Ananthapur
-
చింతకుంట మధుపై దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత చింతకుంట మధుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితుడు తెలిపిన మేరకు... నగరంలోని 39వ డివిజన్ పరిధిలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మేయర్ వసీంతో పాటు కార్పొరేటర్లు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ మొక్కలు నాటి వెళ్లిన అనంతరం కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ కుమారుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు వద్దకు స్థానిక టీడీపీ నేతలు మోహన్ కుమార్, అఖిల్, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్రతో పాటు మరో పది మంది వచ్చి వాదనకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ మధును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేశారు. అక్కడే ఉన్న సచివాలయ ఉద్యోగులను సైతం దూషించారు. కూటమి ప్రభుత్వంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ వారు ఎలా పాల్గొంటారు.. వారిని ఎలా మీరు రానిస్తారు అంటూ రెచ్చిపోయారు. దాడి హేయం చింతకుంట మధుపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయమని మేయర్ వసీం ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న మేయర్తో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, బాధితుడు చింతకుంట మధుతో కలిసి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. సీఐకి ఫోన్ చేస్తే తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్ఐ వద్దకు వెళ్తే ఆయన ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. దాదాపు గంట సేపటి తర్వాత బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం మేయర్ విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది పడేటప్పుడు.. ఉద్యోగం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో అప్పటి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఏనాడూ కబ్జాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదన్నారు. నేడు కూటమి పాలనలో నగరంలో అరాచకాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల తన చాంబర్లోకి సైతం టీడీపీ నేతలు దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నాడు ఎస్పీ కఠినంగా వ్యవహరించి ఉంటే నేడు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. చింతకుంట మధుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులేసు, యువజన విభాగం స్పోక్స్పర్సన్ మారుతీ నాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ కుళ్లాయి స్వామి, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, టౌన్ సెక్రెటరీ సురేంద్ర రెడ్డి, కార్పొరేటర్స్ సంపంగి రామాంజినేయులు, కమల్, మైనార్టీ నాయకులు రఫీ, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు -
రోగులతో ఆత్మీయంగా మాట్లాడాలి
అనంతపురం అర్బన్: రోగులతో ఆత్మీయంగా మాట్లాడితే.. అదే వారి వ్యాధిని సగం తగ్గించేస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ వైద్యులకు సూచించారు. దేవునిగా భావించే వైద్యుల మాటకు అంత శక్తి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది ప్రొఫెషనల్గా ఉండాలన్నారు. రోగులను స్నేహభావంతో పలకరించాలని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాలన్నారు. ఫార్మసిస్టులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే వైద్యసేవల మీద ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తనిఖీ చేస్తాన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ రోగులతో వ్యవహరించే తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. -
సీపీఆర్తో ప్రాణం నిలిపారు!
కదిరి టౌన్: కరెంటు షాక్కు గురైన విద్యార్థి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి. అదే సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ దేవేంద్ర సీపీఆర్ చేసి విద్యార్థి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన కదిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నూతనంగా గృహ నిర్మాణాన్ని స్థానికుడు ఆంజనేయులు చేపట్టాడు. ఆయన కుమారుడు నరసింహులు శుక్రవారం ఇంటిపైకి ఎక్కిన సమయంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైనును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దేవేంద్ర వెంటనే సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత బాలుణ్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కాగా, విద్యార్థి నరసింహులు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కో–ఆపరేటివ్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ కో–ఆపరేటివ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (డీసీఎం, సీఏ) కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలోని రాయలసీమ సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై నా అభ్యర్థులకు 10వ బ్యాచ్ కింద 24 వారాలు శిక్షణ ఉంటుంది. సహకార సంస్థలు, సంఘాల్లో పనిచేయాలనుకున్న వారు ఈ కోర్సు తప్పని సరిగా పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్.. సమాన అర్హత కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు స్థానిక రామ్నగర్లో ఉన్న శిక్షణా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 94907 41137లో సంప్రదించవచ్చు. 8న డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష అనంతపురం: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 8న అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. ఇప్పటి వరకూ పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.2,200 చలానా, పాత హాల్టికెట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి నేరుగా హాజరు కావచ్చు. ఈ అంశంపై పూర్తి వివరాలను ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకోవచ్చు. కాగా, హిందూపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో ఎస్కేయూ యూజీ రెండో సెమిస్టర్ పరీక్షలో మాస్కాపీయింగ్కు పాల్పడిన ఓ విద్యార్థిని డీబార్ చేసినట్లు ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. -
విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు
● భారత నూనె గింజల పరిశోధనా స్థానం డైరెక్టర్ మాథూర్ కూడేరు: పంటల సాగులో విత్తనం నాణ్యతగా ఉంటేనే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశముంటుందని భారత నూనె గింజల పరిశోధనా స్థానం (ఐఐఓఆర్) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథూర్ అన్నారు. ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని భారతీయ నూనె గింజల ప్రాంతీయ పరిశోధన స్థానం, రేకులకుంట, కదిరి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడేరు మండలం పి.నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ సతీష్, డాక్టర్ విజయ శంకర్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ చెన్నరాయుడు మాట్లాడుతూ.. యాజమాన్య పద్దతుల్లో ఆముదం పంట సాగు చేస్తే లాభాలు ఉంటాయన్నారు. అనంతరం కలగళ్ల, ఇప్పేరు, పి.నారాయణపురం రైతులకు 4 కిలోల చొప్పున ఐసీహెచ్–5 రకం ఆముద విత్తనాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరెడ్డి, ఏఓ విజయకుమార్, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రైలు ఎక్కబోతూ కిందపడి వృద్ధుడి మృతి అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో కదిలుతున్న రైలు ఎక్కబోయి కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన దూదేకుల సంజీవరాయుడు(60)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యర్రగుంట్లలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్న రాయుడు హోటల్లో పని చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో కుమారుడు మందలించాడు. మనస్తాపానికి గురైన రాయుడు రాత్రికి ఇంటి నుంచి వచ్చేసి యర్రగుంట్ల రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయమే మచిలీపట్నం–ధర్మవరం రైలెక్కి అనంతపురానికి చేరుకుని నీళ్ల కోసమని దిగాడు. అదే సమయంలో రైలు కదులుతుండడం చూసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మరణించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
అనంతపురం సిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులను నష్ట పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు స్పందిస్తూ.. పూత, పిందే దశలో ఉన్న వాటికి పరిహారం వర్తించదని, చెట్లు పూర్తిగా నేలమట్టమైతేనే పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో సభ్యులు ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ జిల్లా స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7 సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో శుక్రవారం జరిగింది. సీఈఓ వెంకటసుబ్బయ్య, జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు మహేష్, ఉరవకొండ జెడ్పీటీసీ సభ్యురాలు పార్వతమ్మ వేదికపై ఆశీనులయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మామిడి, అరటి రైతులను ఆదుకోవాలనే అంశంపై గోరంట్ల, ఓబుళదేవరచెరువు జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్, దామోదర్రెడ్డి మాట్లాడారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఉద్యాన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో తెలపాలని పట్టుబట్టారు. జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుంటూ ఎన్ని హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, ఎన్ని చెట్లు కూలిపోయాయ్, ఎంత మంది రైతులు నష్టపోయారో వివరాలు వెల్లడించాలని సూచించారు. అయితే ఉద్యాన శాఖ అధికారి వద్ద కనీస సమాచారం లేకపోగా, పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు మండిపడ్డారు. చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడంతో .. అంతెందుకు రైతులు చస్తేనే పరిహారం ఇస్తామని ప్రకటించండంటూ ఆవేశంతో ఊగిపోయారు. రైతులకు నాణ్యమైన కందులు సరఫరా చేయాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేష్, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని నల్లమాడ జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోషణ్ పక్వాడా నిధుల స్వాహాపై చర్యలేవీ? పోషణ్ పక్వాడా నిర్వహణకు సంబంధించి ఒక్కో జిల్లాకు రూ.5 లక్షలు చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని, వీటిని సీడీపీఓలు నొక్కేసి తూతూ మంత్రంగా ముగించారని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ, గోరంట్ల జెడ్పీటీసీ జయరాం నాయక్ ఆరోపించారు. ఆ భారమంతా సూపర్వైజర్ల మీద పడిందన్నారు. సీడీపీఓలపై చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సూపర్వైజర్లకు పంచాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి స్పందిస్తూ.. వచ్చిన డబ్బును సీడీపీఓల ఖాతాల్లో జమ చేశామని ఆధారాలు చూపారు. అయితే వాళ్లు దిగమింగిన సంగతి తనకు తెలియదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు న్యాయం చేయండి జిల్లాలోని అంబేడ్కర్, ఇతర గురుకుల పాఠశాలల్లో గతంలో సీట్లు అమ్ముకున్నారని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా పేద విద్యార్థులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ నాగరత్నమ్మ కోరారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడేలా చూడాలన్నారు. సీట్లు కావాలని ఓట్లేసిన ప్రజలు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారని, అలాంటప్పుడు వారు సిఫారసు చేస్తే కచ్చితంగా కొన్ని సీట్లు ఇచ్చేలా చూడాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోండి స్థాయీ సంఘ సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. ఓబుళదేవరచెరువు పీహెచ్సీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, అయినా అదే పాడుబడిన భవనంలో వైద్య సేవలు అందిస్తుండడంపై జెడ్పీటీసీ దాము ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ కల్పించుకుంటూ.. పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి, కొత్త భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల డిమాండ్ అరటి, మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచన చెట్లు కూలిపోతేనే పరిహారం చెల్లిస్తామని అధికారి వివరణ -
కామాంధులను కఠినంగా శిక్షించాలి
● ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ అనంతపురం టవర్క్లాక్: దళిత బాలికను గర్భవతిని చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలానికి చెందిన దళిత మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు 6 నెలల పాటు బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారన్నారు. ఫలితంగా ఆ చిన్నారి గర్భవతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ఉండేందుకు విద్యార్థినిపై సాముహిక అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అనంతపురం రూరల్: యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంబంధిత అదికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెల 8 న శిల్పారామంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జరుగుతున్న నేపద్యంలో అక్కడ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. శిల్పారామం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రత అనంతపురం: బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బీట్లు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ సహా ఏదైనా సోషల్ మీడియాల్లో అభ్యంతకరమైన పోస్ట్లు షేర్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సులభతరం చేయాలన్నారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ పి. జగదీష్ శుభాకాంక్షలు తెలిపారు. -
మీ ఊరి పక్కనే దాష్టీకం.. కనిపించలేదా?
● పరిటాల సునీతను ప్రశ్నించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడురూరల్: ‘నీ సొంతూరుకు సమీపంలోనే ఉన్న ఏడుగుర్రాలపల్లిలో బాలికను 14 మంది బ్లాక్మేల్ చేసి నెలల తరబడి అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన దాష్టీకం దృష్టికి రాలేదా సునీతమ్మా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఏడుగుర్రాలపల్లి ఘటనపై స్పందించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ తెలిసినా నీ చెవులకు సోకలేదా.. నువ్వేమైనా నిద్రపోతున్నావా అని మండిపడ్డారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచ్ ఏమి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు.. ఆంక్షల తర్వాత వెలుగు చూసిన ఈ ఘటనపై తాము మాట్లాడుతున్నామన్నారు. బాలికకు అన్యాయం చేసిన వారు ఎవ్వరైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. ఒక మహిళగా కనీస స్పందన లేకుండా... ‘వైఎస్సార్సీపీ నాయకులు బాలిక విషయంలో రాజకీయాలు చేస్తున్నారు’ అని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. నిందితులకు కఠినంగా శిక్ష పడాలంటే మీరు లాయర్లను ఏర్పాటు చేయొద్దని సునీతకు సూచించారు. బాలికకు న్యాయం చేయలేని నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బయటకు రాని ఘోరాలెన్నో..? ఏడుగుర్రాలపల్లి 40 ఏళ్లుగా మీకు రిగ్గింగ్ గ్రామమని ప్రకాష్రెడ్డి అన్నారు. అంత ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న గ్రామంలో బాలికకు ఇంతటి అన్యాయం జరిగినా మీకు తెలీలేదంటే ఎవరు నమ్ముతారు అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రామగిరి మండలంలో తొలి గ్రామం కుంటిమద్దికి రావాలంటేనే పోలీసులు మమ్మల్ని రానివ్వడం లేదన్నారు. పోలేపల్లి గుడికి వెళ్తామంటే అడ్డుకున్నారన్నారు. పరిటాల కుటుంబం ఆధిపత్యం చలాయించే గ్రామాల్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఒక్కటేనన్నారు. బయటకు రాకుండా ఎన్నిఘోరాలు.. నేరాలు జరుగుతున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. రామగిరి బంగారు గనుల గుంతల్లో వందలాది శవాలున్నాయని గతంలో చెప్పుకునేవారని గుర్తు చేశారు. ఎక్కడెక్కడో చంపి శవాలను అక్కడేశారన్నారు. మీరంటే అలాంటి భయం ఇంకా కొనసాగుతోందన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యే అయిన తనను ఆ మండలంలోకి రానివ్వాలంటే పోలీసులు భయపడుతున్నారన్నారు. అలాంటి మీ కంచుకోటలో అకృత్యం జరిగిందన్నారు. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఒక పత్రిక రాసిందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను నోరు విప్పి మాట్లాడితే రాజకీయం అంటగడుతున్నావంటే నువ్వు మహిళవేనా అని ప్రశ్నించారు. -
ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలి
● బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన అనంత అనంతపురం కార్పొరేషన్: ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, ఈ పండుగ పర్వదినాన ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని, దైవ పరీక్షలో కట్టుకున్న భార్యను వదిలి, కన్నకొడుకు ప్రాణాలు బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు. కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: ముస్లింలకు కలెక్టర్ వినోద్కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ఆనందంగా జరుపుకోవాలని, అల్లా కృపతో జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు. తాగునీటి సమస్యపై స్పందించరేం? కూడేరు: ముద్దలాపురం ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం శుక్రవారం అనంతపురం – బళ్లారి జాతీయరహదారిపై నిరసన చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అరగంటపాటు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పలువురు దళితులు మాట్లాడుతూ పీఏబీఆర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ ప్రాజెక్టు ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు తమ కాలనీకి 15 రోజులుగా నిలిచిపోయిందన్నారు. దీనికితోడు పంచాయతీ నీరు కూడా రావడం లేదన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఐ రాజు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. మోటార్ల సమస్య వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తాత్కాళికంగా ట్యాంకర్తో నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
శింగనమల: నిదనవాడ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వారం రోజులుగా జేసీబీతో తవ్వి ట్రాక్టర్లతో బయటకు తరలించి డంప్ చేసి, అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అధికారులకు విషయం తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కదిలి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. టిప్పరు, జేసీబీ, ట్రాక్టరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ● ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు మండలంలో దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఉక్కపోత పెరిగింది. గాలివేగం తగ్గింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అపార్ ఐడీ అనివార్యం అనంతపురం: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు దోహదపడినట్లే.. ప్రతి విద్యార్థికీ అపార్ ఐడీ అనివార్యమని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి పాండ్య అన్నారు. అపార్ ఐడీ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి, యూజీసీ సహకారంతో జేఎన్టీయూ అనంతపురంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి మాట్లాడుతూ విద్యార్థుల సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు భద్రపరిచేందుకు అపార్ ఐడీ దోహదపడుతుందన్నారు. ఇందులో ఎల్కేజీ నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లు, స్టడీ, ట్రాన్స్ఫర్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇలా ఎన్నో రకాల సర్టిఫికెట్లు భద్రపరచుకోవడానికి వీలు పడుతుందన్నారు. రాయలసీమ పరిధిలోని అన్ని యూనివర్సిటీల కోర్డినేటర్లు, జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఉన్న 120 కళాశాలల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జీడీ రాజేందర్, జేఎన్టీయూ అనంతపురం ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ అంకారావు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు పాతర
● అనువైన స్థానాల కోసం అడ్డదారులు ● మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద 5 ప్రత్యేక పాయింట్లు ● బదిలీల చట్టానికి తూట్లు పొడుస్తున్న కొందరు మహిళా టీచర్లు ● పెళ్లికాకుంటే చాలు ‘అవివాహిత మహిళ’ పాయింట్లు ● చిన్న వయసు టీచర్లూ ఈ పాయింట్లు పొందిన వైనం ● ఎస్జీటీ కేటగిరిలోనే 30 మందికి పైగా అక్రమంగా పాయింట్లు అనంతపురం ఎడ్యుకేషన్: అనువైన స్థానాల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన గురువులే వక్రమార్గాన పాయింట్లు పొందాలని చూస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు. కొందరు అనర్హత కల్గిన మహిళా టీచర్లు ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద పాయింట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి కాకుంటే చాలు ఈ పాయింట్లు పొందుతున్నారు. దాదాపు 30 మంది ఎస్జీటీల సీనియార్టీ జాబితాలో ఇలాంటి టీచర్లు ఉండడం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఎక్కువగా బ్రహ్మసముద్రం, రొళ్ల, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, మడకశిర, రాయదుర్గం, అమడగూరు, కంబదూరు, అగళి, గుడిబండ, కుందుర్పి మండలాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లు ఎక్కువగా అక్రమంగా పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాను పరిశీలించిన పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారే అర్హులు బదిలీల చట్టం జీవో 22 ప్రకారం మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అన్మ్యారెడ్ ఉమెన్’ (అవివాహిత) కేటగిరీ కింద 5 స్పెషల్ పాయింట్లు పొందేందుకు అర్హులు. ఈలెక్కన 1985 మే 31కి ముందు జన్మించి ఉండాలి. అయితే 1987 నుంచి 1999 మధ్య జన్మించిన వారు దాదాపు 30 మంది దాకా అవివాహిత పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 26, 27 ఏళ్ల మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. జీఓలో చాలా స్పష్టంగా ఇచ్చినా కూడా ఇలా దరఖాస్తు చేశారంటే అడ్డదారులోల పాయింట్లు పొందేందుకేనంటూ ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారందరికీ ఆ పాయింట్లు తొలగిస్తామని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. ఎవరు సహకరించారో... ఎస్ఏ (ఫిజికల్ సైన్స్) బదిలీల్లో భాగంగా సీనియారిటీ లిస్టులో 38వ నంబర్లో ఉన్న రాఘవేంద్ర ప్రస్తుతం కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. రీఅపోర్షన్లో ఆయన పోస్ట్ పోయింది. ప్రస్తుత స్టేషన్లో 2023 నుంచి 2025 వరకు పనిచేశారు. అంతకు మునుపు స్టేషన్లో 2017 నుంచి 2023 వరకు పనిచేశారు. ప్రీవియస్ స్టేషన్ పాయింట్లు వాడుకున్నా 17.5055 రావాలి. కానీ 8 ఏళ్లు పని చేసినట్లు 24 పాయింట్లు వేసుకున్నారు. ఈ విషయం గ్రీవెన్స్ సమయంలో ఎంఈఓకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ స్వయంగా డీఈఓ కాఆర్యలయానికికి వెళ్లి 24 పాయింట్లు తొలగించి 17.5055 మా పాయింట్లు వేయించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఎవరు సహకరించారో తెలీదు కానీ 24 పాయింట్లు వేసుకున్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్లో కాలువపల్లి జెడ్పీహెచ్ఎస్కు వచ్చారు. ఈయనకంటే ఎక్కువపాయింట్లు ఉన్న టీచర్లకు అన్యాయం జరిగింది. ఈ వ్యవహారంపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి డీఈఓకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్లకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కౌన్సెలింగ్ అర్దరాత్రి దాటేదాకా సాగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని 686 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ సాగింది. మున్సిపల్ పాఠశాలల్లో 304 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో 52 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 26, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 304 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లలో పోస్టులకు 1:2, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పోస్టులకు 1:3 రేషియో ప్రకారం టీచర్లను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పదోన్నతులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సౌకర్యవంతమైన ఖాళీలు లేకపోవడంతో చాలామంది పదోన్నతులు తీసుకోలేదు. మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. కౌన్సెలింగ్ హాజరైన టీచర్లతో ఆప్షన్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. వారందరికీ శనివారం పదోన్నతుల ఉత్తర్వులు జనరేట్ కానున్నాయి. వీరితో పాటు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలు (స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లు) అందరూ శుక్రవారం వారి పాత స్కూళ్లలో రిలీవై.. శనివారం ఉదయం కొత్త స్కూళ్లల్లో చేరాల్సి ఉంటుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర్వులు జనరేట్ అయ్యాయి. ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే వివరాలను రాత్రి 12 గంటలు దాటినా విద్యాశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోస్టర్ రగడ కార్పొరేషన్ పరిధిలోని స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో అధికారులు రోస్టర్ పాటించడం లేదంటూ రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు రగడ చేశారు. రోస్టర్ సక్రమంగా పాటించాలంటూ ఆ సంఘం జిల్లా ప్రధానకార్యర్శి ఎస్.రామాంజనేయులు డిమాండ్ చేశారు. కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆర్జేడీ... ఈ విషయంపై జేడీ సర్వీసెస్తో ఫోన్లో మాట్లాడి స్పష్టత ఇచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కనీస వసతులు లేక అల్లాడిన టీచర్లు సాయంత్రంలోపు కౌన్సెలింగ్ ముగుస్తుందని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అర్ధరాత్రి దాటినా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా ఆయా కేంద్రాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. పెద సంఖ్యలో వచ్చిన టీచర్లు సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. వసతుల కల్పనలో విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. మున్సిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో కౌన్సెలింగ్ జిల్లాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో.. పర్యవేక్షించిన పాఠశాల విద్య ఆర్జేడీ -
● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!
బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా మాంసం కోసం పెంచే పొట్టేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ బక్రీద్ పండుగ నేపథ్యంలో విక్రయించే జీవాలకు బరువుతో పని లేదు. కేవలం రూపం, వాటి ఆరోగ్యాన్ని మాత్రమే చూస్తారు. దీంతో సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండుగ ఎలా చేసుకోవాలని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఆత్మకూరు: -
ఆర్ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన మృతదేహం గుర్తింపు
ఉరవకొండ: ఓ ఆర్ఎంపీ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం సిద్దారాంపురం గ్రామానికి చెందిన ఆవుల గోపాలరెడ్డి, సువర్ణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు మంజునాథ్రెడ్డి ఉన్నారు. కుమారుడు గ్రామంలోనే ఆర్ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం మంజునాథరెడ్డి (30)పై పడింది. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడికి పెళ్లి చేయాలని తల్లి సంబంధాలు చూస్తోంది. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి పెంచుకున్న మంజునాథ్ ఈ నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 5న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉరవకొండ మండలం పెన్నహోబిలం గుట్టల్లో కాలిపోయిన ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో సీఐ మహనంది, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెన్నహోబిలంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడిని మంజునాథ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ నేతల ఇళ్ల వద్ద విత్తన కాయల రిజిస్ట్రేషన్! బుక్కరాయసముద్రం: మండలంలోని చెన్నంపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన ఇళ్ల వద్ద వ్యవసాయ సిబ్బంది కూర్చొని విత్తన కాయల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారని వైఎస్సార్సీపీ నాయకులు వెంకటరెడ్డి ఆరోపించారు. గ్రామంలో సచివాలయం ఉండగా వ్యవసాయ అధికారులు టీడీపీ నేతలు చెప్పిన చోట రిజిస్ట్రేషన్లు చేపట్టడం దారుణమన్నారు. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టి విత్తన పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని కోరారు. బ్రెయిన్ డెడ్ బాలుడి అవయవ దానం కళ్యాణదుర్గం రూరల్: బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. మృతిచెందిన తర్వాత తమ కుమారుడు మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడనే భావంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మరీ అవయవదానానికి అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి... కళ్యాణదుర్గం మండలం గరుడాపురం – కొత్తూరు గ్రామాల మధ్య మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమై అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహరి (18) బ్రెయిన్ డెడ్ అయినట్లు గురువారం వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు అనసూయమ్మ, ఈరన్న, సోదరి సింధూజ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీవన్ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులు... శ్రీహరి అవయవాలను దానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయవచ్చని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించడంతో అంతటి దుఃఖంలోనూ వారు అంగీకారం తెలిపారు. దీంతో శ్రీహరి గుండె, కళ్లు, కిడ్నీలను జీవన్దాన్ ప్రతినిధులు సేకరించి అత్యవసరమైన రోగుల కోసం మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఇంటర్ వరకూ చదువుకున్న శ్రీహరి... కొత్తూరు గ్రామంలోనే తల్లిదండ్రులకు వ్యవసాయ వనుల్లో చేదోడుగా ఉండేవాడు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన శ్రీహరి తల్లిదండ్రులను వైద్య సిబ్బంది అభినందించారు. -
అన్నదాతకు రిక్తహస్తం!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం అమలులో నిబంధనల తిరకాసు అన్నదాతలను తీరని ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు సైతం కొర్రీలతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో సవాలక్ష సాకులు వెతికి అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యాచరణ చేపట్టారు. రాయదుర్గం: అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. బాలారిష్టాలను దాటి ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నా... పథకం లబ్ధి పొందేందుకు రైతులకు కొత్త చిక్కులు తప్పడం లేదు. గతంలో చేపట్టిన రీసర్వేను సాకుగా చూపి అర్హుల జాబితా నుంచి చాలా మందిని తొలగించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ కుట్ర కాస్త బహిర్గతం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిక్కుముడులు విప్పకనే తుది జాబితా! కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6 వేలతో పాటు మిగిలిన రూ.14 వేలను రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలను అందించనుంది. దీనికి వెబ్ల్యాండ్ను అనుసంధానిస్తూ పరిశీలన ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోంది. రీ–సర్వేల్లో భాగంగా కొందరు రైతుల ఆధార్, సెల్ నంబర్తో పాటు ఇతర వివరాలనూ అధికారుల నమోదు చేయకపోవడం, ఆన్లైన్లో భూములున్నా ఆధార్ అనుసంధానికి రెవెన్యూ అధికారులు చుక్కలు చూపడం లాంటి కారణాలు వెరసి తహసీల్ధార్, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ రైతులు నిత్యం తిరిగి వేసారి పోతున్నారు. వెబ్ల్యాండ్లో పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో చాలా మంది రైతులు అనర్హులుగా మిగిలిపోయారు. డి.హీరేహాళ్ మండలంలో ఓ అధికారి నిర్వాహకంతో రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. వెబ్ల్యాండ్లోని చిక్కుముడులను విప్పకనే తుది జాబితాకు అధికారులు సిద్ధం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాదిగా ఇదే నాన్చుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఖరీఫ్ ఆరంభానికి ముందే రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తూ వచ్చారు. విత్తు నుంచి విపత్తుదాక వెన్నంటే నిలిచారు. ఏటా రెండు లక్షల మందికి పైగా రైతులకు రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఐదేళ్ల పాటు రైతులకు రూ.1879.29 కోట్ల సాయాన్ని అందించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకంగా నామకరణం చేసి అమలులో ఏడాది పాటు నాన్చుడు ధోరణి అవలంభిస్తూ వచ్చింది. దీనిపై అన్నదాతల్లో అసహనం వ్యక్తం కావడంతో ఓ మెట్టు దిగి వచ్చిన కూటమి సర్కార్... పథకం అమలు పేరుతో కొర్రీలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలో 4.74 లక్షల మంది రైతులుండగా వీరిలో 2,98,535 మందికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలులో కనిపించని కష్టాలు సవాలక్ష నిబంధనలతో రైతుకు తప్పని తిప్పలు అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యచరణ -
ముగిసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
తాడిపత్రి టౌన్: స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీలు తాడిపత్రిలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల కరస్పాండెంట్ సతీష్రెడ్డి, నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. వాహనం ఢీకొని వృద్ధుడి మృతి రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామానికి చెందిన బుంగ లింగారెడ్డి (75), అదే గ్రామానికి చెందిన హరిజన సాకే వెంకటరమణ ద్రాక్ష కొమ్మల కటింగ్ పనితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రామినేపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై రాప్తాడు వద్ద ఉన్న పెట్రోలు బంక్ వద్దకు చేరుకుని అక్కడ తమ వాహనాలను నిలిపి మిగిలిన కూలీలతో కలసి ఆటోలో ద్రాక్ష తోటలకు వెళ్లి పనులు ముగించుకుని వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం గార్లదిన్నె వద్ద ద్రాక్ష కటింగ్కు వెళ్లాల్సి ఉండడంతో తన స్కూటీపై సాకే వెంకటరమణతో కలసి లింగారెడ్డి బయలుదేరాడు. తెల్లవారుజామున 5.15 గంటలకు రాప్తాడు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఐచర్ షోరూమ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. ఘటనలో బుంగ లింగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన వాహనంతో సహా ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన సాకే వెంకటరమణను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, బుంగ లింగారెడ్డికి భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. -
●ఈ కలయికకు 50 ఏళ్లు!
