breaking news
Ananthapur
-
హెచ్చుమీరిన అసాంఘిక కార్యకలాపాలు.. విచ్చలవిడిగా వ్యభిచారం!
అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కర్కశత్వం.. ‘అమ్మ’ను గుడి దగ్గర వదిలేశారు..!!
పెద్దపప్పూరు(అనంతపురం): అంధురాలు.. ఆపై నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రంలో అనాథలా ఉండిపోయింది. పుట్లూరు మండలం కందికాపుల గ్రామానికి చెందిన సంజమ్మను ఎవరో పది రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆరుబయట దోమల బెడదతో పాటు ఈదురుగాలులకు వణుకుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే పాముల ఆది అనే భక్తుడు అమెను చూసి చలించిపోయి సపర్యలు చేస్తున్నారు. ఆమెకు స్నానం చేయించి.. అన్నపానీయాలు అందిస్తున్నారు. అలాగే వదిలేస్తే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో అటువైపు వెళ్లిన ‘సాక్షి’ సదరు మహిళ సమీప బంధువుల ఫోన్ నంబర్ సేకరించి పరిస్థితి వివరించింది. సంజమ్మ యల్లనూరులో ఉందనుకున్నామని, వెంటనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపి అశ్వత్థం నుంచి తీసుకెళ్లాలని తెలియజేస్తామని సమాధానమిచ్చారు. -
తీవ్రంగా తాగునీటి సమస్య
● మంత్రి కేశవ్తో వాపోయిన మహిళలు విడపనకల్లు: తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డొనేకల్లు గ్రామ మహిళలు మంత్రి పయ్యావుల కేశవ్కు విన్నవించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని డొనేకల్లు, గడేకల్లు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా డొనేకల్లులో మహిళలు తాగునీటి సమస్యపై మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. అనంతరం కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనపై రాష్ట్ర ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడిందని తెలిపారు. వలంటీర్ల ద్వారా ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడొస్తాయి సారూ..? ● ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డిని ప్రశ్నించిన ప్రజలు యాడికి: ‘తల్లికి వందనం పథకం కింద మా పిల్లలకు డబ్బులు రాలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే త్వరలో ఖాతాలో జమ అవుతుందంటున్నారు. ఇంతకూ డబ్బులు ఎప్పుడొస్తాయి’అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డిని ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడగగా.. ‘రాలేదు’అని పలువురు ఎమ్మెల్యేకు తెలియజేశారు. -
ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదని ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: ఎంసెట్లో అశించినస్థాయిలో ర్యాంకు రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థి సాగర్కుమార్రెడ్డి (17) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను జీఆర్పీఎఫ్ ఎస్ఐ నాగప్ప శనివారం మీడియాకు వెల్లడించారు. యల్లనూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన పద్మభూషణ్రెడ్డి కుమారుడు సాగర్కుమార్రెడ్డి అనంతపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాడు. ఇంటర్ తరువాత ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోవడంతో లాంగ్టర్మ్ కోచింగ్కు వెళ్లాడు. రెండోసారి రాసిన ఎంసెట్లోకూడా మంచి ర్యాంకు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లోవారికి చెప్పకుండా తాడిపత్రికి మోటార్సైకిల్పై వచ్చాడు. చల్లవారిపల్లివద్ద మోటార్సైకిల్ను పార్క్ చేశానని, వచ్చి తీసుకెళ్లాలని ఇంట్లోవారికి సెల్ఫోన్లో మెసేజ్ పంపాడు. అనంతరం సాగర్కుమార్రెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాల కోసం ఆరా తీశారు. ఎలాంటి అచూకీ తెలియకపోవడంతో ఫొటోలను తీశామన్నారు. రైలు కింద పడిన యువకుడు తన కుమారుడని పద్మభూషణ్రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఫిర్యాదు తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. -
కలుషిత నీరు కలకలం
గుంతకల్లు: కలుషిత నీరు కలకలం సృష్టించాయి. వాంతులు, కడుపునొప్పితో బాధితులు ఆస్పత్రికి పరుగులు తీశారు. వివరాలు.. శనివారం ఉదయం గుంతకల్లు పట్టణంలోని పలు చోట్ల మున్సిపల్ కుళాయిలకు నీళ్లు వదిలారు. ఈ క్రమంలోనే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయిక్రిష్ట ఆస్పత్రి సమీపంలో నివాసముంటున్న వారు కుళాయి నీళ్లను పట్టుకుని తాగారు. కొంతసేపటికే వాంతులు, విరేచనలు, కడుపు నొప్పి మొదలవడంతో వనజ, స్వాతి, గీతమ్మ, దీపక, భరత్, కళ్యాణీ, చిట్టక్క, బ్రహ్మ, భీమలింగా, రామ్ లక్ష్మణ్, కార్తీక్, ఉదయ్తోపాటు మరో 10 మంది లబోదిబోమంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు పెట్టారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చిక్సితలు అందించి ఇంటికి పంపారు. కుళాయి నీళ్లు ఎర్రగా ఉండటంతో పాటు వాసన వెదజల్లాయని రోగులు తెలిపారు. పురుగులు కూడా కనిపించాయన్నారు. తమ ప్రాంతంలో మురికి కాలవలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారం పేరుకు పోయిందన్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కుళాయిల్లో కలుషిత నీరు వస్తున్నాయని వాపోయాచారు. ● రోగులను వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ మార్కెట్ వెంకటేష్ పరామర్శించారు. విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తిలక్నగర్ అర్బన్ హైల్ సెంటర్ డాక్టర్ స్వాతి, ఏఎన్ఎం శ్రీలత, ఆశా వర్కర్ జానికి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించారు. అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. నీళ్లను బాగా వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని డాక్టర్ స్వాతి సూచించారు. గుంతకల్లులో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి బాధితుల పరుగులు -
తాడిపత్రి వెళ్తా.. అనుమతివ్వండి
● ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు తనకు అనుమతి కావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ ఆంక్షలతో ఆయన తాడిపత్రికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పట్టణానికి వెళ్లేందుకు కోర్టులు అనుమతి ఇచ్చినా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అడ్డుకుంటున్న తరుణంలో పెద్దారెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని లేఖలో పెద్దారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా తాడిపత్రిలో కార్యక్రమం చేపట్టాల్సి ఉందన్నారు. తాను దాదాపు 3 రోజుల పాటు పట్టణంలో ఉండాల్సి ఉంటుందన్నారు. కావున తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కావాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో 10,089 కేసుల పరిష్కారం అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్ అదాలత్లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1.57 కోట్ల నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్ఐ యాక్ట్ కేసులు– 22 మొత్తం రూ.31,50,000. రేపు పామిడిలో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 7వ తేదీ సోమవారం పామిడి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. 1100కు కాల్ చేయండి అర్జీదారులు 1100కు ఫోన్ చేసి పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అర్జీలను సమర్పించి పరిష్కారం పొందవచ్చన్నారు. -
కుళ్లాయిస్వామికి విశేష పూజలు
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం పెద్ద సరిగెత్తు, సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గ్రామోత్సవం, ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం గ్రామోత్సవం, జలధి కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్ఐ సాగర్ గట్టి బందోబస్తు నిర్వహించారు. -
రమణీయం.. పూరీ జగన్నాథుడి రథోత్సవం
అనంతపురం కల్చరల్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరేరామ హరే కృష్ణ నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. పూరీ జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని అనంతపురం భక్తిసాగరంలో మునిగితేలింది. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పవిత్ర నదీజలాలతో సంప్రోక్షణ అనంతరం స్థానిక కేఎస్ఆర్ కళాశాల వద్ద రథోత్సవాన్ని సత్యగోపీనాథ్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. సప్తగిరి సర్కిల్ నుంచి పాతూరు, శ్రీకంఠం సర్కిల్,ఆర్ట్స్ కళాశాల, టవర్ క్లాక్ మీదుగా వెళ్లి లలితళాపరిషత్తు వరకు రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా రథం ముందు కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, దేవతామూర్తుల వేషధారులు, కోలాటం, గురవయ్యలు, ఉరుముల కళాకారులు అద్భుతంగా కళారూపాలను ప్రదర్శించారు. నాట్యాచార్యులు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో కళాకారులు శాసీ్త్రయ నృత్యాలతో జగన్నాథుడికి భక్తి నీరాజనాలర్పించారు. ఇస్కాన్ విశిష్టతను తెలియజేశారు. ● అంతకుముందు లలితకళాపరిషత్తులో ఇస్కాన్ మందిర ఇన్చార్జ్ దామోదర గౌరంగదాసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సినీనటుడు సుమన్, సత్యగోపీనాథ్ మాట్లాడుతూ ఇస్కాన్ సేవలు అమూల్యమన్నారు. రథయాత్రలో కుల మతాలకతీతంగా ప్రజలు పాల్గొనడం సంతోషం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో పర్చూరు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి
అనంతపురం అర్బన్: ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి. స్కానింగ్ సెంటర్లను విస్తృతంగా తనిఖీ చేయాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీసీపీఎన్డీటీ యాక్ట్ (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం) అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్ర నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఆర్డీటీ సంస్థ ప్రతినిధి డాక్టర్ దుర్గేష్, సీఐ బాషా, డెమో త్యాగరాజ్ పాల్గొన్నారు. మొక్కజొన్న వ్యాపారిపై కేసు యాడికి: రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యాపారిపై యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఎ.సంతోష్కుమార్ అనే వ్యక్తి శ్రీ చంద్రాల పరమేశ్వర ట్రేడర్స్ ఆల్ పౌల్ట్రీ ఇంగ్రీడియ్స్ అండ్ రా మెటీరియల్స్ సంస్థ ఉంది. గత ఏడాది ఈ వివరాలతో కూడిన విజిటింగ్ కార్డును యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నూతల సాయి కల్యాణ్కు పంపాడు. దీంతో సాయి కల్యాణ్ రూ.1,28,14,340 విలువ గల మొక్కజొన్న పంటను హైదరాబాద్లోని సంతోష్ కుమార్కు విక్రయించాడు. ఇందులో రూ.68,26,080 మాత్రమే ఇచ్చి.. మిగతా సొమ్ము ఇవ్వకుండా మోసం చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయి కల్యాణ్ ఫిర్యాదు మేరకు సంతోష్కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణరెడ్డి, వెంకటరమణప్ప, గోపాల్, వెంకటరెడ్డి, రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉన్న పీఆర్సీ కమిటీ ఏడాది కిందట రద్దయిందని పేర్కొన్నారు. మళ్లీ పీఆర్సీ కమిటీ వేయకుండా, కనీసం ఐఆర్, డీఏ కూడా ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా వెన్నం శివరామిరెడ్డి (ఎన్ఆర్ఐ), చింతకుంట వెంకటేశులు (అనంతపురం అర్బన్), మెట్టు విశ్వనాథ్రెడ్డి, కళేకుర్తి ఉషారాణి (రాయదుర్గం), జింకల రామాంజినేయులు, చుక్కలూరు దిలీప్రెడ్డి(గుంతకల్లు), బళ్లారి మహమ్మద్ జిలాన్, వెన్నపూస వెంకటరామిరెడ్డి (తాడిపత్రి), కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్రెడ్డి, ముదిగుబ్బ వీరాంజినేయులు, అంకె లక్ష్మణ్ణ(రాప్తాడు) నియమితులయ్యారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి. ‘విద్యా శక్తి’ని టీచర్లపై రుద్దడం సరికాదు అనంతపురం ఎడ్యుకేషన్: బడి వేళల తర్వాత ‘విద్యాశక్తి’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ నాయకులు వాపోయారు. శనివారం సాయంత్రం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడారు. ఏటా 10వ తరగతి విద్యార్థులకు ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం జనవరి నెలలో ప్రారంభమవుతుందన్నారు. కానీ జూలై 1 నుంచే పారంభించడం ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన విధానమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. కాలి బాటన వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ఉన్నారని, వారు ఇంటికి చేరుకోవడానికి చీకటి అవుతుందన్నారు. ముఖ్యంగా బాలికలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఏమాత్రమూ ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరోవైపు రెగ్యులర్ బోధనకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, నాయకులు నాగన్న, ఓబులేసు, శ్రీరాములు పాల్గొన్నారు. -
దేవరకొండకు తూట్లు
అది ఒక కొండ కాదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొలిచే దేవతా స్వరూపం. కరువు నుంచి రక్షించే ‘దొణ తిమ్మరాయస్వామి దేవరకొండ’. తరతరాలుగా పూజలందుకుంటున్న ఈ కొండను ప్రజలు ‘ద్యావుర బండ’ అని పిలుచుకొని కొలుచుకుంటారు. అలాంటి ప్రజల విశ్వాసంపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తూటాలు (బండను పేల్చే పేలుడు పదార్థాలు) పేలుస్తుండటం ఆయా గ్రామాల ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తోంది. శెట్టూరు: మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల మధ్య సర్వే నంబర్ 185లో సువిశాలమైన విస్తీర్ణంలో కొండ (ద్యావుర బండ) ఉంది. కొండపై తిమ్మరాయప్ప పాదం, స్వామివారి గుర్రం పాదం గుర్తులు ఉన్నాయి. వీటికి రైతులు ఉత్తరకార్తెలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీ నాయకులకు ఈ కొండపై కన్ను పడింది. కొండను తవ్వి కంకర అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఇందు కోసం క్వారీ నిర్వహణకు అనుమతుల కోసం పావులు కదిపారు. కొండకు ఆనుకుని ఉన్న ఇద్దరు రైతుల డీ–పట్టా పొలాలను లీజుకు తీసుకుని.. అందులో క్రషర్ యంత్ర సామగ్రిని సమకూర్చారు. కొండకు చుట్టుపక్కలన్నీ సాగు భూములే. 70కి పైగా మామిడి తోటలు, 300కు పైగా బోరు బావులు ఉన్నాయి. క్వారీ నిర్వహణ విషయం రైతులకు ఏమాత్రం తెలియదు. అధికారులు కూడా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినా సరే అధికార పార్టీ నాయకులు బండకు తూట్లు పొడుస్తున్నారు. బండను పేల్చే సమయంలో పొలాల్లోకి రాళ్లు ఎగిరి పడటం.. క్రషింగ్ చేసేటపుడు దుమ్ము, ధూళి పంటలను కప్పేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. కొండకాదు మా దేవత.... దేవర కొండను తాము కొండగా చూడబోమని, దేవతగా ఆరాధిస్తామని ప్రజలు తెలిపారు. పురాతన కాలం నుంచి కొండపై వెలసిన దొణ తిమ్మప్పను పూజిస్తున్నట్లు చెప్పారు. ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల రైతులను రక్షించే దైవం, ఇక్కడ వర్షాలు లేక కరువు వస్తే ఈ కొండపైకి వచ్చి తిమ్మప్పస్వామికి పూజలు చేసి, వంట వండి నైవేద్యం సమర్పిస్తే.. తిరిగి ఇంటికి వెళ్లేలోపే వర్షం పడేదని చెబుతున్నారు. కొండపై పూరాతన మాగాణి (పంటలు పండే భూమి) ఉండేదని, పూర్వానికి ఏడు గ్రామాల ప్రజలు ఇక్కడ నివసించి ఆహార ధాన్యాలు పండించేవారని గుర్తు చేస్తున్నారు. మామిడితోటే నా జీవనాధారం దేవరబండ అనే కొండకు ఆనుకుని నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. ఐదేళ్ల క్రితం తోటలో మామిడి మొక్కలు నాటాను. ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. అయితే ఇక్కడి కొండపై పేలుడు పదార్థాలు పెట్టి బండను పేలుస్తున్నారు. దీనివల్ల దుమ్ము, ధూళి వచ్చి మామిడి చెట్లపై పడుతోంది. దీనివల్ల కాపు రాకుండా పోతోంది. ఇక్కడ కంకర మిషన్ నిర్వహస్తే నా తోటపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. ఈ కొండను తవ్వేందుకు అధికారులు అనుమతులు ఇవ్వరాదు. – రామాంజనేయులు, రైతు, ఐదుకల్లు పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం నేను ఐదురోజుల క్రితం తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నా. క్వారీ నిర్వహణ, అనుమతులు విషయం ఏవీ తెలియదు. నా దృష్టకి వస్తే పరిశీలించి.. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసు కుని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా. – ఈశ్వరమ్మ, తహసీల్దార్, శెట్టూరు కొండపై ‘దొణ’లే జీవనాధారం... టీడీపీ నేతల నిర్వాకం సమీప పంట పొలాలకు దెబ్బ చుట్టుపక్కల 4 గ్రామాల వరకు ఎఫెక్ట్.. క్వారీ నిర్వహించరాదంటున్న రైతులుతిమ్మప్పకొండపై ఉన్న లోతైన దొణలు ఎప్పటికీ ఎండిపోవని, స్వచ్ఛమైన నీరు అప్పుడు, ఇప్పుడు ప్రజలకు జీవనాధారంగా ఉందని ప్రజలు తెలిపారు. కొండ ఇంతటి నీటిని పట్టి ఉంచటం వల్లే మా గ్రామాల్లో భూగర్భజలాలు ఎక్కువగా ఉన్నాయని, వన్యప్రాణులు అధిక సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. పొలాల్లో ఉన్న రైతులకు ఈ ‘దొణ’ల్లోని నీరే దాహం తీర్చుతుందన్నారు. ప్రస్తుతం కూడా ఈ కొండపై పెద్ద నీటి ట్యాంకు నిర్మించారని, ఈ ట్యాంక్ నుంచే గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ఇలాంటి కొండపై పేలుళ్లు జరిపి కంకర తీసుకొని కొండను నేలమట్టం చేయాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించు కోవాలని వేడుకుంటున్నారు. -
రైతుల్లో నమ్మకం కోల్పోయారు
మాట చెప్పడం దాన్ని దాటవేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీటీపీని 2014–19 మధ్య పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపనలతో హడావుడి చేశారు. రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మాజీ సీఎం జగన్ 2019–24 మధ్య రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టారు. భూసేకరణకు నిధులిచ్చారు. ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్న సమయంలోనే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. చిత్తశుద్ధి ఉంటే పనులను సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరివ్వాలి. శంకుస్థాపనలు చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు. రైతులతో కలసి ఉద్యమిస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం ప్రజలు నమ్మడం లేదు ఒకే పనికి ముఖ్యమంత్రి ఓసారి, మంత్రులు మరోసారి శంకుస్థాపనలు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీటీపీ ఎత్తిపోతల పథకం కొందరికి బంగారుబాతులా మారింది. రైతులకు మేలు చేకూరితే మొదటగా మేమే సంతోషిస్తాం. అలా కాకుండా శంకుస్థాపనల పేరిట రూ. లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మా ప్రభుత్వ హయాంలో భూసేకరణకు సంబంధించి రైతులకు డబ్బులిచ్చాం. మిగిలిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ -
నాడు
నేడుసాక్షి టాస్క్ఫోర్స్: ‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న’ చందంగా తయారైంది టీడీపీ ప్రజాప్రతినిధుల తీరు. మాటల్లో కోతలు కోస్తున్న వారు చేతల్లో మాత్రం చూపలేకపోతున్నారు. బీటీ ప్రాజెక్టు పూర్తి చేసి రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టారు. అయితే, అధికారం చేపట్టాక ఆర్భాటాలతోనే సరిపెట్టారు. సభలు, శంకుస్థాపనల పేరిట రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. బీటీపీ అతిథి గృహం వద్ద ఏకంగా రూ.50 లక్షలతో పైలాన్ నిర్మించి ఆవిష్కరించారు. దీనికితోడు శిలాఫలకం ఆవిష్కరణ, సభ తదితరాలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రైతులకు పైసా ఇవ్వకుండా.. బీటీపీ ఎత్తిపోతల పథకానికి మొదటి ప్యాకేజీ కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.358.20 కోట్లు కేటాయించారు. ఆ పనుల టెండర్ను ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. జీడిపల్లి నుంచి కామన్కెనాల్ ద్వారా గరుడాపురం చేరే నీటిని కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి– జంబుగుంపుల వరకు మళ్లించి 114 చెరువులు నింపేలా బ్రాంచ్ కెనాల్, బీటీ ప్రాజెక్టుకు మరో బ్రాంచ్ కెనాల్ తవ్వేందుకు 1,406.89 ఎకరాల భూసేకరణ చేపట్టారు.అయితే, భూసేకరణకు సంబంధించి రైతులకు పంపిణీ చేసేందుకు తొలి విడతగా రూ.20 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపితే.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పైసా కూడా జమచేయలేదు. దీంతో పనులను అన్నదాతలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పనులు మరుగున పడిపోయాయి. సంతోషం పంచిన జగన్ బీటీపీ ఎత్తిపోతల పథకంలో ప్రధాన ఘట్టం భూములిచ్చిన రైతులకు పరిహారం పంపిణీ. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.202 కోట్ల నిధులు విడుదల చేశారు. దశల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమచేసి సంతోషం పంచారు. ఈ ప్రక్రియతో పాటు అనేక లోటుపాట్లు సరిదిద్ది పనులు పట్టాలెక్కిస్తున్న తరుణంలోనే కూటమి ప్రభుత్వం రావడంతో ప్రక్రియ మొత్తానికి బ్రేక్ పడింది. నేడు మళ్లీ హడావుడి.. అధికారంలోకి రాగానే బీటీపీ పనులు పూర్తి చేస్తామని గత ఎన్నికల్లోనూ వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలో వచ్చి ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తలేదు. బడ్జెట్లోనూ ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. అయితే ఇటీవల రైతుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో కూటమి ప్రజాప్రతినిధులు మళ్లీ హడావుడి మొదలుపెట్టడం గమనార్హం. ఇందులో భాగంగా శనివారం బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి సమీపంలో రెండో సారి భూమి పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాయలు చేయకుండా ఈ సారైనా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బీటీపీ కాలువ పనులకు మళ్లీ శంకుస్థాపన 2018లో సీఎం హోదాలో ఆర్భాటంగా పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు నేడు మళ్లీ పనులకు టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రారంభోత్సవాలు గత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు పైసా విదల్చని చంద్రబాబు అప్పట్లో ఆర్భాటాలకే రూ.కోట్ల దుర్వినియోగం నేడు మళ్లీ పాతరాగం అందుకోవడంపై సర్వత్రా విమర్శలు ‘‘హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి చేరే కృష్ణా జలాలను జనవరి 2019 నాటికి బీటీ ప్రాజెక్టుకు తరలిస్తాం. కరువు రైతుల కష్టాలు తీరుస్తాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్ని సస్యశ్యామలం చేస్తాం.’’ 2018 అక్టోబర్ 10న బీటీపీ వద్ద పైలాన్ ఆవిష్కరణ అనంతరం సభలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివీ.. ‘‘బీటీపీకి త్వరలో నీరిస్తాం.రైతుల సంక్షేమమే లక్ష్యం’’... అప్పట్లో చంద్రబాబు భూమి పూజ చేసి ప్రారంభించిన పనులకే శనివారం మళ్లీ బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి సమీపంలో పూజలు చేసి ప్రారంభోత్సవం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలికిన పలుకులివి. -
తాడిపత్రికి వెళ్లాలి.. ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్కు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. దీంతో, ఎస్పీ జగదీష్ ఈసారైన అనుమతి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.అనంతపురం ఎస్పీ జగదీష్కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్బంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి తాను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.జేసీ ప్రభాకర్రెడ్డి ఓవరాక్షన్.. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు’ అని జేసీ రెచ్చిపోయారు. -
దళితులంటే అంత చులకనా?
అనంతపురం: దళితులంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చులకన భావం ఎందుకని వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందితే ‘కుక్కపిల్లను పడేసినట్లు పడేశారం’టూ సీఎం చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ‘దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అని హేళనగా మాట్లాడారని, తరచూ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుతో పాటు పత్రికలో ప్రచురించిన ‘ఈనాడు’ యాజమాన్యంపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సీఐ, ఎస్ఐ లేరు. మూడు గంటలపాటు ఫిర్యాదు తీసుకోకుండా అవమానానికి గురి చేశారంటూ ఆందోళనకారులు ఆవేదన చెందారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా.. లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా అని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. సాకే చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ సింగయ్య భార్య మేరీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చి ఆ రోజు జరిగిన ఘటనపై స్పష్టత ఇచ్చారన్నారు. సింగయ్య ప్రమాదానికి గురైన వెంటనే వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు అడ్డుజెప్పారన్నారు. అంబులెన్స్ వచ్చేంతవరకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసులపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. సింగయ్యతో కలిసి అంబులెన్స్లో ప్రయాణించిన వారిని సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. సీఎం బాటలోనే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్, తదితరులు దళితులు శుభ్రంగా ఉండరని, వారికి పదవులు అక్కర్లేదని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు ఇస్తే అందుకు సంబంధించి రశీదు కూడా ఇవ్వడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మిద్దె నగేష్, కుళ్లాయిస్వామి, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, సర్పంచులు సాకే రామాంజినేయులు, ఓబులేసు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జెడ్పీటీసీ భాస్కర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి సాకే ఆనంద్, ఎస్సీ సెల్ నాయకులు వడియం పేట అంజి, వెంకటేశ్, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సింగయ్యను కుక్కపిల్లతో చంద్రబాబు పోల్చడంపై ఆగ్రహం వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ ఫిర్యాదు స్వీకరణకు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన -
‘అల్లూరి’.. ఒక సమూహ శక్తి
అనంతపురం అర్బన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక వక్తి కాదని, ఆయన ఒక సమూహ శక్తి అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో అల్లూరి సీతారామారాజు 128వ జయంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వెంకటశివుడు యాదవ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. అల్లూరి దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఫైళ్లు పక్కాగా ఉండాలిచుక్కుల భూములు, 22ఏ జాబితాకు సంబంధించి ఫైళ్లు సమగ్ర వివరాలతో పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చుక్కల భూముల క్లెయిమ్ల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
రగులుతున్న కుంపట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య కలహాల కుంపట్లు రాజుకున్నాయి. ఓవైపు హామీలు అమలు చేయలేదని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలపై సొంతపార్టీలోనే అసమ్మతుల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్యులకు హామీలు అమలు చేయాల్సిన ఎమ్మెల్యేలు నిత్యం రాజకీయ గొడవలతో ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడంలోనే సమయం సరిపోతోంది. సొంత పార్టీలోనే కార్యకర్తలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. స్వయానా ఎమ్మెల్యేలే ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో తమ ఊరికి వచ్చినా కార్యకర్తలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుపాటికి ఆది నుంచీ అసమ్మతి పోరు.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజునుంచీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దగ్గుపాటి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభాకర్పై కూడా దగ్గుపాటి ఫిర్యాదులు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దగ్గుపాటిపై ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజే పాతూరులో ప్రభాకర్చౌదరి అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గీయులు వీడియోలను వైరల్ చేశారు. తాజాగా దగ్గుపాటికి సుధాకర్నాయుడు లాంటి నేతలు కూడా సొంత పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర వేసుకున్నారు. శ్రావణిశ్రీపై ఫిర్యాదుల వెల్లువ.. శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీపై రోజురోజుకూ అసమ్మతి వెల్లువెత్తుతోంది. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ విచ్చలవిడి అయ్యింది. ఎమ్మెల్యే తల్లి వసూళ్లకు పాల్పడుతోందంటూ ఏకంగా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఇక్కడ కేశవరెడ్డి, నరసా నాయుడుతో కూడిన టీడీపీ ద్విసభ్య కమిటీ ఉంది. ఈ కమిటీ సభ్యుల అనుచరులకు కనీస విలువ ఇవ్వడం లేదని శ్రావణిశ్రీపై ఫిర్యాదు చేస్తున్నారు. నియోజకవర్గంలో వసూళ్లు తప్ప సొంత పార్టీ కార్యకర్తలకు ఏమాత్రమూ విలువ ఇవ్వడం లేదంటూ పలువురు కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అమిలినేనికి ఈ–స్టాంప్ బ్రేకులు.. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు ఇటీవల ఈ–స్టాంప్ల కుంభకోణం మకిలి అంటుకుంది. ఇందులో తన ప్రమేయం లేదంటూ టీడీపీలోనే తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు ఉన్నం మారుతీ చౌదరి పేరును తెరమీదకు తెచ్చారు. తనకంటూ సొంత పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈయన పేరు బయటకు తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నం వర్గీయులకు సంబంధించి ఏ ఒక్కపనికీ ఎమ్మెల్యే సహకరించడం లేదని ఉన్నం ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి పనిచేసిన వారికి సొంతపార్టీ నాయకులే విలువనివ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏడాది పాలన సందర్భంగా ఇంటింటికీ వెళుతున్న సమయంలోనూ ఎమ్మెల్యేలకు సొంతపార్టీ కార్యకర్తలు సహకరించడం లేదు. అంతర్గత విభేదాలతో నలిగిపోతున్న టీడీపీ కార్యకర్తలు మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ బండారు శ్రావణిశ్రీపై ఫిర్యాదుల పర్వం తొలి నుంచీ అనంతపురం అర్బన్లో దగ్గుపాటి, వైకుంఠం మధ్య ఆగని పోరు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపులో నువ్వంటే నువ్వేనని రచ్చకెక్కిన పరిస్థితి కళ్యాణదుర్గంలో అమిలినేని.. ఉన్నం మారుతీ చౌదరి మధ్య తారస్థాయికి వర్గపోరు నాయకుల మధ్య వైరంతో కార్యకర్తల్లో రోజురోజుకూ పెరుగుతున్న అసహనం -
గూగూడుకు పోటెత్తిన భక్తులు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున చిన్నసరిగెత్తు సందర్భంగా అర్చకులు హుసేనప్ప కుళ్లాయిస్వామి పీరును ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసేపు తొక్కిసలాట జరిగింది. చిన్న సరిగెత్తులో భాగంగా స్వామి వారి భక్తులు ఫకీర్లుగా మారి జలధి పోయే వరకు నియమనిష్టగా ఉంటారు. – నార్పల/ సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వజ్రకరూరు సర్పంచ్కు జాతీయ స్థాయి అవార్డు
వజ్రకరూరు: ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో డాన్బాస్క్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన షీరెప్రెజెంట్స్–2025 శిక్షణా తరగతులకు హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసాకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. మొత్తం 45 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఈ శిక్షణా తరగతులకు హాజరు కాగా, జూన్ 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ అవగాహన కల్పించారు. ప్రధానంగా పాలన, కమ్యూనికేషన్, ప్రజా నైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు–వాటి పరిష్కారాలు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, మహిళా సంఘాల బలోపేతం అంశాలపై మోనాలిసా మాట్లాడారు. దీంతో ఆమెను అవార్డుకు నిర్వాహకులు ఎంపిక చేసి, బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డును అందజేశారు. -
● భిక్షమెత్తితేనే భుక్తి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఇలాకాలోని ఓ దివ్యాంగుడు పింఛన్ అందక భిక్షమెత్తుకుని పొట్ట పోసుకుంటున్నాడు. హిందూపురానికి చెందిన రేణుక రాజు దివ్యాంగుడు. గత ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. కొత్త ప్రభుత్వంలో పింఛన్ మరింత పెరుగుతుందనుకున్నాడు. అయితే ఇందుకు విరుద్ధంగా పింఛన్ జాబితా నుంచి ఆయన పేరు కనుమరుగైంది. అధికారులను బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ భిక్షమెత్తుకుంటున్నాడు. శుక్రవారం గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాల్లో ఈ దృశ్యం చూపరులను కలిచివేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
ఏమైందిరా నాన్నా..
ఈ సృష్టిలో ఏ జీవికై నా తల్లిప్రేమ ఒక్కటే. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. ఓ వానరం కూడా తన బిడ్డను పొత్తిళ్లలో జాగ్రత్తగా ఎత్తుకుని పరిసరాలంతా తిరిగింది. ఆహారం కోసం అన్వేషించింది. తినడానికి ఏదో దొరికిన తర్వాత బిడ్డను కిందకు దించింది. కానీ నిర్జీవంగా కన్పించిన బిడ్డ వైపు తదేకంగా చూస్తూ విషాదంలో మునిగిపోయింది.ఈ దృశ్యం శుక్రవారం అనంతపురం నగర శివారులోని వడియంపేట వద్ద– సాక్షిఫొటోగ్రాఫర్, అనంతపురం -
18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం పరికరాలు
● డీసీఓల సమావేశంలో పీడీ రఘునాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది 18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను రైతులకు సకాలంలో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. అయితే పరికరాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో కంపెనీ డీసీఓలు, మైక్రో ఇంజనీర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. గతేడాదిలో ఏవైనా పెండింగ్లో ఉంటే వారం రోజుల్లో పూర్తి చేసి పంపాలన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే 1,359 హెక్టార్లకు కేటాయించిన యూనిట్లను సరఫరా చేసి సంబంధిత పొలాల్లో బిగించే (ఇన్స్టాలేషన్) పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏపీడీ ధనుంజయ, ఏడీహెచ్లు దేవానంద్, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీ ప్యాట్లో ఓటీపీఆర్ఐ విద్యార్థుల సత్తా అనంతపురం: జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో జేఎన్టీయూ(ఏ) ఓటీపీఆర్ఐ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో గణనీయమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు డి.హేమంత్కుమార్ (204 ర్యాంకు ), కె.గురుచరణ్ (2,484), జి.దేవీప్రియ (3,828), ఎస్.కుష్వంత్ (4,058)ను ఓటీపీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ చక్కా గోపీనాథ్ అభినందించారు. -
ఫీజు బకాయిలు చెల్లించండి
రాయదుర్గం టౌన్: వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, కోశాధికారి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సుపరిపాలన సంబరాలు చేసుకోవడం కాదు.. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో వందలాది మంది విద్యార్థులతో కలిసి శుక్రవారం రాయదుర్గంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.6,400 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. బకాయిలు విడుదలకాకపోవడంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు శశి, ఉపాధ్యక్షుడు తరుణ్, మున్నా, నవీన్, సచిన్, నాగరాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా -
కేవీకేలో సర్టిఫైడ్ విత్తనాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సర్టిఫైడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. కందులు (పీఆర్జీ–176, ఉజ్వల), (ఎల్ఆర్జీ–52 అమరావతి) కిలో రూ.150, 4 కిలోల బ్యాగ్ రూ.600, పెసర (ఎల్జీజీ–607, ఎల్జీజీ 574), మినుములు (ఎల్బీజీ 884) కిలో రూ.150తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97046 66923, 70135 71755లో సంప్రదించాలని కోరారు. ఆయుర్వేద ఉత్పత్తుల సేవా కేంద్రంలో విజిలెన్స్ తనిఖీలు అనంతపురం: స్థానిక ఎ.నారాయణపురం పంచాయతీ రాఘవేంద్ర కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న ప్రజలను తప్పుదోవ పట్టించే ఆయుర్వేద ఉత్పత్తుల సేవా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కస్టమర్ల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ కనిపించారు. కొనుగోలుదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, సేకరించిన మొత్తం ఇతర వివరాలు, వాట్సాప్ చాటింగ్లను స్వాధీనం చేసుకున్నారు. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ఎస్–3 గ్రూప్స్ పవర్ సిరప్, సీహెచ్ఆర్ డీఐఏ కంట్రోల్ సిరప్, ఎస్3 గ్రూప్స్ ఆయుర్వేద ఉత్పత్తులపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా విరివిగా ప్రచారం చేస్తున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రిస్తామని, ప్రజల్లో లైంగిక శక్తిని పెంచుతామని నమ్మబలికి కాల్ చేసే వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఈ వివరాలను నెల్లూరుకు చెందిన భరత్ అలియాస్ ఆలకుంట భరత్ కుమార్కు పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఆయుర్వేద డాక్టర్లు డాక్టర్ కె.మాధవి, డాక్టర్ కేఎస్ రాంకుమార్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని వదలి వెళ్లకండి సార్.. కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు ఇటీవల మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు. శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. హనుమంతురాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. వారికి అనుగుణంగా బోధన చేసేవారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. పేద విద్యార్థులకు గురుకులం, ఏపీఆర్ఎస్ వంటి వాటికి శిక్షణ ఇచ్చి.. ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. -
ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చు టోిపీ
తాడిపత్రి టౌన్: నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఫైనాన్స్ కంపెనీల్లో దాఖలు చేసి కొనుగోలు చేసిన వాహనాలను సగం ధరకే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏఎస్పీ రోహిత్కుమార్ వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన కొందరు ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాడిపత్రి ప్రాంతంలోనే వందల సంఖ్యలో వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో తాడిపత్రికి చెందిన గయాజుద్దీన్, కలీముల్లా, ఇంతియాజ్, రోషన్, ముస్తాఫా ఖాధ్రీ, అనంతపురానికి చెందిన నూర్మహమ్మద్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు బహిర్గమతయ్యాయి. ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, ట్రాక్టర్లు, లారీలను సైతం వీరు సగం ధరకే విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ 92 ద్విచక్ర వాహనాలు, ఓ ఫోర్వీలర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, ఈ ముఠాలోని మరికొందరు సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి రెండు రోజులకు ఒకసారి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎవరైనా సగం ధరకే వాహనాలు కొనుగోలు చేసి ఉంటే స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగిస్తే వారిని బాధితులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే వారిని కూడా బాధ్యులుగా గుర్తిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ గౌస్ పాల్గొన్నారు. ఆరుగురు కేటుగాళ్ల అరెస్ట్ 92 ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం -
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపుల విషయంలో వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము పాల్గొన్నారు. -
పన్ను ఎగవేతను కట్టడి చేయాలి
అనంతపురం అర్బన్: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మంత్రుల కమిటీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్నుల వసూళ్ల సరళిని పరిశీలించేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కమిటీ కన్వీనర్, గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ పి.సావంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యునిగా ఉన్న మంత్రి కేశవ్ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ డేటా యాక్సెస్ అన్ని రాష్ట్రాల ఇంట్రాస్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ స్థాయిలో సమాచారం లైవ్ను అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలువుతుందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ -
మెరుగైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ పనితీరుపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు అనువుగా సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆరోగ్య శాఖ ద్వారా చేపట్టిన పనులు గడువులోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీసీహెచ్ఎస్ డేవిడ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ షారోన్సోనియా తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో సంతృప్తస్థాయి పెంచాలి ప్రజల్లో సంతృప్తస్థాయి పెరిగేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు.డీఆర్డీఏ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, మునిసిపల్, రీ–సర్వే, తదితర అంశాలకు సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వేపై కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాస్పందన సమీక్ష ఉన్నతస్థాయిలో జరుగుతోందన్నారు. ఈ అంశానికి సంబంధించి అన్ని శాఖలు పవర్పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పారు. పొద్దున్నే పెన్షన్ ఇవ్వలేదని.. సచివాలయ సిబ్బందికి షోకాజ్ శింగనమల: మండలంలో 27 మంది సచివాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 1న ఉదయం 7.40 గంటలైనా పింఛన్ పంపిణీ ప్రారంభించకపోవడంపై ‘షోకాజ్’ ఇచ్చినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు ఇన్చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు. రేపు బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్ అనంతపురం సిటీ: బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉమ్మడి జిల్లా జనరల్ మేనేజర్ షేక్ ముజీబ్ పాషా తెలిపారు. బకాయి పడిన మొబైల్ వినియోగదారులకు ఇప్పటికే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నోటీసులు జారీ చేశామని, అటువంటి వారు కోర్టుకు హాజరు కాకుండానే జాతీయ లోక్ అదాలత్కు హాజరై బకాయిలను రాయితీతో చెల్లించవచ్చని సూచించారు. ఆ టీచర్లను రిలీవ్ చేయండి అనంతపురం ఎడ్యుకేషన్: రెగ్యులర్ టీచర్లను రిలీవ్ చేయాలని డీఈఓ ప్రసాద్ ఎం. బాబు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరని రిలీవర్ లేని కారణంగా రిలీవ్ చేయలేదని, దీంతో వారి పాఠశాలల్లో ఎంటీఎస్ టీచర్లు జాయిన్ అయ్యారని డీఈఓ పేర్కొన్నారు. బదిలీ అయిన రెగ్యులర్ ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. ఏదైనా పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులో 50 శాతం కంటే తక్కువగా ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ఆ సబ్జెక్టు టీచర్ బదిలీ అయినప్పటికీ వారు గతంలో పనిచేసిన పాఠశాలలోనే పని చేయాలన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. -
ఓఎంసీలో చోరీలపై వీడిన మిస్టరీ
రాయదుర్గం టౌన్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)లో సీబీఐ అధికారులు సీజ్ చేసిన భారీ వాహనాల చోరీ కేసులో మిస్టరీ వీడింది. వాహనాలను ముక్కలుగా చేసి తరలిస్తున్న ముఠా సభ్యులను గురువారం డి.హీరేహాళ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ వెల్లడించారు. ఓఎంసీలో గురువారం ఉదయం అపరిచిత యువకుల సంచారాన్ని పసిగట్టిన స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి.. సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. ఐరన్ ఓర్ను వెలికి తీసేందుకు ఉపయోగించే భారీ యంత్రాలను ముక్కలుగా చేస్తున్న ఏడుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎల్పీజీ సిలిండర్, 2 ఆక్సిజన్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, లగేజీ ఆటోను స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. విచారణ అనంతరం పట్టుబడిన వారిలో బళ్లారి జిల్లా సండూరు తాలూకా కురేకుప్ప గ్రామానికి చెందిన వీరిలో మారుతి, వీరేష్, గాదె లింగప్ప, గణేష్ , హరిజన బసవరాజు, ఉమాపతి, దొడ్డబసప్ప ఉన్నారు. కాగా, వాహనాల విడి భాగాలను, తుక్కు కింద మార్చిన ఇనుమును కొనుగోలు చేసిన ఉచ్చప్ప, వీరేష్, ప్రకాష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే మూడు వాహనాలు తుక్కుకు విక్రయం కురేకుప్పకు చెందిన మారుతి ఓఎంసీలో సీబీఐ అధికారులు సీజ్ వాహనాలను తుక్కు కింద విక్రయించే పథకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 27, 29 తేదీల్లో ఓఎంసీ గనుల్లో దూరి అక్కడ ఉన్న జేసీబీ, హిటాచీ, మొబైల్ క్రషర్లను గ్యాస్ కట్టర్లతో కోసి, లగేజీ ఆటోలలో తరలించి కర్ణాటకలోని ధర్మసాగరానికి చెందిన వీరేష్, ఉచ్చప్ప, ప్రకాష్కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. తొలిసారి ఎవరూ గుర్తించక పోవడంతో మరోసారి ఓఎంసీలో వాహనాలను తుక్కుగా మార్చి సొమ్ము చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఓఎంసీ మైనింగ్లోకి అక్రమంగా ప్రవేశించి మొబైల్ క్రషర్ను కట్ చేసి గురువారం టాటా లగేజీ ఆటోలో తరలించడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు సిబ్బంది రామాంజనేయులు, మల్లికార్జున, కృష్ణారెడ్డి, రంగారెడ్డి, నాగరాజు అక్కడు చేరుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. సీజ్ చేసిన మైనింగ్ వాహనాలను కట్ చేసి తరలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్ -
బదిలీలు ముగిసినా.. రాయ‘బేరాలు’!
అనంతపురం సిటీ: పీఆర్లో బదిలీలు ముగిసినా రాయబేరాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అనంతపురంలోని పంచాయతీరాజ్ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల 29న కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, బదిలీల గడువు ముగిసినా ఆ శాఖలోని ఇద్దరు డీఈలు రాయ‘బేరాలు’ చేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు అనుమానిస్తున్నారు. కోరుకున్న స్థానాలకు పోస్టింగ్ సర్దుతామంటూ పలువురికి హామీ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. కొందరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు రేయింబవళ్లూ పీఆర్ సర్కిల్ కార్యాలయం వద్దే పడిగాపులు కాస్తున్నారు.వారితో ‘సాక్షి’ మాట్లాడగా.. కౌన్సెలింగ్లో తాము కోరుకున్న చోటు వచ్చినా, రాజకీయ సిఫారసుతో తమకు తెలియకుండానే ఆ స్థానాలు మారిపోతున్నాయని ఆరోపించారు. జెడ్పీ క్యాంపస్ లోని ఈఈ కార్యాలయంలో పని చేసే ఓ డీఈఈతో పాటు మరో డీఈఈ బదిలీల్లో అన్నీ తామై వ్యవహరించారు. అందుకు తగ్గట్టు బాగానే వెనకేసుకున్నట్లు చర్చ సాగుతోంది. అయితే, ప్రక్రియ ముగి సినా పేర్లు తారుమారు చేయిస్తూ.. అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు వసూలు చేస్తే చర్యలు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ నాలుగు రోజుల క్రితమే ముగిసింది. ఎస్ఈగా పని చేసిన మహమ్మద్ జహీర్ అస్లాం ఉద్యోగ విరమణ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే కొనసాగింది. జాబితా కూడా ఇప్పటికే కలెక్టర్కు సమర్పించాం. ఆరోపణల గురించి నాకు తెలియదు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవు. – ప్రభాకర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ -
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ముగ్గురు సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా డాక్టర్ రామ్కుమార్ కాకాని (డైరెక్టర్, ఐఐఎం రాయ్పూర్), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ (వీసీ, గీతం వర్సిటీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అలోక్కుమార్ రాయ్ (వీసీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో బాబుగంజ్, లక్నో) వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోని సభ్యులు సమావేశమై ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ తుది నియామకం చేయనున్నారు. కాగా, ఎస్కేయూ ఇన్చార్జి వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ప్రస్తుతం ఉన్నారు. ఇన్చార్జి పాలనలోనే ఏడాది పూర్తయింది. సాధారణ ఉద్యోగిని రిజిస్ట్రార్గా నియామకం చేశారు. కనీసం డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియామకం చేయాల్సి ఉండగా, నిబంధనలు బేఖాతరు చేస్తూ రీసెర్చ్కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ను రిజిస్ట్రార్గా నియామకం చేశారు. ఏడాది కాలంలో వర్సిటీకి ఒక్క యూజీసీ ప్రాజెక్ట్ రాలేదు. కీలక నిర్ణయాలు అన్నీ జాప్యం కావడంతో వర్సిటీ పురోగతి మందగించింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి వీసీ వస్తే వర్సిటీ పురోగతి గాడిన పడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు భావిస్తున్నారు. -
దళితులకు అండగా ఉందాం
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దళిత సామాజిక వర్గంపై దాడులు పెరిగి పోయాయి. వైఎస్సార్ సీపీ దళితుల పక్షాన నిలబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. జిల్లాలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ సెల్ ముందుండాలి. ప్రభుత్వంపై సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలి’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఆ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూ ఆయా వర్గాలను అక్కున చేర్చుకున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకున్నారన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవితే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో 205 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. భయపెట్టేందుకు అక్రమ కేసులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఎస్సీ సెల్ కృషి చేయాలని ‘అనంత’ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని, అందులో వైఎస్సార్ సీపీ సత్తా చాటాలన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. దళితుల్లో నాయకత్వం లేకుండా చేయాలన్న కుట్రతో మాజీ ఎంపీ నందిగం సురేష్పై కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు మోసాలను తెలియజేద్దాం.. వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ నెల 15 నుంచి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరిద్దామని ‘అనంత’ పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అనంతరం ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో దళిత వర్గాలపై దాడులు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్నారు. మృగాళ్లతో ఇబ్బంది పడ్డ వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దారుణమన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ దళితులకు అన్యాయం జరుగుతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం ఆమె పదవికి రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంఎస్ రాజు, బండారు శ్రావణి దళితులకు జరిగిన అన్యాయంపై కనీసం మాట మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూటమి ప్రభుత్వ పెద్దల మోచేతి నీళ్లు తాగుతున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎర్రిస్వామి, బీటీపీ గోవిందు, పసులూరు ఓబులేసు, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ సెల్ ముందుండాలి ఈ నెల 15 నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి బాబు మోసాలను వివరించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
తుంగభద్ర తుళ్లింత
బొమ్మనహాళ్: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు. రెండున్నర అడుగుల మేర ఎత్తి నదికి 58,260 క్యూసెక్కులు, వివిధ కాలువలకు 4,506 క్యూసెక్కులు కలిపి మొత్తం 62,766 క్యూసెక్కులను బయటికి పంపుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోపే ఆమేరకు నీరు చేరడం గమనార్హం. దీంతో డ్యాంలో 78.100 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. గత ఏడాది డ్యాం 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా స్టాప్లాక్ గేటు అమర్చారు. అయితే, జలాశయం 33 క్రస్ట్ గేట్లకూ మరమ్మతులు చేయాలని అప్పట్లోనే నిపుణుల కమిటీ సూచించింది. అయినా పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. గత రబీలో కాలువలకు నీటి విడుదలను ఆపేసిన తర్వాత గేట్ల మరమ్మతు విషయంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించాయి. దీంతోనే ఈ ఏడాది డ్యాంలో 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించే దుస్థితి ఏర్పడింది. వరినార్లలో బిజీబిజీ ప్రస్తుతం టీబీ డ్యాంకు ఇన్ఫ్లో 28,932 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గురువారం ఉదయం 12 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో పెరగడంతో సాయంత్రానికి మరో 8 గేట్లు మొత్తంగా 20 గేట్లు ఎత్తి నదికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు వరి నార్లు వేసుకుంటున్నారు. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.34 అడుగులకు నీరు చేరుకుంది. అవుట్ఫ్లో 62,268 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 78.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,587.11 అడుగుల వద్ద 8.78 టీఎంసీల నీటి నిల్వతో, 10,503 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 296 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండిందని బోర్డు అధికారులు తెలిపారు. 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేత 58,260 క్యూసెక్కుల నీరు నదికి -
డీఎల్ లేని ఉద్యోగుల జీతాలు నిలిపి వేయండి
తాడిపత్రి రూరల్: డ్రైవింగ్ లైసెన్స్లేని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తక్షణమే నిలిపి వేయాలని మున్సిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రి కేంద్రంగా పనిచేస్తున్న పోలీసులకే డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలకు ఇన్సూరెన్స్ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటీవల స్కూటీ నడుపుతున్న మహిళా కానిస్టేబుల్ను ఆపి లైసెన్స్ గురించి అడిగితే.... లేదని సమాధానమిచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి వారు ముందుగా డీఎల్ తీసుకోవాలని సూచించారు. తాడిపత్రిలోని వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో 70 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఇలాంటి వారిని గుర్తించి వారి జీతాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. ఆర్టీఏ, పోలీసు శాఖ సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఉచితంగానో లేదా నామమాత్రపు రుసుంతోనో ఎల్ఎల్ఆర్లు, డీఎల్లు జారీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంగా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని సచివాలయాల ద్వారా వాహనదారులకు ఎల్ఎల్ఆర్లు మంజూరు చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలా? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ -
ఇరువర్గాల ఘర్షణ.. ఒకరు మృతి
శింగనమల: ఇంటి రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా... ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం శింగనమల మండల పరిధిలోని ఇరువెందల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... ఇరువెందల గ్రామంలో ఇంటి రస్తా విషయంలో ప్రభాకర్, మల్లికార్జున ఘర్షణ పడ్డారు. ఇరువురి బంధువులూ కలగజేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రతరం కాగా ఇరువర్గాలు కట్టెలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు గాయపడగా... 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సగం ధరకే వాహనమంటూ కుచ్చుటోపీ ● తాడిపత్రి పోలీసుల అదుపులో మోసగాళ్లు? ● ఇప్పటి వరకూ 53 బైక్ల స్వాధీనం తాడిపత్రి టౌన్: సగం ధరకే అంటూ ప్రజలను మోసం చేసి ద్విచక్ర వాహనాలను అంటగడుతున్న తాడిపత్రికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో తాడిపత్రిలోనే వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు విక్రయించినట్లు గుర్తించి, ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాల కోసం పోలీసులు వల పన్నారు. కాగా, తాడిపత్రి పట్టణంలోని పెద్దబజార్కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని దుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పూర్తిగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునేంత వరకూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా పోలీస్స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలు ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసుల అవాక్కయ్యారు. కాగా, సగం ధరకే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్స్టేషన్ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు, పోలీసులూ ఉన్నట్లు సమాచారం. తాడిపత్రికి చెందిన కొందరు ధనవంతులు సైతం కార్లు, లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
ఇచ్చిన హామీలే నీటిమూటలనుకుంటే ఇంటింటికీ సుపరిపాలన అంటూ ముద్రించిన కరపత్రాలు మరీ ఘోరంగా ఉన్నాయంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల్లో చర్చ జరుగుతోంది. హామీలు నెరవేర్చామా లేదా అన్నది చెప్పకుండా చేయని పనులపై అబద్ధాలు అచ్చువేసి కరపత్రాలు పంచుతున్నారు. వీటిని చదువ
మాకు అన్నీ తెలుసులెండి సారూ..ఆకస్మికంగా గ్రామాల పర్యటన చేసే పరిస్థితి కూటమి నేతలకు లేదు. ఎక్కడ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతానికి ముందురోజే అనుచరులను పంపించి అక్కడ వ్యతిరేకులెవరైనా ఉంటే బుజ్జగిస్తున్నట్టు తెలిసింది. ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉంటే వారికి ముందే నచ్చజెప్పి వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇంటింటికీ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న సామాన్యులు వాట్సాప్ గ్రూపుల్లో సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. డ్రైనేజీ, రోడ్లు, కరెంటు స్తంభాలు, డీపీలు, ఆస్పత్రుల్లో వసతులు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో వాట్సాప్ గ్రూపులు మోత మోగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వ ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న కూటమి ఎమ్మెల్యేలు పంచుతున్న కరపత్రాల్లో ఎస్సీ ఎస్టీ, మైనార్టీ మహిళలపై దాడులు గణనీయంగా తగ్గాయని ముద్రించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన జరిగింది. అనంతపురంలో ఇంటర్ చదివే గిరిజన బాలిక తన్మయి దారుణ హత్యకు గురైంది. ఈ రెండు ఘటనలు జిల్లాలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక.. కూటమి ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీపీపై దారుణంగా దాడి చేశారు. రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఎస్సీ,ఎస్టీలపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. కానీ, వాటన్నింటినీ దాచి దాడులు తగ్గినట్టు చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. గంజాయి, డ్రగ్స్ ముఠా పేట్రేగి పోతున్నా కూటమి ప్రభుత్వం వచ్చాక రాయదుర్గం ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా గంజాయి సాగు చేస్తూ దొరికిపోయాడు. తాడిపత్రిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తూ పోలీసులకు సవాలుగా మారింది. అనంతపురంలో ఇటీవలే గంజాయి బ్యాచ్ పోలీసులకు పట్టుబడింది. హిందూపురంలో విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతోంది. ఇంత దారుణంగా రెండు జిల్లాలో గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదవుతుంటే.. సురక్షిత ఆంధ్రప్రదేశ్ అని, రౌడీషీటర్లు, స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఏడాది పాలన కరపత్రాల్లో భజన చేశారు. గుంతలు లేని రోడ్లకు గంతలు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతలు లేని రోడ్లకు కూటమి సర్కారు గంతలు కట్టింది. ఎక్కడ చూసినా రోడ్లు ఛిద్రమై వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేని రోడ్లకు రూ.866 కోట్లు విడుదల చేశామని కరపత్రాల్లో పొగుడుకున్నారు. కానీ రోడ్లు బాగుపడకపోగా బిల్లులు మాత్రం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. మరోవైపు 9 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చామని చెబుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో కరెంటు కోతలు ఏ జిల్లాలో లేనట్టుగా ఉమ్మడి ‘అనంత’లో చోటు చేసుకుంటున్నాయి. ముందే రెక్కీ.. ‘సుపరిపాలన’ కరపత్రాల్లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గాయని ముద్రణ క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితి ‘ఉమ్మడి అనంత’లో పెరిగిన అత్యాచారాలు, హత్య ఘటనలు రైతులకు ఉచిత విద్యుత్ అంటూనే.. విపరీతంగా కోతలు గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం అంటూ పత్రాల్లో భజన ‘సూపర్సిక్స్’ ఊసే ఎత్తని వైనం -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించండి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ అనంతపురం అర్బన్: స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని జిల్లా ప్రజలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ ప్రక్రియను సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని శ్రీశ్రీనగర్లో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఫిర్యాదు నేరుగా ముఖ్యమంత్రికి చేరుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ భారం మరింత పెరుగుతుందన్నారు. ఇప్పటికే భారంగా మారిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలన్నారు. విద్యుత్ భారాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, నాయకులు వలి, ప్రకాష్, జీవ, కుమార్, రాఘవ, హరికృష్ణ, పాల్, మాబు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు రెట్టింపు సంక్షేమం ● ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా...ప్రజలకు రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఛిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టి రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశాంతత, అభివృద్ధి కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చామన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. కలుషిత నీరు తాగి 16 జీవాల మృతి బెళుగుప్ప: కలుషిత నీరు తాగి 16 జీవాలు మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గురువారం ఉదయం తన మొక్కజొన్న పంటకు యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో గొర్రెల మంద అక్కడకు చేరుకుంది. దాహంతో ఉన్న గొర్రెలు, మేకలు అప్పటికే తొట్టెలో ఉన్న యూరియా కలిపిన నీటిని తాగాయి. కాసేపటి తర్వాత ఒకదాని వెనుక మరొకటి చొప్పున 10 గొర్రెలు, 5 మేకలు, ఓ పొట్టేలు మృత్యువాత పడ్డాయి. కాపరులు తిప్పయ్య, మహేష్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, అంజనప్ప, లింగన్న నుంచి సమాచారం అందుకున్న పశువైద్య సహాయకుడు ఎర్రిస్వామి అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషమ పరిస్థితిలో ఉన్న జీవాలకు సత్వర చికిత్స అందించారు. గొర్రెల పోషణపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కాపరులు కోరారు. డీఎస్పీ పదోన్నతుల సీనియార్టీ జాబితా విడుదల అనంతపురం: డీఎస్పీ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక (అడహాక్ ) సీనియార్టీ జాబితాను అధికారులు విడుదల చేశారు. 2024–25 ప్యానల్లో సీనియార్టీ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఉన్నారు. వీరిలో కె.దేవానంద్ (అనంతపురం), ఎం.ఆదినారాయణ (పీటీసీ అనంతపురం), కె.సాయినాథ్ (అనంతపురం), ఎస్వీ భాస్కర్గౌడ్ (అనంతపురం), పి.సత్యబాబు (అనంతపురం), శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని బి.మోహన్, కె.రాఘవన్, జి.బాలసుబ్రహ్మణ్యం రెడి ఉన్నారు. -
వక్ఫ్ నూతన చట్టం రాజ్యాంగ విరుద్ధం
అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యులు గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ జాఫర్, సభ్యులు మేయర్ వసీం, నదీమ్ అహమ్మద్, తదితరులు మాట్లాడారు. ఇటీవల ఆమోదించన వక్ఫ్ చట్టం.. 1995లోని సంకేతాలు, వివక్షతో కూడినవిగా ఉన్నాయని, ఇవి భారత రాజ్యాంగంలో పొందు పరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ముస్లిం మైనారిటీల అణచివేతనే లక్ష్యంగా చేసుకుని వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనలో ముస్లిమేతరులపై వివక్ష చూపడం ద్వారా ఆర్టికల్15 (వివక్ష నిషేధం)ను ఉల్లంఘించారన్నారు. భూ యజమానుల అనుమతి లేకుండా వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమించుకునేందుకు అనుమతించడం ద్వారా ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వేచ్ఛ)కు విరుద్ధంగా ఉందన్నారు. గతంలో బీజేపీ మద్ధతు ఇచ్చిన వక్ఫ్ చట్టం 1995, వక్ఫ్ సవరణ చట్టం 2013ల ప్రకారం వక్ఫ్ బోర్డు విధివిధానాలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. అయితే ప్రస్తుత సవరణ బిల్లు రాష్ట్రాల అఽధికారాలను తుంగలో తొక్కుతూ అన్ని అధికారాలను కేంద్రమే సొంతం చేసుకుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో జేఏసీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు కాగజ్ఘర్ రిజ్వాన్, సైఫుల్లాబేగ్, షంషుద్ధీన్, అల్లీపీరా, కొర్రపాడు హుసేన్పీరా, షేక్ జావీద్, బంగారు బాషా, ఆవాజ్ వలి, యాసిర్ అహమ్మద్, హాజీపీరా, ముఫ్టి మహబూబ్రజా పాల్గొన్నారు. సవరణ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి యునైటెడ్ జేఏసీ నాయకుల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట నిరసన -
కదిలిన జగన్నాథ రథ చక్రాలు
అనంతపురం కల్చరల్: అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) ఆధ్వర్యంలో అనంత వేదికగా మరోసారి పూరీ జగన్నాథ రథయాత్ర వేడుకగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కళాకారులు, ఇస్కాన్ మందిరాల ప్రతినిధులు అనంతకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన పూరీ రథయాత్రను 2015లో ఇస్కాన్ మందిరం అనంతలో ఘనంగా నిర్వహించింది. దేశంలోనే అతి పెద్దదైన పూరీ జగన్నాథుడి వేడుకలను దూరాభారం వల్ల చూడలేని వారికి.. వారి ముంగిటనే రథయాత్రను చూసే భాగ్యాన్ని ఇస్కాన్ తీసుకువచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటి వరకూ ఆరు సార్లు వైభవంగా రథయాత్ర వేడుకలు జరిగాయి. ఈ నెల 5న సాగే వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. రథయాత్ర సాగుతుందిలా.. తొలుత రెండు రోజుల పాటూ రథయాత్ర ఘనంగా నిర్వహించాలని ఇస్కాన్ ప్రతినిధులు భావించారు. కానీ ఒక్కరోజు యాత్రకు కూడా జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతివ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి రథయాత్ర సజావుగా సాగేలా కృషి చేశారు. ఈ నేపథ్యంలో కళాజాత, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వేద పఠనం నడుమ జగన్నాథ రథయాత్ర శనివారం ఉదయం లలిత కళాపరిషత్తులో ప్రారంభం కానుంది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు సాగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక కేఎస్ఆర్ కాలేజ్ సమీపంలో మహా అభిషేకంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయం, సుభాష్రోడ్, టవర్క్లాక్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్రోడ్, గాంధీబజార్, పాతూరు మీదుగా బసవన్నకట్ట నుంచి మళ్లీ సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళాపరిషత్తుకు చేరుకుంటుంది. విశిష్ట అతిథిగా శ్రీమాన్ సత్యగోపీనాథ్ ప్రభు విచ్చేసి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారు. సినీనటుడు సుమన్ ఆత్మీయ అతిథిగా విచ్చేసి రథయాత్రను ప్రారంభిస్తారు. అలాగే కళాజాతను పలువురు ప్రజాప్రతినిధులు ఆరంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన కళాకారులు అనంతకు విచ్చేసి తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. నగర వీధుల్లో శోభాయమానంగా సాగే రథయాత్రలో అనంత వాసులు భాగస్వాములు కావాలని గురువారం ఇస్కాన్ మందిరంలో జరిగిన సమావేశంలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశంతో లైన్ క్లియర్ 5న అనంతలో రథయాత్ర తరలి రానున్న జాతీయ ఇస్కాన్ ప్రతినిధులు, సినీ ప్రముఖులు -
కనులపండువగా గూగూడు ఉత్సవాలు
నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి వార్షిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం 5 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలసిమెలసి కుళ్లాయిస్వామి, ఆంజనేయ స్వామి పూజల్లో పాల్గొన్నారు. స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులు హుసేనప్ప ప్రత్యేకంగా అలంక రించి చక్కెర చదివింపులు చేశారు. భక్తుల రద్దీ పెరగడంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏడవ సరిగెత్తు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. -
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం.. లేకపోతే చంపేస్తా!
అనంతపురం: పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అంటూ ఓ యువతిపై యువకుడు దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. పుట్లూరు మండలం శనగల గూడూరుకు చెందిన యువతి సాయినగర్ ఏడో క్రాస్లోని లేడీస్ హాస్టల్లో ఉంటోంది.రెండు సంవ త్సరాల క్రితం అనంతపురం నగరంలోని బస్టాండు వద్ద ఉన్న ప్రియదర్శిని హోటల్లో పార్టం ఉద్యోగం చేస్తున్న ఈమెకు.. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అగ్రహారంకు చెందిన ప్రవీణ్ కుమార్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుందాం అని చెప్పగా యువతి నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇటీవల విద్యుత్ నగర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోంలోన్ విభాగంలో సేల్స్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరింది.విషయం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు. మంగళవారం హాస్టల్ వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. బైకులో బలవంతంగా ప్రసన్నాయ పల్లి రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి దాడి చేశాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపుతా అని బెదిరించాడు. తిరిగి బైక్పై హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీనిపై తన సోదరితో కలిసి యువతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
మంత్రి కేశవ్కు సమస్యల ఏకరవు
కూడేరు: మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏకరవు పెట్టారు. కూడేరు మండలం జయపురంలో బుధవారం మంత్రి కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ ఆయనను కలిసి, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రోజూ ఉదయం 6 గంటలకే పంచాయతీల్లో ఉండాలని, చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దిన పత్రిక పట్టుకొని నోట్ కమ్ ఫొటో దిగాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీ రాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించినట్లు గుర్తు చేశారు. రోజూ ఉదయం 6 గంటలకే వెళ్లడం చాలా ఇబ్బందవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలను వేరు చేసి పంచాయతీరాజ్ పనులను మాత్రమే తమకు అప్పగించేలా చూడాలని విన్నవించారు. స్పందించిన మంత్రి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, కార్యదర్శులు రాఘవ, నాగరాజు, హరీష్, వెంకటనారాయణ,రమాదేవి, సుభాషిణి, లక్ష్మీకాంతమ్మ, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లోని గైనిక్ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో రోగికి ప్రాణం పోశారు. వివరాలు... గుత్తికి చెందిన లక్ష్మి గత నెల 23న ఆయాసం, రక్త హీనతతో బాధపడుతూ జీజీహెచ్లోని గైనిక్ ఓపీకి వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని,, పలు రకాల స్కానింగ్లు నిర్వహించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 4.3 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పాటు గర్భసంచికి రెండు వైపులా భారీ పరిమాణంలో కణితులు పెరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం దృష్టికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య తీసుకెళ్లి చర్చించారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేయలేమని హెచ్బీ 10 శాతానికి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రక్తం ఎక్కిస్తూ వచ్చారు. హిమోగ్లోబిన్ శాతం మెరుగు పడిన తర్వాత బుధవారం డాక్టర్ షంషాద్బేగం నేతృత్వంలో డాక్టర్ నిస్సార్ బేగం, డాక్టర్ సౌజన్య, పీజీలు డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ రమణి, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర, స్టాఫ్నర్సులు సుప్రియ, ఉషారాణి బృందంగా ఏర్పడి శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 6 కిలోల బరువున్న భారీ కణితులను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం లక్ష్మి ఆరోగ్యం కుదుట పడుతోందని డాక్టర్ షంషాద్ బేగం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ తరహా శస్త్రచికిత్సను సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా చేసినట్లు తెలిపారు. తొలగించిన కణితిని బయాప్సీకి పంపామని, క్యాన్సర్ నిర్ధారణ అయితే తదుపరి చికిత్సకు రెఫర్ చేస్తామని పేర్కొన్నారు. -
రాకెట్లలో దళిత యువ రైతుపై దాడి
ఉరవకొండ: మండలంలోని రాకెట్లలో దళిత యువ రైతు హనుమంతుపై అదే గ్రామానికి చెందిన చిన్న సుంకప్ప కుటుంబసభ్యులు దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... రాకెట్లలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న దళిత వెంకటేష్ కుమారులు హనుమంతు, రామాంజనేయులు కలిసి ఇటీవల నెట్టం రాధాకృష్ణ నుంచి సర్వేనంబర్ 320–బీ1లోని 74 సెంట్లలో 15 సెంట్లను కొనుగోలు చేశారు. ఈ స్థలానికి చెక్కు బందీ మేరకు దక్షిణం వైపు బండి రస్తా ఉంది. భూమి విక్రయించే ముందు రాధాకృష్ణ కుటుంబసభ్యులు చూపించిన సర్వే హద్దుల్లోనే హనుమంతు సోదరులు పంట దిగుబడిని, పశువుల మేత వామిని హనుమంతు వేశాడు. అయితే ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన చిన్న గుండ్లొల్ల చిన్న సుంకప్ప కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం దౌర్జన్యంగా ఆక్రమించి, అందులో ఎరువులను, మట్టిని వేసుకున్నారు. తమ స్థలంలోకి ఎందుకు చొరబడుతున్నారని అడిగితే.. ఇది మాదే స్థలం అంటూ ఎదురు తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో మరోమారు మరికొంత స్థలాన్ని ఆక్రమించేందుకు ముళ్లకంపలు తొలగించడంతో హనుమంతు గమనించి ప్రశ్నించాడు. అంతే చిన్న సుంకప్ప, ఆయన కుటుంబ సభ్యులు చందు, మణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాదిగ లం... కొ.. అంటూ దూషణలకు పాల్పడటమే కాకుండా కిందపడేసి చెప్పులతో కొట్టారు. కాసేపటి తర్వాత పెదనాన్న, పెద్దమ్మ వచ్చి అతడిని వారి నుంచి విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయినా శాంతించని చిన్నసుంకప్ప కుటుంబ సభ్యులు మరోమారు ఇంటిలోకి చొరబడి హనుమంతుపై చెప్పులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ రాత్రి భయంభయంగా గడిపిన బాధితుడు బుధవారం మధ్యాహ్నం ఉరవకొండ పోలీసుస్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తమ భూమిలోకి అకారణంగా ప్రవేశించి, ఆక్రమణకు పాల్పడి, ఇదేమని అడిగిన తనపై చెప్పులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని, వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
అరటి మొక్కల నరికి వేత
తాడిపత్రి టౌన్ (పెద్దవడుగూరు): పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో కౌలు రైతు విజయ్కుమార్ సాగు చేసిన తోటలోని అరటి మొక్కలను దుండగులు నరికి వేశారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తోటలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 450 మొక్కలు నరికి వేసినట్లు బాధిత కౌలు రైతు విజయ్కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ రామసుబ్బయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. బతికుండగానే చంపేశారు! కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన సరోజమ్మ బతికి ఉండగానే చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. 64 ఏళ్ల వయసున్న ఆమెకు ప్రతి నెలా వింతతు పింఛన్ అందుతోంది. ఈ నెల 1న పింఛన్ తీసుకునేందుకు వెళ్లగా... ఆమె మృతి చెందినట్లుగా రికార్డుల్లో ఉందని, పింఛన్ మొత్తాన్ని ఇవ్వడం కుదరదంటూ అధికారులు తెలపడంతో ఆమె అవాకై ్కంది. మూడేళ్ల క్రితమే తన భర్త చనిపోగా, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్ అందుతోందని, తాను చనిపోయినట్లుగా ఎవరు చెప్పారో తెలపాలని ఎంపీడీఓ లక్ష్మీశంకర్, ఇతర అధికారులను వృద్ధురాలు నిలదీసింది. దీంతో స్వీయరక్షణలో పడిన అధికారులు... ఉన్నతాధికారులతో చర్చించి వచ్చే నెల నుంచి పింఛన్ అందజేస్తామని నమ్మబలికారు. ఏఎంసీ మెస్ బిల్లు స్వాహా కేసులో ఉద్యోగి అరెస్ట్ అనంతపురం: అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ) మెస్ బిల్లులో రూ.20 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను అనంతపురం రెండో పట్టణ సీఐ శ్రీకాంత్ యాదవ్ బుధవారం వెల్లడించారు. మెడికల్ కళాశాలలో మహిళా విద్యార్థినులకు సంబంధించిన మెస్ బిల్లులను హాస్టల్ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయించాల్సి ఉంది. అయితే ఆ విభాగంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న వాణి అలియాస్ ఎస్.ఓబులేశ్వరి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తన వ్యక్తిగత ఫోన్ నంబర్కు మెస్ బిల్లుల మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. కొన్ని నెలలుగా మెస్ బిల్లుల మొత్తం హాస్టల్ బ్యాంకు ఖాతాకు జమ కాకపోవడంతో జీఎంసీ అప్పటి ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు ఆరా తీశారు. దీంతో వాస్తవాలు బయటపడడంతో ఈ అంశంపై విచారణకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని వేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అక్రమాలు బహిర్గతం కావడంతో నలుగురు డాక్టర్లతో కూడిన మరో కమిటీ ద్వారా సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా డాక్టర్ మాణిక్యరావు ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు వాణిపై కేసు నమోదు చేశారు. పక్కా ఆధారాలతో బుధవారం వాణి అలియాస్ సాకే ఓబులేశ్వరిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ
గుత్తి: ఉద్యోగాలు కల్పిస్తామని, సంక్షేమ పథకాలు వర్తింజేస్తామని ఇద్దరు యువకులపై సైబర్ నేరగాళ్లు వల విసిరి, డబ్బు దండుకున్నారు. వివరాలు.. గుత్తిలోని బీసీ కాలనీకి చెందిన రవికుమార్, కుళ్లాయప్పకు మూడు రోజుల క్రితం ఫోన్ కాల్ వచ్చింది. తాము అమరావతి నుంచి మాట్లాడుతున్నామని వెంటనే డబ్బు పంపితే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని అవతలి వ్యక్తి నమ్మ బలికాడు. ప్రస్తుతానికి తమ వద్ద డబ్బు లేదని వారు తెలపడంతో ఇప్పుడు ఎంతుంటే అంత పంపాలని, మిగిలిన డబ్బు ఆ తర్వాత ఇవ్వాలన్నారు. దీంతో రవికుమార్ రూ. 22 వేలు, కుళ్లాయప్ప రూ. 15 వేలు ఫోన్ పే చేశారు. బుధవారం రవికుమార్, కుళ్లాయప్ప ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో తాము మోసపోయామని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని తిమ్మనచెర్ల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం మూడు భాగాలైంది. సంఘటనా స్థలాన్ని గుత్తి జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు పరిశీలించి, కేసు నమోదు చేశాఉ. ‘స్మార్ట్మీటర్ల’పై క్యూఆర్ కోడ్తో పోరాటం : సీపీఎంఅనంతపురం అర్బన్: స్మార్ట్మీటర్ల ఏర్పాటుపై ప్రజా నిరసనను ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ తెలిపారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, కార్యవర్గ సభ్యులతో కలిసి స్మార్ట్మీటర్లపై వ్యతిరేకతను తెలిపేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 6న ప్రజల ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఈ విధానానికి స్వస్తి పలికేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి, చంద్రశేఖరరెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. మద్యం అక్రమ విక్రేతలపై చర్యలు అనంతపురం: ఎకై ్సజ్ శాఖ నుంచి లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం దుకాణాల నుంచి కాకుండా ఇతరులు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి. రామమోహన్రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి విక్రయాలపై 99896 28308కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
అధికారులు అన్యాయం చేశారు
అనంతపురం అర్బన్: బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు తమకు తీవ్ర అన్యాయం చేశారని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించలేదన్నారు. ర్యాంక్ (మెరిట్) ఆధారంగా బదిలీలు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా స్థానాలు కేటాయించారని మండిపడ్డారు. రాజకీయ సిఫారసు ఉన్నవారికి వారు కోరుకున్న స్థానాలు కేటాయించారని వాపోయారు. తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కలెక్టరేట్కు వచ్చిన పలువురు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా సచివాలయ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు గతనెల 28న బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. ఆరోజున కౌన్సెలింగ్కు హాజరైన తమ నుంచి ఆప్షన్ ఫారాలు తీసుకున్నారే తప్ప స్థానాలు కేటాయించలేదన్నారు. అదేమని అడిగితే మీ ఆప్షన్లలో ఏదో ఒకటి ఇస్తామని చెప్పారన్నారు. తీరా పోస్టింగ్ ఆర్డర్స్ ఒకటో తేదీన పంపారని, అందులో తామిచ్చిన ఆప్షన్లకు సంబంధం లేని మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ముందు ర్యాంకులో ఉన్న తమను కాదని తరువాత ర్యాంక్ వాళ్లకు తమ స్థానాలు ఇచ్చారని ఆరోపించారు. అంతే కాకుండా దివ్యాంగులు, మెడికల్, ఒంటరి మహిళలు, స్పౌజ్కు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇలా బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు నేత్ర, జహీర్, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల ఆవేదన రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారని మండిపాటు -
రెండంటే.. రెండే రోజులు
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాతలు ఆశలు పెట్టుకున్న ‘నైరుతి’ ముఖం చాటేసింది. ముంగారుకు ముందుగానే మురిపించిన రుతుపవనాలు తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా జిల్లాలో ఖరీఫ్ ఏరువాక నిరాశాజనకంగా ‘సాగు’తోంది. కేవలం 30 వేల ఎకరాల్లో సాగులోకి పంటలు ఈ ఖరీఫ్లో 8.48 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేయగా జూన్ నెలాఖరుకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వేరుశనగ 9 వేల ఎకరాలు, కంది 10 వేల ఎకరాల్లో రాగా పత్తి, ఆముదం, ఇతర పంటలు కొంత విస్తీర్ణంలో విత్తారు. జూన్లో సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా 23.2 శాతం తక్కువగా 47.1 మి.మీ నమోదైంది. ముందస్తుగానే ఆశల ‘నైరుతి’ గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ సారి జూన్ 2న జిల్లాలోకి ప్రవేశించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమైంది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశించారు. అనుకున్నట్లు పంటలన్నీ సాగులోకి వస్తాయని అంచనా వేశారు. కానీ... రుతుపవనాలు ప్రవేశం తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్ 8న, 11న మాత్రమే అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు పడ్డాయి. జూన్ 15 నుంచి పంటలు వేసుకునేందుకు సమయమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అలాగే ఏరువాక పౌర్ణమి కూడా వచ్చేసింది. అంతేకాక జూన్ 22న రైతులకు ఇష్టమైన ఆరుద్ర కార్తె కూడా ప్రవేశించింది. దీంతో పంటలు విత్తుకునేందుకు అన్ని శుభగడియాలు రావడంతో వర్షం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రోజూ మేఘాలు ఆవరిస్తున్నా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలుల ధాటికి చెల్లాచెదరవుతున్నాయి. అక్కడక్కడ గాలితెరలు, తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అరకొర వర్షాలకే అక్కడక్కడ పంటల సాగుపై రైతులు దృష్టి సారించారు. 21 మండలాల్లో లోటు వర్షపాతం ముంగారు పంటలు విత్తుకునేందుకు మంచి అదను వచ్చినా వరుణుడు కరుణించ లేదు. ఈ నెల 15వ తేదీ వరకు విత్తుకునేందుకు మంచి సమయమని చెబుతున్నా... అది కూడా దగ్గర పడుతున్నందున రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా 47.1 మి.మీ నమోదైంది. 23.2 మి.మీ తక్కువగా కేవలం రెండు వర్షపు రోజులు నమోదయ్యాయి. అందులోనూ 21 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. గుంతకల్లు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, పామిడి, కూడేరు, పుట్లూరు, యల్లనూరు, నార్పల తదితర మండలాల్లో అయితే వర్షం జాడ కనిపించ లేదు. ఈ పది మండలాల్లో సాధారణం కన్నా 60 నుంచి 90 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగిలిన మండలాల్లో కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కణేకల్లు, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు లాంటి ఐదారు మండలాలు మినహా తక్కిన అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ మేర నమోదు కావాల్సి ఉంది. జాలై 15 లోపు జిల్లా అంతటా వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటే ఖరీఫ్ ఏరువాకకు ఇబ్బంది ఉండదు. లేదంటే మరోసారి కరువు ఛాయలు తప్పవని రైతులు అంటున్నారు. ముఖం చాటేసిన నైరుతి జూన్లో కేవలం రెండు రోజుల వర్షం 61.2 మి.మీ గానూ 47.1 మి.మీ వర్షపాతం నిరాశాజనకంగా ‘సాగు’తున్న ఖరీఫ్ ఏరువాక -
హౌస్సర్జన్లకు ౖస్టెఫండేదీ?
● మూడు నెలలుగా అందని వైనం ● మంత్రి ఉన్నా దుస్థితి అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో స్టైఫండ్ అందక హౌస్సర్జన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోని అనంతపురం సర్వజనాస్పత్రిలో విధులు నిర్వర్తించే హౌస్సర్జన్లకు సకాలంలో స్టైఫండ్ అందకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వివరాలు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం 2కే20 బ్యాచ్కు చెందిన హౌస్సర్జన్లు 149 మంది ఉన్నారు. వీరికి మూడు నెలల నుంచి స్టైఫండ్ అందడం లేదు. హౌస్సర్జన్లు 24 గంటలూ విధుల్లో ఉంటారు. ఓపీల్లో రాత్రి వేళ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంతో మంది పేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ చివరి దశకు వచ్చారు. ఈ క్రమంలో సకాలంలో స్టైఫండ్ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక.. ఆస్పత్రిలో 50 మంది హౌస్సర్జన్లకు మాత్రమే డైట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో హౌస్సర్జన్లకు డైట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్న వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముందు భావి వైద్యుల కష్టాలు తీర్చాలని పలువురు అంటున్నారు. -
పచ్చ నేతల పైశాచికం
డీ హీరేహాళ్(రాయదుర్గం): అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ దందాలకు అడ్డు చెప్పే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మట్టి దందాపై సమాచారమిచ్చారన్న కోపంతో రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు దౌర్జన్యంగా తొలగించారు. రాయదుర్గం నియోజకవర్గం డీ హీరేహాళ్ మండలం దొడగట్టలో జరిగిన ఈ ఘటన అధికార పార్టీ నేతల దాష్టీకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. వివరాలు.. దొడగట్ట చెరువులో కొద్ది రోజులుగా భారీ ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీలతో టిప్పర్లలోకి లోడ్చేసి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సండూరు, రాంపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు ఒక్కో ట్రిప్పు మట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా వెనుక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు ఆ ప్రాంతమంతా కోడై కూస్తోంది. మెట్టుతో కలిసి పట్టించారనే కోపంతో.. మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన దొడగట్ట చెరువును నాలుగు రోజుల క్రితం రైతులతో కలసి వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దులో మార్తల్ వద్ద నిల్వచేసిన సుమారు వంద ట్రిప్పుల మట్టిని పరిశీలించారు. అక్కడి నుంచే కళ్యాణదుర్గం ఆర్డీఓ, రాయదుర్గం రూరల్ సీఐ, మైనర్ ఇరిగేషన్ డీఈ తదితరులకు ఫోన్ చేసి.. అక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెట్టుతో కలిసి తమ దందాను బట్టబయలు చేశారనే అక్కసుతో రైతులపై టీడీపీ నాయకులు కక్ష సాధింపులకు దిగారు. విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చెరువులో బోర్లు ఉన్నాయనే సాకుతో రైతులు ఈశ్వరప్ప, పెద్ద అంజినేయులు, మేటి బసవరాజు, వండ్రప్పకు చెందిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తొలగించి సర్వీసులు నిలిపివేయించారు. టీడీపీ నాయకుల దాష్టీకం కారణంగా పొలాల్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంట ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరీ ఇంత దారుణమా?టీడీపీ నాయకుల దందాను బయటపెట్టారనే అక్కసుతో రైతుల విద్యుత్ కనెక్షన్లు తొలగించడం దారుణమని వైఎస్సార్ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మండిపడ్డారు. తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ అమల్లోకి తెచ్చిన రెడ్బుక్ రాజ్యాంగం రైతుల్ని కూడా వదలడం లేదని మండిపడ్డారు. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి దారుణానికి ఒడిగట్టారన్నారు. విప్ కాలవ శ్రీనివాసులుకు ఇలాంటి దారుణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల తొలగింపు మట్టి దందాపై సమాచారమిచ్చారన్న అక్కసుతో దాష్టీకం -
103 మంది విద్యార్థులకు ఏకోపాధ్యాయురాలా?
డి హీరేహాళ్(రాయదుర్గం): ఏకోపాధ్యాయురాలితో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయంటూ కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామస్తులు బుధవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయురాలు ఎలా నెట్టుకొస్తోందో చెప్పాలంటూ నిలదీశారు. నిత్యం హాజరు వేయడం, అల్లరి చేయకుండా కంట్రోల్ చేయడం మినహా పుస్తకాలు తెరవలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎంఈఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రైవేటు బడుల్లో ఖరీదైన చదువులకు పంపడం తమ వల్లకాదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి మరో ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు -
‘కూటమి’ దగా చేసింది
● ధాన్యం కొనుగోలు చేసి డబ్బులివ్వలేదు ● 400 మంది రైతులకు రూ.6.96 కోట్ల బకాయిలు ● మూడు నెలలవుతున్నా పట్టించుకోలేదు ● కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం తమను దగా చేసిందంటూ రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలవుతున్నా నేటికీ డబ్బు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంఽధించి డబ్బు తక్షణమే చెల్లించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మనహాళ్, కణేకల్లు రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, రైతులు మాట్లాడారు. వరి మద్ధతు ధర క్వింటా రూ.2,320 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి, ఏడు రోజుల్లోపు బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందని అధికారులు తెలిపారన్నారు. దీంతో బొమ్మనహాళ్ మండల పరిధిలో 120 మంది రైతులు, కణేకల్లు మండలంలో 280 మంది రైతులు మద్ధతు ధరతో పంటను ప్రభుత్వానికి విక్రయించారన్నారు. దాదాపు 400 మంది రైతులకు రూ.6,96,02,656 చెల్లించకుండా మూడు నెలలుగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. కార్యాలయాలు, సొసైటీల చుట్టు తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సేద్యం పనులు చేపట్టాల్సిన ప్రస్తుత తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలు, ఇతర పనులకు పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం డబ్బు చెల్లించకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు, రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, రైతు సంఘం నాయకులు నారాయణస్వామి, నాగార్జున, తిప్పేస్వామి, తేజ, రైతులు పాల్గొన్నారు. -
శింగనమల టీడీపీలో ఆరని కుంపట్లు
శింగనమల: శింగనమల టీడీపీలో కుంపట్లు ఆరడం లేదు. అనంతపురంలోని ఆర్అండ్బీ వేదికగా మరోమారు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శింగనమల నియోజకవర్గంలో పలు కమిటీల నియామకంపై బుధవారం అనంతపురం ఆర్అండ్బీ బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్య కమిటీ సభ్యులు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆలం నరసానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ మండలాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించగా.. ఎమ్మెల్యే శ్రావణి నిరాకరించారు. ఆ విధంగా కాదని, పేర్లను ఇక్కడే తెలిపితే నమోదు చేస్తామని చెప్పడంతో వాదోప వాదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఇప్పటికే మండలాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్ పోస్టులను మీ వారికే ఇచ్చుకున్నారని, పార్టీలో పని చేసే వారికి ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్టీని నాశనం చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి’ అంటూ ద్విసభ్య కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించడంతో ఉద్రిక్తత నెలకొంది. అరుపులు, కేకలు వేయడంతో గందోరగోళం నెలకొంది. పోలీసులు స్పందించి అక్కడి నుంచి అందరినీ బయటకు పంపించి వేశారు. అనంతపురం ఆర్అండ్బీ వేదికగా మరోసారి భగ్గుమన్న విభేదాలు ఎమ్మెల్యే, ద్విసభ్య కమిటీ వర్గీయుల రచ్చ -
స్కూల్ బస్సుల కండీషన్పై ప్రత్యేక దృష్టి
అనంతపురం సెంట్రల్: విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూల్ బస్సుల కండీషన్పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. స్కూల్ బస్సుల కండీషన్ అంశంపై రవాణాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో ఆర్టీఓ సురేష్నాయుడుతో కలసి జిల్లాలోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో 600 పై చిలుకు స్కూల్, కళాశాలల బస్సులు ఉన్నాయన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ బస్సులన్నీ కండీషన్లో ఉన్నాయో? లేదో పరిశీలించాని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధిక లోడు, ప్యాసింజర్లతో వెళ్లే గూడ్స్ వాహనాలు, ఇతర వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా తిరిగే వాహనాలను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. నగర శివారున వాహనాల ఛేజింగ్ నగర శివారున వాహనాల ఛేజింగ్ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారిని బెంబేలెత్తించింది. వివరాలు... జిల్లా రవాణా శాఖకు చెందిన ఏఎంవీఐ కేవీఎల్ఎన్ ప్రసాద్ మంగళవారం నగరంలోని టీవీ టవర్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన రెండు బొలెరో వాహనాల నిండా చేపల వలలు, ఆపై బోట్లు (పుట్టి) వేసుకుని వాటిపై మనుషులు కూర్చొని ప్రయాణిస్తుండడం గమనించిన ఆయన వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బొలెరో డ్రైవర్లు ఆపకుండా శరవేగంతో దూసుకెళ్లి పోవడంతో ఏఎంవీఐ తన వాహనంలో వెంబడిస్తూ రాప్తాడు పంగల్ రోడ్డు దాటిన తర్వాత అడ్డుకున్నారు. వాహనాలను ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. విచారణలో వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. వాహనాలకు పర్మిట్లు, ట్యాక్స్లు లేకపోవడం, ప్రమాదకరంగా ప్రజలను తీసుకెళుతుండడంతో కేసు నమోదు చేసి జరిమానా విధించారు. -
కేసులు పెట్టడం ఒక్కటే చేశారు
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడమే. గుంతకల్లు ఎమ్మెల్యేకు ఎంత ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనియ్యనని అంటారు? జగన్ నాయకత్వంలో, వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి చోటా నామినేషన్లు దాఖలు చేస్తాం. – శైలజనాథ్, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త -
ఎవరికీ భయపడం: అనంత వెంకటరామిరెడ్డి
గుంతకల్లు: ‘అలవిగాని హామీలతో గద్దెనెక్కడం.. తరువాత వాటిని పక్కన పెట్టడం బాబు నైజం. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు లెక్కేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎక్కడం ఖాయం’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్రెడ్డి అన్నారు. గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలోని పీఎంఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సతీష్రెడ్డితోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజనాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఇస్తామన్న బాబు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారన్నారు. ‘దీపం’ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నాడని, కానీ నేడు సగం మందికి కూడా పథకం డబ్బులు అందలేదని విమర్శించారు. పింఛను పంపిణీ గురించి గొప్పగా చెప్పుకుంటున్న బాబు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వాటి కంటే ఒక్క కొత్త పింఛన్ అయిన మంజూరు చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు’ కార్యక్రమం చేపట్టాక కిందికి దిగొచ్చి అరకొరగా తల్లికి వందనం పథకం అమలు చేశారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది విద్యార్థులకు రూ.13,500 కోట్లు అవసర ముంటే, కేవలం రూ.8,000 కోట్లు విడుదల చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఇన్ని డబ్బులొస్తాయని గతంలో టీడీపీ నాయకులు బాండ్లు పంచారని, హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని అడగాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలూ కూటమి ప్రజాప్రతినిధుల కాలర్ పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారన్నారు. రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకూ పైసా కూడా ఇవ్వని చంద్రబాబు పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నమ్మగలమా అని పేర్కొన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఈ ఏడాదిలో ఒక్క అభివృద్ధి పని చేపట్టారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ 2.0లో ఒకపక్క ప్రజలు.. మరో పక్క కార్యకర్తలు అనే నినాదంతో పార్టీ ముందుకు పోతుందని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశారట.. ఎవరూ వీటిపై అడగరాదట. ఆరు పథకాలు ఏఏ ఇంటికి పోయాయో చర్చించేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్.గాదిలింగేశ్వరబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామాంజినేయులు, పట్టణ, రూరల్ అధ్యక్షులు ఖలీల్, రాము, గుత్తి జెడ్పీటీసీ ప్రవీణ్కుమార్, పార్టీ నేతల పామిడి వీరా, వైఎస్సార్ సీపీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనలో ప్రజలకు చేసిన మంచి శూన్యం రాయలసీమకు తీరని అన్యాయం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్రెడ్డి మండిపాటు గుంతకల్లులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తమ పార్టీ నుంచి గెంటేస్తే గుంతకల్లులో పడిన గుమ్మనూరు జయరాం.. నేడు వైఎస్సార్సీపీ నాయకుల కాళ్లు, చేతులు విరుస్తామంటున్నారని, ఆయనకు గుంతకల్లు నియోజకవర్గ ప్రజల గురించి తెలియనట్లుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కొడితే ఆలూరు కాదు ఎక్కడ పడతాడో కూడా తెలియదని హెచ్చరించారు. గుంతకల్లు నియోజక వర్గంలో ప్రతి మండలానికీ తమ్ముళ్లను ఇన్చార్జ్లుగా ప్రకటించుకొని దోపిడీ చేస్తున్నారన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ పై అధికారుల ఆదేశాలు పాటించాలి కానీ, ఎమ్మెల్యేలు చెప్పినట్లు నడుచుకోకూడదని హితవు పలికారు. చట్టాలు తమకు కూడా తెలుసని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టులకు ఈడుస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ విధా నాలను ఎండగట్టడానికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరగాలని ‘అనంత’ పిలుపునిచ్చారు. -
అధినేతతో భేటీ
శింగనమల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంట పుట్లూరు ఎంపీపీ భూమిరెడ్డి రాఘవరెడ్డి, మండల మాజీ కన్వీనర్లు రఘనాథరెడ్డి, నరేంద్రనాథ్రెడ్డి ఉన్నారు. భూగర్భ జలశాఖ ఇన్చార్జ్ డీడీగా మల్లికార్జునరావు అనంతపురం అగ్రికల్చర్: భూగర్భ జలశాఖ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.మల్లికార్జునరావు బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డీడీ కె.తిప్పేస్వామి విజయవాడలో ఉన్న ప్రఽధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నంద్యాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునరావుకు ఇన్చార్జ్ డీడీగా బదిలీ చేశారు. హెచ్చెల్సీ ఇన్చార్జ్ ఎస్ఈగా విశ్వనాథరెడ్డి అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఇన్చార్జ్ ఎస్ఈగా విశ్వనాథరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకే ఇన్చార్జ్ ఎస్ఈగా పనిచేస్తున్న పురంధరరెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో చిన్న నీటిపారుదలశాఖ ఎస్ఈగా ఉన్న విశ్వనాథరెడ్డికి ఇన్చార్జ్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–స్టాంపుల కుంభకోణంపై అధికారులకు సమాచారమిచ్చా ● టీడీపీ నేత ఉన్నం మారుతి చౌదరి అనంతపురం టవర్క్లాక్: కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త ఎర్రప్ప అలియాస్ బాబు ‘మీసేవ’ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు తానే సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు, టీడీపీ నేత మారుతి చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన అనంతపురం ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ఎర్రప్ప మీసేవ కేంద్రంలో నకిలీ స్టాంపులు సృష్టిస్తున్నట్లు గతంలో అతని కారణంగా మీసేవ కేంద్రాలను మూసేసుకున్న వారు తన దృష్టికి తెచ్చారన్నారు. అందుకు ఆధారంగా ఉన్న పత్రాలను వాట్సాప్లో పంపడంతో వాటిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇతర శాఖల అధికారులకు పంపి విచారణ చేయాల్సిందిగా కోరానన్నారు. ఈ–స్టాంపుల ట్యాంపరింగ్ ద్వారా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతోనే తాను అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించిన వారిని వదిలేసి పోలీసులు తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకు వెళతానన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బురద జల్లుతున్నారని, ఈ కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. -
గుంతకల్లు క్రీడాకారులకు అంతర్జాతీయ చెస్ రేటింగ్
గుంతకల్లు: ప్రపంచ చదరంగ సమాఖ్య (ఎఫ్ఐడీఈ), అఖిల భారత చదరంగ సమాఖ్య (ఏఐసీఎఫ్) సంయుక్తంగా మంగళవారం విడుదల చేసిన చదరంగ క్రీడాకారుల రేటింగ్ జాబితాలో గుంతకల్లు చెందిన ఐదుగురు క్రీడాకారులకు అంతర్జాతీయ రేటింగ్ దక్కింది. ఈ మేరకు కోచ్లు అనిల్కుమార్, రామారావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బాలల విభాగంలో బాలాజీ (1,472), పునీత్రెడ్డి (14,712), కార్తీక్ (1,493), రాఘవ (1,478) అంతర్జాతీయ రేటింగ్ దక్కించుకున్నారన్నారు. బాలికల విభాగంలో 1,401 రేటింగ్తో గుంతకల్లు చెస్ క్రీడా చరిత్రలో మొట్టమొదటి రేటెడ్ ప్లేయర్గా జువైరా రికార్డు నమోదు చేసిందని తెలిపారు. రైలులో ప్రయాణికుడి మృతి గుంతకల్లు: ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్వివాంగుల బోగీలో ప్రయాణిస్తున్న అతని వద్ద కనీసం టికెట్ కూడా లేదు. సరైన సంరక్షణ లేకపోవడం, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండడమే మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. ఎరుపు రంగులో ఉండి.. కాఫీ కలర్ టీ షర్టు ధరించాడు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. కుక్కల దాడిలో 20 గొర్రెల మృతి బుక్కరాయసముద్రం: మండలంలోని చెదుల్ల గ్రామంలో కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... చెదుల్ల గ్రామానికి చెందిన రాగే ఎల్లప్ప గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ శివారులోని దొడ్డిలో మంగళవారం మధ్యాహ్నం జీవాలను వదిలి ఇంటికెళ్లి భోజనం చేసుకుని వచ్చేలోపు వీధి కుక్కల గుంపు మందపై దాడి చేశాయి. ఘటనలో 20 గొర్రెలు మృతి చెందాయి. అతిథి అధ్యాపకులకు నేడు ఇంటర్వ్యూలు అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ – డెయిరీ కోర్సు బోధనకు అర్హులైన అతిథి అధ్యాపకులకు బుధవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ గురుప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూలు అదే కళాశాలలో జరుగుతాయి. బీవీఎస్సీలో డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా డెయిరీ సైన్స్లో డిగ్రీ ఉన్న వారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. గాడిద పిల్లపై చిరుత దాడి వజ్రకరూరు: మండలంలోని కడమలకుంట గ్రామ పరిసరాల్లో చిరుత దాడిలో ఓ గాడిద పిల్ల మృతి చెందింది. యజమాని చాకలి వెంకటేష్ సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం ఫారెస్ట్ బీట్ ధికారి సతీష్కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేష్, ప్లాట్ వాచర్ మల్లికార్జున తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి చిరుత దాడి చేసినట్లుగా నిర్ధారించారు. చిరుత సంచారాన్ని అరికట్టాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రేపు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 3న విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను బంద్ చేసి శాంతియుతంగా నిరసన తెలిపేలా నిర్ణయించినట్లు అపుస్మా రాష్ట్ర కోఆర్డినేటర్ కుసుమ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆర్టీఈ 12(1)సి ద్వారా ఉచిత అడ్మిషన్లకు బలవంతం చేస్తున్నారంటూ వాపోయారు. అకారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని, గుర్తింపు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్రువీకరణ లేని ఫిర్యాదుల ఆధారంగా అధికారులు ఏకపక్షంగా తనిఖీలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమానులు సహకరించి 3న స్వచ్చందంగా విద్యా సంస్థలు బంద్ పాటించాలని పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. -
నేడు ఉరవకొండలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
ఉరవకొండ: నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం స్థానిక గవిమఠం సమీపంలోని వీరశైవ కల్యాణ మండపంలో జరగనుంది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మేలో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20)(ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15), (ఆర్–19) సప్లిమెంటరీ, బీటెక్ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. అలాగే, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్ సప్లిమెంటరీ, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, బీఫార్మసీ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. ఫలితాల కోసం వర్సిటీ వెబ్సైట్ చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్ తదితరులున్నారు. ఏఎఫ్ ఎకాలజీ మల్లారెడ్డికి సైబర్ నేరగాళ్ల టోకరా ● మొబైల్ హ్యాక్ చేసి రూ. 8.50 లక్షల అపహరణ రాప్తాడురూరల్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి సైబర్ నేరస్తుల ఉచ్చులో పడ్డారు. రూ. 8.50 లక్షల డబ్బు పొగోట్టుకున్నారు. ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన మేరకు.. ఐదు రోజుల క్రితం మల్లారెడ్డి మొబైల్కు కిసాన్ రైతు పేరుతో ‘ఏపీకే’ ఫైలు వచ్చింది. మల్లారెడ్డి ఆ ఫైలు ఓపెన్ చేయగా.. ఆయన మొబైల్ హ్యాక్ అయింది. ఆ తర్వాత మల్లారెడ్డి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 8.50 లక్షలు హ్యాకర్లు వేరే అకౌంటుకు బదిలీ చేసుకున్నారు. గుర్తించిన మల్లారెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు కిసాన్ పేరుతో వచ్చే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని ఎస్ఐ విజయ్కుమార్ సూచించారు. మొబైల్ ఒక సారి హ్యాక్ చేశారంటే సమాచారం మొత్తం కొల్లగొడతారని, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. -
ప్రమాదంలో యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్: లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామ సర్పంచ్ దుర్గమ్మ భర్త హనుమంత రాయుడు వైఎస్సార్సీపీలో కీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కళ్యాణదుర్గంలో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు సిద్ధమైన హనుమంత రాయుడు తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. కళ్యాణదుర్గం సమీపంలోకి చేరుకోగానే మల్లాపురం రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. హనుమంతరాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదంలో హనుమంతరాయుడు మృతి చెందిన విషయం తెలియగానే నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, తదితరులతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని హనుమంతరాయుడి మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు సర్పంచ్ భర్త -
హామీలు తుంగలోకి..
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చంద్రబాబు ఎన్నడూ నిజాలు చెప్పడు. ఎన్నికల ముందు ఇచ్చిన 143 హామీల్లో ఇంత వరకూ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. మేం చేపట్టిన ‘వెన్నుపోటు నిరసన’ కార్యక్రమం విజయవంతమైతే దిగొచ్చి ‘తల్లికి వందనం’ అమలు చేశారు. హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వ మెడలు వంచుతాం. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీకి ఓటు వేయకపోతే పథకాలు కట్ చేస్తామని భయపెట్టేందుకే ఇంటింటికీ కార్యక్రమం చేపడుతున్నారు. – వెంకటరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త -
అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి
అనంతపురం అర్బన్: ‘లక్ష్యాలను గడువులోపు పూర్తి చేయాలి. సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీలను ప్రోత్సహించే దిశగా శిల్పారామంలోని స్టాళ్లలో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవన్ పక్కనున్న స్థల సమస్యకు సంబంధించి వాస్తవ నివేదిక సమర్పించాలన్నారు. భూ పంపిణీ కోసం 35 మంది మాజీ సైనికులు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన దుకాణ సముదాయాల నుంచి బాడుగలు తప్పకుండా వసూలు చేయాలన్నారు. స్కాలర్షిప్లు, ఖాజీల రెన్యువల్, ఇమామ్, మౌజన్లు, పాస్టర్ల వేతనం తదితర అంశాలపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హిజ్రాల ఆగడాలపై ఫిర్యాదులు హిజ్రాల ఆగడాలపై ఇటీవల తనకు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ చెప్పారు. వాటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీకి విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా లేఖ సమర్పించాలని ఆదేశించారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ ఉరవకొండ: మండల పరిధిలోని వెలిగొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు గోవిందరాజులు, సిద్దప్ప, బొజ్జన్న, వీణమ్మలు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్యతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఉమాదేవి రేషన్ షాపును కలెక్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ -
ఈఎన్టీలో తప్పని రోగుల నిరీక్షణ
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో చికిత్స కోసం రోగులు నాలుగు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఆస్పత్రికి వచ్చిన రోగులు ఓపీ కోసం గంట పాటు బారులు తీరారు. ఆ తర్వాత ఈఎన్టీ విభాగానికి 9 గంటలకు చేరుకుని 12 గంటల వరకు వేచి ఉన్నా వైద్య నిపుణుడి పత్తా లేకుండా పోయింది. వైద్య విద్యార్థులు (పీజీ) ఓపీ చూసుకుని తీరిగ్గా 12 గంటల తర్వాత చికిత్స మొదలు పెట్టారు. దీంతో చెవి పోటు తీవ్రమై రోగులు నీరసించిపోయారు. నొప్పి అంటున్నా పట్టించుకోలేదు మా ఆదెమ్మ చెవి నొప్పితో బాధపడుతుంటే ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చాం. ఓపీలో పరీక్షించి గదిలో కూర్చొమన్నారు. ఎంత సేపటికీ డాక్టర్లు రారు. చెవి నొప్పి అంటూ ఆదెమ్మ విలవిల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాస్పత్రిలో మరీ ఇంత అద్వానంగా వైద్యం చేస్తారనుకోలేదు. పేదలంటే ఇంత చులకన అనుకోలేదు. – వెంకటరాముడు, వెంకటాపురం నీరసించిపోయా చెవిలో సమస్య ఉందని పొద్దున్నే వచ్చా. ఇక్కడ చూస్తే ఓపీ చూసేందుకు గంటల సమయం పట్టింది. కుర్చీల్లో డాక్టర్లు లేరు. చివరకు జూనియర్ డాక్టర్లు వచ్చి చెవి చెక్ చేసి వెళ్లారు. తిరిగి ఎవరూ పట్టించుకోలేదు. ఎదురు చూసి నీరసించిపోయా. – చెన్నకేశవులు, అనంతపురం -
కూటమి అవినీతిని ప్రజలకు తెలపండి
కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వ అవినీతి, మోసాలను ప్రజలకు తెలియపరచాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శ్రీనివాస కల్యాణ మండపంలో పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ పార్టీ శ్రేణులు 30 రోజుల పాటు ఇంటింటికీ తిరగాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన మంచిని వివరిస్తూ ఏడాదిలో చంద్రబాబు చేసిన మోసాలను, మేనిఫెస్టోను తెలియజేయాలని సూచించారు. అనంతరం... రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కుటుంబానికి ఎంత మోసం జరిగిందో తెలుసుకునేలా ప్రజలను చైతన్య వంతులు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు నారాయణపురం వెంకటేశులు, రామాంజినేయులుతో పాటు వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
వద్దొద్దు.. ఇప్పుడే వద్దు!
‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు’ అన్న చందంగా మారింది జిల్లా హెచ్చెల్సీ అధికారుల తీరు. ప్రకృతి కరుణించడంతో నిండుకుండలా మారిన తుంగభద్ర డ్యాం నుంచి జిల్లాకు నీటి విడుదలకు టీబీ బోర్డు సిద్ధమైనా.. హెచ్చెల్సీ అధికారులు మాత్రం ఇప్పుడే వద్దంటూ తిరకాసు పెట్టారు. ● ఈ నెల 10న హెచ్చెల్సీకి నీటి విడుదలకు టీబీ బోర్డు సుముఖత ● వద్దంటూ హెచ్చెల్సీ అధికారుల తిరకాసు ● అధికారుల నిర్ణయంతో ఆయకట్టు రైతులకు తీరని నష్టం అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ అధికారుల తాజా నిర్ణయం ఆయకట్టు రైతులకు తీరని నష్టం కలిగించేలా మారింది. జిల్లాలో ముందస్తుగా వర్షాలు కురిసినా ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. కానీ ఎగువన కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి కొద్దిరోజులుగా భారీ స్థాయిలో వరద చేరుకుంటోంది. త్వరలో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా హెచ్చెల్సీ అధికారులు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి... ఇప్పుడే అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి విడుదల ఇప్పుడే వదంటూ బోర్డుపై ఒత్తిళ్లు తీసుకెళ్లారు. నత్తనడకన పనులు చేపట్టి.. ఉమ్మడి జిల్లాకు వరదాయినిగా తుంగభద్ర జలాశయం నిలిచింది. కొన్నేళ్లుగా చెప్పుకునే స్థాయిలో వర్షాలు వస్తుండడంతో దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందిస్తున్నారు. ఇంతటి మహోన్నతమైన ప్రాజెక్ట్పై అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హెచ్చెల్సీ ప్రధాన కాలువపై కల్వర్టులు కూలిపోవడంతో పలు చోట్ల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీల మరమ్మతు పనులు కూడా చేపట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి గత జనవరిలో దాదాపు రూ. 30 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. వెనువెంటనే పనులు చేపట్టాల్సింది పోయి ఏప్రిల్ వరకూ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలోహెచ్చెల్సీకి నీరు విడుదలైతే కాలువకు గండ్లు పడే ప్రమాదముంది. కల్వర్టులు, ఇతర పనులు జరుగుతున్నాయంటూ మరో పదిరోజులు గడువు కావాలని హెచ్చెల్సీ అధికారులు విజ్ఞప్తులపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది హెచ్చెల్సీ రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ నష్టం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని తీసుకునే అవకాశముంది. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించిన నీటి కోటాలో ఈ ఏడాది భారీ కోత పడింది. గతేడాది భారీ వర్షాలకు ఒక గేటు కొట్టుకుపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచేందుకు వీలు కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. వాస్తవానికి కొత్త గేటు అమర్చడానికి ఐదారు నెలలకు పైగా సమయం ఉన్నా.. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చినా గేటు ఏర్పాటు అంశంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం చోటు చేసుకుని తాత్కలికంగా అమర్చిన గేటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టీబీ డ్యాంలో 80 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతకు మించి నీరు చేరుకుంటే దిగువకు వదిలేయాల్సిందే. ఆయకట్టుకు తీరని నష్టం దామాషా ప్రకారం 140 టీఎంసీల నీటి లభ్యత ఉంటే హెచ్చెల్సీకి 32 టీఎంసీల నికర కేటాయింపులు ఉంటాయి. ఈసారి తుంగభద్ర జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీలకు మించి నిల్వ ఉంచరాదని నిర్ణయించారు. దీంతో హెచ్చెల్సీకి కేవలం 18.396 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఇందులో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మిగిలిన 8.396 టీఎంసీల్లో ప్రవాహ నష్టాలు ఉంటాయి. ఇక మిగిలిన నీటిని ఆయకట్టుకు అందించాలి. ఫలితంగా హెచ్చెల్సీ పరిధిలో లక్ష ఎకరాలకు పైగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇది హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. తుంగభద్ర నుంచి నీరు విడుదలయ్యే సమయం దగ్గరలోనే ఉందని తెలిసినా పనులు వేగవంతం చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులు కూడా తమకు ఆదాయం సమకూరే పనులపై మాత్రమే శ్రద్ద చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యాం టీబీ డ్యాంకు తగ్గిన వరద బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం 65 వేల క్యూసెక్కులు, సోమవారం 40 వేల క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో మంగళవారం సాయంత్రానికి 33,916 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో శివమొగ్గలోని అప్పర్ తుంగా ప్రాజెక్ట్ (గాజునూరు జలాశయం) నుంచి దిగువకు నీటి విడుదలను నిలిపివేయడంతో టీబీ డ్యాంకు వచ్చే వరద సగానికి తగ్గింది. 80 టీఎంసీలకు చేరితే డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తి నదికి వదులుతారు. ఈ లెక్కన గేట్లు ఎత్తడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈనెల 10న తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు నీటిని విడుదల చేయనుండడంతో రైతులు వరిసాగుకు సిద్ధమయ్యారు. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,624.38 అడుగులకు చేరుకుంది. అవుట్ఫ్లో 2,389 క్యూసెక్కులుగా ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు హెచ్చెల్సీకి నీటిని తీసుకోవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు అవసరముందో.. లేదో.. అనే అంశంపై నీటి సంఘాల నాయకులతో చర్చిస్తాం. అవసరముందని చెబితే తప్పకుండా తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటిని తీసుకుంటాం. ఆలస్యమైనా పర్వాలేదని అంటే పనులను వేగవంతంగా పూర్తి చేసి, నీటిని తీసుకుంటాం. – విశ్వనాథరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ,హెచ్చెల్సీ -
ఇసుకాసురులపై పెల్లుబికిన రైతుల ఆగ్రహం
శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం నిదనవాడ సమీపంలోని పెన్నా నది నుంచి టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందినది ఒక చోట అయితే, పెన్నానదిలో నచ్చిన చోట ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతాయన్న ఆందోళనతో మంగళవారం నిదనవాడ గ్రామ రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో ఇసుకాసురులు రైతులపై దౌర్జన్యానికి దిగారు. గత నెలలోనే పెన్నా నది కింది భాగాన ఇసుక తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి మరో చోటకు మకాం మార్చారు. గ్రామ పైభాగాన ఎర్రమట్టితో నదిలోకి రోడ్డు వేసుకొని పెద్దవడుగూరు మండలం చిత్రచేడు వైపు తరలింపు మొదలు పెట్టారు. మంగళవారం విషయం తెలుసుకున్న నిదనవాడ రైతులు దాదాపు 200 మంది పెన్నా నదిలోకి వెళ్లి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ అక్రమార్కులు బెదిరించారు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రావణిశ్రీతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వచ్చేవరకు వాహనాలను బయటకు వెళ్లనిచ్చేది లేదంటూ అక్కడే వంటా వార్పునకు దిగారు. తహసీల్దార్ శేషారెడ్డి, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయ్కుమార్ అక్కడికి చేరుకుని.. ఇసుక తరలింపును నిలిపివేశారు. అనుమతి ఉన్న చోట నుంచే రవాణా చేసుకోవాలని, అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులతో తహసీల్దార్ మాట్లాడుతూ.. అధికారులు బదిలీల్లో ఉన్నారని, వారు వచ్చిన తరువాత హద్దులు చూపిస్తామని పేర్కొన్నారు. అధికార అండతోనే అక్రమార్కుల అరాచకం.. ‘ఇసుకాసురులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధికారం అండతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతామని, ఇసుక తరలించవద్దని వేడుకుంటున్నా కనికరం చూపడం లేదు. వాహనాలను అడ్డగించి, రెవెన్యూ అధికారులు, పోలీసులకు పట్టించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇది పునరావృతం కాకుండా ఉంటుంది’ అని రైతులు అంటున్నారు. -
అయ్య బాబోయ్ ఇంటింటికీనా..!
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.కబ్జాలు, ఆక్రమణలతో వణుకు జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.మహిళలు ‘బెల్టు’ తీస్తారు..! ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు.. ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆగ్రహంలో రైతన్నలుప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు. -
నేను వైఎస్సార్సీపీలోకి రావచ్చేమో!: జేసీ ప్రభాకర్రెడ్డి
తాడిపత్రి రూరల్:‘భవిష్యత్తులో నేను వైఎస్సార్సీపీలోకి రావచ్చేమో! వైఎస్ కుటుంబం నాకు బాగా తెలుసు’ అని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరిపైనా కక్ష లేదన్నారు.పట్టణంలో భవన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నానన్నారు. దీనివల్ల కొందరు బాధ పడొచ్చని, అందుకు తనను క్షమించాలన్నారు. భవిష్యత్తులో పట్టణ ప్రజలు అన్ని అనుమతులు తీసుకుని భవనాలు నిరి్మంచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
బదిలీల నరకయాతన
అనంతపురం: ఉమ్మడి జిల్లా సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నరక యాతనను మిగిల్చింది. అనంతపురంలోని డీపీఓలో చేపట్టిన ఈ ప్రక్రియకు ఉదయం 8 గంటలకంతా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. 12 గంటల తర్వాత తొలుత స్పౌజ్, పీహెచ్సీ, మెడికల్ సర్టిఫికెట్ ఉన్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. మూడు గంటల వరకు జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో నిరీక్షణ తప్పలేదు. దీంతో చంటి పిల్లల తల్లులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవివాహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులను లోపలకు అనుమతించకపోవడంతో వారు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మహిళల పట్ల పోలీసు శాఖ నిర్దయగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆదోనిలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి ఆగమేఘాలపై పిల్లల తల్లులకు పాలు, జ్యూస్ అందించారు. కౌన్సెలింగ్ కేంద్రంపైన సేద తీరేందుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కోటాలో అభ్యంతరాలు స్పౌజ్ కోటాలో బదిలీలకు సంబంధించి తమ భర్త ఎక్కడ ఉంటాడో ఆ పరిసరాల్లోనే స్థానాన్ని కోరుకోవాలి. అయితే తాడిపత్రి, హిందూపురం పరిసరాల్లో పనిచేస్తున్న కొందరు ఆ స్థానాలు కాకుండా ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. దీనిపై మిగిలిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిని వెనక్కు పిలిపించి.. స్పౌజ్ పరిసర ప్రాంతాల్లో స్థానాన్ని కేటాయించారు. అర్ధరాత్రి ఆందోళన గణనీయమైన ర్యాంకు ఉన్న వారికి ముందస్తుగా అవకాశం కల్పించి.. వారు కోరుకున్న చోటుకు బదిలీ కల్పించాలి. అలాగే రేషనలైజేషన్లో పోస్టు కోల్పోయిన వారికి జనరల్ కేటగిరి కింద చివరన పిలవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపట్టారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అర్ధరాత్రి కౌన్సెలింగ్ను నిలిపివేశారు. అనంతరం అధికారులు నచ్చచెప్పి తిరిగి కౌన్సెలింగ్ను కొనసాగించారు. -
అనుమానాస్పద మృతి
కుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్ యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. 6 పోస్టులు...172 దరఖాస్తులు! అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆరు సెక్టోరియల్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 172 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుకు సోమవారంతో గడువు ముగిసింది. ఏఎంఓ, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ), అసిస్టెంట్ సీఎంఓ, ఏఎస్ఓ, అసిస్టెంట్ ఐఈడీ, అలెస్కో పోస్టుల భర్తీకి ఇటీవల నోటఫికేషన్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా అసిస్టెంట్ సీఎంఓ పోస్టుకు 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అలెస్కో పోస్టుకు 45 మంది, ఏఎంఓకు 37 మంది, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ)కు 14 మంది, అసిస్టెంట్ ఐఈడీకి 14 మంది, ఏఎస్ఓ పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేసి నిబంధనల మేరకు భర్తీ చేస్తామని ఏపీసీ టి.శైలజ స్పష్టం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన జేసీ అనుచరులుసాక్షి టాస్క్ఫోర్స్: స్థానిక రూరల్ పరిధిలోని కడపరోడ్డు శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 13 మందిని స్పెషల్పార్టీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి.. రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డికి అప్పగించారు. వీరంతా మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు కావడం గమనార్హం. వీరి నుంచి రూ.1,23,700 నగదు, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో తాడిపత్రిలోని గన్నెవారిపల్లెకాలనీకి చెందిన జేసీ ప్రధాన అనుచరుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. అందరూ అధికార పార్టీ వారు కావడం, అది కూడా జేసీ అనుచరులు కావడంతో పట్టుబడిన వారి పేర్లను తెలిపేందుకు సీఐ నిరాకరించారు. కాగా.. టీడీపీ నేత ఇంట్లోనే కొద్దికాలంగా పోలీసుల కనుసన్నలోనే పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. అనంతపురం స్పెషల్పార్టీ పోలీసులు పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకుని అప్పగించినా స్థానిక పోలీసులు మాత్రం కొద్దిపాటి మొత్తాన్నే చూపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. -
● తీరని క‘న్నీటి’ వ్యథ
గుంతకలుల్లో నిరసన తెలుపుతున్న మహిళలు గుంతకల్లు: తాగునీటి కోసం స్థానిక బీటీ ఫక్కీరప్ప కాలనీ సోమవారం ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా మున్సిపల్ కొళాయిలకు నీరు విడుదల కాకపోవడంతో కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో సోమవారం సీపీఐ నాయకులతో కలిసి కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీ లోనే జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరభద్రస్వామి, గోపీనాథ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఫలితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. 6 రోజులుగా తాగునీరు అందకపోతే ప్రజల దాహార్తి తీరేదేలా అని ప్రశ్నించారు. కాలనీలో డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు. అధికారులు ఇప్పటికై నా స్సందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో పీఆర్ వ్యవస్థ నిర్వీర్యం
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్ (పీఆర్) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం తక్షణం చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బసవ రాజు, బండి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు సీవీరంగారెడ్డి, సాదక్వలి, నియోజకవర్గ అధ్యక్షుడు మూలి లోకనాథరెడ్డి, విజయకుమార్, తిప్పేస్వామి, తిక్కస్వామి, భూతవి సుధాకర్, యోగష్రెడ్డి, చిన్నరంగారెడ్డి, జెడ్పీటీసీలు జె.చంద్రకుమార్, ఈశ్వరయ్య, వైస్ ఎంపీపీ ప్రసాద్గౌడ్, సర్పంచులు ఓబులేసు, చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, నాయకులు కుమ్మెత చంద్రశేఖరరెడ్డి, రుద్రనంద యాదవ్, రవికుమార్, రమేష్, అంజియాదవ్, బండిపవన్, గోవిందరెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలు
ఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు నేటి నుంచి హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది. -
అయ్యా.. సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్: ‘అయ్యా మా కష్టాలు వినండి... ఆదుకోండి’ అంటూ అధికారులకు ప్రజలు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్ లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 640 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం సమస్యల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకూడదని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు. వినతుల్లో కొన్ని... ● స్వాతంత్య్ర సమరయోధుడు, వడ్డెర్ల ఆరాధ్యుడు వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం కార్యదర్శి మంజుల నారాయణ విన్నవించాడు. నగర పరిధిలోని నడిమివంక ప్రాంతంలో గంగమ్మ గుడి పక్కన స్థలం కేటాయిస్తే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని విజ్ఞప్తి చేశాడు. ● పీఎం విశ్వకర్మ పథకం కింద ఎంపికైనప్పటికీ రుణం మంజూరు కాలేదని బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన కొండన్న ఫిర్యాదు చేశాడు. శిక్షణ ఇచ్చారని, సర్టిఫికెట్తో పాటు రూ.4 వేలు వచ్చాయని చెప్పాడు. గుత్తి రోడ్డులోని యూనియన్ బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేయడం లేదని వాపోయాడు. ● వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీల బదిలీల్లో అక్రమాలు జరిగాయని అనంతపురం నవోదయ కాలనీకి చెందిన బి.శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. స్పౌజ్ కేటగిరీకి చెందిన చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని, స్పెషల్ కేటగిరీ వారికి ప్రాధాన్యత కల్పించకుండా జనరల్గా పిలిచారని వివరించాడు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరాడు. అధికారులకు బాధితుల వినతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 640 అర్జీలు ఈ వృద్ధురాలి పేరు బావమ్మ. శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామం. పింఛను మంజూరు చేయాలంటూ కలెక్టర్ను కలిసి విన్నవించింది. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడని చెప్పింది. జీవనం కష్టంగా మారిందని పింఛను మంజూరు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
● హాజరుకానున్న పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్రెడ్డి కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో మంగళవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తెలిపారు. ముదిగల్లు రోడ్డులోని శ్రీనివాస కల్యాణమండపంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్కుమార్ రెడ్డి హాజరవుతారన్నారు.మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం కన్వీనర్ ఐ.సుధీర్, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, పి.చంద్రశేఖర్రెడ్డి, బ్రహ్మసముద్రం ఎంపీపీ చంద్రశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, వివిధ విభాగాల అధ్యక్షులు దొడగట్ట మురళి, కురుబ పాతలింగ, రామిరెడ్డి, కిరీటి యాదవ్, మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అధికార అండ.. పంచాయతీలపై బండ!
● కంబదూరు మండలంలో విండ్పవర్ సంస్థల ఇష్టారాజ్యం ● కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సంస్థ ఆధ్వర్యంలో పనులు ● గ్రామసభలు నిర్వహించకుండా, తీర్మానాలు లేకుండా ముందుకు ● సామాజిక బాధ్యతనూ విస్మరించడంపై సర్వత్రా విమర్శలుకళ్యాణదుర్గం: అధికారం మాదే.. మేమేం చేసినా అడిగేవారెవరనే రీతిలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్సీ సంస్థ వ్యవహరిస్తోంది. పంచాయతీల అభివృద్ధికి ఆటంకం సృష్టిస్తోంది. వివరాలు.. కంబదూరు మండలంలో 12కు పైగా సంస్థలు గాలిమరలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ముందుగా ఆయా గ్రామ పంచాయతీల్లో నెడ్క్యాప్, రెవెన్యూ, స్థానిక పంచాయతీ అధికారులతో కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది. అయితే, కంబదూరు మండలంలో అనుమతులు పొందిన పంచాయతీల్లో ఇప్పటికీ ఒక్క గ్రామ సభ కూడా చేపట్టలేదు. పనులు ప్రారంభిస్తున్నట్లు కనీస సమాచారం కూడా సర్పంచులకు ఇవ్వలేదు. సామాజిక బాధ్యత మరచి.. కంబదూరు మండలంలో విండ్ పవర్ ఏర్పాటు పనులన్నీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ‘ఎస్ఆర్సీ’ అండ చూసుకుని ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కార్యక్రమం కింద సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. తాగునీటి కల్పన, పాఠశాలల అభివృద్ధి, పారిశుధ్యం, హెల్త్క్యాంప్ల నిర్వహణ తదితర సామాజిక కార్యక్రమాల విషయమే మరచిపోయారు. దీనికితోడు ఆయా గ్రామాల్లో మట్టిరోడ్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇతర మిషన్లను హడావుడిగా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో భారీ వాహనాలను నడుపుతూ రోడ్లను ఛిద్రం చేస్తున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన కంపెనీ పనులు చేస్తుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంచాయతీ తీర్మానమే లేదు మా పంచాయతీలో అనుమతులు లేకుండానే ఎస్ఆర్సీ సంస్థ పనులు చేపడుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు తీర్మానం తప్పనిసరి. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక బాధ్యతగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. స్థానిక నేతల జేబుల్లోకి నిధులు వెళ్తున్నాయి. దీనిపై నెడ్క్యాప్, రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలి. – మంగమ్మ, సర్పంచు, రాళ్ల అనంతపురం -
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం సెంట్రల్: తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వర రెడ్డితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఎంత నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలోని గ్రామ, వార్డుల్లో త్వరలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే ఆదివారం తాడిపత్రి నియోజకవర్గంలో కార్యకర్తలను సమాయత్తం చేయడానికి పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే బలవంతంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. జిల్లాలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య లేదని.. తాడిపత్రిలో మాత్రమే ఉందనడం సబబు కాదన్నారు. పెద్దారెడ్డి నియోజకవర్గంలో తిరిగేందుకు స్వయంగా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యేను శాసించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాడిపత్రిలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ నిర్వహించి తీరుతామని ‘అనంత’ స్పష్టం చేశారు. దరిద్రమైన రాజకీయాలు ఆపెయ్.. పేకాట, గంజాయి బ్యాచ్లను వెంటపెట్టుకొని తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరితే పరిశీలిస్తానని ఎస్పీ అనడం ఏంటని, ఎవరితో మాట్లాడి ఆయన నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డితో చర్చించేకి వీరికేమైనా బాసా అని నిలదీశారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన వారి ఫొటోలు, వీడియోలు ఉన్నాయని, వారికి రపా..రపా ఉంటుందని జేసీ ప్రభాకర్రెడ్డి పబ్లిక్గా హెచ్చరిస్తుంటే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. సొంతింటికి తనను ఎందుకు పోనివ్వరో సమాధానం చెప్పాలన్నారు. ‘గతంలో మీరు చేశారు’ అనే మాటలకు కట్టుబడి ఉన్నానని, దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. భార్యను అసభ్యంగా మాట్లాడానని జేసీ అంటున్నారని, తాను అన్నట్లు ఆ అక్క నోటితో పలికించాలని.. నిరూపిస్తే తాడిపత్రికి వెళ్లనని స్పష్టం చేశారు. అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు..? ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి తన నియోజకవర్గానికి వెళ్లకూడదని దేశంలో ఎక్కడైనా ఉందో చెప్పాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నిలదీశారు. ఎస్పీని అనేకమార్లు కలిసినా, కోర్టు ఉత్తర్వులున్నా అనుమతివ్వకపోవడం సరి కాదన్నారు. ఎవరి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే వారిని అరెస్ట్ చేయాలన్నారు. కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, ప్రజల వద్దే ఎండగడతామని హెచ్చరించారు. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పోలీసులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇది కొత్త తరహా పోలీసింగ్.. జిల్లాలో పోలీసు వ్యవస్థ నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను ఏరిపారేసిందని, కానీ నేడు జేసీ ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లలేక కొత్త తరహా పోలీసింగ్ను చూపిస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్కు కూడా దేశ చట్టాలు విస్తరించాయని, కానీ తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్రెడ్డితో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని విమర్శించారు. మీ నాయన చర్యలను సమర్థిస్తున్నావా? ‘యువకుడు, చదువుకున్న వ్యక్తి అని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన అస్మిత్రెడ్డీ.. మీ నాయన చర్యలను నువ్వైనా సమర్థిస్తున్నావా’ అని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పోలీసులు వెన్నెముక లేన్నట్లుగా పనిచేస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం అయితే ఆ ప్రతులను ప్రజలకు పంచాలని సూచించారు. పట్టణంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ నిర్వహించి తీరుతాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
కల్తీల కలవరం
⇒ అనంతపురంలోని పాతూరుకు చెందిన మహబూబ్ బాషా దోమలబారినుంచి తప్పించుకునేందుకు ఆలౌట్ లిక్విడ్ బాటిల్ కొన్నారు. దోమలు చావకపోగా ఎన్నాలున్నా లిక్విడ్ అయిపోలేదు. అప్పుడు తెలిసింది ఇది నకిలీ ఆలౌట్ అని. ⇒ గుత్తిలో సుజాత అనే ఓ మహిళ అర డజను బట్టల సబ్బులు కొనింది. కానీ ఈ సబ్బుతో ఎంత ఉతికినా మురికి పోలేదు. చివరకు ఆరా తీస్తే అవి నకిలీవని తేలింది.సాక్షి ప్రతినిధి, అనంతపురం: మార్కెట్ నిండా నకిలీ, కల్తీ వస్తువులే. సామాన్యులు, నిరక్ష్యరాస్యులే కాదు బాగా చదువుకున్న ఐటీ ఉద్యోగులు కూడా నకిలీ వస్తువుల విషయంలో బోల్తా పడుతున్నారు. ఏది నకిలీనో, ఏది నిజమైనదో తేల్చుకోలేక వినియోగదారులు ఘోరంగా మోసపోతున్నారు. రోజువారీ వినియోగంలో ఉండే వస్తువుల వ్యాపారం రూ.కోట్లలో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ, కల్తీ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా విజిలెన్స్ తనిఖీల్లో నకిలీ వస్తువులు బయటపడటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తరచూ తనిఖీలు లేకపోవడం వల్ల ఇలా నకిలీ ఉత్పత్తులు మార్కెట్ను ముంచెత్తుతున్నట్టు ఆరోపణలున్నాయి. టీపొడిలో కొత్త కోణాలు ఇటీవలి కాలంలో కల్తీ టీపొడి వినియోగం తీవ్రమైంది. పదే పదే వాడిన టీని ఎండపెట్టి చింతపిక్కల పొడి వంటివి కలిపి మళ్లీ అమ్ముతున్నారు. ఇందులో కొన్ని ఆకర్షించే రంగులు, రుచికోసం రసాయనాలు కలుపుతున్నారు. ఒరిజనల్ టీపొడి అయితే ఒక గ్లాసు మంచినీళ్లలో వేస్తే... టీపొడి బాగా నానిన తర్వాత గానీ రంగుమారదు. అదే నకిలీ టీపొడి అయితే నీళ్లలో వేసిన రెప్పపాటులోనే నీళ్లన్నీ టీరంగులోకి మారిపోతాయి. లేబుళ్లు లేకుండా సంచుల కొద్దీ వస్తున్న ఈ టీపొడిలో మసాలాలు కలిపి వినియోగదారులకు అందిస్తున్న తీరు భయాందోళనకు గురి చేస్తోంది. పాలను విషపూరితం చేస్తున్నారు కల్తీపాలు ఇప్పటికీ యథేచ్ఛగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని రకాల నూనెలను బాగా మరగకాచి, వాటిలో కొన్ని క్రీములు కలిపి నకిలీ పాలను తయారు చేస్తారు. వీటిని డెయిరీ సంస్థలకు అమ్ముతున్నారు. డెయిరీ సంస్థలు ఫ్యాట్ కంటెంట్ (కొవ్వు శాతం) చూస్తాయి గానీ, ఇవి నకిలీవా, కాదా అనే పరిస్థితి లేదు.కల్తీ మాఫియా గుప్పిట్లోనే.. ⇒ కుళ్లిపోయిన వెన్నను కాచి నెయ్యిని తయారు చేస్తున్నారు. మంచి సువాసన కోసం కొన్నిరకాల రసాయనాలు కలుపుతున్నారు. ⇒ కారంపొడిలో రకరకాల రసాయనాలతో పాటు కొన్ని రకాల పొట్టు కలిపి కారంపొడి తయారు చేస్తున్నారు. ⇒ చిన్న పిల్లలకు ఇచ్చే గ్లూకోన్డీని కూడా కల్తీమయం చేశారు. కొన్ని రసాయనాల మిశ్రమం, శాక్రిన్లు కలిపి ఇస్తున్నారు. దీనివల్ల చిన్నారుల ఆహారం గుల్లవుతోంది. ⇒ పప్పు దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. శనగపిండిలో బియ్యపు పిండి కలిపి అమ్ముతున్నారు. ⇒ చిరు ధాన్యాల్లో అంటే ధనియాలు, మినప్పప్పు వంటివి బాగా ఆకర్షించేలా ఉండటం కోసం ఓరకమైన నూనెలను కలుపుతున్నారు. ఇవి చాలా ఆకర్షించేలా ఉంటాయి. ⇒ తాజాగా సర్ఫ్ పౌడర్, సబ్బులు, గుడ్నైట్ లిక్విడ్ వంటి నకిలీ సరుకులు విజిలెన్స్ తనిఖీల్లో పట్టుకున్నారు.నకిలీని కనిపెట్టేదెలా..?⇒ సబ్బులు, బట్టలకు వాడే సర్ఫ్ వంటివి కనిపెట్టడం సామాన్య వినియోగదారులకు కొంచెం కష్టమే. కానీ కొద్దిగా పరిశీలిస్తే... ⇒ ఒరిజనల్ కంపెనీ వస్తువుకు, నకిలీ వస్తువుకు లేబుల్ మీద ఉన్న రాత (ఫాంట్)లో తేడా ఉంటుంది. ⇒ లోగోలో కూడా ఒక అక్షరం తేడాతో ఇమిటేట్ చేస్తుంటారు. ⇒ అన్నింటికీ మించి బార్కోడ్ అతిముఖ్యమైనది. చిన్న చిన్న కిరాణా షాపుల్లో బార్కోడ్ స్కాన్ చేయరు. ⇒ ఒకసారి బార్కోడ్ స్కాన్తో కొనుకున్న వస్తువును, కిరాణా షాపులో ఉన్న వస్తువును పోల్చి చూస్తే తేడా ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. డిక్లరేషన్ నిబంధనలే చూస్తాం మా పరిధిలో కంపెనీ డిక్లరేషన్లో ఇచ్చిన నిబంధనలు మాత్రమే చూస్తాం. అవి కరెక్టుగా ఉన్నాయా లేదా అనేదే పరిశీలిస్తాం. వస్తువు నాణ్యత చూడటం మా పరిధిలో లేదు. డిక్లరేషన్ నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తాం. – సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్, తూనికలు కొలతల శాఖయాజమాన్యాలే జాగ్రత్తగా ఉండాలి నకిలీ ఏదో ఒరిజనల్ ఏదో సామాన్యులు కనిపెట్టలేరు. ఎన్నో ఏళ్లనుంచి వ్యాపారం చేస్తున్న కిరాణా షాపుల యజమానులకు డూప్లికేట్ ఏదో, మంచిదేదో తెలుసు. ఏజెన్సీలనుంచి తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించి తీసుకోవాలి. లేదంటే నకిలీ ప్రొడక్ట్లు దొరికితే నష్టపోయేది కిరాణాషాపుల యాజమాన్యాలే. – జమాల్ బాషా, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ -
జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యానించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు. -
ఆ నలుగురిపైనే.. బాబు ఫోకస్..!
ప్రజాప్రతినిధుల పనితీరుపై టీడీపీ అధిష్టానం చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం.. గతం కన్నా మిన్నగా పాలన సాగిస్తున్నాం అని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో సర్వే ఫలితాలు షాక్కు గురి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్వానపు పనితీరుతో ప్రజాప్రతినిధులు ఆదరణ కోల్పోయిన విషయం స్పష్టమైంది. సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రజాప్రతినిధులు ఏడాదికే ప్రజలకు బేజారయ్యారు. జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. ఏడాది పాలనలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పనితీరుపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) సర్వే చేపట్టింది. ఏ ప్రభుత్వానికైనా కనీసం మూడేళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ప్రజలు విసుగు చెందడం గమనార్హం. ఆ నలుగురిపైనే ఎక్కువగా.. జిల్లాలో సగం మంది ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. పుట్టపర్తిలో పల్లె సింధూరరెడ్డి బదులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెత్తనం చెలాయిస్తుంటారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బదులు మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామిదే హవా సాగుతోంది. పెనుకొండలో మంత్రి సవిత బదులు ఆమె భర్త వెంకటేశ్వర్లు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎంపీగా పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించాల్సిన బీకే పార్థసారథి పెనుకొండ నియోజకవర్గంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఆ నలుగురిపై ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడ్రెస్ లేకున్నా.. అడగరా? సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చుట్టపుచూపుగా హిందూపురం నియోజకవర్గానికి వస్తుంటారు. ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడో కూడా గుర్తించలేరని చెబుతుంటారు. అంతేకాకుండా తన పీఏలు హిందూపురం వ్యాప్తంగా దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సీఎంకు బావమరిది కావడంతో ఆయన పనితీరుపై ఎలాంటి సర్వేలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అరాచకాలను అడ్డుకోరా? ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో అరాచకాలు వెలుగు చూశాయి. ఆమె పనితీరుపై ఎలాంటి సర్వే చేయకపోవడంపై సొంత పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి రేగింది. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు వెలుగు చూసినా పరిటాల కుటుంబానికి అధిష్టానం నుంచి ఎలాంటి హెచ్చరికలూ రాలేదని కూటమి నేతలు వాపోతున్నారు. కదిరిలో వన్మ్యాన్ షో కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వన్మ్యాన్ షో చేస్తున్నారు. కిందిస్థాయి నాయకులను ఎదగనీయకుండా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన నాయకులను దగ్గరకు కూడా రానీయడం లేదని వాపోతున్నారు. అయినా అధిష్టానం వద్ద మంచి మార్కులు ఎలా వచ్చాయని నాయకులు ఆలోచనలో పడ్డారు. జిల్లా కేంద్రానికి రాని మంత్రి శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తికి ఓ మంత్రి రావడమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒకట్రెండు సార్లు మినహా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే వ్యవహారం నచ్చలేదా? లేక అధికారులు తనకు నచ్చిన వారు లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తాడిపత్రిలో జేసీ దౌర్జన్యం.. ఎస్పీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతల బృందం అనంతపురం ఎస్పీ జగదీష్ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీకి తాడిపత్రిలోని పరిస్థితులను వివరించారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పెద్దారెడ్డి విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని వినతి పత్రం అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు.అనంతరం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలి. తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోంది. పెద్దారెడ్డిపై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘నేను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తగిన భద్రత కల్పించాలని రెండు మాసాల కిందటే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రపా.. రపా.. నరుకుతానంటూ జేసీ బెదిరిస్తున్నారు. నాకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయి. హింసకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి దుక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేది. కేవలం మున్సిపల్ చైర్మన్ జేసీ చెబితే పోలీసులు నడుచుకోవటం హాస్యాస్పదం. నాపై చేస్తున్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రిలోకి అనుమతించాలి. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గం. పెద్దారెడ్డి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య రాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేతల దౌర్జన్యాలు దేనికి నిదర్శనం. ఓ మాజీ ఎమ్మెల్యేని ఏడాది కాలంగా అడ్డుకోవడం దేశంలో ఎక్కడైనా ఉందా?. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో తాడిపత్రిలో నిరంకుశ పాలన జరుగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం’ అని అన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చే వారిని రప్పా.. రప్పా.. నరుకుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో హింసా రాజకీయాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులను పోలీసులు పట్టించుకోరా?. పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళితే పోలీసులకు అభ్యంతరం ఏంటి?. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘అధికార’ అండ.. మట్టి దందా
● దొడగట్ట చెరువులో భారీగా మట్టి దోపిడీ ● కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు డి.హీరేహాళ్(రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలం దొడగట్ట చెరువులో కొద్ది రోజులుగా భారీఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నాయకుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తొలుత ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా జేసీబీలతో టిప్పర్లలోకి లోడ్చేసి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సండూరు, రాంపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు ఒక్కో ట్రిప్పు మట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా వెనుక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన దొడగట్ట చెరువును ఆదివారం రైతులతో కలసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దులో మార్తల్ వద్ద నిల్వచేసిన సుమారు వంద ట్రిప్పుల మట్టిని పరిశీలించారు. అక్కడి నుంచే కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, మైనర్ ఇరిగేషన్ డీఈకి ఫోన్ చేసి.. మట్టి అక్రమ రవాణాను సత్వరం అడ్డుకోవాలని కోరారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్నారు. ఇసుక, మట్టితో పాటు ప్రకృతి సంపద కొల్లగొట్టడమేనా సమర్థ నాయకత్వం అంటే అని ప్రశ్నించారు. మెట్టు వెంట స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథ్రెడ్డి, నాయకులు ఎర్రగుంట కేశవరెడ్డి, మురడి మురళీమోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి ● ఎస్యూసీఐ (సీ) కేంద్ర కమిటీ సభ్యుడు అమర్నాథ్ అనంతపురం టవర్క్లాక్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎస్యూసీఐ(సీ) కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎస్యూసీఐ (సీ) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మభ్య పెట్టారని మండిపడ్డారు. అశాస్త్రీయ విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో గ్రాఫిక్ డిజైన్లను ప్రదర్శిస్తున్నారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. శ్రమ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
సిఫారసుకే పెద్దపీట
అనంతపురం సిటీ: ‘మనకు కావాల్సిన పిల్లలు వస్తున్నారు. జర చూసుకోండి. లెటర్ కూడా ఇచ్చి పంపుతున్నాం. వారు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇవ్వండి. లేదంటే రోడ్డు పాయింట్కు వేయండి. ఏ ఒక్కటీ మిస్ కావడానికి వీల్లేదు. అడిగినవన్నీ చేయాల్సిందే’ అంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు ఆదివారం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఓ వైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నా.. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫోన్ కాల్ను అధికారులు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారు ముందుగా రావాలని, లెటర్లు లేని వారిని పక్కన ఉండాల్సిందిగా సూచించారు. లెటర్లు స్వీకరించి వారు ఎక్కడికి పోస్టింగ్ కోరుకుంటున్నారో మరీ తెలుసుకుని కేటాయించారు. తొలి రోజు అనుభవంతో.. మలి రోజు ప్రశాంతం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి రోజు (శనివారం) నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారి.. ఆందోళనలతో ముగిసింది. ఈ అనుభవంతో మలి రోజు (ఆదివారం) అధికారులు తీసుకున్న కొన్ని చర్యలు సాఫీగా సాగేలా దోహదపడ్డాయి. అభ్యర్థులందరినీ బయటే ఉంచి.. కొందరిని మాత్రమే అనుమతిస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టడంతో తొక్కిసలాటకు తావు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ కొనసాగినా ఇంకా అభ్యర్థులు మిగిలే ఉన్నారు. లెటర్లు ఉన్న వారికే ప్రాధాన్యత.. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికే అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చారా.. అయితే రండి. మీకు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరి కొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. జెడ్పీ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో డిజిటల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ కొనసాగుతుండగా డీపీఓ నాగరాజునాయుడుకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ కనిపించారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ర్యాంక్లో తొలి స్థానంలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి ఓ అమ్మాయి లెటర్ తెచ్చుకున్నారు. ఒకే స్థానం కోసం ఇద్దరూ పోటీపడ్డారు. అయితే అప్పటికే ఆ స్థానం తొలి ర్యాంకర్ అబ్బాయికి కేటాయించగా.. అమ్మాయికి సర్దిచెప్పి మరో చోట అవకాశం కల్పించారు. అయితే ఏమాత్రం పలుకుబడి లేని వారు, ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చుకోలేకపోయిన వారు మదనపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా పశుసంవర్థక శాఖలో.. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారని సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కౌన్సెలింగ్కు ముందే అభ్యర్థులు మూడు స్థానాలను ఆప్షన్లగా చూపిస్తూ దరఖాస్తు చేసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక స్థానాన్ని కౌన్సెలింగ్కు పిలిచినప్పుడు కేటాయించాల్సి ఉంటుంది. అయితే పశుసంవర్ధక శాఖలో మాత్రం మీరు ఏవైనా మూడు మండలాలు కోరుకొని ఆప్షన్లు ఇచ్చి వెళ్లండి. అందులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామంటూ’ ఉద్యోగులను వెనక్కి పంపడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌన్సెలింగ్.. ఉమ్మడి జిల్లా యూనిట్గా సచివాలయ ఉద్యోగులకు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉండడంతో అర్ధరాత్రైనా సరే పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు పని చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్లో అధికారుల తీరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అధికారులకు ఫోన్ చేయించినా సరే మంచి ర్యాంకు ఉన్నా సరే దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం -
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి డిమాండ్ అనంతపురం టవర్క్లాక్: ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏపీపీటీడీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన టేబుల్పై ఉన్న ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యూటీ, టర్మినల్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలన,ఇ డబల్ డ్యూటీలకు సంబంధించి ఉద్యోగులకు ఇస్తున్న రెమ్యూనరేషన్ను మరింత పెంచాలని కోరారు. టిమ్స్ డ్యామెజీలపై చేస్తున్న రికవరీలను నిలుపుదల చేయాలన్నారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్ డౌన్ విషయంలో గ్యారేజీ సిబ్బందిని బాధ్యులను చేస్తూ పనిష్మెంట్ ఇస్తున్నారని, ఈ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఖాన్, రామకృష్ణ, కొండయ్య, మల్లికార్జున, విశ్వనాథరెడ్డి, గోపాల్, ఓబులరత్నం తదితరులు పాల్గొన్నారు. బదిలీల తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్ల అసంతృప్తి అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు హాజరు కాగా, వారి ఎస్ఆర్లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, ఏడీహెచ్ దేవాందన్, సూపరింటెండెంట్ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్, డీడీలు, సూపరింటెండెంట్ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్కు 180 మంది విలేజ్ అనిమిల్ హస్బెండరీ అసిస్టెంట్లు హాజరయ్యారు. ట్యాంకర్ దగ్ధం గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివారున కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి గ్రామం వద్ద ఆదివారం టైరు పేలి మంటలు చెలరేగడంతో ఓ ట్యాంకర్ దగ్ధమైంది. గుత్తి నుంచి ఆదోని వైపు బెల్లం పాకంతో వెళ్తున్న ట్యాంకర్ గుత్తి–పెండేకల్లు రైలు మార్గంలోని రైల్వే బ్రిడ్జి కిందకు చేరుకోగానే టైరు పేలింది. దీంతో మంటలు చెలరేగి ట్యాంకర్కు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని రైల్వే అధికారులతో పాటు జొన్నగిరి పోలీసులు పరిశీలించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి నార్పల: మండలంలోని వెంకటాంపల్లిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త మహబూబ్పీరా ఇంటిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఏడుగురు ఆదివారం రాళ్లతో విరుచుకుపడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు... తన ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలాన్ని గతంలో మసీదుకు మహబూబ్ పీరా విరాళం కింద ఇచ్చాడు. ఆ స్థలంలో గ్రామంలోని ముస్లిములంతా కలసి మసీదుతో పాటు ప్రహరీనీ నిర్మించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు జోక్యం చేసుకుని మసీదుకు ప్రహరీ నిర్మాణాన్ని ఆక్షేపిస్తూ మహబూబ్పీరాను నిలదీశారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మహబూబ్పీరాపై దాడికి ప్రయత్నించడంతో ఆయన ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నాడు. దీంతో ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఘటనలో మహబూబ్పీరా కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు నడిమిదొడ్డి రహీం, అప్పడు, హుసేన్పీరా, కాదర్వలి, హాజీ వలి, వలి, హాజీవలిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. వ్యక్తి దుర్మరణం డి.హీరేహాళ్(రాయదుర్గం): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. డి.హీరేహాళ్ గ్రామానికి చెందిన షబ్బీర్ (45) కుమార్తె బళ్లారిలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం బళ్లారికి వెళ్లి కుమార్తెను పలకరించి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన షబ్బీర్.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే హెల్మెట్ జారి కిందపడడంతో బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుకనే వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెలర్ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి కేసు నమోదు చేశారు. -
మద్యం మత్తునే హత్యకు కారణం!
గతంలో వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. అయినా మద్యం వారి మధ్య మాటలు కలిపింది. అదే రోజే మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసి ఒకరి హత్యకు కారణమైంది. నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో ఈ నెల 23న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అనంతపురం: చిన్నపాటి వాదన కారణంగా ఘర్షణ పడి ఓ యువకుడిని హతమార్చిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఏం జరిగిందంటే.. ఈ నెల 24న ఉదయం అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పార్క్లో పడుకుని ఉన్న వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్పాత్ బ్రిక్తో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. హతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి నిర్ధారించారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ ఎన్.జగదీష్ కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేర పరిశోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తొలుత సిదానందను ఆయన భార్య తరఫు వారు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి అనుమానాల్లో వాస్తవం లేదని నిర్ధారించారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో నేర పరిశోధనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మద్యం షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన అనంతరం ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలు మార్గంలో తిరుపతికి చేరుకున్నట్లుగా పసిగట్టారు. అనంతరం పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సిదానందను హత్య చేసినట్లుగా అంగీకరించారు. భార్యను దూషించాడనే... అనంతపురంలోని ఐదో రోడ్డు భవానీ గుడి వద్ద నివాసముంటున్న ఎరికల నాగయ్య కుమారుడు ఎరికల లక్ష్మన్న అలియాస్ అలీ/ చిన్న లింగన్న/ అంజి, కళ్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్య నగర్లో నాగులుకట్ట వద్ద నివాసముంటున్న తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ బొప్పాయి, దోసకాయ లోడింగ్ పనులు చేస్తూ, తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ నెల 23న రాత్రి బళ్లారి బైపాస్ సర్కిల్ సమీపంలో మద్యం షాపు వద్ద తాగుతూ అప్పటికే అక్కడున్న సిదానందతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎరికల లక్ష్మన్నను సిదానంద బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మన్న భార్యనుద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మన్న తన స్నేహితుడు వెంకటరెడ్డితో కలసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పార్కులో సేద తీరుతున్న సిదానంద వద్దకు చేరుకుని నుదుటిపై ఫుట్బాత్ బ్రిక్తో దాడి చేశారు. సిదానంద అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలులో తిరుపతికి వెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు కె.ప్రసాద్, పి.విజయభాస్కర్ నాయుడు, టెక్నికల్ టీంను ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. సిదానంద హత్య కేసులో వీడిన మిస్టరీ చిన్నపాటి గొడవ కారణంగా హత్య నిందితుల అరెస్ట్ -
సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్ను డీఆర్ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్ఆర్లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి : ఎస్టీయూ అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎస్.రామాంజనేయులు పేర్కొన్నారు. పీఆర్సీతో పాటు డీఏ కూడా ప్రకటించాలన్నారు. బదిలీ అయిన టీచర్లకు పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలకు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న టీచర్ల స్థానాల్లో సర్దుబాటు కింద ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ జి.కిషోర్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, రామకృష్ణ, నరసింహ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరణ?
పామిడి/పుట్టపర్తి: అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు తెలిపిన మేరకు... పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న కమ్మరి రామాచారి, పుష్పవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్పెంటర్ వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం రామాచారి తన పెద్ద కుమార్తె శ్రావణి(25)ని శ్రీసత్యసాయి జిల్లా బుక్క పట్నం మండలం కృష్ణాపురానికి చెందిన గోవిందాచారి, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు నీలకంఠాచారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ.లక్షలు విలువ చేసే బంగారు, నగదు ఇచ్చారు. పెళ్లి అనంతరం నీలకంఠ కృష్ణాపురంలోనే వేరు కాపురం పెట్టాడు. వ్యవసాయంతో పాటు వేరుశనగ పప్పు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపారానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు డబ్బు అవసరం కావడంతో శ్రావణి తల్లిదండ్రులు నీలకంఠకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం శ్రావణిని నీలకంఠ వేధించడం మొదలు బెట్టాడు. తరచూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీనికి తోడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు మానుకోవాలని భార్య పదేపదే చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నీలకంఠాచారి పథకం ప్రకారం శనివారం రాత్రి నిద్రపోతున్న భార్య గొంతునులిమి హతమార్చి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం పామిడిలోని అత్తామామకు ఫోన్చేసి విషయం తెలిపాడు. అక్కడకు చేరుకున్న రామాచారి దంపతులు... తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యగా నిర్ధారించుకుని నిలదీసేలోపు నీలకంఠాచారి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అందే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ విజయ్కుమార్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కృష్ణాపురంలో ఘటన మృతురాలు పామిడి నివాసి కుమార్తె కుటుంబ సభ్యులు నిలదీస్తుండగానే భర్త పరారీ -
విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టమైన హామీనిచ్చిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కి విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు.కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ–స్టాంప్ కుంభకోణం రాష్ట్ర మంతటా వ్యాపించి ఉంటుందని, ఆ దిశగా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, కార్యదర్శి వర్గ సభ్యుడు సంజీవప్ప, నియోజకర్గ కార్యదర్శి గోపాల్, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ -
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం : యూటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ బడులను కాపాడుకుందామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైతిక విలువలు నేర్పుతున్న ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య మాట్లాడుతూ.. పాఠశాల ప్రారంభ దినాల నుంచి విద్యలో వెనుకబడిన విద్యార్థులకు చదువుపై ఆసక్తిని కల్పించేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు అబ్దుల్ వహాబ్ ఖాన్, శేఖర్, రాముడు, సుబ్బరాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
సీటు.. ‘తమ్ముళ్ల’తో తలపోటు!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బి.ఉజ్జినప్ప. బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామం. ఈయన భార్య మృతి చెందింది. కూతురు బి.హారిక 7వ తరగతి పూర్తయింది. ఈసారి 8వ తరగతికి వెళ్తోంది. బుక్కరాయ సముద్రం కేజీబీవీలో 3, కురుగుంట కేజీబీవీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఆ తర్వాత తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రమంలో ఆ రెండు కేజీబీవీల్లోనూ ఖాళీ సీట్లయితే భర్తీ చేశారు కానీ తల్లిలేని హారికకు కాకుండా తల్లిదండ్రులిద్దరూ ఉన్న పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ వ్యవహారం వెనుక కొందరు మంత్రాంగం నడిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. హారిక తండ్రి రోజూ సమగ్రశిక్ష కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం రాజకీయ పైరవీలు, అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల ఒత్తిళ్లు వెరసి అర్హులైన ఆడ పిల్లలకు అవకాశం దక్కకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 32 కేజీబీవీలున్నాయి. ప్రతి కేజీబీవీలోనూ ఈ విద్యా సంవత్సరం (2025–26)లో 6వ తరగతిలో చేరేందుకు 40 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు 40 సీట్ల చొప్పున భర్తీకి చర్యలు తీసుకున్నారు. అంతా ఆన్లైన్ విధానంలో రాష్ట్ర స్థాయి అధికారులే ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే మిగులుగా ఉన్న సీట్ల భర్తీ జిల్లా అధికారులకే ఇవ్వడం తలనొప్పిగా మారింది. మా వారికి సీటు ఇవ్వాల్సిందే.. ఖాళీ సీట్ల భర్తీకి జాబితా చాంతాడంత తయారైంది. దీంతో ఎవరికివారు పైరవీలు చేస్తూ జిల్లా అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లపై ఒత్తిళ్లు చేస్తున్నారు. కొందరు చోటా నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకొచ్చి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఓ మంత్రి తన నియోజకవర్గంలోని కేజీబీవీ ఎస్ఓపై చోటా నాయకులు తీవ్ర ఒత్తిడి చేసి ‘మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను తీసేయిస్తాం’ అంటూ హెచ్చరించడంతో ఆమె అంతేస్థాయిలో తిరగబడ్డారు. అయితే ఏమి జరిగిందే ఏమో తెలీదుకాని ఇటీవల ఖాళీ సీట్ల భర్తీకి వచ్చేసరికి వారు ఏది చెబితే అందుకు ఆమె అంగీకరిస్తూ జిల్లా అధికారులకు సిఫార్సు చేయడం విశేషం. కేజీబీవీ ప్రవేశాలకు ఎస్ఓలు, అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు అర్హులైన ఆడబిడ్డలకు అన్యాయం నిబంధనల మేరకే భర్తీ కేజీబీవీల్లో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ విషయంలో నిబంధనల మేరకే ముందు కెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితోనే భర్తీ చేస్తున్నాం. తల్లిదండ్రులు లేని, తల్లి లేక తండ్రి ఉన్న బాలికలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత డ్రాపౌట్స్, పేద పిల్లలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. – టి.శైలజ, సమగ్రశిక్ష ఏపీసీ -
ఇక చూస్తూ ఊరుకొనేది లేదు
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అందులో పోలీసు వ్యవస్థ ఒకటి. జిల్లాలో మద్యం మాఫియా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా, అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోరు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రక్షణ కల్పిస్తూ తాడిపత్రికి పంపాలి. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయ ఆవరణంలోనే భారీ ధర్నా చేస్తాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఆది వారం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న అనంత, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ శ్రేణులు నగరంలోని పెద్దారెడ్డి క్యాంపు ఆఫీస్కు చేరుకుని ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపాలని ఈ ఏడాది ఏప్రిల్ 30న డీజీపీ, ఎస్పీలను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాము ఎస్పీ జగదీష్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 25న ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశించిందని, ఆ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి పెద్దారెడ్డి వెళ్లారన్నారు. అయితే, పెద్దారెడ్డి అక్కడ ఉండకూడదంటూ పోలీసులు బలవంతంగా అనంతపురం తరలించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారో లేదో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.హైకోర్టు, చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారా.. లేక కూటమి ప్రభుత్వం, డీజీపీ ఆదేశాలతో ముందుకెళ్తున్నారా అని ప్రశ్నించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించారా అని పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు. ప్రభాకర్ రెడ్డికి ఎందుకంత భయం.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లా పోలీసులు వ్యవహరిస్తుండడం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తనను చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. ‘నన్ను చూస్తే ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుందా..’ అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా వైఎస్సార్ సీపీ బలపడుతుందనే ఆలోచనతో వారున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, హైకోర్టును మరోసారి ఆశ్రయించి, వారి ఉత్తర్వుల మేరకే తాడిపత్రిలో అడుగుపెడతానని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు తామూ అదే రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ‘నేను రాజకీయాలు చేయకపోతే, అక్కడ ఉండలేకపోతే నువ్వు తాడిపత్రిని సరిహద్దుగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి చురకలు అంటించారు. అనంతపురంలో ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుంటామని, ఏది చేతనైతే అది చేసుకోవాలని పేర్కొన్నారు. పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలి లేకుంటే ఎస్పీ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేస్తాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన పార్టీ నేతలు -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్ డేట్ ఆధారంగా జాబితా ఎలా ఇస్తా రంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్ ఆధారంగా జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదంటే కౌన్సెలింగ్ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై ఏడీలు రూప్లానాయక్, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్ అయూబ్తో సమీక్షించారు. ఆయన సూచన మేరకు ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీ కౌన్సెలింగ్ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. సీనియార్టీ జాబితాపై తీవ్ర అభ్యంతరం ఆరు గంటలు ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభం -
జిల్లా అంతటా ఆదివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య అనంతపురం: అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. టౌ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు.. కడపకు చెందిన మునయ్య కుమారుడు సుంకర మునిశేఖర్ (50) ఆదివారం అరవింద నగర్లో పరిటాల రవి ఇంటి సమీపంలోని సాయి కొరల్ కౌంటీ అపార్ట్మెంట్లో ఉన్న తన స్నేహితుడు జయప్రకాష్ నాయుడును కలవడానికి వచ్చాడు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి జయప్రకాష్ నాయుడు వెళ్లిపోగా.. మునిశేఖర్ అక్కడే ఉన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో అపార్ట్ మెంట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని సీఐ శ్రీకాంత్యాదవ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, మునిశేఖర్ గతంలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినట్లు తెలిసింది. స్థానిక అశోక్నగర్లోని మినర్వా స్కూల్ సమీపంలో ఓ గదిలో అద్దెకున్నట్లు సమాచారం. భార్య లక్ష్మితో 2015 నుంచి మునిశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్య, పిల్లలు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. -
తాడిపత్రిలో పోలీసు రాజ్యం
సాక్షి టాస్క్ ఫోర్స్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన సొంతింటికి చేరుకున్నారు. ఈ విషయం తెలియగానే వందలాది మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవడానికి బయలుదేరారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. కేతిరెడ్డి ఇంటిచుట్టూ వలయాకారంలో బారికేడ్లు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కేతిరెడ్డి ఇంటి పరిసరాల్లోకి సైతం ఎవరూ వెళ్లకుండా నిలువరించారు. బలవంతంగా తరలింపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న ఏఎస్పీ రోహిత్కుమార్, సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ధరణి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆయనను బయటకు రావాలని కోరారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి మాట్లాడుతూ.. ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్తానని ఎన్నిసార్లు ఎస్పీకి విన్నవించుకున్నా ఏదో ఒక సాకు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఎవడు పడితే వాడితో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వం అంటూ కారుకూతలు కూయిస్తుంటే చూస్తూ కూర్చోవాలా? చేతనైతే పోలీసులు లేకుండా వాడు (జేసీ ప్రభాకర్రెడ్డి), అతడి కార్యకర్తలు నన్ను ఆపమనండి’ అంటూ సవాల్ విసిరారు. ఏఎస్పీతో మాట్లాడాలని సీఐ సాయిప్రసాద్ సూచించడంతో ఆయనతో మాట్లాడేందుకు పెద్దారెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయనను కార్యకర్తల తోపులాట మధ్య బలవంతంగా పోలీస్ జీపులో అనంతపురం తరలించారు. జేసీ ప్రభాకర్ ఓవరాక్షన్ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారన్న సమాచారంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఓవరాక్షన్ చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో ఇంటికి పిలిపించుకున్నారు. ట్రాక్టర్లలో రాళ్లను తీసుకొచ్చి.. రాళ్ల దాడి చేసేందుకు కేతిరెడ్డి ఇంటివైపు బయలుదేరారు. వారిని సీఐ శివగంగాధర్రెడ్డి, సిబ్బంది జేసీ ఇంటివద్దే నిలువరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారన్న సమాచారంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కోర్టు ఉత్తర్వులిచ్చినా.. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. రాళ్ల దాడులకు దిగారు. పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. స్వయానా హైకోర్టు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయినా అనంతపురం జిల్లా పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం పేరుతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడంలేదు.ఏదో సాకుతో వాయిదా వేస్తూనే ఉన్నారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి విసిగిపోయారు. పదే పదే ఎస్పీకి లేఖలు రాసినా స్పందించలేదు. పోలీసులు తనకు రక్షణ కల్పించే విషయంలో సహకరించబోరన్న విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. మాజీ ఎమ్మెల్యేకు జిల్లా పోలీసులు రక్షణ కల్పించలేక ఆయన్ను బలవంతంగా అనంతపురం తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేక జిల్లా ఎస్పీ సైతం తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ‘రప్పా.. రప్పాలాడిస్తాం’ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’అని జేసీ అన్నారు. -
పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు మండిపతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వేధిస్తున్నారు..
అనంతపురం జిల్లా: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వేధింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కనంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భార్య, పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు. ‘సేవ్ లోకేశ్ అన్న’ అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. స్థానిక అంశాలపై ప్రసాద్ ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీతో విభేదించారు. ఆమె తీరుపై పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను ధిక్కరించినందుకుగానూ అతడిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ మరోమారు మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో నిరసన తెలిపాడు. -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపైజేసీ కక్ష సాధింపు
● అధికారులను ఉసిగొల్పి ఇంటికి కొలతలు తాడిపత్రి టౌన్: ఆక్రమణల పేరుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు రమేష్రెడ్డి, ఫయాజ్బాషాపై అధికారులను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడిన ఆయన.. శనివారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి మున్సిపల్ అధికారులను ఉసిగొల్పారు. తాడిపత్రి పట్టణంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దారెడ్డి ఇంటి పరిసరాలు, లోపల టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత కొలతలు వేసి రికార్డు చేశారు. భారీ బందోబస్తు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు కొలతలు వేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు.కేతిరెడ్డి ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో సిబ్బందిని మోహరించారు. విధ్వంస పాలన.. జేసీ ప్రభాకర్రెడ్డి విధ్వంస పాలనకు తెరలేపాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణ అభివృద్ధి గురించి మరిచి రోడ్లు కొడతా..సమాధులు కొడతా.. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు కొడతా అంటూ రోజూ అలజడి సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. మొన్నటి వరకు తమ పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేసి నేడు నా ఇంటికి కూడా కొలతలు వేయించారని విమర్శించారు. తాను చట్టానికి లోబడే ఉంటానని స్పష్టం చేశారు. సచివాలయాల్లోనే సబ్ డివిజన్కు రుసుం స్వీకరణ అనంతపురం అర్బన్: ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ కింద దరఖాస్తు రుసు మును సచివాలయాల్లోనే సిబ్బంది స్వీకరించారు. దరఖాస్తు రుసుం స్వీకరించని అంశంపై ‘సాక్షి’లో ‘అమలుకాని ఆదేశాలు’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సబ్డివిజన్ కోసం వచ్చే రైతుల నుంచి దరఖాస్తు రుసుం స్వీకరించాలని సిబ్బందిని సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ ఆదేశించారు. జేసీ ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రైతు కిష్టకు కొర్రపాడు–2 (బోడిగాని దొడ్డి) సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి సబ్డివిజన్కు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఆర్ఓలు, సర్వేయర్లకు నేడు బదిలీల కౌన్సెలింగ్ అనంతపురం అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో 328 మంది గ్రేడ్–2 వీఆర్ఓలు ఉండగా ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 121 మంది ఉన్నారు. మొత్తం 130 ఖాళీలను చూపించారు. ఇక గ్రామ సర్వేయర్ల బదిలీలు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో జరగనున్నాయి. -
పని ఒత్తిడి తగ్గించండి
అనంతపురం అర్బన్: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ ఎన్యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, ప్రొటోకాల్ విధులు ఇలా పలు రకాలు పనులు పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఇదే క్రమంలో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఫిర్యాదులు వచ్చాయంటూ తమపై చర్యలు తీసుకుంటూ మరింత మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల్లో చాలామంది మహిళలు, వయసు పైబడిన వారు ఉన్నారన్నారు. వీరి గురించి అధికారులు ఆలోచించాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని సచివాలయంలో జరిగే సంక్షేమ పథకాల సర్వే విధుల నుంచి తొలగించాలన్నారు. పీఎస్ లాగిన్కు సంబంధించి పీజీఆర్ఎస్ సమస్యలను ఆయా శాఖల వారికే కేటాయించాలన్నారు. పీఎస్ల అన్ని గ్రేడ్లలోనూ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి పారిశుధ్య పనులతో మొదలుకొని, గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు మనమిత్ర, ఈ–కేవైసీ, ఎంబీయూ, జియో ట్యాగింగ్, బియ్యం కార్డు, తదితర వాటితో పాటు రోజూ రెండు లేదా మూడు వెబెక్స్, గూగుల్ మీటింగ్లు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. ఇవి కాకుండా వాట్సాప్ మెసేజ్లు, స్ప్రైడ్షీట్, ఫొటోలు, వీడియోల అప్డేట్లు, ప్రజల మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్ సేకరణ వంటి పనులు చేస్తున్నారన్నారు. ఇలా విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటరాముడు, కార్యదర్శి రాఘవేంద్ర, సభ్యులు శివమూర్తి, శ్వేత పద్మిని, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
వంకలనూ వదలని తమ్ముళ్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలో వాగులు, వంకలు, చెరువులు, రస్తాలను సైతం ఆక్రమించేస్తున్నారు. వంకలు, వాగుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ● బడా నేతల పేర్లతో బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంపద సృష్టి అంశం దేవుడెరుగు కానీ, టీడీపీ నేతలు మాత్రం పేట్రెగిపోయి అక్రమార్జనపై దృష్టి సారించారు. పెద్దవడుగూరు మండలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగానే కనిపిస్తోంది. మండల పరిధిలోని క్రిష్టిపాడు, ఆవులాంపల్లి, కొండూరు గ్రామాల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు బరితెగించి మట్టి, ఇసుక దందాకు తెరలేపారు. ఇదేమని ప్రశ్నించిన అధికారులను బడా నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఈ తలనొప్పి తమకెందుకు అనే ధోరణితో అధికారుల్లో ఉదాసీనత వ్యక్తమవుతోంది. తగ్గు ప్రాంతాల చదును కోసమని రెండు వారాల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసుకునేందకు కొందరు రైతులు వంకల్లోని మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్ను గుర్తించిన స్థానిక టీడీపీ కార్యకర్తలు వెంటనే మట్టి తరలింపులను అడ్డుకున్రాఉ. గ్రామాల్లో ఉన్న విబేధాలతో గొడవలకు తెరలేపారు. దీంతో రైతుల తమ పొలాలకు మట్టిని తరలించుకోవడం మానేశారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. మండల కేంద్రం నుంచి కొండుపల్లికి వెళ్లే మార్గంలోని గ్రామ శివారున ప్రధాన రహదారి పక్కన ఉన్న వంకలోని మట్టిని అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోసాగారు. జేసీబీలను పెట్టి మరీ మట్టి తవ్వకాలు చేపట్టడంతో రోజుల వ్యవధిలోనే వంకలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. దిక్కున్న చోటు చెప్పుకోండి మట్టి అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే బడా నాయకుల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నామని, దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకొండి అంటూ దౌర్జన్యానికి తెరలేపడంతో సామాన్యులు మాట్లాడలేకపోతున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వంకలోని మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా వంకలో మట్టి తరలింపులు కొనసాగిస్తుండడంతో ఇప్టికే 15 అడుగుల లోతుతో, నాలుగు మీటర్ల వెడల్పుతో, సుమారుగా 20 మీటర్లకు పైగా పొడవునా భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులు, వంకల్లో మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.అనుమతులు ఇవ్వలేదు పెద్దవడుగూరు మండలం నుంచి మట్టి, ఇసుక తవ్వకాలు, తరలింపులకు అనుమతులు ఇవ్వలేదు. నిబంధనలు ఉల్లంఘించి మట్టి, ఇసుక అక్రమ తరలింపులు చేపడితే వారిపై చట్ట పరౖమైన చర్యలు తీసుకొంటాం. మట్టి, ఇసుక తరలించాలంటే మైనింగ్ అండ్ జియాలజీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. – ఉషారాణి, తహసీల్దార్, పెద్దవడుగూరు -
ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ గందరగోళంగా తయారైంది. పారదర్శకత కరువైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పలుకుబడి, డబ్బు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, సీనియార్టీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అసిస్టెంట్లు మండిపడుతున్నారు. ప్రణాళికేదీ...? కలెక్టర్ అనుమతితో ఈనెల 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ)కు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, సూపరింటెండెంట్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి, ప్రణాళిక లేకుండా చేపట్టడంతో ఏం జరుగుతుందనే వీఏఏలు ఆందోళనతో ఎగబడ్డారు. ర్యాంకులు, మెరిట్ ప్రకారం వీఏఏలు పట్టుబట్టగా, అధికారులు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం కొనసాగిస్తామని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గంట పాటు నిలిపేశారు. చివరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్కు అధికారులు అంగీకరించారు. సోమవారం ఉత్తర్వులు.. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పోస్టులు 282 ఉండగా... అందులో పనిచేస్తున్న వారు 248 మంది ఉన్నారు. అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఏఏలు 229 మంది బదిలీకి అర్హత ఉన్నట్లు తెలిపారు. మరో 19 మంది రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ఉద్యానశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323 మంది వీహెచ్ఏలు ఉండగా అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 280 మందికి బదిలీలు చేపట్టారు. మరికొందరు రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. శనివారం రెండు జిల్లాల నుంచి తరలివచ్చిన వీహెచ్ఏలు ఆప్షన్లు ఇచ్చేశారు. సోమవారం సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆప్షన్లు ఇవ్వడానికి వీహెచ్ఏలు కూడా ఇబ్బంది పడ్డారు. పట్టుపరిశ్రమశాఖ అసిస్టెంట్ల బదిలీలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎస్కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కరువు -
‘స్టాంప్’ కుంభకోణంపై చంద్రబాబు నోరు విప్పాలి
అనంతపురం టవర్క్లాక్: నకిలీ స్టాంపుల కుంభకోణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు విప్పాలని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తెల్గీ కుంభకోణాన్ని తల దన్నేలా ప్రస్తుత స్టాంపుల కుంభకోణం ఉందన్నారు. ఈ స్కామ్ను ఒక వ్యక్తిపై తోసి సురేంద్రబాబు తప్పించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ స్కామ్ సంబంధించి 40 డాక్యుమెంట్లతో రెండు డాక్యుమెంట్లతోనే రూ.900 కోట్లు, మరో డాక్యుమెంటులో రూ.700 కోట్లు, ఇంకో డాక్యుమెంట్లో రూ.20 కోట్ల వరకు అవకతవకలు పాల్పడినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు అనంతపురంలో కార్యాలయం ఉంటే కళ్యాణదుర్గంలో డాక్యుమెంట్లు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ఎస్ఆర్సీ ఇన్ఫ్రాకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్నూ విచారణ చేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరిందా లేదా అని చూడాలన్నారు. ధాబా నిర్వాహకురాలిపై దాడి గుత్తి రూరల్: ధాబాను తగులబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులు.. అడ్డుకోబోయిన నిర్వాహకురాలిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు... ఊబిచెర్ల గ్రామానికి చెందిన ఓబులేసు, అంజలి దంపతులు గ్రామ శివారు 44వ నంబరు జాతీయ రహదారి పక్కన ధాబా హోటల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాబా మూసివేసిన అనంతరం అంజలి అక్కడే నిద్రించింది. అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ధాబాలోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడికి అంజలి నిద్రలేచి కేకలు వేసి,అడ్డుకుంది. దీంతో వారు అంజలిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కేకలు విని సమీపంలోని వారు వస్తుండటం గమనించిన దుండగులు ద్విచక్రవాహనం వదిలి పారిపోయారు. గాయపడిన అంజలిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు దొంగలా.. లేక ఇతర కారణాలతో దాడి చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అడు!్డ
సాక్షి టాస్క్ఫోర్స్: రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ పేర్లు ముద్రించడాన్ని సహించలేక కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాహకులకు అధికారులు నోటీసు లిచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. వివరాలు.. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు 2021 ఏప్రిల్లో తీర్మానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు విగ్రహ ఏర్పాటుకు తహసీల్దార్, ఎంపీడీఓ అనుమతి తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చందాలు వసూలు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూ.2 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ రూ.7 లక్షల విరాళం అందించారు. పలువురి ద్వారా మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసిన భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు రాప్తాడులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల క్రితమే ఉత్సవానికి సంబంధించి పాంప్లేట్లు కొట్టించి అందరికీ పంచారు. ఆ రెండు పేర్లు తొలగించండి..! విగ్రహావిష్కరణ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహోదగ్రులైనట్లు తెలిసింది. అధికారులకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, సాకే రాజేష్ కుమార్ పేర్లు ఉండకూడదని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఎలాగోలా కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ నిర్వాహకులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.. నోటీసులపై భీమ్ రామ్ యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్, వైస్ ప్రెసిడెంట్ బాల నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. 2021 నుంచి పనులు జరుగుతున్నా అధికారులు ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. పార్టీలకతీతంగా చందాలు వసూలు చేశామన్నారు.పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పేర్లు తొలగించి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని సమాచారమిచ్చారన్నారు. సర్పంచు సాకే తిరుపాల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ కూడా దళితులే అని, అయినా విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ అడ్డు పడడం దళిత జాతికే సిగ్గు చేటన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్కుమార్ పేర్లు ఉండటంతో కక్ష సాధింపు రాప్తాడులో ఆగిపోయిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ చేపట్టాలి
అనంతపురం కార్పొరేషన్: ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అక్రమాలపై విచారణకు, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 30 రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’లో కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన రూ.1150 కోట్ల పంచాయతీరాజ్ నిధులను సీఎం చంద్రబాబు ఇతర పనులకు బదలాయిస్తే.. ఎన్నికలకు ముందు మీ గొంతుకనవుతా.. ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత శాఖకు చెందిన డబ్బులు ఇతర అవసరాలకు వాడితే గ్రామాభివృద్ధి ఎక్కడ సాధ్యపడుతుందని ప్రశ్నించారు. సర్పంచ్లకు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 11 రద్దు చేసి.. 1,350 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇచ్చి 10 నెలలుగా జీతాలు విడుదల చేయలేదన్నారు. గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నును స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమచేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిరణ్, నాయకులు అంజన్రెడ్డి పాల్గొన్నారు. -
ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్
వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. సిగ్నల్ లోపం.. ఆగిన రైలుతాడిపత్రి రూరల్: కోమలి రైల్వే స్టేషన్లో అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి ధర్మవరం – మచిలీపట్టణం ఎక్స్ప్రెస్ గంటకు పైగా నిలిచిపోయింది. తాడిపత్రి రైల్వే స్టేషన్కు రాత్రి 7.24 గంటలకు రావాల్సి ఉండగా.. సిగ్నల్ లోపం కారణంగా 8.33 గంటలకు వచ్చింది. రెండు రోజుల క్రితం అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాడిపత్రి రైల్వే స్టేషన్లో అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన ప్యానల్ బోర్డు ఏర్పాటు చేశారు. వారం క్రితం కోమలి రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున ఒక దుండగుడు సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను తొలగించారు. సిగ్నల్ పడకపోవడంతో స్టేషన్ బయట నిలిచి ఉన్న రైలులోకి చొరబడిన దుండగుడు ప్రయాణికురాలు వనజాక్షి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమైందన్న భయం ప్రయాణికుల్లో ఏర్పడింది. సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడ్డ సాంకేతిక లోపం వల్ల రైలు నిలిచిపోయిందని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సిగ్నల్ వ్యవస్థను పునరుద్దరించి రైలును ముందుకు పంపించారు. రైల్లో ప్రయాణికురాలి మృతి గుత్తి: రైల్లో ప్రయాణిస్తున్న మహిళ హైషుగర్తో కుప్పకూలి మృతి చెందింది. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... బెంగళూరులోని యలహంకకు చెందిన లక్ష్మీబాయి (53) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇటీవల పూరి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ‘పూరి ఎక్స్ప్రెస్’లో యలహంకకు బయల్దేరారు. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చినపుడు లక్ష్మీబాయి షుగర్ పెరిగిపోయి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఎంత లేపినా లేవలేదు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీబాయి మృత దేహాన్ని జీఆర్పీ పోలీసులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఈ-స్టాంపుల కుంభకోణం.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్
సాక్షి,అనంతపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు చేధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 15 వేల నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 100 రూపాయల స్టాంప్ల సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంప్గా నిందితులు మార్చారు. ఫోటో షాప్లో ఎడిట్ చేసి నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు తేలింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 481 నకిలీ ఈ-స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ అసలు కథఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలుఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది. ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచ్చిందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెద్దారెడ్డి ఇంటి కూల్చివేతకు కూటమి కుట్ర!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపు పీక్ స్టేజ్కు చేరుకుంది. పెద్దారెడ్డిని టార్గెట్ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు.. ఇప్పటికీ ఆయనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. ఇక, తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈరోజు పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన కనిపించలేదు. దీంతో, స్థానిక వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. రోడ్డు భద్రతపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోలతో కలసి ఎస్పీ మాట్లాడారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను చేర వేసే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ప్రమాదాలకు గల కారణాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 19 వేల మందిపై కేసు నమోదు ఈ ఏడాది మే1వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 19,982 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. వీరిలో హెల్మెట్ దరించకుండా డ్రైవింగ్ చేసిన 544 మంది, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపిన 749 మంది, డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ.. ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 13,892 మంది, మద్యం సేవించి వాహనాలు నడిపిన 282 మంది ఉన్నారన్నారు. వీరికి రూ.56,96,885 జరిమానా విధించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజగోపాల్, జాతీయ రహదారి శాఖ పీడీ తరుణ్, పంచాయతీరాజ్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు చర్యలు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్సీ పి.జగదీష్ ఆదేశించారు. నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ జగదీష్ ఆదేశం -
సీఆర్ఎంటీలకు బదిలీ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల (సీఆర్ఎంటీ)కు ‘బీ కాంప్లెక్స్’ల బదిలీ టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో మొన్నటి వరకు మొత్తం 155 క్లస్టర్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం రీ–ఆర్గనైజేషన్ ప్రక్రియ చేపట్టడంతో వివిధ నిబంధనలతో వాటిని 135కు కుదించారు. దీంతో మిగులుగా ఉండే సీఆర్ఎంటీఎల్లో గుబులు రేగుతోంది. తమను ఎక్కడికి సర్దుబాటు చేస్తారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సర్దుబాటు పేరుతో అన్యాయం 1 నుంచి 10 తరగతులు ఉన్న క్లస్టర్ స్కూళ్లలో కొత్తగా ‘బీ క్లస్టర్లు’ తీసుకొచ్చారు. ఇలా జిల్లాకు 20 బీ క్లస్టర్ స్కూళ్లు వచ్చాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం పని చేస్తున్న మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో ఎక్కువగా ఉండడంతో సీఆర్ఎంటీలు భయపడుతున్నారు. అనంతపురం అర్బన్ పరిధిలో 12 కాంప్లెక్స్లుంటే ఆరు రద్దయ్యాయి. మరో నాలుగు కొత్తగా వచ్చాయి. అంటే మొత్తం 10 క్లస్టర్ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడ 12 మంది సీఆర్ఎంటీలు పని చేస్తున్నారు. మిగులుగా ఉన్న ఇద్దరిని పక్క మండలాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. సమీపంలో అంటే గార్లదిన్నె మండలంలో ఒక బీ క్లస్టర్ స్కూల్ ఉంది. మరొకటి దరిదాపుల్లో లేదు. అలాగే నార్పల మండలంలో ఒక సీఆర్ఎంటీ మిగలగా, చుట్టుపక్కల మండలాలైన శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురంలో ఖాళీలు లేవు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని బాధిత సీఆర్ఎంటీలు వాపోతున్నారు. జీతం అక్కడ...పని ఇక్కడ! మరోవైపు సీఆర్ఎంటీలు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అదే మండలాల్లోనే ఉంటారని జీతం సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ‘బీ కాంప్లెక్స్’లను తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న సీఆర్ఎంటీలు బీకాంప్లెక్స్కు కేటాయించినా జీతాలు అక్కడ తీసుకుంటూ పని మాత్రం ప్రస్తుతం చేస్తున్న చోటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. భవిష్యత్తులో ప్రతి నెలా ఇక్కడ పని చేస్తూ జీతాలు వేరే మండలాల ఎంఈఓలు చేయాలంటే ఏమి అడ్డంకులు చెబుతారోనని ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న బీక్లస్టర్ల అవసరం లేదని నివేదికలు సిద్ధంచేసి, వాటిని తీసేస్తే తమ పరిస్థితి ఏమి కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సీఆర్ఎంటీలు శుక్రవారం సమగ్రశిక్ష కార్యాలయానికి వచ్చారు. ఏపీసీ శైలజ అందుబాటులో లేకపోవడంతో మాజీ ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డిని కలసి తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు ఎలాంటి ఇతరత్రా అలవెన్సులు ఉండవని, నామమాత్రపు జీతాలతో పని చేస్తున్న తమను దూర మండలాలకు పంపితే ఇబ్బంది పడతామని వాపోయారు. బీక్లస్టర్ స్కూళ్లకు మ్యాపింగ్ చేసి, పనిమాత్రం ప్రస్తుతం ఉన్నచోట చేయాలని చెబుతున్నా భవిష్యత్తులో ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రీ–ఆర్గనైజేషన్ అనంతరం జిల్లాలో 20 బీ క్లస్టర్ స్కూళ్లు సర్దుబాబు పేరుతో సొంత మండలాల్లో కాకుండా దూర మండలాలకు పంపే ప్రయత్నం లబోదిబోమంటున్న సీఆర్ఎంటీలు -
రేషన్కు నగదు బదిలీ ఆలోచన మానుకోవాలి
రాయదుర్గంటౌన్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా లబ్ధిదారులకు రేషన్కు నగదు బదిలీ చేయాలనే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. స్థానిక ఏపీఎన్జీఓ భవనంలో శుక్రవారం రాయదుర్గం, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల సీపీఎం నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నల్లప్ప మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నగదు బదిలీ చేస్తే నిజమైన లబ్దిదారులు, పేదలు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, లోకేష్, నాగరాజు, మధు, తిమ్మరాజు, శంకర్, పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానాస్పద మృతి అనంతపురం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అభిషేక్కుమార్ (20) గురువారం రాత్రి బాత్రూంలో వాంతి చేసుకుని మృతి చెందాడు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని వన్టౌన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లా బహుర్వా గ్రామానికి చెందిన సీతాదేవి, శంభురామ్ దంపతుల చిన్న కుమారుడు అభిషేక్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి రెండు నెలల క్రితం ముంబయిలోని యూనీ సర్వేడ్ టెక్ సొల్యుషన్స్ కంపెనీలో నెట్వర్క్ టెక్నీషియన్గా పనిలో చేరాడు. శిక్షణ అనంతరం కంపెనీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి అనంతపురం కేంద్రంగా విధులు చేపట్టాడు. శ్రీకంఠం సర్కిల్లోని పీజీ హాస్టల్లో ఉంటూ విధుల్లో భాగంగా యాడికి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఎయిర్టెల్ నెట్వర్క్ చెకింగ్కు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకుని వస్తూ మార్గమధ్యంలో తన స్నేహితుడు జయప్రకాష్కుమార్ రాయ్తో కలసి గోబీ మంచూరియా తిని సాయంత్రం హాస్టల్కు చేరుకున్నాడు. రాత్రి 7గంటలకు జయ ప్రకాష్ పిలిచినా భోజనానికి వెళ్లలేదు. కాసేపటి తర్వాత భోజనం గదిలోకి తెచ్చి పెట్టి తినమని జయప్రకాష్ తెలపడంతో ఆరోగ్యం ఇబ్బందిపెడుతుంటే మందులు వేసుకున్నానని అలాగే నిద్రపోయాడు. రాత్రి 8:15 గంటలకు బాత్రూంకు వెళ్లిన అభిషేక్ అక్కడ వాంతులు చేసుకుంటూ కుప్పకూలాడు. గమనించిన జయప్రకాష్కుమార్ వెంటనే తన రూం మేట్స్ నాగూర్ వలి, పోతులయ్య, పీజీ హాస్టల్ యజమాని నాగేశ్వరరెడ్డితో కలసి ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అభిషేక్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అభిషేక్ బావ రూపేష్రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం
అనంతపురం కార్పొరేషన్: సచివాలయ ఉద్యో గుల బదిలీల ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం బదిలీలు చేపట్టాలని ఆగమేఘాలపై సర్క్యులర్ విడుదలైంది. ముందురోజు అర్ధరాత్రి 11 గంటలకు సంబంధిత ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం తెలపడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వర్తించే సచివాలయ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలోని జీసస్నగర్లోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి నేతృత్వంలో వివిధ మునిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. స్పష్టతలో జాప్యం : ఉమ్మడి జిల్లాలో 304 సచివాలయాల పరిధిలో 286 మంది అడ్మిన్ పోస్టులుండగా.. అందులో 18 ఖాళీలున్నాయి. కౌన్సెలింగ్కు 176 మంది అడ్మిన్లు హాజరయ్యారు. మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్ ఎవరైనా ఏదైనా మునిసిపాలిటీ పరిధిలో 5 ఏళ్ల పాటు పని చేసి ఉన్న వారు బదిలీకి అర్హులని చెప్పారు. దీంతో దీనిపై స్పష్టత రాలేదు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 74 సచివాలయాల్లో పది మందికిపైగా బిల్ కలెక్టర్లు అడ్మిన్లు చేస్తున్నారు. ఈ సచివాలయాలను బదిలీల జాబితాలో చూపలేదు. మునిసిపాలిటీల్లో వివిధ సచివాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొందరినీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. ఇతర మునిసిపాలిటీల్లో ఈ విధంగా జరగడం లేదన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్కు ఫిర్యాదు చేశారు. మరోసారి బదిలీ జాబితాను పక్కాగా నమోదు చేసి బదిలీలు చేపట్టాలని కమిషనర్ బాలస్వామిని ఆర్డీ ఆదేశించారు. దీంతో గంటసేపు పైగా బదిలీల కౌన్సిలింగ్ నిలిపివేశారు. తమ్ముళ్ల సిఫార్సు : బదిలీల్లో తెలుగు తమ్ముళ్ల సిఫార్సు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెటర్లతో కొందరు బదిలీలకు రావడంతో వివిధ మునిసిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీలు చూపనట్లు తెలుస్తోంది. దీంతో అర్హులైన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాస.. వాయిదా :అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాసగా సాగింది. శుక్రవారం రాత్రి ఉద్యోగుల ర్యాంక్, స్పౌజ్ల విషయంలో గందరగోళం నెలకొంది. పారదర్శకంగా చేపట్టడం లేదంటూ అడ్మిన్ కార్యదర్శులు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆర్డీ విశ్వనాథ్ బదిలీల కౌన్సెలింగ్ వద్దకు చేరుకున్నారు. బదిలీలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని, తమకు అన్యాయం జరగుతోందంటూ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బదిలీల కౌన్సెలింగ్ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీ విశ్వనాథ్ ప్రకటించారు. -
ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి అందాలి
ఆత్మకూరు: ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా సామగ్రి ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకుడు వెంకట శివసాయి సూచించారు. ఆత్మకూరులోని ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించరాదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్సిడీ బియ్యం పట్టివేత రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. సోమందేపల్లికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్కు తరలించినట్లు వివరించారు. పశు శాఖ జేడీగా సుధాకర్ అనంతపురం సెంట్రల్: పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ టీవీ సుధాకర్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జేడీ వెంకటస్వామి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. -
బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో స్వైరవిహారం
తాడిపత్రి టౌన్: మండలంలోని బోడాయిపల్లిలో శుక్రవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, అదే గ్రామానికి చెందిన రంగనాథ్ భార్యపై దాదాపు ఏడాది క్రితం అత్యచారయత్నం చేశాడు. ఆ సమయంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ నిర్వహించి కుళ్లాయప్పపై ఏడాది పాటు గ్రామ బహిష్కరణ విధించారు. ఏడాది పూర్తి కావడంతో కుళ్లాయప్ప గ్రామానికి చేరుకుని తన సోదరుడు బాలయ్యతో కలిసి గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం ఉదయం పనుల్లో నిమగ్నమైన సమయంలో రంగనాథ్తో పాటు రాజేష్, రంగ సుధాకర్, పృథ్వీ, రాకేష్, హరీంద్ర మరో ముగ్గురు అక్కడకు చేరుకుని వేటకొడవళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. దాడిని ప్రతిఘటిస్తూ తనకు అందుబాటులో ఉన్న వేటకొడవలితో కుళ్లాయప్ప కలబడాడ్డు. ఘటనలో కుళ్లాయప్ప కాలుకు, చేతిపై నరుకుడు గాయాలయ్యాయి. రంగనాథ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఇరువురి పరిస్థితి విషమంగా మారింది. బాలయ్య, రాజేష్, రంగసుధాకర్, పృద్వీ, హరీంద్రకు చిన్నపాటి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని దాడులను అడ్డుకుని క్షతగాత్రులను తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ శివగంగాధర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
వ్యవస్థలు నాశనం
పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను కూటమి సర్కారు నాశనం చేసిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసులు పెడతామని, భూములను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అధికారులు, పోలీసులుకు భారత రాజ్యాంగం ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, దానికి లోబడే పని చేయాలని హితవు పలికారు. రెడ్బుక్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి విమర్శలపాలు కావొద్దని పోలీసు అధికారులకు సూచించారు. -
అరాచకాలను తిప్పికొట్టాలి
మహిళలకు రక్షణ కరువు బుక్కరాయసముద్రం/శింగనమల: చంద్రబాబు ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాలను లెక్కలతో సహా వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెడ్బుక్ మాటున సాగిస్తున్న అరాచకాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇదే వేదిక నుంచి ‘రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిఽథున్రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్రెడ్డి, రమేష్రెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, ఈరలక్కప్ప, దీపిక, మక్బుల్ అహ్మద్, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అధికార ప్రతినిధి ఎంపీ గోరంట్ల మాధవ్, పీఏసీ సభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ, మహాలక్ష్మి శ్రీనివాస్, అనంతపురం మేయర్ వసీం, టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కృష్ణవేణి, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికారు. అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా అవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సిద్దరాంపురం రోడ్డు మీదుగా వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 5 ఏళ్ల పాలనతో జగనన్న రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే చంద్రబాబు ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, భోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు నరేష్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, ముత్యాల శీనా, పురుషోత్తం, పెద్ద కొండయ్య, చికెన్ నారాయణస్వామి, శ్రీనివాస రెడ్డి, ఆది, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు తోడుగా ఉంటా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది బాలికలు మిస్సింగ్ అవుతున్నా మహిళా పక్షపాతి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నోరుమెదపరన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికలపై అత్యాచారాలు జరిగితే సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం కానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. హామీల అమలులో ఘోరంగా విఫలం బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ నాయకులు రెడ్బుక్ మాటున అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ వారు ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం దందా కోసం కొట్టుకుచస్తున్నారన్నారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భోజనం ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రులను చూశాం కానీ.. నేడు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఖండించారు. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
అత్యాశ అస్త్రం.. అథఃపాతాళం
లుక్.. అవుట్ ● అనంతపురంలోనే 3 వేల మంది బాధితులు ● రూ.కోట్లు లూటీ చేశాక యాప్ క్లోజ్ ● పోలీస్స్టేషన్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అనంతపురం: అత్యాశ అస్త్రానికి ఎందరో అమాయకులు బలయ్యారు. ఓ డొల్ల కంపెనీ ప్రవేశ పెట్టిన ‘లుక్’ యాప్కు ఆకర్షితులైన వారు అందులో డిపాజిట్లు పెట్టి.. నిలువునా మోసపోయారు. రూ.కోట్లు కొల్లగొట్టి యాప్ క్లోజ్ చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయండంటూ అనంతపురం నగరంలో సైబర్ విభాగానికి, ఆయా పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క అనంతపురం నగరంలోనే ‘లుక్’ బాధితులు మూడువేల మంది దాకా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సింహభాగం సైబర్ కాల్ సెంటర్కు ఫిర్యాదులు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం కావడంతో రికవరీకి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పక్కా కుట్ర.. ‘లుక్’ పేరుతో యాప్ రూపొందించి వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. డబ్బు డిపాజిట్ చేస్తే ప్రతి వారం ఆదాయం పొందవచ్చని కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేయడంతో ఎక్కువమంది ఆకర్షితులయ్యారు. యాప్లో 9 రకాల స్కీంలు ప్రవేశపెట్టారు. రూ.2,250 నుంచి మొదలై .. గరిష్టంగా రూ.75.6 లక్షల వరకు డిపాజిట్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. యాప్లో చేరిన వారందరికీ ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి ఎప్పటికప్పుడు స్కీంల సమాచారాన్ని పోస్ట్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 17 వేల నుంచి 20 వేల మంది సభ్యులు ఉన్నారు. యాప్లో చేరిన వారికి అనుమానం రాకుండా తొలుత పక్కాగా చెల్లింపులు చేశారు. సేవా కార్యక్రమాల పేరుతో గాలం నిర్వాహకులు యాప్కు ప్రచారం కల్పించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించారు. విస్తృతంగా సభ్యులుగా చేరిన ప్రాంతాలను ఎంపిక చేసి.. ఆయా ప్రాంతాల్లో పేదలకు నిత్యావసర సరుకులు, పుస్తకాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతపురంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం లుక్ యాప్ పేరుతో జరిగిన మోసానికి బలైన బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితులు సైబర్ క్రైం సెల్తో పాటు ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. నేర తీవ్రతను బట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –షేక్ జాకీర్ హుస్సేన్, సైబర్ క్రైం సీఐ -
రూ.3.03 కోట్ల విలువజేసే సెల్ఫోన్ల అందజేత
అనంతపురం: ‘చాట్బాట్’ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా రికవరీ చేసిన రూ.3.03 కోట్ల విలువ చేసే 1,216 మొబైల్ ఫోన్లను శుక్రవారం అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మేళాలో ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 12,594 మొబైల్ ఫోన్లను అందజేసింది. వీటిన్నింటి విలువ రూ.24.11 కోట్లు అని పోలీసుల శాఖ పేర్కొంది. పోయిన ఫోన్లు తిరిగి చేతికి అందడంతో బాధితుల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురైనా.. అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీ విషయంలో జిల్లా పోలీసులు రాజీ పడలేదు. ఇప్పటి వరకు రికవరీ చేసిన 12,594 ఫోన్లలో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బాధితులకు ముట్టజెప్పిన ఫోన్లు 1179, మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా కాకుండా తక్కిన జిల్లాల్లో 2,795 ఫోన్లు అందజేశారు. అందజేసిన మొబైల్ ఫోన్ విలువ రూ.499 నుంచి రూ.1,41,000 వరకు ఉంది. 2022 జూన్ 26న జిల్లా పోలీసు శాఖ ‘చాట్బాట్’ సేవలు ప్రారంభించి.. చోరీకి గురైనా లేదా మిస్ అయినా మొబైల్ ఫోన్ల జాడ కనుక్కుని రికవరీ చేసి ప్రజలకు అందజేస్తోంది. సెల్ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్సు ఉంటే కొనుగోలు చేయాలని తెలిపారు. 10 నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు జూలై పదో తేదీన నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం బెంగళూరులోని విధాన సౌధ సమావేశ మందిరంలో 124వ ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. హెచ్చెల్సీకి జూలై పది నుంచి 31వ తేదీ వరకు సగటున 700 క్యూసెక్కులు, ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ 30 వరకు 1,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్ గేట్లలో 19వ క్రస్ట్ గేటు గతేడాది కొట్టుకుపోవడం, మిగిలిన 32 గేట్లు కూడా దెబ్బతినడం వల్ల నిపుణుల సూచన మేరకు వాటిని మార్చాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో గేట్ల అంచు వరకు 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిబంధన పెట్టారు. టీబీడ్యాంకు 157 టీఎంసీల నీరు చేరుతాయని అంచనా వేసిన అధికారులు.. వాటా ప్రకారం వివిధ కాలువలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పోటెత్తిన వరద తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం 44,569 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. డ్యాంలో 57 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి , చిక్కమంగళూరు, వరనాడుతో పాటు జలాశయం పరిసరాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో టీచర్లకు గాయాలు ఉరవకొండ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులు గాయపడ్డారు. అనంతపురం నుంచి 15 మంది ఉపాధ్యాయులు పాల్తూరు వరకు గల వివిధ పాఠశాలల్లో విధులకు వెళ్లేందుకు శుక్రవారం తుఫాన్ వాహనంలో బయల్దేరారు. ఉరవకొండ మండలం కోనాపురం సమీపంలోకి రాగానే పొలంలోంచి ఓ ట్రాక్టర్ ఉన్నపళంగా రోడ్డుపైకి వచ్చింది. దాన్ని తప్పించేందుకు ప్రయత్నించి తుఫాన్ వాహన డ్రైవర్ కుడివైపునకు తిప్పబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా, మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఆ వెనుకే మరో వాహనంలో వస్తున్న ఇతర ఉపాధ్యాయులు వెంటనే 108 సిబ్బందికి సమాచారమందించి గాయపడిన వారిని ఉరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేస్తున్న ఎస్పీ జగదీష్ -
చిత్తశుద్ధితో పనిచేయండి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉత్తమ జిల్లాగా నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో సానుకూల అవగాహనపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు. సానుకూల అవగాహనపై జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారుల పనితీరు మారాలి ‘సేవలందించడంలో అధికారుల ప్రవర్తన సరిగాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. మీ వైఖరి కారణంగా పలు అంశాల్లో జిల్లా ర్యాంకింగ్ తగ్గిపోతోంది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలులో అధికారుల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాలి’ అని ఆదేశించారు. ప్రధానంగా రెవెన్యూ, సర్వే శాఖల పరిధిలో ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపైనా, వైఫల్యం చెందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైళ్లు పక్కాగా ఉండాలి చుక్కల భూములు, 22ఏ జాబితా ఫైళ్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చుక్కల భూముల క్లెయిమ్ల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 22ఏ (నిషేధిత భూముల) జాబితాలోని 12 క్లెయిమ్లను ఆమోదించారు. చుక్కల భూములకు సంబంధించి 24 ఆమోదించారు. -
గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు గూగూడు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ జగదీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గూగూడు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ పరిసరాలు, పికెట్లు, గ్రామంలోని రహదారులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
అమలుకాని ఆదేశాలు
● సబ్డివిజన్ కోసం రైతుల అగచాట్లు ● దరఖాస్తు రుసుం స్వీకరించని సచివాలయ సిబ్బంధి ● 30వ తేదీతో ముగియనున్న ప్రత్యేక డ్రైవ్ అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోంది. ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు చెప్పారు కదా అని సచివాలయానికి వెళ్లిన రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ నిర్లక్ష్యం రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్ అమలులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. భూముల రీ–సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంలు సబ్డివిజన్ చేసుకునేందుకు ‘ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్డివిజన్కు సంబంధించి రూ.500 రుసుం మినహాయింపు పోగా దరఖాస్తు రుసుము నామమాత్రంగా రూ.50 సచివాలయంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ అవకాశం ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకున్నవారికే ఉంటుందని స్పష్టం చేశారు. రుసుము స్వీకరణకు నో సబ్డివిజన్ కోసం సచివాలయాలకు వెళ్లిన రైతుల నుంచి సిబ్బంది దరఖాస్తు రుసుం కట్టించుకోవడం లేదు. ఇది తమకు సంబంధం లేదని, రెవెన్యూ శాఖ చూసుకుంటుందని చెబుతుండడంతో రైతులు ఏమిచేయాలో దిక్కుతోచక వెనుతిరుగుతున్నారు. అధికారులేమో సచివాలయంలో చెల్లించాలని చెబుతున్నారు.. ఇక్కడికొస్తే మాకు సంబంధం లేదంటున్నారని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు–2 (బోడిగానిదొడ్డి) సచివాలయం పరిధిలోని రైతులు ఎదుర్కొన్నారు. మిగిలింది మూడు రోజులే.. ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు మాత్రమే ఉంది. గడువు ముగిసిన తరువాత సబ్డివిజన్ చేసుకునేందుకు రైతు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా రైతుకు భారమే అవుతుంది. -
‘దుర్గం’ పోలీసుల అదుపులో ఈ–స్టాంప్ నిందితులు
సాక్షి టాస్క్ఫోర్స్: నకిలీ ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితులను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి పాల్పడిన మీసేవ కేంద్ర నిర్వాహకుడు మీసేవ బాబు అలియాస్ యర్రప్పతో పాటు కేంద్రంలో పనిచేసే మరో ఇద్దరిని కూడా ఇటీవల అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో తమ ప్రమేయంలేదని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు మీసేవ బాబుపై అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అనంతపురం పోలీసులు సుమారు ఐదు రోజులపాటు విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో అనుమానం ఉన్న వారినీ అదుపులోకి తీసుకుని విచారించారు. 24 గంటల్లోపే నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ, ఐదు రోజులు కావస్తున్నా అరెస్టు చూపకపోవడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. పోలీసుల్లో కదలిక..ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితుల అరెస్టు చూపకపోవడంపై వారివారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు అరెస్టుచేశారా లేక స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎత్తుకెళ్లారా అన్న అనుమానం ప్రజల్లో రేకెత్తుతోంది. దీనికితోడు వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య విజయవాడ ప్రెస్మీట్ లో పరిణామాలపై పలు ప్రశ్నలు సంధించారు. దీంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. ఈనెల 26న ఈ కేసును అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్ నుంచి కళ్యాణదుర్గానికి బదలాయించినట్లు పోలీసులు తెలిపారు. అదేరోజు సాయంత్రం పోలీసు పెద్దల నుంచి స్థానిక డీఎస్పీ, సిబ్బందికి ఆదేశాలు రావడంతో నిందితులను స్టేషన్కు తీసుకొచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను ఉంచి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. నేడో, రేపో అరెస్టు..నకిలీ ఈ–స్టాంప్ల కుంభకోణంలో నిందితులను కళ్యాణదుర్గానికి తీసుకొచ్చారని సమాచారం తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, మీడియా ప్రతినిధులు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అయితే, కేసు తీవ్రమైందని, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయని.. ఎవరూ కార్యాలయం లోపలకు వచ్చేందుకు అనుమతిలేదని డీఎస్పీ రవిబాబు తెలిపారు. త్వరలోనే నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
గిన్నిస్ బుక్లోని బాబు మోసాలు, దుర్మార్గాలు: సజ్జల
ప్రజలకు ఎన్నికల వేళ హామీలను ఎంత తేలికగా ఇచ్చారో.. వాటిని అంతే తేలికగా ఇప్పుడు చంద్రబాబు కొట్టేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిలోనే ప్రజావ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూట కట్టుకుందని.. అందుకే బాబు మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారాయన. అశేష ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్పై సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ప్రయోజనం ఉండదని సజ్జల తేల్చేశారాయన. సాక్షి, అనంతపురం: అబద్దాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించినవారు లేరని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శింగనమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం.. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో(Recalling Chandrababu’s Manifesto) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తుచేసేందుకే ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు... ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ సిక్స్ హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు!. హామీలను తేలికగా ఇచ్చినట్లే.. అంతే తేలికగా కొట్టిపారేస్తుంటారాయన. అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేసి.. బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం... జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్లోకి ఎక్కించొచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించినవారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తోంది. కూటమి నేతలు ఇళ్లకు వస్తే నిలదీయడానికి.. చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టం లేదు.. లేకపోతే చంద్రబాబు సర్కార్కు పదవీ గండం ఉండేది. .. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గడికోట శ్రీకాంత్ రెడ్డి పై ఎస్వోజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దారుణం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఆయనకు ఉన్న భద్రతను తొలగించింది. పేరుకే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత.. ఆచరణలో అమలు చేయడం లేదు. .. సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదు.. దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లి లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ను ఎంత అణచి వేయాలని చూస్తే... అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్కు మద్దతుగా లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. .. హామీలను త్రికరణ శుద్ధి తో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి’’ అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఇంకా రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్ట్ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు మోసాలను వివరించారు. ‘‘టీడీపీ కూటమి గెలుపు పై ఇప్పటికీ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల అక్రమాల ద్వారా గెలిచారని ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. చంద్రబాబు అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నేతలు భయపడరు. నారా లోకేష్ రెడ్ బుక్ను ఎడమ కాలితో తన్ని ఎదిరిస్తాం. ప్రజలకు అండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఉంటారు’’:::మాజీ మంత్రి శైలజానాథ్ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు?. దళిత, గిరిజన బాలికల పై అఘాయిత్యాలు జరిగితే పవన్కు పట్టదా?. :::మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్చంద్రబాబు మోసాలను ప్రజల్లో కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీలను అమలు చేయలేదు. చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య వెన్నుపోటు. అప్పుడు ఎన్టీఆర్ కు... ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే. నవరత్నాలను పకడ్బందీగా అమలు చేసి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితంగా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. :::వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ కూటమి పై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ ఓటమి ఖాయం అని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ ప్రతి రోజూ జగన్ జపం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటం లేదు. రైతులను గాలికొదిలేసి... మద్యం వ్యాపారులకు మాత్రమే చంద్రబాబు గిట్టుబాటు ధరలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ అమరావతి లో ఖర్చు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల అభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. :::వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి -
నకిలీ బంగారంతో ప్రైవేటు బ్యాంకుకు టోకరా 9 మంది అరెస్ట్
నార్పల: మండల కేంద్రంలోని కీర్తన ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.లక్షల రుణం పొందిన మోసగాళ్లను అనంతపురం జిల్లా నార్పల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పట్టుపడిన వారిలో నార్పలకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్, దాదాపీర్, కంసాల మంజునాథ్, షేక్ మహబూబ్ బాషా, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ సాదిక్ వలి, బాబు, షేక్ యూసుఫ్ బాషా ఉన్నారు. వీరు 125.8 గ్రాముల నకిలీ బంగారాన్ని కీర్తన ప్రైవేట్ గోల్డ్ లోన్ బ్యాంకులో తనఖా పెట్టి ఆ బ్యాంక్ అధికారి మహమ్మద్ షఫీతో కలిసి రూ.9.46 లక్షలు రుణం తీసుకున్నారు.బ్యాంక్ క్లస్టర్ మేనేజర్ కొలంట్ల నాగరాజు ఇటీవల ఆడిటింగ్ చేపట్టగా తాకట్టు పెట్టిన బంగారం నకిలీదిగా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణ కొనసాగుతుండగానే గురువారం మరోసారి అదే తరహాలో మోసం చేయడానికి నిందితులు ప్రయత్నించారు. విషయాన్ని గుర్తించిన మేనేజర్ అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి ఉడాయించారు.సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నార్పల క్రాస్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 నకిలీ బంగారు గాజులు, రెండు కడియాలు, మూడు ఉంగరాలు, ఓ ద్విచక్ర వాహనం, షిఫ్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. -
రైళ్లల్లో కొరవడిన భద్రత
●రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు ●ప్రయాణికుల సొమ్ముకు రక్షణ కరువు ●నిద్రావస్థలో రైల్వే పోలీసులు గుంతకల్లు: రైలు ప్రయాణమంటనే ప్రయాణికులు హడలెత్తిపోయే రోజులు వచ్చాయి. ముఖ్యంగా దుండగులు ఆర్ధరాత్రి సమయాల్లో సిగ్నల్ కోసం వేచి చూస్తూ రైల్వేస్టేషన్ ఔటర్ ప్రాంతాల్లో నిలిపిన రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెరలేపడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్న రైల్వే ఎస్కార్ట్, నిఘా వ్యవస్థలు నిద్రావస్థలో ఉండిపోయాయి. రైళ్లల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఏసీ బోగీల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రైళ్లలో జరిగిన చోరీలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 29న నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు గుత్తి జంక్షన్ సమీపంలో ఔటర్లో సిగ్నిల్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ముందస్తు పథకం ప్రకారం దాదాపు నాలుగు స్లీపర్ బోగీల్లోకి చొరబడి మారణాయుధలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించారు. ● మూడేళ్ల కిత్రం వరురసగా హంపి, రాయలసీమ, చైన్నె ఎక్స్ప్రెస్ రైళ్లు అదే ఔటర్లో సిగ్నల్ కోసం నిలిపిన సమయంలో దుండగులు చొరబడి దాదాపు 30 తులాలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ● గుత్తి–అనంతపురం రైలు మార్గంలోని తురకపల్లి రైల్వేస్టేషన్, గుత్తి–తాడిపత్రి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ వైర్లును కట్ చేయడంతో రైలు ముందుకు పోవడానికి అవకాశం లేకుండా చేసి, ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణలు ఎత్తుకెళ్లారు. ● తాజాగా (గడిచిన సోమవారం వేకువజాము) తాడిపత్రి రైల్వేస్టేషన్ ఔటర్లో సిగ్నల్ వైర్లను కట్ చేసి కోమలి రైల్వేస్టేషన్ ఔటర్లో నిలిచిన ముంబై–చైన్నె ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు విశాలక్ష్మి మెడలోని 2.7 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అదే రోజు రాత్రి పాండిచ్చేరి–కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు దివ్వభారతి మెడలోని 3.5 తులాల బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. గుత్తి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు కిటికి వద్ద కూర్చొన్న ఓ ప్రయాణికుడి చేతిలోని ఖరీదైన సెల్ఫోన్ను అపహరించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి 12 జిల్లాలకు విస్తరించి ఉంది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీలతోపాటు కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి జిల్లాలకూ గుంతకల్లు రైల్వే పోలీస్ కేంద్రంగా ఉంది. గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా 900 మంది పోలీసులు అవసరం కాగా, ప్రసుత్తం 550 మంది మాత్రమే ఉన్నారు. 350కి పైగా ఖాళీలు ఉన్నాయి. డివిజన్ వ్యాప్తంగా రోజూ 300కు పైగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గుంతకల్లు, గుత్తి రైల్వేజంక్షన్ల మీదుగా రాత్రి పూట దాదాపు 50కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగాడుతున్నాయి. ఈ రైళ్లకు 20 నుంచి 24 బోగీలు ఉంటాయి. రాత్రి పూట తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఎస్కార్ట్గా కేటాయిస్తున్నారు. స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందితోనే 24 గంటలు విధులు నిర్వహిస్తుండటంతో విశ్రాంతి లేక జీఆర్పీ, ఆర్పీఎఫ్లు ఒత్తిడికి లోనువుతున్నారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయం ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఉన్న కొద్ది పాటి సిబ్బందితో ర్యాండమ్గా రైళ్లలో బందోబస్తు చేపడుతున్నాం. జీఆర్పీ సిబ్బంది ఇద్దరితో పాటు ఆర్పీఎఫ్కు చెందిన మరో కానిస్టేబుల్కు రైళ్లలో ఎస్కార్టు విధులు కేటాయిస్తున్నాం. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తున్నాం. – హర్షిత, జీఆర్పీ ఇన్చార్జ్ డీఎస్పీ, గుంతకల్లు -
శ్రీసత్యసాయిజిల్లాలో వరుస హత్యలు
శ్రీసత్యసాయిజిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యపై అనుమానంతో ఓ యువకుడిని మరొకరితో కలసి రెండు రోజుల క్రితం భర్త మట్టుబెట్టగా గురువారం వెలుగు చూసింది. మరో ఘటనలో జిల్లా సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో మద్యం మత్తులో చోటు చేసుకున్న గొడవలో హిందూపురం మండలానికి చెందిన ఓ యువకుడు హతమయ్యాడు. అనుమానం పెనుభూతమై.. లేపాక్షి: భార్యపై అనుమానంతో ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన గురువారం లేపాక్షి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (37)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అశ్వత్థప్పతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న బంధువు ఆనంద్ కుటుంబంతో రవికుమార్ చనువుగా ఉండేవాడు. తరచూ ఇంటికి రాకపోకలు సాగిస్తుండడంతో తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఆనంద్ ఎలాగైనా రవికుమార్ను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో తన సోదరుడు గోవిందప్పతో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి స్థానిక రైతు లింగప్ప తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపి రవికుమార్ను రప్పించుకున్నారు. ముగ్గురూ కలసి మద్యం సేవించారు. అదే సమయంలో మత్తులో జోగుతున్న రవికుమార్పై వేటకొడవలితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరుపడింది. అనంతరం మృతదేహాన్ని నీటి గుంతలో గొయ్యి తీసి పాతిపెట్టారు. బుధవారం తెల్లవారినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో అశ్వత్థప్ప ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆనంద్, గోవిందప్ప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడడంతో నీటి గుంతలో పాతిపెట్టిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. మద్యం మత్తులో... గౌరిబిదనూరు/హిందూపురం: మండల పరిధిలోని తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో నివాసముటున్న రవికుమార్ (37) జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. వెల్డర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య అనుపమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు భార్య విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా మార్పు రాకపోవడంతో 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె రాలేదు. దీంతో ఒంటరిగా మారిన రవికుమార్ ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని గంగోత్రి బార్ వద్దకు గురువారం వెళ్లిన అతను సాయంత్రం మద్యం మత్తులో జోగసాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హిందూపురంలోని బాపూజీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ బీరు బాటిల్ ముక్క తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుస పోట్లకు గురి కావడంతో రవికుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న కర్ణాటకలోని గౌరిబిదనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించారు. ఘటనపై గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భార్యపై అనుమానంతో లేపాక్షి మండలంలో ఓ యువకుడి హత్య మంగళవారం రాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చిన వైనం పోలీసుల అదుపులో నిందితులు జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో గురువారం తూముకుంట వాసి హత్య -
వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ
రాప్తాడురూరల్: 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామంలో 60 ఏళ్లు నిండిన వృద్ధుల ఇళ్ల వద్దకు వెళి్ల్ల్ స్వయంగా ఆయన రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30లోపు ప్రకియను పూర్తి చేయాలని ఆదేశించారు. విషయం మీకు తెలియజేశారా అంటూ వృద్ధురాలు నారాయణమ్మతో ఆరా తీశారు. బియ్యం నాణ్యత బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మోహన్కుమార్, రేషన్షాపు డీలర్ యమున, ఆర్ఐ సందీప్, వీఆర్ఓ రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ప్రతి నెలా 26 నుంచి 30 వరకూ.. గార్లదిన్నె: ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ లోపు వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని జేసీ శివ్ నారాయణ్ శర్మ పేర్కొ న్నారు. గురువారం ఆయన గార్లదిన్నెలో పర్యటించారు. రేషన్ షాపు తనిఖీ చేశారు. అనంతరం జగనన్న లేఅవుట్ను పరిశీలించారు. లోకాయుక్తకు సంబంధించి భూమి సమస్యపై విచారించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ ఈరమ్మ పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు ‘ఐడీ’ తప్పనిసరి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్: సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల విధులపై ఆరా తీశారు. ఐడీ కార్డులు ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. సచివాలయంలో నీరు రావడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ మోహన్కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు అనంతపురం: అనారోగ్యంతో మృతి చెందిన అనంతపురం డీటీసీ సీఐ పవన్కుమార్ మృతదేహానికి గురువారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు శాఖలో 1996లో ఎస్ఐగా చేరారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువులు, స్నేహితులు, అధికారులు, బ్యాచ్మేట్ల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న స్వగ్రహంలో ఉంచారు. అనంతరం గురువారం పిల్లిగుండ్ల కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐలు దేవానంద్, శేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అడహాక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్, ఆర్ఎస్ఐ జాఫర్, సూర్యకుమార్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మత్తుకు బానిస కావొద్దు అనంతపురం: మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా అనంతపురం నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ఫ్యాషన్ పేరుతో యువత గంజాయికి బానిసలుగా మారుతోందని, దీంతో తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల ప్రభావం గురించి వివరించారు. చట్టంలో విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. మత్తుకు బానిసలు కావొద్దని పిలుపునిచ్చారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. తమకు తెలియకుండానే డ్రగ్స్ వలలో విద్యార్థులు చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. చెడు స్నేహాలతో మంచి విద్యార్థులు కూడా క్రమంగా వ్యవసనాల బారినపడుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగం నుంచి విక్రయదారులుగా మారుతుండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, రేవతి, ఎస్ఎస్బీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ సరితారెడ్డి పాల్గొన్నారు. -
అశాసీ్త్రయ బదిలీల ప్రక్రియతో నష్టం
● సమస్యలకు పరిష్కారం చూపాలి ● కలెక్టరేట్లో గ్రామ సర్వేయర్ల నిరసన అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించకుండా చేపట్టనున్న అశాసీ్త్రయ బదిలీల ప్రక్రియతో తీరని నష్టం వాటిల్లుతోందని గ్రామ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆవరణలో సర్వేయర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షుడు అరుణ్నాయక్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన కాకుండా రెవెన్యూ గ్రామ విస్తీర్ణం ప్రామాణికంగా తీసుకుని హేతుబద్దీకరణ చేయాలన్నారు. హేతుబద్ధీకరణ చేస్తున్న సర్వేయర్లను వారి సమ్మతి మేరకే బదిలీల కౌన్సెలింగ్ చేపట్టాలన్నారు. ఉద్యోగుల అభిమతానికి అనుగుణంగా ఇతర శాఖలు కేటాయించాలన్నారు. పదోన్నతులు కల్పించిన తరువాత సీనియారిటీ ప్రాతిపదికన హేతుబద్ధీకరణ పూర్తి చేసి బదిలీలు చేయాలన్నారు. అడవులు, ముళ్లపొదల్లో వెళ్లి సర్వే చేసే తమకు రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించే వరకూ నిరసనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సునీల్కుమార్, దామోదర్, మల్లికార్జున, ప్రతాప్, జోత్స్న, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. పత్తి తూకంలో మోసం బొమ్మనహాళ్: మండలంలోని కృష్ణాపురం గ్రామంలో పత్తి తూకంలో మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన పత్తి వ్యాపారులు మూడు రోజులుగా కృష్ణాపురం గ్రామంలో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు తిప్పేస్వామి, వన్నూరుస్వామి, కొత్తపల్లి తిప్పయ్య, సుబ్బుతో పాటు మరికొందరు రైతులకు చెందిన పత్తిని గురవారం క్వింటా రూ.7,400 నుంచి రూ.7,800 వరకు కొనుగోలు చేశారు. కాటా వేస్తున్న సమయంలో మోసాలకు తెరలేపారు. దీంతో రైతు తిప్పేస్వామికి అనుమానం వచ్చి పరిశీలించగా క్వింటాకు 20 కేజీలు తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రైతులు చుట్టుముట్టి నిలదీయడంతో వ్యాపారులు అక్కడి నుంచి పారిపోయారు. దళారులు జోక్యం చేసుకోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి 250 క్వింటాళ్ల పత్తికి నగదు కట్టించేలా చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా రైతులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి అనంతపురం: మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలను వినియోగించిన, అమ్మిన, నిల్వ ఉంచినా, అక్రమ రవాణా చేసినా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్య గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్నాటకలోని రాయచూర్ జిల్లా గుడెదనాల్కు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. పనస కాయల వాహనం బోల్తా కనగానపల్లి: బెంగళూరు నుంచి అనంతపురానికి పనస కాయల లోడ్తో వెళుతున్న బొలెరో వాహనం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోల్తాపడింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మామిళ్ల పల్లి సమీపంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వాహనం ముందరి టైర్లు రెండూ ఒక్కసారిగా పేలాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనం బోల్తాపడింది. పనస కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఘటనతో రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు అనంతపురానికి చెందిన వ్యాపారి పోతులయ్య వాపోయాడు. కాగా, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. -
బాల్య వివాహాలు అరికట్టాలి
అనంతపురం అర్బన్: ‘జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టాలి. ఈ విషయంలో సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. బాల్యవివాహలు జరిపించేవారితో పాటు ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలతో కలిగే దుష్ప్రభావాలపై స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మండల, గ్రామస్థాయి, విద్యాసంస్థల్లో బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు కనపడడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో సున్నితంగా మాట్లాడాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లలో భాగస్వాముల్ని చేయాలన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, జెడ్పీ సీఈఓ శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. డీఎంఎఫ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా మినరల్ ఫండ్స్(డీఎంఎఫ్)తో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024–25లో 116 పనులకు రూ.11.72 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 10 పనులు మాత్రమే పూర్తి చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధిక ప్రాధాన్యత కింద రూ.4 కోట్లతో 27 పనులకు ప్రతిపాదనలు వచ్చాయని, చెక్లిస్ట్ ప్రకారం నివేదికలను ఆయా శాఖలకు అధికారులు అందజేయాలని చెప్పారు. ఇప్పటికే మంజూరై మొదలు పెట్టని పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాటిని చేపట్టాలో వద్దా అనేదానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
లుక్ పేరుతో బుక్ చేసేశారు!
అనంతపురం: రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం వస్తుందని నమ్మించారు. రూ.20,300 చెల్లిస్తే.. నిత్యం రూ.700 ఆదాయం వస్తుందని గాలం వేశారు. చివరికి రూ.కోట్లలో డిపాజిట్ చేయించుకుని బుక్ చేసేశారు. ‘లుక్’ పేరిట ఆన్లైన్లో సామన్యుల నుంచి అత్యున్నత స్థాయి వారిని ఆకర్షించి సొమ్మును డిపాజిట్ చేయించుకుని బోర్డు తిప్పేసిన ఓ ముఠా సాగించిన వ్యవహారమిది. వివరాలు.. అమెరికన్ కంపెనీ ‘లుక్’ పేరుతో యాప్ను ప్రవేశపెట్టారు. పుస్తకాలు, గ్రంథాలు ఆన్లైన్లో చదివే ‘లుక్’ యాప్లో చందాదారుల పేరుతో దోపిడీ ప్రారంభించారు. రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.20,300 చెల్లిస్తే.. రోజూ రూ.700 ఆదాయం వస్తుంది. ప్రతి రోజూ యాప్లో 25 టాస్క్లు ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఒక్కో టాస్క్కు రూ.28లు నగదు క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకోవచ్చు. కొత్త ఖాతాదారులను చేర్పిస్తే 30 శాతం వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ప్రారంభంలో అత్యంత నమ్మకంగా, కచ్చితంగా మొత్తాలను చెల్లించారు. అనంతపురం నగరంలోనే రూ.20 వేల చందాదారులు వేలల్లో ఉన్నారు. రూ.2.50 లక్షల చందాదారులు వందల్లో ఉన్నారు. బుధవారం డ్రా చేసుకునేందుకు క్లిక్ చేయగా, తక్షణమే 30 శాతం చెల్లిస్తే.. ఈ 30 శాతం ఖాతాలో ఉన్న మొత్తం అంతా డ్రా చేసుకోవచ్చని యాప్లో మెసేజ్ చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోటీ పడి నగదు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ డిపాజిట్ చేశారు. బుధవారం రాత్రి రూ.2.50 లక్షలు చెల్లించిన వారే అధికంగా ఉన్నారు. రూ.20 వేలు చెల్లించిన చందాదారులు తక్షణమే రూ.6,090 చెల్లించాలి. లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉన్న ఫలంగా రూ.6,090 చెల్లించారు. ఇలా ఖాతాదారులకు అత్యాశ చూపించి బుధవారం రాత్రే అధికంగా మొత్తాలను కట్టించుకున్నారు.డబ్బు డ్రా చేయడంతో బ్యాంకు ప్రాసెస్లో ఉందంటూ గురువారం రాత్రి యాప్లో డేటాను తొలగించేశారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘లుక్’ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆందోళన చెందుతున్నారు. సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ క్రైం హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్లు చేస్తున్నారు. సైబర్ ముఠా పనేనా: ప్రజలకు ఆశ చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. సైబర్ క్రైం నిపుణుల పన్నాగమేనని భావిస్తున్నారు. ఆశ చూపి కోట్లు కొల్లగొట్టడమే కాకుండా.. ప్రజల బ్యాంకు ఖాతాలను సైతం యాప్లో అప్లోడ్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని యాప్ ద్వారా సేకరించి ఉంటారు. ఇలాంటి యాప్ల ద్వారా డబ్బు సంపాదిస్తే.. సదరు బ్యాంకు ఖాతాలను ఆయా మేనేజర్లు ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలిసింది. సైబర్ క్రైం జరిగే అవకాశం ఉండడంతో మేనేజర్లు ముందస్తుగా ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలాంటి యాప్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తే మరో వైపు బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. రూ.వందల కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన వైనం రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం అంటూ గాలం అపరిమితంగా ఖాతాదారులను పెంచుకుని బురిడీ -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు అనుమతి లేకుండా నడుపుతుంటే చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తామన్నారు. లింగ నిర్ధారణకు ప్రోత్సహించినా చర్యలు తప్పవన్నారు. ఆడ బిడ్డ ప్రాముఖ్యతతో పాటు చట్టాన్ని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలపై ఏఎన్ఎం, ఆశాల ద్వారా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు తెలిస్తే కమాండ్ కంట్రోల్ 08554–228234కు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ అనుపమజేమ్స్ తదితరులు పాల్గొన్నారు. అలా ముగించేశారు! అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండివైఖరితో ముందుకెళ్లింది. ఫలితంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీరందరూ జిల్లా సరిహద్దు మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద వారిగోడును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అలా ముగించేశారు. తొలిరోజు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండోరోజు గురువారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ఉంటుందంటూ ఉదయం అందరికీ మెసేజ్లు పెట్టారు. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఖాళీల అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా...డీఈఓ ప్రసాద్బాబు అంగీకరించలేదు. తన పరిధిలో లేని అంశం అని... కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా కౌన్సెలింగ్కు అటెండ్ కామని చెబితే మాత్రం అలాంటి వారికి నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచే స్కూళ్లు అలాట్ చేస్తారని, అవి ఎక్కడొస్తాయో కూడా తెలీదంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుమార్లు కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసినా ప్రభుత్వం కరుణించలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న తమపై ఇంత కక్షసాధింపుగా వ్యవహరించడం సరికాదని వాపోయారు. ఎట్టకేలకు అందరూ అంగీకరించడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి దాకా కొనసాగింది. 404 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ముందురోజు 190 మందికి 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. నిబంధనల మేరకే ఉన్న ఖాళీలను చూపించామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఏదిఏమైనా కౌన్సెలింగ్కు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చేసిన ఎంటీఎస్ టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. గంజాయి సాగు చేస్తే జిల్లా బహిష్కరణ : డీఐజీ అనంతపురం: గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సాగు, వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. గంజాయి పొగ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలంలో ప్రాణాప్రాయం తలెత్తుతుందన్నారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సం
శింగనమల: బుక్కరాయసముద్రంలో శుక్రవారం శింగనమల నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. గురువారం బుక్కరాయసముద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పీవీ మిథన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, రమేష్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, పార్టీ ముఖ్యనాయకులు హాజరవుతారన్నారు. నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ భాస్కర్, మండల కన్వీనర్ నరేష్, నాయకులు పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, పెద్ద వెంకటరెడ్డి, బోనా నాగలింగారెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, పెద్ద కొండయ్య,పురుషోత్తం, ముసలన్న, ప్రతాప్రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బాబుతో ఎంత నష్టం జరిగిందో వివరిస్తాం అనంతపురం కార్పొరేషన్: ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయిలో ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని శుక్రవారం బీకేఎస్లో లాంఛనంగా చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం బీకేఎస్లో ప్రారంభించనున్న శింగన మల వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: బ్యాంక్ రుణాల కోసం ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్ కంపెనీకి బ్యాంక్ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్ల స్కామ్లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’. ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం?ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:స్టాంప్ డ్యూటీ స్కామ్కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక ప్రకటన చేయాలి.‘సిట్’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:కళ్యాణదుర్గంలో స్టాంప్ డ్యూటీ స్కామ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.హైకోర్టు తలుపు తడుతా:పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. -
ధర్మవరంలో బీజేపీ నాయకుల దాష్టీకం
శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికార అండతో బీజేపీ నాయకులు అమాయకులపై దౌర్జన్యం చేయడం, దాడులకు తెగబడటం పరిపాటిగా మారింది. బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా, అతని అనుచరులు రాత్రి వేళ సమయం ముగిశాక ఎగ్జిబిషన్లోకి అనుమతించాలంటూ దౌర్జన్యం చేసి.. ఆపై నిర్వాహకులతో పాటు కార్మికులపై దాడికి దిగారు. అమాయకులైన ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై చేతికందిన వస్తువులతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. దాడికి గురైన బాధితులు న్యాయం చేయాలంటూ పట్టణ పోలీస్స్టేషన్కు వెళితే ఫిర్యాదు తీసుకుని చోద్యం చూడటం పోలీసుల వంతైంది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలో బీజేపీ నాయకుడు కృష్ణాపురం షాహీన్షా బంధువులను వెంట పెట్టుకుని సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ధర్మవరం–అనంతపురం రోడ్డులోని ఎగ్జిబిషన్ వద్దకు వెళ్లారు. సమయం ముగిసిందని, అనుమతి లేదని నిర్వాహకులు చెప్పారు. దీంతో షాహీన్షా ‘ఏరా.. మేము బీజేపీ నాయకులం. మాకే అనుమతి లేదంటావా?’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన ఎగ్జిబిషన్ నిర్వాహకులతో పాటు కార్మికులు చేసేది లేక లోపలికి అనుమతించారు. వారు జెయింట్ వీల్ ఎక్కి తిరుగుతుండగా రెండు నిమిషాల పాటు విద్యుత్ అంతరాయంతో ఆగిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు ‘మేము తిరుగుతుంటే అదే పనిగా ఆపేస్తావా?’ అంటూ చేతికందిన వస్తువులతో ఎగ్జిబిషన్లో పని చేసే కార్మికును, నిర్వాహకుడి భార్య ఎల్లమ్మను దారుణంగా కొట్టారు. బాధితులు ఎల్లమ్మ, జశ్వంత్, రమేష్ భానులకు రక్త గాయాలయ్యాయి. దీంతో వారు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చోద్యం చూసినట్లు బాధితులు వాపోతున్నారు. -
‘అనంత’లో వరుస హత్యల కలకలం
అనంతపురం: ఒక్క రోజు వ్యవధిలోనే రెండు హత్యలు చోటు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ పరిసరాల్లో గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రామలింగ కుమారుడు జి.సిదానంద (28) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం రాత్రి కుమ్మర నరసాపురం సురేష్ బాబు(43) దారుణంగా హతమయ్యాడు. శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు లోపించాయనేందుకు నిదర్శనంగా ఇప్పటికే పలు హత్యలు చోటు చేసుకున్నాయి. కేవలం 30 రోజులు కూడా గడవక ముందే మూడు హత్యలు చోటు చేసుకుని పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన యువతి తన్మయి (19)ని అతి కిరాతకంగా హత్య చేశారు. రాష్ట్రంలోనే ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన మరువక ముందే అనంతపురం నగరంలో ఒక్క రోజు వ్యవధిలోనే మరో రెండు హత్యలు జరిగాయి. పోలీసులకే సవాల్ విసిరిన గంజాయి బ్యాచ్ అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఏకంగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ ముందే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ గంజాయి బ్యాచ్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం ద్వారా పోలీసులకు సవాలు విసిరింది. కొన్ని రోజులుగా పుష్ప పాటతో రీల్ చేస్తూ సోషల్ మీడియాలో టాటూ చరణ్ అనే యువకుడు వైరల్ చేశాడు. ఈ నెల 18న అనంతపురంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న యశోద ఇంట్లో టాటూ చరణ్, పవన్ చొరబడి డబ్బు కోసం బెదిరించి.. దాడి చేసి దౌర్జన్యంగా సెల్ఫోన్ లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 21న టాటూ చరణ్, ఇతని అనుచరుడు పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇది వరకే దొంగతనం, మనుషులపై దాడి కేసులో నిందితులు. -
ప్రజావ్యతిరేకత దిశగా ‘కూటమి’
అనంతపురం అర్బన్: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ పి.మధు అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి క్లాక్ టవర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో నేడు మతోన్మాద వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రిన దేశంలో ఎమర్జెన్సీని అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించి 1.13 లక్షల మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. యాభై ఏళ్ల అనంతరం ఎమర్జెన్సీ చీకటి పాలనను గుర్తు చేసుకుంటే నేడు అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్, మతోన్మాద పాలకుల చేతిలో ప్రజలు నిర్బంధాన్ని చూడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందన్నారు. డీసీఎం పవన్కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిర్బంధ, మతోన్మాద దుష్ట పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే పేదల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు, రామరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, జిల్లా నాయకులు బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, వెంకటనారాయణ, ప్రకాష్రెడ్డి, గోపాల్, వలి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. నాటి ఎమర్జెన్సీ చీకటి పాలనను తలదన్నేలా నేడు రాష్ట్రంలో పరిస్థితులు మతోన్మాద, నిర్బంధ పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పి.మధు -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పథకంలో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వందశాతం అమలు చేయాలని చెప్పారు. ‘ఉన్నతి’ పథకం కింద సీ్త్ర నిధి ద్వారా మహిళలకు రుణాలు అందించాలన్నారు. ‘జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ అమలులో దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. పీఎంఈజీపీ రుణాలకు సంబంధించి యూనియన్ బ్యాంక్ పరిధిలో సక్రమంగా మంజూరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని డీఐసీ జీఎంను ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లను లబ్ధిదారులకు అందించాలన్నారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, జెడ్పీ సీఈఓ శివశంకర్, సీపీఓ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం రాసిన మరణ శాసనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా సీఎం చంద్రబాబు మార్చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణను దక్కించుకున్న ‘పచ్ఛ’ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి వేళాపాళా లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో యువత మత్తులో జోగుతోంది. తాగుడు మానేయమని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందుబాబులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో తమ పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మద్యం రాసిన మరణ శాసనం. ఈ శాసనానికి బుధవారం ఇద్దరు యువకులు బలయ్యారు. ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయపాలనలేని మద్యం విక్రయాలు ● మద్యానికి బానిసవుతున్న యువత ● తాగుడు మానేయమంటే ఆత్మహత్యలే ధర్మవరం అర్బన్: మద్యం తాగొద్దని భార్య చెప్పినందుకు మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్వీధిలో జరిగింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మార్కెట్వీధికి చెందిన డ్రైవర్ రాజేంద్రప్రసాద్(30)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. తాగుడు మానేయాలని భార్య బతిమాలినా వినేవాడు కాదు. మద్యం మానేయమంటే తాను చనిపోతానంటూ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఉన్న రూ.200 నగదు తీసుకుని మద్యం తాగి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఏదో ఒకటి చేసుకుని చనిపోతానంటూ బెదిరించి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి హాల్లో నిద్రించాడు. రోజూ బెదిరించేది మామూలే కదా అనుకుని ఆమె కూడా పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భార్యకు మెలకువ వచ్చి చూడగా హాల్లో నిద్రపోతున్న భర్త కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ హుక్కుకు బెడ్షీట్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ● గుమ్మఘట్ట: తాగుడు మానేయమన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న, లక్ష్మక్క దంపతులకు నలుగురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కుమారుల్లో చివరి వాడైన శశికుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడికి తల్లిదండ్రులు మరోసారి నచ్చచెప్పారు. తాగుడు మానేస్తే ఎవరైనా పిల్లనిచ్చేందుకు ముందుకు వస్తారని ఇప్పటికై నా మద్యం సేవించడం మానేయాలని హితవు పలికారు. దీంతో మనస్తాపం చెందిన శశికుమార్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు జిలాన్బాషా ప్రమాదకరమైన లింపోమా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు హిమాంబీ, ఫకృద్దీన్, భార్య షర్మిలతో కలసి వ్యవసాయంతో జీవనంతో సాగించేవాడు. 2023, నవంబర్లో ఆరోగ్యం క్షీణించడంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. లింపోమా క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు. అప్పటి నుంచి బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం దాదాపు రూ.30 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. అయినా నయం కాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం చికిత్సకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం స్థానిక టీడీపీ నేతల ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వైఎస్సార్సీపీ సానుభూతి పరులంటూ దరఖాస్తును స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యాలయ సిబ్బంది తిరస్కరించారు. పూర్తిగా క్యాన్సర్ నయం కావాలంటే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షలకు పైగా అవసరమవుతుందని అక్కడి వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వివరించారు. ఆపన్న హస్తం అందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయదలిస్తే.. పేరు : జిలాన్బాషా బ్యాంక్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, నూతిమడుగు శాఖ ఖాతా నంబర్ : 9109 362 3576 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ0001004 ఫోన్ పే నంబర్ :90003 95868 -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తలుపూరు ప్రతాపరెడ్డి (శింగనమల), సహాయ కార్యదర్శిగా ఉమ్మడి మనోజ్కుమార్రెడ్డి (అనంతపురం), ఆర్టీఐ వింగ్ కార్యదర్శిగా ఈ.లక్ష్మీకాంతయ్య (అనంతపురం) నియమితులయ్యారు. పోక్సో కేసు నమోదు కుందుర్పి: మండలంలోని జంబుగుంపల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత మంగళవారం సాయంత్రం ఓ చిన్నారిపై సదరు యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు బాధిత చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రామేశ్వరానికి ప్రత్యేక బస్సు హిందూపురం: హిందూపురం డిపో నుంచి జూలై 12వ తేదీన రామేశ్వరం యాత్ర స్పెషల్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలియజేశారు. 12న ఉదయం 7 గంటలకు హిందూపురం నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, శ్రీరంగం, మధురై చివరగా రామేశ్వరం దర్శనం తర్వాత 16న ఉదయం తిరిగీ హిందూపురం చేరుకుంటుందన్నారు. టికెట్ల కోసం ఫోన్నంబర్ 9440834715కు సంప్రదించాలన్నారు. -
‘నైపర్’లో సత్తా
అనంతపురం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) జేఈఈ–2025 ప్రవేశ పరీక్షల్లో జేఎన్టీయూ (ఏ) ఓటీపీఆర్ఐ విద్యార్థులు సత్తా చాటారు. అఖిల భారత స్థాయిలో ర్యాంకులు సాధించారు. కే. గురు చరణ్ 793 ర్యాంకు, డి. హేమంత్ కుమార్ 1,561, జి. దేవీ ప్రియ 2,187, ఎస్. కుష్వంత్ 3,205, బి. ఆర్తి 3,527, కే. సాయి కిరణ్ 5,124, కె. హేమంత్ 5,254 ర్యాంకులతో మెరిశారు. ఈ సందర్భంగా ఓటీపీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. గోపినాథ్ ఆయా విద్యార్థులను బుధవారం అభినందించారు.ఆర్ఎస్కే సిబ్బంది బదిలీలకు గ్రీన్సిగ్నల్అనంతపురం సెంట్రల్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఆఫ్లైన్లో,ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్ బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్ బదిలీ ఉద్యోగులకు వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్చికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది,‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 73 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మఅనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్ అధ్యక్షత వహించగా, చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనా రంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్కు ఎన్జీఓ, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు విన్నవించారు. రాజకీయ సిఫారసులు, పైరవీలు, అవకతవకలకు తావులేకుండా చూడాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ను ఆయన చాంబర్లో ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, చంద్రమోహన్, కోశాధికారి ప్రవీణ్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఐదేళ్లగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. నిబంధనల మేరకు సీనియారిటీ జాబితా ప్రకారం బదిలీలు నిర్వహించాలన్నారు. ఖాళీ స్థానాల జాబితాను ముందుగానే ప్రకటించడం తద్వారా అభ్యర్థులు స్థానాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రేషనలైజేషన్లో మిగిలిన వారి అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని కోరారు. బదిలీల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగమేష్, సహాయ కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు షణ్ముఖ, సాయినాథరెడ్డి, అనిల్, రవి పాల్గొన్నారు. కలెక్టర్కు సచివాలయ ఉద్యోగులు, ఎన్జీఓ సంఘం నాయకుల వినతి -
1,39,000
ప్రైవేటు ప్రొవైడర్లు చార్జీలు పెంచడంతో బీఎస్ఎన్ఎల్కు వచ్చిన వారు అనంతపురం1,05,000 పైగా 6,00,000● కలగానే బీఎస్ఎన్ఎల్ పూర్వవైభవం ● అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని సంస్థ ● పెరిగిన కస్టమర్లను నిలుపుకోలేని వైనం ● అనంతపురం జోన్లో లక్ష మందికి పైగా సర్వీసు నుంచి బయటకు ● పుట్టపర్తికి చెందిన శ్రీరామ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. సదరు సంస్థ ‘సీయూజీ’ సిమ్ ఇవ్వడంతో ఆ నంబర్ వాడేవాడు. కానీ మూడేళ్ల క్రితం ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ నంబర్ను వదులుకోలేక పోయాడు. సంస్థను అభ్యర్థించి ఆ నంబర్ మరో నెట్వర్క్లో ఉంటే పోర్టబులిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్కు మారాడు. అప్పటి నుంచి అతనికి సమస్యలు మొదలయ్యాయి. సిగ్నల్ సరిగా లేక డాటా కూడా ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఎవరికి ఫిర్యాదు చేసినా సేవలు మెరుగుపడకపోవడంతో ఇటీవలే మరో నెట్వర్క్లోకి మారిపోయాడు. ● అనంతపురానికి చెందిన మురళీమోహన్రెడ్డి 20 ఏళ్లుగా బీఎస్ఎన్ఎల్ నంబర్ వాడుతున్నారు. సిగ్నల్ సమస్య వచ్చినా, నెట్వర్క్ సరిగా రాకపోయినా మరో నెట్వర్క్లోకి మారేందుకు ఇష్టపడలేదు. కానీ రానురాను సమస్య మరీ తీవ్రంగా మారింది. ఇన్కమింగ్ కాల్స్ కూడా రావడం లేదు. పైగా మిత్రులంతా ఎందుకని ఎప్పుడూ సెల్ స్విచాఫ్ చేసుకుని ఉంటావంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో మురళీమోహన్రెడ్డి కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి సమస్య వివరించినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మరోనెట్వర్క్కు మారిపోయాడు. సేవలు సరిగా లేకసాక్షి ప్రతినిధి, అనంతపురం: అవకాశాలు రాక.. వ్యాపారాలు లేక చాలా దిగ్గజ సంస్థలన్నీ నిరాశగా ఉండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒక దశలో లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కావాలని సిమ్లు తీసుకుంటే వారికి సర్వీసు ఇవ్వ లేక చతికిల పడింది. సిగ్నల్స్ ఉండవు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు, నెట్ సరిగా రాకపోవడంతో సిమ్కార్డు ఎందుకు తీసుకున్నాం రా బాబూ అంటూ వినియోగదారులు గగ్గోలు పెట్టిన పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల పరిధిలో ఎంతో ఆశగా బీఎస్ఎన్ఎల్ సిమ్లు తీసుకున్న సంతోషం నాలుగు నెలల్లోనే ఆవిరి అయిపోయింది. టారిఫ్లు పెంచడంతో.. కొన్ని నెలల క్రితం జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు మొబైల్సర్వీస్ ప్రొవైడర్లు ఒక్కసారిగా నెలవారీ చార్జీలు పెంచాయి. దీంతో అనంతపురం జోన్ (కడప–అనంతపురం) పరిధిలో సుమారు 1.85 లక్షల మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపారు. దీంతో బీఎస్ఎన్ఎల్కు పూర్వవైభవం వచ్చినట్టయింది. కానీ కస్టమర్ల సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. సిమ్కార్డు తీసుకున్న వారం లోనే కష్టాలు మొదలయ్యాయి. మొబైల్కు సిగ్నల్స్ రాకపోవడం, నెట్సరిగా ఉండకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిపోయారు. పైగా సిబ్బందికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేక పోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకా 4జీనే.. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలను ఒక జోన్గా పరిగణిస్తారు. ఇటీవల ఈ జోన్లో సుమారు 1.85 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మారారు. దీంతో భారీగా బిజినెస్ పెరిగింది. సిమ్లు విచ్చలవిడిగా అమ్ముడయ్యాయి. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. కానీ నెలరోజుల్లోనే నెట్వర్క్ సరిగా పనిచేయలేదు. కాస్త రూరల్కు వెళితే సిగ్నల్స్ లేవు. పైగా ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లు 6జీకి వెళుతుంటే బీఎస్ఎన్ఎల్లో 4జీనే సరిగా రాదు. దీంతో కస్టమర్లలో సుమారు 1.39 లక్షల మంది వెనక్కు వెళ్లిపోయారు. టవర్లు తక్కువగా ఉండటం, సర్వీసులను ఉన్నతీకరించక పోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడి వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి తిరిగి వెనక్కు వెళ్లిన వారువైఎస్సార్ కడప 80,000 పైగాఅనంతపురంజిల్లాలో టవర్లుప్రస్తుతం రెండు జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు450 వరకూ వైఎస్సార్ కడప జిల్లాలో టవర్లు350 వరకూ -
చెత్త హామీతో ప్రజల చిత్తు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనంతపురంలో కంపోస్టు యార్డు తరలిస్తామని ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రగల్భాలు పలికారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణ జరగలేదు. రోజురోజుకూ చెత్త గుట్టలు గుట్టలుగా చేరుతోంది. కంపోస్టు యార్డులో దాదాపు 2 లక్షల టన్నులకుపైగా చెత్త ఉంది. నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి 74 సచివాలయాల పరిధిలో రోజూ 120 టన్నుల నుంచి 140 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 12 నుంచి 18 టన్నులు ప్లాస్టిక్ ఉంటోంది. ఈ క్రమంలో చెత్త నిర్వహణ పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష నరకం.. కంపోస్టు యార్డు ఉండే గుత్తి రోడ్డు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలైన లెక్చరర్స్ కాలనీ, రాజీవ్ కాలనీ వాసులతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈదురుగాలులు వచ్చాయంటే భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగ వస్తోంది. ఈ క్రమంలో పొగలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి రోడ్డు మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇక.. కంపోస్టు యార్డు నుంచి వచ్చే దుర్వాసన భరించలేక అక్కడి ప్రజలు నిత్యం తలుపులు, కిటికీలు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించి, పనికిరాని చెత్త, ప్లాస్టిక్ను అల్ట్రాటెక్, తదితర కంపెనీలకు పంపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నిషేధిత ప్లాస్టిక్ కూడా టన్నుల కొద్దీ కంపోస్టు యార్డులో పేరుకుపోయింది. ఈ క్రమంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే విషవాయువులు వెలువడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ స్పందించి కంపోస్టు యార్డును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ‘అనంత’లో అటకెక్కిన కంపోస్టు యార్డు తరలింపు అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని ‘తమ్ముళ్ల’ ప్రగల్బాలు ఏడాది పూర్తయినా పట్టించుకోని వైనం స్థానికులు, వాహనదారులకు తీవ్ర అవస్థలు -
రైల్వే అభివృద్ధికి పాటుపడదాం : డీఆర్ఎం
గుంతకల్లు: అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ రైల్వే అభివృద్ధికి పాటుపడదామని ఉద్యోగులకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనిబరిచిన టీటీఈలకు మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం సాయంత్రం డీఆర్ఎం కార్యాలయంలో జరిగింది. టిక్కెట్ చెకింగ్ స్క్వాడ్ గత నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న దాదాపు 14 మందికి అవార్డులను డీఆర్ఎం అందజేసి, అభినందించారు. ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీసీయం మనోజ్, కమర్షియల్ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం తరలింపుదారుడి అరెస్ట్ రాయదుర్గం: జిల్లాలోకి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ రాయదుర్గం మండలం కాశీపురం గ్రామానికి చెందిన కావలి తిప్పేస్వామి పట్టుబడినట్లు ఎకై ్సజ్ సీఐ మహేష్కుమార్, ఎస్ఐలు పవన్కుమార్, దామోదర్ తెలిపారు. కొంత కాలంగా తిప్పేస్వామి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నట్లుగా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
30 వరకే సబ్డివిజన్ డ్రైవ్ అనంతపురం అర్బన్: ‘భూములు రీ–సర్వే జరిగిన గ్రామాల్లో ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ ఈనెల 30 వరకే ఉంటుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా సమాచారం చేరవేయండి’ అని అధికారులను జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. సబ్ డివిజన్ డ్రైవ్ అంశంపై జేసీ బుధవారం కలెక్టరేట్ నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడంలో నెలకొన్న ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవర్ చేపట్టామన్నారు. రెవెన్యూశాఖ సబ్ డివిజన్ సేవకు నిర్ధారించిన రుసుము రూ.550లో రూ.500 మినహాయింపు ఇచ్చారన్నారు. నామమాత్రంగా దరఖాస్తు రుసుం రూ.50 సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద చెల్లించాలన్నారు. తదుపరి జాయింట్ పట్టాదారులకు ఉచితంగా సబ్డివిజన్ చేస్తారన్నారు. ఈ అవకాశం ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకున్నవారికే ఉంటుందన్నారు. రీ–సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఈ విషయాన్ని తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ పాల్గొన్నారు. ఏఈఓలకు ఇన్చార్జ్ ఏఓ బాధ్యతలు అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖలో పలువురు ఏఈఓలకు మండల ఏఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. డీ హీరేహాళ్ ఏఈఓ ఎన్.వి.గోపాల్కు బ్రహ్మసముద్రం ఏఓగా, కళ్యాణదుర్గం ఏఈఓ విజయకుమార్కు కుందుర్పి, గుత్తి ఏఈఓ మధుకర్కు ఉరవకొండ, తాడిపత్రి ఏఈఓ మధుకుమార్కు యల్లనూరు మండల వ్యవసాయాధికారిగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ కళ్యాణదుర్గం ఏఓగా శ్రావణ్కుమార్, కంబదూరు ఏఓగా మహేష్, గుంతకల్లు ఏఓగా లీనావసుందర, పుట్లూరు ఏఓగా కాత్యాయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హెచ్ఐవీపై చైతన్యం తీసుకువద్దాం
● ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, హెచ్ఐవీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె.నీలకంఠారెడ్డి సూచించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో పని చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రాంతీయ సమీక్షా సమావేశం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బుధవారం జరిగింది. హైరిస్క్ గ్రూపులు, మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, తదితరులకు అందిస్తున్న సేవలపై పీడీ నీలకంఠారెడ్డి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైరిస్క్ గ్రూపులతో పాటు వారి భాగస్వామ్యులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హెచ్ఐవీ సంక్రమించే అవకాశం ఉన్న యువత, ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర వర్గాలను గుర్తించి వారికి కూడా హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలన్నారు. ఏపీఎస్ఏసీఎస్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ... స్వచ్చంధ సంస్థలు అందించిన సేవల ఆధారంగా ప్రతి స్వచ్చంద సంస్థకు గ్రేడింగ్ ఇస్తారన్నారు. దీని ఆధారంగా నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఏపీ సాక్స్ డిప్యూటీ డైరెక్టర డాక్టర్ శ్రీనివాసవర్మ, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ సుకుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారులు డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ శారదాబాయి, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్లు వెంకటరత్నం, అలీహైదర్, రమణ, సిబ్బంది మురళి, నారాయణ స్వామి పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిస్తే తల్ సైనిక్ క్యాంపునకు ఎంపిక
కూడేరు: పది రోజుల పాటు కొనసాగే ఎన్సీసీ శిక్షణా తరగతుల్లో ప్రతిభ కనబరిస్తే ఽఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంపునకు ఎంపికవుతారని ఎన్సీసీ క్యాడెట్లకు క్యాంప్ కమాండర్ కల్నల్ ఎల్డీ రాడ్రిక్స్ సూచించారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–5 ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల నుంచి 500 మంది క్యాడెట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంప్ కమాండర్ ఎల్డీ రాడ్రిక్స్ మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణ మంచి భవిష్యత్తును ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు శారద, సంగీత శశికళ, ఇంద్ర బహుదూర్, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.రైల్వే స్టేషన్లో కుప్పకూలి వ్యక్తి మృతిగుత్తి: స్థానిక రైల్వే స్టేషన్లో చంద్రశేఖరరెడ్డి (51) అనే వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన చంద్రశేఖరరెడ్డి ఇటీవల తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన ఆయన గుత్తి రైల్వే స్టేషన్లో రైలు దిగాడు. స్టేషన్లో బయటకు వెళ్లడానికి మెట్లు ఎక్కుతున్న సమయంలో కుప్పకూలి కింద పడి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు.ఉత్తమ బాడీ బిల్డర్గా హేమంత్బుక్కరాయసముద్రం: బెంగళూరు వేదికగా ఐసీఎన్ ఇండియా ఇటీవల నిర్వహించిన బాడీ బిల్డర్, ఫిట్నెస్ మోడలింగ్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బీకేఎస్ మండలం రేకులకుంట గ్రామానికి చెందిన ఆకుల నాగభూషణ కుమారుడు హేమంత్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు, బాడీ బిల్డర్లు, ఫిట్నెస్ మోడల్స్ తలపడిన ఈ పోటీల్లో ప్రామాణిత డ్రగ్ టెస్టింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. -
అనుకున్నట్టే చేశారు!
● 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు వేర్వేరుగా బదిలీల కౌన్సెలింగ్ ● బెదిరించే ధోరణితో ముందుకెళ్లిన అధికారులు ● ఎట్టకేలకు 2008 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి అనంతపురం ఎడ్యుకేషన్: ఇప్పటికే రెండుమార్లు వాయిదా పడ్డ ఎంటీఎస్ టీచర్ల బదిలీల అంశంలో అధికారులు కొత్త పంథా ఎంచుకుని అనుకున్నట్టే చేశారు. సీనియార్టీ జాబితాలో 2008 ఎంటీఎస్ టీచర్లు ముందున్నారు. వీరి తర్వాతనే 1998 ఎంటీఎస్ టీచర్లు మొదలవుతారు. ఖాళీలన్నీ దూర ప్రాంతాల్లో ఉండడం, ఉన్న వాటిలో 2008 ఎంటీఎస్ టీచర్లకు కాస్తా మంచివి దక్కుతాయి. రెండుసార్లు వాయిదా పడడంలో 1998 ఎంటీఎస్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ... ఎంటీఎస్ టీచర్ల మధ్య ‘విభజించు–పాలించు’ సూత్రాన్ని అమలు చేసింది. 2008, 1998 వారిని కలిపికాకుండా వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీఈఓ పేరుతో మెసేజ్ పంపారు. ‘2008 ఎంటీఎస్ టీచర్లకు మాత్రమే సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్’ ఉంటుందని పేర్కొన్నారు. గొడవతో ఉద్రిక్తత.. సాయంత్రం 5 గంటలకు 2008 ఎంటీఎస్ టీచర్లందరూ వచ్చారు. జాబితాలో 50 మందికి మాత్రమే మంచి స్కూళ్లు వస్తాయి. తక్కిన 147 మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని వాపోయారు. ఇలా రెండు గ్రూపులు విడిపోయి వాదించుకున్నారు. ఇదే సమయంలో ‘కౌన్సెలింగ్కు హాజరుకాకపోతే నేరుగా కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జనరేట్ అవుతాయి.. ఎవరికి ఎక్కడొస్తాయో మీ ఇష్టం’ అంటై విద్యాశాఖ సిబ్బంది బెదిరింపులకు గురి చేయడంతో ఎంటీఎస్ టీచర్లు ఇరకాటంలో పడ్డారు. జాబితాలో ముందున్న కొందరు తాము కౌన్సెలింగ్లో పాల్గొంటామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. డీఈఓ ఎం. ప్రసాద్బాబు పర్యవేక్షణలో ప్రక్రియ సాగింది. ఇక.. నేడో, రేపో 1998 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కమిషనరేట్ నుంచి ఆదేశాలు రాగానే 1998 ఎంటీఎస్ టీచర్లకు సమాచారం చేరవేస్తామని డీఈఓ వెల్లడించారు. -
ప్రియుడితో భర్తను చంపించిన భార్య
రాప్తాడు రూరల్ : 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భర్తను కాదని.. రెండునెలల క్రితం పరిచయమైన ప్రియుడిపై ఓ మహిళ మోజు పెంచుకుంది. అది చివరకు భర్తను అంతమొందించేందుకు దారితీసింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన ఆరు గంటల్లోనే అనంతపురం రూరల్ పోలీసులు మిస్టరీని ఛేదించారు. వివరాలివీ..అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివకాలనీకి చెందిన కుమ్మర నరసాపురం సురేశ్బాబు (43), అనిత దంపతులు. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో సురేష్బాబు ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. భార్య అదే ప్రాంతంలోని ఓ హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అనితకు రెండునెలల క్రితం ఆటోలో పండ్లు అమ్ముకునే బాబాఫకృద్దీన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు అనుమానం రావడంతో..భార్య వ్యవహారశైలిపై ఇటీవల సురేశ్బాబుకు అనుమానం వచ్చింది. దీంతో మద్యం మత్తులో భార్యను వేధించడం ప్రారంభించాడు. తనను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రియుడికి అనిత వివరించింది. భర్తను కడతేరిస్తే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి భర్త హత్యకు పథకం రచించారు. ఈ క్రమంలో సురేశ్బాబు మంగళవారం రాత్రి 11 గంటలకు హోటల్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అక్కంపల్లి–రాచానపల్లి మధ్య మాటువేసిన బాబాఫకృద్దీన్ ఖాళీ సీసాను సురేశ్బాబుపై విసిరాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిన సురేశ్పై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ఓ పెద్ద బండరాయితో హతమార్చి ఉడాయించాడు. భార్య తీరుపై అనుమానంతో..ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐ శేఖర్, ఎస్ఐ రాంబాబు, సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హతుడి భార్య అనితతో మాట్లాడారు. తన భర్త చాలా మంచివాడని ఎవరితోనూ గొడవల్లేవని ఎందుకు హత్యచేశారో తనకు తెలీదంటూ వాపోయింది. అయితే, ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె నడవడికపై ఆరా తీశారు. ఆ తర్వాత బాబాఫకృద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.