-
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
కాయ్ రాజా కాయ్..
● జిల్లాలో జోరుగా బెట్టింగ్లు సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఓట్ల లెక్కింపునకు 20 రోజులు గడువు ఉండగా, అప్పుడే బెట్టింగ్లు ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా వైఎఎస్సార్పీ అభ్యర్థులు గెలుస్తారనే మెజార్టీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలకు తోడు పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి పనులతో జన మంతా అధికార పార్టీ వైపే మొగ్గు చూపారని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆ పార్టీ గెలుస్తుందనే పందేలు వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఏడు స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ గెలుస్తుందని బెట్టింగ్ కడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకవాసులు కూడా మన జిల్లాకు సంబంధించి పలు స్థానాలపై బెట్టింగ్లు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలుస్తారనే దానిపైనే కాకుండా ఆయా స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, కూటమి అభ్యర్థులు ఎంత చిత్తుగా ఓడతారనే దానిపై కూడా పందెం కాస్తున్నట్లు సమాచారం. ఎన్ఎస్జీ కమాండర్ ఆత్మహత్య కొత్తచెరువు: ఎన్ఎస్జీ కమాండర్గా పనిచేసే మండలానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎర్రబల్లి గ్రామానికి చెందిన బోయ నరసింహులు కుమారుడు చెన్నుడు (34) ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సాం రైఫిల్స్లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన చెన్నుడు...ఆ తర్వాత వీవీఐపీల రక్షణ బాధ్యతలు చూసే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) విభాగానికి బదిలీ అయ్యారు. శిక్షణ నిమిత్తం రెండు నెలల క్రితం ఢిల్లీకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీ రాత్రి తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తడి కారణంగానే చెన్నుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం చెన్నుడు మృతదేహాన్ని స్వగ్రామం ఎర్రబల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. దరఖాస్తులకు జూన్ 14 వరకూ అవకాశం కల్పించారు. రూ.1,000 అపరాధ రుసుంతో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 3,000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో జూలై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ బాలికల కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ● ఒక్కో సబ్జెక్టుకు రూ.1000, రెండు సబ్జెక్టులు రూ.3,000, మూడు సబ్జెక్టులు ఆపైన ఫెయిల్ అయి ఉంటే రూ.4,000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ● డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం ఉత్తీర్ణులై, మూడో సంవత్సరంలో పరీక్షలు రాయకుండా ఉంటే రూ.3,000 అదనంగా అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ● 1994–95 విద్యా సంవత్సరం నుంచి 2014–15 విద్యా సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ● 2008–09 విద్యా సంవత్సరం నుంచి రాయలసీమ వర్సిటీ ఏర్పాటైన నేపథ్యంలో.. అంతకుముందు ఎస్కేయూ పరిధిలో చదువు కున్న కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ● అభ్యర్థులు గతంలో పరీక్ష రాసిన హాల్టికెట్ గానీ, మార్క్స్కార్డు గానీ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఎంతోమందికి ఊరట.. గతంలో అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేని వారు, బ్యాక్లాగ్స్ (ఫెయిల్ అయినవారు) ఉన్నవారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని ఇటీవలే ఎస్కేయూ ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిగ్రీ ఫెయిల్ అయి పట్టా పొందలేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే సదవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా, వాటిన్నింటినీ రాయడానికి వీలు కల్పించారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్:ఓట్ల లెక్కింపు(కౌంటింగ్) కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతపురం పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జేఎన్టీయూలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సిద్ధం చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు, ఆర్ఓ టేబుల్, కౌంటింగ్ టేబుళ్లు, కేంద్రంలో ఇనుప కంచె, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చే మార్గం లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. అక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. ఎలుగుబంటి కలకలం బొమ్మనహాళ్: మండలంలోని దేవగిరి, ఉద్దేహాళ్, శ్రీనివాస్ క్యాంపు గ్రామాల శివార్లలో ఓ ఎలుగుబంటి మంగళవారం కలకలం సృష్టించింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో చెట్టుపైకి ఎక్కింది. కాసేపటికే దేవగిరి కొండల్లోకి పరుగులు తీసింది. ఎలుగుబంటి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రైతులు పత్తి పొలాల్లోకి వెళ్లాలంటే ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. న్యూస్రీల్ -
పథకం ప్రకారం అంతమొందించేందుకు కుట్ర
తాడిపత్రిరూరల్: పథకం ప్రకారం తనను అంతమొందించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగించాడని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలింగ్ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ పనిచేశారని ఆరోపించారు. నా ఓటమి చూడాలన్న లక్ష్యంతో పనిచేసిన ఆయన త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలకు ప్రత్యక్షంగా జేసీ ప్రభాకర్రెడ్డి కారణమైతే, వారికి రామకృష్ణ మద్దతిచ్చి పరోక్షంగా కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు జేసీ ప్రభాకర్రెడ్డిని రానీయొ ద్దని రిటర్నింగ్ అధికారి చెప్పినా రామకృష్ణ పట్టించుకోలేదన్నారు. వందలాది మంది అనుచరులతో పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాడన్నారు. పోలింగ్ ఏజెంట్గా ఉన్న తన పెద్దకుమారుడు హర్షవర్దన్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసి డ్రైవర్ తప్ప మరెవరు ఉండకూడదని హెచ్చరించాడన్నారు. ఒక పథకం ప్రకారం తనతోపాటు తన కుటుంబాన్ని అంతమొందించడానికి జేసీతో పాటు కుట్ర పన్నారని మండిపడ్డారు. దాడులకు దిగిన పచ్చ మూకపై కాకుండా తనపై అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. ఇలాంటి అధికారిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. టీడీపీ వర్గీయులు రాళ్ల దాడులకు దిగుతున్నా ఎంతో సహనంతో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను భయపడితే ఓటింగ్కు రారన్న భ్రమలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయాడని, అయితే, ఆయన భ్రమలను తారుమారు చేస్తూ ఓటర్లు తండోపతండోలుగా తరలివచ్చి వైఎస్సార్ సీపీకి మద్దతు ప్రకటించారన్నారు. ఇలాంటి ప్రజా చైతన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ‘జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా నా తలలో వెంట్రుక కూడా పీకలేకపోయారు. గతంలో నాపై కక్ష కట్టిన అధికారులు ఇప్పుడు ఏమయ్యారో, ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. ప్రజల అండతో త్వరలో మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది. నేడు రాక్షసంగా వ్యవహరించిన పచ్చ మూకను, వారికి సహకరించిన ఏ ఒక్క అధికారినీ వదిలి పెట్టేది లేదు. నాపై బనాయించిన కేసులపై కోర్టులో న్యాయ పోరాటం చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి జేసీ అరాచకాలకు చరమగీతం పాడుతా’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగడానికి కారణమైన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. జేసీ ప్రభాకర్ తొత్తులా ఏఎస్పీ రామకృష్ణ ఇలాంటి పోలీసును నా రాజకీయ జీవితంలో చూడలేదు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజం -
ట్రాలీ బోల్తా – వ్యక్తి మృతి
వజ్రకరూరు: ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన బోయ సురేష్ (30)కు భార్య సునీత, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న సురేష్ మంగళవారం ఉదయం తన సహచరులు వన్నూరు స్వామి, చిన్నమల్లితో కలసి ట్రాక్టర్లో బండలు వేసుకుని వజ్రకరూరుకు బయలుదేరారు. మరి కాసేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటారనగా... ట్రాక్టర్ ఇంజన్కు సంబంధించిన పెద్ద టైర్ బరస్ట్ కావడంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ట్రాలీ బోల్తాపడడంతో సురేష్పై బండలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మళ్లీ మా ప్రభుత్వమే
అనంతపురం కార్పొరేషన్: మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమే అని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకూ అండగా నిలిచారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పోలింగ్ రోజు రాత్రి 11 గంటల వరకూ కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారన్నారు. జగనన్నకు జై కొట్టిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, విప్లవాత్మక సంస్కరణలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల కృషితో మరోసారి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రానుందన్నారు. జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని, లేకుంటే బీజేపీలో విలీనమవుతుందని జోస్యం చెప్పారు. పోలింగ్ రోజున తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్న జిల్లా పోలీసులకు అభినందనలు తెలియజేశారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఛీ కొట్టినా పచ్చ మూకలకు బుద్ధి రావడం లేదన్నారు. సమావేశంలో తాడిపత్రి మార్కెట్యార్డు చైర్మన్ హరినాథ్ రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ జూన్ 4 తర్వాత టీడీపీ కనుమరుగు : పార్టీ అధ్యక్షుడు పైలా -
ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. జేఎన్టీయూలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో ఆయా నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు మంగళవారం తెల్లవారుజాముకు వాహనాల ద్వారా జేఎన్టీయూకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు వాటిని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల సమక్షంలో స్వాధీనం చేశారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే ప్రక్రియను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్, ఎన్నికల కమిషన్ సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్, అజయ్నాథ్ ఝ సమక్షంలో అధికారులు మంగళవారం నిర్వహించారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి వాటికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ల్లో ఉంచిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన ఫారాలను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్రూమ్లకు కలెక్టర్, పరిశీలకులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేశారు. సీల్పై కలెక్టర్, పరిశీలకులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. పటిష్ట బందోబస్తు నిర్వహించాలి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 24 గంటలూ నిఘా ఉంచాలన్నారు. స్ట్రాంగ్రూమ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తూ ఉండాలన్నారు. గదులవైపు ఏ ఒక్కరూ రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు ఉన్నారు. ‘అసెంబ్లీ’ల్లో 81.10.. ‘పార్లమెంట్’ 80.53 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగిందంటే ఓటు వేసేందుకు ప్రజలు ఏస్థాయిలో ఉత్సాహం చూపారనేది స్పష్టమవుతోంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ 81.10 శాతం నమోదైంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం (ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు) పరిధిలో 80.53 శాతం పోలింగ్ నమోదయ్యింది. 2019 ఎన్నికల కంటే ఈ ఎనికల్లో పోలింగ్ శాతం 0.3 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం. అప్పటి ఎన్నికల్లో 80.80 శాతం పోలింగ్ కాగా ఈ ఎన్నికల్లో 81.10 శాతం నమోదయ్యింది. కళ్యాణదుర్గంలో అత్యధికం.. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20,18,161 ఓట్లు ఉండగా 16,36,648 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుఫులు 8,17,536 మంది(49.95శాతం),మహిళలు 8,19,004 మంది (50.04 శాతం), ఇతరులు 108 మంది(0.01శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అత్యధికంగా 88.89 శాతం పోలింగ్ నమోదయ్యింది. అధిక సంఖ్యలో మహిళల ఓట్లే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పురుషుల ఓట్లు 49.89 శాతం, మహిళల ఓట్లు 50.10 శాతం, ఇతరుల ఓట్లు 0.08 శాతంగా నమోదయ్యాయి. అనంతపురం పార్లమెంట్ పరిధిలోకి రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురం పార్లమెంట్ పరిధిలోకి వెళుతుంది. రాప్తాడు మినహా ఏడు నియోజకవర్గాల పరిధిలో 17,67,591 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 14,23,441 మంది (80.53 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 7,10,187 మంది(49.89 శాతం), మహిళలు 7,13,148 మంది (50.10 శాతం), ఇతరులు 106 మంది (0.08 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
No Headline
● ఒత్తిళ్లకు కాసింత విరామం ఎన్నికల దృష్ట్యా ఒకట్రెండు నెలలు కాదు... దాదాపు ఎనిమిది నెలలుగా వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యనే గడిపిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోలింగ్ ముగియడంతో మంగళవారం కాస్త రిలాక్స్ అయ్యారు. కుటుంబసభ్యులతో కలసి ఆహ్లాదంగా గడిపారు. వంట చేయడంలో సిద్ధహస్తులైన వారు స్వయం పాకం చేసి ఇంటిల్లిపాదికి పెట్టి ఆనందించారు. కొన్ని నెలలుగా తాము పడిన ఒత్తిడికి విరామం ప్రకటిస్తూ ఆనందోత్సాహాలతో సందడి చేశారు. -