యాడికి: మండలంలోని రాయలచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారిలో 21 మంది అదే పాఠశాల వేదికగా గురువారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు తమకు విద్యాబుద్దులు నేర్పి మృతి చెందిన నాటి గురువులు, తమ ఐదుగురు స్నేహితులకు నివాళులర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థి నాగరంగయ్య మాట్లాడుతూ.. రాయలచెరువులోని నం.1 ప్రాథమికోన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకోగా... 1974లో పాఠశాలను ఉన్నత పాఠశాల అప్గ్రేడ్ చేయడంతో తాము మొదటి బ్యాచ్ విద్యార్థులుగా పాఠశాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు నాగరంగయ్య, శివప్రసాద్, సత్యరంగయ్య, విశ్వనాథ్, శ్రీనివాసులు, రామకృష్ణ నేతృత్వం వహించగా ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు డేనియల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
ప్రైవేట్ వాహనదారుల ఘర్షణ
ఉరవకొండ: స్థానిక టీడీపీ ముఖ్యనేత ఆశీస్సులతో కూడేరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ఏడాదిగా అనంతపురం – ఉరవకొండ మార్గంలో అనధికార షటిల్ సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రైవేట్ వాహనాలను అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాల వాగ్వాదం చెలరేగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టి దాదాపు 150 మంది వాహనాలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. తాము మూడు నెలలకు రూ.8.960 రోడ్ ట్యాక్స్ కట్టి, ఈఎంఐలు చెల్లిస్తున్నామన్నారు. టీడీపీ నేతల వాహనాలు కాదని ఇతరుల వాహనంలో ప్రయాణికులు ఎక్కబోతే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. చివరకు ఆటోల్లో సైతం ప్రయాణికులను అనుమతించడం లేదన్నారు. తమతో పాటు గవిమఠంలోని వాహన స్టాండ్లో వాహనాలు పెట్టి క్రమ పద్ధతిలో బాడుగకు తిప్పుకుంటే అభ్యంతరం లేదన్నారు. అలా కాదని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెట్టి దోపిడీ చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికై నా ఆర్టీసీ, ఆర్టీఓ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాలని కోరారు. -
బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం
గుత్తి: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీలో నివాసముంటున్న జంగాల పుల్లయ్యకు చెందిన బిందెల షెడ్డులో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డులో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. షెడ్డు లోపల ఉంచిన బైక్, బిందెలతో పాటు కోళ్లూ కాలిపోయాయి. అర్ధరాత్రి కావడంతో మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. దీంతో రూ.5 లక్షలు వరకు నష్ట పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి’ వజ్రకరూరు: ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ... కౌలు రైతులు గుత్తలు ముందుగానే చెల్లించి పంటలు పండిస్తున్నారన్నారు. నూతన కౌలు చట్టం అమలు చేసి కౌలు రైతులందరికీ గ్రామసభల ద్వారా సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ రైతులకు వర్తించే అన్ని సౌకర్యాలతో పటు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అద్యక్షుడు రంగారెడ్డి, జిల్లా నాయకుడు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, రైతుసంఘం జిల్లా ఉపాద్యక్షుడు విరూపాక్షి పాల్గొన్నారు. -
అభిప్రాయ సేకరణ చేపట్టాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జనాభా నిర్వహణ విధానం పాలసీపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ పక్కగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘జనాభా నిర్వహణ విధానం, ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయం మార్గదర్శనం’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్య సంప్రదింపుతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు అందజేసి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, సీపీఓ అశోక్కుమార్ పాల్గొన్నారు. యువకుడి దుర్మరణం గుత్తి: పట్టణ నడిబొడ్డున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం కొట్టాలపల్లికి చెందిన కార్తీక్ (24), శివరామిరెడ్డి గుత్తిలో గురువారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గుత్తిలోకి చేరుకోగానే యాడికి గ్రామానికి చెందిన బషీర్, రమేష్ వెళుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో రోడ్డుపై కుడి వైపు పడిన కార్తీక్ను గమనించి లారీ డ్రైవర్ బ్రేక్ వేసే లోపు చక్రం దూసుకెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ వెనుక బైక్పై కూర్చొన్న శివరామిరెడ్డి, మరో బైక్పై ఉన్న రమేష్, బషీర్ రోడ్డుకు ఎడమ వైపు పడటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో వారు బయటపడ్డారు. మృతుడు బేల్దారి పనులతో కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. పోటీలకు కవితల ఆహ్వానం అనంతపురం కల్చరల్: ఈ నెల 16నవిన్సెంట్ ఫెర్రర్ స్మారక కవితా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ గురువారం పోస్టర్లను కొప్పల మీనాక్షమ్మ ఫౌండేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలుగు వెలుగు సాహితీ సంస్థ టీవీరెడ్డి, ఆశ్రయ కృష్ణారెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, లఘుచిత్రాల కెమెరామెన్ లింగాల పవన్ తదితరులు మాట్లాడారు. ఈనెల 16న విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ‘ఆర్డీటీ సేవలు– అభాగ్యులకు వరాలు’ పేరిట కవితా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 10వ తేదీలోపు తమ కవితలను 73828 63523 నంబర్కు పంపాలన్నారు. -
విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి
ఆత్మకూరు: విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వాలని కలెక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పంపనూరు రైతు సేవా కేంద్రం వద్ద ఎమ్మెల్యే సునీతతో కలిసి విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తన వేరుశనగ లోడ్లను వ్యవసాయ సిబ్బంది తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నాణ్యతగా లేకుంటే వెనక్కు పంపాలని సూచించారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ రైతులు విత్తన వేరుశనగ బస్తాలను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యతగా లేకపోతే వెనక్కిఇవ్వాలని సూచించారు. జిల్లాకు విత్తన వేరుశనగ కేటాయింపు తక్కువగా ఉందని, రైతుల నుంచి డిమాండ్ దృష్ట్యా ఎక్కువ విత్తనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డీసీ రామ్మోహన్, ఏడీఏ రవి, ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏఈఓ సుజిత పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంపనూరు నగర వనంలో ఎమ్మెల్యే సునీతతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించాలన్నారు. కార్యక్రమంలో సీఎఫ్ఓ యశోదబాబు, డీఆర్ఓ మలోల, తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పంచివ్వలేదని తల్లిపై దాడి పెద్దపప్పూరు: ఆస్తిలో వాటా పంచలేదనే కోపంతో తల్లిపై తనయుడు దాడి చేసిన సంఘటన పెద్దపప్పూరు మండలం గార్లదిన్నెలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గార్లదిన్నెకు చెందిన సరస్వతికి శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, వేణు సంతానం. గురువారం రెండో కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి తనకు ఆస్తి పంచిలేదంటూ తల్లి సరస్వతితో ఘర్షణకు దిగాడు. తల్లిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు గురువారం విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్టీయూ (ఏ) వెబ్సైట్ చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నీటి తొట్టెలో పడి బాలుడి మృతి పెద్దవడుగూరు: నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిత్రచేడు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిత్రచేడుకు చెందిన అరుణ, ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కుమారుడైన ఏడాదిన్నర వయసున్న అరుణ్ దీప్ గురువారం ఆడుకొంటూ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. తర్వాత ఎంత సేపటికీ లోపలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు బయటకు రాగా.. నీటి తొట్టెలో అరుణ్ దీప్ అచేతన స్థితిలో కనిపించాడు. బయటకు తీసి వెంటనే పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అరుణ్ దీప్ మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనాల్లో శుక్రవారం నిర్వహించనున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన సమావేశ భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన ప్రారంభమవుతాయని వివరించారు. గత సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సంబంధించిన వివరాలపై సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని సూచించారు. ● స్థాయీ సంఘ సమావేశాల్లో ఐసీడీఎస్లో పోషణ్ పక్వాడా నిర్వహణకు మంజూరైన నిధులు రూ.5 లక్షలు ఖర్చు పెట్టకుండా సీడీపీఓలు వాడుకోవడం, ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కార్పొరేట్ హంగులతో కార్యాలయాలు ఉండాలన్న కలెక్టర్ వినోద్కుమార్ ఆశయం మేరకు ఐసీడీఎస్లో రూ.5 కోట్లతో ఆధునికీకరించిన వాటిని ఆర్నెల్లకే పీకి పడేయడంపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. ముంగారు సేద్యాలు మొదలైన కారణంగా ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువుల ఊసే లేకపోవడం, పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల మంజూరు అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించే పరిస్థితి ఉంది. కరోనా మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ పెట్టకపోవడంపైనా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాల సరఫరాతో పాటు ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచే అంశంపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలు, బెంగళూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు విడతలుగా ఈనెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డీఈఓ పరిధిలోని కేంద్రాలకు పరిశీల కులుగా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును నియమించారు. పరీక్షలయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటూ కేంద్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాలకు డిపార్ట్ మెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు అనంతపురం అర్బన్: డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. నగరంలో ఏడు కేంద్రాలు, గుత్తి, తాడిపత్రి పట్టణాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రెండు సెషన్లుగా పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. డీఎస్సీ నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారన్నారు. కేంద్రానికి ఒకరు చొప్పున ఏడు కేంద్రాలకు డిప్యూటీ కలెక్టర్లను ఇన్చార్జ్లుగా నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్లు రోజూ పరీక్ష కేంద్రాలు తనిఖీ చేయాలని చెప్పారు. తాను కూడా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, డీఎస్పీ వెంకటేషులు, డీఈఓ ప్రసాద్బాబు, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు జిల్లా పరిశీలకులుగా జేడీ సుబ్బారావు -
హత్యకు పన్నాగం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో కూటమి పాలనా పగ్గాలు చేపట్టి మరో వారానికి ఏడాదవుతుంది. ఇంతలోనే ‘తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం’ విస్మయం కలిగిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారాలతో రోజుకో నేత విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమై గ్రూపులతో అట్టుడుకుతోంది. మొన్న వెంకటేశులు.. నిన్న చంటి ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరుపై అర్బన్ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా విభేదిస్తూ దూరమవుతున్నారు. మొన్నటికి మొన్న మినీ మహానాడులో తనను ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ సాకే వెంకటేశులు అనే వ్యక్తి పురుగుల మందు తాగారు. ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్నటికి నిన్న ఎమ్మెల్యే అనుచరులు తన ఇళ్లు కూల్చడానికి వచ్చారంటూ చంటి అనే టీడీపీ ముఖ్య నేత పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సుధాకర్నాయుడు ఫిర్యాదు కలకలం.. మొదటినుంచి అనంతపురం అర్బన్లో టీడీపీ నేతగా సుధాకర్నాయుడుకు పేరుంది. ఈయన్ని లిక్కర్ సుధాకర్ అనికూడా అంటారు. గత కొంతకాలంగా సుధాకర్కు ఎమ్మెల్యేతో విభేదాలు నెలకొన్నాయి. జిల్లా పార్టీ పరిశీలకులు కోవెలమూడు రవీంద్ర (నాని) పంచాయితీ చేసినా రాజీ కుదరలేదు. ఈ క్రమంలోనే.. తనకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి భార్యతో కలిసి ఎస్పీకి సుధాకర్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. టీడీపీకి తొలి నుంచి విధేయుడిగా ఉన్న సుధాకర్కే ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మిగతా కేడర్లో భయం మొదలైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గురువారం అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సుధాకర్నాయుడు, ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడ వెళ్లివచ్చారు. ఈ క్రమంలోనే రాత్రి సుధాకర్ నాయుడు అనంతపురం డీఎస్పీని కలవడం చర్చనీయాంశమైంది. తొలి నుంచీ ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి.. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అనంతపురం టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా వేరుకుంపటి పెట్టి నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నియోజకవర్గంలో కబ్జాలు, మద్యం వంటి వాటిపై ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్ రాజకీయంగా ఏకాకి అయ్యారని అంటున్నారు. పాలన చేపట్టి ఏడాది గడవకముందే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని టీడీపీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది. అనంత టీడీపీలో తారస్థాయికి కుమ్ములాటలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ముఖ్య నాయకులు ఇటీవల ‘మినీ మహానాడు’లో పురుగుల మందు తాగిన వెంకటేశులు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని సుధాకర్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు తొలినుంచీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి ఎమ్మెల్యే దగ్గుపాటిపై అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువసుధాకర్ నాయుడు హత్యకు అదే పార్టీకి చెందిన మరోవర్గం పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. తన వర్గం వారిని కావాలనే వేధిస్తున్నారని సుధాకర్ నాయుడు ఎమ్మెల్యేను ప్రశ్నించడం మొదలు పెట్టడం, వైన్షాపుల వ్యవహారాల్లో తేడా రావడంతో హత్య చేయాలని భావించారనే అనుమనాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఇద్దరు ఈ దురాగతానికి యత్నించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు అడుగడుగునా అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతోనే అతన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. టీడీపీలోనే ఓ వర్గం నాయకుణ్ని మరో వర్గం నాయకులు చంపడానికి యత్నించడమనేది ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ఎస్ఏ పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురంం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల టీచర్లు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1:2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని విద్యాశాఖ అధికారులు చెప్పినా... మొత్తం 382 పోస్టులు ఖాళీలుంటే, 372 మంది ఎస్జీటీలు రావడం విశేషం. యాజమాన్యాల వారీగా పరిశీలిస్తే... ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు కలిపి 26 ఖాళీలుంటే 21 మంది ఎస్జీటీలు, మునిసిపల్ పాఠశాలల్లో 304 ఖాళీలుంటే 300 మంది, మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 52 ఖాళీలుంటే 52 మంది హాజరయ్యారు. శుక్రవారం మండల పరిషత్ పాఠశాలల టీచర్లకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జిల్లాపరిషత్ స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు కలిపి 350 దాకా ఖాళీలున్నట్లు లెక్కలు తేల్చారు. మండల్ పరిషత్ టీచర్లతో పాటు ప్రభుత్వ, మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు శుక్రవారం కూడా సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బదిలీ ఉత్తర్వుల కోసం స్కూల్ అసిస్టెంట్లు ఎదుచూపు బదిలీల ఉత్తర్వుల కోసం స్కూల్ అసిస్టెంట్లు ఉదయం నుంచి ఎదురుచూశారు. ముందురోజే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఆర్డర్స్ జనరేట్ అవుతాయని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రిదాకా వేలాది మంది టీచర్లు బదిలీ ఉత్తర్వులు కోసం ఎదురుచూశారు. తరచూ సెల్ఫోన్లు చూసుకోవడం, డీఈఓ కార్యాలయ సిబ్బందిని ఆరా తీయడం, ఉపాధ్యాయ సంఘాల నాయకులను వాకబు చేయడం, రాష్ట్రంలోని సంఘాల నాయకులను ఆరా తీయడం కనిపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జనరేట్ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 4,589 మంది దరఖాస్తు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,589 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 2,456 మంది తప్పనిసరి, 2,133 మంది టీచర్లు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే..,. బయలాజికల్ సైన్స్ 631 మంది, ఇంగ్లిష్ 656, హిందీ 383 మంది, కన్నడ ముగ్గురు, గణితం 847 మంది, పీడీలు 262 మంది, ఫిజికల్ సైన్స్ 616 మంది, సంస్కృతం ఏడుగురు, సోషల్ 544 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ 37 మంది, తెలుగు 584 మంది, ఉర్దూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు మండల పరిషత్ పాఠశాలల టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన పదోన్నతి పంచాయితీ ఇటీవల జరిగిన హెచ్ఎం పదోన్నతుత్లో నాట్ ఆప్టెడ్ (ప్రస్తుతం పదోన్నతి ఇష్టం లేదు) ఇచ్చిన ఓ స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు పదోన్నతి కావాలని అడుగుతున్నాడు. ఈ విషయం విద్యాశాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. వివరాలు.. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతులకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ధర్మవరం మునిసిపల్ బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ టీచరు... పదోన్నతి జాబితాలో ఉన్నాడు. వాస్తవానికి ఇదే స్కూల్లో హెచ్ఎం పోస్టు ఖాళీ ఉంది. తాను హెచ్ఎం పదోన్నతి తీసుకుని ఇదే స్కూల్కు రావాలని ఆయన భావించాడు. అయితే, సీనియార్టీ జాబితాలో ఈయనకంటే ముందు మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. సదరు టీచరు కౌన్సెలింగ్కు హాజరైనప్పుడు ధర్మవరం బాలికల పాఠశాల పోస్టు ఖాళీగానే ఉంది. నిబంధనల ప్రకారం 50 ఏళ్లు దాటిన పురుష టీచరు బాలికల పాఠశాల కోరుకున్నా... ఆయన వెనక (చివరిస్థానంలో ఉన్నాసరే) ఉన్న మహిళా టీచరు సదరు బాలికల పాఠశాల కోరుకుంటే ఆయన వెనక్కు రావాల్సిందే. ఆ సమయంలో మిగులుగా ఉన్న స్కూళ్లకు కేటాయిస్తారు. ఇదే విషయాన్ని సదరు టీచరుకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన పదోన్నతి వద్దని ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఆ టీచరు వెనుక మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. అక్కడితో ఖాళీలన్నీ పూర్తవుతాయి. ఇద్దరూ పదోన్నతి పొందారు. పురుష టీచరు తీసుకోకపోవడంతో సీనియార్టీ జాబితాలోని మూడో టీచరుకు అవకాశం కల్పించారు. తాజాగా నాట్ ఆప్టెడ్ ఇచ్చిన సదరు టీచరు రంగంలోకి దిగి డీఈఓపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు చేయించినట్లు తెలి సింది. దిక్కు తెలీని అధికారులు... ఆయన పదోన్నతి తీసుకున్న ముగ్గురు టీచర్లను పిలిపించి చివరి టీచరు రివర్షన్ వెళ్లాలని సూచించారు. ఇందుకు సదరు టీచరు ససేమిరా అంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
రంగయ్య పాదయాత్రపై కూటమి కుట్రలు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారు. గురువారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామంలో మొదలైన పాదయాత్ర మధ్యాహ్నానికి బొమ్మగానిపల్లి తండాకు చేరుకుంది. అక్కడి నుంచి బొమ్మగానిపల్లి చేరుకుని సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి కొనసాగాల్సి ఉంది. తమ్ముళ్లను ఉసిగొల్పిన వైనం.. రంగయ్య పాదయాత్ర టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయనయ వర్గీయులకు మింగుడు పడటం లేదు. పాదయాత్రను కొనసాగిస్తే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని భయపడిన వారు యాత్రను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. గురువారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి నుంచి పాదయాత్ర సాగాల్సిన రాయలదొడ్డి రహదారిపై ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. గో బ్యాక్ రంగయ్య అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చేందుకు ఒక్కో బైకుకు రూ.200 పెట్రోల్ వేయించడంతో పాటు క్వార్టర్ బాటిల్ సరఫరా చేసినట్లు తెలిసింది. భారీగా మోహరించిన పోలీసులు పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నిన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో బొమ్మగానిపల్లికి చేరుకోవడంతో పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామంలో మోహరించారు. రంగయ్య శాంతియుత పాదయాత్రకు బుధవారం ఆటంకం కలిగించిన పోలీసుల తీరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులూ రావడంతో బొమ్మగానిపల్లిలో సుమారు 8 గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు కష్టాలు.. మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడానికి వచ్చిన టీడీపీ శ్రేణుల అత్యుత్సాహంతో సామాన్య ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. సాయంత్రం బొమ్మగానిపల్లి మీదుగా బుడిమేపల్లికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సుకు ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు అడ్డంగా బైఠాయించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని అరగంట తర్వాత బస్సును పంపించివేశారు. అదేవిధంగా కన్నేపల్లి, రాయలదొడ్డికి వెళ్లే వాహనదారులను సైతం వదలకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. టీడీపీ శ్రేణులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే అమిలినేని వర్గీయులు బైకుకు రూ.200 పెట్రోల్... ‘తమ్ముళ్ల’కు క్వార్టర్ బాటిల్ సరఫరా రోడ్డుపై బైఠాయించి హల్చల్ చేసిన ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు -
8 మంది తహసీల్దార్లకు స్థానచలనం
అనంతపురం అర్బన్: జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కోసం 16 మంది తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతగా 8 మందిని బదిలీ చేశారు. ఖాళీ స్థానాలను భర్తీ చేయని వైనం.. జిల్లాలో కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, కణేకల్లు, యల్లనూరు తహసీల్దార్లతో పాటు అనంతపురం ఆర్డీఓ కార్యాలయం డీఏఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డీ.హీరేహాళ్ తహసీల్దారును బెళుగుప్పకు బదిలీ చేశారు. శెట్టూరు తహసీల్దారు ఈ నెల 2న ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయ డీఏఓని నియమించారు. ఇన్చార్జ్ పాలనలో ఉన్న ఆరు మండలాలకు తహసీల్దార్లను, అనంతపురం ఆర్డీఓ కార్యాలయ డీఏఓని తొలివిడతలో నియమించలేదు. -
టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతల స్కెచ్!
సాక్షి, అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు వైరం ఊహించని మలుపు తిరిగింది. టీడీపీ నేత హత్యకు టీడీపీ నేతలే కుట్రపన్నడం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం అప్రమత్తమైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత సుధాకర్ నాయుడి హత్యకు ఎమ్మెల్యే అనుచరులు స్కెచ్ వేయడం పోలీసుల నిఘాలో బయటపడింది. ఇంట్లోకి చొరబడి మరీ సుధాకర్ను హత్య చేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ వేశారు. అయితే.. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఈ విషయం కూడా వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుధాకర్ నాయుడు హత్య కుట్రను భగ్నం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ ఎపిసోడ్తో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఇద్దరిని అమరావతికి పిలిపించుకుని రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తోంది. -
‘వెన్నుపోటు దినం’ జయప్రదం
సూపర్ సిక్స్తో సహా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ప్రజా సంక్షేమం విస్మరించి అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో కడుపు మండిన ప్రజలు కూటమి సర్కారు వంచనపై గర్జించారు. కూటమి నేతల కుట్రలను ఛేదించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘వెన్నుపోటు’ దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఉప్పెనలా కదం తొక్కారు. అధికారులకు వినతిపత్రాలతో నిరసన తెలియజేశారు. అనంతపురం కార్పొరేషన్: కూటమి సర్కారు నయ వంచనను ఎండగట్టేందుకు,చంద్రబాబు సర్కార్ను మేలుకొలిపేందుకు వైఎస్సార్ సీపీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది.అనంతపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వ ర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమే‹Ùగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు పాల్గొన్నారు. ట నార్పలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ స్థానిక వాలీ్మకి ఆలయం నుంచి ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, బోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. ⇒ ఉరవకొండలో సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఉరగాద్రి ఆలయం నుంచి టవర్ క్లాక్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సూపర్సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ⇒ గుంతకల్లులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆ«ధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమికి డిపాజిట్లు రావన్నారు.కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, గుంతకల్లు ఎంపీపీ మాధవి, గుత్తి పట్టణ కనీ్వనర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ⇒ రాయదుర్గంలో సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ వినాయక సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది.ఎమ్మెల్సీ శివరామి రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాలకూ చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. ⇒ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలతో ముందుకెళ్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఏడాదిగా ఒక్క హామీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, నేతలు ఉమా, వెంకటేశులు, తిమ్మరాయడు పాల్గొన్నారు. ⇒ యాడికి మండల కేంద్రంలో ‘వెన్నుపోటుదినం’ నిరసన ర్యాలీ... కార్యక్రమ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలోజరిగింది. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. సుధాకర్ బాబు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు హర్షవర్దన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడలు వంచుతాం.. అనంతపురంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను గుప్పించి ఇంత వరకు ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరే‹Ùకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. హంద్రీ –నీవా కాలువ సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకే పరిమితం చేసి భవిష్యత్తులో నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బంది తలెత్తేలా చేశారన్నారు. -
ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
యల్లనూరు: ‘హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే తాడిపత్రికి పంపుతానని హామీ ఇచ్చారు. న్యాయస్థానం నుంచి ఆ మేరకు ఉత్తర్వులు తెచ్చుకుంటే ఏవేవో కారణాలు చెబుతూ అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదు. జిల్లా ఎస్పీ గారు.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు. కావాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయండి’ అంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యాడికి మండలంలో ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలో పాల్గొనేందుకు కార్యకర్తలతో బయల్దేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు తెల్లవారుజామునే డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పెద్దారెడ్డి స్వగ్రామమైన మండలంలోని తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఇంటి నుంచి మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ‘మీరు కాకుండా మీ తరఫున ఎవరైనా యాడికి వెళ్లొచ్చు’ అంటూ డీఎస్పీ తెలుపగా పెద్దారెడ్డి తన కుమారుడు హర్షవర్దన్రెడ్డిని పంపించారు. ఈ క్రమంలోనే తనను ఎస్పీ వద్దకు తీసుకెళ్లాలని పెద్దారెడ్డి పోలీసులు పట్టుబట్టగా పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ తీరుపై విమర్శలు గుప్పించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాట వింటూ తనపై ఎస్పీ జగదీష్ కక్ష కట్టారని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్ను సైతం పక్కన పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల వరకు వస్తే చట్టాలు.. మా వరకు వస్తే సాకులు చెబుతారా అని ప్రశ్నించారు. ఎస్పీకి ఆరు సార్లు మెయిల్ పెట్టినా పట్టించుకోలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాము ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు. భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వస్తామని, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఇటీవల తిమ్మనచెరువు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. తాడిపత్రి జేసీ నాగిరెడ్డి జాగీరు కాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు వెంకటేష్నాయుడు, నాయకులు గొడ్డుమర్రి ఈశ్వర్రెడ్డి, దంతలపల్లి పెద్దిరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, కల్లూరు సూరి, కొత్తపల్లి పురుషోత్తం నాయుడు, వెంకటాంపల్లి శంకర్రెడ్డి, యల్లనూరు కిరణ్, చిలమకూరు జనార్థన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు కావాలంటే రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేయండి కోర్టు అనుమతి ఇచ్చినా జేసీ మాట విని అడ్డుకుంటారా? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజం -
‘రిక్వెస్ట్’ కాస్త ‘కంపల్సరీ’ అయింది
● తాడిపత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న బయాలజీ సైన్స్ టీచరు మరో 8 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పని చేస్తున్న స్కూల్ కనబరిచి సబ్మిట్ చేయబోతే సిస్టం అంగీకరించలేదు. తప్పనిసరి బదిలీల టీచర్లు లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది. ● ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్ ● రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే ‘కంపల్సరీ’గా చూపిస్తున్న వైనం -
ఉద్రిక్తత నడుమ సేవ్ ఆర్డీటీ
●ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ●ఉద్రిక్తతల మధ్య సాగిన మొదటి రోజు పాదయాత్ర కళ్యాణదుర్గం/ బెళుగుప్ప: కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను పోలీసులు అడ్డుగడుగునా అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్దిదారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ గొంచితండా నుంచి బ్రాహ్మణపల్లి వరకూ అడుగడుగునా కళ్యాణదుర్గం, గుంతకల్లు, డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను రహదారికి అడ్డంగా పెట్టారు. పాదయాత్రను భగ్నం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఒకానొక దశలో ఒక్కసారిగా తలారి రంగయ్యను చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగయ్యను తమ భుజాల మీదకు ఎత్తుకుని పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కార్యకర్తలు ముందుకు సాగారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ తొలి రోజు పాదయాత్ర గొంచి తండా నుంచి రాయదుర్గం – కళ్యాణదుర్గం ప్రధాన రహదారి మీదుగా కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, నరసాపురం, బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామం వరకూ సాగింది. ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత గొంచితండాలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంబోత్సవ సభలో తలారి రంగయ్యతో పాటు పార్టీ జిల్లా అద్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్, జెడ్పీ చైర్పర్రసన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉమామహేశ్వరనాయుడు, తిప్పేస్వామి, చందన శివాజీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కరువు జిల్లా అనంతలో పేదరికం రూపుమాపేందుకు 50 సంవత్సరాలుగా ఆర్డీటీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆర్డీటీ సేవలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్డీటీకి ఎప్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రమనేపల్లి సర్పంచ్ రమేష్, నరసాపురం ఎంపీటీసీ సురేష్, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిదులు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు బాగుండాలి
అనంతపురం అర్బన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికాలను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. లోటుపాట్లకు తావివ్వకుండా నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలన్నారు. పర్యావరణ దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆయన సమీక్షించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్ధామనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని నగర వనంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం తరువాత ప్రతి రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025 పోస్టర్లను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. సమీక్షలో అటవీశాఖ ప్లయింగ్ స్క్వాడ్ గురుప్రభాకర్, డ్వామా పీడీ సలీంబాషా, డీపీఈఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సీఈఓ రామసుబ్బయ్య, నగర పాలక కమిషనర్ బాలస్వామి, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ మునిప్రసాద్, డీసీఓ ఆరుణకుమార్, ఉద్యాన శాఖ డీడీ నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 48 పట్టాదారు పాసు బుక్కుల రద్దు గుత్తి: మండలంలోని ఊటకల్లు రెవెన్యూ పరిధిలో గుర్తించిన 48 దొంగ పట్టాదారు పాస్ బుక్కులను సంబంధిత అధికారులు రద్దు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవల ఆర్డీఓ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లత, వీఆర్వోలు వారం పాటు విచారణ చేశారు. మొత్తం 48 మంది దొంగ పట్టాదారు పాస్ బుక్కులు కలిగినట్లుగా గుర్తించారు. వీరిలో కొందరు ప్రభుత్వ భూములకు పాస్ బుక్కులు చేయించుకోగా, మరి కొందరు భూములు లేకున్నా పాస్ బుక్కులు పొంది రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. మండల వ్యాప్తంగా మరో 50 కి పైగా దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుధవారం తహసీల్దార్ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లతను వివరణ కోరగా ఊటకల్లులో 48 దొంగ పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేసిన మాట వాస్తవమేనన్నారు. మండల వ్యాప్తంగా విచారణ చేస్తున్నామన్నారు. విచారణలో దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తేలితే రద్దు చేస్తామన్నారు. దొంగ పట్టాదారు పాసు బుక్కులతో రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన వారిపై తదుపరి చర్యలు ఆర్డీఓ తీసుకుంటారన్నారు. -
పేదోడి ఆకలి తీరాలంటే జగన్ సీఎం కావాలి
తాడిపత్రి టౌన్: పేదోడి ఆకలి తీరాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు అన్నారు. వైఎస్ జగన్ను సీఎంగా చేసేందుక ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో బుధవారం జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ వెన్నుపోటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తాడిపత్రిలో అప్రజాసామ్యం రాజ్యమేలుతోందన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది కంటికి కూడా కనిపించదన్నారు. వింత పోకడలు, విచిత్ర పోకడలతో ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్రమంగా నిర్బందిస్తున్నారన్నారు. నిర్బంధాలను ఛేదించుకుని ఏదో ఒక రోజు పెద్దారెడ్డి బయటకు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, యువ నేత కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్బాషా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు -
9న రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం
అనంతపురం: జేఎన్టీయూ (ఏ)లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కేంద్రాన్ని ఈ నెల 9న సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పాలక భవనాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ బుధవారం పరిశీలించారు. అడ్మిన్ బిల్డింగ్లో క్లీనింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు, అవసరం మేరకు ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ వి. రాజగోపాల్, జేఎన్టీయూ అనంతపురం ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప రెడ్డి పాల్గొన్నారు. రైలు కిందపడి ఇద్దరి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని చల్లవారిపల్లి వద్ద బుధవారం రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ నాగప్ప తెలిపారు. అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వయస్సు 40సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు. అనంతపురం సిటీ: స్థానిక జీఆర్పీ పరిధిలోని గార్లదిన్నె–తాటిచెర్ల రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి (50) దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే అనంతపురం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో గురువారం నుంచి రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కార్యక్రమాన్ని ఆత్మకూరు మండలం పంపనూరులో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మిగతా మండలాల్లో శుక్రవారం నుంచి మొదలవుతుందని తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు (3 బస్తాలు) పంపిణీ చేస్తామన్నారు. -
అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్ రైలు ప్రారంభం
అనంతపురం సిటీ: అనంతపురం–బెంగళూరు మధ్య ప్యాసింజర్ రైలును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎమ్మెల్యే సునీత, డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్తో కలసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనంతపురం నుంచి బెంగళూరుకు రూ.50కే చేరుకోవచ్చన్నారు. 12 బోగీలుంటాయన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో వాటరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డీఆర్ఎంకు సూచించారు. మెమూ రైలు సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరేలా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుత్తా కేశవ నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే డీజీఎం ఉదయ్నాథ్, రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఓ శ్రవణ్ కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్రెడ్డి, ఏడీఆర్ఎం సుధాకర్, అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘వీర’బాదుడుతో సెంచరీ అనంతపురం: వైఎస్సార్ జిల్లా కడపలో జరుగుతున్న అండర్–23 అంతర జిల్లా క్రికెట్ టోర్నీలో బుధవారం జరిగిన అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్లో అనంత బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి వీరబాదుడుతో బంతిని బౌండరీలు దాటించి 125 పరుగులు సాధించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు పది వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో లోహిత్ లక్ష్మీ నారాయణ 80 పరుగులు, కె.రెడ్డిరుషీల్ 60 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఓపెనర్ కోగటం హనీష్వీరారెడ్డి 125 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మరో బ్యాటర్ పి.అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో తొలి సెంచరీ సాధించిన కోగటం హనీష్ వీరారెడ్డిని జట్టు సభ్యులు, కోచ్లు అభినందించారు. -
కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత..
అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)ని రక్షించాలని కోరుతూ మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి సంఘీభావం తెలిపారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గొంచితండాలో పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. వారికి, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి రెన్యువల్ చేసేదాకా పోరాటం కొనసాగిస్తానని తలారి రంగయ్య స్పష్టం చేశారు. -
బహిర్గతమైన ‘కూటమి’ విభేదాలు
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తానని బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మంగళవారం అనంతపురం నగరంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అలాగే రుద్రంపేట సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను పల్లె వంచిస్తున్న తీరుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ వద్దకు ఆయన చేరుకోగానే పెద్ద సంఖ్యలో పల్లె అనుచరులు అక్కడకు చేరుకుని భయభ్రాంతులకు గురి చేశారు. ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. నడిరోడ్డుపైనే తోపులాట చోటు చేసుకుంది. ప్రెస్మీట్, రౌండ్టేబుల్ సమావేశం విరమించుకుని వెళ్లకపోతే దారుణమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని పల్లె అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలోనే పల్లె రఘునాథరెడ్డికి మద్దతుగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టడానికి వీల్లేదంటూ ఆదినారాయణయాదవ్ను అడ్డుకున్నారు. అనంతరం ప్రెస్క్లబ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి భూమిని కబ్జా చేశారని ఆదినారాయణ యాదవ్ అనుచరులు ఆరోపించారు. అల్లరిమూకలను రెచ్చగొట్టి పదేపదే బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సోలార్ ప్రాజెక్ట్ కోసమని 100 ఎకరాల గిరిజనుల భూమిని ఆదినారాయణ యాదవ్ లాక్కొన్నారని పల్లె అనుచరులు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిలోని విభేదాలను బయటపెట్టారు. అనంతలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు పోలీసుల అండతో అడ్డుకున్న పల్లె అనుచరులు -
‘పీఎంశ్రీ’తో పాఠశాలల సమగ్రాభివృద్ధి
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల సమగ్రాభివృద్ధికి పీఎంశ్రీ పథకం దోహదపడుతోందని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ అన్నారు. స్థానిక జిల్లా సైన్స్ సెంటర్లో మంగళవారం ఎంఈఓ–2, ఇంజినీర్లు, పీఎంశ్రీ పథకానికి ఎంపికై నా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో రాష్ట్ర పరిశీలకులు సురేష్కుమార్తో కలసి ఆమె సమావేశమై మాట్లాడారు. పీఎంశ్రీ పథకం లక్ష్యం, ఇందుకు సంబంధించి పాఠశాలల్లో విభాగాల ఏర్పాటు అంశాలను సురేష్కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. పథకంలో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, క్రీడా మైదానాల ఏర్పాటు, డిజిటల్ బోధన కోసం కంప్యూటర్ ల్యాబ్, శుద్ధ నీటి కోసం ఆర్వో ప్లాంట్ తదితర సౌకర్యాల ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం ఏపీసీ శైలజ మాట్లాడుతూ... పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్ గ్రాంటు, ఎమ్మార్సీ గ్రాంట్, సీఆర్సీ గ్రాంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. అనంతరం పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనుల స్థితి, యాప్లో తలెత్తే సాంకేతిక సమస్యలు... వాటి పరిష్కారం, భారత్ స్కౌట్ గైడ్స్ విభాగం ఏర్పాటుపై చర్చించారు. సమావేశంలో సమగ్రశిక్ష సూపరింటెండెంట్ మహమ్మద్ ఇక్బాల్, డీఈ జయరామ్, ఏపీఓ నారాయణస్వామి, టీసీఎస్ సాంకేతిక నిపుణుడు రాజు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఏపీిసీ శైలజ -
రేషన్ బియ్యం పట్టివేత
తాడిపత్రి టౌన్: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీ సమీపంలో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న ముల్లా నజీర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 200 బస్తాల రేషన్ బియాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. అందిన పక్కా సమాచారంతో తహసీల్దార్ రజాక్వలి, సీఐ శివగంగాధర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. బియ్యం డంప్ చేసిన ముల్లా నజీర్, వేణుగోపాల్, గంగాధర్, చక్రపాణిపై కేసు నమోదు చేశారు. మహిళ అనుమానాస్పద మృతి కళ్యాణదుర్గం: కర్ణాటకలోని వైఎన్ హొసకోట సమీపంలో జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కర్ణాటక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కంబదూరు ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది మంగళవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. వైఎన్ హొసకోట సమీపంలోని గుట్టలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి, కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ ఏడాది మే 22 నుంచి వరలక్ష్మి కనిపించడం లేదంటూ అప్పట్లో ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 23న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. -
వారికి ఇంటి వద్దనే రేషన్ ఇవ్వండి
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయస్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కొవూరునగర్ ఆరో వార్డు పరిధిలోని 65 ఏళ్లు పైడిన వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం, నిత్యాసవర సరుకులు పంపిణీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. దివ్యాంగురాలికి సరుకులను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఇకపై 65 ఏళ్లు ౖపైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులు చౌక దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదన్నారు. వారికి ఇంటి వదద్దకే డీలర్లు సరుకులు చేరుస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, డీలర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. విజిలెన్స్ తనిఖీలు గుత్తి: స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం, మెయిన్ బజారులో ఉన్న 8వ నంబర్ దుకాణాన్ని మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 8వ స్టోర్లో 46 చక్కెర ప్యాకెట్లు, 89 కిలోల బియ్యం స్టాక్లో నమోదు చేసిన దాని కంటే అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ వెంకటప్రసాద్, ఏఓ సాయి, పీఆర్ఓ ఆదినారాయణమ్మ పాల్గొన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయం అనంతపురం క్రైం: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల పొదుపు మరియు పరపతి సహకార సంఘం లిమిటెడ్ (ఏపీఆర్టీసీ సీసీఎస్) ద్వారా అర్హులైన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నేత రామిరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీసీఎస్లో కనీసం ఐదేళ్ల సభ్యత్వం కలిగి, 63 సంవత్సరాలు వయసు నిండిన వారు అర్హులు. అనంతపురం డిపో వద్ద ఉన్న సంఘం కార్యాలయంలో ప్రతినిధులను సంప్రదించి దరఖాస్తులను పొందవచ్చు. చెరకు పంట దగ్ధం గార్లదిన్నె: మండలంలోని బూదేడులో మంగళవారం చెలరేగిన మంటల్లో చెరకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన శాంతరాజు మరో రైతుకు చెందిన 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.12 వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం చెరకు పంట సాగు చేపట్టాడు. మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు పడి మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే చెరకు తోటను మంటలు చుట్టుముట్టడంతో డ్రిప్ పరికరాలు, పైపులు, స్స్రింకర్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత కౌలు రైతు వాపోయాడు. -
●ఈ తిప్పలు పడలేకున్నాం
కూటమి పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేషన్ లబ్ధిదారులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ పద్ధతిని ప్రవేశపెట్టి ఇంటి వద్దకే చేపట్టిన రేషన్ పంపిణీ విధానం ఎంతో బాగుందని, ఇప్పుడు చౌకధాన్యపు డిపోల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని మండుటెండలో రోజంతా వేచి ఉండాల్సి వస్తుండడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఈ తిప్పలు పడలేకున్నామని, ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విషయం మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
మా వాడే.. దగ్గరకు వేయండి
అనంతపురం సిటీ: ‘అతను మా వాడే.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏదో ఒక మండలానికి ఏఓగా వేయండి’ అంటూ జిల్లా ప్రజా పరిషత్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద పని చేసే ఓ అధికారి ఫోన్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేసి ఎనిమిది నెలల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పరిపాలనాధికారి(ఏఓ) ఒకరు ఎలాగైనా జెడ్పీ లేదా చుట్టుపక్కల మండలాలకు చేరుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మొన్నటి వరకూ జెడ్పీ అధికారులు, పాలకవర్గ పెద్దల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కులం కార్డు బయటకు తీసి నేనూ మీ సామాజిక వర్గం వాడినేనంటూ డిప్యూటీ సీఎం పేషీలోని ఓ అధికారిని ఆశ్రయించి అతని ద్వారా జెడ్పీ అధికారులపై ఒత్తిడి పెంచారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే.. సదరు ఏఓ జెడ్పీలో పని చేసిన సమయంలో అప్పటి ముఖ్య అధికారుల అండ చూసుకొని బరితెగించి ప్రవర్తించాడు. పాలకవర్గం అనుమతి లేకుండానే ఏకంగా రూ.3 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించడం అప్పట్లో దుమారం రేపింది. అందుకు ప్రతిఫలంగా భారీగానే ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీలోని ముఖ్య అధికారులు, సహచార ఉద్యోగుల పేర్లు కూడా వాడుకొని కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వానికి, లోకాయుక్తకు, విజిలెన్స్కు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఇంకా విచారణ కొనసాగుతుండగానే తాను అనుకుంటే పాలకవర్గం, జెడ్పీ ముఖ్య అధికారులు కూడా ఏమీ చేసుకోలేరని, కోరుకున్న చోటుకు పోస్టింగ్ తెచ్చుకోకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సవాళ్లు విసురుతుండడం జెడ్పీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మండల ఏఓ బదిలీ విషయంగా జెడ్పీ అధికారులకు డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఫోన్ -
16 రోజులు... 209 కిలోమీటర్లు
కళ్యాణదుర్గం: ఉమ్మడి అనంతపురం జిల్లా జీవనాడి ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పురుడుపోసుకుంది. పేద ప్రజలను ఆదుకుంది. అలాంటి ఆర్డీటీకి ఇటీవల ఇబ్బందులు తలెత్తాయి. విదేశాల నుంచి సంస్థకు వచ్చే నిధులను ఆపేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక్కసారిగా పేదలను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ‘పాదయాత్ర’కు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజ లను చైతన్య పరుస్తూ ముందుకు సాగనున్నారు. 16 రోజులు...209 కిలోమీటర్లు బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా (గొంచితండా) నుంచి రంగయ్య పాదయాత్ర ఈనెల బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తంగా 16 రోజుల పాటు 209 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లోని 63 గ్రామాల మీదుగా యాత్ర సాగుతుంది. పాదయాత్ర మొదటి రోజు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, శ్రేణులు పాల్గొని రంగయ్యకు సంఘీభావం తెలపనున్నారు. నేటి నుంచి తలారి రంగయ్య ‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’ ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించకపోతే 55 ఏళ్లుగా పేదలు పొందుతున్న అన్ని సేవలు, సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. పిల్లల చదువులు, ఇళ్లు, వైద్య సేవలు, మహిళా సంఘాల ప్రయోజనాలు, దివ్యాంగులు, రైతులు ఇలా అందరికీ తీరని నష్టం వాటిల్లుతుంది. ఆర్డీటీని కాపాడుకోవడానికి ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాలి. సంస్థ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకునే అవకాశంలా భావించి కదలిరావాలి. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ -
నేడు వెన్నుపోటు దినం..
హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ‘వెన్నుపోటు దినం’ పేరుతో వైఎస్సార్ సీపీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం అనంతపురం కార్పొరేషన్: వెన్నుపోటు నిరసన ర్యాలీతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై, కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ఉదయం 9.30 గంటలకంతా చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోనూ ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలు ఉంటాయన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని ‘అనంత’ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు 175 హామీలను ప్రకటించిన చంద్రబాబు .. ఇంత వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని, ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఎవరికెంత ముట్టింది..?
● పుట్టపర్తి ప్రవాస భారతీయుడికి చీటింగ్ కేసులో పోలీసులపైనా విచారణ! సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసులో నిందితుడి నుంచి భారీగా లబ్ధి పొందిన పోలీసులపైనా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనకు రూ.12 కోట్లకు పైగా మోసం చేశారని మే 22న ప్రవాస భారతీయుడు మహేంద్రకర్ ఆర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై పుట్టపర్తి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ అనంతరం నిందితుడిని అరెస్టు చూప కుండా కొంతమంది టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు అతని ఆస్తులను బదలాయించడం, మరికొన్ని ఆస్తులపై అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులతో పుట్టపర్తి పోలీసులు రూ.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ బాగోతమంతా ఒక సబ్ డివిజనల్ పోలీసు అధికారి, కొంతమంది పోలీసుల సమక్షంలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిత్యం సత్యసాయి భక్తులతో కళకళలాడే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలోనే ఇదంతా జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాయ‘బేరం’లో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారికి టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి అండదండలు ఉన్నట్టు తెలు స్తోంది. ఈయన ఏరికోరి సదరు అధికారిని పుట్టపర్తికి తెచ్చుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా డీల్ కుదుర్చుకున్న రూ.50 లక్షల్లో ఉన్నతాధికారులకు ఏమైనా వెళ్లిందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విజయవాడకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. రైతును మింగిన అప్పులు శెట్టూరు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని యాటకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంభూపాల్ తెలిపిన మేరకు... యాటకల్లు గ్రామానికి చెందిన గొల్ల గోవిందప్ప (74) తన మూడెకరాల పొలంలో 8 బోర్లు వేశాడు. చివరి బోరులో నీళ్లు పడ్డాయి. అప్పటికే రూ. 5 లక్షల వరకూ అప్పులయ్యాయి. నీళ్లు పడ్డాయని, పంటలు పెట్టి అప్పులు తీర్చవచ్చనే ఉద్దేశంతో మళ్లీ రూ. లక్ష వరకూ అప్పు చేసి టమాట, వేరుశనగ సాగు చేయగా.. నష్టాలు వచ్చాయి. దీంతో గోవిందప్ప నైరాశ్యంలో కూరుకుపోయాడు. అప్పులెలా తీర్చాలో అంటూ నిత్యం మదనపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పుల విషయం చర్చించి బాధపడ్డాడు. అయితే, కుటుంబసభ్యులు గోవిందప్పకు ధైర్యం చెప్పి పడుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లేచి చూసే సరికి గోవిందప్ప కనపడకపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో అంతా వెతికారు. ఇంటి సమీపంలోని పాడుబడ్డ పెంకుల కొట్టంలో దూలానికి వేలాడుతూ కనిపించిన గోవిందప్పను చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గోవిందప్పకు భార్య గొల్ల మల్లమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి ● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: ‘విధి నిర్వహణలో ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సచివాలయ సిబ్బందించి ఆదేశించారు. పింఛను పంపిణీలో ఫీడ్బ్యాక్పై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో డీఆర్డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజు నాయుడుతో కలిసి సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ముఖ్యంగా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పింఛను లబ్ధిదారుల నుంచి డబ్బు తీసుకోకూడదన్నారు. సిబ్బంది కనిపిస్తేనే లబ్ధిదారులు నమస్కారం చేసేలా ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, డీపీఓ, డీఆర్డీఏ పీడీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. -
‘మహాత్మా.. అధికారులకు బుద్ధి ప్రసాదించు’
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మహాత్మా... మా పోస్టులు మాకు కేటాయించేలా అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించు’ అంటూ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లు విన్నవించుకున్నారు. మంగళవారం స్థానిక టవర్క్లాక్ సమీపంలోని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా చేశారు. 21 జీఓ ప్రకారం 19 మాత్రమే ఖాళీలున్నాయంటూ చెబుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో పదోన్నతుల జాబితాలోని సీనియర్ ఎస్జీటీలు జి. సూర్యుడు, కోనంకి చంద్రశేఖర్, జయపాల్ నాయుడు, నరసింహులు, లింగమయ్య, మహమ్మద్ రఫి, అంజి నాయక్, గోపాల్ రెడ్డి, పీరు నాయక్, వన్నారెడ్డి పాల్గొన్నారు. ఎస్టీయూ రమణారెడ్డి, యూటీఎఫ్ గోవింద రాజులు, ఏపీటీఎఫ్–1938 శ్రీనివాసులు రెడ్డి, సత్యప్రసాద్, ఆప్టా శంకరమూర్తి మద్దతు తెలిపారు. -
ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం!
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం కూడా బయటకు చెప్పకుండా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పూర్తిగా గోప్యత పాటిస్తుండడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది టీచర్లు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ 3–4 సార్లు రాష్ట్ర అధికారులు వెబెక్స్లు పెట్టుకుంటూ వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఉండే టీచర్లకు చేరడం లేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్న గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ మీడియా ద్వారానైనా ఉపాధ్యాయులకు తెలియజేసే ప్రయత్నాలు చేయకపోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలకు సంబంధించి రోజూ స్వయంగా డీఈఓల పేరుతోనే వివిధ మెసేజ్లు టీచర్ల గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి తప్ప మన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలు, ఖాళీల విషయం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. రెండు రోజుల క్రితం పీఎస్హెచ్ఎంల బదిలీలయ్యాయి. ఆయా సబ్జెక్టుల్లో మిగులుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు పీఎస్హెచ్ఎంలుగా మంగళవారం బదిలీలు చేశారు. అయితే ఎంతమంది పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లారు... ఏయే సబ్జెక్టుల వారు వెళ్లారు...వీరిలో తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలు ఎవరు అనే సమాచారం రాత్రి 10 గంటలు దాటినా బయటకు చెప్పలేదు. తుస్...మన్న కోఆర్డినేషన్ సమావేశం బదిలీ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రెండోరోజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓను అడ్డుకుని నిరసన తెలియజేశారు. డీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని, ఇతర జిల్లాల అధికారులు గ్రూపుల్లో పెడుతున్న సమాచారానికి అనుగుణంగా ముందుకు వెళ్లే దౌర్భాగ్యం నెలకొందంటూ వాపోయారు. ఇకపై అలా జరగదని, మరుసటి రోజే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేస్తామన్న డీఈఓ.. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదని నాయకులు మండిపడుతున్నారు. ఖాళీలు చూపించకుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలట! స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఖాళీలు ప్రదర్శించకుండానే బుధవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెబుతున్నారంటూ టీచర్లు వాపోతున్నారు. సీనియార్టీ జాబితా, ఖాళీలు ప్రకటించిన తర్వాత అభ్యంతరాలకు గడువు ఇవ్వడం లేదంటున్నారు. గుత్తి కోట జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరు ఇటీవల హెచ్ఎం పదోన్నతిపై కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ పోస్టు ఖాళీ చూపించలేదు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచరు జనవరిలో రిటైర్డ్ అయ్యారు. ఆ పోస్టు ఖాళీ చూపించలేదు. ఇక్కడ హిందీ ఒక పోస్టు ఖాళీగా ఉంటే రెండు పోస్టులున్నట్లు చూపించారు. బుధవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. ఉన్న ఖాళీలను చూపించకుండా, లేని ఖాళీలను చూపించిన స్కూళ్లు కోరుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ టీచర్లు వాపోతున్నారు. టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు: ఏపీటీఎఫ్ మంగళవారం సాయంత్రం పాఠశాల సహాయకుల సీనియార్టీ, వేకెన్సీ జాబితాలు విడుదల చేసి గ్రీవెన్స్కు ఒకరోజు సమయం ఇవ్వకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వమని వేధిస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. సిరాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సీనియారిటీ, వేకెన్సీ జాబితాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈఓ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో తీవ్ర గందోరగోళం నెలకొందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కన్వీనర్ వన్నప్ప, నాయకులు గురు రాజ్, నాగేంద్ర, ఈశ్వరయ్య, భాగ్యరాజ్, దాసరి మురళి, ఓబులేసు, చిదంబరయ్య, వెంకటరామిరెడ్డి, చక్రి, రాజశేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బదిలీలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు చెప్పని విద్యాశాఖ ఆందోళనలో ఉపాధ్యాయులు నేడు స్కూల్ అసిసెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఖాళీలు చూపించలేదంటున్న టీచర్లు -
రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్?
హామీలిచ్చేటప్పుడు ఆచరణ సాధ్యమా .. కాదా అని ఆలోచన చేయాలి. సీఎం పీఠంపై కూర్చున్నాక ఇప్పుడు హామీలు చూస్తుంటే భయమేస్తుంది అంటే ఎలా నమ్మాలి. ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. సీఎం సార్ నాకు ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేస్తున్నారు. జగనన్న సర్కార్లో మహిళలే మహారాణులు. అమ్మ ఒడి, సున్నా వడ్డీ ద్వారా రూ.కోట్ల లబ్ధి చేకూరింది. ‘నాడు మహిళల చేతిలో డబ్బులు గల గల.. నేడు వెలవెల’ అన్న చందంగా మారింది. – మమత, ఎం.బండమీదపల్లి, రాప్తాడు మండలం -
మాట తప్పిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పెద్ద పీట వేస్తామని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమ వుతున్నా ‘తల్లికి వందనం’ అమలు చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని చంద్ర బాబు ‘తల్లికి వందనం’గా పేరు మార్చి ఓట్లను దండుకున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఎన్నికల వరకు నెట్టుకొచ్చే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుంది. – పావని, పాలచెర్ల, రాప్తాడు మండలం -
ఈసారీ అప్పులు తప్పవేమో!
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రబీ సీజన్ ముగిసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా నేటికీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో పంటల పెట్టుబడి కోసం ఈ సారి కూడా అప్పులు తప్పేలా లేవు. – చెన్నారెడ్డి, రైతు, జంబులదిన్నె, గార్లదిన్నె మండలం -
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మోసగించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నేడు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సుకు ముహూర్తమే ఖరారు కాలేదు. ‘ఇంటింటికీ ఉద్యోగమిస్తాం.. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.3 వేలు భృతి’ అన్నా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకూ పైసా ఇవ్వలేదు. సామాన్యుల బెంబేలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా ఎమ్మెల్యేలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లకు అంతులేకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టుషాపులు, పర్మిట్ రూములతో ఉమ్మడి అనంత జిల్లాను మత్తులో జోగేలా చేశారు. ● హిందూపురంలో బాలకృష్ణ పీఏల అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ● ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. రామగిరి మండలంలో కురుబ లింగమయ్యను పచ్చ మూకలు కొట్టి చంపాయి. రాప్తాడులో నారాయణరెడ్డి, ముత్యాలమ్మను టీడీపీ నేతలు నరికి చంపారు. ● ఉమ్మడి జిల్లాలో కొండలు, గుట్టల్ని ‘తమ్ముళ్లు’ పిండిచేసి సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ● చిత్రావతి, పెన్నా, వేదవతి హగరి నదుల్లో అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. ● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ● అనంతపురం అర్బన్లో ఎవరైనా ఇళ్లు కట్టాలంటే ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ● మట్కా, గంజాయికి తాడిపత్రి నియోజకవర్గం అడ్డాగా మారిపోయింది. ● గుత్తిలో ఓ వ్యక్తిని టీడీపీ నేతలు రైలు పట్టాలపై పడుకోబెట్టి డబ్బు దండుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ● రాప్తాడులో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు ముట్టజెప్పాలని చెబుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటువైపు చూడటమే మానేశారు. గమనిక: చంద్రబాబు ప్రభుత్వంలో వీరిలో ఒక్కరికీ రూపాయి లబ్ధి చేకూరలేదు.. అలవిగాని హామీలతో లక్షలాది మందికి కుచ్చుటోపీ ఎన్నికల ముందు ఊరూరా ‘సూపర్సిక్స్’ ప్రచారం అధికారంలోకి వచ్చాక ఒక్క పథకమూ అమలు చేయని వైనం పైగా కబ్జాలు, ఆక్రమణలు, మోసాలు, దోపిడీలతో భయభ్రాంతులు ‘కూటమి’ పాలనను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ -
రిలీజ్ డేట్లు తప్ప ఏమీ లేదా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో కేవలం రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తచేతులు చూపుతున్నారు. కనీసం ఒక్క హామీని అమలు చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబులో కన్పించడం లేదు’ అని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిందన్నారు. శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం సమర్పించి, కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలియజేయనున్నట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో విశ్వసనీయత లోపించిందన్నారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు తదితర హామీలను అమలు చేయకపోగా, అమరావతి పేరుతో రూ.1,60,000 కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమేనా అని ప్రశ్నించారు. వెనుకబడ్డ అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ కడప ప్రాంతాలు కన్పించడం లేదా అని విమర్శించారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేశారన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లా వాసులకు ఎంతో మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని చంద్రబాబు అటకెక్కించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీని తామే తీసుకొచ్చామని టీడీపీ చెబుతోందని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోగాతి విజయప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
తాగునీటి కోసం రోడ్డెక్కిన కూడేరు వాసులు
కూడేరు: మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తమకు తాగునీరు అందడం లేదంటూ సోమవారం కూడేరు వాసులు ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్ పనులను రైతులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్ట్ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్కెనాల్కు లిప్ట్ ఇరిగేషన్ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే లైనింగ్ పనులతో రైతులకు నష్టం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
● కలెక్టర్ వినోద్కుమార్ గుత్తి: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గుత్తి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న వసుధా ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జేసీ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో ఉన్నతాధికారులకు అందజేశారు. మొత్తం 490 అర్జీలు అందాయి. తనకు బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అనంతపురం గిరిజన బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్గా నిధులు నిర్వహిస్తున్న అనసూయ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అవినీతికి పాల్పడి అంధురాలైన తనను తాను కోరిన గుత్తి ఎస్టీ హాస్టల్కు బదిలీ చేయలేదని విన్నవించారు. డబ్బు ముట్ట జెప్పిన వారిని కోరిన ప్రాంతానికి బదిలీ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా తదితరులున్నారు. టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది. బెంగ తీర్చేనా..?! అనంతపురం సెంట్రల్: జిల్లాకు వర ప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం ఈ ఏడాది ముందుగానే జలకళ సంతరించుకుంటుండడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి త్వరగానే ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలాఖరు, జూలైలో డ్యాంకు ఇన్ఫ్లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించడంతో కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే 20 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో చేరుకోవడం గమనార్హం. కర్ణాటకలో వర్షాలు కొనసాగితే కొన్ని రోజుల్లోనే గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీ డ్యాం పరిధిలో హెచ్చెల్సీ కింద జిల్లాకు చాలా లబ్ధి కలుగుతోంది. దాదాపు లక్ష ఎకరాల పైగా సాగునీరు అందుతోంది. ఇలాంటి తరుణంలో డ్యాం త్వరగా నిండితే సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ పురార్థనరెడ్డి మాట్లాడుతూ టీబీ డ్యాంకు జూన్లోనే ఇన్ఫ్లో వస్తుండటం శుభ పరిణామమన్నారు. కేటాయింపులు త్వరగా నిర్ణయించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాము కాటుతో రైతు మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కెంచానపల్లికి చెందిన రైతు బోయ రామాంజనేయులు (70) పాము కాటుతో మృతి చెందాడు. తన వేరుశనగ పొలంలో సోమవారం మధ్యాహ్నం పనుల్లో నిమగ్నమైన సమయంలో పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాలు కీలకం
అనంతపురం కార్పొరేషన్: పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాల పాత్ర ఎంతో కీలకమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ హరిప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టి.సురేంద్రరెడ్డి అన్నారు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం వారు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీను బలోపేతం చేయడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి వివిధ పదవులతో జగనన్న గుర్తింపునిచ్చారన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలతో మమేకమై పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలన్నారు. ప్రజల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ అధిష్టానం దశలవారీగా పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హరిప్రసాదరెడ్డి, సురేంద్ర రెడ్డిని అనుబంధ విభాగాల అధ్యక్షులు సన్మానించారు. కార్యక్రమంలో యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు అమర్నాథరెడ్డి, వైపీ బాబు, మల్లెమీద నరసింహులు, కురుబ దేవేంద్ర, మూడే శ్రీనివాసులు నాయక్, రాజశేఖరరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కె శ్రీనివాసరెడ్డి, ఎం ధనుంజయ, సి.నాగప్ప, ఓబిరెడ్డి, ఎంసీ సంధ్యారాణి, శ్రీదేవి, రిలాక్స్ నాగరాజు, వై.నరేంద్రరెడ్డి, సైఫుల్లాబేగ్ పాల్గొన్నారు. -
రాయితీ విత్తనాలకు కత్తెర..
రాయితీపై ఇచ్చే విత్తనాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రాయితీ కూడా కుదించి రైతులపై భారం మోపారు. ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ఈ ఖరీఫ్లో కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే విత్తన ప్రణాళిక తయారు చేశారు. ● వైఎస్ జగన్ ప్రభుత్వం 40 శాతం రాయితీతో విత్తనం అందించింది. ఐదేళ్లలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రూ.289 కోట్లు రాయితీ కల్పించడం గమనార్హం. -
గుత్తి కోట ఉత్సవాలకు రూ.50 లక్షలు
గుత్తి: వచ్చే ఏడాది జనవరిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు గాను రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం గుత్తి కోటపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, జిల్లా పర్యాటక అధికారి విజయకుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ ఓబులేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీ, మహర్షి దయానంద గురుకుల పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్
● ఆలిండియా ఓపెన్ కేటగిరీలో భూపతి నితిన్ అగ్రిహోత్రికి 183వ ర్యాంకు అనంతపురం ఎడ్యుకేషన్/శింగనమల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘అనంత’ విద్యార్థులు అదుర్స్ అనిపించారు. పలువురు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలు 12.68 లక్షల మంది విద్యార్థులు రాశారు. 2.5 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఐఐటీల్లో 17 వేల సీట్లు, తక్కిన సీట్లు ఎన్ఐటీ, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విడుదలైన ఫలితాల్లో భూపతి నితిన్ అగ్నిహోత్రి 360 మార్కులకు గాను 264 మార్కులు సాధించి అఖిల భారత స్థాయి ఓపెన్ కేటగిరీలో 183 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అలాగే శింగనమల మండలం సీ.బండమీదపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి శశిధర్రెడ్డి 638, అనంతపురం నగరానికి చెందిన పి. విశాల్ 3,946, భావన 10,889, మోక్ష సాయి రెడ్డి 12,809, ఆసిఫ్ 16,099, సవిత్ కుమార్ రావు 16,884 ర్యాంకు, డి.లోకేష్ కుమార్ 114 (ఎస్సీ కేటగిరీ) ర్యాంకు, ప్రణయ్ చౌదరి 5,499 (ఈడబ్ల్యూఎస్) ర్యాంకు సాధించారు. వీరందరికీ నేరుగా ఐఐటీలో ఇంజినీరింగ్ సీట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
మోసం... చంద్రబాబు నైజం
బుక్కరాయసముద్రం: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రెడ్బుక్ పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాకాండకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచక పాలన సాగించడం హేయమన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4న నార్పల మండలంలో ఆందోళన, నిరసన కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి, అనుబంధ సంఘాల పరిశీలకులు సురేంద్ర మాట్లాడుతూ కూటమి పాలన రాష్ట్రంలో ఎల్లకాలం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడరాదని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నరేష్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నాగలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల నారాయణస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, అనంత వెంకటరెడ్డి, కాటమయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించి బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు. చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు. కర్ణాటక వాసి దుర్మరణం పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మార్కెట్ వసూళ్లు ఆశాజనకంఅనంతపురం అగ్రికల్చర్: మార్కెట్యార్డు పరిధిలో వివిధ రకాల ఫీజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నట్లు ఆ శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలోని9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13.49 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా మొదటి రెండు నెలల కాలంలో 18 శాతంతో రూ.2.42 కోట్లకు పైగా సాధించినట్లు వివరించారు. అందులో మే నెల టార్గెట్ రూ.1.01 కోట్లు కాగా రూ.1.03 కోట్లు వసూలైందన్నారు. -
ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వాలు
అనంతపురం అర్బన్: సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో ప్రభుత్వాల సంస్కరణల వల్ల ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదానీకి దాసోహమైందని ఆరోపించారు. ఆదానీకి లబ్ధి చేకూరేలా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. సర్దుబాటు పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లను పగలకొట్టాలంటూ ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మాట మార్చాయని మండిపడ్డారు. విద్యుత్చార్జీల పెంపు, స్మార్ట్మీటర్ల ఏర్పాటు, ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో పోరాటాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రామిరెడ్డి, సిటిజెన్స్ ఫోరమ్ నాయకులు ఏజీరాజమోహన్, నాయకులు మత్తుజ, వెంకటనారాయణ, ప్రకాష్, గోపాల్, మసూద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు -
చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్ ఫొటోలతో కూడిన రెడ్బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో యథేచ్ఛగా దా
● పుట్లూరు మండలం కోమటిగుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మనోహర్, విశ్వనాథ్, శేఖర్ తదితరులపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య(55) టీడీపీ నాయకుల్ని అడ్డుకుని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆయనపై బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బలమైన గాయాలతో అక్కడే కుప్పకూలి ఎరికలయ్య మృతి చెందాడు. ● రాప్తాడులో వైఎస్సార్సీపీకి చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతుల హత్య రాష్ట్రాన్నే కుదిపిసేంది. పొలం తగాదా విషయంలో ఇనుపరాడ్లు, కట్టెలు, వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే భార్య, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో భర్త మృతి చెందారు. రాప్తాడు సమీపంలోని గంగలకుంటకు చెందిన పొలం విషయంగా దాయాదుల మధ్య నెలకొన్న వివాదంలో టీడీపీ నేతలు తలదూర్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. రాప్తాడు మండలంలో టీడీపీ నాయకులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన బోరు, డ్రిప్ పరికరాలు (ఫైల్) రాప్తాడు మండలం వరిమడుగులో స్థలం కబ్జా కోసం టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన బండలు (ఫైల్) అనంతపురం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల వరకూ ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పచ్చ ముఠాలు రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి తెరతీస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరిపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి. ● సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా నూతనంగా గృహాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అనుమతులూ ఉన్నాయి. అయినా... ఫయాజ్బాషా నిర్మించిన ఇంటిని ఆక్రమణల పేరుతో తొలగించేందుకు మునిసిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పురమాయించారు. ఇంటిని కూల్చాలని ఒత్తిడి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలను పలు దఫాలుగా ఫయాజ్ బాషా అడ్డుకున్నారు. దీంతో నేరుగా జేసీ ప్రభాకర్రెడ్డి రంగంలో దిగి జేసీబీని తీసుకెళ్లి ఫయాజ్బాషా ఇంటి పైకి టీడీపీ కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై ఫయాజ్బాషానే రాళ్ల దాడికి పాల్బడ్డారంటూ రివర్స్ కేసు నమోదు చేయించారు. ● సార్వత్రిక ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా రెడ్బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, జేసీ ప్రభాకర్రెడ్డి ఇరువురినీ తాడిపత్రి వదిలి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక జేసీ ప్రభాకర్రెడ్డి ఒక్కరే తాడిపత్రిలో కాలు పెట్టారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్నా పెద్దారెడ్డిని ఇప్పటికీ అక్కడ కాలు పెట్టనివ్వడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం ఎస్పీ పట్టించుకోలేదంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. ● జిల్లా వ్యాప్తంగా ఖాళీ స్థలాలనే కాకుండా పట్టా స్థలాలనూ టీడీపీ నేతలు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోబోయిన సొంత దారులపై దాడులకు తెగబడుతున్నారు. చిన్నారులనే కనికరం లేకుండా ● రాయదుర్గం మండలం యర్రగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న లైంగిక వేధింపులకు పాల్బడ్డాడు. మనో వేదనకు గురైన ఆ బాలిక హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అప్రమత్తమైన స్థానికులు బాలికను కాపాడారు. ముక్కన్నకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ● గత నెలలో కేవలం రోజుల వ్యవధిలోనే 15 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. కారణాలు ఏమైనా ఇప్పటి వరకూ కొన్ని అదృశ్యం కేసుల్లో మిస్టరీ వీడలేదు. రాక్షసత్వానికి పరాకాష్ట కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అంతులేని ఆకృత్యాలు, దౌర్జన్యకాండ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం అక్రమ కేసులు, అరెస్ట్లు, హత్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి దాసోహమన్న పోలీసులు కుంటి సాకులతో కేసులు ఆగని దౌర్జన్యకాండ జిల్లాలో ఇప్పటి వరకూ 70 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రివర్స్ కేసులతో వేధింపులకు గురి చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామితో పాటు మొత్తం 48 మంది నాయకులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ లింగరాజును ప్రభావితం చేసి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం. చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించి, నిందితులను శిక్షించాలని ప్రెస్మీట్లో కోరినందుకు కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేశారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కుమార్పై దాడికి యత్నించారంటూ ఎంపీ గోరంట్లమాధవ్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విద్యుత్ బిల్లుల పెంపు అంశంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండలో ట్రాఫిక్కు అంతరాయంకలిగించారనే నెపంతో అక్రమ కేసు నమోదు చేశారు. గుమ్మఘట్ట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ గౌని కాంతారెడ్డి.. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో పంచాయితీ చేసి బాధితులకు అందాల్సిన రూ.నాలుగు లక్షలను వాడుకున్నాడని తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. ఆత్మకూరు, రాయదుర్గం మండలం ఆయతపల్లి, బెళుగుప్ప గ్రామాల్లోని సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలంసిద్దాపురం తండాలో తాగునీటి కొళాయి విషయంగా ఘర్షణ పడి ఏడుగురు వైఎస్సార్సీపీ నాయకులపైనే రివర్స్ కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలం కళ్లెం గ్రామంలో చోటు చేసుకున్న చిన్న పాటి ఘర్షణకు రాజకీయ రంగు పులిమి 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు బనాయించి రిమాండ్కు పంపారు. -
ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా పడ్డాడు. అలవిగాని హామీలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి రైతన్న బలయ్యాడు. ఏడాది పాలనలో రైతుకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా చేతులెత్తేయడంతో కరువ
అనంతపురం అగ్రికల్చర్: ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇదిగో అదిగో అంటూనే ఏడాది కాలం ముగించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. కానీ చంద్రబాబు తన హామీని గాలికి వదిలేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ... పీఎం కిసాన్ రూ.6 వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇచ్చి ఉన్నా రూ.400 కోట్లకు పైగా సాయం అందేది. కానీ రూపాయి కూడా ఇవ్వకుండా రైతులకు కుచ్చుటోపీ పెట్టేశారు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ సర్కారు ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ. 67,500 ఇచ్చారు. మొత్తంగా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. పంటల బీమాకు పాడె.. రైతులకు ఎంతగానే మేలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు పాడె కట్టేసింది. ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్లకు పైగా రైతుల నుంచి పిండేస్తోంది. 2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాల్సివుండగా... తమకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు ఎగనామం పెట్టేశారు. 2024 ఖరీఫ్లో కూడా ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారంపై నోరు మెదపడం లేదు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా కూడా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం ఇచ్చింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించారు. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చేశారు. బాధిత కుటుంబాలపై నిర్లక్ష్యం.. చంద్రబాబు ఏడాది పాలనలో పంటలు పండక, అప్పుల బాధతో 45 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నా... ప్రభుత్వం చలించడం లేదు. రూ.7 లక్షలు అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ● ఆత్మహత్య బాధిత కుటుంబాలకు గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రెండు మూడు నెలల్లోపే రూ.7 లక్షల మేర పరిహారం ఇచ్చి అండగా నిలిచారు. అలా 280 బాధిత రైతు కుటుంబాలకు రూ.17.40 కోట్ల ఎక్స్గ్రేషియా అందించారు. గతంలో చంద్రబాబు పాలించిన 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి 110 కుటుంబాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ, పావలా వడ్డీ లేదు.. ఖరీఫ్, రబీలో పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ ఇవ్వలేదు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న సన్నచిన్నకారు రైతులకు వడ్డీరాయితీలు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ● గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగింది. గిట్టుబాటు లేక నష్టాలు.. అరకొరగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. చీనీ, అరటి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నా... ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టలేదు. పత్తి, కంది రైతులు కూడా బాగా నష్టపోయారు. అరకొర కొనుగోలు కేంద్రాలతో మమ అనిపించేశారు. ● గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన రూ.350 కోట్లు విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరతో కొనుగోలు చేసి మేలు చేకూర్చింది. రైతులకు కూటమి సర్కారు కుచ్చుటోపీ చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తున్న సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సాయం చేయని వైనం మోసంపై మండిపడుతున్న అన్నదాతలు -
●జనం నెత్తిన ‘రేషన్ బరువు’
ఇంటి వద్దకు వాహనం వచ్చినప్పుడు రేషన్ తీసుకుంటూ వచ్చిన కార్డుదారులకు... ఇప్పుడు ‘నెత్తిన రేషన్ బరువు’ మోయాల్సిన దుస్థితి పట్టింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడి... చౌక దుకాణాల ద్వారానే అందజేసే విధానం తేవడంతో కార్డుదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీంతో వృద్ధులు స్లోర్ల వద్దకు వచ్చి బియ్యం, సరుకులు తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ మొదలైన రెండో రోజు సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా కార్డుదారులు అవస్థలు పడ్డారు. – అనంతపురం అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ సీపీ ధ్యేయం
అనంతపురం కార్పొరేషన్: ‘ప్రజల శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పుడు ప్రజలను నయవంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పోరాటాలకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఏ–7 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో కలసి ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 4న ఉదయం 10 గంటలకు పాతూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. గాంధీ విగ్రహం, వన్టౌన్ పీఎస్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, తొలి సంతకాలకు వన్నె తెచ్చిన నాయకులు దివంగత నేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్థానమంతా వెన్నుపోటేనని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’తో పాటు 175 హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 1.30 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు, 2.50 లక్షలకుపైగా వలంటీర్లకు అవకాశం కల్పించారన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి పనులతో అనంతపురం నగర రూపురేఖలు మార్చేశామన్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం మాఫియా గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సంపద సృష్టించుకునేందుకు మద్యం మాఫియాకు తెరలేపారని ‘అనంత’ ధ్వజమెత్తారు. మద్యం బాటిల్పై అదనంగా ధర వసూలు చేస్తున్నారన్నారు. ప్రతినెలా మద్యం షాపుల నుంచి భారీగా ఎమ్మెల్యేలకు ముడుపులు అందుతున్నాయన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలను హస్తగతం చేసుకుని అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలపై గళమెత్తుదామని, ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చైతన్యానికి మారుపేరు అనంతపురం అని, వైఎస్సార్ సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్గౌడ్, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు అశ్వర్థ్ నాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు ప్రసంగించారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, చంద్రశేఖర్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, సైఫుల్లాబేగ్, శ్రీదేవి, చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు కృష్ణవేణి, దత్తా, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, బాకే హబీబుల్లా, పెన్నోబులేసు, చింతకుంట మధు, ఆసిఫ్, సాకే చంద్రలేఖ, సుజాత రెడ్డి, పార్వతి, భారతి, గౌని నాగన్న, జానీ, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు వెన్నపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి -
గంటల తరబడి వేచి ఉన్నా..
ఈమె పేరు జయమ్మ. అనంతపురంలోని నవోదయ కాలనీవాసి. తన ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న స్టోర్ నం. 88లో ఆదివారం రేషన్ తీసుకునేందుకు వచ్చి లైన్లో నిలబడలేక చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది. ఉదయం 8.30 గంటలకు నీళ్లు వస్తే పట్టేసి వచ్చానని, ఇక్కడేమో 9 గంటలైనా రేషన్ ఇవ్వడం మొదలు పెట్టలేదని వాపోయింది. రెండు రోజులే ఇచ్చి ఆ తరువాత బియ్యం అయిపోయాయని చెబుతారనే భయంతో మొహం కూడా కడుక్కోకుండానే మొదటి రోజే వచ్చినట్లు చెప్పింది. గతంలో తమ వీధిలోకే రేషన్ బండి వచ్చేదని, కేవలం 10 నిమిషాల్లో బియ్యం, సరుకులు తీసుకునేదాన్నని గుర్తు చేసుకుంది.రేషన్ సరుకులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే దుస్థితి దాపురించింది. గత ప్రభుత్వం తరహాలో ఇంటి వద్దనే రేషన్ వేయాలి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో..ఎప్పుడు మూస్తారో అర్థం కావడంలేదు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణం వద్ద వేచి ఉండి బియ్యం తెచ్చుకున్నా. మా ఇంటి నుంచి రేషన్ షాపు కి.మీ దూరంలో ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది.– రాజేశ్వరి, గుంతకల్లుఅనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పేదలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా రేషన్ కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కోసం కార్డుదారులు ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఇంటి వద్దకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకునేవారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహన వ్యవస్థకు మంగళం పాడి చౌక దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి తెరలేపడంతో పేద ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదటి రోజే చుక్కలు కనిపించాయి. ‘ఉదయమే ఇంటి పనులను వదిలేసుకుని చౌక దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. మాకేం కర్మ పట్టిందిరా స్వామి’ అంటూ పలువురు వాపోయారు.8 గంటలకూ తెరచుకోని స్టోర్లు..ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. అప్పటికే రేషన్ తీసుకునేందుకు వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. డీలర్లు నింపాదిగా 9 గంటల తరువాత పంపిణీ ప్రారంభించారు.ఇబ్బంది పడ్డ వృద్ధులు, మహిళలు..సరుకులు తీసుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు లైన్లలో నిలబడలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయానగర్లో చౌక దుకాణం వద్ద చాలా ఆలస్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చిన కార్డుదారులు లైన్లో నిలబడలేక సంచులను వంతులుగా పెట్టి కూర్చున్నారు.రెండు రోజులకు మించి ఇవ్వరు..!చౌక దుకాణాల్లో ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కార్డుదారులు అంటున్నారు. బియ్యం, సరుకులు రెండు రోజులకు మించి ఇవ్వరని చెబుతున్నారు. ఆ తరువాత వస్తే అయిపోయాయని అంటారని, అందుకే పనులు వదిలేసుకుని మరీ బియ్యం తీసుకునేందుకు మొదటిరోజే వచ్చామని పేర్కొంటున్నారు. డీలర్లు కచ్చితంగా 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చూడాలని, అలా ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
హెచ్చెల్సీలో ఫెవికాల్ వీరులు
● హెచ్చెల్సీలో ఓ ఉద్యోగి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈయన తన సర్వీసులో అన్ని ప్రాంతాల్లో పనిచేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. అనేక సంవత్సరాలుగా ఎస్ఈ కార్యాలయంలోనే ఉండిపోయారు. డిప్యుటేషన్ ముసుగులో ‘ఫెవికాల్’ వేసుకొని తిష్ట వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈయనకు ప్రత్యేకంగా గది కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ● ఓ ఇరిగేషన్ ఉద్యోగి జిల్లా కేంద్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం, లోక్ డివిజన్, ధర్మవరం డివిజన్ అంటూ జిల్లా కేంద్రంలోనే తిరుగుతున్నారు తప్ప ఏనాడు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. ఇలాంటి ఉద్యోగులు హెచ్చెల్సీలో దాదాపు 25 మంది విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్టు కీలకమైంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి తాగునీరు, దాదాపు 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టులో పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఉద్యోగుల నియామకాల్లో విపరీతమైన రాజకీయం సాగుతోంది. పలుకుబడి ఉన్న వాళ్లు ఎప్పుడూ కీలక స్థానాల్లో ఉంటున్నారు. పైరవీలు చేయడం... ప్రాధాన్య సీట్లను దక్కించుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు కూడా వీరికే వత్తాసు పలుకు తుండటంతో చాలా మంది ఉద్యోగుల సర్వీసు మొత్తం సుదూర ప్రాంతాల్లోనే సాగుతోంది. వాస్తవానికి నీటి సరఫరా జరిగే సమయంలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా డిప్యుటేషన్లు వేసుకునే వెసులు బాటు ఉంటుంది. సరఫరా ఆగిన తర్వాత యథావిధిగా వారి స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ హెచ్చెల్సీలో ఏళ్లుగా డిప్యుటేషన్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా పైరవీలకే పెద్దపీట..! బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారికి, మ్యూచువల్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ బదిలీలు కావాలని ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 2 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. హెచ్చెల్సీలో ఇప్పటి వరకూ బదిలీల గురించి అధికారికంగా ప్రకటించకపోయినా... ఇప్పటికే ఆ తంతు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పైరవీలతో కొందరు ఉద్యోగులు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొన్ని, డిప్యుటేషన్లతో కొన్ని పోస్టులను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీగానే ముడుపులు ముడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఉద్యోగుల బదిలీలు నేటిలోపు పూర్తి చేయాల్సి ఉంది. జేఈలు, డీఈలు, ఈఈల బదిలీలు ఈఎన్సీ స్థాయిలో ఉంటాయి. మిగిలిన పోస్టులకు ఎస్ఈ స్థాయిలో బదిలీలు చేస్తాం. జీఓ ప్రకారం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామే తప్ప ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి ఉండదు. డిప్యుటేషన్ల రద్దు విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – పురార్థనరెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీహెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే విధులు డిప్యుటేషన్ ముసుగులో తిష్ట అధికారులకు బురిడీ -
నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గుత్తి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు.గుత్తిలో పత్తికొండ రోడ్డులోని వసుధ ఫంక్షన్ హాలులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. గుత్తి పట్టణ, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాటు తుపాకీ స్వాధీనం రాయదుర్గంటౌన్: ఓ వ్యక్తి అక్రమంగా తీసుకెళ్తున్న నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీ హీరేహాళ్ మండలంలోని పాత హడగలి గ్రామం వద్ద సీఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం ఎస్ఐ గురుప్రసాద్ వాహన తనిఖీ చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే పాత హడగలి వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా కోనాపురం గ్రామా నికి చెందిన బోయ గంగన్న పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడన్నారు. అనుమానంతో గంగన్నను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా నాటు తుపాకీ, నల్ల మందు లభ్యమయ్యాయన్నారు. డీ హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలోని ఓ దానిమ్మ తోటలో గంగన్న మామ నాగరాజు పనిచేస్తున్నాడన్నారు. తోటలో తిరుగుతున్న అడవి పందుల నుంచి కాపాడాలని చెప్పడంతో తన గ్రామానికే చెందిన బసవ అనే వ్యక్తితో నాటు తుపాకీ, నల్లమందును తీసుకుని గంగన్న కూడ్లూరుకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏమ్మా.. రేషన్ బియ్యం అన్నం బాగా ఉంటోందా? ● లబ్ధిదారుని ఆరా తీసిన కలెక్టర్ కూడేరు: ‘ఏమ్మా బియ్యం నాణ్యతగా ఉన్నాయా.. అన్నం బాగా అవుతోందా’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ రేషన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కలెక్టర్ మండల పరిధిలోని కమ్మూరులోని రేషన్ షాపులో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. అనంతరం పలువురు కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యంపై ఆరా తీశారు. చిట్టెమ్మ అనే మహిళ ఇంట్లో రేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ కుమార్తె దీక్షను ఏం చదువుతున్నావమ్మా అంటూ పలకరించారు. పదిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు దీక్ష తెలపగా.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించాక ఉన్నత చదువులు చదవాలని, ‘అనంత ఆణిముత్యాలు’ పథకం ద్వారా చదివిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలు మధ్యలోనే చదువులు మానేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఎస్డీటీ లక్ష్మీదేవి తదితరులు వీఆర్ఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
ద్రోహులను పార్టీ ఉపేక్షించదు
● పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ క్రమ శిక్షణ నూతన కమిటీని అధిష్టానం నియమించిందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చైర్మన్గా ఉన్న కమిటీలో సభ్యులుగా తనతో పాటు తానేటి వనిత, రెడ్డిశాంతి, అనిల్కుమార్ ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు, విధివిధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆశయం మేరకు ప్రజలతో పార్టీ కేడర్ ఉండాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచినా, ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న వారిలో పార్టీ మార్పు కోరుతోందని, అయినా వారు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా, ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారన్నారు. బహిష్కరణకు గురైన వారిలో మార్పు రాకుండా అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకత్వంపైన కూడా చర్యలుంటాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన సోనాక్షి అనంతపురం: సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ఆధ్వర్యంలో గోవా వేదికగా గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించగా.. రోలర్ స్కేటింగ్ విభాగంలో జిల్లాకు చెందిన చిన్నారి ప్రతిభ చాటింది. అండర్–5 కేటగిరిలో ఏకంగా రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కె.వేణుగోపాల్, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షిని ఆమె చదువుతున్న మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆదివారం అభినందించింది. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బదిలీ అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం ఉత్తర్వులు రాగా...మధ్యాహ్ననికి ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న వెంకటేశును నియమించారు. అలాగే డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య రెండు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. మరో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీ ఉంది. దీంతో ఈ రెండు స్థానాలను అధికారులు భర్తీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న మునీర్ఖాన్, కర్నూలు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఇక్కడికి బదిలీ చేశారు. అలాగే ఇక్కడి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న సరళను కర్నూలు డీఈఓ పరిధిలోని పాఠ్యపుస్తకాల విభాగానికి బదిలీ చేశారు. ప్రమాదంలో వివాహిత మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి సమీపంలో చోట చేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ఆవులదట్ల గ్రామానికి చెందిన వివాహిత కవిత(28) ఆదివారం తన సోదరుడు నవీన్తో కలిసి ద్విచక్ర వాహనంపై గుండ్లపల్లికి బయల్దేరారు. కదరంపల్లి టోల్గేట్ సమీపంలోకి చేరుకోగానే వెనుకనే ఆర్బీ వంక గొల్లలదొడ్డి గ్రామం నుంచి కెంచానపల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివప్ప ఢీకొన్నాడు. ప్రమాదంలో బలమైన గాయమైన కవితను ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. నవీన్తో పాటు ప్రమాదానికి కారణమైన శివప్ప, అతని తాత ఉలెప్పకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉలెప్పను అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, మృతురాలు కవితకు భర్త నాగరాజు, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. నాలుగు మండలాల్లో విస్తారంగా నిమ్మ సాగు తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పుట్లూరు మండలాలతోపాటు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని రైల్వే కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిమ్మ సాగు విస్తారంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి తాడిపత్రిలోని మార్కెట్ యార్డుకు నిమ్మ కాయలను మంగళ, శుక్ర, ఆదివారాల్లో రైతులు తీసుకువస్తుంటారు. బస్తాలో 1,000 నుంచి 1,100 వరకు నిమ్మకాయలు ఉంటాయి. కాయ నాణ్యత, సైజును బట్టి మూడు రకాలుగా విభజించి వేలం వేస్తారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ ధర గిట్టుబాటు కాకపోతే రైతులు జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మార్కెట్లో తగ్గిన నిమ్మకాయల ధరలు.. గత ఏడాది ఇదే సమయానికి నిమ్మ ధరలు రైతులకు కాస్త వెసులుబాటుగా ఉండేది. అప్పట్లో బస్తా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్ముడు పోయింది. ఈ ఏడాది రుతు పవనాలు వారం రోజులు ముందుగా జిల్లాను పలకరించాయి. దీంతో ఆకాశం మబ్బులు కమ్ముకోవడం, వాతావరణ పరిస్థితులు చల్లబడటంతో నిమ్మ ధరలు అమాంత పడిపోయినట్లుగా తెలుస్తోంది. బస్తా రూ.5వేల నుంచి రూ.1,500 లోపు ఆందోళనలో రైతులు మరింత తగ్గుతాయి నేను తాడిపత్రిలోని మార్కెట్లో డైలీ నిమ్మకాయలు అమ్ముతుంటాను. గత నెలలో రూ.20కి 5 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.10కే 5 కాయలు ఇస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే నిమ్మకాయల ధరలు మరింత తగ్గే అవకాశముంది. – రసూల్బీ, వ్యాపారి, తాడిపత్రి -
● ఇదీ జనమెరిగిన ‘సత్య’ం
ధర్మవరం.. దుర్గంధమయమైంది. ఎటు చూసినా చెత్త కుప్పలు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో పారిశుధ్యం మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో ఎన్నడూ ఇంతటి దుర్భర స్థితిని చూడలేదని... సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటోందో ఊహించుకోలేక పోతున్నామని స్థానికులు అంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
కమ్ముకుంటున్నా.. కరుణించట్లేదు!
అనంతపురం అగ్రికల్చర్: ఆశల నైరుతి రుతుపవనాలు ఈ సారి చాలా ముందుగానే గత నెల 26న ప్రవేశించడంతో అన్నదాతలు సంబరపడ్డారు. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా విస్తారంగా వర్షాలు పడతాయని ఆశించారు. కానీ... ‘నైరుతి’ ప్రవేశించి వారం కావొస్తున్నా ప్రభావం మాత్రం చూపడం లేదు. రుతుపవనాలు రాకమునుపు జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ‘నైరుతి’ ప్రవేశించాక అనుకూల వాతావరణం మధ్య మంచి వర్షాలు కురుస్తాయని ఆశించినా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వారం రోజులుగా అక్కడక్కడా తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షపాతం నమోదు కాలేదు. 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి మేఘాలు చెదిరిపోతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 36 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల 15 నుంచి... జూలై నెలంతా ఖరీఫ్ కింద పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టకపోవడం.. కూటమి సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం లేక సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఇంకా మొదలు కాని ‘నైరుతి’ ప్రభావం గాలి వేగానికి చెదిరిపోతున్న మేఘాలు -
వంచకుడిపై చర్యలు తీసుకోండి
● పోలీసులను ఆశ్రయించిన యువతి ● న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో గుమ్మఘట్ట: ప్రేమ పేరుతో తనను లోబర్చుకుని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి పెద్ద కుమార్తె జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరులో ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో సొంత గ్రామానికి చెందిన నాగప్ప, నాగమ్మ దంపతుల కుమారుడు సురేష్ లోబర్చుకున్నాడు. పెళ్లి పేరుతో మూడేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. ఆమె అడిగిన ప్రతిసారీ తన అన్న పెళ్లి జరిగేంత వరకూ ఓపిక పట్టాలని నచ్చచెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం యువకుడి అన్నకు పైళ్లెంది. దీంతో పది రోజుల క్రితం ఆమె నిలదీయడంతో యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఎస్ఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా విచారిస్తున్నామని తెలిపారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు... కక్కలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144/2ఏలో మొత్తం 1.76 ఎకరాల్లో ఆర్.కృష్ణారెడ్డి కుమారుడు హనుమంతరెడ్డికి 0.73 సెంట్లు, మహమ్మద్ షఫీ కుమారుడు సయ్యద్ షామీర్కు 0.58 సెంట్లు, మహేష్బాబు భార్య జి.విజయలక్ష్మికి 0.08 సెంట్లు, షేక్ మహబూబ్బాషా కుమారుడు షేక్ ఇమాం బాషాకు 0.08 సెంట్ల స్థలం ఉంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గత 20 సంవత్సరాలుగా పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంక్ రుణాలు సైతం పొందారు. ఆ స్థలంలో నీటి బోర్లు, కాంపౌండ్ వాల్, షెడ్డు, డోర్ నంబర్లు, కరెంట్ బిల్లులూ ఉన్నాయి. గత నెల 28న సర్వేయర్ ఉమామహేశ్వర్ ఫోన్ చేసి హద్దులు చూపిస్తానని తెలపడంతో వారు హక్కుదారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ప్రహరీని జేసీబీతో కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం సాగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన 50 మంది అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి తమదంటూ దుర్భాషలాడుతూ హక్కుదారులను పక్కకు లాగేశారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దౌర్జన్యపరులపై ఎలాంటి చర్యలూ లేవు. అలాగే కియా కార్ల షోరూం వెనుక ఉన్న ఎకరాలోపు స్థలంలో కుటుంబ సభ్యులపై అనంతపురం, రాప్తాడు ప్రజాప్రతినిధులకు చెందిన ముఖ్య అనుచరులు దాడి చేశారు. నగరంలోని అరవిందనగర్కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ గుప్తాకు చెందిన ఈ స్థలం అత్యంత విలువైనది. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు శనివారం ఆ స్థలం వద్దకెళ్లి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రసాద్ గుప్తా, అతని కుమారులు ప్రణీత్, సాయినాథ్ అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో వెంకటేశ్ప్రసాద్ గుప్తా చెవికి తీవ్ర గాయమైంది. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కె.సాయినాథ్ మాట్లాడుతూ.. భూ వివాదాలపై ప్రాథమికంగా విచారణ చేపడతామన్నారు. బాధితులకు రాత్రి, ఉదయం ఫోన్ చేసి విచారణకు రావాలని సూచించామని, వారిచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
అడిషనల్ ఎస్పీ సేవలు చిరస్మరణీయం
అనంతపురం: అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ జగదీష్ అన్నారు. అడిషనల్ ఎస్పీ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారని అడిషనల్ ఎస్పీని కొనియాడారు. అనంతరం అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరి ప్రజలకు సేవలు అందించడం సంతృప్తి ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ షేక్ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు రవిబాబు, వెంకటేశులు, శ్రీనివాస్, మహబూబ్ బాషా, నీలకంఠేశ్వర రెడ్డి (ఏఆర్), గురునాథ్ బాబు, ప్రసాదరెడ్డి, బీవీ శివారెడ్డి, ప్రభాకర్, మహేశ్వర్రెడ్డి, ఏఓ రవిరాం నాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ● ఉద్యోగ విరమణ చేసిన పలువురు పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఘనంగా సత్కరించారు. రామాంజినేయులు (ఎస్ఐ) జిల్లా స్పెషల్ బ్రాంచి, చంద్రశేఖర్ (ఎస్ఐ) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అనంతపురం, శ్రీధర్ బాబు (ఏఎస్ఐ) యాడికి, శివశంకర్ (ఏఎస్ఐ) అనంతపురం టూటౌన్, ఈశ్వర్ (ఏఎస్ఐ) కణేకల్లు, అయూబ్ బాషా, హెడ్కానిస్టేబుల్– వన్టౌన్ అనంతపురం, వెంకటేశులు కానిస్టేబుల్– ఒన్టౌన్ పోలీస్ స్టేషన్, అనంతపురం ఉద్యోగ విరమణ చేశారు. వీరిందరికీ ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసనాగ్రహం
● రాజేష్ నాయుడుపై క్రిమినల్ చర్యలకు డిమాండ్ అనంతపురం: మహానాడుకు జన సమీకరణ చేయలేదని వార్డు వెల్ఫేర్ సెక్రటరీ అశ్వత్థరెడ్డిని టీడీపీ 30వ డివిజన్ ఇన్చార్జ్ రాజేష్నాయుడు పరుష పదజాలంతో దూషించడంపై సచివాలయ ఉద్యోగులు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్ యాదవ్కు బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, రామకృష్ణ తదితరులు మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమానికి జనాలను సమీకరించే బాధ్యత సచివాలయ ఉద్యోగులది కాదన్నారు. బాధితుడు అశ్వత్థరెడ్డికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగులను నోటికొచ్చినట్టు తిడుతూ భయభ్రాంతులకు గురిచేస్తే విధులు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నించారు. ● జిల్లాలోని కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి పట్టణాల్లో సచివాలయ ఉద్యోగులు శనివారం ధర్నా చేసి టీడీపీ నేత రాజేష్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదన్నారు. జాబ్చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తిస్తామే తప్ప ఏ పార్టీకీ కొమ్ము కాసే ప్రసక్తే లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
● కారును ఢీకొన్న కేఎస్ఆర్టీసీ బస్సు ● ఒకరు మృతి.. మరో నలుగురికి గాయాలు ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: ఓవర్ టేక్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. కారును కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరానికి చెందిన జాన్రెడ్డి (80), చెన్నమ్మ దంపతులు తమ కుమార్తె షైనీదీప్తి, అల్లుడు రోహన్రెడ్డితో కలిసి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించి శనివారం కారులో తిరుగు పయనమయ్యారు. బూదగవి సమీపంలో బళ్లారి నుంచి ఉరవకొండకు వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో కారును వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జాన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కూతురు, అల్లుడుతో పాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రతమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
●మీ సేవలు అమూల్యం
అనంతపురం అర్బన్: ఉద్యోగులుగా ప్రభుత్వానికి, ప్రజలకు మీరు అందించిన సేవలు అమూల్యమని కలెక్టర్ వినోద్కుమార్ కొనియాడారు. వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణ చేసి అధికారులు, ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తరఫున శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరై ఉద్యోగ విరమణ చేసిన వారికి శాలువా కప్పి మొమెంటో, పూలమొక్క అందించి సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరూ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాక్షించారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
స్టేషన్ పాయింట్ల నమోదులో ఇష్టారాజ్యం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా స్టేషన్ పాయింట్లు (పని చేస్తున్న స్కూల్) గరిష్టంగా 24కు మించి ఉండకూడదు. ఎనిమిదేళ్ల సర్వీసుకు (3వ కేటగిరీ) 24 పాయింట్లు వస్తాయి. ఆపైన 9–10 ఏళ్లు సీనియారిటీ ఉన్నా..గరిష్టంగా ఎనిమిదేళ్లకే పాయింట్లు పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. అయినా కొందరు టీచర్లు ఇష్టానుసారంగా నమోదు చేసుకున్నారు. సరి చేయాల్సిన మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా వందలాది మంది టీచర్లు ఇష్టానుసారంగా స్టేషన్ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ఎస్జీటీ తెలుగులో 3,872 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వీరిలో 84 మంది ఎస్జీటీలు స్టేషన్ పాయింట్లు 24కు పైగా వేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎడిట్ చేయాలని డీఎస్ఈ నుంచి డీఈఓలు, ఎంఈఓలకు ఆదేశాలు వచ్చాయి. పట్టించుకోని ఎంఈఓలు ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను..సంబంధిత టీచర్లతో హార్డ్కాపీలు తెప్పించుకుని వారు వేసుకున్న పాయింట్లను పరిశీలించి ఆమోదం తెలపాలి. చాలా మండలాల్లో ఎంఈఓలు పట్టించుకోని కారణంగా ఈ ప్రక్రియ సరిగా జరగలేదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కంప్యూటర్ల ముందు కూర్చుని వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగానే నిర్ధారించారు. తర్వాత డీఈఓ లాగిన్కు వచ్చిన దరఖాస్తులను కూడా కార్యాలయ సిబ్బంది అలానే నిర్ధారించి పంపారు. ఫలితంగానే వందలాది మంది టీచర్లకు స్టేషన్ పాయింట్లలో తేడా వచ్చింది. వీటిని సరిదిద్దుతున్నామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ‘ప్రత్యేక’ పాయింట్లలోనూ అడ్డదారులు కొందరు టీచర్లు అనుకూలమైన స్థానాలకు వచ్చేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యాలు, వ్యాధుల బారిన పడిన వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నా, ప్రత్యేక పాయింట్లు పొందినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే..లేని రోగాలను సృష్టించుకుని అడ్డదారుల్లో నకిలీ సర్టిఫికెట్లు పొంది పాయింట్లు పొందుతుండడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. డి.హీరేహాళ్ మండలంలో పని చేస్తున్న ఓ ఎస్జీటీ ఇటీవల బైకుపై నుంచి కిందకు పడ్డాడు. ఇదే అదనుగా తనకు మేజర్ సర్జరీ జరిగినట్లు ప్రచారం చేసుకుని నకిలీ సర్టిఫికెట్ తెచ్చుకుని.. ప్రత్యేక పాయింట్లు పొందాలని చూస్తున్నాడు. ఈయన వ్యవహారంపై కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి బదిలీలు, ప్రమోషన్ల కోసం తీసుకున్న మెడికల్ సర్టి ఫికెట్లను పున:పరిశీలించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ ఎవరైనా మెడికల్ సర్టిఫికెట్లను దుర్వినియోగపరిస్తే.. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్న 84 మంది ఎస్జీటీలు అధికారుల పరిశీలనలో వెలుగులోకి.. -
ఏడాదిన్నర నిరీక్షణకు తెర
● తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు పునఃప్రారంభం రాయదుర్గంటౌన్: మరమ్మతులు, అభివృద్ధి పనుల పేరిట దాదాపు ఏడాదిన్నరగా రద్దు చేస్తూ వస్తున్న తిరుపతి – కదిరిదేవరపల్లి రైలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాయదుర్గం ప్రాంత ప్రజలకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. రాయదుర్గం – తుంకూరు మార్గంలో ట్రాక్ పనులు పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు నడుపుతున్న ఏకై క రైలును సైతం రద్దు చేస్తూ వస్తుండడంతో ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఈ రైలు ఇప్పటి దాకా గుంతకల్లు వరకు రాకపోకలకు సాగించేది. 2023 నవంబర్ నుంచి ఈ రైలును రెండు నెలలు, మూడు నెలల పాటు పాక్షికంగా రద్దు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 1న కదిరిదేవరపల్లికి ఈ రైలు (57405) తిరుపతిలో బయల్దేరుతుందని, అలాగే రెండో తేదీన కదిరిదేవరపల్లిలో (57406) రాయదుర్గం మీదుగా తిరుపతికి బయల్దేరుతుందని నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బీఎల్ శివకుమార్ తెలిపారు. రోజూ తిరుపతిలో రాత్రి బయల్దేరి గుంతకల్లు, బళ్లారి మీదుగా రాయదుర్గానికి 11.03 గంటలకు చేరుకుంటుందని, అలాగే కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం స్టేషన్కు మధ్యాహ్నం 3.49 గంటలకు చేరుకుంటుందన్నారు. -
ఒక్క పథకమైనా అమలు చేశారా?
బుక్కరాయసముద్రం: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలలోని దయ్యాలకుంటపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తున్నారన్నారు. హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావడానికి లక్ష్యంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4న నిర్వహించే ర్యాలీలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వెన్నుపోటుకు ఆద్యుడు బాబు రాజకీయాల్లో వెన్నుపోటుకు ఆద్యుడిగా చంద్రబాబు పేరుగాంచారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఆయనకు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. చంద్రబాబు మోసాలకు నిరసనగా నార్పలలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, బీకేఎస్ జెడ్పీటీసీ భాస్కర్, సత్య నారాయణరెడ్డి, నారాయణరెడ్డి, నార్పల ఎంపీపీ నాగేశ్వరరావు, రాఘవరెడ్డి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, గోకుల్రెడ్డి, చామలూరు రాజగోపాల్, నాగలింగారెడ్డి, ప్రసాద్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను నిరసిస్తూ ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
నాణ్యమైన విత్తనం సిద్ధం చేయండి
● ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్య ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నిబంధనల మేరకు నాణ్యమైన విత్తనం సిద్ధం చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్ జి.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. శనివారం ఆయన స్థానికంగా ఉన్న హిమబిందు ప్రాసెసింగ్ ప్లాంట్ను సందర్శించి, అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తనశుద్ధి చేసి ఆర్ఎస్కేలకు సరఫరా చేసిన విత్తనకాయలు బాగలేవని వెనక్కు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించాలని ఆదేశించారు. అవుటన్, తూకాలు కచ్చితంగా ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 40 శాతం రాయితీతో 1.14 లక్షల క్వింటాళ్ల వరకు వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం 15 ప్రాసెసింగ్ ప్లాంట్లలో విత్తనశుద్ధి వేగవంతంగా జరగుతోందన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా 16 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న ఆర్ఎస్కేలకు 8,500 క్వింటాళ్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయశాఖ సహకారంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని, త్వరలోనే విత్తన పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్ వసీం చాంబర్లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి రాజేష్నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం ఇచ్చారు.నేను మాట్లాడేది రికార్డు చెయ్..కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్నాయుడు ఫోన్లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా.. రాత్రి నుంచి ఫోన్చేసినా.. నీ క్లస్టర్ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్ రికార్డు చెయ్ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మంచి సంస్కృతి కాదు..సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శిరాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలి..టీడీపీ నేత రాజేష్నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ -
జెడ్పీలో ఆరుగురికి పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురికి పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ల్యాబ్ అసిస్టెంట్, ఓ రికార్డు అసిస్టెంట్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో భీమయ్య (గుమ్మఘట్ట), ఫకృద్ధీన్ (సిద్దరాంపురం), లక్ష్మన్న (నాగసముద్రం), సాదిక్ బాషా (తగరకుంట), హరికృష్ణ (ముదిగుబ్బ), వెంకటేశులు (కళ్యాణదుర్గం) ఉన్నారు. వీరికి పదోన్నతుల ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేసి, అభినందించారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగులకు శనివారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఈఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. చైర్పర్సన్ సమక్షంలో ఉదయం 9:30 గంటలకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జ్గా నెట్టెం వెంకటేశులును ప్రకటిస్తూ పాలక వర్గం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసినట్లు డీసీఎంఎస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన చాకలి రంగ (45)కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాఆపరుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన రంగ... శుక్రవారం కోమలి – జూటూరు గ్రామాల మధ్య ఉన్న పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ యువజన విభాగంలో పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి (అనంతపురం), రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజేష్ (ఉరవకొండ), రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొర్ల మారుతీనాయుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా జి.రామాంజినేయులు (కళ్యాణదుర్గం), వాసగిరి నాగ్ (అనంతపురం), జోనల్ అధ్యక్షుడిగా వై.ప్రణయ్రెడ్డి (ఉరవకొండ) నియమితులయ్యారు. ‘ఖజానా’లో బదిలీల సందడి అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖజానా శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై బదిలీల నిర్వహణ కమిటీ సభ్యులు అనంతపురం జిల్లా డీడీ వెంకటేశ్వర్లు, ఏటీఓ రాణి, శ్రీసత్యసాయి జిల్లా డీడీ శ్రీనివాసులు, ఏటీఓ పవిత్ర శుక్రవారం అనంతపురంలోని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ చాంబర్లో సమీక్షించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది సీనియర్ అకౌంటెంట్లు, 15 మంది జూనియర్ అకౌటెంట్లు, 12 మంది ఆఫీస్ సబార్డినుట్లు చొప్పున మొత్తం 61 మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకే స్థానంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీనియర్ అకౌంటెంట్లు 19 మంది, జూనియర్ అకౌంటెంట్లు 9 మంది, ఆఫీసు సబార్డినేట్లు 8 మంది ఉన్నారు. అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఖజానా శాఖలో బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అంటూ ఏదీ ఉండదన్నారు. ఖాళీల జాబితా ప్రకటించామని, బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి చేసి స్థానాలను కేటాయిస్తామన్నారు. రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ గుత్తి: రైలులో నగదు, నగలు చోరీ చేస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం మచిలీపట్నం – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులోని కోచ్–1లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఓ ప్రయాణకుడి బ్యాగ్లోని బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు అపహరిస్తుండగా గమనించి మరో ప్రయాణికుడు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. రైలు గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకోగానే జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ కానిస్టుబుల్ భాస్కర్ నాయుడు కోచ్–1లోకి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు, రూ.10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు నంద్యాల జిల్లాకు చెందిన జయరాజ్గా గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్ఏ ఇంగ్లిష్ ఖాళీలు పెంచాలని రెండోరోజూ ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్ల ఖాళీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండోరోజూ శుక్రవారం అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ పదోన్నతుల అంశంపై హైకోర్టులో వేసిన కేసు పరిష్కారమైందన్నారు. 2023, జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 వరకు రూ. 2,500 గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లుగా పనిచేసిన ఎస్జీటీలకు ఇంగ్లిష్ టీచర్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 230 ఖాళీలకు గాను కేవలం 19 మాత్రమే ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని, వీటిని 2023లో తాత్కాలిక పద్ధతిలో ఇచ్చిన 230 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల ఖాళీలుగానే చూపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి 30 శాతం కోటా 103 పోస్టులు కేటాయించి ఇందులో 70 శాతం ఇవ్వాల్సిన పదోన్నతులను కాదని కేవలం 19 మాత్రమే ఇస్తామనడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి సూర్యుడు, చంద్రశేఖర్, నాగభూషణ, జయరాం నాయక్, జయపాల్ నాయుడు, సురేష్, నరసింహులు, మురళి, భాస్కర నాయుడు, రవి, విజయ శ్రీ, పరిమళ, తులసి, మాధవి,ఆదిలక్ష్మి, కౌసర్ బాను పాల్గొన్నారు. ధర్నాకు ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, యూటీఎఫ్ నాగేంద్ర, పీఆర్టీయూ విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్టీఏ నాగిరెడ్డి, శ్రీనివాసులు, రవినాయక్, నాగభూషణ, ఆర్ఈఎఫ్ నారాయణ నాయక్ మద్దతు తెలిపారు. -
రాష్ట్రంలో దగాకోరు పాలన
అనంతపురం ఎడ్యుకేషన్: మహానాడులో చంద్రబాబు ప్రసంగం పరిశీలిస్తే అధికారం నుంచి దిగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే బాధ స్పష్టంగా కనిపిస్తోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనలో అన్ని విధాలుగా దగాపడ్డామనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారన్నారు. టీడీసీ, జనసేనతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే భావనలో ఉన్నారన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు సైతం స్పష్టత వచ్చిందని, అందుకే రానున్న రోజుల్లో అధికారం కోల్పోవాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. చెప్పుకునేందుకు వంద ఉన్నాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ నెరవేర్చారన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధిని సైతం పరుగులు పెట్టించారన్నారు. జగన్ పాలనలో ప్రజలకు చేకూరిన లబ్ధిపై చెప్పుకునేందుకు వంద ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో చెప్పుకునేందుకు ఏ ఒక్కటీ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమల ఊసే లేదు కానీ, అన్నీ అమలు చేశానని చంద్రబాబు గొప్పలకు పోతున్నారని, ఆయనకు అల్జీమర్స్ పీక్స్కు వెళ్లిందనేందుకు ఇదే నిదర్శమన్నారు. ఈ పరిస్థితులను చూస్తూంటే ఆయన కుర్చీని లోకేష్బాబు లాక్కొనే టైం వచ్చిందనే అనుమానం కలుగుతోందన్నారు. వ్యవస్థలన్నీ నాశనం చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అమ్మకాలు, వెనుకబడిన ప్రాంతాల తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. వలంటీర్ల వ్యవస్థ, ఉన్న ఉద్యోగాల రద్దు, సచివాయాలు, ఆర్బీకేలు, మహిళా సాధికారత, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేశారన్నారు. నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు. పథకాల కోసం గొంతెత్తితే గొంతుకోస్తారనే భయాన్ని సృష్టించారన్నారు. రాష్ట్రానికి తనకు తాను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే చంద్రబాబు వాస్తవానికి కరువుకు, అపద్ధాలకు, దగాకోరు పాలనకు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని విస్మరించారన్నారు. అభివృద్ధి పేరుతో ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి, వాటిని పక్కదారి పట్టించడంపై ఉన్న తపన నీళ్లు పారించే విషయంగా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే రాయలసీమకు కాని, గ్రేటర్ రాయలసీమకు గాని తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. గండికోట నుంచి గాలేరు–నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి పథకం తీసుకొచ్చి సగానికి పైగా పనులు చేస్తే చివరకు ఆ ప్రాజెక్ట్ను చంద్రబాబు రద్దు చేశారన్నారు. హంద్రీనీవా మొదటిదశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీల నీటిని అదనంగా తీసుకొచ్చే పనులను ప్రారంభిస్తే ఆ ప్రాజెక్ట్నూ రద్దు చేశారన్నారు. నారా వారి పాలనపై రాయలసీమ ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు పొగాకు రామచంద్ర, కదిరి ఇస్మాయిల్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజి, గంగుల సుధీర్రెడ్డి, బండిపవన్, ఈశ్వరయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
అనంతపురం అర్బన్: బాలకార్మిక వ్వవస్థను నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. బాలకార్మిక వ్వవస్థ నిర్మూలనపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జేసీ సమీక్షించారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలకార్మికులు, డ్రాపౌట్లను గుర్తించి సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలకు విముక్తి కల్పించాలన్నారు. బాలకార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధిబాలలు, యాచన చేస్తున్న వారిని గుర్తించడంతో పాటు పునరావాసం కల్పించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టండి అధికారులకు జేసీ శివ్నారాయణ్ శర్మ ఆదేశం -
బాసిజం... బానిసత్వం ఈ రెండూ నాటికి, నేటికీ రెవెన్యూ శాఖను వీడడం లేదు. ఇది ఏ ఒక్క స్థాయిలోనో అనుకుంటే పొరపాటే. అన్ని స్థాయిలోనూ ఇదే తీరు కొనసాగుతోంది. ఇదేమని ప్రశ్నిస్తే మరింత అణచివేత... విధుల పరంగా వేధింపులు తప్పడం లేదు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు మౌనంగ
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో కీలకంగా ఉండే రెవెన్యూ శాఖ అన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఈ శాఖలో ఉన్నతాధికారుల బాసిజానికి కింది స్థాయి ఉద్యోగులు బానిసలుగా మారక తప్పడం లేదు. ముఖ్యంగా బదిలీల ప్రక్రియలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడుతోంది. అన్ని శాఖల్లోలా ఇక్కడి ఉద్యోగులకు బదిలీలకంటూ ప్రత్యేక కౌన్సెలింగ్ ఉండక పోవడమే ఇందుకు నిదర్శనం. బదిలీ కోసం స్థానాల ఆప్షన్లతో దరఖాస్తు చేసుకోవడం వరకే ఉద్యోగుల వంతు.. అటు తర్వాత ఆ స్థానానికి వారిని బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం అనేది అధికారుల చేతుల్లో ఉంటుంది. ఆప్షన్ ప్రకారం ఇవ్వచ్చు... లేదా ఇవ్వని స్థానానికి బదిలీ చేయవచ్చు. ‘ఎందుకు?... ఏమిటి?... ఎలా?’ అని మాత్రం ప్రశ్నించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారు ‘చుక్కలు’ చూడాల్సిందే. ఇక ‘మేనేజ్’ చేసుకునే సామర్థ్యం ఉన్నవారు కోరిన చోట పోస్టింగ్ పొందవచ్చు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు... సాక్షాత్తూ బానిసత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులే కావడం గమనార్హం. అన్ని స్థాయిల్లోనూ బాసిజం రెవెన్యూ శాఖలో గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి వరకు బాసిజం ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలో బానిసత్వమూ కనిపిస్తోంది. గ్రామ స్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తూ.. పైవారు ఏది చెప్పినా కాదనకుండా చేస్తారు. మండలస్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తారు. డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఏది చెప్పినా (ఆర్థిక, ఆర్థికేతర) కిమ్మనకుండా ఆగమేఘాలపై చేసి పెడతారు. ఒక ఆదేశం జిల్లా స్థాయి అధికారి నుంచి డివిజన్ స్థాయి అధికారికి వస్తే... ఆ ఆదేశం వెంటనే మండల స్థాయికి... అక్కడి నుంచి గ్రామ స్థాయికి వెళుతుంది. ఎలా చేస్తారు? అనేది పైవారికి అవసరం లేదు. వారు చెప్పింది చేయాలి... చేయకపోతే ‘సినిమా’ చూడాల్సిందే. ఇక్కడ నో కౌన్సెలింగ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీల సమయంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ప్రకియ అనేది నిర్వహించడం పరిపాటి. అదికూడా ఉద్యోగుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తుంటారు. చివరికి పోలీసు శాఖలోనూ కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో చూపించిన ఖాళీల్లో వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తుంటారు. ఇక మెప్మా, గ్రంథాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ను స్వయంగా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అయితే రెవెన్యూశాఖలో ఈ విధానం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ విధానం లేదు. బదిలీలు చేయడంలోనూ అధికారుల బాసిజమే పనిచేస్తుంది. అధికారులు బదిలీ చేసిన స్థానాలకు మారుమాట్లాడకుండా ఉద్యోగులు వెళ్లాల్సిందే. స్టేషన్ అమలు కాదు... రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. ప్రధానంగా ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి అనే నిబంధన విషయంలో ‘స్టేషన్’ అమలు కాదు. ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ) బదిలీల క్రమంలో మండలం స్టేషన్గా తీసుకోకుండా... గ్రామం స్టేషన్గా తీసుకుంటున్నారు. దీంతో పలువురు వీఆర్ఓలు ఒక మండలంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ అవుతున్నారే తప్ప ఆ మండలం వీడడం లేదు. ఇక డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు విషయంలో డివిజన్ స్టేషన్గా తీసుకోవడం లేదు. దీంతో వారు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దారు, పౌర సరఫరాల కార్యాలయాల్లో... ఇలా ఇక్కడిక్కడే పోస్టింగ్ పొందుతూ ఒకే స్టేషన్లో ఏళ్లుగా పాతుకుపోతున్నారు. ఈ విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వస్తుండం గమనార్హం. రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లోనూ ఇదే తీరు బదిలీల్లోనూ ఇదే వైఖరి ఉద్యోగులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ అంటూ లేదు అధికారులు పోస్టింగ్ ఇచ్చిన చోటుకు వెళ్లాల్సిందే -
చౌక దుకాణాల వద్దే రేషన్
● నిస్సహాయులకు ఇంటి వద్దకే పంపిణీ అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా రేషన్కార్డుదారులకు జూన్ నెలకు సంబంధించి బియ్యం, తదితర సరుకులు చౌక ధరల దుకాణాల (స్టోర్) వద్దే పంపిణీ చేస్తారని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. 65 ఏళ్ల వయసున్న వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. చౌక దుకాణాల్లో ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో డీలర్లు కార్డుదారులకు అసౌకర్యం కల్పించినా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైళ్లు సమగ్రంగా సిద్ధం చేయాలి ● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశంఅనంతపురం అర్బన్: నిషేధిత భూముల జాబితాలో ఉన్న చుక్కల భూములు, 22ఏ భూముల ఫైళ్లను సమగ్ర వివరాలతో సిద్ధం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలోని భూముల ఫైళ్లు సమగ్రంగా లేకపోతే వాటిని పరిష్కరించలేమన్నారు. చెక్లిస్ట్ ప్రకారం అన్ని వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమగ్రంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం 22ఏకు సంబంధించి 16 క్లెయిమ్లను, చుక్కల భూములకు సంబంధించి 31 దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నవాటిని ఆమోదించారు. వివరాలు సమగ్రమంగా లేని వాటిని పునః పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఆర్బీఎస్కే శ్రీనివాస్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. పుట్టపర్తిలో జరిగిన ఘటన పోలీసుల పుణ్యమా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలకే దొంగ, కేటుగాళ్లకు కేటుగాడు వంటివి సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ పు
ఎన్ఆర్ఐని చీటింగ్ చేసిన కేసులో భారీ ట్విస్టులు ● నిందితుడిని పోలీస్స్టేషన్లో పెట్టి స్థిరాస్తుల బదలాయింపు ● పోలీసుల ఆధ్వర్యంలోనే నిందితుడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి ● కేసు నమోదు చేసిన వారానికి అరెస్టు చూపించిన పోలీసులు ● పోలీసు అధికారులకు రూ.50 లక్షల డీల్ కుదిర్చిన టీడీపీ నేతలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడైన ఆర్వీన్ మహేంద్రకర్ను పుట్టపర్తికి చెందిన సత్యనారాయణ రాజు రూ.12.50 కోట్ల మేర మోసం చేశారు. ఈ కేసులో బాధితుడికి పెద్దగా లాభం చేకూరకపోగా నిందితుడి నుంచి పోలీసులకు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు, ద్వితీయశ్రేణి నాయకులకు బాగా లబ్ధి కలిగింది. పోలీసులకు రూ.50 లక్షల డీల్ ఎన్ఆర్ఐ మోసపోయిన కేసులో పోలీసులకు రూ.50 లక్షల డీల్ కుదిరినట్టు తెలిసింది. ఈ నెల 22న బాధితుడి ఫిర్యాదు మేరకు సత్యనారాయణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. 28వ తేదీ వరకు అరెస్టు చూపించలేదు. ఈ ఏడు రోజుల పాటు నిందితుణ్ని స్టేషన్లో హింసించి.. లొంగదీసుకుని దారికి తెచ్చుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, ఒక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారు. తాము చెప్పినట్టు చేస్తే మీకు రూ.50 లక్షలు ఇస్తామని టీడీపీ నాయకులు పోలీసు అధికారికి చెప్పడంతో తలూపిన సదరు అధికారి బాధితుణ్ని గోప్యంగా ఉంచి.. చేయాల్సిందంతా చేశారు. ఆస్తుల బదలాయింపు నిందితుడి పేరిట ఎక్కువ మొత్తంలో భూములు, స్థలాలు ఉన్నాయి. వీటిని కొట్టేయాలనేదే ప్రధాన ఆలోచన. పథకంలో భాగంగా అరెస్టుకు ముందే నిందితుడి పేరున ఉన్న కొన్ని భూములు ఓ మహిళ (ఎన్ఆర్ఐ భార్య) పేరిట బదలాయించారు. ఈమె పుట్టపర్తిలో పూల వ్యాపారం చేసుకునేది. వీసా సమస్య వస్తుందని గతంలో మహేంద్రకర్కు సదరు మహిళతో ప్రస్తుత నిందితుడు సత్యనారాయణరాజు పెళ్లి జరిపించారు. ప్రవాస భారతీయుడైన మహేంద్రకర్కు ఇక్కడి విషయాలు తెలియవు. దీంతో ఈమెను టీడీపీ నాయకులు, పోలీసులు భయపెట్టి తమ వైపు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణరాజు పేరుపై ఉన్న ఆస్తులు బుక్కపట్నం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో (డాక్యుమెంటు నంబర్లు 1563, 1564, 1584) ఆమె పేరుపై బదలాయించారు. ఏకంగా పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు ఎస్కార్టు వాహనాల్లో నిందితుణ్ని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారంటే పోలీసులు ఏ స్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు. ముందుగా ఆమె పేరుతో బదలాయించి.. ఆ తర్వాత తక్కువ ధరకు టీడీపీ నేతలు రాయించుకోవాలనేది ఎత్తుగడ. నిందితుణ్ని వారం రోజులు అరెస్టు చూపించకుండా చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ఇక్కడ భారీగా లబ్ధిపొందిన పోలీసు అధికారిపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐతో కలిసి పోలీసు బాస్లకు వసూళ్లు చేసి పెట్టడంలోనూ ఈ అధికారికి ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అరాచకాలు సత్యసాయి భక్తులకు విస్మయం కలిగిస్తున్నాయి. ఎన్నో దేశాల నుంచి సాయి సన్నిధికి భక్తులు వస్తుంటారు. ఇలా పోలీసులే నిందితుల నుంచి వసూళ్లు మొదలెడితే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. తీవ్ర విమర్శలు రావడంతో పుట్టపర్తి పోలీసులు తమను తాము కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమ ప్రయోజనాలను ఏమాత్రమూ పట్టించుకోని ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా తాను రాయలసీమ ప్రాంత వాసి అని మహానాడులో చెప్పారని, ఆయనకు ఈ ప్రాంతం ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం గండికోట రిజర్వాయర్ను పట్టించుకోకపోవడం, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కోస్తా జిల్లా నేతలతో కలిసి ధర్నాలు చేయడం, విభజన హామీల్లో అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించడం, కర్నూలుకు రావాల్సిన హైకోర్టును.. బెంచ్ వరకే పరిమితం చేయడం వంటివి చేసిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గాలేరు నగరి, హంద్రీ–నీవాకు పునాదిరాయి మాత్రమే వేశారని, 1996 నుంచి ఏళ్ల తరబడి సీఎంగా పని చేసిన చంద్రబాబు ఆ ప్రాజెక్టులను ఒక్క కిలోమీటర్ కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. 40 టీఎంసీల సామర్థ్యం గల హంద్రీ–నీవాను 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చిన జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీ–నీవాను అనంతపురం, కర్నూలు జిల్లాకు పరిమితం చేసి, గండికోట నుంచి చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు నీరందించి హంద్రీ–నీవాను అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుని.. సీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అనంత పేర్కొన్నారు. జగన్ హయాంలో గండికోటకు 27 టీఎంసీల నీరు తీసుకువచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో హంద్రీ–నీవాకు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, మరి జగన్ హయాంలో రూ.2వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన విషయాన్ని దాచిపెడితే ఎలా బాబూ అన్ని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం హామీలు నెరవేర్చాలంటే తనను అధికారం నుంచి దించవద్దని, మళ్లీ గెలిస్తేనే హామీలకు గ్యారెంటీ అని, ఇప్పట్లో హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని చెప్పకనే చెబుతూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని అనంత మండి పడ్డారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తామని.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పింఛన్ల కోత విధించి అర్హులకు అన్యాయం చేశారన్నారు. మహానాడు పేరిట మహాడ్రామా కడపలో టీడీపీ నిర్వహించింది మహానాడు కాదని మహాడ్రామా అని అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. మూడు రోజుల కార్యక్రమమంతా ఆత్మస్తుతి పరనిందగా సాగిందన్నారు. ప్రజలకు ఏం చేస్తామనే విషయంపై నోరు మెదపలేదన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబును ఉద్దేశించి ఏం మాట్లాడారో ఆ వీడియోలను మహానాడులో ప్రదర్శించి ఉంటే బాగుండేదన్నారు. మామకు చేసిన మోసాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు నమ్మబోరన్నారు. లోకేష్ తనకు తాను యువరాజులా భావిస్తూ ఆరు శాసనాలు అనడం, దాన్ని గేమ్ఛేంజర్ అంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో శాసనాలు ఉండవని గుర్తు చేశారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేశ్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జూన్ 4న వెన్నుపోటు దినం ఎన్నికల హామీలు అమలు చేయకుండా కూటమి చేసిన మోసాన్ని వివరిస్తూ జూన్ 4న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినాన్ని చేపడుతున్నట్లు అనంత తెలిపారు. సమన్వయకర్తలతో కలసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, మల్లెమీద నరసింహులు, చింతా సోమశేఖర్రెడ్డి, నాయకులు కృష్ణవేణి, మధు, కేశవరెడ్డి, పుల్లయ్య, గుజ్జల శివయ్య, సాకే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం ఎన్నికల హామీల అమలులో తాత్సారం జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
టీబీ డ్యాంకు 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఏప్రిల్ 24 వరకు జీరో ఇన్ఫ్లో ఉండి 6.871 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే ఈ నెల మొదటి వారం నుంచి ఇన్ఫ్లో మొదలవడంతో శుక్రవారం ఉదయానికి 15,777 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదై నీటి నిల్వ 13.680 టీఎంసీలకు చేరింది. ఎగువ భాగం ఆగుంబే, తీర్ధనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. టీబీ డ్యాం లో 1,633 అడుగులకు గాను 1592.96 అడుగుల నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 153 క్యూసెక్కులు ఉంది. కాగా గత ఏడాది ఇదే సమయానికి 3.330 టీఎంసీల నీరు నిల్వ ఉండి, ఇన్ఫ్లో జీరో, అవుట్ఫ్లో 30 క్యూసెక్కులు ఉండేది. విత్తన నాణ్యతలో రాజీ పడంఅనంతపురం అగ్రికల్చర్/ బెళుగుప్ప: నాణ్యతా ప్రమాణాల మేరకు విత్తన వేరుశనగ శుద్ధి (ప్రాసెసింగ్) చేపట్టి రైతులకు మంచి విత్తనం అందేలా చూడాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం అనంతపురంలోని విజయ ఆగ్రోసీడ్స్, బాలాజీ ట్రేడర్స్, వేంకటేశ్వర ట్రేడర్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లతో పాటు బెళుగుప్పలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. మొలకశాతం, అవుటన్ గురించి ప్రయోగత్మాకంగా తెలుసుకున్నారు. సరఫరాకు సిద్ధంగా ఉన్న వేరుశనగ బస్తాలు తూకం వేసి చూశారు. విత్తన నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, నాసిరకమని గుర్తించినా, బాగా లేవని వెనక్కి వచ్చినా సంబంధిత ప్లాంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 శాతం రాయితీతో 50,952 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టామని, జూన్ మొదటి వారంలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. జేడీఏ వెంట ఏడీఏ ఎం.రవి, టెక్నికల్ ఏఓ రాకేష్నాయక్, ప్రాసెసింగ్ ప్లాంట్ల పర్యవేక్షక ఏఓలు కిరణ్కుమార్రెడ్డి, సాయిలక్ష్మి, శేఖర్రెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
పాయింట్లపై ఫిర్యాదుల వెల్లువ
● స్టేషన్ పాయింట్లు 24కు మించి ఉండకూడదు ● 26, 28, 30 పాయింట్లు పొందిన టీచర్లపై ఫిర్యాదులు ● స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాల విడుదల ● అభ్యంతరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అధికారులు ● నేడు ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీల్లో భాగంగా ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసుకున్న పాయింట్లపై శుక్రవారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గురువారం అర్ధరాత్రి స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితాలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయాన్నే పరిశీలించి.. కొందరు పాయింట్లు ఎక్కువ వేసుకోవడాన్ని గుర్తించి నగరంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాల వద్దకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు తరలివచ్చారు. ఒక స్కూల్లో ఎన్నేళ్లు పనిచేసినా గరిష్టంగా ఎనిమిదేళ్లకు 24 పాయింట్లు (3వ కేటగిరీ) పొందాలి. ఒక టీచరు పదేళ్లు పనిచేసినా వేసుకోవాల్సింది 24 పాయింట్లు. ఆ రకంగా సీలింగ్ పెట్టారు. సాంకేతిక సమస్య కారణంగా ఎన్నేళ్లు నమోదు చేసినా అన్ని పాయింట్లు పడ్డాయి. రీఅపోర్సన్కు గురైన టీచర్లు కూడా ఇష్టానుసారంగా పాయింట్లు నమోదు చేశారు. దీనిపై ఎంఈఓలు, డీఈఓలు పరిశీలించి అభ్యంతరాలు స్వీకరించి అదనంగా పడిన పాయింట్ల తొలిగింపునకు సిఫార్సు చేయాలంటూ విద్యాశాఖ డైరక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దాదాపు ఏ ఒక్క మండలంలోనూ ఈ పని జరగలేదు. ఎంఈఓల లాగిన్లకు వచ్చిన దరఖాస్తులను వచ్చినవి వచ్చినట్టు అఫ్రూవల్ చేసి డీఈఓ లాగిన్కు పంపారు. డీఈఓ కార్యాలయ టెక్నికల్ సిబ్బంది కూడా వాటిని వెంటనే అఫ్రూవల్ చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు. 300కు పైగా అభ్యంతరాలు స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలను పరిశీలించిన టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపారు. సుమారు ఆధారాలతో రాతపూర్వకంగా 300కు పైగా ఫిర్యాదులు చేశారు. వాటన్నింటినీ డెప్యూటీ డీఈఓల ద్వారా రాష్ట్ర అధికారుల లాగిన్లకు పంపారు. శనివారం రోజుకు ఫైనల్ జాబితా విడుదల కానుంది. ఆలోగా ఎన్ని అభ్యంతరాలు పరిష్కారమవుతాయో.. తాము ఎన్నో స్థానంలో ఉంటామోనన్న ఆందోళన చాలామంది టీచర్లకు పట్టుకుంది. కాగా శనివారం ఎస్జీటీ తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదల కానుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీపై దుమారం చాలామంది అనర్హులు ప్రిపరెన్షియల్ కేటగిరీ జాబితాలో కనిపించడం పట్ల ఉపాధ్యాయుల్లో దుమారం రేపుతోంది. గార్లదిన్నె మండలంలో పని చేస్తున్న ఓ టీచరు.. కంటిచూపు తగ్గిందని వైద్య ధ్రువీకరణ పత్రం పొంది ప్రిఫరెన్షియల్ కేటగిరీలో హెచ్ఎం పదోన్నతి పొందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ల తాత్కాలిక సీనియార్టీ జాబితాలోనూ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న టీచర్ల పేర్లను చూసి కంగుతింటున్నారు. సీకేపల్లి, అనంతపురం రూరల్, గుత్తి, రొళ్ల, శింగనమల, బత్తలపల్లి, కూడేరు, కణేకల్లు, ధర్మవరం, పెనుకొండ తదితర మండలాల పరిధిలోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అవయవాలు బాగున్నవారు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నారంటూ వాపోతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత సహజంగానే వివిధ రోగాల బారిన పడుతుంటారని, కొందరు వాటిని అసరగా చేసుకుని ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు పొందారంటున్నారు. ఎస్జీటీల జాబితాల్లో కుప్పలుతెప్పలుగా నకిలీరాయుళ్లు కనిపిస్తారంటున్నారు. -
చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన
● మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: ఎమర్జెన్సీ తలపించేలా పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులపై తప్పుడు కేసులు బనాయించి వారిని జైలుకు పంపించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అండ్ కో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. సంపద సృష్టి, సూపర్ సిక్స్ హామీలు కేవలం చంద్రబాబు అభూత కల్పనగానే మిగిలిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. పాలన గాడి తప్పడంతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటి పోతున్నాయన్నారు. లిక్కర్ స్కాంలో అసలైన దోషి చంద్రబాబు అని బెయిల్పై బయటకు వచ్చి పాలన సాగిస్తున్నాడనే విషయాన్ని టీడీపీ పెద్దలు గుర్తించాలన్నారు. రైతుల శ్రేయస్సును పూర్తిగా విస్మరించిన క్రెడిట్ కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. -
జెడ్పీలో బదిలీలకు రంగం సిద్ధం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లా, మండల పరిషత్ సహా అనుబంధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితా ఇప్పటికే పూర్తి స్థాయిలో రూపొందించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత అవకాశాన్ని బట్టి రిక్వెస్ట్ బదిలీలకు చోటు కల్పించాలని సూచించింది. బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులు 236 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ యాజమాన్యం పరిధిలో పని చేస్తున్న వారిలో 236 మంది ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. వీరిలో ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారు 136 మంది ఉండగా 131 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రిక్వెస్ట్ బదిలీల కోసం ఏకంగా వంద మంది దరఖాస్తు చేసుకున్నారు. అటెండర్లలో 64 మంది ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకోగా బదిలీల కోసం 59 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జాబితా సిద్ధం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిషత్ కార్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మందిని బదిలీ చేయవచ్చనే సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక బృందం రూపొందించిన జాబిత పరిశీలన కోసం సీఈఓ వెంకటసుబ్బయ్య టేబుల్పైకి గురువారం చేరింది. ఆయన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. కొందరు అటెండర్లు పదేళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. మరి కొందరు జిల్లా కేంద్రం దాటి బయటకు పోవడం లేదు. ఇక్కడిక్కడే జెడ్పీ లేదా పీఆర్ఐ, పీఐయూ, క్యూసీ, ఆర్డబ్ల్యూఎస్ ఇలా ఏదో ఒక ఆఫీసుకు బదిలీ చేయించుకోవడం పరిపాటిగా మారింది. జెడ్పీలో పని చేస్తూ ఏడాది కిందట ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు తిరిగి జెడ్పీకి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల ఇళ్లు, జెడ్పీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు అనారోగ్యం సాకు చూపిస్తూ అందుకు అనుగుణంగా సర్టిఫికెట్లు సైతం సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేడు తుది ఆమోదం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వద్దకు శుక్రవారం పంపనున్నారు. ఆమె పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాత బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. శని లేదా ఆదివారంలోపు కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించే ఆలోచనలో జెడ్పీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ వెంకటసుబ్బయ్య పరిశీలనకు అర్హుల జాబితా నేడు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనుమతి కోసం ఫైల్ -
ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా డాక్టర్ పీపీ రావు
గార్లదిన్నె: మండల పరిధిలోని దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల, శిక్షణ, పరీక్షణ సంస్థ (ట్రాక్టర్ నగర్) డైరెక్టర్గా గురువారం డాక్టర్ పీపీ రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన డాక్టర్ బాలాజీ మురారి నాందేడ్ను మధ్యప్రదేశ్లోని బుద్ని సంస్థకు బదిలీ చేశారు. కాగా, డాక్టర్ పీపీ రావు 2016 నుంచి 2022 వరకు ట్రాక్టర్ నగర్ డైరెక్టర్గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి పొడిగింపు అనంతపురం అర్బన్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించినట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ నిర్ణయం మేరకు అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు లేదా కొత్త కార్డులు జారీ చేసే వరకు (ఏది ముందు జరిగితే అప్పటి వరకు) పొడిగించినట్లు పేర్కొన్నారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ గుంతకల్లు రూరల్: గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విజయ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ గుంతకల్లు మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులను అభివృద్ధి పనులు చేపట్టకుండా అధికారులు, సర్పంచులు ఉమ్మడిగా కాజేశారంటూ ధర్మహ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ అధికారిగా డీఎల్పీఓ విజయ్కుమార్ నియమించడంతో ఆయన గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో వీరాంజనేయులు సమక్షంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులను విచారిస్తూ రికార్డులు పరిశీలించారు. 5న జాబ్ మేళా అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జూన్ 5న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లా రెడ్డి తెలిపారు. ఎంపికై న వారు ఐఆర్ఈపీ సంస్థ (ఎన్బీఎఫ్సీ)లో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి, ప్రొద్దుటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, చిత్తూరు, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. సేల్స్ ఆఫీసర్, సీనియర్ సేల్స్, ఆఫీస్ అడ్మిన్, కలెక్షన్ ఎక్జిక్యూటీవ్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి 35 సంవత్సరాల్లోపు వయసు న్న వారు అర్హులు. ఎన్బీఎఫ్సీ, ఎంస్ఈ, ఎంఎస్ఎంఈల్లో అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి రూ.3.6 లక్షల వార్షిక వేతనం, రూ.2.4 లక్షల వార్షిక వేతనం అందిస్తారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
పుట్లూరు: మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన తోలు కృష్ణయ్య, సరస్వతి దంపతుల రాజకుళ్లాయప్ప (24) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కృష్ణయ్య, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, కొన్నేళ్ల క్రితమే కుటుంబ పెద్ద కృష్ణయ్య మృతి చెందాడు. అప్పటి నుంచి చిన్న కుమారుడు రాజకుళ్లాయప్ప వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతకూ రాజకుళ్లాయప్ప ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి తల్లి సరస్వతి బోరున విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాము కాటుతో మహిళ... బెళుగుప్ప: మండలంలోని అంకంపల్లి గ్రామానికి చెందిన పాటిల్ ప్రభాకర్రెడ్డి భార్య సావిత్రమ్మ(60) పాము కాటుకు గురై మృతి చెందింది. గ్రామానికి సమీపంలోనే ఉన్న తమ తోటలో గురువారం ఉదయం కూలీలతో పనులు చేయిస్తున్న భర్తకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకెళ్లిన ఆమె అనంతరం కూలీలతో కలసి కలుపు తీత పనుల్లో నిమగ్నమైంది. ఆ సమయంలో రక్త పింజరి కాటు వేసింది. వెంటనే విషయాన్ని గుర్తించిన కూలీలు పామును కట్టెలతో కొట్టి చంపేశారు. సావిత్రమ్మను ఆగమేఘాలపై అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. డీసీసీబీ చైర్మన్గా ముంటిమడుగు కేశవరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జిగా ముంటిమడుగు కేశవరెడ్డి నియమితులైనట్లు సీఈఓ కె.సురేఖారాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశవరెడ్డి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిసియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ జారీ చేశారన్నారు. మహానాడులో జీఆర్పీ హెచ్సీ హల్చల్ సాక్షి, టాస్క్ఫోర్స్: కడపలో జరుగుతున్న మహానాడులో గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వాసు హల్చల్ చేశారు. రెండో రోజు (28వ తేదీ) కార్యక్రమాల్లో పాల్గొన్న వాసు.. టీడీపీ నేతలు ఇసురాళ్లపల్లికి చెందిన కిట్టుయాదవ్, లచ్చానుపల్లికి చెందిన రామాంజినేయులుతో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. కాగా, ఈ నెల 11న గుత్తి టీడీపీ సీనియర్ నేత కోనంకి కృష్ణపై పార్టీ కార్యాలయంలోనే వాసు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కోనంకి కృష్ణ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి వాసు ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ నేతగా చెలామణి అవుతున్నాడు. -
పదోన్నతులు కోరుతూ ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో అర్హులైన ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) పదోన్నతులు కల్పించాలంటూ బాధిత టీచర్లు గురువారం స్థానిక శారదా నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నా చేపట్టారు. ఆందోళనకు పీఆర్టీయూ, ఏపీటీఎఫ్, వైఎస్సార్టీఏ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ (1938), ఆప్టా, ఎన్టీఏ, ఎంఈఎఫ్, పీడీ అసోసియేషన్ తదితర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ.. గతంలో ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి 230 మందికి పదోన్నతులు ఇచ్చారని, కోర్టు వివాదం కారణంగా వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేశారని గుర్తు చేశారు. రూ.2,500 గౌరవ వేతనంతో మూన్నెళ్లకు పైగా పని చేశామన్నారు. ప్రస్తుతం ఆ పోస్టుల్లో కేవలం 19 మందిని మాత్రమే చూపిస్తున్నారన్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న డీఈఓ ప్రసాద్బాబు శిబిరం వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) పదోన్నతుల ఖాళీల విషయమై పాఠశాల విద్య డైరెక్టర్కు లేఖ రాసినట్లు తెలిపారు. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూర్యుడు, రమణారెడ్డి, రామాంజనేయులు, సిరాజుద్దీన్, రాయల్ వెంకటేష్, లింగమయ్య, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ నాయక్, కరణం హరికృష్ణ, శ్రీధర్గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జయరాం నాయక్, వెంకటరత్నం, శంకరమూర్తి, జైపాల్ నాయుడు, చంద్రశేఖర్, సుధాకర్, హరి ప్రసాద్ రెడ్డి, బండారు శంకర్, నరసింహారెడ్డి, రవి నాయక్, వాణిశ్రీ త్రివేణి విజయశ్రీ, లక్ష్మీదేవి, కౌసర్ భాను,సురేష్, కేశవరెడ్డి, నాగభూషణ, ఈరప్ప, నరసింహులు, శేషగిరి, వెంకటరమణ పాల్గొన్నారు. -
‘ఆర్డీటీ’ పరిరక్షణకు పాదయాత్ర
కళ్యాణదుర్గం: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన ఆర్డీటీ పరిరక్షణను అందరూ బాధ్యతగా స్వీకరించాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలనే డిమాండ్తో జూన్ 4వ తేదీ నుంచి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులతో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామితో కలసి గురువారం ఆయన సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దీటుగా పేదరిక నిర్మూలనకు ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ను ప్రభుత్వాలు అడ్డుకున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యక్తపై ప్రజలను చైతన్యపరిచేందుకు సంస్థ సేవలను జిల్లాలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి జూన్ 4న పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా మొత్తం 62 గ్రామాలలో 209 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందన్నారు. ఉద్యమానికి కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, తదిరాలను కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పల్లెపల్లె నుంచి ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన ప్రతి కుటుంబమూ ఓ ఉప్పెనలా తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరప్ప, ఎంపీపీ ఆంజనేయులు, మున్సిపాలిటీ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, ఎంఎస్ హనుమంతరాయుడు, కంబం చంద్రశేఖర్రెడ్డి, కె.హనుమంతరాయుడు, కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, పార్టీ అనుబంధ విభాగాల కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణ్ణ్ణమూర్తి, హనుమంతరెడ్డి, రామాంజినేయులు, నాయకులు గోపాలరెడ్డి, మంజునాథ్, తిప్పేస్వామి, ఫయాజ్, దాదు, కిరణ్, నరసింహులు, చరణ్, పాతలింగ, భాస్కర్, షెక్షావలి, మురళి, రాజు, పాండు, ఇబ్రహీం, అజయ్, ప్రతాప్, రామిరెడ్డి, మల్లికార్జున, తిమ్మారెడ్డి, కిరీటి యాదవ్, దేవ, మల్లి, సుధాకర్, నారాయణస్వామి, కేశవ్ గౌడ్, జానీ, జయరామిరెడ్డి, సుబ్బరాయుడు, గంగాధర్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ 4న గొంచితండా నుంచి ప్రారంభం 62 గ్రామాలు....209 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య -
ఖరీఫ్ సీజన్కు సిద్ధం కండి
● కలెక్టర్ వినోద్కుమార్ బుక్కరాయసముద్రం: ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. బీకేఎస్ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి జెడ్పీ హైస్కూల్లో గురువారం వ్యవసాయ, ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ రైతుల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో 100 శాతం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. విత్తనశుద్ధి వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ, ఏపీసీడ్స్ డీఎం సుబ్బయ్య, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, తహసీల్దార్ పుణ్యవతి, సెరికల్చర్ అధికారి ఓబిలేసు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి రైతులు పంటల సాగులో సాంకేతిక పరిజ్ఞానం అందింపుచ్చుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ‘జిల్లాస్థాయి వికసిత కృషి సంకల్ప అభియాన్’ ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ వినోద్కుమార్ హాజరై మాట్లాడారు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జూన్ మొదటి వారం వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న పాల్గొన్నారు. -
పడకేసిన వైద్యం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక వైద్యం పడకేసింది. కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వైద్య రంగం తిరోగమనంలో వెళుతోంది. మందుల కొరత, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం నిత్యకృత్యమయ్యాయి. ఇక పేదలకు అపర సంజీవనిగా వెలుగొందిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం కావడంతో ప్రజల కష్టాలు చెప్పనలవిగా మారాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50 శాతం మంది తమకు మందులు అందడం లేదని చెప్పారు. చాలాచోట్ల యాంటీబయాటిక్స్ లేవు. పాముకాటు మందు లేదు. గర్భిణులకు కాన్పు సమయంలో ఇచ్చే ఇంజెక్షన్లు లేవు. అంతెందుకూ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం ఆస్పత్రిలోనే మందులు లేవు. పీహెచ్సీ నుంచి బోధనాసుపత్రి వరకూ మందుల కొరత రోగులను వేధిస్తోంది.దారుణ పరిస్థితులు..ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రక్తపరీక్షలు సరిగా జరగడం లేదు. ఎమర్జెన్సీ మందులు లేవని సిబ్బంది వాపోతున్నారు. చిన్నారులకు ఇచ్చే టీకాలు కూడా సరిగా సరఫరా కావడం లేదని చెబుతున్నారు.‘ఆరోగ్య శ్రీ’ నిర్వీర్యం..2019–24 మధ్య కాలంలో అప్పటి సీఎం జగన్ చొరవతో ఆరోగ్యశ్రీ పథకం కొత్త జవసత్వాలు నింపుకుంది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 3,250 జబ్బులకు ఈ పథకం ద్వారా చికిత్సలు అందించేవారు. అయితే, చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కారు ఏర్పటినప్పటి నుంచి పథకం ప్రకారం ‘ఆరోగ్య శ్రీ’ని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు రెండు మాసాలకోసారి సమ్మెకు దిగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో ‘ఆరోగ్య శ్రీ’ని ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో పథకం పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.గాల్లో దీపంలా 108, 104 ..ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందిని ఆపత్కాలంలో ఆదుకున్న 108 అంబులెన్సులు నేడు షెడ్డుకు చేరాయి. అంబులెన్సుల నిర్వహణా సంస్థను మార్చారు. పాత వాహనాలన్నీ రాప్తాడు వద్ద షెడ్డులో పడ్డాయి. కాల్ వెళ్లిన 30 నిమిషాల్లో ఘటనా స్థలికి వెళ్లాల్సిన అంబులెన్సు నేడు గంటకు కూడా రావడం లేదు. ఇక 104 అంబులెన్సులకు కూటమి సర్కారు రాగానే కాలం చెల్లింది. గతంలో నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు, గర్భిణులకు మందులివ్వడంతో పాటు వైద్య పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. 104 వాహనాలు పల్లెలకు వెళ్లక ఏడాది అవుతోంది.పెనుకొండలో మెడికల్ కాలేజీకి గ్రహణం...శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్ జగన్ హయాంలో రూ.375 కోట్లతో మెడికల్ కాలేజీకి పునాది వేశారు. కూటమి సర్కారు వచ్చాక దీన్ని ముందుకు కదలనివ్వలేదు. ఉమ్మడి జిల్లా అంతటికీ కలిపి ఇప్పటికీ ‘అనంత’లో ఒక్కటే మెడికల్ కళాశాల ఉంది. కొత్త కాలేజీ వస్తే శ్రీ సత్యసాయి జిల్లాకు వరం అయ్యేది. కానీ ‘కూటమి’ దీన్ని కాలరాసింది. -
అధికారుల తప్పిదం... విద్యార్థులకు శాపం
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులకు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ హైస్కూల్, బీపీఎస్ (బేసిక్ ప్రైమరీ స్కూల్) విద్యార్థులు బలవుతున్నారు. 117 జీఓ ప్రకారం 3–5 తరగతులకు కూడా సబ్జెక్టు టీచర్ల బోధన అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూల్గా మార్చారు. అయితే,కూటమి ప్రభుత్వం 117 జీఓకు తోసిరాజని పాఠశాలల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఇందులో హైస్కూల్+బీపీఎస్ ఒకటి. అబుల్కలాం ఆజాద్ నగరపాలక ఉర్దూ పాఠశాల ఈ కోవలోకి వచ్చింది. ఇక్కడ 1–5 తరగతులను బీపీఎస్గా, 6–10 తరగతులను హైస్కూల్గా విభజించారు. 1,2 తరగతుల విద్యార్థులు మాయం 3,4,5 తరగతుల విద్యార్థులు 20 మంది, 1,2 తరగతుల విద్యార్థులు 14 మంది ఉన్నారు. మొత్తం 34 మంది పిల్లలు ఈ బేసిక్ ప్రైమరీ పాఠశాలలో ఉన్నారు. 21 జీఓ ప్రకారం బీపీఎస్ స్కూళ్లల్లో 1–10 మంది విద్యార్థులకు రెండు ఎస్జీటీ పోస్టులు, 11–30 మంది విద్యార్థులుంటే 3 ఎస్జీటీ పోస్టులు, 31–59 ఉంటే మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు పీఎస్హెచ్ఎం/ఎస్ఏ పోస్టు కేటాయిస్తారు. అయితే, విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్లో 1,2 తరగతుల విద్యార్థులను చూపించలేదు. వారిని మ్యాపింగ్ చేయలేదు. 3–5 తరగతుల విద్యార్థులు 20 మంది ఉంటే 18 మందిని మాత్రమే చూపించారు. వాస్తవానికి ఈ స్కూల్కు మూడు ఎస్జీటీ పోస్టులతో పాటు ఒక పీఎస్హెచ్ఎం/ఎస్ఏ రావాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా చూపిస్తున్న కారణంగా పీఎస్హెచ్ఎం పోస్టు కోల్పోయారు. 10 రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ... తమ పాఠశాలకు జరిగిన అన్యాయంపై హెచ్ఎం, కొందరు పది రోజుల నుంచి డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డీఈఓను, టెక్నికల్ విభాగం సిబ్బందిని కలిసి రోజూ వినతిపత్రాలు ఇస్తున్నారు. వారు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సాంకేతిక పరంగా పొరబాటు జరిగిందంటూ పరిష్కారం చూపించలేదని బాధిత టీచర్లు వాపోతున్నారు. వాస్తవానికి 9 మంది దాకా ఉర్దూ ఎస్ఏలు మిగులు టీచర్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ స్కూల్కు ఒకరిని కేటాయిస్తే అటు టీచరుకు, ఇటు విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అనంతపురం ‘అబుల్ కలాం ఆజాద్’ బీపీఎస్ స్కూల్కు అన్యాయం విద్యార్థుల లెక్క సరిగా లేకపోవడంతో రద్దయిన పీఎస్హెచ్ఎం పోస్టు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధిత టీచర్లు -
ముఖానికి మాస్క్.. మెడలో టవల్
గుంతకల్లుటౌన్: సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ వినోద్కుమార్ ఓ సాధారణ వ్యక్తిలా ముఖానికి మాస్క్ ధరించి, మెడలో టవల్ వేసుకుని గుంతకల్లు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుధవారం రాత్రి గుంతకల్లులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్.. తిరిగి అనంతపురం వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరిగ్గా రాత్రి 10.10 గంటల సమయంలో ముఖానికి మాస్క్, మెడలో టవల్ వేసుకుని ఆస్పత్రిలోకి ప్రవేశించిన ఆయన... తొలుత నూతన ఎంసీహెచ్ భవనం వద్దనున్న ప్రైవేట్ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. తమ బంధువులను అనంతపురం తరలించాల్సి ఉందని, ఎంత ఖర్చవుతుందని ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ను అడిగారు. ఆక్సిజన్తో అయితే రూ.5,500, ఆక్సిజన్ లేకుండా అయితే రూ.5 వేలు తీసుకుంటామని డ్రైవర్ చెప్పాడు. సరే మళ్లీ కలుస్తామని చెప్పిన కలెక్టర్.. అక్కడి నుంచి నేరుగా ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఐడీ, లేబర్ వార్డులను పరిశీలించారు. రోగుల సహాయకులతో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సేవలు, మందులు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం టాయిలెట్లను పరిశీలించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆస్పత్రిలో కలెక్టర్ తనిఖీలు చేసినా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి తెలియలేదు. కలెక్టర్ బయటికి వెళ్తున్న సమయంలో బయటి నుంచి స్థానిక పోలీసుల రాకను గమనించిన ఆస్పత్రి సిబ్బంది ఎవరొచ్చారు.. ఎందుకొచ్చారని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోగుల వద్దకు వెళ్లి కలెక్టర్ ఏమడిగారు.. మీరేం సమాధానమిచ్చారంటూ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాత్రి వేళ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో ఒక్కసారిగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిలో అలజడి మొదలైంది. సెక్యూరిటీ గార్డులకు మెమో ఇవ్వండి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ప్రైవేట్ అంబులెన్స్లను ఎందుకు పార్కింగ్ చేయిస్తున్నారని కలెక్టర్ వినోద్కుమార్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజేంద్రరావును ప్రశ్నించారు. గురువారం డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్రవికుమార్తో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్ అజేంద్రరావు, డ్యూటీ డాక్టర్ శ్రీనివాసయాదవ్ ను కలెక్టరేట్కు పిలిపించుకున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ను ఎందుకు నిరుపయోగంగా ఉంచారని ప్రశ్నించారు. ప్రైవేట్ అంబులెన్స్లను ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ చేయించడంపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులకు మెమో జారీ చేయాలని, ఆస్పత్రి శానిటేషన్ను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించినట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. ఆస్పత్రిలో జరుగుతున్న సాధారణ కాన్పులు, సిజేరియన్ల గురించి ఆరా కలెక్టర్ తీసినట్లు తెలుస్తోంది. సాధారణ వ్యక్తిలా గుంతకల్లు ఆస్పత్రికి కలెక్టర్ వినోద్కుమార్ రాత్రి 10 గంటల సమయంలో వార్డుల్లో ఆకస్మిక తనిఖీ -
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు.. జాబితా సిద్ధం చేస్తున్నాం తదితర కారణాలు చెబుతూ మధ్యాహ్నం 2 గంటలకు చేపడతామని స్వయంగా డీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలో అందరూ భోజనం చేసుకుని 2 గంటలలోపే అక్కడికి చేరుకున్నా అప్పటికీ ప్రారంభం కాలేదు. సాయంత్రం 4 గంటలకు అంటూ మరోమారు ప్రకటించారు. తర్వాత 6 గంటలకు అని చెప్పినా అప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు రాత్రి 7 గంటల తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు ముగిసింది. మొత్తం 148 హెచ్ఎం పోస్టులకు గాను ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 3 పోస్టులకు ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులు కల్పిస్తారు. తక్కిన జిల్లా పరిషత్, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన 145 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఇదిలాఉండగా కౌన్సెలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. చీకటి పడిన తర్వాత వెలుతురు సరిగా లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ముఖ్యంగా మహిళా టీచర్లు అగచాట్లు పడ్డారు. 133 మంది హెచ్ఎంల బదిలీలు.. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 133 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. మొత్తం 191 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29 మంది తప్పనిసరి బదిలీ కాగా...162 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 104 మంది బదిలీ కాగా తక్కిన 58 మంది బదిలీ కాలేదు. ఆలస్యమైన సీనియార్టీ జాబితా.. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితా శుక్రవారం విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రెండు రోజుల కిందటే జాబితా సిద్ధం కావాల్సి ఉన్నా...హెచ్ఎం పదోన్నతుల కౌన్సెలింగ్ ఉన్న కారణగా ఆలస్యమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కువ పాయింట్ల నమోదుపై జాగ్రత్త.. ఉపాధ్యాయుల పాయింట్ల నమోదును ఎంఈఓలు జాగ్రత్తగా పరిశీలించాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావాల్సిన పాయింట్ల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అలాంటి వారితో గ్రీవెన్స్ పెట్టించి తగ్గించుకునేలా చూడాలని ఆదేశించారు. తర్వాత ఎక్కువ పాయింట్లు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ ఉదయం నుంచి రాత్రిదాకా వేచిఉన్న టీచర్లు ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమై 10 గంటలకు పూర్తి -
సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: మెప్మా, గ్రంఽథాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మెప్మా, గ్రంథాలయ శాఖ ఉద్యోగుల కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ వేర్వేరుగా నిర్వహించారు. మెప్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి లైబ్రేరియన్ గ్రేడ్–3, రికార్డ్ అసిస్టెంట్, కార్యాలయ సహాయకుల బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. కార్యక్రమంలో మెప్మా పీడీ జె.విశ్వజ్యోతి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పామిడి తహసీల్దార్, వీఆర్వోకు నోటీసులు పామిడి: మండలంలోని అప్పాజీపేట గ్రామంలో సర్వే నంబర్ 178–బీలోని 10 ఎకరాల భూమి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తహసీల్దార్ ఎన్. శ్రీధర్మూర్తి, వీఆర్వో జ్యోతికి ఉన్నతాధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆ పొలానికి సంబంధించి గత నెల మార్చి7న గ్రీవెన్స్లో అర్జీ వచ్చింది. దీనిపై బుధవారం కలెక్టర్ వినోద్కుమార్ అర్జీదారునికి ఫోన్ చేశారు. భూమి విషయంపై సంబంధిత వీఆర్వో, తహసీల్దార్తోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. సదరు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, దీన్ని ఇరువురు ఆక్రమించుకొని అనుభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి అని తెలిసినా స్వాధీనం చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీధర్మూర్తికి కాషన్ నోటీసు, వీఆర్వో జ్యోతికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్ఎస్ తహసీల్దార్ను ఆదేశించారు. భూమి ఆక్రమణదారులపై 22 రోజుల్లో చర్యలు చేపట్టాలని సూచించారు. ‘రెవెన్యూ’లో బదిలీలకు 313 దరఖాస్తులు అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీ కోసం 313 మంది అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. 16 మంది తహసీల్దార్లు, 44 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, 38 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఐదుగురు, గ్రేడ్–1 వీఆర్ఓలు 68 మంది, గ్రేడ్–2 వీఆర్ఓలు 113 మంది, అటెండర్లు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. ‘సూపర్’లో మూడు రోజులు ఓపీ సేవలు అనంతపురం మెడికల్: రోగులకు స్పెషాలిటీ వైద్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా జూన్ 2 నుంచి వారంలో మూడు రోజుల పాటు ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వ రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి సోమ, గురు, శనివారాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, సీటీపీ, ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, ప్రతి సోమ, బుధ, శనివారాల్లో నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల ఓపీ ఉంటుందని పేర్కొన్నారు. నేటి నుంచి విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్లు అనంతపురం అగ్రికల్చర్: విత్తన వేరుశనగ కోసం శుక్రవారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. 40 శాతం రాయితీ ప్రకటించారు. కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్లు మండలాలకు అలాట్ చేశారు. కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా రూ.5,580గా ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు తమ వాటా కింద రూ.4,920 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. -
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
● దేవదాయశాఖ మాజీ సలహాదారు శ్రీకాంత్ అనంతపురం కార్పొరేషన్: గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని, ఆలయాల్లో విగ్రహాలు కొట్టేశారని, హుండీలు దోచుకున్నారని, తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్తో కూటమి ప్రభుత్వ పెద్దలు పచ్చి అపద్ధాలు మాట్లాడించారంటూ దేవదాయశాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014–19 మధ్య కాలంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం చంద్రబాబు నడుచుకున్నారని గుర్తు చేశారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేసి మహాపరాధానికి పాల్పడ్డారన్నారు. విజయవాడలో 30 ఆలయాలను కూల్చి వేశారన్నారు. సదాపర్తి భూములను అనుయాయులకు అప్పగించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బ్రాహ్మణులకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారన్నారు. ఆలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం సబబు కాదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రానికి దారి చూపండి
శింగనమల: నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి దారి చూపాలంటూ శింగనమల వాసులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ‘544డీ’ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు, సీఐ కౌలుట్లయ్య, ఏఎస్ఐ చితంబరయ్య అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించేందుకు ఏకై క మార్గం మరువకొమ్మ మీదుగానే ఉండేదని గుర్తు చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ రహదారిని మూసి వేసి, మరువకొమ్మ నుంచి తాడిపత్రి వైపుగా ఉన్న పెద్దమ్మ గుడి వద్ద క్రాసింగ్ ఇచ్చారన్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో మరువకొమ్మ క్రాస్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించే మార్గాన్ని మూసి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి వద్ద చోటు చేసుకున్న ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడ్డారన్నారు. జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్నపాటి గ్రామాలైన రెడ్డిపల్లి, రోటరీపురం,కొర్రపాడు వద్ద రెండు బ్రిడ్జిలు, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, పెరవలి, నాయనపల్లి క్రాస్లో అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించారని, అయితే నియోజకవర్గ కేంద్రమైన శింగనమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ ఆందోళనను విరమించబోమని భీష్మించారు. సీఐ కౌలుట్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు మాట్లాడుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. శింగనమల మరువకొమ్మ వద్ద గ్రామస్తుల ధర్నా అధికారుల హామీతో ఆందోళన విరమణ -
అమ్మవారికే ఎగనామం
●ముసలమ్మ ఆలయ స్థలం ఆక్రమణ ●రూ.5 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం బుక్కరాయసముద్రం: గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండేలా కరుణించిన ముసలమ్మ అమ్మవారికే కబ్జాదారులు ఎగనామం పెట్టారు. రూ.కోట్ల విలువైన ఆలయ భూమిని కబ్జా చేసి, ఆ స్థలంలోకి ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దౌర్జన్యాలను తాళలేక చివరకు అన్యాక్రాంతమైన భూమిని ఆలయానికి తిరిగి స్వాధీనం చేయాలంటూ అనంతపురం ఆర్డీఓకు ముసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సుశీల విన్నవించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి నాడు ప్రాణత్యాగం ముసలమ్మ ఆలయానికి సుదీర్ఘ చరిత్రనే ఉంది. మూడు శతాబ్దాల క్రితం బుక్కరాయసముద్రం చెరువు నిండి ఉప్పొంగి కట్టకు భారీగా గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా గ్రామంలోకి చొరబడి మునిగిపోతుండగా గ్రామస్తులు గ్రామ సమీపంలో ఉన్న పోలేరమ్మ తల్లిని ప్రార్థించారు. ఆ సమయంలో ‘గ్రామంలో ఉన్న బసిరెడ్డి చిన్నకోడలు ముసలమ్మ ప్రాణత్యాగంతో కట్ట నిలుస్తుంది’ అనే మాటలు వినిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న ముసలమ్మ దేవుడిని ప్రార్థిస్తూ గండి పడిన చోట చెరువులోకి దూకింది. దీంతో వరద నీరు నిలిచిపోయిందట. అప్పటి నుంచి ముసలమ్మను ఇలవేల్పుగా గ్రామస్తులు పూజిస్తూ వస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రాణత్యాగం చేసిన ముసలమ్మకు ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. అనంతరం కాలంలో రూ.3 కోట్లు వెచ్చించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మోరు స్థలానికే ఎసరు ముసలమ్మ ఆలయం వెనుక సర్వే నంబర్ 636–4లో 80 సెంట్ల స్థలం బెంగళూరుకు చెందిన ఆదెమ్మ పేరుపై డైక్లాట్లో ఉంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దకుమార్తె మునిరత్నమ్మ పేరుపై 1933లో రిజిస్టర్ చేయించి ఇచ్చింది. ఆ తర్వాత ఆ స్థలాన్ని 1949, ఫిబ్రవరి 10న ముసలమ్మ ఆలయంలో నిత్యకై ంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా అమ్మవారి వంశస్తులైన తిరుమలరెడ్డి గారి కొండారెడ్డికి దాన విక్రయం కింద మునిరత్నమ్మ రాసిచ్చారు. అప్పటి నుంచి పాత గుడిలో అమ్మవారికి నిత్య పూజలు కొనసాగుతూ వచ్చాయి. కాలక్రమేణ గుడిని అభివృద్ది చేశారు. ఈ క్రమంలో 33 సెంట్ల స్థలాన్ని అనంతపురానికి చెందిన వెంకట్రాముడు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ముసలమ్మ వంశస్తులతోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు. ఆ స్థలం తనదని, అక్కడ ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులకు ఆలయ ధర్మకర్త సుశీల, ఆమె భర్త సూర్యనారాయణరెడ్డి, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ పుణ్యవతిని కలసి ఆలయ భూమిని పరిరక్షించాలంటూ విన్నవించారు. అన్యాక్రాంతమైన భూమి విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని, వెంకట్రాముడితో పాటు మరికొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. -
నాడు రాద్ధాంతం.. నేడు అదే సిద్ధాంతం
అనంతపురం అర్బన్: సమగ్ర భూ సర్వేకు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన మార్గమమే ఉత్తమమని కూటమి ప్రభుత్వ చేపట్టిన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాటను అనుసరిస్తూ భూముల రీ–సర్వే చేపట్టింది. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా చేపట్టిన భూముల రీ సర్వేపై విష ప్రచారం సాగించిన టీడీపీ కూటమి నేతల నోళ్లు ఇప్పడు మూతపడ్డాయి. దీనికి తోడు భజన పత్రికల చేతులకు బ్రేక్లు పడ్డాయి. గత ప్రభుత్వంలో సర్వే ఇలా సర్వే క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ను మొబైల్ మెజిస్ట్రేట్గా గత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరిస్తోంది. జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 31 మండలాల్లో ఉన్న 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్లై ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు సంబంఽధించి ఓఆర్ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 5,88,615.626 ఎకరాల సర్వే సంపూర్ణ స్థాయిలో పూర్తి చేశారు. ఈ విధానాలతో సర్వే ప్రక్రియను గత ప్రభుత్వం సులభతరం చేసింది. దీంతో తాజాగా మిగిలిన 305 గ్రామాల్లో ఎలాంటి అడ్డంకులూ లేకుండా రీ–సర్వేకు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రస్తుతం రెండు దశలుగా 62 గ్రామాల్లో సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి దశలో 31 గ్రామాలు, రెండో దశలో మరో 31 గ్రామాల్లో సర్వే చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గతంలో పక్కాగా రీ–సర్వే గత ప్రభుత్వంలో భూముల రీ–సర్వే ప్రక్రియ పక్కాగా జరిగింది. 503 గ్రామాలకు గానూ 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దులు నిర్ధారిస్తూ రాళ్లు కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో అధికారులు గ్రామ సభలను నిర్వహించారు. అయితే 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి చూస్తే సర్వే పక్కగా జరిగినట్లుగా స్పష్టమైంది. దీంతో అప్పట్లో రీ సర్వే ప్రక్రియపై విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయి. రీ–సర్వేపై విషం చిమ్ముతూ కథనాలు ప్రచురించిన పత్రికలు సైతం మూగబోయాయి. 503భూముల రీ–సర్వే చేయాల్సిన గ్రామాలు సర్వే చేయాల్సిన మొత్తం విస్తీర్ణం రీ–సర్వేపై అప్పట్లో పచ్చ‘బ్యాచ్’ విష ప్రచారం తాజాగా సర్వేకు అప్పటి విధానాలనే అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా రెండు దశల్లో 62 గ్రామాల్లో సర్వే -
నాణ్యత... దేవుడికెరుక!
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు అన్నదాతల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. రైతు కష్టనష్టాల గురించి అసలు ఆలోచించడమే లేదు. విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియలో మరోసారి సర్కారు అలసత్వం బయటపడింది. ఈ సారి జిల్లా రైతులకు నాణ్యత లేని విత్తన కాయలు పంపిణీ చేసి ‘మీ చావు మీరు చావండి’ అంటూ చేతులు దులుపుకునే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్ ప్రారంభమవుతున్న కీలక తరుణంలో అటు టీడీపీ ఎమ్మెల్యేలు ‘మహానాడు’ అంటూ రైతులను గాలికి వదిలేయగా.. ఇటు వ్యవసాయశాఖ అధికారులు బదిలీల మాయలో విత్తన పంపిణీ గురించి పట్టించుకోవడమే లేదు. ఆర్ఎస్కేలకు నాసిరకం సరుకు.. ఈ సారి విత్తన పంపిణీ ప్రక్రియను చాలా ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లాకు 50,592 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడ్స్కు బడ్జెట్ విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేయడంతో జిల్లాలో రైతులు పండించిన నాణ్యమైన విత్తనం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో విత్తనం కోసం మిల్లర్లపై ఆధారపడ్డారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, మరోవైపు బదిలీల ప్రక్రియ కొనసాగుతుండటంతో విత్తనశుద్ధి (ప్రాసెసింగ్)పై దృష్టి పెట్టడం లేదు. ఇదే అదునుగా మిల్లర్లు నాసిరకం విత్తనకాయలను మండలాలు, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుమతి ఉన్న 10 ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి 6 వేల క్వింటాళ్ల వరకు ఆర్ఎస్కేలకు సరఫరా చేశారు. అందులో నాలుగైదు లారీల వరకు వేరుశనగ కాయ నాణ్యత లేదని వెనక్కి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా పంపిణీ చివరి సమయంలో నాసిరకం, కల్తీ సరుకు సరఫరా అయ్యేది. కానీ చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం కారణంగా నేడు మొదట్లోనే నాసిరకం సరఫరా అవుతుండటం రైతులను కలవరపరుస్తోంది. దిగుబడులపై తీవ్ర ప్రభావం.. అన్నదాతలకు నాణ్యమైన విత్తనం అందించడంలో వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ విఫలమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతా ప్రమాణాల మేరకు 9 శాతం లోపు తేమశాతం, 70 శాతం మొలకశాతం (జర్మినేషన్), 96 శాతం ఫిజికల్ ప్యూరిటీ, 74 శాతం అవుటన్ (షెల్లింగ్), వ్యర్థ పదార్ధాలు (ఇనర్ట్మ్యాటర్) 4 శాతం మేర ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ అవుటన్ శాతం చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అవుటన్ తక్కువగా ఉంటే విత్తనం మొలకెత్తినా దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మండలాలకు నాసిరకం విత్తనకాయల సరఫరా ప్రమాణాలపై దృష్టి పెట్టని వ్యవసాయశాఖ రైతుల ఆశలతో సర్కారు చెలగాటం -
230 పోయి 19 పోస్టులు మిగిలాయి!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యా శాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెండేళ్ల సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్రెడ్డి
తాడిపత్రి టౌన్: సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంగానే ఉంటుందని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బుధవారం వైరల్గా మారాయి. ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయనన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి.. అదీ ఇదీ అని 15 వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు తిడుతున్నారని జేసీ చెప్పారు. ‘రోడ్లు బాగా లేకుండాలేవు. నీళ్లు తక్కువేమీ లేవు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ బాగా చేశాం. అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే.. నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికీ బుద్ధిలేదు. ఈ జనాలకు బుద్ధిలేద’ని ప్రభాకర్రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నానదిలో ఇసుకను ఇష్టమొచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్గానే ఇసుక అమ్ముదామనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు. -
మహానాడు కాదది.. దగానాడు
అనంతపురం కార్పొరేషన్: అలివిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని, కడపలో టీడీపీ నిర్వహించేది మహానాడు కాదని.. దగా నాడుగా ప్రజలు భావిస్తున్నారని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చలేదన్నారు. కనీసం ఇప్పటికై నా రాష్ట్రాభివృద్ధిపై తీర్మానాలు చేయించేలా చూడాలని ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందన్నారు. కక్ష సాధింపులకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజుతో పాటు బడుగులు, దళితులపై పోలీసులు సాగించిన చౌర్జన్యంపై మహానాడులో చర్చించగలరా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ పేరుతో ఇచ్చిన చంద్రబాబు హామీల్లో ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. డబ్బులు లేవంటూనే ఏడాదిలో రూ.50 వేల కోట్లు మిగుల్చుకున్నారన్నారు. మొత్తమ్మీద ఒక్క ఏడాదిలోనే రూ.1,30,000 కోట్లు, అమరావతి పేరుతో రూ.30 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. ఏఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒకే ఏడాది లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు 2013లో ఎయిమ్స్ మంజూరైతే..దానిని మంగళగిరికి తరలించి జిల్లాకు అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని మాట ఇచ్చి తప్పారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని, జిల్లాలో 20 లక్షల ఎకరాలకు విత్తన వేరుశనగ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారసులెవరు? టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి అధికారంలోకి తీసుకువస్తే.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి తానే అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకున్న అంశంలో నేరపూరితమైన భావన కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పార్టీకి అసలు వారసుడు బాలకృష్ణ దబిడిదిబిడే అంటూ తిరుగుతున్నాడని, మరొకరు (కుమార్తె) బీజేపీలో కొనసాగిస్తారో... తొలగిస్తారోనని ఆలోచిస్తున్నారని, ఇక జూనియర్ ఎన్టీఆర్ అవునా, కాదా అనే మీమాంశతోనే సరిపోతోందన్నారు. కార్పొరేట్కు సాగిలపడిన చంద్రబాబు.. తన స్వలాభానికి ప్రజల భూములను పావలా, అర్ధరూపాయికి కట్టబెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్
ఉరవకొండ: రాజకీయ కక్షతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సాఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టును ఖండించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎలాంటి అభివృద్ది లేకపోయినా అక్రమ కేసులు, అణిచివేత చర్యలు, కక్షపూరిత రాజకీయాలకు సీఎం చంద్రబాబు ఊతమిస్తున్నారన్నారు. మాజీ ఐఎఎస్, ఐపీఎస్లను సైతం వదిలిపెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ను అప్రతిష్టపాలు చేసి, ఆయన్ను అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు సృష్టించి కేసుల్లో ఇరికిస్తున్నా వైనంపై ఇప్పటికే ప్రభుత్వానికి కోర్టులు మందలిస్తున్నా పాలకుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. భార్యభర్తలు, అన్నదమ్ముల మద్య తలెత్తే చిన్నపాటి ఘర్షణల్లో కూటమి నేతలు జోక్యం చేసుకోని రాజకీయంగా వాటిని వినియోగించుకోని గ్రామస్థాయిలో వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతల అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే జిల్లాలో జరిగిన మినీ మహానాడులో కొందరు టీడీపీ సీనియర్ నేతలు గళం విప్పారని, ఈ వ్యతిరేక జ్వాలలు మరింత చెలరేగి కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయక తప్పదని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నరసింహులు, ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, తిప్పయ్య, వీరన్న పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
పీఆర్లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బాలూనాయక్, ఎస్ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్ఈలతో పాటు పీఆర్ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు. గాలిమరలు కూల్చేశారు! పుట్లూరు: మండలంలోని ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమరలు నెల రోజుల వ్యవధిలో రెండు కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ గాలిమరలు కూలిపోలేదని పరికరాల చోరీ కోసం కొందరు దుండగులు సపోర్ట్ దిమ్మెలకు ఉన్న ఇనుప చువ్వలను కత్తిరించి కూల్చేసినట్లు భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రతినిధులు గుర్తించారు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కూల్చి వేసిన గాలిమరల్లోని విలువైన పరికరాలను చోరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హామీల అమలు కోసం పోరుబాట ● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అనంతపురం అర్బన్: అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, హామీల అమలు కోసం సీపీఐ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమైనట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విడుదల చేసి, మాట్లాడారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని, సూపర్ సిక్స్ అమలు చేయాలనే డిమాండ్తో జూన్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దారు కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు తలపెట్టామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లేలా చేపట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజేష్గౌడ్, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా పాల్గొన్నారు. -
అన్యాయం జరుగుతోంది
హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన కాంక్రీట్ లైనింగ్ పనులతో ఒక్క రాప్తాడు నియోజకవర్గమే కాదు... మొత్తం రాయలసీమకే అన్యాయం జరుగుతోంది. రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోతాయి. భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రైతులకు అన్యాయం జరగకుండా రిలే నిరాహార దీక్షలు రాప్తాడు నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తాం. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఉద్యమించాలి. ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులకు, పోలీసులకు అనుమతులు కోరాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
బాబు స్వార్థం.. సీమకు అన్యాయం
ఆత్మకూరు: జిల్లాలో రైతు మనుగడను కూటమి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే సీఎం చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు. టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీ–నీవా ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కాలువలో నీరు ప్రవహించే సమయంలో ఎంతో కొంత నీరు భూమిలోకి ఇంకడం ద్వారా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో జిల్లాలో ఉద్యాన పంటలు గణనీయంగా విస్తరించాయి. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోవడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు తగ్గిపోయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లైనింగ్ పనులను అడ్డుకున్నారు. వట్టిపోనున్న చెరువులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ హంద్రీ–నీవా ద్వారా కొత్త ప్రాజెక్టులకు కూడా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు (కర్నూలు తాగునీటి పథకం)కు 3 టీఎంసీలు, డోన్లో లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 63 చెరువులకు నీరు ఇచ్చేందుకు 2 టీఎంసీలు, జిల్లాలోని శింగనమల చెరువుకు 1 టీఎంసీ, శింగనమల పాత తాలూకాలోని చెరువులకు 1.3 టీఎంసీలు, జీడిపల్లి, భైరవానితిప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 3.7 టీఎంసీలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, సోమరాండ్లపల్లి రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు 4.5 టీఎంసీలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 23 టీఎంసీలు కేటాయించడంతో పాటు 40 టీఎంసీల నీటిని రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు అందించేలా బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. కాలువకు లైనింగ్ పనులు చేయడం ద్వారా భవిష్యత్తులో నీరంతా దిగువకు వెళ్లిపోయి చెరువులన్నీ పూర్తిగా వట్టిపోయే ప్రమాదం నెలకొంది. హంద్రీ–నీవా లైనింగ్ పనులతో బీళ్లుగా మారనున్న రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడకే ముప్పు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమంటున్న ‘రాప్తాడు’ రైతులు పంటల సాగు కష్టం రాప్తాడు నియోజకవర్గంలో చాలా పొలాలు హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నాయి. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరిగి మా వ్యవసాయ బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగింది. దీంతో నాకున్న 4 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. ఇప్పుడేమో కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత లేక పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రైతు కష్టాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. లైనింగ్ పనులు ఆపి 83 టీఎంసీల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేయాలి. – సుబ్బర రామాంజినేయులు, సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలం రైతుల పొట్ట కొట్టొద్దు హంద్రీ–నీవాలో నీటి ప్రవాహం వల్ల చాలా మంది బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువ పక్కన పొలాల్లో చీనీ, అరటి, టమాట, వరి, అంజూర, ద్రాక్ష, దానిమ్మ వంటి ఉద్యాన పంటల సాగు పెరిగింది. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయితే బోర్లు ఎండి పోయే ప్రమాదముంది. రైతులు నష్టపోతారు. కాంక్రీట్ లైనింగ్ పనులతో రైతుల పొట్ట కొట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – వెంకటేష్, సింగంపల్లి, ఆత్మకూరు మండలం -
రాత్రంతా సాగిన బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ఉదయం మొదలైన జోనల్ స్థాయి ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం తెల్లవారుజాము సరిగ్గా 6 గంటలకు ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జోనల్ స్థాయి కావడంతో ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు సూపరెండెండెంట్లు, 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు రిక్వెస్ట్ కింద ఐదుగురు సూపరెండెండెంట్లు. 32 మంది సీనియర్ అసిస్టెంట్లు, 26 మంది ఏడీఏలు, 122 మంది ఏఓలు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ విభాగాల అసోసియేషన్లకు చెందిన నాయకులు తరలిరావడంతో జాతరను తలపించింది. ఇందులోనూ ఎక్కువగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. 255 మందికి పైగా కౌన్సెలింగ్కు హాజరవుతున్నట్లు తెలిసినా కౌన్సెలింగ్ ప్రక్రియ జాప్యం చేయడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రంతా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళా ఉద్యోగులు జాగరణతో పడిగాపులు కాసేలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆన్లైన్ పక్రియ అంటూనే భౌతికంగా చేపట్టారు. ప్రతి విషయంలో ఒకరిద్దరు జేడీఏలు జోక్యం చేసుకోవడంతో ఆలస్యమైనట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏఓ స్థాయి అధికారులు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. అలాగే రిక్వెస్ట్ కింద, అసోసియేషన్ల వెసులుబాటు, కొందరు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో సదరు ప్రజాప్రతినిధులు అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ అంటూనే భౌతికంగా సాగిన కౌన్సెలింగ్ -
తల్లుల వేదన అంతా ఇంతా కాదు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్కూళ్లు తెరిచిన వారం రోజుల్లోనే ‘అమ్మఒడి’ పేరుతో రూ.15 వేలను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కానీ 2024 ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తానన్న బాబు.. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావొస్తున్నా ‘తల్లికి వందనం’ మాటే ఎత్తడం లేదు. పైగా ఒక్కో రోజు ఒక్కోమాట మాట్లాడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారికే అని ఒకసారి.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులందరికీ అని మరోసారి.. ఇటీవల మార్గదర్శకాల్లో ఒకరికే అని ఇచ్చి తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4 లక్షల మంది చిన్నారుల తల్లులు ప్రభుత్వ సాయం కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. -
మరణించిన వారికీ ‘ఉపాధి’
పుట్లూరు: మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు తారస్థాయికి చేరాయి. జాబ్కార్డు ఉంటే చాలు పనికి వెళ్లకపోయినా హాజరు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు సిబ్బంది ఏడాదిలో జాబ్కార్డుకు రూ.30 వేలు జమచేయించి లబ్ధిదారుడికి రూ.15 వేలు ఇచ్చి మిగతాది దోచుకుంటున్నారు. దీంతోపాటు క్షేత్ర స్థాయిలో అప్పటికే పూర్తైన పనులను పదే పదే పరిశీలించి కొలతల ఆధారంగా మళ్లీ చెల్లింపులు చేస్తున్నారు. గ్రామాల్లో లేని వారు, ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లపై మస్టర్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. సామాజిక తనిఖీ బృందాలు సైతం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి వెళ్లిపోతుండటంతో ఉపాధి సిబ్బంది అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. జంగంరెడ్డిపేటలో ‘ఆత్మలకు’ ‘ఉపాధి’ కల్పించిన విషయంపై పుట్లూరు ఎంపీడీఓ అలివేలమ్మ వివరణ కోరగా.. ఆమె స్పందించారు. మరణించిన వారి పేరుపై బిల్లులు చేసిన విషయం తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నిరుద్యోగులకు మోసం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కూటమి పార్టీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నిలువునా మోసగించాయి. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు.వలంటీర్లకు రూ.10 వేలు వేతనం అన్నారు...ఉన్నవారందరినీ పీకేశారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేసి వాటిపై ఆధారపడ్డ సిబ్బందిని రోడ్డుపాలు చేశారు. – కసాపురం రమేష్, జిల్లా కార్యదర్శి, డీవైఎఫ్ఐ సాయం కోసం ఎదురు చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాం. గత ఏడాది కూడా పెట్టుబడి సాయం మంజూరు కాలేదు. ప్రస్తుతం రైతుల వెరిఫికేషన్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం వస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. మా ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందో లేదో చూడాలి. – మునయ్య, ముచ్చుకోట, తాడిపత్రి మండలం పేదలకు శాపంగా మారిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పేద ప్రజలకు ఏ మేలూ జరగలేదు. సంక్షేమ పథకాల ఊసే లేదు. పట్టణ, గ్రామ పరిధిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పిన మాటను చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను సైతం అమలు చేయకుండా దగా చేశారు. పేద ప్రజలకు ఈ ప్రభుత్వం శాపంలా మారింది. –చిరంజీవి యాదవ్, సీపీఐ పట్టణ కార్యదర్శి, తాడిపత్రి బాబు జీవితమంతా మోసమే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలను ఇచ్చి ప్రజలను వంచించారు. గత ఎన్నికలకు ముందు సూపర్సిక్స్తో పాటు 145 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. చంద్రబాబు జీవితమంతా పచ్చి మోసం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి సంక్షేమం అందించారు. మేనిఫెస్టో అమలు చేయని పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలి. ఆ దిశగా పార్లమెంట్లో చర్చ జరగాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
రైతాంగాన్ని ఆదుకోవాలి
అనంతపురం కార్పొరేషన్: ‘ఖరీఫ్, రబీకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్నా ఇంత వరకు విత్తన కేటాయింపులు జరపలేదు. ప్రజాప్రతినిధులు స్వార్థ రాజకీయాలు వీడి రైతాంగాన్ని ఆదుకోవాలి’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023–24 ఖరీఫ్లో 17 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారని, కేంద్ర బృందం పర్యటించి వెళ్లినా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినా కేవలం 7 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 15 లక్షల ఎకరాలకు పైబడి పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందు కోసం 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కేవలం 1.14 లక్షల క్వింటాళ్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క రూపాయి ఇచ్చారా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం కింద రైతుకు రూ.13,500 చొప్పున అందజేశామని ‘అనంత’ గుర్తు చేశారు. అప్పట్లో సున్నావడ్డీ, పావలా వడ్డీ వచ్చేవన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. సున్నా, పావలా వడ్డీ అందే పరిస్థితి లేదన్నారు. బ్యాంకు రుణాలను రెన్యూవల్ చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. ఇటీవల జెడ్పీ సమావేశంలో రైతు సమస్యలను ప్రస్తావించిన పాపాన పోలేదన్నారు. ‘ఆ ఫొటో ఇక్కడుండాలి, ఈ ఫొటో అక్కడుండాలి’ అని అనుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రైతులకు ఎటువంటి మేలు జరగడం లేదన్నారు. అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు చేస్తున్నా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గత ఏడాది డీఏపీ, యూరియా, పొటాష్ కృత్రిమ కొరత సృష్టించారని, బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా అమ్ముకున్నారని, ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉందన్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రజాప్రతినిధుల దృష్టంతా ఆదాయం, వ్యాపారాలపైనే ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలను, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప మరేమీ చేయడం లేదన్నారు. అసలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఉన్నారా అనే పరిస్థితి ఉందన్నారు. తక్షణం సీఎంతో మాట్లాడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్వామ పద్ధతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రైతు విభాగం అనంతపురం నియోజకవర్గం అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
తప్పులతడక..గందరగోళం
కుప్పలు తెప్పలుగా విన్నపాలు అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కోసం అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితా గందరగోళంగా మారిందంటూ టీచర్లు వాపోతున్నారు. కామన్ సీనియారిటీ లెక్కించేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొందిన వారికి వారి ర్యాంకుల ప్రకారం వివిధ సబ్జెక్ట్లను కలుపుతూ జాబితా తయారు చేస్తారు. కానీ ఎస్జీటీ నుంచి పాఠశాల సహాయకులుగా ముఖ్యంగా ఒకే డీఎస్సీలో ఎస్జీటీగా ఎన్నికై ఒకేరోజు పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లతో ఉమ్మడి సీనియార్టీ తయారు చేసేటప్పుడు వారి ఫీడర్ కేటగిరీ (ఎస్జీటీ) లో మెరిట్ను ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే, ప్రస్తుత పదోన్నతుల్లో ఈ విధానాన్ని పక్కనపెట్టడంతో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు. మెరిట్కు మంగళం... 1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికై ...2002 నవంబరులో స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందిన వారి సీనియార్టీ జాబితాలో పరిశీలిస్తే.. డీఎస్సీలో 36వ మెరిట్ ర్యాంకుగా ఉన్న టీచరు కంటే కూడా 397 ర్యాంకు టీచరును ముందు పెట్టారు. 99వ ర్యాంకు పొందిన టీచరుకంటే కూడా 161, 378, 141, 373 ర్యాంకు టీచర్లు ముందున్నారు. ఈ ఐదుగురూ (99,161,378,141,373 ర్యాంకర్లు) కూడా 36 ర్యాంకు టీచరుకంటే ముందున్నారు. అందరూ ఓపెన్ కేటగిరీ టీచర్లు కావడం విశేషం. కోర్టుకు వెళ్లే ఆలోచనలో టీచర్లు హెచ్ఎం పదోన్నతులకు తయారు చేసిన సీనియార్టీ జాబితాలో మెరిట్ను తుంగలో తొక్కి, సీనియర్లకు అన్యాయం చేయడంపై బాధిత టీచర్లు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. 20 ఏళ్లకు పైగా ప్రమోషన్స్ లేక ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులను ‘వింత పద్ధతి’ దెబ్బ తీస్తోందంటూ వాపోతున్నారు. హెచ్ఎంల సీనియార్టీ పదోన్నతుల జాబితాలో తప్పులు పట్టించుకోని అధికారులు.. కోర్టుకెళ్తామంటున్న బాధిత టీచర్లు ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్కు సంబంధించి విన్నపాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో జరిగిన పొరబాట్లు, సాంకేతిక సమస్య కారణంగా చాలామందికి అర్హత ఉన్నా కూడా వివిధ పాయింట్లు నమోదు కాలేదు. కొందరు దరఖాస్తు సమయంలో పొరబాట్లు చేశారు. ఈ కారణంగా వారికి నిబంధన మేరకు రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ నమోదయ్యాయి. అర్హత ఉండీ రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ రావడంతో ఆందోళన చెందుతూ డీఈఓల వద్దకు టీచర్లు పరుగులు తీస్తున్నారు. పని చేయని ఆన్లైన్ గ్రీవెన్స్ సెల్ ప్రతి టీచరూ వ్యక్తిగత ట్రాన్స్ఫర్ లాగిన్లో వెళ్తే...అక్కడ గ్రీవెన్స్ ఆప్షన్ ఉంచారు. ఆప్షన్ ఓపెన్ చేసి తమ సమస్య విన్నవించుకోవచ్చు. అయితే ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘ఎనేబుల్’ కాలేదని చూపుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు డీఈఓతో పాటు వారి పరిధిలోని ఎంఈఓలను కలిసి విన్నవిస్తున్నారు. ఎంఈఓలు తమ లాగిన్లో అప్లికేషన్లు ఓపెన్ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ ఉన్నా...పరిష్కరించే సమయం లేక వెంటనే ఆమోదం తెలుపుతున్నారు. డీఈఓ లాగిన్కు రాగానే ఇక్కడి ఐటీ ఉద్యోగులు కూడా అదే స్పీడ్తో ఆమోదం తెలుపుతుండటం గమనార్హం. -
హామీలిచ్చి మోసం చేయడం ఆయనకు కొత్తకాదు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలతో ఊదరగొట్టడం.. అధికారంలోకి వస్తే వాటిని గాలికొదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘పూర్తిగా రుణమాఫీ చేస్తాను, మీ బంగారంపై తీసుకున్న రుణం పైసా కట్టొద్దు, లోన్లు చెల్లించొద్దు’ అంటూ 201
సాక్షిప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పగ్గాలు చేపట్టి ఏడాది కావొస్తున్నా హామీలు అమలు కావడం లేదు. మేనిఫెస్టోను చిత్తుకాగితంలా భావించిన సీఎం చంద్రబాబు సామాన్యుల నోట మట్టికొట్టారు. ఈ క్రమంలో జిల్లాలో నేడు ఏ పల్లెకు వెళ్లినా, ఏ గల్లీకి వెళ్లినా కూటమి సర్కారు మోసాల గురించి చర్చలు సాగుతున్నాయి.గత ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ పథకానికి ఎంత సొమ్ము ఇవ్వాలో బటన్ నొక్కి మరీ వారి ఖాతాలోకి జమ చేశారు. తాజా పరిస్థితుల్లో ‘పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు’ను తెచ్చుకున్నామన్న చందంగా పరిస్థితి తయారైందని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ● ఎన్నికల వేళ సూపర్సిక్స్ పథకాలపై చంద్రబాబు డప్పు ● అధికార పగ్గాలు చేపట్టాక హామీలన్నీ గాలికి ● ఏడాది పూర్తవుతున్నా ఒక్క రూపాయీ అందించని వైనం ● మండిపడుతున్న లబ్ధిదారులు -
‘నవోదయ’ నిర్మాణానికి భూమిని గుర్తించండి
కళ్యాణదుర్గం/కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయం నిర్మాణం కోసం అవసరమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కళ్యాణ దుర్గం పట్టణ పరిధిలోని ధర్మవరం రోడ్డులో సర్వే నంబర్ 464లో 17.12 ఎకరాలు, సర్వే నంబర్ 465లో 1.35 ఎకరాలను, అలాగే, ఈస్ట్ కోడిపల్లి సమీపంలో సర్వే నంబర్ 389లోని 37.45 ఎకరాల భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ విద్యాలయం కోసం ప్రభుత్వ భూమి ఉంటే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి, ఆర్డీఓ వసంతబాబు, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులు చేపట్టిన ‘యోగాంధ్ర’ రిజిస్ట్రేషన్ సర్వేను కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, డీపీఓ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 28 పడకలతో కోవిడ్ వార్డు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఈఎన్టీ వార్డులో 28 పడకలతో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. మూడు వెంటిలేటర్లు, 50 వీటీఎం కిట్లను అందు బాటులో ఉంచారు. మంగళవారం ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈఎన్టీ వార్డులో 24 గంటలూ స్టాఫ్నర్సులు ఉండేలా, టెక్నీషియన్, వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామిని ఆదేశించారు. రాయదుర్గం, గుమ్మఘట్టకు అత్యధిక అలాట్మెంట్అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియలో భాగంగా పంట విస్తీర్ణం బట్టి మండలాలకు విత్తన కేటాయింపులు చేశారు. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. అందులో కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900 క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు జారీ చేశారు. తాజాగా డివిజన్లు, మండలాల వారీగా విత్తన వేరుశనగ బస్తాలను అలాట్ చేశారు. రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాలకు అత్యధికంగా 3 వేల క్వింటాళ్ల చొప్పున కేటాయించగా... యల్లనూరు మండలానికి క్వింటా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక పుట్లూరుకు 50 క్వింటాళ్లు, తాడిపత్రి మండలానికి 100 క్వింటాళ్లు ఇచ్చారు. మొత్తమ్మీద కళ్యాణదుర్గం సబ్డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాలకు అత్యధికంగా 14,462 క్వింటాళ్లు కేటాయించారు. ఆ తర్వాత అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు మండలాలకు 10,500, రాయదుర్గం డివిజన్లో ఐదు మండలాలకు 10,200, ఉరవకొండ డివిజన్లో నాలుగు మండలాలకు 6,850, గుత్తి సబ్ డివిజన్లో ఐదు మండలాలకు 6,750 క్వింటాళ్లు అలాట్ చేశారు. అత్యల్పంగా తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాలకు 1,830 క్వింటాళ్లు కేటాయించారు. రాయితీ ఇలా.. కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తిధర రూ.9,300 కాగా 40 శాతం రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా కింద రూ.5,580 ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు రూ.4,920 ప్రకారం చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోల బస్తాలు మూడు పంపిణీ చేయనున్నారు. -
టీడీపీకి నిజమైన వారసులు ఎవరు?: శైలజానాథ్
సాక్షి అనంతపురం : టీడీపీది మహా నాడు కాదు... దగా నాడు అంటూ.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ఎన్టీఆర్పై చెప్పులు వేయించింది చంద్రబాబే.. టీడీపీకి వారసుడు ఎవరు?. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి.. దిబిడి అంటూ తిరుగుతున్నారంటూ శైలజానాథ్ వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. రెండు ఎకరాల నుంచి లక్ష కోట్లకు చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలి. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు చెప్పాలి. పేదల సంక్షేమ పథకాలు ఆపేసి... విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. 1.30 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి పేదలకు పైసా ఇవ్వలేదు’’ అంటూ శైలజానాథ్ మండిపడ్డారు.పేదల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పుజెప్పుతున్నారు. ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని మహానాడులో తీర్మానం చేస్తారా?. టీడీపీలో సీనియర్లకు మంగళం పాడారు. చంద్రబాబును కూడా మారుస్తారేమోనని అనుమానంగా ఉంది. టీడీపీలో ఎన్టీఆర్నే గద్దె దించారు? చంద్రబాబు ఎంత?’’ అని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. -
‘ఖరీఫ్’ లక్ష్యం 4.38 లక్షల హెక్టార్లు
● అత్యధికంగా కళ్యాణదుర్గం మండల వ్యాప్తంగా 22,910 హెక్టార్లలో పంటలు ● మొత్తం నీటి వసతి కింద 1,32,321 హెక్టార్లలో సాగు ● వర్షాధారంగా 3,06,450 హెక్టార్ల సాగు అంచనాఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ముంగారు (ఖరీఫ్) వ్యవసాయానికి రైతులు సిద్ధమవుతుండగా... ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు అంచనాలు కూడా అధికారులు ఎక్కువగానే అంచనా వేశారు. ఇందులో భాగంగానే నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర 15 రకాల పంటలు 3,06,450 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. అలాగే నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, ఎండుమిరప, టమాట ఉల్లి, మల్బరీ తదితర పంటలు 1,32,321 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. గత ఐదేళ్లలో ఈ–క్రాప్లో నమోదైన గణాంకాల ఆధారంగా ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు 4,38,771 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. కళ్యాణదుర్గం టాప్ ఖరీఫ్లో అటు నీటి వసతి, ఇటు వర్షాధారంగా కళ్యాణదుర్గం మండలంలో 22,910 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారిక అంచనా. ఇందులో నీటి వసతి కింద 6,527 హెక్టార్లు, వర్షాధారంగా 16,383 హెక్టార్లుగా గుర్తించారు. అలాగే తాడిపత్రి మండలంలో అతి తక్కువగా 8,261 హెక్టార్లలో అన్ని రకాల పంటలు వేస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత పెద్దపప్పూరులో 8,372 హెక్టార్లు, పుట్లూరులో 9,412 హెక్టార్లు, యల్లనూరులో 9,728 హెక్టార్లు, బుక్కరాయసముద్రంలో 9,670 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి వస్తాయని లెక్క వేశారు. శింగనమల నియోజక వర్గ పరిధిలో తక్కువ విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. ఇందులోనూ నీటి వసతి కింద ఉద్యాన పంటలు ఎక్కువగానూ, వర్షాధారంగా తక్కువగా పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఓవరాల్గా వర్షాధారంగా యల్లనూరు మండలంలో కేవలం 2,243 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తున్నట్లు అంచనా. వరి పంట ఎక్కువగా ఉన్నందున కణేకల్లు మండలంలో 8,204 హెక్టార్లలో నీటి వసతి కింద పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. -
ఆస్తి పన్ను పెంపు అసంబద్ధం : సీపీఎం
గుంతకల్లు టౌన్: పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అసంబద్ధంగా ఉందని, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప అన్నారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం చేపట్టిన ప్రజా పోరుయాత్రను సోమవారం ఆయన గుంతకల్లులో జెండా ఊపి ప్రారంభించారు. ఆస్తి పన్నులను 20 శాతం పెంచేలా త్వరలో చేపట్టనున్న సర్వేను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, సురేంద్ర, రంగమ్మ, తిమ్మప్ప, ఓబులేసు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి బుక్కరాయసముద్రం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తెలిపారు. 2025–25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి https://angrau.ac.in/ వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలన్నారు. -
ముచ్చుకోట స్కూల్ హెచ్ఎంకు షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీసు జారీ అయింది. కీలకమైన టీచర్ల బదిలీల ప్రక్రియపై అలసత్వం వహించిన ఆయన తన స్కూల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు సంబంధించిన హార్డ్కాపీలపై కౌంటరు సంతకాలు చేయకపోవడమే కాక, వారికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఫోన్లు చేసి అడిగితే.. ‘నేను ఎంఈఓకు చెప్పాను వెళ్లి ఆయనను కలవండి. మీ దరఖాస్తును లాగిన్లో ఆమోదం తెలుపుతారని’ చెపుతూ వచ్చాడు. ఆ టీచర్లు ఎంఈఓను కలవగా... హెచ్ఎం కౌంటర్ సంతకం లేకుండా తాను ఓకే చేయలేనంటూ తెగేసి చెప్పాడు. ఆదివారం చివరి రోజు కావడం... హెచ్ఎం అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన టీచర్లు చివరకు విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ పలుమార్లు ఫోన్ చేసినా సదరు హెచ్ఎం మొబైల్ పని చేయలేదు. చేసేదిలేక ఎంఈఓను ఆఫీసుకు పిలిపించి ఆ టీచర్ల దరఖాస్తులన్నీ ఆమోదం తెలపాలని సూచించారు. డీఓఈ ఆదేశాలతో ఎంఈఓ తన లాగిన్లో ఆమోదం తెలిపారు. ఈ వ్యవహారంపై ‘హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సమస్యను కొందరు పాఠశాల విద్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. -
పరాకాష్టకు ‘రెడ్బుక్’ వేధింపులు
● అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం ● వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్ అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్షక్ష పూరిత చర్యలకు పాల్పడడడం దారుణమన్నారు. పల్నాడు జంట హత్య కేసులో టీడీపీకి సంబంధించిన ఇరువర్గాలు గొడవపడి ఓ వర్గం వారిని హత్య చేశారని, మృతుల బంధువుల చెబుతున్నా.. ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ను కేసులో ఇరికించడం అన్యాయమన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నాయకులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని తిరుగోమనం దిశగా మళ్లించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. అమరావతి జపం, రెడ్బుక్ రాజ్యాంగం అమలు తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. హెచ్ఎం పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పాఠశాల సహాయకుల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాలో ఉన్న టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. https://deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ప్రొవిజినల్ సీనియార్టీ ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాలోని పీఎస్హెచ్ఎంలు/స్కూల్ అసిస్టెంట్లు తమ విద్యార్హత ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు కుల ధ్రువీకరణ పత్రాలు, పీహెచ్ టీచర్లు తమ ఒరిజనల్ విద్యార్హత పత్రాలతో పాటు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అనంతపురంలోని మొదటి రోడ్డులో ఉన్న శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో చేపట్టిన పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. -
వ్యవసాయశాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుశాఖలో.. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు. -
ఈ స్థలం నాది.. కాదనేవారెవ్వరు?
తాడిపత్రి: ‘అధికారం మాది.. ఇక్కడ మేము ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుంది. మమ్మల్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు’ అనే ధోరణి టీడీపీ నేతలో వ్యక్తమైంది. గ్రామ కంఠం స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకుని బండలు పాతేయడమే కాక... ఆ స్థలం తనదని, కాదనేవారెవ్వరూ లేరంటూ దౌర్జన్యానికి తెరలేపిన ఘటన తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు... ఇగుడూరు గ్రామంలోని సర్వే నంబర్ 306లో కొంత స్థలం గ్రామ కంఠంగా ఉంది. ఈ స్థలానికి అవతలి వైపు పట్టా భూముల్లో కొందరు పక్కా గృహాలు నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు సర్వే నంబర్ 306లోని గ్రామ కంఠంలోని 12 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉన్న స్థలమే ప్రధాన మార్గం. కాగా, ఈ స్థలానికి ఓ వైపు పుల్లన్న అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుని 30 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అతడి ఇంటి ముందర రస్తాకు ఓ వైపు పంచాయతీ బోరును వేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సదరు రస్తాతో పాటు పుల్లన్న ఇంటిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ వారాది పావులు కదిపాడు. ఇందులో భాగంగానే గత నెల 9న టీడీపీకి చెందిన బాలమద్దిలేటి మరికొందరితో కలసి పంచాయతీ బోరును దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయంగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం బోయ వారాది, బాల మద్దిలేటి మరికొందరు కలసి రస్తాను ఆక్రమించి అటు వైపు నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా దౌర్జన్యంగా బండల పాతారు. ఇది చూసిన స్థానికులు అడ్డుకోబోతే ఆ స్థలం తనదంటూ వారాది దౌర్జన్యానికి తెగబడ్డాడు. రెవెన్యూ అధికారుల అండతోనే టీడీపీ నేతలు బరి తెగించారని, సమస్య పరిష్కారానికి తహసీల్దార్ రజాక్వలి ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ ఇళ్లకు రాకపోకలు సాగించేలా ఉన్న రస్తా ఆక్రమణలను తొలగించాలని కోరారు. గ్రామ కంఠాన్ని ఆక్రమించి బండలు పాతిన టీడీపీ నేత రెవెన్యూ అధికారుల అండతోనే దౌర్జన్యమంటున్న స్థానికులు -
పనిచేసినా పనిష్మెంట్!
● ఎస్జీటీ కేడర్ సర్వీస్ పాయింట్లు కలపని ప్రభుత్వం ● 6–10 ఏళ్ల సర్వీస్ పాయింట్లు కోల్పోతున్న టీచర్లు ● పాయింట్ల నమోదులో 2017 బదిలీ టీచర్లకూ తీవ్ర అన్యాయం ● లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్: ఏళ్ల తరబడి పని చేసినా...తాజా బదిలీల్లో ప్రభుత్వం తమకు పనిష్మెంట్ ఇస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎస్జీటీ కేడర్కు ఎంపికై పని చేస్తూ...కొన్నేళ్లకు మరో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై సర్వీస్లో ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా పని చేస్తున్న టీచర్లకు ఎస్జీటీ కేడర్లో పని చేసిన సర్వీస్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘టీచర్ల బదిలీ చట్టం–2025’లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటూ బాధిత టీచర్లు వాపోతున్నారు. ఎస్జీటీ కేడర్లో పని చేసిన 6–10 ఏళ్ల సర్వీస్ను కోల్పోతున్నారు. ఒక్కో టీచరు 3–5 పాయింట్లు దాకా నష్టపోతున్నారు. గతంలో జరిగిన పలు బదిలీల్లో తమకు ఎస్జీటీ కేడర్ పాయింట్లు సర్వీస్కు కలిపారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా ఇలాంటి టీచర్లు ఉన్నారు. వారంతా రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మెసేజ్లు పెడుతూ ప్రభుత్వానికి తమగోడు వినిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు. తప్పనిసరి బదిలీ... పాయింట్లలో అన్యాయం 2017లో బదిలీ అయిన టీచర్లందరినీ తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్లు సర్వీస్ పూర్తికాకపోయినా ఈనెల 31 కటాఫ్ తేదీగా పెట్టి 23.2828 పాయింట్లతో 8 ఏళ్లు పూర్తయినట్లు భావించి వారందరి పోస్టులను ఖాళీలుగా చూపించారు.8 ఏళ్లు అంటే 24 పాయింట్లు ఇవ్వాలి. అదే 2023, 2021 రేషనలైజేషన్కు గురైన వారికి పూర్తిగా 24 పాయింట్లు ఇచ్చారు. దీంతో వారందరూ 2017 బ్యాచ్ వారికంటే ముందుకు వచ్చారని 2017 బదిలీ అయిన టీచర్లు వాపోతున్నారు. 9 ఏళ్లు సర్వీస్ అయినా 8 ఏళ్లకే పాయింట్లు 2014 డీఎస్సీలో ఎంపికై న వారు 2016 జూన్ 1న పాఠశాలల్లో చేరారు. వారందరికీ 2024 జూన్ 1 నాటికి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయింది. వారంతా అదే ఏడాది తప్పనిసరిగా బదిలీ కావాలి. అయితే ఆ ఏడాది బదిలీలు జరగలేదు. ప్రస్తుతం (9వ సంవత్సరం) కూడా అదే పాఠశాలలో పని చేస్తూ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి గరిష్టంగా 8 ఏళ్లకే స్టేషన్ పాయింట్లు చూపిస్తున్నారు. ఒక ఏడాదికి స్టేషన్ పాయింట్లు పూర్తిగా కోల్పోతున్నారు. 2021, 2023 సంవత్సరాల్లో జరిగిన బదిలీల్లో ఎలాంటి సీలింగు విధించకపోవడం వల్ల గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పని చేశారో అన్ని సంవత్సరాలకూ స్టేషన్ పాయింట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం గరిష్టంగా 8 ఏళ్లు సీలింగ్ పెట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని 2014 డీఎస్సీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా.. బదిలీల్లో భాగంగా మంగళవారం హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా ప్రదర్శించనున్నారు. ఖాళీలను వెబ్సైట్లో ప్రదర్శించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాను ప్రదర్శించనున్నారు. ఎస్జీటీల దరఖాస్తులను నేడు, రేపు పరిశీలించనున్నారు. -
జననాలంటే ‘లెక్కే’లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రైవేటు ఆస్పత్రుల విచ్చలవిడితనం రకరకాల ఇబ్బందుకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో అయినా మారుమూల గ్రామానికి చెందిన మహిళ ప్రసవించినా తల్లీ బిడ్డ వివరాలు నమోదు చేయాలనేది నిబంధన. కానీ మిస్సింగ్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జరుగుతున్న ప్రసవాలకు, నమోదవుతున్న వాటికీ పొంతన లేకుండా పోయింది. దీంతో కేంద్రం నుంచి ప్రసవ సమయంలో వచ్చే లబ్ధి కూడా జరగకుండా పోతోంది. జనాభా లెక్కల్లోనూ భారీ తేడా చోటు చేసుకుంటోంది. 8,661 మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు.. 2024–25 సంవత్సరంలో జిల్లాలో వాస్తవానికి 48,224 డెలివరీలు జరిగినట్టు సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం)లో నమోదైంది. ఈ సంఖ్య ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్)లో 34,858గా ఉంది. ఒక్కో కేంద్రం పోర్టల్లో ఒక్కో రకంగా సంఖ్య నమోదై ఉంది. జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే డెలివరీలు, గర్భిణుల నమోదు తప్పుల తడకగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 8,661 ప్రసవాలు అసలే నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఎంతమంది పుడుతున్నారు, ఎవరికి ఎలాంటి లబ్ధి జరుగుతోందన్నది తెలియడం లేదు. 2,800కు పైగా అబార్షన్లు..! జిల్లాలో మిస్సింగ్ ప్రసవాలే కాదు అబార్షన్లు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రమారమి 2,800కుపైగా అబార్షన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగినట్టు తెలిసింది. వాస్తవానికి ప్రసవం లేదా అబార్షన్ ఏదైనా నమోదు చేసి జిల్లా ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)కు సమాచారం ఇవ్వాలి. ఎందువల్ల అబార్షన్ చేయాల్సి వచ్చిందనేది నివేదికలో పొందుపరచాలి. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాయి. లింగనిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేస్తున్నట్టు కూడా విమర్శలొస్తున్నాయి. ఓవైపు జననాల రేటు తగ్గిపోతుంటే ప్రైవేటు వైద్యులు అబార్షన్లు చేసి మరింత తగ్గిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం బర్త్రేటు 1.5 కంటే తక్కువగా నమోదవుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకూ ప్రసవాల నమోదు ఇలా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,591 ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,481 ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదైనవి 34,858 సీఆర్ఎస్లో నమోదైనవి 48,224 మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ 8,661 (ఒక్కో పోర్టర్లో ఒక్కో రకంగా నమోదు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది) ప్రైవేటు ఆస్పత్రుల మాయాజాలం ప్రసవాల రిజిస్ట్రేషన్స్లో అవకతవకలు నమోదులో లేని 8,661 ప్రైవేటు ఆస్పత్రుల ప్రసవాలు రాష్ట్రంలో అత్యధికంగా మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు జిల్లాలోనే నర్సింగ్ హోంలలో జరిగే ప్రతి ప్రసవంపై సమాచారం ఇవ్వాలని నిబంధన ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంతో జనగణనలో ఇబ్బందులు -
నాడు
జిల్లాలో చౌక ధరల దుకాణాలు 1,645 రేషన్కార్డు దారులు 6,60,330 ఎండీయూ వాహనాలు 405 వాహనాలపై ఆధారపడిన నిరుద్యోగులు 810 మంది నేడుపొట్ట కొట్టి.. అవస్థలు తెచ్చిపెట్టి! ● కూటమి సర్కార్ కక్ష సాధింపు ● ఎండీయూ వాహనాల రద్దు ● రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునేలా ఆదేశాలు ● ఎండీయూ వాహనదారులు, ఆపరేటర్లకు ఉపాధి కోత ● ‘పాత’ కష్టాలు తలచుకుని కార్డుదారుల గగ్గోలు రాయదుర్గం: పేదల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్కు పేరొస్తుందనే అక్కసుతో నిర్దయగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. ఇంటింటా బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేసింది. ఎండీయూ వాహనాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరుద్యోగుల పొట్టకొట్టింది. మరోవైపు కూటమి సర్కారు చర్యలపై కార్డుదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. బియ్యం, పప్పుల కోసం ఇక ప్రతి నెలా కుస్తీలు పట్టాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఎండీయూ వాహనాల్లో త్రాసుతో తూకం వేసి బ్యాగులో బియ్యం పోసేవారు. 20 కిలోల కార్డుకు ఆ మేర తూకం పడితేనే సిగ్నల్ చూపేది. గతంలో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసే క్రమంలో తకరారు చేసి కొంత మిగుల్చుకునేవారు. దీంతో కార్డుదారులకు నష్టం చేకూరేది. అలాంటి అవకతవకలకు చెక్ పెడుతూ పేదలకు సౌలభ్యంగా ప్రవేశపెట్టిన విధానాన్ని మరింత మెరుగుపర్చాల్సింది పోయి పూర్తిగా ఊపిరి తీస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం వీధిన పడుతుంది గతంలో కూలి పనిచేసుకునేదాన్ని. మాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎండీయూ మంజూరు కావడంతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా బాబు వలంటీర్గా ఉండేవాడు. అది తొలగించారు. ఇప్పుడు వాహనాలను తొలగిస్తే మా కుటుంబం వీధిన పడుతుంది. –బండి ముంతాజ్, వైఎస్సార్ కాలనీ, కురుగుంట కంతులు ఎలా చెల్లించాలి? ఎండీయూ వాహనాల్ని రద్దు చేయడంతో ఆపరేటర్లు చిక్కుల్లో పడినట్లయింది. వాహనాలకు సంబంధించి నెలవారీ కంతులు బ్యాంకులకు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లకే కాదు, కార్డుదారులకూ ఇబ్బందులు తప్పవు. అందరినీ దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన నిర్ణయం తీసుకోవాలి. – సుధాకర్, ఎండీయూ ఆపరేటర్, రాయదుర్గం అనంతపురం అర్బన్: ‘‘ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి మా పొట్ట కొట్టొద్దు. ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడతాయి‘‘ అంటూ ఎండీయూ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎండీయూ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా 2021 నుంచి జిల్లాలో 405 వాహనాల నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఎండీయూ వాహనాలు తొలగిస్తే తమతో పాటు హెల్పర్లుగా ఉన్నవారు కూడా ఉపాధి కోల్పోయి వీధిన పడతారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాబావలి, బాబ్జాన్, ఖాసీమ్, గంగాధర్, గణేష్, హనుమంత, పోతయ్య, బషీర్, రమేష్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.నిర్దయపై నిరసనాగ్రహం -
వామ్మో.. ఇన్ని సమస్యలా...
తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారు వీరు. అధికారులు ఊహించని రీతిలో అర్జీదారులు రావడంతో మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. కలెక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ శివ్నారాయణశర్మ, ఇతర జిల్లాధికారులు అర్జీలు స్వీకరించారు. దాదాపు 380 అర్జీలు వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలున్నట్లు సమాచారం. ఇక.. అర్జీదారులకు అనుగుణంగా మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం పైఅంతస్తులో కార్యక్రమం నిర్వహించడంతో దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. వినతుల్లో కొన్ని.. 544డీ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు గ్రామంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, భూములను కాపాడాలని ఆలయ అర్చకులు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రిలో ప్రెస్క్లబ్ ఏర్పాటు చేయాలని విలేకరులు ఎమ్మెల్యే, కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే విలేకరులకు ఇంటి స్థలాలివ్వాలని కోరారు. -
కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇవి ప్రజల్లో మెదలినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కక్ష సాధింపులు తప్ప.. సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు దారుణ’మని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాని అరెస్టును ఖండించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో భయానకమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆయన జీవితమంతా అబద్ధాలమయ మని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గిరిజన పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనంతపురం రూరల్: గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజినేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఉన్నాయన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి 3 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఆయా పాఠశాలల్లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. యువ వైద్యుడిని మింగిన రోడ్డు ప్రమాదం కోలారు: రోడ్డు ప్రమాదం ఓ యువ వైద్యుడిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కర్ణాటకలోని కోలారు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నగరానికి చెందిన యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని ఇందిరానగర్కి చెందిన వెంకటేశులు కుమారుడు కృష్ణ జగన్ (24) చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హౌస్సర్జన్గా పని చేస్తున్నాడు. ఇటీవల వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కళాశాలకు కారులో బయలుదేరాడు. కోలారు జిల్లా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఉదయం 8.30 గంటల సమయంలో కృష్ణ జగన్ ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా తీవ్ర గాయాలైన డాక్టర్ కృష్ణ జగన్ ఘటనా స్థలంలోనే మరణించారు. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కృష్ణ జగన్ మరణవార్తను తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. యోగాతో మానసికోల్లాసం తాడిపత్రి రూరల్: యోగాతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పెన్నానది ఒడ్డున గల బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణలో యోగాసనాలు వేయడం సంతోషకరమని తెలిపారు. పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయం, గుత్తి కోట పరిసరాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వరస్వామిని కలెక్టర్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్లు తదితరులున్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘చల్లగా’ వచ్చేసింది ● 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరింపు అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ (సౌత్వెస్ట్ మాన్సూన్స్) ఉమ్మడి అనంతను సోమవారం పలకరించింది. ఉమ్మడి జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో ‘నైరుతి’కి స్వాగతం పలికాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు జూన్ 5 లేదా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే పరిస్థితి ఉండేదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. అయితే ఈ సారి వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈనె 24న కేరళను తాకిన నైరుతి సోమవారం ‘అనంత’లోకి ప్రవేశించాయన్నారు. రుతువపనాల ప్రభావంతో రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడవచ్చన్నారు. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఖరీఫ్ కింద దాదాపు 8 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే వ్యవసాయ, ఉద్యాన పంటలకు ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. రుతుపవనాలు ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురుస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. -
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్ ఉన్నారు. -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ● వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు లక్ష్మినారాయణ అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక అనంతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా కృష్ణప్రసాద్, రఘురామానాయుడు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామునాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా అశోక్బాబు, నాగేశ్వరయ్య, వెంకటరాముడు, కలీం అహ్మద్, డాక్టర్ శివారెడ్డి, శశిధర్రెడ్డి, పౌల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కేసీ నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా హనుమంతు, వరప్రసాద్, చంద్రశేఖర్, భారతమ్మ, మహబూబ్బాషా, వసంత, రామాంజినేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రూరల్ కమిటీ అధ్యక్షుడు మారుతీప్రసాద్ పాల్గొన్నారు. ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బూదగవి గ్రామానికి చెందిన బోయ నాగరాజు (32)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. హెచ్ఎం టీవీ రిపోర్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, జర్నలిస్టులు పి. షెక్షావలి, కె.ఆనందరావు, వడ్డె రమేష్, సాదిక్, వీరేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సరిహద్దున ప్రమాదంలో ఇద్దరి మృతి శెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) ఉన్నారు. వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి అల్లరి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులు ఆత్మానంద, వెంకటరమణప్ప, గురురాజమూర్తిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అమరేంద్ర, తిరుపాలు, పీడీ గోపాల్, హెచ్.నారాయణరావు, గోపాల్రెడ్డి, నగేష్, ఎంపీ శ్రీనివాసులు, రాజశేఖర్, రఘునాథశర్మ నేతృత్వం వహించారు. శేషగిరి, మునిస్వామి, సతీష్కుమార్, శ్రీనివాసులు, సదానందబాబు, వెంకటేశ్వరరావు, పులిశేఖర్ కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువును విస్మరించిన జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు. చెరువు మట్టిని దోచేస్తున్నారిలా.. అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నివేదిక పంపించాం. – ప్రతాప్రెడ్డి, తహసీల్దార్, యాడికి రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ 24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం -
ఏఐజీడీఏ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆలిండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం (ఏఐజీడీఏ) కన్ఫరడేషన్ జోనల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒడిశా) సెక్రెటరీగా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పి.రమేష్బాబును నియమించారు. ఆదివారం ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్ల సంఘం కన్ఫడరేషన్ సమావేశం చత్తీస్ఘడ్లో జరిగింది. 18 రాష్ట్రాల నుంచి సంఘం అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐజీడీఏ కన్ఫరడేషన్ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబుకు నియామక ఉత్తర్వులను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు అందజేశారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి పామిడి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వడ్ల చంద్రశేఖర్(38) అలియాస్ శేఖర్ చీనీ, వేరుశనగ, వడ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో భాగంగా పామిడికి చెందిన పిక్కిలి రామకృష్ణతో కలసి శనివారం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి తిరుగు ప్రయాణమైన భోజనం చేసేందుకు 44వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ధాబాకు చేరుకున్నారు. అప్పటికే మూసేయడంతో ధాబా సమీపంలోనే ద్విచక్ర వాహనం వద్ద నిలబడి మాట్లాడుకుంటుండగా... ఖల్సా ధాబా యజమాని తేజ ట్రాక్టర్పై వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో ట్రాక్టర్ అదుపు తప్పి చంద్రశేఖర్పై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, చంద్రశేఖర్కు భార్య లక్ష్మి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం అనంతపురం ఎడ్యుకేషన్: ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దరఖాస్తుల హార్డ్కాపీలను సంబంధిత హెచ్ఎంలు నిర్ధారించి...వాటిని ఎంఈఓలకు అందజేస్తే వారి లాగిన్లో ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఆదివారం తుది గడువు. ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యం మూడు రోజులుగా పత్తా లేకుండా పోయాడు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంఈఓ రవికుమార్ను అడిగితే...హెచ్ఎం నిర్ధారించిన తర్వాతనే లాగిన్లో అప్లోడ్ చేస్తానని స్పష్టం చేశారు. అయితే స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తులను పరిశీలించి... ఎంఈఓలు తమ లాగిన్లో అప్లోడ్ చేసేందుకు ఆదివారమే చివరి గడువు కావడంతో దరఖాస్తు చేసుకున్న ఆ స్కూల్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని డీఈఓ, గుత్తి డీవైఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వారు నేరుగా ఎంఈఓ రవికుమార్తో మాట్లాడారు. డీఈఓ మౌఖిక ఆదేశాల మేరకు చివరి నిముషంలో ఎంఈఓ అప్లోడ్ చేశారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతా అక్రమ ఆదాయమే.. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్మెంట్లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 శ్రీరామ్ ట్యాక్స్ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్స్టేషన్ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గార్మెంట్ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు. భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు హంద్రీ నీవా లైనింగ్ పనులతో రైతులకు తీరని అన్యాయం న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు.