వర్తకం అమలు. రూ. 8 కోట్ల విలువైన 50 రైతు బజార్లు అదనపు సౌకర్యాల కల్పన. ప్రాంతం వారీగా ఎంపిక చేయబడిన వ్యవసాయ ఉత్పుత్తుల సేకరణ పశువుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకంతో సహా వ్యవసాయ కార్యకలాపాలకు రైతుల మద్దతు స్వల్పకాలిక రుణ అవసరాల కోసం రూ. 3 వేల కోట్ల మూలధన వ్యయం. పంట రుణాల మాఫీకి రూ.1,477 కోట్ల నిధి. వరి సబ్సిడీకి రూ. 525 కోట్లు నిధి. 10 లక్షల తాటి విత్తనాల పంపిణీకి నిర్ణయం, ఊటీలో రిసార్ట్ల నిర్మాణ పథకానికి బ్రేక్ వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. మత్స్యసంపద పెంపునకు ప్రత్యేక కార్యాచరణ. నీటి వనరులలో చేపల ఉత్పాదకతను పెంచే విధంగా ఒక పంచాయతీలోని 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులో 2 వేల చేపల పిల్లల పంపిణికి చర్యలు. మహిళా జాలర్లు 1000 మందికి నైపుణ్యాల అభివృద్దిలో శిక్షణ. 10 వేల మంది జాలర్లకు వ్యవసాయ రుణ కార్డుల పంపిణీ. 42 వేల ఎకరాలలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల మధురై మల్లి ఉత్పత్తి లక్ష్యం. మదురై, ధర్మపురి, తిరువళ్లూరు, సేలం, దిండుగల్, తిరువణ్ణామలై, కృష్ణగిరి , ఈరోడ్లలో మల్లె పువ్వల ఉత్పత్తికి కార్యాచరణ. 7 వేలమంది మల్లె సాగు రైతుల కోసం రూ. 60 లక్షలు కేటాయింపు. తిరువణ్ణామలై, సేలం, దిండుగల్, తిరుప్పత్తూర్లలో గులాబీల సాగును ప్రోత్సహించేందుకు రూ. కోటి కేటాయింపు. -
సీఈపీటీ వర్సిటీలో వేసవి కోర్సులు
సాక్షి, చైన్నె: సీఈపీటీ విశ్వవిద్యాలయం వేసవి – 2025 కోర్సులను ప్రకటించింది ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులకు సాంప్రదాయ తరగతి గదికి మించి విస్తరించే వైవిధ్యమైన, ఇంటెన్సివ్, సుసంపన్నమైన విద్యా అనుభవాలను ఈ కోర్సుల ద్వారా అందించనున్నామని ఆ వర్సిటీ డిప్యూటీ ప్రోవోస్ట్ (అకాడమిక్) ప్రొఫెసర్ చిరాయు భట్ తెలిపారు. ఈ కోర్సుల వివరాలను శనివారం స్థానికంగా ఆయన ప్రకటించారు. యూరోపియన్ విద్యా వ్యవస్థలలో ప్రముఖంగా ఉన్న సమ్మర్ అండ్ వింటర్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే అంశంతో సీఈపీటీ విశ్వవిద్యాలయం ముందుకెళ్తోందన్నారు. సమ్మర్ అండ్ వింటర్ లలో రెండు నుండి నాలుగు వారాల ఇంటెన్సివ్ కోర్సులను అందిస్తామన్నారు. ఇవి విద్యార్థులకు గణనీయమైన ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అవకాశాలను అందిస్తాయన్నారు. విద్యార్థులు భారతదేశంలో, అంతర్జాతీయంగా క్యాంపస్, ఆన్లైన్, ప్రయాణ ఆధారిత ఎంపికలు సహా సుమారు 50 విభిన్న కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు అని వివరించారు. విద్యార్థులను శక్తివంతం చేయడానికి ఈ కోర్సులు రూపొందించబడిందన్నారు. పీర్ లెర్నింగ్ ద్వారా, వారు విభిన్న దృక్పథాలను పొందుతారని, క్రెడిట్లను సేకరించడం ద్వారా, వారు వారి విద్యాపరమైన సౌలభ్యాన్ని పెంచుకుంటారని పేర్కొన్నారు. తమ కోర్సులలోని ఇంటర్ డిసిప్లినరీ స్వభావం విద్యార్థులు కొత్త రంగాలను అన్వేషించడానికి, వారి మేధో పరిధులను విస్తరించడానికి దోహద పడుతుందన్నారు. అదే సమయంలో వినూత్న బోధనా పద్ధతులను అందిస్తుందన్నారు. క్రికెట్ పోటీలు సాక్షి, చైన్నె: చైన్నె ప్రెస్క్లబ్, ఇండియన్ ఆయిల్ సంస్థ సంయుక్తంగా చైన్నెలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది. శనివారం ఈ పోటీలను తమిళాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి స్వామినాథన్ ప్రారంభించి, కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ సంస్థ తరఫున అధికారులు సుధాకర్, వెట్రిసెల్వన్, మురళి, రాజశేఖర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు సురేష్ వేదనాయగం, ఆసిఫ్, మణికంఠన్, మదన్, సుందరభారతి పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో అగ్రగామి – కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తిరువళ్లూరు: ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి హబ్గా తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో వుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా కన్నూరులో రూ.1200 కోట్ల వ్యయంతో జెట్వర్క్ కొత్త అత్యాధునిక ప్లాంట్ను 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 2వేల మందికి ఉపాధి లభించనుంది. కొత్త ప్లాంట్ను ప్రారంభించే కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టీఆర్బీ రాజా, కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ హాజరై ప్రారంబించారు. మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా వుండడంతోనే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కోయంబత్తూరులో సెజ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, పరిశ్రమలు పెట్టడానికి తమిళనాడు అనువైన రాష్ట్రంగా పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారని వివరించారు. దేశంలో 500 బిలియన్ ఈఎస్డీఎం మార్కెట్ ఉత్పత్తుల లక్ష్యాన్ని చేరాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులో ట్రిలియన్ ఉత్పత్తుల మార్కెట్కు దోహదం చేస్తుందన్నారు. మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడుతూ తమిళనాడులో పిల్లైపాక్కం, మనలూరు ప్రాంతాల్లో భారీ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ యూనిట్లను స్థాపించడానికి పీఎం సహకారం అందించారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కృష్ణన్, ఐసీఈఏ అధ్యక్షుడు పంజాజ్ మోహింద్రూ, అరుణ్రాయ్, సంస్థ నిర్వాహకులు అమృత్ ఆచార్య పాల్గొన్నారు. గంజాయి కేసులో వ్యాపారి అరెస్ట్ తిరువొత్తియూరు: తూత్తుకుడి తాళముత్తునగర్ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళుతున్న సెల్వేంద్రన్ (57)ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా 5 గంజాయి కేసులు ఉన్నట్లు తెలిసింది. అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 3.5 కిలోల గంజాయిని గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. -
అన్నదాతకు ఒరిగేది శూన్యమే
సాక్షి, చైన్నె: వ్యవసాయ బడ్జెట్తో నిజమైన అన్నతదాతకు ఒరిగేది శూన్యమేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. వ్యవసాయ బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు వ్యవసాయ బడ్జెట్లో రైతులకు మేలు చేసే ఒక్క పథకం అంటూ లేదని ధ్వజమెత్తారు. మండు టెండలో అన్నదాత పడుతున్న శ్రమకు గుర్తింపు లేదని, వర్షాల సీజన్లో నెలకొనే నష్టాలకు ఆదుకునే వారు లేరని, ప్రభుత్వ ప్రకటనలన్నీ కంటి తుడుపు చర్యఅని ఆరోపించారు. తమిళనాడులో 11.75 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో అంటూ గతంలో పేర్కొన్నారని, అయితే,సాగు విస్తీర్ణం అన్నది క్రమంగా తగ్గుతోందని వివరించారు. అయితే ఈ పాలకులు సాగు విస్తీర్ణం పెంపు అంటూ నాటకాలు రచిస్తున్నారని విమరిశంచారు. భౌగోళిక గుర్తింపు ప్రయత్నాలు అని పేర్కొంటున్నారేగానీ, వాటిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గతంలో ప్రకటించిన వాటికి భౌగోళిక గుర్తింపు సాధనలో ఎందుకు విఫలమైనట్టు అని ప్రశ్నించారు. ఏటా వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలకు శాశ్వత మోక్షం కల్పించే పథకం, ప్రాజెక్టు అన్నది లేక పోవడం విచారకరంగా పేర్కొనారు. ఈ బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ కాగితాలకే పరిమితం కానున్నాయే గానీ, ఆచరణలో పెట్టబోరని,ఎన్నికల దృష్ట్యా, రైతల దృష్టి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం మాత్రమే ఈ బడ్జెట్ అని పాలకులపై విమర్శలు గుప్పించారు. గతంలో తాము రైతు కమిటీల ద్వారా నేరుగా అన్నదాత వద్దకే పథకాలు వెళ్లే విధంగాచర్యలు తీసుకుంటే, ఈ పాలకులు వాటిని నిర్వీర్యంచేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ఆవిష్కరణల కోసం డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్ రీసెర్చ్ ఫండ్ సృష్టించ బడుతుందని ప్రకటించి, కేవలం రూ. కోటి కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులను మోసం చేయడంలో డీఎంకే పాలకులు నిష్ణాతులు అని,మరో మారు అదే బాణి అనుసరించారని విమర్శించారు. డీఎంకే పాలనలో తమిళనాడు ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, తమిళనాడు ప్రభుత్వం అప్పులు చేయకుండా ప్రాజెక్టులు అమలు చేసే పరిస్థితిలో లేదని ఆరోపించారు. -
టెస్ట్ క్రీడా కథా చిత్రం మాత్రమే కాదు
తమిళసినిమా: నటుడు మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం టెస్ట్. ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా అవతారమెత్తి తన వై నాట్ స్టూడియోస్ ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. నటుడు నాజర్, కాలి వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఏప్రిల్ 4వ తేదీన నేరుగా నెట్ ఫిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం చిత్ర దర్శక నిర్మాత శశికాంత్ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. టెస్ట్ చిత్రం క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన కథా చిత్రమే కాదని, ఈ కథలో క్రికెట్ క్రీడకు సంబంధించిన పలు అంశాలు చోటు చేసుకుంటారని చెప్పారు. ఇది ముగ్గురు జీవితాలకు సంబంధించిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్ర కథను తాను 12 సంవత్సరాల క్రితమే తయారు చేసుకున్నానని చెప్పారు. అయితే పలు చిత్రాలు నిర్మాణంలో ఉండడం వల్ల ఈ కథను తెరకెక్కించడానికి సమయం పట్టిందన్నారు. అయితే కరోనా సమయంలో టెస్ట్ చిత్రాన్ని రూపొందించడానికి ఇదే సరైన తరుణం అని భావించానన్నారు. ఈ చిత్ర కథలు అనుకున్నప్పటి నుంచి నటుడు సిద్ధార్థ తనతో ట్రావెల్ అయ్యారన్నారు అదేవిధంగా మరో మాట చెప్పకుండా నటించటానికి అంగీకరించారన్నారు ఇక నటుడు మాధవన్ మాత్రం కథను మరింతగా అప్డేట్ చేయడానికి పుష్ చేశారని చెప్పారు. నటి మీరాజాస్మిన్ ది అద్భుతమైన పాత్ర అని పేర్కొన్నారు. దర్శకుడుగా తన తొలి చిత్రాన్ని థియేటర్లో కాకుండా ఓటిటీ లో స్ట్రీమింగ్ చేయడానికి కారణం ఏంటని అడుగుతున్నారని, దట్ ఫిక్స్ ఓటిటి ప్లాట్ఫామ్ గ్లోబల్ స్థాయిలో రీచ్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు నెట్ఫ్లిక్స్ సంస్థతో 9 ఏళ్ల అనుబంధం ఉందని, టెస్ట్ చిత్రాన్ని ఆ సంస్థ నిర్వాహకులు తొలగించి ఫాలో అవుతున్నారని ,అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. చిత్ర షూటింగులు మూడు నెలల్లో పూర్తి చేసినట్లు, అయితే అంతకుముందు ఆరు నెలలు చేసినట్లు చెప్పారు. ఇందులో డ్రామా పోర్షన్కు డబ్బింగ్ చెప్పించలేదని, లైవ్ షూటింగ్లో షూట్ చేసినట్లు చెప్పారు. ఈ చిత్రం దర్శకుడిగా తనకు చాలెంజ్ నని అయితే దర్శకుడుగా తనను తాను సిద్ధం చేసుకున్న తర్వాతే షూటింగ్కు రెడీ అయినట్లు శశికాంత్ తెలిపారు. -
బోధన పద్ధతులపై అవగాహన ఉండాలి
వేలూరు: టీచర్లు వినూత్న విద్యా బోధన, బోధన పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని వేలూరు జిల్లా విద్యాశాఖ సీఈఓ మణిమొళి అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా వినూత్న అభ్యాసం, బోధన పద్ధతులు, పరిశోధన పత్రాల భాగస్వామ్యం కోసం ఉపాధ్యాయులకు సైన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. దీంతో మొట్టమొదటి సారి గా వేలూరులోని ఊరీస్ కళాశాలలో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువళ్లూరు, కాంచిపురం జిల్లాలకు చెందిన 120 మంది టీచర్లకు శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమైంది. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల విద్య నుంచే సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పరిశోధన నివేదికలు సమర్పించే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నా రు. శిక్షణను విడతల వారిగా నిర్వహిస్తామని ఇక్క డ శిక్షణ పొందిన వారు మీ ప్రాంతంలోని టీచర్లకు జోన్ల వారిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జ్యోతీశ్వర పిళ్లై, తమిళనాడు సైన్స్ మూవ్మెంట్ జిల్లా కార్యదర్శి డాక్టర్ జనార్దన్, జిల్లా అధ్యక్షులు అముద, మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్రమ ణి, నార్త్జోన్ కో–ఆర్డినేటర్ అంబిక పాల్గొన్నారు. -
ఘనంగా డబ్ల్యూటీఎఫ్లో మహిళా దినోత్సవం
కొరుక్కుపేట: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం వేడుకగా జరిగాయి. నగరంలోని ఆళ్వారుపేటలో ఉన్న ఓ హోటల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు ప్రప్రంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైన్నె ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ దావులూరి కోమలి కృష్ణ పాల్గొని మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగు భాష వికాసానికి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం కర్ణాటక, సినీ గాయినీ జననీ సంజీవి సంగీత విభావరి ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమ నిర్వహణను ప్రమీలా ఆనంద్, సురేఖ మోహన్ దాస్ లు చేపట్టారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరాదత్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రతీ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సంయుక్త కోశాధికారి తాల్లూరి రుక్మిణీదేవిని జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నవనారీమణుల పేరిట తొమ్మిది మంది ప్రముఖుల పాత్రలు పోషించిన మహిళలుగా విచ్చేసిన ఉప్పులూరి విజయలక్ష్మి, వెంకటరమణ, ఏ.జాన్సీ రత్నం, డీ హేమమాలిని, ఊరా శశికళ, పోతూరు రమాదేవి, రుక్మిణి దేవి, వినీషా వశిష్ట్, సౌమ్య వశిష్ట్ ఆయా వేషధారణలో ఆకట్టుకున్నారు. తంబూలా గేమ్స్ ను నిర్వహించి బహుమతులు అందజేశారు. -
బాలికలు పరిశోధనలు చేయాలి
వేలూరు: బాలికలు ఉన్నత విద్యపై ఆశక్తి చూపి పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడాలని ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి ఇరయన్బు అన్నారు. వేలూరు ధనభాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో 50వ స్నాతకోత్సవం కళాశాల కార్యదర్శి మణినాథన్ అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోను రాణిస్తున్నారని అందుకు కారణం విద్య ఒక్కటే అన్నారు. అధికంగా మహిళలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, పట్టుదలతో ఉన్నత విద్యకు వెళితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చన్నారు. ఇండియాలోనే ఉన్నత విద్యలో మన దేశం 75 శాతంగా ఉందన్నారు. వీటిలో తమిళనాడులో విద్యాభివృద్ధి 45 శాతంగా ఉందని తెలిపారు. ఒక మహిళ విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబమే విద్యావేత్తలుగా ఉంటారన్నారు. డిగ్రీలు సాధించిన అందరూ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇంటర్నెట్, వాట్సాప్లను పక్కన బెట్టి విద్యా సంబంధమైన పరిశోధనలు చేసేందుకు ఆశక్తి చూపాలన్నారు. అనంతరం యూజీ, పీజీ కోర్సులో ఉత్తీర్ణత సాధించిన 1,069 మంది విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ భానుమతి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
గన్ షూటింగ్ పోటీలకు సర్వం సిద్ధం
తిరుత్తణి: రాష్ట్రంలో ఐదు రోజుల పాటూ జాతీయ స్థాయి గన్, రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు విచ్చేసిన అసోంం, బిహార్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కమెండో బృందానికి తిరుత్తణిలో శనివారం రైల్వే పోలీసులు స్వాగతం పలికారు. తమిళనాడు పోలీసు శాఖ కమెండో ఫోర్స్ ద్వారా చెంగల్పట్టు జిల్లాలో 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటూ గన్, రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు, అదనపు సహాయ బలగాలు, కమెండో ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు షూటింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం అస్సాం నుంచి 21 మంది కమెండో ఫోర్సు, బిహార్ నుంచి 29 మంది పోలీసులు రెండు బ్యాచ్లుగా రైలు ద్వారా తిరుత్తణికి చేరుకున్నారు. వారికి రైల్వే పోలీసులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తిరుత్తణి నుంచి పోలీసుల వాహనాల ద్వారా చెంగల్పట్టు జిల్లాకు బయల్దేరి వెళ్లారు. అత్యాధునిక ఆయుధాలతో పోలీసులు ఈ పోటీల్లో పాల్గొనున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
విష్ణు విశాల్కు జంటగా మమిత బైజూ
తమిళసినిమా: మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి మమిత బైజూ. ఆ చిత్రంతో దక్షిణాది చిత్త పరిశ్రమ దష్టిని తనపై తిప్పుకుంది. అంతే వెంటనే తమిళంలో జీవి ప్రకాష్ కుమార్కు జంటగా రెబల్ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కొద్దిరోజులు కోలీవుడ్ ఈమెను పట్టించుకోలేదు. అలాంటిది అనూహ్యంగా నటుడు విజయ్ కథా నాయకుడుగా నటిస్తున్న జననాయకున్ చిత్రంలో నటించే అదష్టం నటి మమిత బైజూకు దక్కింది. నటి పూజా హెగ్డే కథానాయక నటిస్తున్న ఇందులో మమిత బైజూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీంతో మరింత పెరిగిందని చెప్పాలి. ఇటీవల టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. కాగా తాజాగా నటుడు విష్ణు విశాల్కు జంటగా నటించే అవకాశం ఈ మాలీవుడ్ భామను వరించింది. ఇంతకుముందు విష్ణు విశాల్ కథానాయకుడిగా ముండాసు పట్టి , రాక్షసన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రామ్ కుమార్ తాగారా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మరోసారి నటుడు విష్ణు విశాల్ కథనాయకుడిగా నటించనున్నారు. దీంతో దర్శకుడు రామ్ కుమార్, విష్ణు విశాల్ కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రం కానుంది. ఇందులోనే నటి మమిత బైజూ నాయికగా నటించనునుంది. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని జి. త్యాగరాజున్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిం సంస్థ నిర్మిస్తోంది. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను యూనిట్ వర్గాలు శనివారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. -
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి
తిరుత్తణి: నొచ్చిలి రోడ్డులో ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు కోరారు. తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ దీప ఆధ్వర్యంలో రైతు సమస్యల పరిష్కార సభ నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమావేశంలో తిరుత్తణి, పళ్లిపట్టు, తిరువలంగాడు, ఆర్కేపేట ప్రాంతాల నుంచి వందకు పైగా రైతులు పాల్గొన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరాజు మాట్లాడుతూ పళ్లిపట్టు ప్రాంతంలోని రాళ్లు, ఇసుక, గ్రావల్ క్వారీల నుంచి రోజూ వందలాది టిప్పర్లు, లారీలు నొచ్చిలి తిరుత్తణి రోడ్డులో వెళుతుంటాయి. భారీ వాహనాలు రోడ్డు నిబంధనలు పాటించకుండా అతివేగంతో పయనించడంతో పాటు అధికభారం తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా రాత్రుల్లో వాహనాలు నడపడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుని వాహన చోదకులు, గ్రామీణులు ప్రాణాలు కోల్పోవాల్సి వుంది. పోలీసులు, ఆర్టీఓ చర్యలు తీసుకుని వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలు సీజ్ చేయాలని కోరారు. -
కారైక్కాల్ ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అనుసంధానంలోని తిరువలంగాడు ఆలయంలో కారైక్కాల్ అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో ఆలయంలో 16, 17 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వేడుకల ఏర్పాట్లు, భక్తులకు సదుపాయాలు కల్పనకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో శనివారం తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తహసీల్దార్ మలర్విళి, డీఎస్పీ కందన్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస కేంద్రాలు ఏర్పాటుతోపాటు పరిశుభ్రత, రవాణా సదుపాయాలు, తాత్కాలిక వైద్య కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలీసుల భద్రతకు ఏర్పాట్లు, హైవే రోడ్డులో ఆక్రమణలు తొలగించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారానికే సమీక్ష వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే జిల్లాల వారిగా కార్మికులతో నేరుగా సమీక్షిస్తున్నట్లు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పొన్కుమార్ అన్నారు. వేలూరులోని కార్మిక సంక్షేమ కార్యాలయంలో కమిషనర్ జ్ఞానవేల్ ఆధ్వర్యంలో కార్మికులతో నేరుగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్మికులు చెప్పన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం 50 మంది కార్మికులకు రూ.15.55 లక్షల విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు దేహదారుఢ్య కోసం ప్రత్యేక మెడికల్ కార్డును అందజేస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం ఏడు జిల్లాల్లో ఐటీఐని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారని, వాటిని వేలూరులో కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికుల పెన్షన్ను రూ.3 వేలు చేయాలని సిఫారస్సు చేశామని, వెంటనే వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వంలోనే కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకొచ్చారని, గత ప్రభుత్వంలో ఎటువంటి ప్రాజెక్టులు తీసుకు రాకపోవడంతోనే కార్మికుల సభ్యత్వం కూడా పూర్తిగా తగ్గిందన్నారు. ఇళ్లులేని ప్రతి కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.4 లక్షలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వీటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాని కోరారు. ఆయనతోపాటు భవన నిర్మాణ కార్మికుల అఖిల భారత అధ్యక్షుడు ఆర్టీ పయణి, జిల్లా అద్యక్షుడు వేల్మురుగన్, కార్మిక నేతలు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో అలైషిప్ క్లబ్లు
సాక్షి, చైన్నె: ప్రభుత్వ పాఠశాలల్లో అలైషిప్ క్లబ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు కార్పొరేట్ల కోసం ప్రపథమంగా మేల్ అలైషిప్ సినర్జీ సమ్మిట్ శనివారం నిర్వహించారు. సమ్మిళిత నాయకత్వం, సమానత్వం సాంస్కృతిక మేధస్సు ప్రధాన అంశాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశంలోని ప్రముఖ వర్క్ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థగా ఉన్న అవతార్ పరిధిలోని లాభాపేక్షలేని విభాగం అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్, ‘మేల్ అలై షిప్ సినర్జీ సమ్మిట్’(ఎంఏఎస్ఎస్) – 2025ను స్థానికంగా నిర్వహించింది, ఇది కార్పొరేట్ నిపుణులు , విద్యార్థుల మైత్రిని సాధించడానికి వేదికగా నిర్వహించారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలలో కౌమారదశలో ఉన్న బాలుర సున్నితత్వంపై దృష్టి సారించే విధంగా మెన్ ఇంపాక్టింగ్ ట్రస్ట్ – రెస్పెక్ట్) ఆధారిత ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో చైన్నెలోని నాలుగుప్రభుత్వ పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అలైషిప్ క్లబ్లు ప్రారంభించారు. అలాగే, ‘అలైషిప్ను రోజువారీ చర్యలుగా మార్చడం’ అనే అంశంపై ప్యానెల్ చర్చ, ‘హార్ట్ టు ఆర్ట్’ – పోస్టర్ తయారీ పోటీ, కార్యాలయంలో అలైషిప్ ఉత్తమ పద్ధతులు, శక్తిపై వీడియో బైట్లు , మేల్ అలైషిప్ చుట్టూ కేంద్రీకృతమైన ఇతర పోటీలను ఈసందర్భంగా నిర్వహంచారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కూపర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మోహన్రామ్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక నాందికి ఈ క్లబ్లు దోహదకరంగా పేర్కొన్నారు. బాలురు, బాలికలను కలిపి మిత్రత్వాన్ని చురుకుగా అభ్యసించడానికి ప్రయత్నిస్తాయని వివరించారు. తమిళనాడు అంతటా 30 పాఠశాలల్లో తొలి విడతగా నిర్వహించే కార్యక్రమాల ద్వారా క్లబ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అవతార్ హ్యూమన్ క్యాపిటల్ ట్రస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వర్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ , లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పురుషులు పోషించే కీలక పాత్ర గురించి, వారి సమ్మిళిత నాయకత్వాన్ని ఎలా ప్రోత్సహించవచ్చో, అవకాశాల కోసం ఎలా వాదించవచ్చో, మిత్రుడిగా ఎలా ఉండవచ్చో అన్న విషయాలను విద్యార్థులకు వివరించారు. -
లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా..
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, సత్యరాజ్, నటి శృతిహాసన్, రెండా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా చిత్రం టైటిల్ వీడి యోతో పాటూ రెండు పాటల క్లిప్పింగ్స్ ను విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇది స్మగ్లింగ్ గ్యాంగ్స్ ఇతివృత్తంతో రూపొందుతున్న కథా చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం దర్శకుడు లోకేష్ కనకరాజ్ 49వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నటి శృతిహాసన్ ఎక్స్ మీడియా ద్వారా ఆయనకు జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. కాగా కూలీ చిత్రంలో నటుడు బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈయన పుట్టిన రోజు శుక్రవారం మే కావడంతో ఆయనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కూలీ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. అంతేకాకుండా కూలీ చిత్రంలో లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్తో ఉన్న ఫొటోను, నాగార్జునతో, ఉపేంద్ర, సత్యరాజ్తో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలిప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కూలీ చిత్రంపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయనే చెప్పాలి. -
ఉత్సాహంగా ఉగాది ముగ్గుల పోటీలు
కొరుక్కుపేట: ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వహక వర్గం, సర్ త్యాగరాయ కళా పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విశ్వావసు ఉగాది మహోత్సవ వేడుకలు– 2025 సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. దీనికి పాతచాకలిపేటలోని శ్రీ సుబ్బారావు కల్యాణ మండపం వేదికైంది. మొదటి సారిగా ఈ పోటీల్లో కేసరి హయ్యర్ సెకండరీ స్కూల్, కేటీిసీటీ బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభను చాటుకుని మొదటి బహుమతిని ఎస్.అపూర్వ, ఎస్.కీర్తిగ, రెండవ బహుమతిని. భూమిక, డి. మహ, మూడవ బహుమతిని వి.సర్వేశ్వరి, వి.అభినయ గెలుచుకున్నారు. మొదటి మూడు బహుమతులు కేసరి మహోన్నత పాఠశాల– టి.నగర్, ఈ పోటీలో కేటీసీటీ ప్రాథమిక పాఠశాల నాలుగవ తరగతి విద్యార్థినులు శ్రీమిత, కార్తీక ప్రత్యేక బహుమతి గెలుచుకున్నారు. పెద్దలకు నిర్వహించిన పోటీలో ప్రత్యేక బహుమతిని బి.లోహిత గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా మన్ని వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, వరలక్ష్మి వ్యవహరించారు. -
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
● సినీ పక్కీలో ఛేజింగ్ ● కొలనులో దూకడంతో పట్టుబడిన వైనం సేలం: కోవై జిల్లా పెరూర్ సమీపంలో ఆలన్తురై ప్రాంతానికి చెందిన రైతు కృష్ణసామి (62). ఈయన సర్టిఫికెట్ కోరుతూ మత్తువరాయపురం వీఏఓ వెట్రివేల్ (35)ను కలిశాడు. అప్పుడు వీఏఓ వెట్రివేల్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రూ.5 వేలు లంచం అడిగాడు. దీంతో కృష్ణస్వామి రూ.1000 నగదును వెట్రివేల్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బును శుక్రవారం ఇస్తానని తెలిపాడు. దీంతో వీఏఓ కృష్ణస్వామిని పుట్టువిక్కి రోడ్డు వద్దకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలని తెలిపాడు. ఇదిలాఉండగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని కృష్ణస్వామి ఈ విషయాన్ని ఏసీబీ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆ శాఖ అదనపు ఇన్స్పెక్టర్ దివ్య, పోలీసులు రసాయనంతో పూసిన నోట్లను అందజేశారు. ఆ నగదు నోట్లతో కృష్ణసామి వీఏఓను శుక్రవారం సాయంత్రం సుండక్కాపుత్తూర్ రోడ్డు వద్ద పుట్టువిక్కిర ప్రాంతానికి వెళ్లాడు. అప్పుడు అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు వెట్రివేల్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులను చూసిన వెంటనే వీఏఓ బైక్పై తప్పించుకుని పారిపోయాడు. అయితే పోలీసులు సినీ పక్కీలో వీఏఓను వెంబడించారు. వీఏఓ పెరూర్ కులత్తేరి రోడ్డుపై బైక్ను నిలిపి పెరూర్ కొలనులో దూకేశాడు. లంచం డబ్బులను కూడా కొలనులో పడేశాడు. పోలీసులు వెట్రివేల్ను అరెస్టు చేశారు. అనంతరం కొలనులో వెట్రివేల్ వేసిన రూపాయి నోట్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతరం వీఏఓను వేట్రివేల్ను పెరూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఏసీబీ పోలీసులు తీసుకువెళ్లి విచారణ జరుపుతున్నారు. -
సరెండర్ కోసం విజయ్సేతుపతి సపోర్ట్
తమిళసినిమా: యువ నటుడు దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సరెండర్. ఈయన తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం ఇది అన్నది గమనార్హం. ఇందులో నటుడు లాల్, సుజిత్ శంకర్, మునీష్ కాంత్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఆఫ్ బీట్ ఫిలిమ్స్ పతాకంపై విక్రం కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు అరివళగన్ శిష్యుడు అన్నది గమనార్హం. కాగా చిత్రం వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ సరెండర్ చిత్రం యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా తమిళ సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కాగా చిత్రం టైటిల్ను, ఫస్ట్ లుక్ పోస్టర్ను నటుడు విజయ్ సేతుపతి ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా సరెండర్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా దీనికి మెయ్యేంద్రన్ ఛాయాగ్రహణం అందించగా, వికాశ్ ప్రదీషా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితర ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పని చేశారన్నది గమనార్హం. -
ఐఐటీ మద్రాస్లో..సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఓపెన్ హౌస్
సాక్షి, చైన్నె: ఇండియన్ ఇనన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్)లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్(సీఎఫ్ఐ) ఓపెన్ హౌస్ – 2025 కార్యక్రమం శనివారం జరిగింది. ఇందులో 26 జట్లకు చెందిన సుమారు 1,000 మంది విద్యార్థుల ఆవిష్కరణలు కొలువయ్యాయి. 60 అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించారు. దేశంలో విద్యార్థులచే నిర్వహించబడే అతిపెద్ద ఇన్నోవేషన్ ల్యాబ్లలో ఒకటిగా సీఎఫ్ఐ పేరు గడించింది. ఇందులో విభిన్న సాంకేతిక డొమైన్లలో విస్తరించి 14 క్లబ్లు ఉన్నాయి, అలాగే జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో చురుకుగా పోటీపడే ఎనిమిది పోటీ జట్లు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఏటా నిర్వహించబడే ఓపెన్ హౌస్లో పూర్తిగా విద్యార్థులే రూపొందించి నిర్మించిన ఉత్పత్తులు కొలువు దీర్చడం జరుగుతోంది. ఇందులో ప్రాజెక్టులు, పరిశ్రమ, పూర్వ విద్యార్థుల నుంచి మరింత మద్దతును ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన వేదికను ఈ ఓపెన్ హౌస్ అందిస్తోంది. శనివారం జరిగిన ఓపెన్ హౌస్ 2025 అనేక అద్భుతమైన ప్రదర్శనలకు సాక్ష్యంగా నిలిచింది, ఆవిష్కరణలు.. హర్యానాలోని సోనిపట్లోని జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలోని భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంలో సందర్శకులకు సహాయం చేయడానికి రూపొందించబడిన ఏఐ–ఆధారిత హ్యూమనాయిడ్ సంవిద్, ఓ సూపర్సిరింజ్, ఖచ్చితమైన అనస్థీషియా మోతాదును నిర్ధారించే వాల్యూమ్–గేటెడ్ సిరంజి. ఓ డ్రోన్ స్వార్మ్, పేలోడ్ లిఫ్టింగ్, డెలివరీ కోసం రూపొందించబడిన డ్రోన్ల సమన్వయ సముదాయం కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణలను మార్కెట్కు తీసుకెళ్లడంలో సహాయం చేయాలని పరిశ్రమ, పూర్వ విద్యార్థుల సంఘానికి పిలుపునిస్తూ, ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ ఓపెన్ హౌస్వేదికగా పిలుపు నిచ్చారు. విద్యార్థి సమాజంలో నిర్మాణ సంస్కృతిని ఈ కార్యక్రమం పెంపొందించిందన్నారు. తమ అండర్ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మంది సీఎఫ్ఐ అనుబంధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ సంవత్సరం ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఈ బృందాలు అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడంతో పాటూ కొన్ని అసాధారణమైన ఆవిష్కరణలను ప్రదర్శించడం జరిగిందన్నారు. అలాగే ప్రీ–ఇంక్యుబేటర్ నిర్మాణ్ను చేరుకుంటున్నాయని ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థి సార్థక్ సౌరవ్ గ్రాాడ్యుయేషన్ తర్వాత వెంటనే తన సొంత స్టార్టప్ (మాటరైజ్)ను స్థాపించి చేరడం ఇదే మొదటిసారి పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించినందుకు జట్లు, విద్యార్థి కార్యనిర్వాహకులు, అధ్యాపక మార్గదర్శకులు మరియు సహాయక సిబ్బందిని అభినందించారు. అలాగే స్టార్టప్ శతం మిషన్ను కొనసాగించడానికి మరింత బలంగా సహకరించడానికి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్ గుమ్మడి మాట్లాడుతూ, సీఎఫ్ఐ అనేది ఆవిష్కరణ సృజనాత్మకతకు ఒక వెలుగు అని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం ఓపెన్ హౌస్లో 1,000 మంది విద్యార్థులతో కూడిన 60కి పైగా ప్రాజెక్టులు తమ వద్ద ఉన్నట్టు వివరించారు. ఈ ఆవిష్కరణల ఆధారంగా 15 పేటెంట్లను దాఖలు చేశామన్నారు. అలాగే మూడు సంభావ్య స్టార్టప్ల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఈ ప్రయాణంలో ఐఐటీ మద్రాస్ త్వరలో లక్ష్యాన్ని సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు.. ఈ పదర్శనలో సాప్ట్వేర్, ఏఐ రంగంలో దృష్టి లోపం ఉన్న వారికి యాక్సెసిబిలిటీని పెంచే ఆడియో – ఆధారిత వీఆర్ గేమ్ బ్లింక్, విభిజన్న శైలులను మిళితం చేసే మల్టీ –ట్రాక్ ఫ్యూజన్ మ్యూజిక్ జనరేటర్ ఏఐఐ రెహమాన్ వంటి ప్రాజెక్టులు లీనమయ్యే సాంకేతికతను ఈ ప్రదర్శన ద్వారా ముందుకు తెచ్చాయి. నాణ్యతను కొనసాగిస్తూ ఫైల్ పరిమాణాలను ఆప్టిమైజ్ చేసే అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనం యాక్సిఫై, భవిష్యత్తు–ప్రూఫ్ భద్రతను నిర్ధారించే పోస్ట్–క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ లైబ్రరీ క్వాన్ క్రిప్ట్, గణన సామర్థ్యం, సైబర్ భద్రతలో ఆవిష్కరణలను ప్రదర్శించారు. ట్రేడ్క్రాఫ్ట్, ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, వినియోగదారులు స్టాక్, ఫ్యూచర్స్ , ఆప్షన్స్ ట్రేడింగ్ను రిస్క్–ఫ్రీ వాతావరణంలో అనుకరించడానికి అనుమతి ఇచ్చారు. ఫార్ములా స్టూడెంట్ ఈవీ రేస్ కార్ టీమ్ రఫ్తార్, ఫార్ములా భారత్ – 2025లో ఓవరాల్ స్టాటిక్స్లో మొదటి స్థానాన్ని కై వసం చేసుకోవడం విశేషం. ఇంజినీరింగ్ డిజైన్, ఖర్చు, తయారీ చ ఉత్తమ బ్యాటరీ ప్యాక్లలో అత్యున్నత అంశాలు ఉన్నాయి. హైపర్లూప్ కోసం సబ్–స్కేల్ ప్యాసింజర్ క్యాబిన్ , మార్గదర్శక బూస్టర్–క్రూయిజర్ టెక్నాలజీని అభివృద్ధి తో పాటుగా స్టీల్ ట్యూబ్లను ఖర్చుతో కూడుకున్న కాంక్రీట్ ట్యూబ్లతో భర్తీ చేస్తూ మౌలిక సదుపాయాలను మరింత స్కేలబుల్గా తీర్చిదిద్దారు. వారి టెస్ట్ ట్రాక్ ఏరోడైనమిక్స్, లెవిటేషన్, ప్రొపల్షన్ , భద్రతా వ్యవస్థల వాస్తవ–ప్రపంచ ధ్రువీకరణకు ఇందులో అనుమతి ఇచ్చారు. ఆవిష్కరణల కొలువు 60 టెక్ ఇన్నోవేషన్ల ప్రదర్శన -
గెలవక ముందు ‘జనసేనాని’.. గెలిచాక 'భజన సేనాని’: ప్రకాశ్ రాజ్
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్కి ప్రకాశ్రాజ్ జత చేశారు.‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA— Prakash Raj (@prakashraaj) March 15, 2025‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు. -
పవన్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.మరోవైపు, పవన్ కల్యాణ్కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. నటుడు ప్రకాష్రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
తమిళులపై కామెంట్స్.. పవన్కు ప్రకాష్రాజ్ కౌంటర్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.నటుడు ప్రకాష్రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్ చేశారు."మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please... 🙏🏿🙏🏿🙏🏿 #justasking— Prakash Raj (@prakashraaj) March 14, 2025ఇక, అంతకుముందు.. పవన్ కల్యాణ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఇప్పటికే సీఎం స్టాలిన్ దీనిపై స్పందించారు. ‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. -
యథార్థ ఘటనలతో రాబర్
తమిళసినిమా: ిసనిమా అనేది కల్పిత కథలతో కూడిన కాలక్షేప మాధ్యమమే కాదు. సమాజానికి కావలసిన చక్కని సందేశంతో కూడిన ప్రయోజనాత్మక కథా చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. అవి సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకొస్తుంటాయి. అలాంటి ఇతివృత్తంతో కూడిన చిత్రం రాబర్ అని చెప్పవచ్చు. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే చైన్ స్నాచింగ్ సమస్య ఒకటి. చైన్ స్నాచింగ్కు కారణాలు చాలానే ఉంటాయి. ఆడంబర జీవితాలకు అలవాటు పడే జులాయిగాళ్లు, కష్టపడకుండా సంపాదించాలనే దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వారు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటారు. దీని వల్ల అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్థిక సమస్యలకు గురవుతున్నారు. అలా ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. అయితే అలా చైన్ స్నాచింగ్కు పాల్పడిన వారు బాగుంటున్నారా అంటే వారు ఎప్పుడో ఒకప్పుడు చట్టానికి పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం రాబర్. ముఖ్యంగా చైన్ స్నాచింగ్లతో మహిళలకు జరుగుతున్న బాధను చాలా స్పష్టంగా తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని పాత్రికేయురాలు ఎస్.కవిత తన ఇంప్రెస్ ఫిలింస్ సంస్థతో కలిసి, మెట్రో ప్రొడక్షన్స్ అధినేత ఆనంద్కృష్ణన్తో కలిసి నిర్మించడం విశేషం. సత్య, డేనియల్, అన్నేపోప్, జయప్రకాశ్, దీపాశంకర్, సెండ్రాయన్, పాండియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎస్ఎం.పాండి దర్శకత్వం వహించారు. ఎన్ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం, సోహన్ శివనేశ్ సంగీతాన్ని అందించారు. అత్యంత సహజత్వంగా వాస్తవ సంఘటనలతో రూపొందించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది. శక్తి ఫిలింస్ సంస్థ ద్వారా శక్తివేల్ తమిళనాడు విడుదల హక్కులను పొంది రాబర్ చిత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది. -
కిటకిటలాడిన తిరువణ్ణామలై గిరివలయం
వేలూరు: తమిళ మాసి మాస పౌర్ణమిని పురష్కరించుకుని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ గిరివలయం రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. పంచ భూత స్థలమైన అరుణాచలేశ్వరాలయంలో ప్రతినెలా పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గిరివలయం రోడ్డులోని 14 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా పౌర్ణమి గురువారం ఉదయం 11.40 గంటలకు ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం ముగియడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. అదేవిధంగా ఆలయంలోని అన్నామలైయార్ సమేత ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు చేశారు. పౌర్ణమి సమయంలో తిరువణ్ణామలై చేరుకొని భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగించడంతో భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
కమనీయం.. తిరుకల్యాణోత్సవం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని వల్లిమలై సుబ్రహ్మణ్యస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మురుగ పెరుమాల్ తిరు కల్యా ణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవార్లుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు, దీపారాధనలు చేసి తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. ఆర్యవైశ్య వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారికి వరుస తాంబూలం అందజేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ధనశేఖర్ శెట్టియార్, కార్యదర్శి ఆనందన్, కోశాధికారి కుప్పురాజ్, పీఆర్ఓ సుబ్రమణ్యశెట్టియార్, జాయింట్ కార్యదర్శి భాస్కరన్, వాసుదేవన్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ సారథి పాల్గొన్నారు. -
పరువు నష్టం కేసులో పళనికి ఊరట
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామిపై ఎంపీ దయానిధి మారన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధిస్తూ శుక్రవారం ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి పళనిస్వామి పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో, సెంట్రల్ చైన్నెలో డీఎంకె ఎంపీ దయానిధి మారన్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను సరిగ్గా ఖర్చు చేయడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. ఈ ప్రసంగాన్ని ఖండించిన దయానిధి మారన్, ఎడపాడి పళనిస్వామిపై పరువు నష్టం దావా వేశారు. చైన్నె జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఎడపాడి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో, తాను వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా మాట్లాడానని, ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలు పరువు నష్టం కలిగించేవి కావని, కాబట్టి తనపై ఉన్న కేసును రద్దు చేయాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జి.కె.ఇళందిరియన్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో ఎడపాడి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జాన్ సత్యన్ వాదిస్తూ ఆయన వార్తాపత్రికలోని వార్తలు, ప్రభుత్వ వెబ్సైట్లోని డేటా ఆధారంగా మాత్రమే మాట్లాడానని, ఎటువంటి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. వాదనల అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల కోర్టులో విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి జారీ చేశారు. మాజీ కేంద్ర మంత్రికి సత్కారం సాక్షి, చైన్నె: దేశానికి విశేష సేవలను అందించినందుకు భారత మాజీ కేంద్రమంత్రి సురేష్ప్రభును శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ కంపెనీ సంయుక్తంగా సత్కరించుకుంది. శుక్రవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దేశాభివృద్ధికి ఎనలేని సేవలను అందించారని ఆ సేవలకు గుర్తింపుగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభుతోపాటు మరో ఇద్దరు న్యాయ ప్రముఖులు మద్రాస్ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్.శంకరనారాయణన్, సీనియర్ న్యాయవాది జయేష్ డోలియాను సత్కరించారు. సురేష్ప్రభు మాట్లాడుతూ ప్రజలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక ఆ కార్యక్రమాన్ని సమ్మతించానని తెలిపారు. తాను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి జరిగిన అతిపెద్ద ప్రయత్నాలను వివరించారు. దేశంలో 80 శాతం విద్యుత్ కొరత ఉందని ఆయన గుర్తు చేశారు. తన హయాంలో ఉచిత విద్యుత్ ప్రాజెక్టుపై తొలిసారి సంతకం చేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితను మరిచిపోలేమన్నారు. ఇందులో శ్రీశ్రీమల్ బలాద్ కుటుంబం, టీమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. మోటారు పంపుల తయారీ నగరంగా కోవై సాక్షి,చైన్నె: ప్రపంచంలోనే మోటారు పంపు సెట్ల తయారీ నగరంగా కోయంబత్తూరును తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని భారత మోటారు పంపు తయారీదారుల సంఘం ప్రశంసించింది. ఇండియన్ పంప్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి. కార్తీక్ మాట్లాడుతూ, కోయంబత్తూరు మోటారు పంప్ పరిశ్రమను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటును తమకు ఎంతో ఆనందకరంగా పేర్కొన్నారు. బడ్జెట్లో అధునాతన పంపుల తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రకటించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, కోయంబత్తూర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వి.సెంథిల్ బాలాజీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. -
బావిలోకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరి మృతి ● కారులో ప్రయాణించిన రైతు, రక్షించడానికి వెళ్లిన ఈతగాడు సేలం: ఈరోడ్–సత్యమంగళం సమీపంలో కారు బావిలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని ముల్లికాపాళయంకు చెందిన రైతు యువరాజ్ (65)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో గురువారం సాయంత్రం 6 గంటలకు తోటలో ఉన్న కారును యువరాజ్ నడుపుతున్నాడు. కారు అకస్మాత్తుగా అదుపుతప్పి వెనక్కి దూసుకెళ్లి సమీపంలోని 80 అడుగుల లోతైన బావి రిటైనింగ్ వాల్ను ఢీకొని బావిలో పడిపోయింది. బావిలో నీరు 50 అడుగుల లోతులో ఉండడంతో కారు నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న యువరాజ్ బయటకు రాలేక నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి గ్రామస్తులు సత్యమంగళం పోలీసులకు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. యువరాజ్ను రక్షించే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది తాడుకట్టి బావిలోకి దిగారు. 50 అడుగుల లోతు వరకు నీరు నిలిచి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. వారు రాత్రి 11 గంటల వరకు సహాయక చర్యలను కొనసాగించారు. గజ ఈతగాడు మృతి ఆ తరువాత, వారు భవానీసాగర్ నుంచి నలుగురు గజ ఈతగాళ్లను పిలిపించారు. వారిలో భవానీసాగర్ అన్నానగర్కు చెందిన తిరుమూర్తి(42) కూడా బావిలోకి దిగి యువరాజ్ను రక్షించడానికి ప్రయ త్నించాడు. బావిలోని నీటిని మోటారుతో బయటకు పంపింగ్ చేశారు. ఈ పరిస్థితిలో బావిలోకి దిగిన నలుగురు ఈతగాళ్లు ఊపిరాడక వెలుపలికి వచ్చేశారు. అయితే తిరుమూర్తి నీటిలో మునిగిపోయాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 9 గంటలపాటు శ్రమించిన తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, నీళ్లన్నీ ఖాళీ అయిన తర్వాత, కారులో ఉన్న యువరాజ్, తిరుమూర్తి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష కోసం సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. తర్వాత బావిలో ఉన్న కారును కూడా ఒక పెద్ద క్రేన్ ద్వారా బయటకు తీశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈతగాడు తిరుమూర్తి కారు బావిలో పడడంతో దానిలోని గ్యాస్ బావిలోకి పోవడంతో ఊపిరాడక మరణించాడని తేలింది. ఈ ఘటనపై సత్యమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకథా చిత్రంగా డెక్స్టర్
తమిళసినిమా: సినిమా కథలు కొత్తగా ఉండవు. ఏ చిత్రంలోనైనా ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, వినోదభరిత అంశాలే ఉంటాయి. అయితే ఆ కథలను తెరపై ఆవిష్కరించే విధానమే కొత్తగా ఉండాలి. అలాంటి చిత్రాలే ప్రేక్షకుల ఆదరణను పొందుతాయి. అలాంటి మంచి కంటెంట్తో తెరకెక్కిన తాజా చిత్రం డెక్స్టర్. కథ పాతదే అయినా, దాన్ని కథనం, తెరపై ఆవిష్కరించిన తీరు జనరంజకంగా ఉన్న చిత్రం ఇది. బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఒక కుర్రాడి జీవితాన్ని ఎలాంటి పరిణామాలకు గురి చేసింది, దాని వల్ల ఎందరి ప్రాణాలు బలైయ్యాయి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్స్టర్ చిత్రాన్ని రామ్ ఎంటర్టెయినర్స్ పతాకంపై ప్రకాశ్.ఎస్వీ నిర్మించారు. సూర్యన్.జీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో రాజీవ్ గోవింద్, అభిషేక్ జార్జ్, యుక్తా పెర్వీ, సితార విజయన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య గోవిందరాజ్ చాయాగ్రహణం, శ్రీనాఽథ్ విజయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఒక గాఢమైన ప్రేమికుడి ఆవేదన, ప్రతీకారేచ్ఛ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందింది. ప్రేమించిన ప్రియురాలు హత్యకు గురైతే ఆమె జ్ఞాపకాలు గుండెల్లో గుచ్చుకుంటుంటే అతని బాధను, మనోవేదనను చూడలేక అతని మిత్రుడు ఏం చేశాడు? అదే విధంగా అనుకోకుండా తారస పడిన బాల్య స్నేహితురాలు అతనికి ఏ విధంగా బాసటగా నిలిచింది? ఆమె కుటుంబ సమస్య ఏమిటి? దాన్ని ఆమె స్నేహితుడు పరిష్కరించగలిగాడా వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన డెక్స్టర్ చిత్రం ఊహించని మలుపులతో సాగుతుంది. చిత్రంలో ప్రేమ, పగ, ప్రతీకారాలతో పాటు రొమాన్స్, అందమైన పాటలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని శుక్రవారం తెరపైకి వచ్చింది. -
తంగం బడ్జెట్
● అసెంబ్లీలో ఆర్థిక పద్దు ● దాఖలు చేసిన ఆర్థికమంత్రి తంగం తెన్నరసు ● అప్పులు 9 లక్షల కోట్లు ● పథకాలకు నిధుల వరద ● మహిళలకు అందలం ● ఉద్యోగులకు కానుక ● నేడు వ్యవసాయ బడ్జెట్ సాక్షి, చైన్నె: ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు తనదైన శైలిలో రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం అసెంబ్లీలో దాఖలు చేశారు. తమిళనాడు భవిష్యత్తుకు దిక్సూచీగా పేర్కొంటూ పద్దుల చిట్టాను వివరించారు. రాష్ట్ర అప్పులు రూ. 9 లక్షల కోట్లకు చేరినట్టు ప్రకటించారు. పథకాలకు నిధుల వరద పారిస్తూ, చైన్నె శివారులో గ్లోబల్ సిటీ నిర్మాణం, రోడ్లు, వంతెనల ఏర్పాటు వంటి కొత్తప్రగతి పథకాలను ప్రకటించారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీతో పాటు ఉద్యోగులకు ఈఎల్ (ఎర్న్డ్ లీవ్ సరెండర్ సిస్టమ్)ను మళ్లీ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2025–26 సంవత్సరానికిగాను ఆర్థిక బడ్జెట్ను సభలో మంత్రి తంగం తెన్నరసు ప్రవేశ పెట్టేందుకు ముందుగా సీఎం స్టాలిన్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ గురించి సీఎంతో చర్చించినానంతరం అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ, స్పీకర్ అప్పావు అధ్యక్షతన సభ సరిగ్గా 9.30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 12.10 గంటల వరకు బడ్జెట్ ప్రసంగం 2.40 గంటలు సాగింది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు బడ్జెట్ ప్రసంగానికి సిద్ధం కాగా, అన్నాడీఎంకే సభ్యులో ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. ఇందుకు ఇది సమయం కాదంటూ స్పీకర్ వారించారు. అనంతరం సభలో పూర్తి స్థాయి బడ్జెట్ను తంగం తెన్నరసు దాఖలు చేశారు. తమిళనాడులో విద్య, ఆరోగ్యం వంటి అంశాలను గుర్తు చేస్తూ శాంతి సామరస్యాల గురించి ప్రస్తావించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను విశదీకరించారు. తమిళ భాషాభ్యున్నతి గురించి ప్రస్తావిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచీగా నిలిచే విధంగా పలు పథకాలు, అంశాలకు నిధులను కేటాయిస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని వివరించారు. తిరుక్కురల్ను అన్ని ప్రపంచ భాషల్లో అనువదించేందుకు, విదేశాలలో సైతం పుస్తక ప్రదర్శనల ఏర్పాటుకు నిధులను కేటాయిస్తూ తొలి ప్రకటన చేశారు. కిలడి, తూత్తుకుడి, నాగపట్నం, కడలూరు, తెన్కాశి ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు విస్తృతం చేయడం, మ్యూజియంల ఏర్పాటు, ఎగ్మూర్ మ్యూజియంలో సింధులోయ నాగరికత ఆవిష్కరణ, మహాబలిపురం ప్రగతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ, నిధులను కేటాయించారు. ఈ ఏడాది రూ.3,500కోట్లతో లక్ష గృహాలను నిర్మించనున్నారు. అప్పులు రూ.9 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు రూ.9 లక్షల కోట్లను దాటింది. బడ్జెట్లో ఆదాయ వ్యయ వివరాల సమయంలో ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లోటు రూ. 41,634 కోట్లుగా చూపించారు. రానున్న కాలంలో ఈ లోటు క్రమంగా తగ్గుతుందని వివరించారు. 2025–26 ప్రభుత్వం 1,62,096.76 కోట్ల అప్పులు తీసుకునేందుకు నిర్ణయించింది. అలాగే, 55,844.53కోట్ల విలువగల అప్పును తిరిగి చెల్లించనున్నారు. గత ఏడాది 8 లక్షల కోట్లుగా అప్పులు ఉండగా ప్రస్తుతం రూ. 9 లక్షల కోట్లను దాటింది. ఇక, బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శనివారం వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేయనున్నారు. సోమవారం నుంచి బడ్జెట్ చర్చ. మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు శాఖల వారీగా నిధుల కేటాయింపు చర్చ జరుగుతుందని స్పీకర్ అప్పావు ప్రకటించారు. బడ్జెట్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎర్న్డ్ లీవ్ సరెండర్ సిస్టమ్ను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలలోని 40వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. బడుల్లో 1,721 పీజీ టీచర్ల నియామకానికి చర్యలు రెండు సంవత్సరాల్లో రూ.2 వేల కోట్లతో 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు లేదా ట్యాబ్ల పంపిణీ పాఠశాలలో చెస్ క్రీడపై మక్కువ పెంచే విధంగా పాఠ్యాంశం, వ్యాయామ పాఠ్యాంశాలలో మార్పునకు నిర్ణయం. కున్నూరు, నత్తంచైన్నె ఆలందూరు, విక్రవాండి, సెయ్యూరు సహా 10 చోట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు ఏర్పాటు. యువజన క్రీడల శాఖకు రూ. 572కోట్ల కేటాయింపు. మొబైల్ వైద్య సేవలతో క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు పరికరాల కొనుగోలుకు రూ. 40 కోట్లు కేటాయించారు. క్యాన్సర్ను ప్రారంభంలోనే గుర్తించే పరికరాన్ని రూ.110 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ దిశగా టీకాలు వేయడానికి రూ. 36 కోట్లు, కాంచీపురంలో అన్నా స్మారక క్యాన్సర్ ఆస్పత్రి హోదా పెంపునకు రూ.120 కోట్లు అంటూ తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య శాఖకు రూ.21,096 కోట్లు కేటాయించారు. హొసూరులో రూ.400 కోట్లతో టైడల్ పార్క్, సైన్స్ సెంటర్ ఏర్పాటు, విరుదునగర్లో మినీ టైడల్ పార్క్, మదురై మేలూరు, కడలూరులలో పాదరక్షల పార్క్ను రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు కేటాయించనున్నారు. పుదుకోట్టైలో 200 ఎకరాల్లో కొత్త పారిశ్రామక వాడ ఏర్పాటు, పరందూరులో కొత్త విమానాశ్రయ ఏర్పాటు పనులు త్వరలో వేగవంతం చేయనున్నారు. పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించే విభాగానికి రూ.3,915కోట్లు కేటాయించారు. స్పేస్ రంగంలో పరిశోధనలు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిధులు అంటూ ఎంఎంఎస్ఈ విభాగానికి రూ.1,918 కోట్లు కేటాయించారు. చైన్నె కార్పొరేషన్ రూ. 50 కోట్లతో నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఐటీశాఖకు రూ.131కోట్ల కేటాయింపు. వాటర్ మేనేజ్మెంట్ పథకం అమలుకు రూ.2వేల కోట్లు. వెల్లిమలై, ఆలియారు పరిధిలో రూ.11, 721 కోట్లతో కొత్తగా 2 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు. విద్యుత్శాఖకు రూ. 21,168 కోట్ల కేటాయింపు. మత సామరస్యాన్ని పరిరక్షించే గ్రామ పంచాయతీలను ప్రతి ఏటా 10 ఎంపిక చేయనున్నారు. తలా ఒక కోటి అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక నిధి కేటాయింపు. చైన్నె, మదురై, కోయంబత్తూరుల కోసం 1,125 విద్యుత్ బస్సుల కొనుగోలు. 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రూ.125 కోట్లు కేటాయింపు. చైన్నె సైదా పేటలో రూ. 110 కోట్లతో 190 గృహాల నిర్మాణం. రామనాథపురంలో రూ.21 కోట్లతో నావల్ ఎగ్జిబిషన్. కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చైనె శివారులో 2 వేల ఎకరాల్లో గ్లోబల్ సిటీ రూపకల్పన, ఉమ్మడి తాగునీటి పథకం అమలుకు రూ. 21,678 కోట్ల కేటాయింపు, చైన్నెకు తాగు నీరు అందించేందుకు కోవలం– తిరుప్పోర్ మధ్య రూ. 350 కోట్లతో కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం. పది కార్పొరేషన్లలో సీనియర్ సిటిజన్ల కోసం రూ.10 కోట్లతో అన్బుచోళై మయంల ఏర్పాటు. -
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కార్తీ
తమిళసినిమా: నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన మెయ్యళగన్ చిత్రం సద్విమర్శలతో పాటు, ప్రేక్షకాదరణ అందుకుంది. తాజాగా కార్తీ నటించిన వా వాద్ధియార్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం సర్ధార్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రంలో కార్తీ నటించనున్నారు. అదే విధంగా డానాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు. దర్శకుడు మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబందించిన కథా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా మరో చిత్రానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ప్రస్తుత సమాచారం. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించనున్నారన్నదే ఆ న్యూస్. దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంతకు ముందు నటుడు సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క, వారణం ఆయిరం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మరో చిత్రం రూపొందాల్సి ఉండగా సూర్య, గౌతమ్ మీనన్ల మధ్య అభిప్రాయబేధాలు కారణంగా ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా సూర్య సోదరుడు, ప్రముఖ కథానాయకుడు కార్తీ , దర్శకుడు గౌతమ్ మీనన్ క్రేజీ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషం. గౌతమ్ మీనన్ ఇటీవల కార్తీకి కథ చెప్పినట్లు, అది నచ్చడంతో ఆయన పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ప్రముఖ రచయిత జయమోహన్ రాసిన కథనే గౌతమ్మీనన్ కార్తీకి చెప్పినట్లు తెలిసింది. ఇది దర్శకుడు గౌతమ్ మీనన్ స్టైల్లోనే యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్ మీనన్ మెగాఫోన్ పట్టి చాలా కాలం అయ్యింది. ఈయన నటుడిగా బిజీ అయ్యారు.నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించి, నిర్మించిన ధృవనక్షత్రం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విదుదలకు ఎదురు చూస్తోంది. ప్రస్తుతం గౌతమ్మీనన్ ఒక మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
ఖైదీలను చిన్నచూపు చూడొద్దు
వేలూరు: జైలు నుంచి విడుదలైన ఖైదీలను చిన్న చూపు చూడకుండా వారిని సమాజంలో ఒకరిగా చూడాలని వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ధర్మరాజ్ అన్నారు. వేలూరు సెంట్రల్, మహిళా సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన ఖైదీలకు మాజీ జైలు ఖైదీల పునరావాస సంఘం, వెటర్నరీ శాఖ, జైళ్ల శాఖ సంయుక్తంగా కోళ్ల పెంపకంపై శిక్షణ తరగతులు జైలు ఆవరణలో జరిగాయి. ఆయన మాట్లాడుతూ క్షణికావేశంతో చేసిన తప్పులకు వీరందరూ జైలు శిక్ష అనుభవించి చేసిన తప్పును తెలుసుకొని వారి జీవితంలో మార్పురావడంతోనే జైలు నుంచి విడుదల చేశారన్నారు. అయితే ఈ సమాజం జైలు శిక్ష అనుభవించిన వారిని చిన్నచూపు చూడకుండా సమాజంలో ఒకరిగా చూడాలన్నారు. మాజీ ఖైదీలు ఇకపై చెడు అలవాట్లకు బానిస కాకుండా స్వయం ఉపాధిని ఎంచుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం సాయం చేసేందకు సిద్ధంగా ఉందన్నారు. అందుకే ప్రస్తుతం కోళ్ల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన కోల్లను కొనుగోలు చేసి ఇచ్చి వాటిని పెంచుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో చెడు అలవాట్లకు వెళ్లకుండా కుటుంబాన్ని పోషించుకోవాలన్నారు. జైలు ఖైదీల పునరావాసుల సంఘం కార్యదర్శి జనార్దన్, సీనియర్ న్యాయవాది విజయరాఘవులు, కోశాధికారి శ్రీనివాసన్, సభ్యులు శరవణన్, వెటర్నరీ విభాగం ప్రొఫెసర్ పాండియన్ పాల్గొన్నారు. -
అసెంబ్లీకి టాస్మాక్ స్కాం
● అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్ సాక్షి, చైన్నె: టాస్మాక్లో ఈడీ దాడుల నేపథ్యంలో రూ.1000 కోట్ల స్కాం జరిగిందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారం శుక్రవారం అసెంబ్లీకి చేరింది. అసెంబ్లీ తొలి రోజు బడ్జెట్ దాఖలుకు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు సిద్ధమయ్యారు. ఆసమయంలో అన్నాడీఎంకే శాసనసభా పక్ష ఉప నేత జోక్యం చేసుకుని టాస్మాక్ స్కాం అంటూ నినదించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని, చర్చకు పట్టుబట్టారు. శుక్ర, శనివారాలు కేవలం బడ్జెట్ దాఖలుకు మాత్రమే సమయం అని స్పీకర్ అప్పావు వారించారు. దీంతో ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి జోక్యం చేసుకుని స్పీకర్తో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారాలన్నీ సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. దీంతో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. వీరు బయటకు వెళ్లగానే, ఇదే స్కాంను ఎత్తిచూపుతూ బీజేపీ సభ్యులు సైతం నినాదాలు అందుకున్నారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అలాగే, రాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి పెట్రేగిందని నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి మాజీ సీఎం పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. నాలుగైదు రోజులుగా టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగాయని, ఇందులో వెయ్యికోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నట్టు పేర్కొన్నారు. టాస్మాక్ ద్వారా ప్రభుత్వానికి రూ.40 వేల కోట్లు వస్తున్నదని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు. డీఎంకేను తరిమికొట్టే రోజులు సమీపంలోనే ఉందని, ప్రజలు ఆ మేరకు ఆగ్రహంతో ఉన్నట్టు పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ ఈ స్కాంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ ఈనెల 17న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. టాస్మాక్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈడీ చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటామని రాష్ట్ర ఎకై ్సజ్ మంత్రి సెంథిల్బాలాజీ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పసలేని బడ్జెట్ అసెంబ్లీలో తంగం తెన్నరసు బడ్జెట్ దాఖలు చేశారు. ఎలాంటి పన్నుపోటు, కొత్త భారం అన్నది లేకుండా పాత పథకాలకు నిధులు, కొత్త ప్రాజెక్టులు అంటూ ప్రసంగం ముగించారు. అయితే, ఈ బడ్జెట్పై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు రుణాలను మాఫీ చేయని వాళ్లు, విద్యార్థులకు ఎక్కడి నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇస్తారని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వాగ్దానాలను మమా అనిపించారని, ఈ బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొంటూ, ఈ బడ్జెట్లో ఏమీ లేదని, పాత వాటికి రంగులు వేసుకున్నారని విమర్శించారు. కాగా బడ్జెట్లో ఇండియన్ కరెన్సీ సింబల్ను తొలగించి తమిళ అక్షరంగా ‘రూశ్రీ’ వాడడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విభజన వాద రాజకీయాలను డీఎంకే చేస్తున్నట్టు మండిపడ్డారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పేర్కొంటూ బడ్జెట్లో ప్రజలను పూర్తిగా ఈ పాలకులు విస్మరించారని మండిపడ్డారు. త్వరలో డీఎంకేను ఇంటికి పంపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
నాలుగు వాహనాలు ఢీ
– 10 మందికి తీవ్రగాయాలు సేలం: విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలో వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైన్నె వైపు వెళుతున్న లోడు లారీ తెన్పాసరై వద్ద వెళుతుండగా సైక్లిస్ట్ను తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ వెనుక వస్తున్న మరొక లారీ, ప్రభుత్వ బస్సు, కారు వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని పోలీసులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో పేలిన ఫ్రిడ్జ్ తిరుత్తణి: తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో మందులు వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే గర్భిణులు, చంటి పిల్లల తల్లులను ఆస్పత్రి సిబ్బంది కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలోని ప్రసవ వార్డులో 15 మంది గర్భిణులు, చంటి పిల్లల తల్లులు చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వార్డులోని మందులు నిల్వ వుంచే ఫ్రిడ్జ్ పేలడంతో పొగలు చోటుచేసుకున్నాయి. దీంతో గర్భిణులు, చంటి బిడ్డల తల్లులను అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కాపాడి సమీపంలోని వార్డుకు తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి చేరుకుని అత్యవసర ద్వారం అద్దాలు కూల్చి వార్డులో కమ్ముకున్న పొగలను శుభ్రం చేసి సకాలంలో స్పందించి గర్భిణులు, బాలింతలను కాపాడిన ఆస్పత్రి సిబ్బంది సేవలను వైద్యులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కొనియాడారు. వాహనం ఢీకొని చిన్నారి దుర్మరణం తిరువళ్లూరు: ఫోర్క్లిఫ్ట్ వాహనం ఢీకొని 8 నెలల చిన్నారి మృతిచెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కల్లకురుచ్చి ప్రాంతానికి చెందిన చెల్లముత్తు, ప్రియారాణి దంపతులు తిరువళ్లూరుకు వచ్చి గత మూడు నెలల నుంచి ప్రయివేటు ఇటుక బట్టీలో పనిచేస్తున్నా రు. వీరికి భువనేశ్వరి అనే 8 నెలల చిన్నారి వుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రియారాణి తన 8నెలల చిన్నారిని చెట్టు కింద పడుకోబెట్టి పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో ఇటుక రాయిని బట్టీ వద్దకు తీసుకొచ్చిన ఫోర్క్ లిఫ్ట్ అపరేటర్ నిర్లక్ష్యంగా వాహనా న్ని నడపడంతో చెట్టు కింద నిద్రిస్తున్న చిన్నారి పై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటనపై మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య తిరువొత్తియూరు: చైన్నె వడపళనిలో కుటుంబకలహాలతో భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నె, వడపలని వెస్ట్ శివాలయం వీధికి చెందిన ఆర్ముగం (47) కారు డ్రైవర్. ఇతనికి మద్యం అలవాటు ఉంది. రాత్రి సమయంలో మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఆర్ముగం ఇంటికి వచ్చాడు. భార్య రాణితో గొడవ పడ్డాడు. విరక్తి చెందిన రాణి అతనిపై కోపగించుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆర్ముగం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత బయటికి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్త శవముగా వేలాడుతుండడం చూసి దిగ్భ్రాంతి చెంది పోఈసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.