సౌకర్యవంతంగా వైద్య సేవలు
అనంతపురం మెడికల్: ఇటీవల ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన ఓపీ, ఐపీ బ్లాక్ ఎంతో ఉపయోగకరంగా మారింది. సర్వజనాస్పత్రిలో వివిధ విభాగాల్లో పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.3.5 కోట్ల నిధులు కేటాయించింది.ఈ నిధులతో అన్ని విభాగాలు అధునాతనంగా రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఆస్పత్రిలో ఉన్న ఓపీ బ్లాక్లో ఓపీ టికెట్ పొందాలంటే పురుషులు, మహిళలు చాలా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు చెక్క పెడుతూ ఆస్పత్రి ఆవరణలోని ఓపీ బ్లాక్లో రెండు గదుల్లో పురుషులు, మహిళలు, వికలాంగులు, తదితరుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నూతన ఓపీ బ్లాక్ ఏర్పాటుపై రోగులు, వారి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం కల్చరల్: బ్రాహ్మణ విద్యార్థినీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా ప్రతిభ గల పేద బ్రాహ్మణ విద్యార్థినులకు ఉపకార వేతనాలందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంఘం కార్యదర్శి రమాదేవి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 6వ తరగతి నుంచి పీజీ చదువుతున్న ప్రతిభ కల్గిన పేద విద్యార్థినులు అర్హులు. పూర్తి వివరాలకు 9703789201, 9490130999లో సంప్రదించవచ్చు. -
అనంతపురం క్రికెట్ లీగ్–2 ప్రారంభం
అనంతపురం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం క్రికెట్ లీగ్–2 మంగళవారం ప్రారంభమైంది. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్, ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛూఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. అనంతపురం క్రికెట్ లీగ్ను రెండో దఫా నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఇలాంటి లీగ్ల్లో పాల్గొంటే ఏసీఏ, బీసీసీఐ డొమెస్టిక్ సీజన్లో క్రీడాకారులు రాణిస్తారన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జూన్ 30 నుంచి జులై 13 వరకూ కొనసాగుతుందన్నారు. అనంతపురం క్రికెట్ లీగ్ నుంచి నాలుగు టీమ్లకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో అవకాశం కల్పిస్తామన్నారు. గ్రామీణ క్రికెట్తో ప్రారంభమైన ఆర్డీటీ క్రీడా ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ పాతికేళ్లుగా ఫుట్బాల్, హాకీ, టెన్నిస్, ఆర్చరీ, కబడ్డీ, జూడో తదితర క్రీడాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, ఏడీసీఏ అధ్యక్షుడు పీఎల్ ప్రకాష్రెడ్డి, సెక్రెటరీ కె.మధు ఆచారి, ఆర్డీటీ డైరెక్టర్ సాయికృష్ణ. జాయింట్ సెక్రెటరీ భీమలింగారెడ్డి, కోశాధికారి షబ్బీర్ అహమ్మద్, బీసీసీఐ లెవల్ –2 కోచ్ ఎం.శ్రీనివాసరెడ్డి, రంజీ మాజీ క్రీడాకారుడు కేఎస్ షాబుద్దీన్ పాల్గొన్నారు. -
అందరి సహకారంతో..
రోటరీ క్లబ్ అంటే అంతర్జాతీయంగా సేవా తత్పరతకు చిరునామాగా నిలిచింది. సేవాభావం ఉన్న వారు రోటరీ క్లబ్లో సభ్యులవుతున్నారు. ఆ సభ్యుల భార్యలు ఇన్నర్వీల్ సంస్థలో సభ్యులుగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము స్వతంత్రంగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలను ఇప్పటి వరకూ విజయవంతంగా నిర్వహించాం. మరెన్నో కార్యక్రమాలను రూపొందించాం. కలెక్టర్తో పాటూ అధికారులందరి సహకారం తీసుకుంటున్నాం. సేవలో సంతృప్తి పొందాలనుకునేవారికి ఇన్నర్వీల్ క్లబ్ చక్కటి మార్గం. – పీటీ పద్మ, చైర్పర్సన్, ఇన్నర్వీల్ క్లబ్ -
తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
తాడిపత్రి/తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ నాడు మొదలైన పచ్చ ముఠా హింసాకాండ మంగళవారమూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొనసాగింది.. సోమవారం పోలింగ్ సందర్భంగా దాడులకు దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు.. మంగళవారమూ తాడిపత్రిలో రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులూ ప్రతిఘటనకు దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలూ పరస్పరం రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అడ్డొచ్చిన పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. బరి తెగించిన టీడీపీ కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోని గానుగవీధికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సంజీవ సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా 230వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఏజెంటుగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకుడు సూర్యముని తన వర్గీయులు భాను, కిరణ్, అశోక్, వేణు మరికొందరితో కలిసి సంజీవపై దాడి చేశారు. అతని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా అతని మిక్చర్ బండినీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సంజీవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద పెద్దఎత్తున గుమిగూడిన టీడీపీ అల్లరి మూకలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్పై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన టీడీపీ అల్లరి మూకలు పోలీసులపైనా రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తాడిపత్రి అర్బన్ సీఐ మురళీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ గూండాగిరి దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులను వెంటేసుకుని సీబీ రోడ్డులో భయానక వాతావరణం సృష్టిస్తూ వస్తుండగా..పోలీసు బలగాలు అడ్డుకున్నా, ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో పుట్లూరు రోడ్డు గుండా సంజీవనగర్ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో తన ఇంటి ముందున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్ధంగా ఉంచుకున్న ట్రాక్టర్లలోని రాళ్లతో టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలోని వారందరూ ఇళ్లకు తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఐదు వేల మందికి పైగా జేసీ అనుచరులు గుమిగూడి ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారు వినకుండా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, బీఎస్ఎఫ్ బలగాలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు సైతం పరుగెత్తాల్సివచ్చి0ది. చివరకు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. జేసీ అనుచరులు ఒక్కసారిగా నాగాలాండ్ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ బలగాలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ జవానుల్లో ఒకరి కంటికి తీవ్ర గాయమైంది. జేసీ అనుచరులు విచక్షణ కోల్పోయి దాడులకు దిగడంతో ఎస్పీ అమిత్బర్దర్, డీఎస్పీ గంగయ్య, పోలీసులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో ఆగని అల్లరి మూకలు మరింత రెచ్చిపోయి బాణా సంచాకు నిప్పు పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన ఎస్పీ పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముíÙతో పాటు కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, ట్రైనీ ఎస్పీలు తాడిపత్రికి చేరుకుని భద్రతను సమీక్షించారు. ఆయా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.పోలీసుల వైఫల్యమే కారణం రెండు రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు పోలీసుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. తాడిపత్రి అసలే సమస్యాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన బలగాలను మంగళవారం ఉదయమే పంపేశారు. దాడులు జరుగుతాయని ముందస్తుగా పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు బలగాలను పట్టణంలో అలాగే ఉంచి ఉంటే మంగళవారం ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ వర్గీయుల పట్ల పోలీసులు అవలంబిస్తున్న మెతకవైఖరే అందుకు కారణమన్న బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
కోనుప్పలపాడులో రాళ్లతో దాడి
యాడికి: మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఉదయం నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఓటింగ్కు వస్తుండడం గమనించిన టీడీపీ సర్పంచ్ లక్ష్మీదేవి భర్త రామాంజనేయులు కుట్రలకు తెరలేపాడు. అదే గ్రామానికి చెందిన జేసీ ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత చవ్వా గోపాల్రెడ్డి ద్వారా నంద్యాల జిల్లా బూరుగుల గ్రామానికి చెందిన పది మంది అనుచరులను ఆటోలో రప్పించుకుని రిగ్గింగ్కు ఎత్తుగడ వేశారు. విషయాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నేత బాలగంగయ్య, తన అనుచరులతో కలసి వారిని అడ్డుకున్నారు. అప్పటికే రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉన్న చవ్వా గోపాల్రెడ్డి అనుచరులు 70 మంది ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఘటనలో గంపిరెడ్డి, మంగల చంద్ర, బాలకృష్ణతో పాటు ఇంటి బయట కూర్చొని ఉన్న కోనా వెంకటశివారెడ్డి తల్లి కోనా వెంకటనారాయణమ్మపై రాళ్లు పడడంతో తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న జెడ్పీ మాజీ సభ్యుడు వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు బాలా రమేష్బాబు, భోగాతి బ్రహ్మానందారెడ్డి కోనుప్పలపాడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
రెక్కమానులో రచ్చ
గాండ్లపెంట: కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం రెక్కమాను పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం మధ్యాహ్నం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 174వ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 1,445 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 2 గంటల సమయానికి 600 ఓట్లు పోలయ్యాయి. అయితే వైఎస్సార్సీపీకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయనే ఉద్దేశంతో మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. సముదాయించబోయిన వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. దీంతో స్వీయ రక్షణలో భాగంగా ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి. ఒకరికి రక్తగాయాలయ్యాయి. -
పోలింగ్కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు
అనంతపురం అర్బన్: జిల్లాలో పోలింగ్ విజయవంతంగా ముగిసిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ అన్నారు. ఇందుకు సహకరించిన ఎన్నికల కమిషన్ పరిశీలకులు, అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. పోలింగ్ నిర్వహణలో భాగస్వాములైన రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఏఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలు, ఓపీఓలు, కేంద్ర బలగాలు, నిఘా స్క్వాడ్లు, రూట్ అధికారులు, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికులు, ఎన్సీసీ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. -
యర్రగుంటలో ఏజెంట్పై దాడి
కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం యర్రగుంట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా ఓట్లు పోలవుతున్నాయన్న అక్కసుతో ఆ పార్టీ ఏజెంట్ కేవీ మంజునాథ్పై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఉదయం నుంచి వరుసగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఎక్కువగా ఓటింగ్కు వచ్చారు. విషయాన్ని గమనించిన టీడీపీ నేత ఆనంద్కుమార్ ఎలాంటి పాస్ లేకుండానే పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లాడు. ఆ సమయంలో అభ్యంతరం తెలిపిన మంజునాథ్ను దుర్భాషలాడుతూ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చాడు. అనంతరం అక్కడే ఉన్న టీడీపీ నాయకులు యశోదప్ప, అజయ్, రఘు, గౌసి, లక్ష్మన్న, రంగస్వామి, రాజప్పతో కలసి మంజునాథ్పై మూకుమ్మడి దాడి చేశారు. రోడ్డు పక్కన ఉన్న డ్రెయినేజీలోకి పడేసి తొక్కారు. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకునేసరికి పారిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ బి.శ్రీనివాసులు ప్రత్యేక పోలీసు బలగాలను పంపించారు. బాధితుడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పరామర్శించారు. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
అనంతపురం అర్బన్: పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. జేఎన్టీయూ కళాశాలలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచేందుకు నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈవీఎంలను పీఓ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు నియోజకవర్గానికి ఒక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల పీఓలు నియోజకవర్గ రిసెప్షన్ కౌంటర్లో నిర్దేశించిన ఫారాలను భర్తీ చేసి ఈవీఎంలను అప్పగించారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. అక్కడ విధులు నిర్వర్తించే అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. -
No Headline
ఉత్సాహంగా ఓటింగ్..ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు నెలలపాటు నిప్పులు కురిపించిన సూరీడు శాంతించాడు. వాతావరణం చల్లగా మారింది. ఐదేళ్లకొకసారి వచ్చే అతిపెద్ద ఎన్నికల పండుగకు ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం ఆరుగంటల నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ఈసారి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నూతన ఓటర్లు, సాధారణ ఓటర్లు అందరూ బాధ్యతగా కదిలారు. ఊతకర్ర చేతపట్టి కొందరు.. శక్తిని కూడదీసుకుని ఇతరుల సహాయంతో మరికొందరు.. వీల్చైర్లు.. మూడుచక్రాల సైకిళ్లపై ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కదిలొచ్చారు. ఓటు విలువను గుర్తెరిగి మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వారు ఎవరో నిర్ణయించుకుని ఓటు వేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తమ మదిలో ముద్రితమైన అభ్యర్థి–పార్టీకి ఈవీఎంపై బటన్ నొక్కారు. – సాక్షి బృందం -
కదిలొచ్చిన మహిళాలోకం...
●వృద్ధులు, యువత కూడా ●చల్లని ‘గాలి’కి సంకేతమే(నా)!సాక్షి,అనంతపురం: ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గంటల తరబడి క్యూలలో ఓపిగ్గా వేచి ఉండి మరీ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. వృద్ధులు, యువత కూడా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. ‘గాలి’ ప్రచండమే(నా).. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. అన్ని పథకాల్ల్లోనూ అగ్ర తాంబూలం ఇచ్చారు. నామినేటెడ్ పదవులనూ అక్కచెల్లెమ్మలకే పెద్ద సంఖ్యలో కట్టబెట్టారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా తదితర పథకాలతో అండగా నిలిచారు. దీంతో పాటు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందేలా చర్యలు తీసుకుని చేయూత అందించారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని కుచ్చుటోపీ పెడితే, జగన్ అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ చేసి మాట నిలుపుకున్నారు. అక్కచెల్లెమ్మలకు సంతోషం పంచారు. మహిళా పక్షపాతిగా నిలిచి జేజేలు అందుకున్నారు. అలాగే, వృద్ధులకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ మొత్తాన్ని పెంచి, వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దకే వెళ్లి డబ్బు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకోవడం చూస్తే ‘ఫ్యాను’ గాలి బలంగా వీచే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఓట్ల పండుగ... రంగవల్లుల ముచ్చట
అనంతపురం అర్బన్: ఏడు నెలల ముందుగానే జిల్లాలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన జిల్లా వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణాలు, గ్రామాల్లో సందడి నెలకొంది. కనువిందు చేసే ముగ్గులతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ జిల్లా అధికారులు సైతం ఈ సారి వైవిధ్యాన్ని కనబరిచారు. ఇప్పటికే జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి ఆలోచనతో జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల మస్కట్ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్కుమార్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద రంగవల్లులతో ఆకట్టుకున్నారు. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ప్రవేశ మార్గం వద్ద ‘ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అంటూ వేసిన రంగవల్లి చూపరులను ఆకట్టుకుంది. పలు మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వేసవితాపం బాగా తగ్గిపోయింది. రాయదుర్గం, గుడిబండ, కళ్యాణదుర్గం, మడకశిర, గుంతకల్లులో 30 నుంచి 40 మి.మీ, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, కంబదూరు, వజ్రకరూరు, కదిరిలో 20 నుంచి 25 మి.మీ, డి.హీరేహాల్, కణేకల్లు, యాడికి, ఆత్మకూరు, బుక్కపట్నం, తలుపుల, అమరాపురం, కనగానపల్లి, ముదిగుబ్బ తదితర మండలాల్లో 10 మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అస్మిత్ హౌస్ అరెస్ట్ తాడిపత్రి అర్బన్: పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్దన్రెడ్డి, సాయిప్రతాపరెడ్డిని వారి నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు. అలాగే టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి, సోదరుడు జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్రెడ్డిలనూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వీరిని విడిచిపెట్టారు. -
ఓటు వేసేందుకు వెళుతూ మృత్యు ఒడికి
గౌరిబిదనూరు: ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు... హిందూపురం తాలూకా సంతేబిదనూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేశు (35) బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన అర్ధరాత్రి గౌరిబిదనూరు తాలూకాలోని కామలాపురం సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఘటనలో వెంకటేశు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై మంచేనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
తనకల్లులో మూకుమ్మడి దాడి
తనకల్లు: కదిరి నియోజకవర్గం తనకల్లు పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లిలో 1,110 ఓటర్లు కలిగిన 255వ పోలింగ్ కేంద్రం వద్ద మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్రిక్తత నెలకొంది. రాచువారిపల్లికి చెందిన ఓటరు దేశాయి గౌతంరెడ్డి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఆ సమయంలో క్యూలైన్ అడ్డదిడ్డంగా ఉండడంతో సక్రమంగా వెళ్లాలని ఆయన సూచించారు. అయితే అప్పటికే ఓటమి భయంతో చిరాకుతో ఉన్న టీడీపీ నాయకులు... గౌతంరెడ్డిపై మూకుమ్మడిగా కలబడ్డారు. మా ఊళ్లోకి వచ్చి నీవెవరు చెప్పడానికంటూ చేతికి అందిన రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. దాడిలో గౌతంరెడ్డి కారు ధ్వంసమైంది.ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో ధ్వంసమైన కారు -
వ్యక్తి దుర్మరణం
రాయదుర్గం టౌన్: స్థానిక బీటీపీ రోడ్డు హౌసింగ్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో హోటల్ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన రాజు (35), హోట్ల్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గర్భణి అయిన భార్యకు రాయదుర్గంలో వైద్య పరీక్షలు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో పాటు నాలుగేళ్ల వయసున్న కుమారుడు చరణ్ను పిలుచుకుని ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి బయలుదేరాడు. హౌసింగ్ లే అవుట్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో తలకు బలమైన గాయమై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన భార్య, కుమారుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి చేర్చారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement