breaking news
Ananthapur
-
సమ్మెలోకి ‘సహకార’ ఉద్యోగులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్–సొసైటీ) ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. దీని కారణంగా సొసైటీల్లో కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. పంట రుణాలు, భూములపై వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ ఆగిపోనున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 110 సొసైటీ ఉద్యోగుల సమ్మె వల్ల డీసీసీబీ సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో పోరుబాట.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. 18 నెలలుగా దశల వారీ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కమిషనర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా సానుకూల స్పందన కనిపించలేదు. దీంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నారు. డీసీవో, డీసీసీబీ, ఆప్కాబ్ కమిషనర్ కార్యాలయాల వద్ద వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,060 సొసైటీల ఉద్యోగులు దాదాపు 9 వేల మంది రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ఎదుట 13 రోజుల పాటు వంటావార్పుతో పెద్ద ఎత్తున నిరసనతో పాటు ముట్టడి చేపట్టినా చలనం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి. ఇక తమ సమస్యలకు పరిష్కారం లభించేదాకా ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మెలో ఉంటామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జీవో 36 అమలు చేయాలి.. ప్రధానంగా జీవో 36 అమలు చేయాలని, 2019, 2024 పీఆర్సీ ఇవ్వాలని, లేదంటే 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రూ.2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డు వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు వెళుతున్నట్లు పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు తెలిపారు. నేటి నుంచి మూతపడనున్న సొసైటీలు నిలిచిపోనున్న రైతు రుణాలు, ఎరువుల పంపిణీ -
●పరమేశ్వరా... పాహిమాం!
మహాశివరాత్రి వేడుకలు అంబరమంటాయి. జిల్లా అంతటా ఆదివారం శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర.. నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మహా శివరాత్రి పర్వదిన ప్రాముఖ్యతను పండితులు వివరించారు. భక్తులు ఉపవాస దీక్షతో పాటు రాత్రంతా జాగారం చేసి పరమ శివుని సేవలో తరించారు. ఆలయాలతో పాటు ప్రత్యేక శిబిరాల వద్ద మహాశివరాత్రి వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. – అనంతపురం కల్చరల్ -
సేవాలాల్ మార్గంలో పయనించాలి
గుత్తి రూరల్: సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. సేవాగఢ్లో మూడు రోజులుగా జరుగుతున్న సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మారుతీప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ మహరాజ్కు కుంభాభిషేకం జరిపించారు. ఉత్సవ విగ్రహాన్ని తోలారం గుర్రంపై ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవాలాల్ మాలధారులు ఇరుముడులు సమర్పించారు. ఆలయం ఎదుట ఉన్న హోమం కట్టపై మహా భోగ్ (హోమం) నిర్వహించారు. 108 మంది కన్యలచే పూర్ణ గంగ కలశోత్సవం నిర్వహించారు. బంజారాలు సంప్రదాయ దుస్తులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రాకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ సేవాగఢ్ ఎంతో పవిత్రమైన పుణ్య స్థలమన్నారు. సేవాలాల్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అనంతరం ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రభుత్వ ఆధికారులను జేసీ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అప్పా వెంకటేష్, సంత్ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, సభ్యులు రవీంద్రనాయక్, అశ్వత్థనాయక్, సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ఖాన్ పాల్గొన్నారు. ● సేవాగఢ్లోని సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దర్శించుకున్నారు. మంత్రికి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన మహాభోగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముగిసిన జయంత్యుత్సవాలు -
నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో బిల్గేట్స్ బృందం సమావేశం కారణంగా పై కార్యక్రమాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. కాన్ఫరెన్స్ కారణంగా జిల్లాస్థాయితో పాటు మండల, డివిజన్ స్థాయలోనూ రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి రావద్దని సూచించారు. వర్చువల్గా హాజరవ్వాలి బిల్గేట్స్ బృందంతో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో జరగనున్న సమావేశానికి కలెక్టరేట్ నుంచి తనతో పాటు జిల్లా అధికారుల బృందం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు, మండలస్థాయి అధికారులు వర్చువల్గా హాజరు కావాలని ఆదేశించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ విజేత ‘గంజికుంట ఈగల్స్’ వజ్రకరూరు: రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ విజేతగా గంజికుంట ఈగల్స్ జట్టు నిలిచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గంజికుంటలో గ్రామపెద్దల ఆధ్వర్యంలో జనవరి 14న రాష్ట్ర స్థాయి 8వ టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 86 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం గంజికుంట ఈగల్స్ జట్టు, హోతూరు రాజా లెవెన్స్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. హోతూరు రాజా లెవెన్స్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులుచేసింది. అనంతరం గంజికుంట ఈగల్స్ జట్టు 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయం సాధించి, ట్రోఫీ కై వసం చేసుకుంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి 75 పరుగులు చేసిన గంజికుంట ఈగల్స్ బ్యాటర్ అసురకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రతిభ కనబరచిన సూర్య (హోతూరు రాజా జట్టు ఆటగాడు సూర్య మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఎన్ఆర్ఏఐఎన్ హార్వేస్టింగ్ మిషన్ డీలర్ సుధాకర్ సోదరులు రూ.60 వేల నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందించారు. రన్నరప్గా నిలిచిన హోతూరు రాజా లెవెన్స్ జట్టుకు గ్రామానికి చెందిన హాజీ సోదరులు రూ.30 వేల నగదు బహుమతితో పాటు కప్ అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జట్టుకు గ్రామానికి చెందిన బీఆర్.అంబేద్కర్ కమిటీ వారు రూ.10వేల నగదు, కప్ అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ గౌరవాధ్యక్షుడు బీపీ వీరప్ప, సర్పంచ్ జయేంద్రరెడ్డి, కార్యవర్గసభ్యులు జక్కల శ్రీని వాసులు, ఆవుల కుళ్లాయప్ప, ప్రదీప్, ఓబుళపతి, ఆర్గనైజర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంతా మా ఇష్టం.. ● రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు సాక్షి, పుట్టపర్తి: గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఆదాయం కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గ్రామంలో బాగున్న పాఠశాల భవనాన్ని కూల్చి వేసి ఆగమేఘాలపై అక్కడ పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల భవనాన్ని కూల్చివేసేందుకు.. కొత్తగా పంచాయతీ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి సవిత ప్రోద్బలంతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం. పంచాయితీ భవన నిర్మాణం కోసం వేస్తున్న బేస్మెంట్ బలంగా లేదని, నాసిరకంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్
ఉరవకొండ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా ఉందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో రాష్ట్ర బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో తాజాగా రూ.లక్ష కోట్ల వరకు అప్పులు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లం చేశారన్నారు. నిధులు ఎలా తెస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రవ్యలోటు కూడా ఈస్థాయిలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆర్థికవేత్తలు సైతం రాష్ట్ర బడ్జెట్ను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారని, ఇది మరింత అప్పుల ఊబిలో నెట్టే బడ్జెట్గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలతో మభ్యపెట్టారన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటున్న ప్రభుత్వం.. హర్టికల్చర్ రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ హామీలు అరకొరగా సాగుతున్నట్టే బడ్జెట్ కూడా అరకొరగానే అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, సూపర్ సిక్స్ హామీలు కూడా ప్రజల ఆలోచనల నుంచి తొలగించాలన్న భావనతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విద్య, వైద్యంతో పాటు గ్రామీణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. గత వైఎస్ జగన్ పాలనను విమర్శించడంతోనే చంద్రబాబు ప్రభుత్వానికి సమయం సరిపోతోందన్నారు. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ రూ.2.75లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా అందించారని గుర్తు చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థికంగా వారిని బలోపేతం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్ లాంటివి అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన మూడవ బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్పై వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
రెవెన్యూ క్లినిక్లో అందని భూ చికిత్స
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిన్’లో అర్జీలకు మొక్కుబడిగా పరిష్కారం లభిస్తోంది. ఈ విషయాన్ని అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. అందిన అర్జీలు వందల్లో ఉంటే పరిష్కరించిన అర్జీలు పదుల సంఖ్యలో ఉండడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 26న రెవెన్యూ క్లినిక్ ప్రారంభించారు. ప్రతి సోమవారం పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ను కూడా నిర్వహిస్తున్నారు. భూ సమస్యలపై అప్పటి నుంచి అంటే దాదాపు రెండు నెలల వ్యవధిలో అందిన అర్జీల సంఖ్య 944 కాగా.. పరిష్కరించిన అర్జీలు 59గా నివేదికలో పేర్కొన్నారు. 95 శాతం మండలస్థాయివే.. రెవెన్యూ క్లినిక్లో అందుతున్న అర్జీల్లో 95 శాతం మండలస్థాయిలో పరిష్కారం కావాల్సినవే ఉంటున్నాయి. ఇప్పటి వరకు అందిన 944 అర్జీల్లో జిల్లాస్థాయిలో పరిష్కారం కావాల్సినవి 48 మాత్రమే (22ఏ) ఉన్నాయి. మిగిలిన అన్ని సమస్యలూ తహసీల్దారు స్థాయిలో పరిష్కరించాల్సినే కావడం గమనార్హం. సత్వర పరిష్కారం ఎక్కడ..? భూ సమస్యలపై అర్జీలను మండలస్థాయిలో స్వీకరించినా.. మండలస్థాయి యంత్రాంగం జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ తీసుకున్నా... పరిష్కారం కల్పించడంలో జరుగుతున్న జాప్యంలో ఎలాంటి మార్పూ లేదు. అర్జీలకు సత్వర పరిష్కారం కనిపించడం లేదు. ఇప్పటి వరకు అందిన వాటిలో 687 అర్జీల పరిషారానికి చర్యలు తీసుకున్నామంటూ (యాక్షన్ టు బీ టేకెన్) చూపిస్తున్నారు. అవి ఎప్పటికి పరిష్కరిస్తారనేది అధికారులకే తెలియాలి. మిగిలిన వాటిలో 12 జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ)కు పంపించారు. సచివాలయాలకు 89 పంపగా, ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ కింద 49 రిజిస్టర్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించి 48 సమస్యలు ఉన్నాయి. మండలం, డివిజన్ను వదిలేసి.. ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించేందు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అయితే రెవెన్యూ క్లినిక్ను ప్రారంభించిన తరువాత సోమవారం రోజున తహసీల్దార్లు మండలాన్ని.. ఆర్డీఓలు డివిజన్ను వదిలేసి సిబ్బందితో జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీంతో మండలస్థాయిలో అర్జీల స్వీకరణ బాధ్యతను డిప్యూటీ తహసీల్దారుకు అప్పగిస్తున్నారు. మండలంలో తహసీల్దారు లేకపోవడంతో అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేదంటూ ప్రజలు వ్యయప్రయాసలకోర్చి తప్పనిసరై జిల్లా కేంద్రానికి వస్తున్నారు. భూ సమస్యలపై వినతుల వెల్లువ రెండు నెలల్లో అర్జీలు 944, పరిష్కారం 59 మాత్రమే ఐదు మండలాల నుంచే 370 అర్జీలు -
జయహో.. భారత్
పాక్పై విజయంతో అభిమానుల సంబరాలు అనంతపురం కార్పొరేషన్: చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఎప్పుడు విజయం సాధించినా అభిమానుల్లో పట్టలేని ఆనందం. టి20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్– పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. జిల్లా కేంద్రంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సప్తగిరి సర్కిల్, టవర్క్లాక్ తదితర ప్రాంతాల్లోకి భారీగా చేరుకున్నారు. యువత బైక్ నడుపుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు జాతీయ జెండాను పట్టుకుని సందడి చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
రాయదుర్గంటౌన్: మండల పరిధిలోని భూపసముద్రం వద్ద అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు చనిపోయాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకలోని నాయకనహట్టి పంచాయితీ పరిధిలోని మల్లూరహళ్లి గ్రామవాసులు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మల్లూరుహళ్లి గ్రామం నుంచి డీజల్ ఆటోలో రాయదుర్గం మండలం జుంజుంరాపల్లి గ్రామంలోని చిత్రకొండపై వెలసిన అరుడ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరారు. అయితే భూపసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్కు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉచ్చప్ప (50) మృతి చెందారు. అలాగే రమేష్ (6) తీవ్ర రక్తగాయాలు కాగా సంగీత (22)కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రమేష్ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైదులు సిఫార్సు చేయడంతో క్షతగాత్రులను కర్ణాటకలోని చిత్రదుర్గంకు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన బాలుడు రమేష్, మృతుడు ఉచ్చప్ప ఇద్దరికి గాయాలు -
పాముకాటుతో రైతు మృతి
పుట్టపర్తి టౌన్: పాముకాటుతో యవ రైతు మురళీ (35) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి రాయలవారిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయలవారిపల్లికి చెందిన రామప్ప, చిన్నాగమ్మ దంపతుల కుమారుడు మురళీ తన పొలంలో దోస పంట సాగు చేశారు. ఆదివారం ఉదయం తన భార్యతో కలసి తన పొలంలో వేసిన దోస పంటకు మందుల పిచికారీకి వెళ్లాడు. పని ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం వాంతులు, వీరేచనాలు కావడంలో కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే మృతి చెందారు. పాము కాటుతో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
తప్పుల తడకగా ‘డ్యాష్ బోర్డు’
మోసపూరిత బడ్జెట్ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేదు. అబద్ధపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తోంది. సూపర్సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకపోవడం సిగ్గుచేటు. పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిల చెల్లింపులకు అరకొరగా నిధులు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతోంది. అన్నదాతను ఆదుకునే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదని బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్, వేతన సవరణ, పెండింగ్ బకాయిల నిధుల గురించి ప్రస్తావించకుండా వారిని కూడా మోసం చేశారు. – వై.వెంకటరామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే యువతను దగా చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం యువతను దగా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం... జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం మోసానికి పరాకాష్ట. ఎన్నికల సమయంలో యువతకు స్పష్టమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేకుండా మోసం చేస్తున్నారు. ఏటా జనవరి 1న జాబ్క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోచింగ్ కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – సంతోష్ , ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య గుంతకల్లు రూరల్: కడుపునొప్పి తాళలేక ఇర్ఫాన్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం గుంతకల్లులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు .. స్థానిక కసాపురం రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం ముందు భాగంలో నివాసం ఉంటున్న రహిమాన్, ఖాశీంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు కియాలో పని చేస్తుండగా చిన్న కుమారుడైన ఇర్ఫాన్ ఇంటర్ ఫెయిల్ కావడంతో రెండేళ్లుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 13న రహిమాన్, ఖాశీంబీ తమ బంధువుల ఇంటికి కర్నూలుకు వెళ్లి శనివారం అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట నుంచి ఎంత పిలిచినా కుమారుడు తలుపు తీయలేదు. అనుమానం కలిగిన తల్లిదండ్రులు తలుపు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా కుమారుడు ఉరి తాడుకు వేళాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే చాలు కాగిత రహిత పాలన అంటూ ఊదర కొడుతుంటారు. అయితే ఆయన మాటలకు చేతలకు ఏం సంబంధం ఉండదని ఎన్నోసార్లు రుజువైంది. కమిషనర్, డ్రైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డ్యాష్బోర్డ్ కూడా దాన్నే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పొందుపరిచేవారు. సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చాక, ఈ పరిస్థితి మరింత మెరుగ్గా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో డ్యాష్ బోర్డు తప్పుల తడకగా మారింది. సిబ్బంది ఉన్నా హాజరు శాతం సున్నా... డ్యాష్బోర్డ్లో నమోదువుతున్న యూఎల్బీ హాజరు గణాంకాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో శానిటేషన్ విభాగం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం నగరంలో శానిటేషన్ విభాగంలో మొత్తం 586 మంది సిబ్బంది ఉండగా హాజరులో 0 శాతంగా చూపించారు. ఇందులో 450 మంది పీహెచ్ వర్కర్లు, 35 మంది డ్రైవర్లు, 60 మంది లోడర్లు, 41 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. గుత్తి 92 మంది, గుంతకల్ 200 మంది, కళ్యాణదుర్గం 57 మంది, రాయదుర్గం 128 మంది, తాడిపత్రి 172 మంది ఉన్నా జీరో శాతంగా నమోదైంది. ఇదే పరిస్థితే శ్రీసత్యసాయి జిల్లాలోనూ కనిపిస్తోంది. ధర్మవరం 198 మంది, హిందూపురం 314 మంది, కదిరి 175 మంది, మడకశిర 29 మంది, పుట్టపర్తి 62 మంది ఉన్నా సిబ్బంది హాజరు శాతం సున్నాగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే.. వందలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ హాజరు నమోదు లేకపోవడం శానిటేషన్ సేవలు స్తంభించాయా లేక అటెండెన్స్ నమోదు చేయలేదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ గణాంకాలు పూర్తిస్థాయిలో అప్డేట్ కాలేదని భావించినా కార్యాలయాల్లో ఏరోజుకారోజు నమోదు చేయాల్సిన సిబ్బంది హాజరు వివరాలపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బయోమెట్రిక్ లేదా ఆ్లైన్ అటెండెన్స్ వ్యవస్థ సక్రమంగా పర్యవేక్షించకపోవడం, స్థానిక స్థాయిలో అధికారులు రోజువారీ సమీక్షలు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు. కీలక సేవలపై ప్రతికూల ప్రభావం శానిటేషన్ సిబ్బంది హాజరును సున్నాగా చూపబడటంతో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ వంటి కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దోమల వ్యాప్తి, చెత్త పేరుకుపోవడం, సంక్రమణ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల సీడీఎంఏ స్థాయిలోనే తక్షణ సమీక్ష నిర్వహించి, రోజువారీ హాజరు నమోదు తప్పనిసరి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరం. డ్యాష్బోర్డ్లోని గణాంకాలు కేవలం సంఖ్యలు కాకుండా పట్టణ శుభ్రత వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్న హెచ్చరిక సంకేతాలుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిండు ప్రాణాన్ని బలిగొన్న యూటర్న్పోటాపోటీగా రాతి దూలం పోటీలు సీడీఎంఏ డ్యాష్బోర్డులో శానిటేషన్ సిబ్బంది హాజరు చూపని అధికారులు కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పట్టించుకోని ఉన్నతాధికారులు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి -
శభాష్ విష్ణు భగవాన్
యాడికి: మండలంలో పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్ 22 ఏళ్లుగా నాణేలను సేకరిస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నారు. దక్షిణ భారతదేశంలో విజయనగర రాజుల పాలన అప్రతిహతంగా సాగింది. తుంగభద్ర నదీ తీరాన సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు రాజ వంశాలు పాలించాయి. తుళువ వంశస్తుడైన కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. విజయ నగర కాలంలో బంగారు నాణేలను చలామణి చేశారు. మొదటి హరిహర రాయలుగా బుక్కరాయలు, రెండో హరిహర రాయలుగా శ్రీకృష్ణ దేవరాయలు, చివరిగా చంద్రకోటను పాలించిన వెంకటపతిరాయలు బంగారు నాణేలను వినియోగించారు. ఈ అపురూపమైన బంగారు నాణేలను విష్ణు భవగాన్ ఎంతో కష్టపడి సేకరించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో పుర ప్రజలు, విద్యార్థులు కోసం ఉచితంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో ఒక వైపు శివపార్వతులు, మరో వైపు ప్రతాప దేవరాయులు ఉన్న బంగారు నాణాన్ని యాడికిలో ప్రదర్శించారు. 22 ఏళ్లుగా నాణేల సేకరణ ఉచిత ప్రదర్శనల ద్వారా ఆదర్శం -
నిరాశ మిగిల్చిన బడ్జెట్
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగింది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మంత్రి కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలు, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ -
అపు‘రూపం’... పాదరస శివలింగం
● నేడు ఆలయంలో ప్రత్యేక పూజలురాయదుర్గంటౌన్: శివలింగం అంటే తెలియని వారు, చూడని వారు ఉండరు. అయితే పాదరస శివలింగాన్ని చూశారా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే పాదరసాన్ని ఘనరూపంలో చూడలేం కాబట్టి!. అయితే ఇలాంటి అపు‘రూప’మైన శింగలింగాన్ని రాయదుర్గం పట్టణంలోని శ్రీరాజ విద్యాశ్రమంలో చూడవచ్చు. దేశంలోనే ప్రథమంగా 1974లో అప్పటి ఆశ్రమ పీఠాధిపతి జీవన్ముక్తస్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వాముల వారు రాయదుర్గంలో పాదరస శివలింగాన్ని ప్రతిష్టించారు. జీవన్ముక్తస్వామి రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు కృషి చేసి రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింప చేసి లింగాకృతినిచ్చారు. ఈ శివలింగం 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. పాణిపటాన్ని మాత్రం నల్లరాతితో కర్ణాటకలోని రాణిబెన్నూరులో తయారు చేయించి ప్రతిష్టించారు. ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని తాకే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు. నీళ్లడిగి.. నిలువునా దోచి ● గుంతకల్లులో కి‘లేడీల’ బ్యాచ్ హల్చల్ గుంతకల్లుటౌన్: పట్టణంలో కిలాడీ మహిళల బ్యాచ్ హల్చల్ చేసింది. ఓ మహిళ ఇంటికి వెళ్లి నీళ్లు అడిగి.. ఆమెను మాటల్లో దించి నగలు, నగదుతో ఉడాయించింది. వివరాల్లోకెళితే... హౌసింగ్బోర్డు నాగసముద్రం బావి వీధికి చెందిన సరస్వతి రోజుమాదిరిగానే శనివారం ఉదయం ఆకుకూరలు అమ్ముకుని ఇంటికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత ఆరుగురు మహిళలు ఆమె ఇంటికి వచ్చి తాగడానికి నీళ్లు కావాలని హిందీలో అడిగారు. నీరు తాగేందుకు గ్లాసులు ఇవ్వగా అందుకు వారు నిరాకరించి.. దోసిట్లో పోయాలని కోరారు. సరే అని నీరు పోస్తుండగా వారంతా చుట్టూ చేరి ఆమెతో మాటలు కలిపారు. ఆరుగురిలో ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి.. అందులో భద్రపరిచిన ఆరు గ్రాముల బంగారు కమ్మలు, 30 తులాల వెండి, రూ.5 వేల నగదుతో ఉడాయించింది. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఇంట్లోకి వెళ్లి సరస్వతి చూడగా బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని, భర్త అంజికి సమాచారమిచ్చింది. నిందితులు మిల్లు ఏరియా మీదుగా వెళ్లినట్లు సమాచారం రావడంతో ఆ వైపు గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా ఆరుగురు ముఠా సభ్యులు మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. -
పేదల వ్యతిరేక బడ్జెట్
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్గా కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్కళ్యాణ్.. చివరకు మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయలేని పరిస్థితికి వచ్చారు. ‘చంద్రబాబు వల్ల స్వర్ణాంధ్ర సాకారం అవుతోంది.. నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగం మెరుగవుతోంది.. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి పరుగు పెడుతోంది’ అంటూ డబ్బా కొట్టుకున్నారు. గడిచిన 20 నెలల్లో ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కాదు.. నేరాంధ్ర.. అప్పులాంధ్ర.. కబ్జాంధ్ర.. దోపిడీ ఆంధ్రగా సాకారమైంది. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న అనేలా చంద్రబాబు పాలన సాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులకు రూ.10,700 కోట్లు అవసరమైతే రూ.6600 కోట్లు మాత్రమే కేటాయించారు. 12వ పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. 50 ఏళ్లకే పింఛన్ అమలు లేదు. నిరుద్యోగ భృతిపై అతీగతీ లేదు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీల కృష్ణాజలాలను తొలిసారిగా తరలించామని పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అపద్ధాలు చెప్పారు. రైతులు, యువత, విద్యార్థి, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరోసారి మోసం జరిగింది. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
● గిరిజనులకు విరివిగా రుణాలు అందించాలి ● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, గిరిజన నాయకులతో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్పతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ కమిషన్కు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో నాణ్యతగా కల్పించాలన్నారు. తండాల్లో రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బలో సుమారు 2 వేల మంది ప్రజలు ఉన్నారని, ఇప్పటిదాకా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రోడ్డు వేయాలని ఆదేశించారు. సేవాలాల్ జయంతికి రూ. 50 లక్షల నిధులు విడుదల చేశారని, మరిన్ని నిధులు విడుదల చేయాలన్నారు. మదిగుబ్బ గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ ఉందని, తండాకు పైప్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఎస్టీలకు విరివిగా బ్యాంకు రుణాలు అందించాలన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిందన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుమ్ అమలు మొదలైందన్నారు. ఎస్టీలకు పూర్తి స్థాయిలో పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ సేవాగడ్ను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సీపీఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులకు అండగా అంటాం రాప్తాడు రూరల్/ఆత్మకూరు: గిరిజనులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన కురుగుంట సేవాలాల్ కాలనీతో పాటు ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బ తండాలో పర్యటించారు. గిరిజనులతో సమావేశం నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీలు తమ సమస్యలను ncstgrams.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ, తహసీల్దార్లు మోహన్ కుమార్, లక్ష్మినాయక్, ఎంపీడీఓలు లక్ష్మినరసింహ, దివాకర్, ఏఐబీఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాన్నోత్ చక్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
గుత్తి రూరల్: దేశంలో ధర్మం, సమాజాభివృద్ధి, గో సంరక్షణకు పాటుపడి బంజారాల ముద్దు బిడ్డగా విరాజిల్లుతున్న సేవాలాల్ మహరాజ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంత్ శ్రీ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, జాతీయ ఎస్టీ కమిషన్ జాటోత్ హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు. గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్లో శనివారం రాత్రి సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి, టెంకాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జీవన విధానాన్ని గిరిజనులు అలవర్చుకోవాలన్నారు. జల్ (నీరు), జమీన్ (భూమి), జంగల్ (అడవి) అనే నినాదంతో సేవాలాల్ గిరిజనుల హక్కుల కోసం పోరాడారన్నారు. అంతటి మహనీయుని ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. సేవాగఢ్ను పవిత్ర పుణ్యక్షేత్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బంజారా నాయకులతో కలసి విద్యా హబ్గా చేస్తామన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్ మాట్లాడుతూ సేవాగఢ్ ఆలయ అభివృద్ధిని తాము ముందుండి నడిపిస్తామని చెప్పారు. ఇక్కడ బంజారా యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చిన ముఖ్య అతిథులను బంజారాల సంప్రదాయ తలపాగ (పగిడి)లతో ప్రత్యేకంగా సన్మానించారు. సన్మార్గంలో నడవండి బంజారాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని భారత్ సాధు సమాజ్ గురూజీ చేతన్ గిరి మహరాజ్ సూచించారు. బంజారాలు ముందుగా సేవాలాల్ మహరాజ్ ఉత్సవ విగ్రహాలతో అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం విగ్రహాన్ని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్ని కిటకిటలాడాయి. ఉత్సవాలలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, బంజారా ముఖ్యనేతలు అశ్వత్థనాయక్, శేఖర్నాయక్, హరిలాల్ నాయక్, ఠాగూర్ నాయక్, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, డిప్యూటీ ఎంపీడీఓ నరసింహారెడ్డి, ఫైర్ ఆఫీసర్ అశ్వర్థ, డీఎస్పీ శ్రీనివాస్, గుత్తి సీఐ రామారావు, ఎస్ఐలు సురేష్, అమీర్ఖాన్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
ప్రభుత్వం వల్లే ఎఫ్సీఆర్ఏ ఆగిపోయింది
● ఆర్డీటీ సేవలు కొనసాగించాలి ● మాజీ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదరికాన్ని పారదోలేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాకుండా ఆగిపోయిందని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య దుయ్యబట్టారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించాలని, త్రిబుల్ ఇంజిన్ సర్కార్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శనివారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వద్ద ఉన్న తిమ్మప్ప కొండకు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రంగయ్య మెట్ల మార్గంలో కాలినడన ‘సేవ్ ఆర్డీటీ’ నినాదంతో వెళ్లారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్ 21 నుంచి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రజల తరఫున ఆర్డీటీ సంస్థ కోసం పోరాటం చేస్తోందన్నారు. మే నెలలో బైక్ ర్యాలీ చేపట్టి నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతులను చేశామని, జూన్లో పాదయాత్ర ద్వారా నేతలకు కనువిప్పు కలిగేలా చేశామని చెప్పారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా 1969 నుంచి పేదరికాన్ని రూపుమాపుతున్న సంస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపునకు దిగాయన్నారు. రెన్యువల్ వస్తుందని చంద్రబాబు, లోకేష్తో చర్చించామని టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే వైద్యం, వ్యవసాయ, మహిళా రంగాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరోసారి సేవ్ ఆర్డీటీ కార్యక్రమం పేరుతో శాంతియుత ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మయ్య, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక కార్యదర్శి టైలర్ వన్నూరుస్వామి, పార్టీ కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీలు చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, సీనియర్ నాయకుడు వన్నూర్రెడ్డి, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు నాగలక్ష్మి, అభిలాష్ రెడ్డి, నరసింహులు, తిప్పేస్వామి, నరేష్, రామిరెడ్డి, మంజు, భాస్కర్, మల్లికార్జున, పాండు, కై రేవు గంగాధర్, వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయక్, గోపాల్ రెడ్డి, బసవరాజు, రాము, కేశవ్గౌడ్, కొండాపురం రాము, రామ్మోహన్, గంగాధర్, జిన్నా మల్లికార్జున, తిమ్మారెడ్డి, శంకర్ నాయక్, జానీ, మల్లికార్జునతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇది డొల్ల బడ్జెట్
సంక్షేమం, అభివృద్ధి రెండూ లేని అప్పుల డొల్ల బడ్జెట్. అమరావతి నిర్మాణమే అన్ని సమస్యలకూ పరిష్కారమని రాష్ట్ర బడ్జెట్ తేల్చేయడం దారుణం. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేటాయింపులో మొండి చేయి చూపించారు. ప్రాజెక్ట్లు పూర్తి చేయకుండా.. నీళ్లు లేకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఎలా చేస్తారు? రాయలసీమలో కడప ఉక్కు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రస్తావనే లేదు. – కేవీ రమణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఆర్డీటీని కాపాడుకుందాం
● ఉద్యమాలతోనే అది సాధ్యం ● చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రమేష్ గౌడ్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ప్రసంగానికి టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రమేష్గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పేదలకు సంస్థ సేవలు దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో సుధాకర్ యాదవ్ జోక్యం చేసుకుని సమావేశాన్ని రసాభాసగా మార్చాడు. అతని తీరును సమావేశంలో పాల్గొన్న ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. ‘వాస్తవాలు మాట్లాడితే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఆర్డీటీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది నిజం కాదా?’ అంటూ నిలదీశారు. దీంతో సుధాకర్ యాదవ్ తోక ముడిచాడు. అనంతపురం టవర్క్లాక్: ఉద్యమాలు చేసైనా ఆర్డీటీని కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో సీపీఐ ఆధ్యర్యంలో అఖిల పక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ. నల్లప్ప, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, ముతవల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షకీల్ షఫి, ఇస్సాక్, రాష్ట్ర కార్యదర్శి జాఫర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ జిల్లాలో పేద పిల్లలను ఆర్డీటీ సంస్థ అక్కున చేర్చుకుని చదివించిందన్నారు. పేదల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారన్నారు. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించి వారిలో మనోధైర్యం నింపారన్నారు. క్రీడాభివృద్ధికి విశేష కృషి చేసి పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారన్నారు. అటువంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్డీటీ కోసం ఏ కార్యక్రమాలు చేసినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందించాలి.. మేయర్ వసీం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ అంశంపై కేంద్రంతో మాట్లాడాలన్నారు. చంద్రబాబు రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్డీటీని కాపాడాలన్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించలేదన్నారు. వీధి పోరా టాలతో లక్ష్యం సాధించలేమని, చలో అమరావతికి పిలుపునివ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేమన్నారు. సంస్థకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినా చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతోందని విమర్శించారు. ఆర్డీటీని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ మాట్లాడుతూ ఆర్డీటీని కాపాడుకునేందుకు చేసే ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ బలమైన ఉద్యమాలతోనే ఆర్డీటీని కాపాడుకోగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీని కాపాడాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమన, పులి కిష్ట, మాజీ సైనిక అధికారి షేకన్న, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఓబిరెడ్డి, కార్పొరేటర్ చంద్రలేఖ, నాయకురాలు కమర్ తాజ్, సీపీఐ నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
యువతకు కుచ్చుటోపీ
‘రాష్ట్రంలో యువతకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చారు. 20 నెలలు దాటినా ఒక్క నిరుద్యోగికీ పైసా ఇవ్వలేదు. బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. అయినా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని ప్రసంగించడం యువతను వంచించడమే. గడిచిన కాలానికి గాను ప్రతి నిరుద్యోగికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. – సాకే చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో దామోదరం సంజీవయ్య 105వ జయంత్యుత్సవం నిర్వహించారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1920లో కుల వివక్ష ఎక్కువగా ఉండేదన్నారు. ఆ సమయంలో దామోదరం సంజీవయ్య పడిన కష్టాలు మాటల్లో చెప్పలేమన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో పదవులు చేపట్టారన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. డీఆర్ఓ మలోల మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అడుగు జాడల్లో మనమందరం నడవాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, నాయీబ్రాహ్మణ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, బెస్త కార్పొరేషన్ల డైరెక్టర్లు ఆదినారాయణ, పి.లక్ష్మీ నరసింహులు, రంగాచారి, పవన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్రెడ్డి, ఐఅండ్పీఆర్ డీఐపీఆర్ఓ ఎ.బాలకొండయ్య కుల సంఘాల నాయకులు దాస్, విద్యార్థులు పాల్గొన్నారు. రాడ్తో కొట్టి చైన్ లాక్కెళ్లాడు బుక్కరాయసముద్రం: మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో శనివారం ఓ మహిళపై అగంతకుడు రాడ్తో దాడిచేసి, ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రానికి చెందిన ముత్యాల వెంకటేశు భార్య శ్రీదేవి నార్పల క్రాసింగ్లోని గాంధీనగర్ కాలనీ సమీపంలో టీ కేఫ్, క్యాంటీన్ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం షాపులో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఇనుప రాడ్డుతో తలపై, చేతలపై దాడిచేసి.. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్ లాక్కునిపోయాడు. స్థానికులు గమనించి దాడిలో గాయపడిన శ్రీదేవిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ పరిశీలించారు. దుండగుడు లాక్కెళ్లిన బంగారు చైన్ రూ.6 లక్షల వరకు విలువ ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
పీఆర్సీ సాధనకు చలో విజయవాడ
● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ ఉరవకొండ: పీఆర్సీ సాధనకు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ పిలుపునిచ్చారు. యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమంపై చేపట్టిన ప్రచార జాతా ఉరవకొండలోని ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్కుమార్తో పాటు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు, నూతన పీఆర్సీ నియాకంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యులు రమణయ్య, సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోటీశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, నాయకులు రాఘవ, సంజీవ, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, బండయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు గోవిందరాజులు, లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం: ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని నార్త్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం జీపు జాత పోస్టర్లను యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ఐ కేర్ సెంటర్లను కొనసాగించాలి
సీఎం ఐ కేర్ సెంటర్లను కొనసాగించాలి. గ్రామీణ ప్రజలు ఎక్కువగా కంటి జబ్బులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాలను మూసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుడిని ఉచితంగా కళ్లాద్దాలు తీసుకున్నా. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ కళ్లాద్దాలు ఇవ్వడం లేదు. నేను కూడా ఇటీవల రూ.వెయ్యి ఖర్చుతో కొత్త కళ్లాద్దాలను బయట కొనుగోలు చేశాను – అంజినప్ప, ముప్పులకుంట, బ్రహ్మసముద్రం మండలం -
9 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం నిర్ధేశించిన మద్ధతు ధరతో క్వింటా రూ.8 వేల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,964 మంది రైతుల నుంచి రూ.77 కోట్లు విలువ చేసే 9,706 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో రూ.55 కోట్ల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. 3,298 మంది రైతుల ఖాతాల్లోకి రూ.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. కొరియర్ సెంటర్లో చోరీ శింగనమల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పక్కనే ఉనన పార్సిల్ కొరియర్ సెంటర్లో చోరీ జరిగింది. ముసుగులు ధరించిన ఇద్దరు యువకుల కదలికలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమై ఉంది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొరియర్ సెంటర్ వద్దకు చేరుకున్న దుండగులు ముందుగా తలుపు వద్ద ఉన్న సీసీ కెమెరాను తొలగించారు. అనంతరం తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. పార్శిళ్లను పరిశీలించి, విలువైన వస్తువులున్న వాటిని అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 900 హెక్టార్లకు ఆటోమేషన్ లక్ష్యం కూడేరు: ఈ ఏడాది మార్చి లోపు జిల్లా వ్యాప్తంగా 900 హెక్టార్లకు ఆటోమేషన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథ రెడ్డి తెలిపారు. ఆటోమేషన్ టెక్నాలజీపై కూడేరులోని వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ శంకరబాబు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానందతో పాటు ఆయన మాట్లాడారు. ఆటోమేషన్ విధానం ద్వారా నీటి వృధాని అరికట్డడంతో పాటు రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. రైతులు పొలాల్లోనే ఉండి పంటలకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి వద్ద నుంచే సెల్ఫోన్ ద్వారా పంటలకు ఎంత మోతాదులో నీరు అవసరమో అంతే అందించే అవకాశం ఉంటుందన్నారు. 55 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ పరికరాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఉద్యానాధికారి యామిని పాల్గొన్నారు. -
ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం. ఎంత వర్ణించినా తక్కువయ్యే ఈ భావోద్వేగానికీ ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే ‘వాలెంటైన్స్ డే’. ఆ రోజు రానే వచ్చింది. రప్రేమను వ్యతిరేకిస
అనంతపురం కల్చరల్: ప్రేమలో ఉండే వారికి ప్రతిరోజూ పండగలాగే అనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో తమ భాగస్వామికి తమ ప్రేమను ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటారు. పేమికుల రోజు సందర్భంగా శనివారం అనంతపురంలోని కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రేమను మించిన ఆయుధం లేదు వాలెంటైన్ డే కు సంబంధించి ఓ చారిత్రక ఘట్టమూ లేకపోలేదు. క్రీస్తు శకం 270లో వివాహ వ్యవస్థపై ఏ మాత్రం ఇష్టం లేని రోమ్ నగరాన్ని పాలించే రాజు క్లాడియస్ అప్పటికే వివాహంపై నిషేధం విధించారు. తన ముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకెళితే కఠినమైన శిక్షలు వేసేవారు. అదే సమయంలో ప్రేమ పెళ్లిళ్లను మతగురువు వాలెంటైన్ విపరీతంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. హింస, స్వార్థం, ద్వేషం వంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మిన ఆయన.. ప్రేమలో పడిన వారికి దగ్గరుండి వివాహం జరిపించేవారు. తన రాజ్యంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీసిన రోమ్ రాజు.. వాలెంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలుసుకుని అతనిని కారాగారంలో బంధించాడు. రాజద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. అయితే కారాగారంలో శిక్ష అనుభవించే సమయంలో జైలర్ కూతురితో వాలెంటైన్ ప్రేమలో పడిపోయాడు. తనను ఉరి తీసే ముందు తన ప్రేయసి గురించే తలచుకుంటూ ‘యువర్ వాలెంటైన్’ అంటూ ఓ ప్రేమ లేఖ రాశాడు. అలా అది కాస్త ప్రేమకు నిర్వచనంగా మారి ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సందర్భం నేడు ‘వాలెంటైన్స్ డే’ -
ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు
అనంతపురం: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం సజావుగా ముగిశాయి. అనంతపురం జిల్లా కోర్టులో 883, కదిరిలో 101, పెనుకొండలో 65, హిందూపురంలో 100, కళ్యాణదుర్గంలో 49, రాయదుర్గంలో 50, ఉరవకొండలో 15, ధర్మవరంలో 83, పుట్టపర్తిలో 20, మడకశిరలో 28, తాడిపత్రిలో 73, గుత్తిలో 92, గుంతకల్లులో 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఆలూరి రామిరెడ్డి, బడా నారాయణరెడ్డి, రాంకుమార్, జక్కల శ్రీనివాసులు పోటీ చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో తొలిసారిగా భారీ ఎత్తున ఓట్లు పోలవ్వడం విశేషం. బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి హేమావతి బ్రహ్మోత్సవాలు అమరాపురం: మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం అఖండ పూజలు, విశేష అభిషేకాలు, భజనలు, కీర్తనలు ఉంటాయి. 16న భానుపల్లకి, ధూళోత్సవం, అన్నసంతర్పణ, 17న అగ్నిగుండం ప్రవేశం, ముత్యాలపల్లకీ ఉత్సవం, వివిధ రకాల పుష్పాలంకరణ ఉంటుంది. 18న సాయంత్రం సిడిమాను ఉత్సవం, అన్నసంతర్పణ, రాత్రికి ముత్యాలపల్లకీ ఉత్సవం, 19న చిన్న రథోత్సవం, రాత్రి ముత్యాల పల్లకీ ఉత్సవం, 20న బ్రహ్మరథోత్సవం, అన్నసంతర్పణ, 21న వసంతోత్సవం, 22న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. వ్యక్తి బలవన్మరణం పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లికి చెందిన శ్రీరాములు(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద వాపోయేవాడు. గత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులు గాలిస్తూనే ఉన్నారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా శ్రీరాములు ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే గ్రామ శివారులోని పొలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే మామిడి చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న శ్రీరాములు మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు పుట్టపర్తి టౌన్: వయోభారం కారణంగా పోలీసు విశ్రాంత జాగిలం శాండి శుక్రవారం మృతి చెందింది. జిల్లా పోలీస్ శాఖలో 2013 నుంచి 2024 వరకు విశిష్ట సేవలు అందించిన ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరి. గత ఏడాది నవంబర్ 30న పదవీ విరమణ పొందింది. జాగిలం మృతి చెందిన విషయం తెలియగానే ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, రవికుమార్ తదితరులు శాండీ కలేబరంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది చెన్నప్ప, బీడీటీం సిబ్బంది పాల్గొన్నారు. -
పేదలంటే బాబుకు ‘కళ్ల’ మంట!
● ఆగిన సీఎం ఐ కేర్ కేంద్రాల సేవలు ● కళ్లజోడు నమోదు ప్రక్రియ బంద్ ● ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు తప్పని అవస్థలు కళ్యాణదుర్గం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యం అందని ద్రాక్షగానే మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అందకుండా పోయాయి. తాజాగా సీఎం ఐ కేర్ సెంటర్ల నిర్వహణలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తిసింది. ఫలితంగా కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందకుండా పోతున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్లను చంద్రబాబు ప్రభుత్వం మూసివేసింది. గద్దెనెక్కిన మూడు నెలల్లోనే ఈ పథకానికి మంగళం పాడేయగా... ప్రస్తుతం సెంటర్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. దీంతో నేత్ర పరీక్షలు చేయించుకోలేక, కళ్లజోళ్లు పొందే అవకాశం కోల్ఫోయిన పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. కష్ట కాలంలోనూ ఆగని వైద్య సేవలు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా 2017లో చంద్రబాబు అమలు చేసిన సీఎం ఐ కేర్ సెంటర్లను నిబద్ధతతో కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం పేరుతో సరికొత్త హంగులు అద్ది మరింత విస్తరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా కంటి వైద్య సేవలను అందజేస్తూ వచ్చారు. ఇందు కోసం రూ. కోట్లు విలువ చేసే అత్యాధునిక ఫండస్ మిషన్, ఏఆర్ మిషన్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రతి కేంద్రంలోనూ ఒక ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వీరు విశిష్ట సేవలు అందించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి రెండు వారాల్లోపు కళ్లజోళ్లను ఆశా కార్యకర్తల ద్వారా నేరుగా ఇంటి వద్దకే అందించారు. ఈ పథకం కింద అప్పట్లో రోజుకు 100 మందికి పైగా కళ్యాణదుర్గం సీహెచ్సీలో ఓపీ జరిగింది. -
మెడికల్ మాఫియాను అరికట్టాలి
● నేడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసనలు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ గుంతకల్లు: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంతో వైద్యాన్ని మరింత ఖరీదుగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల జీవించే హక్కుపై మెడికల్ మాఫియా పరోక్షంగా దాడి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యత లేని, కల్తీ మందులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళితే... లేనిపోని పరీక్షలు, మందులు రాసి రూ.వేలల్లో బిల్లులు చేస్తున్నారని ఆరోపించారు. తీరా రోగాన్ని నయం చేయలేక రెఫరల్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు పంపి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేయాలని, కార్పొరేట్ ఆస్పత్రుల దందాపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల ఎదుట తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.వీరభద్రస్వామి, బి.మహేష్, ఈశ్వరయ్య, దాసరి శ్రీనివాసులు, వెంకట్నాయక్ పాల్గొన్నారు. -
సేవాలాల్ జయంత్యుత్సవాలు ప్రారంభం
గుత్తి రూరల్: బంజారాల ఆరాధ్య దైవం సంత్శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు శుక్రవారం గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు మాతా జగదాంబ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేశారు. సేవాలాల్ ఆలయ ముఖద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరం, ఫొటో ఎగ్జిబిషన్, మరుగుదొడ్లు, వసతి ఏర్పాట్లతో పాటు ద్విచక్రవాహనాలు, జీపులు, కార్ల పార్కింగ్కు స్థలం కేటాయించారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మాతా జగదాంబ ఆలయంలో హోమం సేవాగఢ్లోని మాతా జగదాంబ ఆలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, అభిషేకం తదితర పూజలు చేశారు. భారీ బందోబస్తు సేవాలాల్ జయంత్యుత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశమైన సీఐ వారికి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలు విజయవంతం చేయండి సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, కార్యదర్శి అశ్వత్థనాయక్ కోరారు. ఆలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలను పూర్తి చేశామన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, డీటీ సూర్యనారాయణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ మూలవిరాట్, మాతా జగదాంబ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న ట్రస్టు సభ్యులు -
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో శుక్రవారం బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, రెండో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, బీసీఏ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24)రెగ్యులర్, బీబీఏ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (24) రెగ్యులర్, బీబీఏ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ రెండో సెమిస్టర్ (24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శారద, డాక్టర్ ఎస్. శ్రీధర్ విడుదల చేశారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు అనంతపురం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారం ముగిశాయి. జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన జవాబు పత్రాలను డీఆర్ఓ మలోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులో పోలీసు బందోబస్తు ద్వారా విజయవాడకు తరలించారు. కార్యక్రమంలో ఏఓ అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యమూ ప్రధానమే అనంతపురం అర్బన్: పిల్లలకు విద్యతో పాటు వారి ఆరోగ్యమూ ప్రధానమేనని కలెక్టర్ ఆనంద్ ఆన్నారు. ఈ నెల 17న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న అన్ని విద్యాసంస్థల్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, విద్యా, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాక అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు అనంతపురం చేరుకోనున్నారు. ఆదర్శనగర్లోని మారెమ్మ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆత్మకూరు మండలం మదిగుబ్బ తండాకు 11 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట సేవాలాల్కాలనీలో పర్యటిస్తారు. 2 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఎస్టీ సంఘాల నాయకులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 6 గంటలకు గుత్తి మండలం సేవాఘడ్కు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి వెళతారు. -
మెటీరియల్ పేమెంట్లు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టి పనులకు సంబంధించి రూ.22 కోట్ల చెల్లింపులు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉపాఽధి హామీ కింది మెటీరియల్ ఎక్స్పెండేచర్, మెటీరియల్ పేమెంట్లు, తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంసీసీ సిబ్బంది, పీఆర్ ఏఈలు, ఈసీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెటీరియల్ పేమెంట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజూ రూ.7.35 కోట్ల విలువైన పనులు అప్లోడ్ చేయాలన్నారు. శని, ఆది వారాలు సెలవు రోజులైనప్పటికీ ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన మెటీరియల్ బడ్జెట్ను ఈ నెలాఖరులోగా పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా పీడీ సలీంబాషా, పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి మోసం చేశారు
● చంద్రబాబు ప్రభుత్వంపై ఎస్టీయూ నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్: ‘మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ వేయకుండా మోసం చేశారు. ఇంతటి దౌర్భాగ్యం ఎన్నడూ లేదు’ అంటూ ఎస్టీయూ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు మాట్లాడుతూ కొత్తగా తీసుకొస్తున్న 33 ఏళ్ల సర్వీసు విధానం ఉద్యోగుల మెడలో పాములాంటిదన్నారు. అది ఎప్పుడైనా కాటువేయవచ్చని హెచ్చరించారు. రెండేళ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ వేయకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ బకాయిలు తక్షణం చెల్లింపునకు రోడ్మ్యాప్ ప్రకటించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచి డీఏలు ఇస్తామని చెప్పారని, తీరా ఒక డీఏ ఇచ్చి తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు. పాత పెన్షన విధానం అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 మేరకు పాత పెన్షన అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన సౌలభ్యాలు చెల్లించకుండా వారిని ఏడిపిస్తూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ చేసి మరుసటి రోజునే సౌలభ్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సూరీడు, ఫణిభూషణ్, కృష్ణమూర్తి, రాజశేఖర్, జిల్లా నాయకులు నాగభూషణం, మల్లికార్జున, సుధాకర్, నాగేంద్ర, రాధాకృష్ణంరాజు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ అధికారి ‘దూకుడు’
అనంతపురం ఎడ్యుకేషన్: ఆయన రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో కీలక అధికారి. రిటైర్డ్మెంట్ దగ్గర పడుతుండడంతో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే నానుడిని బాగా వంట పట్టించుకున్నారు. ఆయన అదృష్టం కొద్దీ సామాజికవర్గమూ కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంటున్న సామాజిక వర్గానికి చెందినవ్యక్తి కావడంతో చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు తెరతీశారు. ఆ సామాజికవర్గంలో కీలకమైన ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతుండడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈయన ‘బరితెగింపు’ అధికార పార్టీతోపాటు రెవెన్యూశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యవహారంపై కొందరు ఏకంగా సీఎంఓ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి గుట్టుగా ఆరా తీస్తున్న వైనం రెవెన్యూశాఖలో కలకలం రేపుతోంది. వివాదాల భూములు.. ఏకపక్ష నిర్ణయాలు వివాదం ఉన్న భూముల వ్యవహారంలో ఆ అధికారి చాలావరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసుల విచారణ వివాదాస్పదమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి వారం 100కు పైగా కేసులను విచారణకు పిలుస్తుండడం పట్ల చర్చ జరుగుతోంది. గతంలో వారానికి 30 కేసులకు మించి విచారణకు పిలిచేవారు కాదు. ఈ అధికారి రిటైర్డ్మెంట్ తేదీ దగ్గర పడేకొద్దీ కేసుల సంఖ్య పెంచుతూ వస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కేసల్లో నాలుగుసార్లు నోటీసులు ఇచ్చి తుది తీర్పు ఇచ్చేస్తున్నారు. ‘కమిట్’ అయిన వారితో ప్రతి ఫైలుకూ రూ. లక్షల్లోనే తన వాటా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈయన ఏకపక్షంగా ఇచ్చిన తీర్పులపై హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు అక్కడ ఊరట లభిస్తోంది. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం కురుగుంట 172 సర్వే నంబరులోని భూ వివాదంపై ఈయన ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అలాగే కక్కల పల్లి, కాటిగానికాలవ, నరసనాయనికుంట గ్రామాల్లోని భూములకు సంబంధించి ఈయన ఉత్తర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకా పలువురు బాధితులు ఈయన తీర్పును సవాల్ చేస్తూ హైకోరునాశ్రయించారు. ఏదేమైనా ఆర్ఓఆర్ కేసులు ఈయనకు పెద్ద ఆదాయవనరుగా మారాయి. తహసీల్దార్ కార్యాలయ నివేదికలు కూడా అక్కడి నుంచే... ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి పిటీషనర్లు, రెస్పాండెంట్లకు నోటీసులు ఇచ్చి రికార్డులను తెప్పించుకుంటారు. ఆ రికార్డులను సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపి క్షేత్రస్థాయిలో విచారణ చేయించి నివేదికలను తెప్పించుకుంటారు. వాటి ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కేసుల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి తాను మాట్లాడుకున్న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు.. తహసీల్దార్ కార్యాలయాల నుంచి రావాల్సిన నివేదికలు (ఫైళ్లు) అక్కడే సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం సంతకాల కోసం తహసీల్దార్ల కార్యాలయాలకు పంపుతున్నారు. సంబంధిత వీఆర్ఓ, ఆర్ఐఓ, డీటీ, తహసీల్దారు సంతకాలు చేయాలి. ఇక్కడ కాదుగీదు అనేకి లేదని మండలాల ఉద్యోగులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో సదరు అధికారి బరితెగించి ఇచ్చిన ఉత్తర్వులను ధైర్యం చేసి తాము అమలు చేయలేకపోతున్నామని ఓ డీటీ వాపోయారు. ఓ మిల్ట్రీ పట్టా ఫేక్ అని నిర్ధారించినా కూడా.. ఆ కేసులో భారీగా దండుకున్న అధికారి ఆ పట్టాను అడ్డుపెట్టుకుని కొనుగోలు చేసిన వారికి ఆన్లైన్లో ఎక్కించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం కలెక్టరేట్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ దృష్టికి వ్యవహారం ఈ అధికారి నెలల వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తాడని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ఏమైనా మాట్లాడితే ప్రొటోకాల్ ఖర్చులు అంటూ జిల్లా ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటున్నారని వాపోతున్నారు. ఈయన బరితెగింపు వ్యవహారం చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు. అక్కడి నుంచి కీలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈయన వ్యవహారంపై ఓ కన్నేశారు. రిటైర్మెంట్ దగ్గర పడుతుండటంతో అక్రమ వసూళ్లు భూవివాదాల్లోవిపరీతమైన జోక్యం రికార్డుస్థాయిలో ప్రతి వారం వందదాకా కేసుల విచారణ -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగుతోంది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
కంటితుడుపుగా టమాట కొనుగోలు అనంతపురం అగ్రికల్చర్: టమాట ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి మార్కెట్కు ఇటీవల కాలంలో రోజూ 600 నుంచి 800 టన్నుల వరకు సరుకు అమ్మకానికి వస్తోంది. అయితే ధరలు పతనం కావడంతో కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నెలన్నర రోజులుగా అత్యంత నాణ్యమైన టమాట గరిష్ట ధర కిలో రూ.10 పలుకుతుండగా మిగతావన్నీ రూ.5 నుంచి రూ.7కు మించి పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కంటితుడుపు చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రోజుకు 30 నుంచి 40 టన్నుల టమాటా కొనుగోలు చేస్తూ పక్క జిల్లాలకు సరఫరా చేస్తుండగా.. అలాగే ఆటోల ద్వారా కిలో రూ.10 ప్రకారం విక్రయాలు మొదలు పెట్టారు. మార్కెటింగ్ శాఖ కూడా రైతుల నుంచి కిలో రూ.5 ప్రకారం కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కొన్ని లాట్లు అమ్ముడుపోక వదిలేసుపోతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రైతులకు ఏదో లబ్ధి చేకూర్చుతున్నట్లు చెప్పుకునే క్రమంలోనే కంటితుడపు చర్యలకు దిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పచ్చదోపిడీ ఖనిజం
తాడిపత్రి టౌన్/ పెద్దవడుగూరు: అధికార అండతో ‘పచ్చ’ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నారు. ఆదాయం తప్ప భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా గనులు నిర్వహిస్తూ కార్మీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్ మాఫియాగా ఏర్పడి చెలరేగిపోతున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో స్టీటైట్ అనే ఖనిజ సంపద ఉంది. ఇక్కడ దాదాపు 42 గనులు ఉన్నాయి. టీడీపీకి చెందిన వారే ఎక్కువగా లీజు పొందారు. ఈ గనుల్లో 600 మంది దాకా కార్మికులు పనులు చేస్తున్నారు. భూగర్భ గనుల నిర్వహణలో కార్మికుల భద్రత చాలా ముఖ్యం.కార్మీకులు హెల్మెట్, బూట్లు, హెడ్లైట్లు ధరించాల్సి ఉంటుంది. సొరంగంలో కొంత దూరం వెళ్లాక తగినంత గాలి, వెలుతురు కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొండుపల్లి గనుల్లో ఇలాంటి భద్రతా ప్రమాణాలు ఏవీ కనిపించవు. ఖనిజం వెలికితీసే ప్రక్రియల్లో మందుగుండు (జిలెటిన్స్టిక్స్) సామగ్రి ఉపయోగిస్తారు. ఇందుకు గాను మైనింగ్కు అర్హులైన మేనేజర్, మేట్, బ్లాస్టర్ను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదంతా రికార్డుల్లో మాత్రమే పొందుపరుస్తారు. వాస్తవంలో ఎవ్వరూ ఉండరు. నైపుణ్యం లేని కార్మికులతోనే జిలెటిన్ స్టిక్స్పెట్టిస్తూ.. ఖనిజాన్ని వెలికితీస్తున్నారు. అనుమతికి మించి జిలెటిన్స్టిక్స్ వినియోగం సాధారణంగా భూగర్భ గనుల్లోంచి ఖనిజం బయటకు తీసేందుకు మందుగుండు (జిలెటిన్స్టిక్స్) సామగ్రిని రోజుకు కేజీల లెక్కల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ టన్నుల్లో జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తూ ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఇలా విచ్చల విడిగా పేలుళ్లు జరిపే క్రమంలో కార్మికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. గనుల్లో ప్రమాదం జరిగి కార్మీకుల మరణాలు సంభవించినా, కాళ్లు, చేతులు పోగొట్టుకున్నా బాధిత కుటుంబాలకు డబ్బు ఆశచూపి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండుపల్లిలో ఈ నెల రెండో తేదీన అనుమతి లేని గనిలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి నిబంధనలు ఉల్లంఘించినా మైనింగ్ నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వారిచ్చే మామూళ్లు తీసుకుని పట్టనట్టుగా ఉంటున్నారు. అనుమతికి మించి స్టీటైట్ తవ్వకాలు చేపట్టి పౌడర్ ఫ్యాక్టరీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ ఎగ్గొడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొండుపల్లిలోని 688, 697, 698, 699 సర్వే నంబర్లలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. 693, 694, 695 సర్వే నంబర్లలోని మైనింగ్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా 25 వేల టన్నుల ఖనిజం తరలించినట్లు గుర్తించిన అధికారులు 2022 మార్చి 21న రూ.6.41 కోట్ల జరిమానా విధిస్తూ గని సీజ్ చేశారు. అయితే నిర్వాహకులు ఆ గనిలో ఇప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. -
త్వరలో ఓటర్ మ్యాపింగ్పై శిక్షణ
అనంతపురం అర్బన్: త్వరలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించి ఓటరు మ్యాపింగ్ అంశంపై బీఎల్ఓలు, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తామని డీఆర్ఓ ఎ.మలోల తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, తొలగింపు, వివరాల మార్పు క్లెయిమ్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. రాజకీయ పార్టీలు చొరవ తీసుకుని యువత ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
కేశవ్ అండతోనే మట్టి దోపిడీ
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ అండతోనే టీడీపీ నేతలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసరాల్లో మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. గురువారం పెన్నహోబిలం ఆలయ కమిటీ మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రూరల్ పరిశీలకులు డిష్ సురేష్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముస్టురు నరేష్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా సహజ సంపదను దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమాలపై ప్రశ్నించే వారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే పెన్నహోబిలం ఆలయానికి ఈఓను సైతం నియమించలేదన్నారు. పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా దేవదాయ శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం దుర్మార్గమన్నారు. ఇకపై సహజ సంపద దోపిడీ జరగకుండా వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జయరాం, షేక్షానుపల్లి రమేష్, చంద్ర, నీలప్ప తదితరులు పాల్గొన్నారు. -
వీఆర్ఓలకు పదోన్నతి
అనంతపురం అర్బన్: రెవెన్యూశాఖలో గ్రేడ్–2 వీఆర్ఓలకు గ్రేడ్–1 వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 110 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల గురువారం జారీ చేశారు. అనంతపురం జిల్లాలో 60 మంది గ్రేడ్–2 వీఆర్ఓలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 50 మంది గ్రేడ్–2 వీఆర్ఓలకు గ్రేడ్–1 వీఆర్ఓలుగా పదోన్నతి లభించింది. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులను వీఆర్ఓలు అందుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్రావు పాల్గొన్నారు. వీఆర్ఏలకు లైన్క్లియర్.. వీఆర్ఓలకు గ్రేడ్–1 పదోన్నతి కల్పించడం ద్వారా గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతి పొందేందుకు డైరెక్టర్ రిక్రూట్ వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రేడ్–1 వీఆర్ఓ ఖాళీలు దాదాపు 140 వరకు ఉన్నాయి. ప్రభుత్వం నిబంధన ప్రకారం పదోన్నతి ద్వారా 30 శాతం మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏకు పదోన్నతి కల్పిచేందుకు అర్హత ఇంటర్మీడియేట్ లేక డిగ్రీ అనేదానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరించి 2020లో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒకే దఫా 231 మందికి గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. అదే తరహాలో ప్రస్తుతమూ వన్టైమ్ సెటిల్మెంట్ కింద అర్హులందరికీ పదోన్నతి కల్పించాలని వీఆర్ఏలు కోరుతున్నారు. పదోన్నతి ద్వారా 30 శాతం కాకుండా 70 శాతం ఖాళీలు భర్తీ చేయాలని ఒక ఫైలు, వన్టైమ్ సెటిల్మెంట్కు సంబంధించిన ఫైలు సీసీఎల్ఏ వద్ద ఉందని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది ఆమోదం పొందినా దాదాపు అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలా కాకుండా 30 శాతం నిబంధన అమలు చేస్తే 140 ఖాళీల్లో 46 మంది వీఆర్ఓలకు మాత్రమే పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 మందికి అవకాశం -
ఆలయాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ అనంతపురం అర్బన్: ‘బ్రహ్మోత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో దేవాలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మునిసిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. ఆలయాల వద్ద బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పి.జగదీష్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని వర్గాలు, మతాల వారు మతసామరస్యంతో ఉండేలా చూడాలన్నారు. రంజాన్ వేడుకలు, క్రైస్తవ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవదాయ, మైనారిటీ శాఖ అధికారులు, ఈఓలు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. మసీదులు, ఆలయాలు ఇతర ముఖ్య ప్రాంతాల్లో సెక్యూరిటీ ఆడిట్ ఒక నెలలో పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘నకిలీ’ కేటుగాళ్ల అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని శారదానగర్లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మికి ఇల్లు ఉంది. వీరు 2024 నవంబర్లో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన పాములపాటి అమర్నాథ్, పుట్టపర్తికి చెందిన ఆవుల సుబ్రహ్మణ్యం ఇంటిని కొట్టేయాలని పథకం రచించారు. హిందూపురానికి చెందిన బి.శకుంతలకు సుసర్ల కనకదుర్గ తన ఇంటిని రాసి ఇచ్చినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పుట్టపర్తికి చెందిన శేఖర్కు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అర్బన్ సబ్రిజిస్ట్రార్ రమణరావు కనుసన్నల్లో జరిగింది. తర్వాత సదరు జీపీఏ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలకసంస్థ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించారు. దీనిపై సుసర్ల కనకదుర్గ వారసుడైన సాయి మనోహర్ అనంతపురం వన్టౌన్ పోలీసులసు ఆశ్రయించాడు. ఎస్పీ జగదీష్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపారు. శకుంతల, శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, అమర్నాథ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకడైన పాములపాటి అమర్నాథ్పై ఇది వరకూ ఇలాంటివే నాలుగు కేసులు ఉన్నాయి. కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. -
కదం తొక్కిన కార్మిక, కర్షక లోకం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కన్నెర్ర ● మోదీ, చంద్రబాబు తీరుపై మండిపాటు అనంతపురం అర్బన్: కార్మిక, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా చూపిస్తామని కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం నగరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్టీయూ, ఐఎఫ్టీయూ, మునిసిపల్, ఎల్ఐసీ, బ్యాంక్, హమాలీ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ తదితర సంఘాల నాయకులు క్లాక్టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మాస్క్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యతిరేక విధానాలపై మండిపాటు టవర్క్లాక్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, మేయర్ సలీం, సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాష్ట్ర కార్యదర్శి జాఫర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్వీనాయుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి వేమన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని దుమ్మెత్తిపోశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మారుస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు చట్టపరమైన హక్కులన్నీ కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్దతునిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎనిమిది గంటల పనివేళలను 12 గంటలకు మార్చడం కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికుల శ్రమను దోచిపెట్టడమేని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని, పంటలకు మద్ధతు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. ఇటీవల అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కార ణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీ జీ రామ్జీ పథకం తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని, వీబీ–జీ– రామ్జీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు రాజేష్గౌడ్, రమణ, గోపాల్, వెంకటనారాయణ, నాగరాజు, ముత్తుజా, పద్మావతి, జయలక్ష్మి, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన
● ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తోందని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ విమర్శించారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్తో పాటు జిల్లా కార్యదర్శి రవికుమార్, ప్రభుత్వ పెన్షనీర్ల సంఘం జిల్లా కార్యదర్శి శిల జయరామప్ప, నగర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించలేదన్నారు. బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. తక్షణం 12వ పీఆర్సీ నియమించడంతో పాటు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) విధానం అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింజేయాలన్నారు. సుప్రీం కోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీజీఓ నిరసనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్డీ నాయుడు, నగర అధ్యక్షుడు వెంకటనారాయణ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీధర్బాబు, చంద్రమోహన్, నాయకులు జమీలబేగం, లక్ష్మినారాయణ, లింగమేష్, దస్తగిరి, లక్ష్మినరసయ్య, వెంకటరాముడు, ప్రవీణ్, ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అహూడా.. ఏదీ అభివృద్ది జాడా?
అనంతపురం క్రైం: అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)లో అభివృద్ధి జాడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అథారిటీ కార్యాలయం ఎవరికి ఉపయోగపడుతుందో తెలియడం లేదని పలువురు అంటున్నారు. కేవలం ప్రచార కార్యాలయంగా మార్చారంటూ పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘అహుడా’ ఒక వెలుగు వెలిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.6.53 కోట్ల నిధులతో మొత్తం 22 పనులు చేపట్టారు. రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, జిమ్ పరికరాలు, లేఅవుట్ల అభివృద్ధి, ప్రహరీల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా చేశారు. అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి జేఎన్టీయూ దాకా సుందరంగా రహదారి నిర్మించడంతో పాటు ధర్మవరంలో రహదారులు, గుత్తి లేఅవుట్ అభివృద్ధి, పట్టణ ప్రాంతాలో పార్కులు, జర్నలిస్ట్ కాలనీల్లో పార్కు అభివృద్ధిలో భాగంగా ప్రహరీ ఏర్పాటు చేశారు. ఫొటోలకు ఫోజులతో సరి.. అనంతపురం నగరంలోని అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఫొటోలకు ఫోజులివ్వడానికి మినహా మరెందుకూ ఉపయోగపడడం లేదని ఆ కార్యాలయ సిబ్బందే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఉన్నతాధికారులు, పాలకవర్గం సభ్యులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కేవలం రెండు అర్జీలే వచ్చాయి. చాలామంది అర్జీదారులు ఖాళీ కుర్చీలను చూసి నిరాశతో వెనుదిరగడం కనిపించింది. గతంలో వచ్చిన అర్జీలకు కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. 19 నెలల చంద్రబాబు పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదంటే ‘అహుడా’ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. అహుడా చైర్మన్ టీసీ వరుణ్ వైఎస్సార్ సీపీ హయాంలో వేసిన ఎంఐజీ లేఅవుట్లలో హంగామా తప్పా పైసా కూడా తీసుకురాలేదన్న విమర్శలున్నాయి. ఆదాయం.. దూరం జిల్లాలో ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు కాదు.. నగరానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేశారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవడంలేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన క్రమబద్ధీకరణ పథకం కూడా సా...గుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి ఒక్క సమీక్ష నిర్వహించలేదు. లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న సూచనలు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో చాలా మందికి క్రమబద్ధీకరణ విషయంలో స్పష్టత లేకుండా పోతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పని జరిగితే ఒట్టు వినతులనూ పట్టించుకోని అధికారులు గ్రీవెన్స్లో ఫొటో షూట్లకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 6.53 కోట్లతో అభివృద్ధి పనులు -
ధరల పతనంతో వంగ రైతు బెంగ
గుత్తి రూరల్: మార్కెట్లో వంకాయ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతు నరేష్.. పంట మొత్తాన్ని గొర్రెలకు ఆహారంగా వదిలేశాడు. తనకున్న భూమిలో నుంచి ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో సిమ్రాన్ రకం వంకాయ మొక్కలను గత నవంబర్లో రైతు నాటాడు. నార, ఎరువులు, కూలీలు, మందుల పిచికారీ తదితరాలకు రూ.80 వేలు ఖర్చు చేశాడు. మూడు నెలల పాటు పంట సంరక్షణకు మరో రూ.50 వేలు ఖర్చైంది. మంచి దిగుబడి రావడంతో ఈ ఏడాది అప్పులు తీరి తన కష్టాలు దూరమవుతాయని రైతు భావించాడు. వారం క్రితం పంట కోత కోసి ఒక్కో బస్తాలో 20 కిలోల చొప్పున మొత్తం 120 బస్తాల్లో 2.40 క్వింటాళ్ల దిగుబడిని మార్కెట్కు తరలిస్తే ఒక్కో బస్తా రూ.30 చొప్పున దళారులు అడగడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గతంలో 20 కిలోల బస్తా రూ.300 నుంచి రూ.500 వరకూ అమ్ముడు పోయిందని, ఈ లెక్కన రూ.5 లక్షలు వస్తుందని ఎంతో ఆశతో మార్కెట్కు పంట తరలిస్తే చివరకు రూ.50 వేలు కూడా చేతికి అందలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంట మొత్తాన్ని గొర్రెలకు వదిలేసినట్లుగా తెలిపాడు. -
విభిన్న ప్రతిభావంత యువతకు ‘ఇగ్నైట్’
● స్వయం ఉపాధి దిశగా శిక్షణ ● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అనంతపురం క్రైం: విభిన్న ప్రతిభావంత యువత స్వయం ఉపాధి సాధించే దిశగా ‘ఇగ్నైట్’ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అధికారులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యాచరణ లక్ష్య సాధనలో భాగంగా అనంతపురంలోని రతన్టాటా ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణను అందజేస్తున్నట్లు వివరించారు. వ్యాపార ప్రారంభానికి అవసరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్ విధానాలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర మార్గదర్శకత్వంపై శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, దివ్యాంగులు, లింగ వైవిధ్య వ్యక్తులు అర్హులన్నారు. మార్చి 2 నుంచి 16వ తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయంతో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుగా rtih. ananthapuramu@gmail. com మెయిల్కు దరఖాస్తులు పంపి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91003 32660, 77299 32987లో సంప్రదించాలని కోరారు. -
‘ప్రైవేట్’ భాగస్వామ్యంతో టెన్త్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఈసారి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లగా ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. పరీక్షల నిర్వహణలో నూతన ఒరవడికి విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల నుంచి 75 శాతం మందిని తీసుకుంటే, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల నుంచి 25 శాతం మందిని తీసుకోనున్నారు. అలాగే తొలిసారిగా అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకం ప్రక్రియ ఎస్ఎస్ఈ బోర్డు నుంచే చేపట్టనున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ఆధారంగా హెచ్ఎంలు, టీచర్ల జాబితా తయారు చేసి మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డీఈఓలకు పంపారు. వారు ఆ జాబితాలను పరిశీలించి ప్రతి టీచరుకూ సంబంధించి రిమార్కులు రాసి పంపాలి. నిబంధనల మేరకు అనర్హులైన వారిని తొలిగించి.. అర్హులైన వారిని విధుల్లో నియమిస్తారు. ఈ విషయాలను వెబెక్స్లో విద్యాశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. 60 ఏళ్లు నిండిన వారికి, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మినహాయింపు ఇస్తారు. అయితే వీరు సంబంధిత మెడికల్ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వారు సిఫార్సు చేస్తే డీఈఓ ద్వారా బోర్డుకు వెళ్తాయి. అక్కడి నుంచి మినహాయింపు ఇస్తారు. చార్జెస్ ఫ్రేమ్ అయిన వారు, ఇతర క్రమశిక్షణ చర్యలకు పాల్పడిన వారిని పరీక్షల నిర్వహణ విధులకు తీసుకోరు. ఉన్నతాధికారులు వెబెక్స్లో తెలియజేశారని పూర్తిస్థాయి విధివిధానాలు రెండుమూడు రోజుల్లో రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 143 పరీక్ష కేంద్రాలు మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో 143 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31,931 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 16,384 మంది బాలురు, 15,547 మంది బాలికలు ఉన్నారు. మూడు ఓరియంటల్ స్కూల్స్ నుంచి 41 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే 36 కేంద్రాల్లో 1,288 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వ పాఠశాలల నుంచి 75 శాతం, ప్రైవేట్ నుంచి 25 శాతం -
అరటి ఎగుమతికి సహకారం
అనంతపురం అర్బన్: ‘రైలు ద్వారా అరటి ఎగుమతికి తగిన సహకారం అందిస్తామని ఎగుమతిదారులకు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అరటి ఎగుమతిపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉద్యాన శాఖ అధికారులు, ఎగుమతిదారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ద్వారా తాడిపత్రి నుంచి జేఎన్పీటీ పోర్టుకు అరటి ఎగుమతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రిఫర్ కంటైనర్కు రూ.10 వేలు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎగుమతిదారులు రవాణా ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఇన్సెంటివ్ విషయంపై ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడామన్నారు. అరటి ఎగుమతి ఒకసారి విజయవంతం అయితే దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. అరటి నాణ్యత పెంచేందుకూ చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని గ్రామాల్లోనూ రైతులకు సంబంధిత అధికారుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎగుమతిదారులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. రైలు ద్వారా అరటి రవాణాలో పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, ఇతర అధికారులు, ఎగుమతిదారులు, వాటాదారులు పాల్గొన్నారు. -
పెన్నహోబిలంలో మట్టి తోడేళ్లు
● లక్ష్మీనృసింహుని ఆలయం చుట్టూ తవ్వకాలు ● జేసీబీతో తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్న వైనంఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక – పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో సహజ వనరులపై అక్రమార్కులు కన్నేశారు. ఆలయ పరిధిలోని భూముల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఏటా మే నెలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాలు– చుట్టుపక్కల ఆరుబయలు ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని ఇక్కడే వంటావార్పు చేసుకుంటుంటారు. కొందరు భక్తులు వారి ఆర్థిక స్థోమతను బట్టి వసతి కోసం సత్రాలు/ భవనాలు , బేస్మెంట్లు నిర్మించారు. అలాంటి ఈ పుణ్యక్షేత్ర పరిసరాల్లోని ఆరుబయలులో మట్టితో పాటు వివిధ రకాల చెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొందరు అక్రమార్కులు సహజ వనరులను సొంత ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఇప్పటికే ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాల్లోని హంద్రీ–నీవా కాలువ గట్ల మట్టిని దోచేసి రూ.కోట్లు గడించారు. తాజాగా వీరి కన్ను పెన్నహోబిలంపై పడింది. ఇక్కడ ఆరుబయలులోని ఎర్రమట్టిని జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1000 దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు వారాలుగా మట్టిని తోడేస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు కనిపిస్తున్నాయి. అక్రమార్కులకు టీడీపీ నేతల అండ దండలు ఉండటంతో రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. దేవదాయ శాఖ నిర్లక్ష్యం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆలనా పాలనా గాలిలో దీపంలా మారింది. ఇక్కడ రెగ్యులర్ కార్య నిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఆలయ నిర్వహణ – సిబ్బంది పర్యవేక్షణ గాడితప్పింది. దేవదాయ శాఖ ప్రస్తుతానికి ఇన్చార్జ్ అధికారిని నియమించి చేతులు దులుపుకొంది. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల ఏమి జరుగుతోందో పట్టించుకునేవారు లేరు. మట్టి తవ్వుకుపోతున్నా.. పచ్చని చెట్లు నేల కూలుస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నా తమకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు. పెన్నహోబిలంలో ఆలయ దిగువన ఆమిద్యాల మార్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు -
ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులు ధ్వంసం
ఉరవకొండ: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది గమనించి ఆ శాఖ అధికారి యామినికి తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే కార్యాలయంలో రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి చెక్కుచెదరలేదని పోలీసులు గుర్తించారు. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తనివ్వకండి● జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆత్మకూరు: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడేగానీ తాగునీటి సమస్య తలెత్తరాదని, ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, ఆత్మకూరు, సింగంపల్లి గ్రామాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్యతో కలసి బుధవారం ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సర్వేల ప్రగతిపై ఉద్యోగులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, డిప్యూటీ ఎంపీడీఓ సాదిక్వలి, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్, అశోక్, శిరీష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెరగాలి : ఎస్పీ అనంతపురం సెంట్రల్: తీవ్రమైన నేరాల దర్యాప్తులో వేగం మరింత పెరగాలని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన నెల వారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులు, హత్యలు, పోక్సో, అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలు, మిస్సింగ్, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కలిగే దుష్ప్రభావాలు, శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మార్చిలో జరగనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్, ట్రైనీ ఐపీఎస్ అశ్వని మణిదీప్, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్బాషా, సూర్యనారాయణరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ముగిసిన పోలీసు క్రీడా పోటీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ బుధవారంతో ముగిసింది. మూడు రోజులుగా వివిధ క్రీడల్లో రాణించిన పోలీసులను అభినందిస్తూ స్థానిక పరేడ్ మైదానంలో ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, మెమొంటోలను డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ జగదీష్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో అన్ని జట్లూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్వనిమణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
పేట్రేగిపోతున్న టీడీపీ నాయకులు
● రస్తా లేదంటూ దౌర్జన్యం ● వత్తాసు పలుకుతున్న పోలీసులు విడపనకల్లు: మండలంలోని వి.కొత్తకోటలో టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోందని, వారు పేట్రేగి పోతుండడంతో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆ గ్రామానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఫర్వీన్, రుబియా, షేక్ బాబూన్నీ, ఖాజీము, బడేషావలి తదితరులు మాట్లాడుతూ... గ్రామంలోని బడేషావలి దర్గా సమీపంలో సర్వే నంబర్ 703లో తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. రూ. కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని ఆక్రమించుకునేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ నేతలు కొందరు తమను భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. బరితెగించి ఆడవాళ్లని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారని వాపోయారు. బుధవారం వారి దౌర్జన్యాలను తాళలేక డయల్ 100కి కాల్ చేసి సమస్య తెలిపినా ఎలాంటి చేకూరలేదన్నారు. చివరకు విడపనకల్లు పీఎస్కు వెళ్లి తమపై అసభ్యంగా మాట్లాడికి దాడికి ప్రయత్నించిన అసుండ షెక్షావలి, హోతూరు వలి, నేమకల్లు బాషు, మహమ్మద్, చాంద్, రజాక్వలిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నా ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. చివరకు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళతామనడంతో ఫిర్యాదు తీసుకుని, విచారణ చేస్తామని పేర్కొన్నారని వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా బాధితులు కోరుతున్నారు. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతిరాప్తాడు రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి (64) అనంతపురంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సజ్జలకాలువలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో విద్యుద్దీకరణ పనుల్లో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతి చెందాడు. భార్య నాగేశ్వరి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రేపు ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: మేనిఫెస్టో సాక్షిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సంఘం జిల్లా కార్యాలయంలో ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని నమ్మించి రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నా కనీసం కమిటీ కూడా వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సకాలంలో పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రతి ఉద్యోగీ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. నష్ట నివారణ చర్యలో భాగంగా మధ్యంతర భృతి ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. రిటైర్డు ఉద్యోగులకు అందాల్సిన సౌలభ్యాలు నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయన్నారు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ మెంబర్ వి.రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు శివయ్య చారి, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి.మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్ కె.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగభూషణ, నాయకులు వై.రవి, నిట్టూరు చంద్రశేఖరరావు, రామకృష్ణ, శ్రీనివాసులు, మహేష్రెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ● 97017 45437కు ఫోన్ ద్వారా ఫిర్యాదు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బి.మదన్మోహన్ 97017 45437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని డీపీఓ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మొదలైన ‘చీనీ’ సీజన్
అనంతపురం అగ్రికల్చర్: చీనీ సీజన్ ప్రారంభమైంది. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సరుకు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. గత అక్టోబర్ నుంచి జనవరి వరకు దాదాపు నాలుగు నెలల పాటు నామమాత్రపు అమ్మకాలు జరిగాయి. ఈ కాలంలో రోజుకు 100 టన్నులు కూడా క్రయ విక్రయాలు జరగలేదు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు మార్కెట్ జోరుగా ఉంటుంది. దీంతో ఈ సీజన్ మొదలు కావడంతో ఈ నెల నుంచి మార్కెట్కు సరుకు పెరుగుతూ వస్తోంది. బుధవారం మార్కెట్లో 500 టన్నుల వరకు అమ్మకాలు జరిగాయి. ఇక నుంచి మరింత పెరిగే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు 1,500 టన్నుల దాకా క్రయ విక్రయాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపు చీనీ ధరలు గత ఏడాది నేలచూపు చూడటంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. మార్చి, ఏప్రిల్ మినహా మిగతా నెలల్లో గరిష్ట ధర రూ.20 వేలకు మించి పలకలేదు. ఇప్పుడు సీజన్ ఆరంభంలో గరిష్ట ధర రూ.24 వేలతో నడుస్తోంది. వేసవిలో ఈసారి చీనీకి మంచి ధరలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 37 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించగా.. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న చీనీలో 60 శాతం వరకు రాజస్తాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరుకు చెందిన వ్యాపారులు కొందరు నేరుగా, మరికొందరు తమ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డులో గ్రేడ్–ఏతో పాటు బీ, సీ గ్రేడ్ చీనీ అమ్మకాలు జరుగుతున్నందున ఉత్తరాది నుంచి వచ్చే పెద్ద పెద్ద వ్యాపారులతో పాటు లోకల్ వ్యాపారులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది నష్టాల నుంచి గట్టెక్కడానికి మంచి గిట్టుబాటు ధర కోసం ‘అనంత’ చీనీ రైతులు ఎదురుచూస్తున్నారు. మార్కెట్ యార్డులో చీనీ క్రయ విక్రయాలు -
ల్యాండ్ టైట్లింగ్ ఆదర్శం
భూమికి, వాటి యజమానులకు రక్షణగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ విషం చిమ్మింది. పచ్చమీడియా విషప్రచారం చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దావోస్ వేదికగా ఇటీవల జరిగిన సదస్సులో ఆ విష ప్రచారం బట్టబయలైంది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనం.. ఆవశ్యకతను వివరిస్తూ ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ ప్రశంసలు కురిపించారు. అది కూడా సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో.. ఆయన సమక్షంలోనే ప్రశంసించడం గమనార్హం. అనంతపురం అర్బన్: భూ యాజమాన్యానికి సంబంధించి గ్రామస్థాయిలో 1బి, అసైన్మెంట్, ఈనాం వంటి పలు రిజిస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే భూ రికార్డుల శాఖ కార్యాలయంలో మరికొన్ని, సబ్రిజిస్ట్రార్, పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఇంకొన్ని రికార్డులు నిర్వహిస్తుంటారు. అటవీ, దేవదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా... చట్టపరంగా ఏదీ తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా... వేరే వాళ్లు అది తనదని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటి కేసులు కోర్టులో చాలా నడుస్తున్నాయి. అయితే టైట్లింగ్ చట్టం ద్వారా ఒక్కసారి రిజిస్టర్ అయితే భూ యజమానులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ హక్కులపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లూ ఉంటాయి. ఇంతటి బృహత్తర చట్టాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే ఇక తమకు విలువ ఉండదని భావించిన అప్పటి ప్రతిపక్ష టీడీపీ... పచ్చ మీడియా విష ప్రచారాన్ని చేపట్టాయి. చివరకు అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్పై అక్కసుతో ఆ చట్టాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేశారు. హుక్కులకు ప్రభుత్వ పూచీ ● ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ జవాబుదారీ వహించదు. ● రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని... రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. ● టైట్లింగ్ చట్టం కింద రూపొందించిన రిజిస్టర్ ప్రకారం టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాత రికార్డులేవీ చెల్లవు. టైట్లింగ్ ద్వారా భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా పరిహారం కూడా చెల్లిస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ● టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలోపు దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారు అవుతుంది. టైట్లింగ్ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒక్కసారి నిర్ధారణ అయితే అదే అంతిమ నిర్ణయం అవుతుంది. ● భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా నమోదు చేస్తారు. టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్య తలెత్తితే పరిష్కారానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతంలా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లవచ్చు. ● ఇప్పటి వరకూ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం కింద రిజిస్ట్రేషన్కు సంబంధించి పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. ఈ వ్యవస్థను జిల్లా, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పట్లోనే స్పష్టత ఇచ్చిన నీతి ఆయోగ్ తప్పుడు పత్రాలతో... భూ యజమానుల తప్పుడు ఆధార్లు సృష్టించి వారి భూములను వేరొకరికి విక్రయించిన పలు ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటిపై పోలీసు విచారణ జరగడం... వాస్తవమని నిర్దారణ కావడం... తదనంతరం కేసులు నమోదు కావడం... తదితర పరిణామాలు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిసిందే. ఇదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద రిజిస్టర్ జరిగితే... యజమానిని కాదని వారి భూమిని తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భూ యజమానులకు సంపూర్ణ భరోసానిస్తూ జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రవేశపెట్టగానే రాజకీయాల్లో పెను దుమారం రేగింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఈ అంశంపై అప్పటి అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఆ సమయంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబునిచ్చింది. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని స్పష్టం చేసింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని పేర్కొంది. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన టైట్లింగ్ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో కితాబు చంద్రబాబు సమక్షంలోనే దావోస్ వేదికగా అభినందనల వెల్లువ అయినా వైఎస్ జగన్పై అక్కసుతో రద్దు చేసిన చంద్రబాబు సర్కారు -
వేడుకగా ఘంటసాల రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానం
అనంతపురం కల్చరల్: ఘంటసాల 52వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల సంగీత కళాభారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఘంటసాల పురస్కార వేడుకలు బుధవారం రాత్రి అనంతపురంలో వేడుకగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు సుగుమంచి సురేష్బాబు నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ గాయకుడు, అభినవ ఘంటసాలగా కీర్తికెక్కిన ధూళిపాళ మిత్రకు అవార్డును అందజేశారు. స్థానిక అనంతపురం క్లబ్ వేదికగా సాగిన ఈ వేడుకలో తొలుత సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. అనంతరం డీఆర్వో మలోల, సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ, క్లబ్ సెక్రటరీ కేశవరెడ్డి, జీవీ రామయ్య తదితరులు మాట్లాడుతూ.. ఘంటసాల జీవితంలోని విశేషాలను గుర్తు చేశారు. అనంతరం శ్రీదేవి, సురేష్, ఆదినారాయణ, జ్యోతి , కృష్ణవేణి, సూర్యనారాయణ తదితరులు ఆలపించిన పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. -
దేవుళ్ల పేరుతో రాజకీయమా..?
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుళ్లను వాడుకునే నీచ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుముడితో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన శివమాలధారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. ఆలయాల నిర్వహణ, భక్తుల భద్రత విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో తిరుమల, సింహాచలం తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందినా, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో మరో పది మంది భక్తులు చనిపోయినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నారు. శ్రీశైలంలోనూ పొరపాటున అలాంటి ఘోర ఘటనలు జరిగి ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించేదా అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు పట్టని బాబు అండ్ కో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా రాజకీయ స్వార్థమే తమకు ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినా.. దుష్ప్రచారం చేసినందుకు పశ్చాత్తాపం చెందకుండా మరింత దిగజారుడుగా వ్యవహరించారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ మొత్తం ప్రెస్మీట్ పెట్టి లడ్డూ ప్రసాదం అంశంలో సిట్ నివేదిక ఇచ్చిన అంశంపై ఏకసభ్య కమిటీతో విచారణ చేయిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదం తయారీలోనూ బాత్రూంలు కడిగే ద్రావణం కలిపారని చేసిన ప్రకటన భక్తులు నిర్ఘాంతపోయేలా చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ విషప్రచారాన్ని కోట్లాది మంది భక్తులు చీదరించుకుంటున్నారన్నారు. తిమ్మిని బమ్మిని చేసే ఘనుడు కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తిమ్మిని బమ్మిని చేసి పచ్చి అబద్దాలు చెప్పడంలో ఘనుడని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వం తప్పులు ఎప్పుడు బయటపడ్డా ప్రెస్మీట్ల ద్వారా పచ్చి అబద్ధాలు వల్లెవేయడం కేశవ్కు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మాట్లాడి అభాసుపాలయ్యారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలోనూ జీఓలను వక్రీకరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, జిల్లా అధికార ప్రతిని సీపీ వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, రాష్ట్ర నాయకులు బసవరాజు, రూరల్, మండల సమన్వయకర్తలు ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, పరిశీలకులు డిష్ సురేష్, వజ్రకరూరు కన్వీనర్ సోమశేఖర్రెడ్డి, చాబాల జగదీష్, నాయకులు పచ్చి రవి, చిన్న భీమా, మారెష్, వడ్డే ఆంజినేయులు, మహనంది తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేయడం దారుణం భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
బ్రహ్మసముద్రం : మండలంలోని పడమటి కోడిపల్లి గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన జి.వీరేష్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందాడు. వారం క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఆయన ఆస్పత్రి పాలయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. కోమాలో ఉన్న వీరేష్ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. కసాపురంలో ప్రశాంతంగా టెండర్లు ● తలనీలాల సేకరణకు రూ.1.36 కోట్లు గుంతకల్లు: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదాయ వనరులపై బుధవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ధర్మకర్త కె.సుగుణమ్మ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలంతో పాటు ఈ–టెండర్లలో పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. గత ఏడాది రూ.1,02,6000 తలనీలాల సేకరణ హక్కుకు టెండర్ పాడగా... ఈ ఏడాది అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ నవీన్ ఏకంగా రూ.1,36,50,000కు పాడి వేలం దక్కించుకున్నాడు. టోల్గేట్ నిర్వహణకు గత ఏడాది రూ.7.10 లక్షలు కాగా, ఈ ఏడాది రూ.19,07,069కు, సెల్ఫోన్లు భద్రపరుచు హక్కు కోసం గత ఏడాది రూ.6.20 లక్షలు ఉండగా ఈ ఏడాది రూ.8.15 లక్షలకు, హుండీ ద్వారా వచ్చిన బియ్యం సేకరణ హక్కుకు గత ఏడాది రూ.12.75 లక్షలు కాగా, ఈ ఏడాది కిలోపై రూ.29 అధికంగా పాడినట్లు అధికారులు వివరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఐస్ క్రీమ్ విక్రయ హక్కు రూ.2.16 లక్షలు, అగర బత్తి తయారీకి రూ.6.11 లక్షలు, కేసరి సదనం వద్ద తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసుకుని క్యాంటీన్ నిర్వహణకు రూ.69వేలు, గోశాలలో ఎరువు సేకరణకు రూ.57 వేలు, ఒక్కో ఖాళీ డబ్బా సేకరణకు రూ.19 చొప్పన వేలం పాట సాగిందన్నారు. కాగా, ఏడాది పాటు కసాపురం ఆలయంలో కొబ్బరి కాయలు, తమలపాకులు, పూలు, పూలమాలలు, కండువాలు, శాలువాలు, జాకెట్లు, కొర పంచలు, రక్షా కంకణాలు సరఫరాకు గురువారం టెండర్లు నిర్వహించనున్నారు. అలాగే ప్రసాదాల కవర్లు, స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు, డెటాయిల్, స్టేషనరీ, రసీదు పుస్తకాలు వగైరా ముద్రించి ఇవ్వడం, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్ , శానిటేషన్ మెటిరియల్ సరఫరాకూ టెండర్లు ఉంటాయి. కార్యక్రమంలో ఏఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి టీసీసీ పరీక్షలుఅనంతపురం ఎడ్యుకేషన్: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ అనంతపురంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జి.వెంకటేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు www.bse.ap. gov. in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఽధ్రువీకరించుకోవాలన్నారు. హాల్టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు. -
ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం
కళ్యాణదుర్గం: ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ సేవలు అంతరించిపోయేందుకు టీడీపీ నాయకులే కారణమయ్యారని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ... ఆర్డీటీకి 2025 ఏప్రిల్ నుంచి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రెన్యువల్ కాలేదన్నారు. దీంతో సేవా కార్యక్రమాలకు నిధులు అందకుండా పోయాయన్నారు. అంతేకాక సంస్థ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఆర్డీటీపై ఉద్దేశపూర్వకంగానే కుట్ర జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్దరించాలని తాను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే రాజకీయ ఉనికి కోసమేనంటూ కళ్యాణదుర్గం, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పెడదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అసలు ఆర్డీటీ పుట్టిందే కళ్యాణదుర్గం ప్రాంతం బెళుగుప్ప మండలంలోనన్నారు. అక్కడి నుంచే తాను పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నాలుగు రోజుల్లో ఎఫ్సీఆర్ఏ తెస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారని, అయితే నేటికీ ఇది సాధ్యం కాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఆ రోజుల్లో పాదయాత్ర సాగనివ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. నిధులు అందకపోవడంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థ... సేవా కార్యక్రమాలను కొనసాగించే క్రమంలో ఆస్తుల విక్రయానికి సిద్ధమవుతోందని, ఇది కూడా కళ్యాణదుర్గం నుంచే ప్రారంభం కావడం బాధాకరమన్నారు. బెళుగుప్ప, కొత్తూరు, బోయలపల్లి, మల్లికార్జున పల్లి, కై రేవు తదితర ప్రాంతాల్లోని దాదాపు 8కి పైగా స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన దుర్గతికి సంస్థను నెట్టేశారని మండిపడ్డారు. ఆర్డీటీ ఆస్తులు అమ్ముతున్నారంటే సంస్థ మూసివేతకు సంకేతంగా భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రజలు చైతన్యం కాకపోతే రానున్న రోజుల్లో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. తలారి రంగయ్య -
వక్ఫ్ భూముల సేకరణ నిలిపివేయాలి
అనంతపురం అర్బన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణను తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మైనారిటీ నాయకులతో కలసి వినతి పత్రం అందజేసి, తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి మండలంలో వివిధ సర్వే నంబర్లకు సంబంధించి నోటిఫికేషన్లో చూపిన 71.57 ఎకరాల భూములు మత, ధార్మిక, విద్యా ప్రయోజనాల కోసం దశాబ్ధాలుగా వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయన్నారు. వీటిని కౌలు ప్రాతిపదికన చాలా మంది రైతులు సాగు చేస్తున్నారన్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకు, మసీదులు, పాఠశాలల నిర్వహణకు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని వివరించారు. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తిని బదిలీ చేయడానికి వీలు లేదన్నారు. వివాదాస్పద నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ముస్లిం సమాజానికి, వక్ఫ్ బోర్డుకు, అంజుమన్ సొసైటీకి, కౌలు రైతులకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత భూమిని సేకరించడం ద్వారా ముస్లిం సమాజానికి, ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సమాజంలోని పేదలకు పూడ్చలేని సామూహిక నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వక్ఫ్ భూముల సేకరణ చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని, నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీంసలీమ్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, రాష్ట్ర కార్యదర్శి గౌస్బేగ్, మైనారిటీ విభాగం రాష్ట కార్యదర్శులు వేముల నదీమ్, రహంతుల్లా, అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఫయాజ్, కార్పొరేటర్లు అబుసలేహ, ఇషాక్, షంషుద్ధీన్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు మన్సూర్, నాయకులు బాకే హబీబుల్లా, షేక్ జావీద్, ఖాజాపీరా, షరీఫ్ ఖాన్, రియాజ్, ఖాదర్బాషా, మహబూబ్బాషా, ఆసీఫ్, ఖమ్మర్ తాజ్, రపీ, షాహీ, ఇషాక్, షబ్బీర్, అబ్బాస్, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. -
డుమ్మా టీచరుకు చివరి అవకాశం
ఎయిర్పోర్టుకు స్థల పరిశీలన కూడేరు: ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనువైన స్థలం కోసం బ్రాహ్మణపల్లి వద్ద భూములను మంగళవారం ఆర్డీఓ కేశవనాయుడు పరిశీలించారు. ఆయన వెంట కూడేరు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడి అరెస్ట్ గుంతకల్లుటౌన్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు వన్టౌన్ పీఎస్ సీఐ మనోహర్ తెలిపారు. వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. గుంతకల్లులోని భాగ్యనగర్లో నివాసముంటున్న ఆటోడ్రైవర్ షాహీర్ ఎనిమిదేళ్ల క్రితం షేక్ రుక్సార్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసై రెండో పెళ్లి చేసుకుంటానంటూ తీవ్ర వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన రుక్సార్ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో షాహీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు రాయితీ అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి 35 శాతం రాయితీతో రుణాలు అందిస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ తెలిపారు. స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయ హాలులో అనంతపురం డివిజన్ ఏడీలు, డాక్టర్లతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాలో పాడిపశువుల సమాచారాన్ని సేకరించాలన్నారు. అవసరమైతే వైద్యచర్యల్లో భాగంగా ఫార్మసీ పూర్తి చేసిన మహిళల ద్వారా ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎదకు వచ్చిన పశువులకు ఇకపై తప్పనిసరిగా లింగనిర్ధారిత వీర్యం (ఎస్ఎస్ఎస్) ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేపట్టాలన్నారు. వేసవిలో గడ్డి, నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వీఏహెచ్ఏల పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, డీఎల్డీఏ ఈఓ డాక్టర్ జి.వెంకటేష్, ఏడీలు డాక్టర్ రాధిక, డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు పాల్గొన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: దాదాపు ఏడాదిన్నరకు పైగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొట్టిన టీచరుకు విద్యాశాఖ చివరి అవకాశం ఇచ్చింది. 10 రోజుల్లో రిపోర్టు చేసుకోకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలిగింపునకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే...విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరుగా పని చేస్తున్న బద్రీనాథ్ 2024, జూలై 15 నుంచి విధులకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ అంశంపై అనంతపురం డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేజర్ పెనాల్టీ కోసం తుది షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినా ఆయన అందుబాటులోకి రాలేదు. డీఈఓ కార్యాలయానికి ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పది రోజుల్లోపు రిపోర్టు చేసుకోని పక్షంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలిగించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. కాగా, అప్పుల కారణంగానే బద్రీనాథ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సుమారు రూ. 4 కోట్ల మేర అప్పులున్నట్లు తెలిసింది. అతని బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోనే సుమారు రూ. 25 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
బుగ్గరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గ్రామోత్సవంలో స్వామి ఉత్సవ విగ్రహాలు గోపూజ అనంతరం యాగశాల ప్రవేశానికి గోవును తీసుకెళ్తున్న దృశ్యంతాడిపత్రి రూరల్: పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు అభిషేకాలు, నక్షత్ర హారతులు ఇచ్చి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలోని పార్వతీమాతకు కుంకుమార్చనలు అనంతరం విశేష అలంకరణ చేశారు. ఈఓ రామాంజినేయులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు గోపూజ నిర్వహించి, యాగశాల ప్రవేశం చేయించారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల విశేష అలంకరణ అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
పీఆర్సీ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం
అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ వేయాలని, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ ఎస్వీవీ రమణయ్య, బసవరాజు ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక జెడ్పీహెచ్ఎస్లో టీచర్లతో కలిసి పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రికి పంపారు. ఈ సందర్భంగా ఎస్వీవీ రమణయ్య మాట్లాడుతూ 2023 జూలై నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పే రివిజన్ జరగాలని, ఇందు కోసం కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్బాబు, దేవదానం, ముక్తియార్, కృష్ణవేణి పాల్గొన్నారు. -
సేవాలాల్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
గుత్తి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ అఽధికారులను ఆదేశించారు. గుత్తి మండలం సేవాగఢ్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముందని గిరిజన సంఘాల నాయకులు, సేవాలాల్ ట్రస్ట్ సభ్యులు చెప్పారన్నారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రస్ట్ సభ్యులతో సమన్వయం చేసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సేవాలాల్ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలన్నారు. అనంతరం సేవాలాల్, మాతా జగదాంబ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సేవాలాల్ ట్రస్ట్ అధ్యక్షులు కేశవ నాయక్, ట్రస్ట్ సభ్యులు అశ్వత్థ నాయక్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎల్డీఓ విజయలక్ష్మి, చెర్లోపల్లి సర్పంచు అప్పా వెంకటేష్, గుత్తి మున్సిపల్ కమిషనర్ బబ్బార్మియా, ఐఅండ్పీఆర్ డీఐపీఆర్ఓ బాల కొండయ్య, ఎకై ్సజ్ ఎస్ఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలి
అనంతపురం మెడికల్: అత్యవసర సమయాల్లోనే సిజేరియన్ చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గత నెలలో చోటు చేసుకున్న మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. పుట్లూరు మండలానికి చెందిన సరస్వతికి సకాలంలో సిజేరియన్ చేయకపోవడంతో మృతి చెందిందని, ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిన వైద్య సిబ్బందికి డీఎంహెచ్ఓ మోమో జారీ చేశారు. కష్టతరమైన కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పీడియాట్రీషియన్లు డాక్టర్ దినకర్, డాక్టర్ లోక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. -
బాబులో రాజకీయ అభద్రతాభావం
అనంతపురం: సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు తొలిసారి రాజకీయ అభద్రతాభావంలో మునిగిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ చేసిన దుష్ప్రచారం సీబీఐ– సిట్ నివేదిక కొట్టిపారేసిందని, దీంతో ఏమి చేయాలో ఆయనకు దిక్కుతోచడం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని తప్పుబట్టారు. మంగళవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అయితే ఎన్నడూ లేని విధంగా తొలిసారి రాజకీయంగా అభద్రతా భావంలో పడిపోయారని విమర్శించారు. తనపై తనకే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల హామీలు అరకొరగా అమలు చేశారన్నారు. ఓసారి కల్తీ మద్యం అంటూ హడావుడి చేస్తారని, మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసులో అబద్ధాలు ప్రచారం చేస్తారని, ఇంకోసారి శ్రీవారి లడ్డూ కల్తీ అంటూ దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని అసత్య ప్రచారం చేశారన్నారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చివరకు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వూ కలవలేదని ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ ల్యాబ్లు తేల్చినా ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దుష్ప్రచారాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు చెప్పిందే సీబీఐ నివేదికలో రావాలన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విచారకరమన్నారు. తప్పు ఒప్పుకో...చంద్రబాబూ..! ‘ఎన్నికల సమయంలో మహిళలకు నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరైనా ఈ హామీల గురించి అడిగితే ఉండండయ్యా లడ్డూలో కల్తీ జరిగింది’ అంటూ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబుపై అనంత మండిపడ్డారు. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఇదే చర్చలు చేస్తున్నారని, చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోబియా పట్టుకుందన్నారు. నిద్రలో కూడా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు మాజీ సీఎం జగన్ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్, ఆ తర్వాత హరికృష్ణపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి లబ్ధి పొందిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో తనకు ఎవరు అడ్డువచ్చినా వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. అలానే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా ఏదో ఒక మరక అంటించాలనే ఆరాటం తప్ప మరొకటి లేదన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మీ హయాంలో ఉన్న కాంట్రాక్ట్ సంస్థే కదా? ‘తక్కువ ధరకు నెయ్యి వస్తుందా? అని అంటున్నారు. చంద్రబాబు కూడా వ్యాపారంలో ఉన్నాడు. డెయిరీలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేయలేదా?’ అని అనంత ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సరఫరా జరిగి తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్ల మీదే ప్రస్తుతం కేసు నడుస్తోందన్నారు. మీ హయాంలోనే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచే రూ.320, రూ.321కి సరఫరా జరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాకే కుళ్లాయిస్వామి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యాఖ్యలేంటి? పాలనా వైఫల్యం, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
భూముల రీ సర్వే పక్కాగా చేపట్టండి
కళ్యాణదుర్గం: భూముల రీ సర్వేని పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద జరుగుతున్న భూముల సమగ్ర రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ల వారీగా రైతులకు ముందుస్తుగా సమాచారం ఇచ్చి సర్వే చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదని సిబ్బందికి సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే పరిశీలించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు సర్వే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ డివిజినల్ ఇన్స్పెక్టర్ అంజలి, తహసీల్దార్ భాస్కర్, మండల సర్వేయర్ ప్రభాకర్, వీఆర్వో జవహర్ బాషా, రైతులు అంజనరెడ్డి, పాతూరప్ప, పలువురు రైతులు పాల్గొన్నారు. కసాపురంలో నేడు టెండర్లు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏడాది పాటు నిర్వహించే వివిధ రకాల పనులకు ఈ నెల 11న బహిరంగ వేలంతో పాటు షీల్డు, ఈ–టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు తలనీలాల సేకరణ, ఖాళీ ఆయిల్ డబ్బాలు, నెయ్యి, గోడంబి డబ్బాల సేకరణ, కొబ్బరి చిప్పలు, మొబైల్ ఫోన్ కౌంటర్, పార్కింగ్, టోల్గేట్, బెడ్షీట్స్, చాపలు అద్దెకు ఇచ్చే లైసెన్స్, తాత్కాలిక షెడ్డు వేసి హోటల్ నిర్వహణ, గోశాల ఎరువు సేకరణ, అగరు బత్తీలు, సంగంధ ద్రవ్యాలు అమ్ముటకు, బియ్యం– బేడల సేకరణ, భక్తుల లగేజీ భద్రపరుచుట తదితర వాటికి టెండర్లను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు బుధవారం ఉదయం జరిగే బహిరంగ వేలం పాటతో పాటు షీల్డు, ఈ–టెండర్లలో పాల్గొనవలసిందిగా ఆయన సూచించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనంతపురం అర్బన్: జిల్లాను బాల్యవివాహరహితంగా తీర్చిదిద్ధాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఐసీడీఎస్, జిల్లా బాలల పరిక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాల్య వివాహ విముక్త్ భారత్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మూడు నెలల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, శిక్షలు ఏ విధంగా ఉంటాయనేదానిపై అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఆర్డీఏ పీడీ శైలజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మంజునాథ్, ఓఏసీ శాంతమ్మ, ఉమా, నర్మద, ఆదినారాయణ, భానుజ, సమీర్, వసంతలక్ష్మి, కమలాక్షి, వెంకటర్, ఇర్ఫాన్, నిర్మల పాల్గొన్నారు. ముగిసిన ‘ప్రాక్టికల్స్’ అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, ఇంటర్ బోర్డు సిబ్బందికి పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఆర్ఐఓ వెంకటరమణనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. చివరి రోజు ఉదయం విడత పరీక్షలకు జనరల్ విద్యార్థులు 522 మందికి గాను 518 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 403 మందికి గాను 398 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 286 మందికి గాను 269 మంది హాజరయ్యారు. ఆర్ఐఓ 2 కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి 2, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 3, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. -
‘అనంత’జిల్లాలో దాహం కేకలు
వజ్రకరూరు/కుందుర్పి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నికల హామీలన్నీ నీటి మూటలుగా మారగా.. గొంతు తడిపే నీటిచుక్క కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్న ప్రజలు పలుచోట్ల రోడ్లెక్కి ఆందోళనలకు దిగారు. మంగళవారం వజ్రకరూరు మండలం కొనకొండ్లలో మహిళలు తాగునీటి కోసం మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆ గ్రామంలోని 7, 8 కాలనీలకు కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో వారంతా సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ సమస్య గురించి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం వివిధ కాలనీల వారు మహిళలతో కలిసి గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. ఎదురుగా ఉన్న ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో గంటకుపైగా ధర్నా నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వాల్మీకి గోవిందు, కాలనీవాసులు దేవేంద్రప్ప, శంకరయ్య, రాజేష్ కుమార్, మరికొందరు మహిళలు మాట్లాడుతూ... కాలనీకి సక్రమంగా మంచినీరు రావడం లేదని, రెండురోజులకు ఒకసారి నీరు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ వంద రోజుల్లో ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముళ్లకంచె అడ్డంగా పెట్టి ఖాళీ బిందెలతో నిరసన కుందుర్పి మండలం బండమీదపల్లి గ్రామంలో మంగళవారం కుందురి్ప–కళ్యాణదుర్గం ప్రధాన రహదారికి ముళ్ల కంచె అడ్డంగా పెట్టి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామంలో 20 రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే స్పందించేవారు కరువయ్యారన్నారు. ఎంపీడీవో లక్ష్మీశంకర్ బండమీదపల్లిలోనే నివాసముంటూ సమస్యను కళ్లారా చూస్తున్నా.. పరిష్కరించడంలో విఫలమయ్యారని మహిళలు వాపోయారు. 20 రోజుల్లో రెండుసార్లు కుందుర్పి మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టినా... అధికారుల్లో చలనం లేదన్నారు.గొంతెండుతోంది.. నీళ్లివ్వండి మహాప్రభో!నీటి కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బ్రహ్మసముద్రం/మడకశిర రూరల్: నీటి సమస్యను తీర్చాలంటూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. వివరాలు.. అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సుమారు 15 రోజులుగా ఈ పాఠశాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటికి, కాలకృత్యాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను టీడీపీ గ్రామ సర్పంచ్, టీడీపీ నేత సందీప్కు తెలిపినా ఆయన ఏ చర్యలూ తీసుకోలేదు. దీంతో విద్యార్థులంతా మంగళవారం రోడ్డెక్కారు. పాఠశాల ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం సర్పంచ్ ఇంటికి వెళ్లి తమ ఆందోళన తెలియజేశారు. ఇంట్లో సర్పంచ్ లేకపోవడంతో.. విద్యార్థులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఇంటికి వెళ్లి నిరసన తెలిపారు. మంత్రి సవిత ఇలాకాలో ఇదే పరిస్థితి..బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలం పత్తికుంటలోనూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజన సమయంలో తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ధర్నా చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే తమ సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. -
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమితమైన ప్రేమ చూపుతున్నారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా.. తిరిగి అదే స్థానంలో మరికొంత కాలం కొనసాగించేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. అధికారి ద్వారా ప్రతిపాదనలు పెట్టించి మరీ ప్రభుత్వ పెద్దలకు సిఫార్సు చేస్తున
హంద్రీ–నీవా సీఈ నాగరాజ రిటైర్డు ● 10 రోజులైనా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని వైనం ● ఆ సీటులో మరికొంతకాలం కొనసాగేందుకు ప్రయత్నాలు ● ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు ● రూ.వందల కోట్ల బిల్లుల మంజూరు కోసమేననే ఆరోపణలు అనంతపురం సెంట్రల్ : జల వనరుల శాఖలో ఎన్నడూ లేనివిధంగా నయా ట్రెండ్కు టీడీపీ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారినే తిరిగి కొనసాగించాలంటూ పట్టుబడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఆయన తప్ప సమర్థవంతమైన మరో అధికారి లేరా... ఇంత వరకూ ఆయన చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్నలు ఎవరికై నా ఉత్పన్నం కాకమానదు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రమే ఆయన సేవలు కావాలని ఒత్తిడి తెస్తుండడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రధాన కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం ఫేజ్–2 పరిధి (అనంతపురం, చిత్తూరు)లోనే రూ.1300 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనుల వల్ల భూగర్భజలాలు అభివృద్ధి చెందవని, నేరుగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు నీరు తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని రాజకీయపక్షాలే కాకుండా రైతులు సైతం వ్యతిరేకించినా పరిగణనలోకి తీసుకోకుండా ముందుకుపోయారు. రూ.వందల కోట్లు నీళ్ల ప్రాయంగా వెచ్చిస్తున్నారు. ఎక్కడేకానీ డిస్ట్రిబ్యూటరీ పనుల జోలికి వెళ్లకుండా ప్రధాన కాలువకు లైనింగ్ చేశారు. దాదాపు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. త్వరలో నీటి సరఫరా ఆగిపోతే మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. రెండు నెలల కాలంలోనే రూ.వందల కోట్లు విలువ చేసే పనులు జరిగాయి. అయితే ఈ పనుల పర్యవేక్షణలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) విధులు క్రియాశీలకం. ప్రస్తుతం పనిచేస్తున్న హంద్రీ–నీవా సీఈ నాగరాజ పదవీ కాలం జనవరి 30తో ముగిసింది. దాదాపు పది రోజులు కావస్తున్నా తదుపరి సీఈ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని సీఈ నాగరాజ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఓ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యేకే రూ.వందల కోట్లు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గతంలో ఆధునికీకరణ పనులు కూడా దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సంస్థకు అధిపతి అయిన ఎమ్మెల్యేకు రూ.వందల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. దీంతో సదరు ఎమ్మెల్యే.. సీఈ పదవీకాలం పొడిగించేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మంత్రి అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని జోరుగా చర్చించుకుంటున్నారు. ముందు నుంచి ఈ ఇద్దరి ఆశీస్సులతోనే సదరు అధికారి సీఈగా నియమితులయ్యారనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఎస్ఈగా ఉన్న ఆయనను అడహాక్ పదోన్నతిపై సీఈగా నియమించారు. తాజాగా పదవీ విరమణ చెందినా కూడా సీఈగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరముంటే పొడిగించవచ్చు ప్రభుత్వ అవసరాన్ని బట్టి అధికారుల పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఈఈ, ఎస్ఈల పదోన్నతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ముఖ్యమైన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా సీఈ క్యాడర్ పోస్టుల్లో అధికారులు లేరు. ఈ నేపథ్యంలో నేను పదవీ కాలాన్ని పొడిగించాలని కోరాను. ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. గతంలో ఇతర జిల్లాల్లో ఈఈ పదవీకాలాన్ని పొడిగించారు. – నాగరాజ, చీఫ్ ఇంజినీర్, హంద్రీ–నీవా -
బాలికల పాఠశాలలో సమస్యలు
● పరిష్కరించాలని టీచర్ల వినతి గుమ్మఘట్ట: మౌలిక సదుపాయాలు లేక విద్యార్థినులు పడుతున్న బాధను చూసి ఉపాధ్యాయినులు చలించిపోయారు. వారి గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వారే ముందుకు కదిలారు. రాయదుర్గంలోని జెడ్పీ ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతమందికి గాను మరుగుదొడ్లు, మూత్ర శాలలు అరకొరగా ఉన్నాయి. దీంతో విద్యార్థినులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయినులు అంజలి, ప్రభావతి, హేమలత సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. బాలికల ఉన్నతపాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీఓ కొండన్న హామీ ఇచ్చారు. -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు
● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు వివరించారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీలకూ ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారులతో సమీక్షిస్తున్న సీఎండీ శివశంకర్ -
జంబుకేశ్వరుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామికి సోమవారం విశేష పూజలు జరిగాయి. మూలవిరాట్కు ద్రాక్షపండ్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కాచిగూడ–తిరుపతి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–తిరుపతి మధ్య ఈ నెల 12న వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (07511) 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి రైల్వే జంక్షన్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఇందులో 3ఏ, చైర్ కార్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యతతో సరైన నిర్ణయాలు అనంతపురం అర్బన్: ఆర్థిక అక్షరాస్యత ద్వారా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎల్డీఎం నరేష్రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. వారోత్సవం సందర్భంగా బ్యాకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎల్డీఎం తెలిపారు. బేబీ కిట్లు.. ఇస్తే ఒట్టు..! ● ఆగిపోయిన కిట్ల సరఫరా ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉరవకొండ రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో నవజాత శిశువులకు బేబీ కిట్లు అందడం లేదు. పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకుంటారు. నవజాత శిశువులకు బేబీ సోప్, ఆయిల్, పౌడర్, షాంపూ, దోమతెర, బేబీ బెడ్, దుస్తులు, న్యాప్కిన్స్, డైపర్లు తదితర వస్తువులతో కూడిన కిట్ను గత ప్రభుత్వం ఉచితంగా అందించేది. ఇది పేదలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగించేది. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమైన వారికి బేబీ కిట్లు ఠంచన్గా అందించేది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బేబీ కిట్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కూలీనాలి చేసుకునే బతికే తాము వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బాలింత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ ప్రభుత్వాస్పత్రితో పాటు రాకెట్ల, పెద్దకౌకుంట్లలో పీహెచ్సీలు ఉన్నాయి. ఈ మూడు ఆస్పత్రుల్లో నెలకు సగటున 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే ఒక్కరికీ బేబీ కిట్లు అందించిన దాఖలాలు లేవు. ఉరవకొండ మండలమే కాకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బేబీ కిట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నేటితో ముగియనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మంగళవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియనున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ప్రారంభం కాగా, జనరల్ విద్యార్థులకు ఈ నెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన పరీక్షలకు 65 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో జనరల్ విద్యార్థులు 1,179 మందికి గాను 1,160 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,066 మంది విద్యార్థులకు గాను 1,051 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 433 మందికి గాను 402 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణనాయక్ మూడు కేంద్రాలు, జిల్లా వృతి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి మూడు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఎనిమిది, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏడాది వృథా కాకుండా... జిల్లా వ్యాప్తంగా 13 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో వారికి కేటాయించిన విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు. వాస్తవానికి వారు మళ్లీ వచ్చే ఏడాదే రాసుకోవాల్సి ఉంది. అయితే వైద్య చికిత్స చేయించుకుని మెడికల్ సర్టిఫికెట్లు జతచేసి ఆర్ఐఓ వెంకటరమణనాయక్కు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత విడతల్లో అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు చర్చించారు. ఎట్టకేలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత విడతల్లో రాసుకునే అవకాశం కల్పించారు. అనంతపురం, కంబదూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన 13 మంది విద్యార్థులకూ మళ్లీ అవకాశం కల్పించి రాయించారు. -
ఇంటర్నెట్ను బాధ్యతగా వినియోగించాలి
అనంతపురం అర్బన్: ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (ఏఐ)ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేఫర్ ఇంటర్నెట్ డే– 2026 పోస్టర్లను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. సేఫర్ ఇంటర్నెట్ డేను ఏటా ఫిబ్రవరి రెండో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. సైబర్ హైజిన్కు సంబంధించి ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, సైబర్ ముప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఏఐ డీఫ్ ఫేక్లు, ఏఐ వాయిస్ మోసాలు వంటి సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్ఐసీ ఏడీఐఓ భారతి సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, ఎన్ఐసీ ఏడీఐఓ టి.భారతి, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణారెడ్డి, ఈ–ఆఫీస్ అసోసియేట్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు. -
అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలి
● సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అనంతపురం క్రైం: రకరకాల సర్వేలను గడువులోపు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆత్మ శాంతి కలగాలని సోమవారం రాత్రి అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల ముందు నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ పార్కులో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు సర్వేలను ఒకే సమయంలో పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. అయితే సంబంధిత యాప్లు సరిగా పనిచేయకపోవడం, అప్గ్రేడ్ మొబైల్ ఫోన్లు లేకపోవడం, నెట్ సరిగా పనిచేయకపోవడంతో సర్వేలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పని ఒత్తిడి అనేకమంది సచివాలయ ఉద్యోగుల అకాల మరణాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల ప్రారంభానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో ప్రజల నుంచి సిబ్బందికి సరైన సహకారం అందకపోవడంతో పాటు ఓటీపీలు అడిగే సమయంలో అవమానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు చిన్నూరప్ప, వీరనారప్ప, డి.సుధాకర్, వరప్రసాద్, వి.లక్ష్మీనారాయణ, ముత్యాల రాజ్, మల్లికార్జున, సిరాల చంద్ర, రామకష్ణ, ముత్యాలు పాల్గొన్నారు. -
సమయానికి రాని వైద్యులు
● సిబ్బందితో రోగుల వాగ్వాదం కూడేరు: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద సోమవారం కూడేరులోని పీహెచ్సీలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది సమాచారమివ్వడంతో మండల పరిఽధిలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు తరలి వచ్చారు. వీరికి తోడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వందల సంఖ్యలో రోగులు కూడా చికిత్స కోసం వచ్చారు. అయితే ఉదయం 9 గంటలకు వైద్యులు హాజరు కావాల్సి ఉండగా 11 గంటలైన రాకపోవడంతో సహనం కోల్పోయిన రోగులు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీహెచ్సీ డాక్టర్ వెంకటప్రసాద్ సైతం 104 ద్వారా వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని, డాక్టర్ ఉషారాణి వచ్చేస్తారని సిబ్బంది చెప్పుకొచ్చారు. చివరకు 11.10 గంటలకు డాక్టర్ ఉషారాణి వచ్చి వైద్య సేవలందించారు. వివాహిత బలవన్మరణం గుంతకల్లు టౌన్: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని గంగానగర్కు చెందిన రుక్సార్ (27), అనంతపురంలోని కేకే నగర్లో నివాసముంటున్న సయ్యద్ షామీర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షాహీర్, తన భార్యాపిల్లలతో కలసి ఏడాది క్రితం గుంతకల్లులోని భాగ్యనగర్ ధర్మవరం రైల్వేగేట్ వద్ద ఓ అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసగా మారి కుటుంబపోషణను పట్టించుకోవడం మానేసి తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న షాహీర్ తన భార్యతో గొడవ పడ్డాడు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో భర్త, పిల్లలు నిద్రిస్తుండగా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం నిద్ర లేచిన పిల్లలు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించగానే గట్టిగా కేకలు వేస్తూ రోదించసాగారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి తల్లి షేక్ భానూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
విద్యార్థి కాలు విరిచిన ఆట సరదా
గుంతకల్లు టౌన్: సరదా పేరుతో విద్యార్థులు ఆడే ఆటలు తల్లిదండ్రుల్ని తీవ్రవేదనకు గురిచేస్తున్నాయి. స్థానిక లోని రోటరీ హైస్కూల్లో జరిగిన ఈ ఘటనే ఓ తార్కాణం. సోమవారం ఉదయం పాఠశాల విరామ సమయంలో స్టేజ్ వద్ద నిలబడిన ఎనిమిదో తరగతి విద్యార్థి శ్రీవర్ధన్ను తొమ్మిదో తరగతి విద్యార్థి విక్రమ్ పైకెత్తి కిడ్స్ ప్లే జోన్లోకి కింద పడేశాడు. దీంతో గాయపడిన శ్రీవర్ధన్ బాధ తాళలేక గట్టిగా కేక వేయడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీవర్ధన్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగినట్లు ఎక్స్రే ఆధారంగా వైద్యులు నిర్ధారించడంతో పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు పాఠశాల హెచ్ఎం వరలక్ష్మి తరలించారు. బేల్దారి పని కోసమని గూళ్లపాళ్యంకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు నారాయణస్వామి, ధనలక్ష్మి హుటాహుటిన పాఠశాలకు చేరకుని టీచర్లతో కలిసి అనంతపురానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించారు. -
కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు ఎర్రప్ప తోటలో సోమవారం ఉదయం ఎలుగుబంటి కనిపించింది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన ఎర్రప్ప.. ఎలుగుబంటిని గమనించి చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులను పోగేసుకుని అక్కడి నుంచి తరిమేశారు. కుక్కను తప్పించబోయి బీటెక్ విద్యార్థి మృతి అనంతపురం సెంట్రల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ఆదర్శనగర్లో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి తనూజ్ (23) సోవమారం శ్రీనగర్ కాలనీ నుంచి తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన తనూజ్ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ కేసు నమోదు చేశారు. రాష్ట్రస్థాయి త్రోబాల్ చాంపియన్గా ‘అనంత’ అనంతపురం కార్పొరేషన్: లీప్ టీచర్స్ త్రోబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 8 నుంచి రెండ్రోజుల పాటు గుంటూరులో త్రోబాల్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. సోమవారం ఏలూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వరుసగా 26–19, 17–25, 15–9 పాయింట్ల తేడాతో అనంతపురం జట్టు విజయ కేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా విజేత జట్టు క్రీడాకారులను డీఈఓ ప్రసాద్బాబు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాస్ తదితరులు అభినందించారు. చెరువులో పడి వృద్ధుడి మృతి బుక్కరాయసముద్రం: అనంతపురంలోని మున్నానగర్కు చెందిన చిన్న ఆంజనేయులు (65) స్థానిక చిక్క వడియార్ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. సోమవారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆయన కాలు జారీ చెరువు నీటిలో పడ్డాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 35 ఏళ్ల తర్వాత ఒకే చోట.. అనంతపురం సెంట్రల్: వారంతా ఒకేసారి పోలీసుశాఖలో ఏఆర్ విభాగంలోకి అడుగుపెట్టారు. వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు రావడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం అనంతపురంలోని రహమత్ ఫంక్షన్ హాల్లో కలుసుకుని సంబరాలు జరుపుకున్నారు. -
నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు రాలేంటూ విద్యార్థులు వాపోతుంటారు. మా అబ్బాయి బాగానే చదువుతుంటాడు. అయినా మార్కులు సరిగా రావడం లేదని తల్లిదండ్రులూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆశించిన మేర మార్కులు రాకపోవడానికి చేతి రాత అందంగా లేకపో
● పరీక్షల్లో చేతిరాత కూడా ముఖ్యమే ● అర్థమయ్యేలా రాయాలి ● దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు చేతి రాతపై సాధన చేస్తున్న విద్యార్థులు రాయదుర్గం టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన తరుణమిది. ధ్యాసంతా చదువుపైనే నిమగ్నం చేసే విద్యార్థులు కీలకమైన చేతిరాతపై దృష్టి సారించకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడాది పాటు చదివిన అంశాలను రెండున్నర గంటల్లో జవాబు పత్రంపై రాయగలగాలి. పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. ఈ ఆందోళనలోనే చేతి రాత అందంగా లేకపోవడం.. మూల్యాంకనం చేసే వారికి అర్థం కాకపోవడం తదితర కారణాలతో మార్కులు తగ్గే అవకాశముంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా దస్తూరిపై సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి పాటించాలి.. ● సమాధాన పత్రంపై రాసే జవాబు సూటిగా ఉండాలి. అక్షరాలు పొందికగా ఉంటే మూల్యాంకన చేసేవారికి సులువుగా అర్థమై కచ్చితమైన మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ● పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. ● సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తి పెట్టి రాయకూడదు. ● పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లకు మించి రాయకుండా జాగ్రత్త పడాలి. పదానికి, పదానికి అర సెంటీమీటరు గ్యాప్ ఇవ్వాలి. ● రోజూ చేతిరాతపై కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయగలుగుతారు. ● అక్షరాలు, పదాలు, వ్యాక్యాల మధ్య తగినంత ఖాళీ ఉండాలి. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. -
యువకుడి దుర్మరణం
కూడేరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ఎ.కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన అరుణ్ (18), శివయ్య జేసీబీ వాహన డ్రైవర్, సహాయకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూడేరు మండలంలో జేసీబీతో చేపట్టిన పనుల్లో పాలు పంచుకుంటున్న వారు సోమవారం వాహనానికి అవసరమైన గ్రీజును అనంతపురంలో కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బ్రాహ్మణపల్లి సమీపంలోకి చేరుకోగానే 67వ జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్ప స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. న్యూ కేటగిరి విభాగంలో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం 12 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఫరీద్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా పీఆర్పల్లికి రైతు రాజు యాదవ్ వృషభాలు, అదే జిల్లా చెన్నకానల గ్రామ రైతు చెన్నారెడ్డి వృషభాలు తృతీయ స్థానం, గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. రామాలయంలో చోరీ శింగనమల: మండలంలోని లోలూరు పంచాయతీ రఘునాథపురంలో వెలసిన రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలో చొరబడిన దుండగులు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, 3.5 కిలోల వెండి ఆభరణాలు, అర తులం బంగారును అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి గుర్తించి గ్రామస్తుల ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే రెండిళ్లలో... గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో సోమవారం పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. కారు డ్రైవర్ ప్రవీణ్ ఇంట్లో చొరబడిన దుండగులు బీరువాలోని ఒక తులం బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలతో పాటు రూ. 18 వేలు నగదు అపహరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంట్లో చొరబడి బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 3,500 నగదు అపహరించారు. ఇంటి యజమానాలు పనిపై బయటకు వెళుతూ ఇళ్లకు తాళం వేసి ఉన్న సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్ఐ సురేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసులు నమోదు చేశారు. -
ఇద్దరు మైనర్ల అరెస్ట్
కణేకల్లు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కణేకల్లు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్ఐ నాగమధు వెల్లడించారు. కణేకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు తమ తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన బాలురు తమ అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలకు తెరలేపారు. చాకలి రామన్న ఇంట్లో చొరబడి 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.వెయ్యి నగదు, బెస్త వన్నూరుస్వామి ఇంట్లో రూ.10వేల నగదు, జెడ్పీహెచ్ఎస్లో నీటి పంపింగ్ మోటారు, నల్లంపల్లి గ్రామ శివారున ఉన్న మరో ఇంట్లో విద్యుత్ మోటార్ను అపహరించారు. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కళ్యాణదుర్గం–బళ్లారి రహదారిలో వెళుతున్న బాలురు తమ వద్ద ఉన్న డబ్బు పంచుకునే విషయంగా గొడవపడడంతో అనుమానం వచ్చిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని పాలిథిన్ సంచుల్లోని రెండు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీలను అంగీకరించడంతో ఇరువురినీ గ్రామపెద్దల సమక్షంలో అరెస్ట్ చేశారు. ఉపాధి నూతన చట్టాన్ని రద్దు చేయాలి : సీపీఐఅనంతపురం టౌన్: ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చి నూతనంగా తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం డ్వామా కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వీ–బీ–జీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ.. వెంటనే కొత్తచట్టాన్ని రద్దుచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్చల్
ఉరవకొండ: ఓ కేసు విషయంలో తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ ఓ వ్యక్తి కోర్టు భవనం పైకెక్కి కిందకు దూకుతానంటూ కలకలం సృష్టించాడు. న్యాయమూర్తి అక్కడికి చేరుకుని తనకు హామీనిస్తే తప్ప కిందకు దిగనంటూ భీష్మించాడు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సదరు వ్యక్తిని ఉరవకొండకు చెందిన రాజశేఖర్గా గుర్తించి, సముదాయించి కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంగా పోలీసులు మాట్లాడుతూ.. రాజశేఖర్ మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం గొంతు కోసుకుని చికిత్సకు సహకరించకుండా ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు గుర్తు చేశారు. -
సంత్ సేవాలాల్
గిరిజనుల ఆరాధ్యుడు.. గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సేవాగఢ్లో సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. తమ ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జన్మస్థలమైన సేవాఘడ్లో జరిగే ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలు అశేషంగా హాజరవుతారు. 14న శనివారం రాత్రి జ్యోతి ప్రజ్వలనతో సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని రాంజీనాయక్ తండాలో భీమా నాయక్, ధర్మిణి బాయి దంపతులకు 1739, ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. తండ్రి భీమానాయక్ ఆ తండాకు పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రామంలో రచ్చబండపై పంచాయితీ తీర్పులు ఇచ్చేవారు. అ కట్టను భీమానాయక్ కట్టగా పిలుస్తుంటారు. ఈ కట్టకు ఎదురుగా ఉన్న బావిలో అక్కమ్మ దేవతలు స్నానం చేసేవారని, దీంతో ఆ బావిని పవిత్ర ‘కాళోకుండ్’గా పిలుస్తుంటారు. ఈ బావిలోనే సేవాలాల్ మహరాజ్ అప్పట్లో స్నానం ఆచరించి, భీమానాయక్ కట్టపై కూర్చొని తన ఆధ్యాత్మిక బోధనలతో బంజారాల్లో చైతన్యం తీసుకువచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ కాళోకుండ్ దగ్గరలో రూ.1.2కోట్లతో దండం మోరో మాత (మారెమ్మ దేవత) ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని విద్యలూ నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమైన సేవాలాల్.. తన ఆధ్యాత్మిక బోధనలతో జాతిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఇందులో ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. దాదాపు పాతిక సంత్సరాల క్రితం వరకూ సేవాగఢ్ ప్రాంతం నిర్జనమైన కొండ గుట్టలతో నిండి ఉండేది. చారిత్రక ఆధారాలను పరిశీలించిన అనంతరం రూ. కోటి వ్యయంతో అక్కడ సేవాలాల్ ఆలయాన్ని బంజారా నాయకుడు రంజిత్ నాయక్ నిర్మించారు. ఆలయ నిర్మాణానికి బంజారాలను ఏకం చేసి విరాళాలు సేకరించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఓ పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 2000 సంవత్సరంలో మొట్టమొదటి సారి సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బంజారాలు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సేవాలాల్ మహరాజ్ ఆలయ పరిసరాల్లోనే రూ.1.2కోట్లతో మారెమ్మ (మాతా జగదాంబ) ఆలయాన్ని నిర్మించారు. సేవాఘడ్కు గుత్తి బస్టాండ్ నుంచి నేరుగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. రైలులో గుత్తి, గుంతకల్లు స్టేషన్లకు వచ్చిన భక్తులు ఆటోల ద్వారా బస్టాండులకు చేరుకొని ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లో ప్రయాణించేవారు గుత్తి–గుంతకల్లు మార్గంలో గొల్లలదొడ్డి క్రాస్ నుంచి లోపలకు మూడు కిలోమీటర్ల దూరం వెళితే సేవాలాల్ ఆలయం వస్తుంది. సేవాలాల్ మహరాజ్ ఆలయం ‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. తనదైన బోధనలతో బంజారాల మనసు గెలుచుకుని.. వారిని భాషపరంగా ఏకతాటిపైకి తెచ్చి.. ధర్మమార్గంలో నడిచేలా చేశారు. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. మానవాళికి ధర్మమార్గాన్ని అలవాటు చేసేందుకు ఈ భువిపై వెలసిన ఆయనే సంత్ సేవాలాల్ మహరాజ్. కారణజన్ముడిగా బంజారాలు ఆరాధించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. భారతదేశంలోనే ఏకై క ఆలయం ‘సేవాగఢ్’ నాడు కొండ గుట్టల ప్రాంతం.. నేడు పుణ్య క్షేత్రం సేవాగఢ్లో 13 నుంచి జయంత్యుత్సవాలు దేశంలోనే అరుదైన ఆలయం.. ఇక్కడికి ఇలా చేరుకోవచ్చు.. సేవాగఢ్ విశిష్టత.. -
గుత్తి డీవైఈఓ ఎవరో?
● ఆర్జేడీ చేతికి సీనియార్టీ జాబితా అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ గుత్తి డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి (డీవైఈఓ) నియామకంపై సస్పెన్స్ నెలకొంది. డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యత వీరిదే కావడంతో డీవైఈఓ పోస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో గుత్తి డీవైఈఓ పోస్టులో మొన్నటి వరకూ బెళుగుప్ప ఎంఈఓ–1 మల్లారెడ్డి పని చేస్తుండేవారు. గత నెల 31న ఆయన ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఆ పోస్టు భర్తీకి సంబంధించి హెచ్ఎంల సీనియార్టీ జాబితాను ఆర్జేడీకి జిల్లా విద్యాశాఖ అధికారి నివేదించారు. అడ్డంకిగా మారిన ‘సెన్సూర్’ హెచ్ఎంల సీనియార్టీ జాబితాలో పామిడి మండలం ఖాదర్పేట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పురుషోత్తంబాబు పేరు ఉంది. రెండో స్థానంలో కణేకల్లు ఎంఈఓ–1 లక్ష్మన్న, మూడో స్థానంలో గుంతకల్లు ఎంఈఓ–1 మస్తాన్రావు పేర్లు ఉన్నాయి. అత్యంత సీనియర్గా ఉన్న పురుషోత్తంబాబుకు హెచ్ఎంగా దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. అయితే డీసీఈబీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో నిధులు పక్కదారి పట్టించారనే అభియోగాలున్నాయి. ఈ క్రమంలో అప్పట్లో ఆర్జేడీ స్పందించి విచారణకు కూడా ఆదేశించారు. అనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రెండు నెలల క్రితం ‘సెన్సూర్’ జారీ చేశారు. దీని కారణంగా పురుషోత్తంబాబుకు డీవైఈఓ ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రెండో స్థానంలో ఉన్న కనేకల్లు ఎంఈఓ–1 లక్ష్మన్నకే అవకాశం ఉండగా, ఆయన అయిష్టత చూపిస్తే తర్వాత స్థానంలో ఉన్న మస్తాన్రావుకు అవకాశం కల్పించనున్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ: 10 మందికి గాయాలు పెనుకొండ రూరల్: ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పది మంది గాయపడ్డారు. పెనుకొండ వద్ద 44వ జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకొంది. వివరాలు.. ఆదివారం హిందూపురం డిపో నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ అద్దె బస్సు ధర్మవరం బయలుదేరింది. మార్గమధ్యంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని వై జంక్షన్ వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు కండక్టర్ చాంద్ బాషా, డ్రైవర్ వెంకటరమణ నాయక్తో పాటు ప్రయాణికులు భాస్కర్, చిన్న నరసప్ప, లక్ష్మమ్మ, సుజాత, కల్పన, వెంకటమ్మ, చెన్నకేశవ, శ్రీనాథ్ గాయపడ్డారు. క్షతగాత్రులను కియా పోలీసులు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కండక్టర్ చాంద్ బాషా, చిన్న అంజనప్ప, కల్పనను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన కియా పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఉద్యాన హామీలు ఉత్తుత్తివే!
అనంతపురం అగ్రికల్చర్: ఏడాదిలోపు జిల్లాను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుస్తామని, ఫలసాయంలో ‘లోకల్ టు గ్లోబల్’గా ‘అనంత’ బ్రాండ్ను క్రియేట్ చేస్తామని, ఉద్యాన రైతుల తలరాతలు మార్చి ఆర్థికంగా గట్టెక్కిస్తామని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025 ఫిబ్రవరి 5న అనంతపురం వేదికగా నిర్వహించిన ‘హార్టికల్చర్ కాంక్లేవ్’లో ప్రకటించారు. దేశ నలుమూలల నుంచి 64 కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరైనట్లు చెప్పుకున్నారు. ఉద్యాన రైతులకు చేదోడు వాదోడుగా ఫలసాయానికి మంచి మార్కెటింగ్ జరిగేలా, రైతులకు మంచి లాభాలు వచ్చేలా చేయడానికి వీలుగా ఆరు కంపెనీలతో ఎంవోయూ (ఒప్పందాలు) చేసుకున్నట్లు ప్రకటించారు. ఏడాది పూర్తయినా ఆ ఎంవోయూలు అమలుకు నోచుకోక ఉత్తుత్తివిగా మిగిలిపోయాయి. కనిపించని ‘కాంక్లేవ్’ ప్రభావం.. రాష్ట్ర స్థాయి ఉద్యాన సదస్సు (కాంక్లేవ్) రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం చేకూర్చలేకపోయింది. దాని ప్రభావం మచ్చుకై నా కనిపించని పరిస్థితి ఏర్పడింది. చీనీ, మామిడి, ఎండుమిరప, అరటి, టమాట పంటలను ఐదు ప్రధాన గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించినా.. రైతులకు ఒనగూరిన ప్రయోజనం లేదు. ఏడాది పొడవునా చీనీ రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. కనీసం నెల రోజులు కూడా మంచి ధరలు లభించక.. టన్ను ధర సగటున రూ.15 వేలకే పరిమితం కావడంతో చీనీ రైతులు రూ.కోట్లు కోల్పోయారు. ఇక టమాట, అరటి పరిస్థితీ అంతంత మాత్రమే. ఒక దశలో టన్ను రూ.2 వేలకు పతనం కావడంతో అరటి రైతుల ఆక్రందనలు అమరావతి, ఢిల్లీని తాకాయి. ఎండుమిరప సాగు సగానికి పడిపోవడం గమనార్హం. మామిడిదీ అదే పరిస్థితి కావడంతో ఐదు గ్రోత్ ఇంజిన్లు డౌన్ఫాల్ కావడం గమనార్హం. మిగతా ఉద్యాన ఉత్పత్తులకు కూడా ఈ ఏడాది మార్కెట్ కలిసిరాకపోవడంతో 60 నుంచి 70 శాతం మంది రైతులకు నష్టాలే మిగిలాయి. ముందుకు సాగని ఎంవోయూలు.. ఉద్యాన కాంక్లేవ్ను ఇక నుంచి ప్రతి ఏటా నిర్వహించి కార్పొరేట్ కంపెనీల సహకారంతో రైతుల తలరాతలు మార్చేస్తామని మంత్రి పయ్యావులతో పాటు కాంక్లేవ్కు హాజరైన మిగతా ప్రజాప్రతినిధులు, అలాగే ప్రభుత్వం నుంచి మెంటర్గా హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈవో గెడ్డం శేఖర్బాబు ప్రకటించారు. ఆరు కార్పొరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ‘ఎంవోయూ’ (ఒప్పందాలు)లు ఉత్తుత్తివిగా మిగిలిపోయాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన మైక్రో ఆల్గే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్ఐ) ఏసియా పసిఫిక్ ప్రెసిడెంట్ డెబాబ్రతా సర్కార్, అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ కోల్డ్కేర్ ప్రొప్రైటర్ సిద్ధార్థరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన కోసూరి బాలాజీ ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కె.శ్రీనివాసరావు, తెలంగాణ, మల్కాజ్గిరి జిల్లాకు చెందిన గ్రీన్ గురుకులం ఫౌండర్ రాజాచాంద్, ఢిల్లీకి చెందిన ఆగ్రో లైఫ్ సైన్స్ కార్పొరేషన్ ఏపీ, తెలంగాణ స్టేట్ హెడ్ ఎం.ప్రసాద్, అనంతపురానికి చెందిన అనానఫిట్ నాచురల్ ఫైబర్ వీవర్ క్లస్టర్ ఫౌండర్ సి.శేఖర్ తదితరులతో కుదుర్చుకున్న ఎంవోయూలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అనంత ఉద్యాన ఉత్పత్తులను లోకల్ టు గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ప్రకటించిన యాక్షన్ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడం గమనార్హం. హార్టికల్చర్ ‘కాంక్లేవ్’ పూర్తయి ఏడాదైనా అమలుకు నోచుకోని ఎంఓయూలు ‘అనంత’ను ఫ్రూట్బౌల్ ఆఫ్ ఇండియాగా, లోకల్ టు గ్లోబల్ అంటూ గొప్పలు పోయిన మంత్రి దిగుబడి పెంచి, నష్టాలు తగ్గించి, రైతులను ఆర్థికంగా గట్టెక్కిస్తామన్న పాలకులు వాస్తవంగా ఏడాది పొడవునా చీనీకి నష్టాలే.. అరటి, టమాటాల పరిస్థితీ అంతంతే -
సంఘటిత పోరాటాలతో సమస్యలకు పరిష్కారం
అనంతపురం ఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కారం కావాలన్నా, హక్కులు దక్కాలన్నా సంఘటిత పోరాటాలతోనే సాధ్యమవుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానూజీరావు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో ఉమ్మడి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా జనసభ జరిగింది. ఉద్యోగుల హక్కులు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భానూజీరావు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్గా ఎం.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శిగా సి.వరప్రసాద్, కోశాధికారిగా ఎం.రాజేష్తో పాటు 23 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి.గురునాథ్, వైస్ చైర్మన్లు దివాకర్బాబు, సుశీల, కోశాధికారి యు.అనిల్, నాయకులు బి.వరపుత్ర, షేక్ మస్తాన్, పి. లవరాజు, అమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ భానూజీరావు -
రైతును నష్టపరిచిన నకిలీ విత్తనం
కనగానపల్లి: వ్యాపారుల మాటలు నమ్మి, వారు అంటగట్టిన నకిలీ విత్తనాలతో పంట సాగు చేపట్టి కనగానపల్లి మండలం ముత్తువకుంట గ్రామానికి చెందిన రైతు ఎం.నారాయణ మోసపోయాడు. వివరాల్లోకి వెళితే.. రైతు నారాయణ అనంతపురంలోని వినాయక ట్రేడర్స్ నిర్వాహకుడి మాటలు నమ్మి రూ.35 వేలు చెల్లించి పీహెచ్ఎస్– ప్లస్ అనే కళింగర విత్తనాలు కొనుగోలు చేసి, తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. తర్వాత వివిధ దశల్లో రూ.4 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాడు. నీరు సమృద్ధిగా అందిచడంతో పంట వేపుగా పెరిగి 90 రోజుల్లోనే కోతకు వచ్చింది. అయితే కాయ కోసి చూస్తే తెల్లగా బెండు బారిపోయి కనిపించింది. కాయలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు పంట కొనుగోలుకు ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని విత్తనం విక్రయించిన వ్యాపారితో పాటు విత్తన తయారీ కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళితే వారి నుంచి నిరాదరణ గురైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో 13 టన్నుల దిగుబడి పొలంలోనే ఉండిపోయిందని, రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. అధికారులు స్పందించి నకిలీ విత్తనం అంటగట్టిన వ్యాపారిపై చర్యలు తీసుకుని తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు. -
వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. స్వామి దర్శనార్థం భారీగా భక్తులు తరలి రావడంతో వెంకటాంపల్లి కొండప్రాంతం కిటకిటలాడింది. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం వేకువజామునే లక్ష్మీ నరసింహస్వామికి కల్యాణం నిర్వహించారు. ఉదయం పది గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 51 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు అలంకరించబడిన రథంపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుంచారు. రథాంగహోమం, బలి హరణ పూజల అనంతరం వేలాది భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, సోదరులు పాల్గొన్నారు. ఘనంగా ఉచిత సామూహిక వివాహాలు -
గంగమ్మా.. చల్లగ చూడమ్మా..!
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం సమీపంలోని పెన్నానది తీరాన వెలసిన ఏటి గంగమ్మ తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం మూడో ఆదివారం జరిగే ఈ తిరునాళ్లకు ఈసారి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆంధ్రా, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించారు. -
ప్రాణాన్ని బలిగొన్న కుటుంబ కలహాలు
వజ్రకరూరు: కుటుంబ కలహాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరుకు చెందిన ఆర్.రవికుమార్ (26) స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఏడాదిన్నర కిందట గుంతకల్లుకు చెందిన జయశ్రీ అనే యువతితో వివాహమైంది. మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోవడం.. తిరిగి రావడం.. జరుగుతోంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరి కాపురాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే మనస్తాపానికి గురైన రవికుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలోని పొలంలోకి వెళ్లాడు. అక్కడి నుంచే సోదరుడికి, మిత్రుడికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి పెట్టేశాడు. అనంతరం వెంట తీసుకెళ్లిన పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం కూడా కాలిపోయింది. మృతుని తల్లి వరాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఇళ్ల నిర్మాణాలు ఆపిన పాపం మీదే
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదల కోసం కేంద్రం నుంచి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయించి నిర్మాణాలు చేపడితే.. వాటిని పూర్తిచేయకుండా అడ్డుకున్న పాపం మీదే’నని చంద్రబాబు ప్రభుత్వంపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయే పేకమేడ అని అన్నారు. వైఎస్ జగన్, ఆయన వెంట నిలబడిన వారి క్యారెక్టర్లను దెబ్బతీసేందుకు ఎల్లోమీడియా ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎల్లో మీడియా రాస్తుందని, వీరు రాసిందే వారు మాట్లాడతారని పేర్కొన్నారు. అదే ప్రజలు నమ్మాలి అని భావిస్తున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం విఫలం.. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకాష్రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లోనే ఇటీవల గృహప్రవేశాలు చేశారని ఎద్దేవా చేశారు. రూ.1.80 లక్షలకే నిర్మిస్తున్న ఇళ్లల్లోనూ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 5–10 శాతం కమీషన్లు ఆశిస్తున్నారన్నారు. అధికారంలో వచ్చి 20 నెలలవుతున్నా ఇళ్ల నిర్మాణాల్లో ఏమి అభివృద్ధి సాధించారని ప్రశ్నించారు. రాష్ట్ర వాటా యూనిట్కు రూ.30 వేలు చొప్పున కేంద్రానికి చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం 3 లక్షల ఇళ్లను రద్దు చేసిందని తెలిపారు. రాక్రీట్ సంస్థపై ఎల్లోమీడియా దుష్ప్రచారం ఇళ్ల నిర్మాణాలను రాక్రీట్ సంస్థ పట్టించుకోలేదని ఎల్లోమీడియా మళ్లీ దుష్ప్రచారం చేస్తోందని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ పెద్దలు గాడిదలు కాస్తున్నారా? అనేది మాత్రం రాయలేదన్నారు. ఇళ్ల నిర్మాణ స్కీం మనుగడ ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంపై ఎల్లో మీడియా నిందారోపణలు చేస్తోందన్నారు. ఇంగితజ్ఞానం లేని మూర్ఖురాలు పరిటాల సునీత ఇచ్చిన లేఖను పట్టుకునే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు ఆపేశారనేది ఎల్లో మీడియాకు తెలీదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్రీట్ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణ జరపాలంటూ పరిటాల సునీత రాసిన లేఖతో పనులను ఆపేశారన్నారు. రూ.38 కోట్లు బిల్లులు రావాలని రాక్రీట్ సంస్థ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఈ బిల్లులు చెల్లిస్తే తక్కిన పనులన్నీ పూర్తి చేస్తామని 2024లో సదరు సంస్థ కోర్టుకు నివేదించిందన్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. మరి ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేవలం తనను అప్రతిష్టపాలు చేసేందుకు రాక్రీట్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై పచ్చమీడియాలో బూతు వార్తలు రాయించి పరిటాల సునీతను తృప్తి పరుస్తున్నారన్నారు. జగనన్నకాలనీల్లో చాలావరకు సిమెంటు, ఇసుక, పెల్లలు, సెంట్రింగ్ సామాన్లు, కడ్డీలు, మిషనరీల మోటార్లు ఎత్తుకెళ్లి రూ.20 కోట్ల దాకా నష్టం కల్గించారని పేర్కొన్నారు. మరో రూ. 30 కోట్ల విలువైన మిషనరీ తదితరాలు వృథాగా ఉన్నాయన్నారు. రూ. 38 కోట్లు బిల్లులు సంస్థకు రావాల్సి ఉందన్నారు. మీరే నిర్మాణాలు చేపట్టండి.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరితో చేయించినా తమకు అభ్యంతరం లేదన్నారు. అవసరమైతే రాక్రీట్ సంస్థ వద్ద ఉన్న అన్ని మిషనరీలు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ఇచ్చి సహకరిస్తామని చెప్పారు. పేదలకు చెందిన 50 వేల ఇళ్ల నిర్మాణాలు జరగకుండా అడ్డుకున్న ప్రతి ఒక్కరినీ వెతికి, వేటాడి వేటాడి మరీ చట్టం ముందు ఉంచి శిక్ష పడేలా చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ఇళ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, మీనుగ నాగరాజు, బోయ రామాంజి, ఉప్పరపల్లి శీనా, నారాయణరెడ్డి, రాప్తాడు శేఖర్, బండి పవన్, మాదన్న, బిల్లే మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. పరిటాల సునీత లేఖ ఆధారంగా పనులు నిలిపేశారు ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లల్లోనే ఇటీవల గృహప్రవేశాలు ఎల్లో మీడియాలో రాక్రీట్ సంస్థపై నిందారోపణలు చేయిస్తారా? రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం -
‘బూదిగుమ్మ’కు పోటెత్తిన భక్తులు
బెళుగుప్ప: మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బూదిగుమ్మ ఆంజనేయస్వామి తిరుణాలలో భాగంగా చివరి రోజు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుందకాండ హోమాన్ని నిర్వహించారు. సమీపంలోని పెన్నానది, జీడిపల్లి రిజర్వాయర్లో భక్తులు గంగ పూజలు చేసి, పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. బళ్లారి వెన్నపూస వంశస్తులు, రాళ్లపల్లి మనోజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిప్లాన్ గ్రూప్ చైర్మన్ కరుట్లపల్లి అనంతయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ
అనంతపురం: ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు గుత్తి మండలం సేవాగఢ్లో జరిగే సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్నాయక్, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస నాయక్తో కలసి ఆదివారం ఆయన సంత్ సేవాలాల్ జయంత్యుత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో వెంకటేష్ నాయక్, సోమ్లా నాయక్, ధనుంజయ నాయక్, సీనా నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీలో ‘అనంత’కు ప్రాధాన్యత అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యత కల్పించారు. ఆదివారం విజయవాడ వేదికగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా ఇందులో జిల్లాకు చెందిన పాతిరెడ్డికి రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా రాచంరెడ్డి మాధవి, రాష్ట్ర జీఓల కమిటీ మెంబర్గా జి.గురురాజను ఎన్నుకున్నారు. ఎంపికపై కమిటీ జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేశాయ్ నాగరాజు, సబ్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిరుత కోసం గాలింపు శింగనమల(నార్పల): బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం, నార్పల మండలం బొందలవాడలో చిరుతల సంచారంపై జిల్లా అటవీ శాఖ అప్రమత్తమైంది. ఈ రెండు గ్రామాల కొండల్లో ఆదివారం సిబ్బందితో కలసి అటవీశాఖ అధికారి చక్రపాణి పర్యటించి, చిరుత జాడ కోసం గాలించారు. డ్రోన్ సాయంతో చిరుతల కదిలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఆయన వెంట గుత్తి, అనంతపురం, కదిరి ఫారెస్ట్ రేంజర్లు, సిబ్బంది ఉన్నారు. -
ఆర్ఎస్కే అసిస్టెంట్లపై డెడ్లైన్ కత్తి
సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు సేవ కేంద్రాల్లో పనిచేసే సహాయకులు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకేసారి ఐదారు టాస్క్లు ఇచ్చి గడువులోపు పూర్తి చేయాలంటూ వారి మెడపై కత్తి పెట్టారు. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆర్ఎస్కే అసిస్టెంట్లు ఉదయం ఏడింటికే ఇల్లు వదిలి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా టార్గెట్ను చేరుకోలేకపోతున్నారు. ఈ నెల ఆఖరులోపు లక్ష్యాలన్నింటినీ సాధించాలంటూ వ్యవసాయశాఖ అధికారులు వాట్సాప్, టెలికాన్ఫరెన్స్లతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవ కేంద్రం (ఆర్ఎస్కే) అసిస్టెంట్లకు ఉద్యోగం కత్తిమీద సాముగా మారింది. వీరికి సాధారణంగా ఖరీఫ్లో మాత్రమే పనిభారం అధికంగా ఉంటుంది. రబీలో పెద్దగా పనిభారం ఉండదు. కానీ ఈసారి రబీ ఈ–క్రాప్ పెద్ద గుదిబండగా మారింది. యాప్లో 6.1 వర్షన్ కాకుండా 6.5 వర్షన్ సాప్ట్వేర్ మార్పు వల్ల గత ఖరీఫ్లో వేసిన పంటలతో పాటు రబీ పంటలు, బీడు భూములు కూడా మరోసారి ఈ–క్రాప్లోకి ఎక్కించాలని ఆదేశాలు ఇవ్వడం సమస్యగా మారింది. దీంతో మరోసారి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలను ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే)లో నమోదు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్కే అసిస్టెంట్లు వాపోతున్నారు. ఇదొక్కటే అయితే సమస్య ఉండేది కాదని.. ఇప్పుడు ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెల విశిష్ట సంఖ్య (యూనిక్ నంబరు) కేటాయించే ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ (ఏపీఎఫ్ఆర్) కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ● మరోపక్క న్యాచురల్ ఫార్మింగ్ కింద ఈ నెల 20 లోపు 23,711 మట్టి నమూనాలు (సాయిల్ శాంపిల్స్) సేకరించి ప్రయోగశాలలకు పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ సమయంలో ఇది కూడా పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. ● కొత్తగా ఫార్మర్ యాప్ (ఏపీఎఐఎంఎస్–2) ప్రతి రైతు మొబైల్లోనూ డౌన్లోడ్ చేయించాలని ఆదేశించారు. ఇంకో పక్క రోజుకు కనీసం 20 శాంపిల్స్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో ఫ్యామిలీ సర్వేకు ఎంతలేదన్నా అరగంట సమయం పడుతుందని చెబుతున్నారు. ఇవన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆర్ఎస్కే అసిస్టెంట్లపై భారం మోపడంపై మానసికంగా, శారీరకంగానూ ఆందోళన చెందుతున్నారు. ● ప్రతి మంగళ, బుధవారం ‘పొలం పిలుస్తోంది’, యూరియా సమస్య లేకుండా పర్యవేక్షణ, ఇతరత్రా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుందని ఆర్ఎస్కే అసిస్టెంట్లు చెబుతున్నారు. ఉదయం ఏడుకే ఫీల్డ్కు వెళుతున్నా టార్గెట్లు రీచ్ కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు యాప్లు సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 326 ఆర్ఎస్కేల పరిధిలో అసిస్టెంట్లు పనిభారంతో అల్లాడిపోతున్నారు. చంద్రబాబు సర్కార్ మల్టీ టాస్క్లు ఉదయం ఏడింటికే క్షేత్రస్థాయికి వెళ్లినా టార్గెట్ పూర్తికాని దుస్థితి ఈ–క్రాప్, శాంపిల్స్, ఏపీఎఫ్ఆర్, యూనిఫైడ్ సర్వేతో ఒత్తిళ్లు ‘పొలం పిలుస్తోంది’, కార్యక్రమాలతో ఆర్ఎస్కే అసిస్టెంట్లు సతమతం -
ఏపీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి జరగనున్న పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్ శశిధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో పరీక్షల ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను భద్రపరిచిన ఖజానా స్ట్రాంగ్ రూమ్ను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు కేంద్రాల్లో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయ న్నారు. రోజూ రెండు సేషన్లుగా ఉదయం 9.30కు, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిర్దేశించిన సమయం తరువాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదన్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులనూ కేంద్రాల్లోకి అనుమతించబోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
సరళంగా.. సులభంగా
రాయదుర్గంటౌన్: కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, సురక్షితంగా, సులభతరంగా అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో కొత్త ఆధార్ యాప్ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఆధార్ యాప్తో ఇక చిన్న చిన్న మార్పుల (అప్డేట్స్) కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆధార్లో అడ్రస్ మార్చాలన్నా.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలన్నా గంటల తరబడి లైన్లలో నిలబడి వేచిచూడాల్సిన పని ఏమాత్రమూ లేకుండా కొత్త యాప్లో సౌకర్యాలను సులభతరం చేశారు. అంతేకాక ఒకే స్మార్ట్ఫోన్లోనే ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాల ప్రొఫైల్ను సైతం పొందుపరుచుకునే సౌకర్యం కల్పించారు. ఆధార్ నంబర్ లాక్, అన్లాక్ సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే మొబైల్ నుంచే ఈ సేవలన్నీ పొంద వచ్చు.రోజువారీ గుర్తింపు ధ్రువీకరణలు సరళంగా, భద్రంగా మార్చడమే మార్పుల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. వివరాలు ఫుల్సేఫ్.. ఎక్కడపడితే అక్కడ ఆధార్ నెంబర్, వేలిముద్రలు (బయోమెట్రిక్) ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త యాప్ ద్వారా ఐడెంటిటీని సులువుగా రుజువు చేసుకోవచ్చు. అంతేకాక ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా ఇందులో వెరిఫికేషన్ చేసుకొనే వెసులు బాటు కల్పించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను సైతం పరిశీలించుకోవచ్చు. ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు పంచుకోకుండానే గుర్తింపు నిర్ధారించే విధానాన్ని ఈ యాప్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం గమనార్హం. ఇది వినియోగదారుడికి పూర్తిగా నియంత్రణలో ఉండి భద్రతను అందిస్తుంది. కొత్త ఆధార్ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసుకుని షేర్ చేయొచ్చు. పేరు, వయస్సు వంటి పరిమిత వివరాలతో పాస్వర్డ్ రక్షిత ఫైల్ను తయారు చేసి పంచుకునే అవకావం ఉంది. స్మార్ట్ ఫోన్లోనే ఫ్యామిలీ అంతా.. కొత్త ఆధార్ యాప్లో పొందుపరిచిన మరొక అద్భుతమైన సౌకర్యం ఇది. మీ ఒక్కరిదే కాకుండా ఇంట్లో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను ఫోన్ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు సంబంధించిన వివరాలు ఒకే చోట లభిస్తుండడంతో ఆధార్ వివరాలు తెలియజేసేందుకు, ఐడీగా చూపేందుకు ఎంతో సౌకర్యవంతమైన ఆప్షన్గా చెప్పవచ్చు. ఈ నూతన ఆధార్యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అప్డేట్ ఇక మీ చేతుల్లోనే.. మొబైల్ నెంబర్, చిరునామా మార్పు కొత్త యాప్లో సులభతరం ఒకే స్మార్ట్ఫోన్లో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు -
వెంకన్న ప్రతిష్టను దిగజారుస్తున్న చంద్రబాబు
● గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ మండిపాటు గుత్తి: సీఎం చంద్రబాబు తన దిగజారుడు వ్యాఖ్యలతో తిరుమల వెంకన్న ప్రతిష్టను దిగుజారుస్తున్నారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అన్నారు. గుత్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్ సీపీ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, సీబీఐలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ప్రకటించినా పట్టించుకోకుండా కూటమి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వెంకన్న ఆగ్రహానికి గురవుతున్నారన్నారు. జగన్ను ఎదుర్కోలేక కూటమి నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, దీనిపై ప్రశ్నిస్తున్న గొంతుకలను అణచి వేస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజనిపై దాడులు చేయించారన్నారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు.పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ, వార్డు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ, మండల కన్వీనర్లు మధు, గంగరాజు, మాజీ కన్వీనర్ పీరా, డాక్టర్ శాంతి ప్రియ, జిల్లా నాయకులు రామ సుబ్బారెడ్డి, రంగస్వామి, వెల్డింగ్ రవూఫ్, మున్నా, మండల నాయకులు షఫి, రఘు, దేవా, వరదా, సునీల్, గాదిలింగ, కటిక అన్వర్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
గార్లదిన్నె: బీటెక్ విద్యార్థి బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని కమలాపురంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కమలాపురం గ్రామానికి చెందిన చింతబరరెడ్డి, జయలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి (21) బెంగళూరులోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. శ్రీకర్ రెడ్డి మొదటి, ద్వితీయ సంవత్సరంలోని కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. తోటి స్నేహితులు పాస్ కావడం, ఫైనల్ ఇయర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యం బాధపడుతుండేవాడని సమాచారం. ఈ క్రమంలో శనివారం తమ వ్యవసాయ తోటలో చీనీ చెట్లకు మందు పిచికారీ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శ్రీకర్ రెడ్డి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి కూడేరు: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అరవకూరు–కమ్మూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం నేరహళ్లికి చెందిన లారీ డ్రైవర్ వీరన్న (34) హొస్పేట్ నుంచి ధర్మవరానికి సిమెంట్ బస్తాలు తీసుకుని వెళుతున్నాడు. మార్గమధ్యంలోని అరవకూరు–కమ్మూరు వద్ద శనివారం వేకువ జామున ఎదురుగా గుర్తు తెలియని వాహనం లారీని ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన వీరన్న లారీలోనే మృతి చెందాడు. అటుగా వెళుతున్న వాహనదారులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. వీరన్న సోదరుడు ముత్తప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. కొర్రకోడు హైస్కూల్ పీఈటీ తీరుపై విచారణ కూడేరు: మండల పరిధిలోని కొర్రకోడు హైస్కూల్ పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయుడు) మల్లికార్జున రెడ్డి తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మద్యం సేవించి విధులకు వస్తున్నాడని, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఈఓ ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు కొర్రకోడు పాఠశాలలో విచారణ చేపట్టారు. బాలికలు, ఉపాధ్యాయులు, పలువురు తల్లిదండ్రులను విచారించారు. మద్యం సేవించి రావడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీ సెలవులో ఉన్నారు. విచారణలో వెల్లడైన విషయాలను నివేదిక రూపంలో డీఈఓకి అందజేస్తామని డిప్యూటీ డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ మహమ్మద్ గౌస్, హెచ్ఎం గాయిత్రి పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యేశ్వరా.. పాహిమాం
● కోటంకలో వైభవంగా రథోత్సవం గార్లదిన్నె: మండల పరిధిలోని కోటంక కొండల్లో వెలసిన గుంటి కింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన అర్చకులు రామాచార్యులు స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, సహస్ర నామార్చన నిర్వహించారు. స్వామివారి వెండి విగ్రహాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథంలో ఉంచి పురవీధుల్లో రాత్రి రథోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని మనసారా కీర్తిస్తూ భక్తిపారవశ్యం పొందారు. రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో కోటంక కిటకిటలాడింది. కొండల్లో కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరునాలలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. -
కీలక దశ.. మెలకువలతో లాభాల దిశ
● పూత దశలో మామిడి తోటలు ● యాజమాన్యం పాటించాలని అధికారుల సూచనలు కళ్యాణదుర్గం/అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చింది. ఈ సమయంలో దిగుబడి పెంచుకోవడానికి కొన్ని మెలకువలు పాటిస్తే గణనీయమైన లాభాలు సాధించవచ్చు. కొమ్మలకు పూత వచ్చే ప్రస్తుత సమయంలో వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సమయాల్లో పూత వచ్చినప్పటికీ అది ముడుచుకుని పోయే ప్రమాదం ఉంది. సీజనల్ పూత పూర్తిగా రాకపోవడం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాప్టలిస్ అసిటిక్ ఆమ్లాన్ని స్పిరిట్లో కరిగించి ఆ తర్వాత మంచినీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. దీంతో కొమ్మలకు పూత సాగి పూలు విచ్చుకుని పిందెకట్టే అవకాశం అధికంగా ఉంటుంది. సాగునీటి యాజమాన్యం... మామిడి పూత సమయంలో తోటలకు నీటి తడులు చాలా అవసరం. పూత, మొగ్గ బయటపడే సమయంలో మామిడి తోటలకు తప్పనిసరిగా నీటిని అందించాల్సి ఉంటుంది. వేళ్ల నుంచి చివర కొమ్మ వరకు తడి అందేలా చేస్తే అన్ని కొమ్మలకు పూత సాగే అవకాశం ఉంటుంది. నీటిని అందించే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పదిహేనేళ్లు దాటని తోటలకు ఒకసారి (బాగా తేలిక నేలలైతే), వారం రోజుల తర్వాత మరోసారి నీరందించాలి. లేదంటే డ్రిప్ ద్వారా వారం రోజుల పాటు నీరు అందిస్తే ప్రయోజనం ఉంటుంది. పిందె దశలో.. రబీలో ఆలస్యంగా కోతకు వచ్చే రకాల చెట్టుపై హోర్మోనులను పిచికారీ చేస్తే పూత, పిందె రాలడం బాగా తగ్గుతుంది. తెల్లపూత, జొన్న గింజ పరిమాణంలో పిందెలు ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 4 గ్రాముల నాప్టలీన్ అసిటిక్ ఆమ్లం, దీనికి తోడు 400 గ్రాముల బోరాన్ కలిపి పూతపై పడేలా పిచికారీ చేసుకోవడం వల్ల పిందెకట్టే సమయంలో రాలడాన్ని నివారించవచ్చు. కాయ దశ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో పూతపై మాత్రమే తుంపర్లు పడే విధంగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పిందె పరిమాణం పెరుగుతన్న సమయంలో కూడా నీటిని అందిస్తూ మొదళ్లలో తడి ఆరకుండా చూడాలి. -
21 నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బ్రోచర్లను శనివారం గవిమఠం ఆవరణలో పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం ఇన్చార్జ్ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న స్వామి వారి మహారథోత్సవం, 27న లంకాదహనం ఉంటాయన్నారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్, పాటిల్ రాజశేఖర్, మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గవిమఠం చంద్రమౌశీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్ సూచించారు. శనివారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో గవిమఠం బ్రహ్మోత్సవాలపై దేవదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ అధ్యక్షతన అధికారులతో జరిగిన సమీక్షలో ఆర్డీఓ మాట్లాడారు. మహారథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. -
బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు!
అనంతపురం సెంట్రల్: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నివాసం వద్ద క్షుద్రపూజలు చేశారన్న వదంతులు కలకలం రేపాయి. శనివారం ఉదయం అనంతపురంలోని నివాసం వద్ద జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఏపీ39 కేఎక్స్ 0986 నంబరు గల కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే నివాసం దగ్గర నిమ్మకాయలు మంత్రించి పరారైనట్లు చెబుతున్నారు. ఆ సమయంలో గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు వెంబడించినా దొరకలేదని అంటున్నారు. ఈ పని ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదూ అందలేదని టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. రేపు ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. ఉచిత విద్యకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం–2009 ఉచిత నిర్బంధ హక్కు చట్టం సెక్షన్ 12(1)సి ప్రకారం 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న, బలహీన వర్గాల పిల్లలకు సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలతో వెబ్సైట్లో కేటాయిస్తారన్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలల్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం, మండల వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఎంఈఓలను సంప్రదించాలన్నారు. చిరుతల కోసం డ్రోన్ కెమెరాతో నిఘా శింగనమల: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతల కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం – నార్పల మండలం బొందలవాడ పొలాల్లో చిరుతల సంచారం కలకలం రేపింది. వారం రోజులుగా ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ఈ ప్రాంతాల ప్రజల భయంతో గజగజ వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక అధికారులు, సిబ్బంది పై రెండు గ్రామాల పొలాల్లో పర్యటించారు. చిరుత ఎప్పుడు కనిపించిందంటూ ఆయా ప్రాంత రైతులు, ప్రజల నుంచి వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. చిరుత పాదాల గుర్తుల కోసం నిశితంగా పరిశీలిస్తున్నారు. చిరుతల ఆచూకీ కోసం పొలాల్లో డ్రోన్ కెమారాలతో నిఘా వేశారు. చిరుతలు కనిపిస్తే ఆ ప్రదేశంలో బోన్లు ఏర్పాటు చేయడానికి, తదితర చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం, బొమ్మలాటపల్లి, కేకే ఆగ్రహారం, బొందలవాడ, ఆ గ్రామాల పరిసరాల్లో చీనీ, మామిడి, మొక్కజొన్న, సపోట తోటలు ఆధికంగా ఉన్నాయి. చిరుతలు ఈ తోటలలో కనిపిస్తున్నాయని, అటువైపు పోవడానికి భయపడుతున్నామని రైతులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఈగ్రామాల పరిధిలోని పొలాల్లో డ్రోన్ కెమెరాతో వాచ్ చేస్తున్నారు. సంజీవపురం తోటల్లో చిరుత గుర్తింపు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ కెమారాతో పరిశీలించగా.. సంజీవపురం వద్ద వ్యవసాయ తోటల్లో ఒక చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుతను త్వరలోనే పట్టుకుంటామని, అందుకు అవసరమైన బోను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. -
పాముకాటు బాలునికి పునర్జన్మ
● సర్వజనాస్పత్రి పీడియాట్రిక్ వైద్యుల ఘనత అనంతపురం మెడికల్: పాముకాటుకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఏడేళ్ల బాలునికి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్నర్సులు ఊపిరి నిలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత మీడియాకు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలం ఇట్లంపల్లికి చెందిన లక్ష్మీకాంత్, లక్ష్మి దంపతుల కుమారుడు బన్నీ జనవరి 30న పాముకాటుకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స ప్రారంభించారు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ సంజీవప్ప, తదితరులు యాంటీ స్నేక్ వీనమ్తో పాటు పలు రకాల యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. బన్నీ పూర్తిగా కోలుకోవడంతో శనివారం వైద్యులు డిశ్చార్జ్ చేశారని వారు తెలిపారు. -
ఆలయంలో వెండి అపహరణ
గార్లదిన్నె: మండల పరిధిలోని జంబులదిన్నె కొట్టాల గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో దుండగులు 40 తులాల వెండి అపహరించారు. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి జంబులదిన్నె కొట్టాల ఆంజనేయస్వామి ఆలయంలోకి తాళాలు పగుల గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. హుండీతో పాటు 40 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఆలయ షట్టర్ పగులగొట్టిన విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఉత్సాహంగా క్రీడాపోటీలు అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో భాగంగా రెండోరోజు శనివారం పలు క్రీడా పోటీలను స్థానిక పరేడ్గ్రౌండ్లో నిర్వహించారు. క్రికెట్, యోగా, కబడ్డీ, బాస్కెట్బాల్, వాలీబాల్, హైజంప్, పరుగు పందెం తదితర పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్కు ఎంపిక
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జ్యోతి అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 2వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయస్థాయి 7వ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (40 సంవత్సరాల వయస్సు పైబడిన వారు) పోటీల్లో జ్యోతి 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్ఎం గోపాల్రెడ్డి, పీడీ ఎంకె.రాజేష్ తెలిపారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్లు ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, డీ.హీరేహాళ్ ఎంఈఓ వేణుగోపాల్లు పాల్గొని జ్యోతిని అభినందించారు. అనుమానంతోనే హత్య ● వీడిన కావలి రమేష్ హత్య కేసు మిస్టరీ బొమ్మనహాళ్: మండలంలోని లింగదహాళ్ గ్రామ శివారులో ఈ నెల 1న జరిగిన కావలి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కావలి రమేష్ తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మండలంలోని కొలగానహళ్లి గ్రామానికి చెందిన కావలి మహేంద్ర అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువైన కావలి తిప్పేస్వామి అలియాస్ తిప్పయ్య, హరిజన సోమశేఖర్, కణేకల్లు మండలం కళేకుర్తి గ్రామానికి చెందిన బోయ రమేష్తో కలిసి కుట్ర పన్నాడు. ఈ నెల 1న సాయంత్రం కావలి రమేష్ లింగదహాళ్లోని ఎరువుల దుకాణానికి వెళ్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యంలో కాపుకాసిన నలుగురూ.. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం కణేకల్లు క్రాస్లోని ఆర్డీటీ ఆసుపత్రి ఎదురుగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రెండు వేట కొడవళ్లు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరమణ తెలిపారు. కావలి రమేష్ను హత్య చేసేందుకు కిరాయి హంతకులను ఏర్పాటు చేస్తానని బోయ రమేష్ చెప్పగా హత్య సఫలమయ్యేందుకు హరిజన సోమశేఖర్ పూజలు చేయించి తాయెత్తు తెచ్చినట్లు వెల్లడైందన్నారు. కేసులో ఇంకా ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అభినందించారు. హంచనహాల్లో దొంగల కలకలంవిడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ గ్రామంలో దొంగల కలకలం రేగింది. గ్రామస్తులు తెలిపిన మేరకు ... కర్నూలు జిల్లా తాండాకు చెందిన ఐదుగురు దొంగలు శనివారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి చొరబడ్డారు. వీరిని గుర్తించిన యువకులు, మహిళలు ప్రశ్నించగా పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు వెంబడించి ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గ్రామంలో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు వారు ఒప్పుకున్నట్లు తెలిసింది. సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దొంగలను అదుపులోకి తీసుకున్నారు. -
బోయ ఆనంద్ది పరువు హత్యే
● లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన హతుడి సోదరి పూజ కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండలం యనకల్లుకు చెందిన బోయ ఆనంద్ది పరువు హత్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుల పక్షాన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పోరాటం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై హతుడి సోదరి లోకాయుక్తను ఆశ్రయించారు. బోయ ఆనంద్ది ముమ్మాటికీ పరువు హత్యేనని ఫిర్యాదు చేశారు. వివరాలను ఆమె శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బోయ ఆనంద్ను ప్రేమిస్తున్నానంటూ కళ్యాణదుర్గంలో నివాసముంటున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ వివాహిత నమ్మించి, తన భర్త నుంచి విడాకులు తీసుకుంటానని, పెళ్లి చేసుకుందామంటూ 2025, నవంబర్ 20న కళ్యాణదుర్గానికి పిలిపించుకుందన్నారు. మరుసటి రోజు 21న బోయ ఆనంద్ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడన్నారు. ఆనంద్ సెల్ఫోన్లో మెసేజ్లు, ఆడియో, వీడియో రికార్డింగ్ ఉండడంతో.. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని అది ముమ్మాటికే హత్యేనని అప్పట్లో కుటుంబ సభ్యులు భావించారు. అమ్మాయి తరపున బంధువులే పథకం ప్రకారం బెంగళూరు నుంచి రప్పించి కొట్టి, బలవంతంగా పురుగుల మందు తాపించారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా టీడీపీ నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణంగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనూ నిర్ధారణ అయిందన్నారు. ఇదంతా పోలీసులకు తెలిసినా రూ.7 లక్షలు లంచం తీసుకుని సీఐ హరినాథ్ కేసును తారుమారు చేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులే బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వారి బెదిరింపులకు తన కుటుంబసభ్యులు గ్రామం విడిచి మూడు నెలలుగా బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు హత్యకు ప్రాథమిక ఆధారాలున్నా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
ఎనర్జీ అసిస్టెంట్లకు సర్వే కష్టాలు
అనంతపురం టౌన్: సచివాలయాల పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని 25 ఇళ్లలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రతి రోజూ ఆధార్ ఈ కేవైసీ చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన కచ్చితమైన ఆధారాఆలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సర్వే ఆధారంగానే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించనున్న నేపథ్యంలో సచివాలయ పరిధిలోని ఉద్యోగులు సర్వే తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది. ప్రతి ఉద్యోగి కూడా సర్వే ప్రక్రియలో పాల్గొని సమగ్ర వివరాలతో నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లకు తిప్పలు ఎనర్జీ అసిస్టెంట్ల ఎంపిక గతంలో సచివాలయాల పరిధిలో జరిగింది. వారిని సైతం సచివాలయాల ఉద్యోగుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంతో వారు సైతం తమ సచివాలయాల పరిధిలోని ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను మొబైల్ యాప్ ద్వారా (యూఎఫ్ఎస్) సర్వే చేయాలని, క్లష్టర్ పరిధిలోని ఇళ్ల వివరాలను అధికారులు అందజేశారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సైతం సర్వే చేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రోజూ 10 కుటుంబాల వివరాలను సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎనర్జీ అసిస్టెంట్లు తమ పరిధిలోని విద్యుత్ శాఖ ఏఈల ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. సర్వే చేయాలని ఎస్ఈ ఆదేశాలు ఇచ్చినా.. మీరు మాత్రం సర్వేకు వెళ్లకూడదని ఏఈలు అడ్డుకుంటున్నారు. జీతాలు విద్యుత్ సంస్థ ఇస్తోంది కాబట్టి అందరూ ఎస్పీడీసీఎల్ సంస్థ ఉద్యోగులుగానే పరిగణించబడుతారని, ప్రతి ఒక్కరూ విద్యుత్ బిల్లులు కొట్టాల్సిందేనంటూ ఏఈలు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఎనర్జీ అసిస్టెంట్లకు తిప్పలు తప్పడం లేదు. గతంలో షోకాజ్ నోటీసులు జిల్లా వ్యాప్తంగా 350 మందికి పైగా ఉద్యోగులు సచివాలయాల పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్లుగా ఎంపికై విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో పని చేస్తున్నారు. గతేడాది నవంబర్లో ప్రభుత్వం సూచించిన కౌశలం, సిటిజన్ ఈకేవైసీ, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై డోర్ టూ డోర్ సర్వే చేయలేదని 137 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తాజాగా సర్వే చేయకుంటే మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశమూ లేకపోలేదు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి సర్వేలో పాల్గొనని ఉద్యోగుల వివరాలపై నివేదికలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఎనర్జీ అసిస్టెంట్లు సర్వే చేయకపోవడంతో మరో మారు వారికి తాకీదులు అందే అవకాశం లేకపోలేదు. విద్యుత్ సబ్ స్టేషన్ సర్వే తప్పనిసరి చేస్తూ ఉన్నతాధికారి ఆదేశాలు సర్వేలు వద్దని ఏఈల ఒత్తిళ్లు ఇద్దరి మధ్య నలుగుతున్న ఎనర్జీ అసిస్టెంట్లు -
అక్రమ మద్యం కట్టడికి చర్యలు : ఎకై ్సజ్ డీసీ నాగమద్దయ్య
అనంతపురం సెంట్రల్: జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా సరిహద్దు చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశించారు. జిల్లాలోని అన్ని స్టేషన్లు, ఎన్ఫోర్సుమెంట్, ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్లతో శుక్రవారం తన చాంబర్లో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు సాగాలని, బెల్టు షాపులను నిర్మూలించాలని ఆదేశించారు. ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన కల్పించాలన్నారు. పాత బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు ఉపయోగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా పొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్రెడ్డి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రేవతి, శ్రీరామ్ పాల్గొన్నారు. -
మళ్లీ చిరుత కలకలం
బుక్కరాయసముద్రం: మండలంలోని సంజీవపురంలో మరోసారి చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళపై 3 రోజుల క్రితం చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ శుక్రవారం చిరుత ప్రత్యక్షం కావడం గమనార్హం. అయితే చిరుతను చూసిన గ్రామానికి చెందిన యువకులు రాళ్లు, కర్రలతో వెంబడించగా.. హెచ్ఎల్సీ వైపు పారిపోయింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు ఏమాత్రమూ సహాయక చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పది’ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం అనంతపురం ఎడ్యుకేషన్: మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు తత్కాల్ కింద చివరి అవకాశం కల్పించారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు, 2025లో కొత్త సిలబస్ పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈ నెల 12 వరకు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. హెచ్ఎంలను సంప్రదిస్తే వారి లాగిన్ ద్వారా వెబ్సైట్లో ఫీజు చెల్లిస్తారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు గడువు పెంచరని స్పష్టం చేశారు. క్రీడలతో మానసికోల్లాసం ● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: నిత్యం పని ఒత్తిడితో తలమునకలయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని ఎస్పీ జగదీష్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ మీట్లో ఏఆర్, స్పెషల్ పార్టీ విభాగాలతో కలిపి ఏడు క్రీడా బృందాలు పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా అందరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం 800 మీటర్ల పరుగు, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్, ట్రైనీ ఐపీఎస్ అశ్వినీ మణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. అ‘ధనం’ వసూలు చేయొద్దుఅనంతపురం అర్బన్: వంటగ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుంచి బిల్లుపై అదనంగా డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఎస్ఓ వెంకటేశ్వర్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులను హెచ్చరించారు. డీఎస్ఓ శుక్రవారం పౌర సరఫరాల శాఖలోని తన చాంబర్లో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్ బిల్లుపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఏవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో వస్తోందన్నారు. దీని ప్రకారం జిల్లాలో 10 గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. వారు ఇచ్చే సంజాయిషీ మేరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో జరిమానా విధిస్తామన్నారు. ఏజెన్సీ నిర్వాహకులు తమ ఏజెన్సీలోని డెలివరీ బాయ్స్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. సీఎస్డీటీలు తమ పరిధిలోని ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డెలివరీని పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్ఓ శోభరాణి, సీఎస్డీటీలు, ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. -
చంద్రశేఖర్ గణిత ప్రదర్శనలు రాష్ట్రానికే ఆదర్శం
● డీఈఓ ప్రసాద్బాబు ఉరవకొండ: ‘టచ్ ఎంజాయ్ అండ్ లర్న్ మ్యాథ్స్’ విధానంతో విద్యార్థుల్లో గణితంపై ఉన్న భయాన్ని పొగొట్టేలా మ్యాథ్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన ఉరవకొండ ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ గణిత ప్రదర్శనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయని డీఈఓ ప్రసాద్బాబు కొనియాడారు. దక్షిణ భారత టీచర్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రదర్శనకు అవార్డు అందుకున్న గణిత ఉపాధ్యాయుడు ఆకుతోట చంద్రశేఖర్ అభినందన కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీఈఓ ప్రసాద్బాబు, విశ్రాంత డీవైఈఓ మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఆవిష్యరణలు అద్భుతమన్నారు. గణితంపై విద్యార్థుల్లో సహజసిద్ధంగా ఉన్న భయాన్ని పొగొట్టి, వారితో నూతన ఆవిష్కరణలు చేయిస్తుండడం గొప్ప విషయమన్నారు. అనంతరం ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవిప్రసాద్, సీఐ మహనంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షాషావలి, ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, ఏడీ మునీర్, పర్యవేక్షకులు ఆదినారాయణ, సీనియర్ ఉపాధ్యాయుడు పాండురంగ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి వచ్చే నెల జరిగే పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలను డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. విద్యాంజలి కార్యక్రమంలో భాగంగా హెచ్ఎంలకు శుక్రవారం స్థానిక ఎమ్మార్సీలో ఏర్పాటు చేసిన ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి పాల్గొన్నారు. -
భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్వే చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా.. అందుకు తగ్గ సహకారం తక్కువగా ఉందనేది ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేలో కీలకమైన రోవర్లు చెడిపోతే మరమ్మతు చేసివ్వలేదు. ఇక సర్వేకు సంబం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపట్టింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సర్వే పక్కాగా చేపట్టేందుకు అవసరమైన వనరులు, సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వానికి వడ్డించిన విస్తరిని ముందుంచింది. అయినా పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించలేని పరిస్థితి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో నెలకొంది. జిల్లాలో 503 రెవెన్యూ గ్రామాల్లో 25,17,658.51 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని గ్రామాలో డ్రోన్ఫైల్, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ పూర్తి చేసింది. 198 గ్రామాల్లో 5,88,615.62 ఎకరాలు సర్వే పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పటిష్ట వ్యవస్థతో 2024 డిసెంబరులో రీ–సర్వేని పునఃప్రారంభించింది. మిగిలిన 305 గ్రామాల్లో తొలుత పైలట్ ప్రాజెక్టుగా 31 గ్రామాల్లో సర్వే చేసింది. ఇక రెండవ విడతలో 24 గ్రామాలు, మూడవ విడతలో 24 గ్రామాల్లో మొత్తం 79 గ్రామాల్లో సర్వే చేసింది. నాల్గవ విడతగా 90 గ్రామాల్లో ప్రస్తుతం సర్వే చేపట్టంది.మిగిలిన 136 గ్రామాల్లో మలి విడతల్లో సర్వే చేయాల్సి ఉంది. రోవర్ల రిపేరీ పట్టదా..? రీ–సర్వే కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లావ్యాప్తంగా 158 రోవర్లను అందుబాటులో ఉంచి సర్వేయర్లకు శిక్షణ ఇచ్చింది. గ్రామాల్లో రీ–సర్వే కోసం 131 రోవర్లను వినియోగించారు. అయితే ఈ రోవర్లలో ప్రస్తుతం 52 చెడిపోగా 79 మాత్రమే పనిచేస్తున్నాయి. సర్వే వేగవంతంగా జరగాలంటే 131 రోవర్లను వినియోగించాల్సి ఉంటుంది. చెడిపోయిన 52 రోవర్లను మరమ్మతు కోసం పంపి రెండు నెలలు అవుతున్నా వాటిని తిరిగి పంపలేదు. దీంతో ఉన్న రోవర్లతో సర్దుబాటు చేసుకుంటూ సర్వే ప్రక్రియను నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. ఇక ల్యాప్టాప్ల సమస్య కూడా వేధిస్తోంది. ప్రస్తుతం 50 ల్యాప్టాప్లు వినియోగిస్తున్నారు. ఒక గ్రామంలో సర్వే వివరాలు నమోదు చేయాలంటే కనీసం మూడు ల్యాప్ట్యాప్లు ఉండాలని సర్వే శాఖ సిబ్బంది చెబుతున్నారు. అవసరమైన మేరకు ల్యాప్టాప్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో ఉన్నవాటితో పని జరిగే క్రమంలో తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పలువురు సర్వేయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేయర్ల సహాయ నిరాకరణ గ్రామ సర్వేయర్లు 460 మంది ఉన్నారు. వీరంతా రీ–సర్వే ప్రక్రియలో పాల్గొంటున్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రస్తుతం వీరంతా సహాయ నిరాకరణ బాట పట్టి జనవరి 27 నుంచి రీ–సర్వే దూరంగా ఉన్నారు. సర్వేకు అవసరమైన ల్యాప్ట్యాప్లు, రోవర్లు, ఇతర స్టేషనరీ సరఫరా చేయాలని, పెడింగ్ టీఏ, డీఏ, ఇతర బకాయిలు చెల్లించాలని, బేసిక్ పే రూ.32 వేలు మంజూరు చేయాలని, జిల్లా వారీగా 70 శాతం గ్రేడ్–1 పదోన్నతి ఇవ్వాలని, సాంకేతిక పనులు నిర్వహిస్తున్నందున టెక్నికల్ పే అలవెన్స కల్పించాలని, రేషనలైజేషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,722 మంది గ్రామ సర్వేయర్లను మిగిలిన శాఖల్లో విలీనం చేయాలని, సచివాలయ ఇతర ఉద్యోగులకు వర్తింపజేస్తున్న ప్రయోజనాలన్నీ గ్రామ సర్వేయర్లకూ వర్తింపజేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ.. సహకారం తక్కువ రోవర్ల రిపేరీపై దృష్టి సారించని సర్కార్ సరిపడు ల్యాప్టాప్లూ ఇవ్వని వైనం -
అర్హులందరికీ అక్రిడిటేషన్లు
అనంతపురం అర్బన్: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇస్తామని అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాలో తొలి విడతగా 551 మందికి అక్రిడిటేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అక్రిడిటేషన్ మెంబర్ కన్వీనర్ డీఐపీఆర్ఓ బాలకొండయ్య, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పత్రికలు, పీరియాడికల్స్ను డీఐపీఆర్ఓ కార్యాలయానికి అందించే వారికి, ఎలాంటి తప్పులు చేయని వారికి నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కమిటీ సభ్యులు షఫీవుల్లా, అయూఫ్, రవికుమార్, ప్రతాప్, అనిల్కుమార్రెడ్డి, మల్లికార్జునరావు, రామకృష్ణ, సురేష్బాబు, చంద్రశేఖర్, రసూల్, రామాంజనేయులు, ప్రసాద్, ఏపీఆర్ఓ ఫకృద్ధీన్, పీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది దామోదర్రెడ్డి, కమల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాసభ రేపు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల 8న (ఆదివారం) ఉదయం 9 గంటలకు అనంతపురంలోని డీఎంహెచ్ఓ కమిటీ హాలులో నిర్వహించనున్నట్లు ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సి.వరప్రసాద్, రాఘవేంద్ర, శివానంద, సిద్ధయ్య, సాకే చంద్ర, రామకృష్ణ, కిరణ్యాదవ్, బి.మహేంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) వారు విడుదల చేసి, మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంస్థాగతంగా సంఘం బలోపేతం లక్ష్యంగా మహాజనసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి నెలా రెండో శనివారం ‘హలో ఔట్సోర్సింగ్ ఏపీ’ పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నేతలు హాజరుకానున్న మహాజనసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బోర్వెల్ రాడ్ పడి వ్యక్తి మృతి బ్రహ్మసముద్రం : బోర్వెల్ రాడ్ తలపై పడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రం గ్రామానికి చెందిన రైతు చాకలి రామన్న పొలంలో గురువారం అర్ధరాత్రి బోర్ వేస్తుండగా పలువురు గ్రామస్తులు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బోర్వెల్ హైడ్రాలిక్ రాడ్ ఉన్నఫళంగా జారి అక్కడే ఉన్న గొల్ల అజ్జప్ప(45) తలపై పడింది. ఘటనలో అజ్జప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు ● రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ గుత్తి: రాయలసీమ డయాసిస్ పరిధిలో ఉన్న క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ డాక్టర్ ఐజాక్ వరప్రసాద్ తెలిపారు. గుత్తి సీఎస్ఐ చర్చిలో పాస్టర్లు, క్రైస్తవ సంఘం సభ్యులతో శుక్రవారం ఆయన సమావేశమై మాట్లాడారు. క్రైస్తవ మిషనరీ ఆస్తులను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యే , ఇతర ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. అనంతరం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను బిషప్తో పాటు క్రైస్తవ సంఘం పెద్దలు, పాస్టర్లు సన్మానించారు. కార్యక్రమంలో డివిజనల్ చైర్మన్ డేవిడ్ నాయక్, ఎంఎస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ రస్సెల్ కిరణ్, బిషప్ సతీమణి భారతి, క్రైస్తవ సంఘం సభ్యులు విజయ్కుమార్, సునీల్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో విద్యార్థులకు తీవ్ర గాయాలు రాయదుర్గం టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడగా, ప్రమాదానికి కారణమైన విద్యార్థి సైతం తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. శుక్రవారం ఉదయం రాయదుర్గంలోని బాలికల జూనియర్ కళాశాల ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. గుమ్మఘట్ట మండలం కలుగోడుకు చెందిన తస్మియ కాలేజీకి వెళుతున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా, కణేకల్లు రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డి.హీరేహాళ్ మండలం తమ్మేపల్లికి చెందిన పవన్ బస్టాండ్ వైపు నుంచి వేగంగా బైక్పై దూసుకొచ్చి ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. -
అందుబాటులో ఉండరు.. తలుపులు తీయరు!
అనంతపురం సెంట్రల్: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా తూనికలు, కొలతల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అనంతపురంలోని సోముల దొడ్డి, గుత్తి రోడ్డులోని పెట్రోల్ బంకుల్లో అక్రమాలు బయటపడ్డాయి. వెలుగు చూస్తున్నవి కొన్నే అయితే బయటకురాని మోసాలు అనేకం ఉన్నాయి. తమకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది మిన్నకుండిపోతున్నారు. మోసాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా తూనికలు, కొలతల శాఖ ఉంది. అయితే, చాలా మందికి జిల్లా కేంద్రంలో ఈ కార్యాలయం ఎక్కడుందో కూడా తెలియడం లేదు. దొరకని చిరునామా.. వినియోగదారులు మోసపోకుండా చర్యలు తీసుకోవడంలో లీగల్ మెట్రాలజీ(తూనికలు, కొలతలు)శాఖ కీలకం. అలాంటి శాఖ కార్యాలయం ఎక్కడుందో చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. పరిశోధన చేస్తే తప్ప కార్యాలయం చిరునామా దొరకని పరిస్థితి! జాతీయ రహదారిలోని డీమార్ట్ వెనుక గౌరవ హోమ్స్లో ఓ నివాసంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కనీసం జాతీయ రహదారి సమీపంలో కార్యాలయ చిరునామా బోర్డు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఇక్కడ ఒక కార్యాలయం ఉందనే విషయం స్థానికులకూ తెలియడం లేదు. కార్యాలయంలో సిబ్బంది కొరత కూడా ఉంది. అసిస్టెంట్ కంట్రోలర్ కార్యాలయంలో కేవలం ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటున్నారు. ఎప్పుడు తెరుస్తారో...?తూనికలు, కొలతల శాఖ కార్యాలయ తలుపులు తీయడమే గగనంలా మారింది. ఉమ్మడి జిల్లా బాస్ అసిస్టెంట్ కంట్రోలర్ (ఏసీ) ఎక్కువ శాతం క్యాంపులు, మీటింగ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఇన్స్పెక్టర్ కార్యాలయ తలుపులు ఎప్పుడు తీస్తారో తెలియడం లేదు. ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటున్నాయి. శుక్రవారం కూడా కార్యాలయానికి వేసిన తాళం తీయలేదు. దీనిపై ఇన్స్పెక్టర్ ఖాజాహుస్సేన్ను ఫోన్లో వివరణ కోరగా.. నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన చెప్పడం గమనార్హం. ఇదీ లీగల్ మెట్రాలజీ శాఖ తీరు పరిశోధిస్తే తప్ప కానరాని చిరునామా అవస్థలు పడి వెళ్లినా ప్రయోజనం శూన్యం ఎప్పుడూ కార్యాలయ తలుపులు మూతే -
అనంత మున్సిపల్ కమిషనర్గా జశ్వంతరావు
● విజయనగరం మున్సిపల్ కమిషనర్గా బాలస్వామి బదిలీ అనంతపురం క్రైం:అనంతపురం మున్సిపల్ కమిషనర్గా జశ్వంతరావు నియమితులయ్యారు. ఇప్పటివరకుకమిషనర్గా సేవలందించిన బి. బాలస్వామి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. కమిషనర్ బాలస్వామి సమయస్ఫూర్తి కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నేతలు అనేక ఒత్తిళ్లకు గురిచేసినా ఎక్కడా తలొగ్గకుండా విధులు నిర్వర్తించారు. ●గుంతకల్లు కమిషనర్ నయీమ్ అహ్మద్ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. అలాగే.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎస్.నూర్అలీఖాన్ను కమలాపురం నగర పంచాయతీ కమిషనర్గా పంపారు. -
బాలుడి కిడ్నాప్ యత్నం... మహిళకు దేహశుద్ధి
గుంతకల్లు రూరల్: ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు... గుంతకల్లులోని జగ్జీవన్రామ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పైపుల ఫ్యాక్టరీలో శ్రీనివాసులు కూలి పనులకు వెళ్లేవాడు. సుజాత సైతం వ్యవసాయ కూలి పనులతో భర్తకు చేదుడుగా నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం దంపతులిద్దరూ పనిలోకి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న శ్రీనివాసులు కుమారుడు విఘ్నేష్ను అటుగా వచ్చిన ఓ మహిళ ఎత్తుకొని వెళ్లిపోయింది. ఆమె మొహాన్ని చూసి బిత్తర పోయిన బాలుడు బిగ్గరగా ఏడవడంతో కాలనీలోని ఓ మహిళ అడ్డుకుంది. సంకలో ఉన్న బాలుడిని గుర్తించి సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు పరుగులు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కాలనీ వాసులందరూ అక్కడ పోగయ్యారు. వివరాలు ఆరా తీసేందుకు ప్రయత్నించా ఆగంతకురాలు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేశారు. దీంతో తనతో పాటు మరో ముగ్గురు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు ఉన్నారని హిందీలో తెలిపింది. తాము ఎందుకోసం వచ్చారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆగంతకురాలని పీఎస్కు తరలించారు. -
నేడు నవోదయ ప్రవేశాలకు పరీక్ష
లేపాక్షి: లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పట్టణంలో అజిజీయ, ఎంజీఎం, ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు 1,205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయం, ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డులతో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. -
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
గుత్తి: మాయమాటలతో ఇంటర్ విద్యార్థిని లోబర్చుకుని గర్భిణిని చేసిన కేసులో ఆటో డ్రైవర్ ఓబుళపతిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామారావు వెల్లడించారు. గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఆటోడ్రైవర్ ఓబుళపతి రోజూ విద్యార్థులను గుత్తికి తెచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన ఇంటర్ అమ్మాయికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఆరు నెలల గర్భిణి. ఈ విషయం రెండు రోజుల క్రితం బయట పడింది.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ఓబుళపతిపై పోక్సో యాక్ట్తో పాటు రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్సార్టీయూ మద్దతు అనంతపురం: ఆల్ ట్రేడింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ మద్దతు తెలిపింది. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను అనంతపురంలోని ఎన్జీఓ హోంలో శుక్రవారం ఆవిష్కరించి, మాట్లాడారు. 2025, నవంబర్ 21నుంచి అమల్లోకి వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఇవి అమల్లోకి వస్తే కార్మికుల్లో కొనుగోలు శక్తి 90 శాతం నశిస్తుందనపి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దన్నుగా నిలిచేలా లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, నగర కార్యదర్శి కాకర్ల శ్రీనివాసరెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, నగర కార్యదర్శి ముత్తుజ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కృష్ణుడు, రాజు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఏఐసీసీటీయూ వేమన తదితరులు పాల్గొన్నారు. బాధ్యతగా పని చేయలేరా? ● డ్వామా పీడీ సలీం బాషా కూడేరు: నిబంధనల మేరకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి, రికార్డులు, నేమ్బోర్డుల నిర్వాహణ సక్రమంగా చేపట్టలేరా? అంటూ మండల ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ సలీం బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడేరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ కుళ్లాయి స్వామి అధ్యక్షతన 18వ సోషియల్ ఆడిట్ ఓపెన్ ఫోరం జరిగింది. 2024, ఏప్రిల్ నుంచి 2025, మార్చి 31 వరకు జరిగిన రూ.7.26 కోట్ల ఉపాధి పనులపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీ వివరాలను సోషియల్ ఆడిట్ రాష్ట్ర రీసోర్స్ పర్సన్ నీలకంఠ వెల్లడించారు. కొలతల్లో తేడా, చనిపోయిన వారి పేరిట బిల్లులు, మొక్కలు నాటకున్నా నాటినట్లు రికార్డుల్లో నమోదు చేసి సుమారు రూ.45 లక్షల మేర దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగం మోపారు. దీంతో బాధ్యులైన సిబ్బందిపై డ్వామా పీడీ మండిపడ్డారు. రికార్డుల నిర్వాహణ సక్రమంగా చేపట్టడం చేతకాదా? అని ప్రశ్నించారు. అభియోగాలపై విచారణ జరిపిన పీడీ, ఇతర అధికారులు రూ.50 వేలు రికవరీతో పాటు రూ .65 వేలు జరిమానా, రూ.17 లక్షల పనులపై ఏపీడీ విచారణకు, రూ.3.20 లక్షలు రీప్లాంటేషన్కు ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ సుధాకర్ రెడ్డి, డీవీఓ శ్రీనివాసులు, ఏపీడీ చెన్నకేశవులు, ఏపీఓలు తులసీప్రసాద్, పోలేరయ్య, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
సేవాలాల్ జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
● జేసీ విష్ణు చరణ్ అనంతపురం అర్బన్: ‘‘సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి’’ అని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 15 వరకు గుత్తి మండలం సేవాఘడ్లో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులు నడపాలని చెప్పారు. సేవాఘడ్ వద్ద స్టాపింగ్ సదుపాయం ఉండాలన్నారు. మౌలిక సదుపాయాలు, కనీస వసతులు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. అందరూ సమష్టిగా పనిచేసి వేడుకలను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గుంతకల్లు ఆర్డీఓ ఏబీవీఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, ట్రస్ట్ అధ్యక్షుడు కేశవనాయక్, కార్యదర్శి అశ్వర్థనాయక్, ప్రతినిధులు బాలనాయక్, డీఎల్డీఓ విజయలక్ష్మి, గుత్తి, గుంతకల్లు తహసీల్దారు పుణ్యవతి, రమాదేవి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నెలాఖరులోపు లక్ష్యాలు పూర్తి చేయండి
అనంతపురం అగ్రికల్చర్: ఈ–పంట, రైతులకు విశిష్ట నంబరు కేటాయింపు లక్ష్యాలు నెలాఖరులోపు పూర్తి కావాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి (డీఏఓ) ముదిగల్లు రవి ఆదేశించారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీఏలు, టెక్నికల్ ఏఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. రబీ ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే)లో కొన్ని మండలాల్లో వెనుకబడినందున వేగవంతం చేయాలన్నారు. నెలాఖరులోపు తుది ముసాయిదా ప్రభుత్వానికి పంపాల్సి ఉందన్నారు. రైతులకు 11 అంకెలు కలిగిన యూనిక్ నెంబరు (విశిష్ట సంఖ్య) కేటాయింపు వారం రోజుల్లో పూర్తి కావాలన్నారు. రైతుల పొలాల్లో 23,711 మట్టి నమూనాలు సేకరించి విశ్లేషణకు ప్రయోగశాలకు పంపే కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలన్నారు. అలాగే అనంతపురం ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ కూడా గురువారం తన కార్యాలయంలో డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాల ఏఓలతో ఇవే అంశాలపై సమావేశం నిర్వహించారు.బాలికను గర్భిణిని చేసిన ఆటోడ్రైవర్పై కేసు నమోదుగుత్తి రూరల్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ బాలికను గర్భిణిని చేసిన ఆటోడ్రైవర్పై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలమేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఓబుళపతి అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో లైంగికంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. బాలిక తెలిపిన వివరాలమేరకు ఆటోడ్రైవర్ ఓబుళపతిపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండికుందుర్పి: జిల్లాలోని అన్ని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు, 6 నుంచి 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ అస్రత్వలి సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుందని, నేటి నుంచి మార్చి 4 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12న, 6 నుంచి 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అదే నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం https:// mjpapbcwrcis.apcfss.inను సంప్రదించాలని సూచించారు. -
మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలి
అనంతపురం టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31లోగా 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా సూచించారు. గురువారం ఏపీడీలు, ఏపీఓలతో ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో నూతన ఉపాధి చట్టం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీ జీ రామ్ జీ’ అమల్లోకి వస్తుందన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న మెటిరీయల్ పనులను 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం రూ. 90 కోట్లతో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందన్నారు. పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, పనులను పూర్తి చేయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. -
నేటి నుంచి పోలీస్ స్పోర్ట్స్ మీట్
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ను శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్లో క్రీడాకారులకు అవసరమైన దస్తులు, క్రీడా సామగ్రిని అందించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను, క్రమ శిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు అనంతపురం: గంజాయి సరఫరా, విక్రయ ముఠాలోని ఆరుగురు యువకులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా మొదటి సెషన్స్ కోర్టు జడ్జి సత్యవాణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2021 జూన్ 17న అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దగ్గర ఎస్ఐ నబిరసూల్ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక కారులో 29 కేజీల గంజాయి దొరింది. వీటిని తరలిస్తున్న అనంతపురానికి చెందిన కుంచపు వడ్డే పవన్కుమార్, గాజుల అఖిల్, ధనరాజ్, కళ్యాణదుర్గానికి చెందిన గాజుల నాగరాజు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంకు చెందిన పూల సునీల్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పల్లె వెంకట రవితేజలను అరెస్ట్ చేశారు. వీరంతా 21 నుంచి 29 ఏళ్లలోపు వయసు కలిగిన యువకులే. అప్పటి సీఐ మురళీధర్రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అనంతపురం మొదటి అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు సాక్షులను జడ్జి సత్యవాణి విచారించారు. నేరం రుజువు కావడంతో అనంతపురం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్చు చెప్పారు. స్పెషల్ పీపీ లేపాక్షి నాయుడు ప్రాసిక్యూషన్ తరఫున వాదించారు. సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచి, ముద్దాయిలకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ జగదీష్ అభినందించారు. స్వీప్ నిధుల దుర్వినియోగం! ● శింగనమలకు రూ.6కోట్లతో ప్రాజెక్ట్ ● నేడు అధికారికంగా ప్రారంభం ● ప్రారంభానికి ముందే రూ.15 లక్షల వ్యయం శింగనమల: గ్రామీణ మహిళల స్వయం జీవనోపాధి కల్పన కోసం శింగనమల నియోజకవర్గానికి మంజూరైన స్టార్టప్ గ్రామీణ వ్యాపారోత్సాహ కార్యక్రమం (స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్–స్వీప్)లో ప్రారంభోత్సవానికి ముందే నిధులు దుర్వినియోగమయ్యాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల్లోని 2,400 మంది మహిళలకు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మూడేళ్ల కిందట రూ.6 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చించనున్నాయి. మహిళలకు 50 పైసల వడ్డీకే రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే వెలుగు సిబ్బంది మూడేళ్లుగా దీని గురించి పట్టించుకోలేదు. ఎట్టకేలకు శుక్రవారం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే ఈ డబ్బు ఎందుకోసం వెచ్చించారో వెల్లడించకపోవడం గమనార్హం. గుమ్మఘట్ట ఏపీఎంకు బాధ్యతలు రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగుట్టలో పని చేస్తున్న రెగ్యులర్ ఏపీఎంను శింగనమల స్వీప్ ప్రాజెక్టుకు ఇన్చార్జ్గా నియమించారు. నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల ఏపీఎంలను పర్యవేక్షణ చేయాలి. జిల్లాలో మారుమూలన పనిచేస్తున్న ఏపీఎంకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటోనని మహిళలు చర్చించుకుంటున్నారు. -
సేవాలాల్ ఉత్సవాలకు సహకరిస్తాం
అనంతపురం అర్బన్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కలెక్టర్ను గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్ఎంటీ) సభ్యులు కలిసి 287వ జయంతి మహోత్సవాలకు అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం జయంతి మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున మహోత్సవాలకు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. భక్తులు, బంజారా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ట్రస్ట్ సభ్యులు ఆయన చాంబర్లో కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ఎంటీ ప్రధాన కార్యదర్శి అశ్వర్థనాయక్, కోశాధికారి బాలానాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం సెంట్రల్: గుత్తికి సమీపంలో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. గురువారం ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా ఉత్సవాలకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఉత్సవాలకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు పాలే జయరాంనాయక్, వెంకటరమణనాయక్, గర్మా మల్లికార్జుననాయక్, శివకుమార్నాయక్, శ్రీనివాస్నాయక్, ధనుంజయనాయక్, చిన్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీ కొని వ్యక్తి మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని మిడుతూరు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో షేక్షావలి (37) మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు.. గుత్తి పట్టణానికి చెందిన షెక్షావలి లారీ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మిడుతూరు వద్ద నాగరాజు పంక్షర్ షాపు వద్ద ఆగి రోడ్డుకు అవతలి వైపు ఉన్న ముత్యాలరెడ్డి హోటల్ వద్ద టీ తాగడానికి వెళ్లాడు. తిరిగి రోడ్డు దాటుతుండగా గుత్తి వైపు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన షెక్షావలి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు షెక్షావలి -
కాలవా... కాస్త చూడవా!
కణేకల్లు వేదవతి హ గరిపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆరు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రెండేళ్లలో పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గొప్పలు చెప్పుకున్నా.. క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. పనులు ఇలా చేస్తే బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనని ప్రజలు మండిపడుతున్నారు.కణేకల్లు: మండల పరిధిలోని వేదవతి హగరిపై బ్రిడ్జి నిర్మాణం రాయదుర్గం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక. రాయదుర్గం నుంచి ఉరవకొండ, గుంతకల్లు రాకపోకలకు ఉన్న ఏకై క మార్గం ఇది. కణేకల్లు మీదుగా ఉరకొండ, గుంతకల్లుకు వెళ్లాల్సి ఉంది. గతంలో బస్సులు, కార్లు, లారీలు ఇతరాత్ర వాహనాలన్నీ వేదవతి హగిరిపై ఉన్న హెచ్చెల్సీ అక్విడెక్ట్ మీదుగా రాకపోకలు కొనసాగించేవీ. ఈ అక్విడెక్ట్ సుమారు 60 ఏళ్ల క్రితం నిర్మించింది కావడంతో ఇది కాస్తా ప్రమాదకర పరిస్థితికి చేరుకొంది. దీంతో హెచ్చెల్సీ అధికారులు అక్విడెక్ట్ మీదుగా వాహనాల రాకపోకలను పూర్తి నిషేధించారు. వేదవతి హగరిపై బ్రిడ్జి అవసరాన్ని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా ముగించింది. అగ్రిమెంట్తో పాటు పలు సాంకేతిక సమస్యల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. 16 నెలల క్రితం పనులకు భూమి పూజ అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం పెరిగిన రా మెటిరియల్ ధరలకు అనుగుణంగా బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని రూ.48.42 పెంచింది. 2004 సెప్టెంబర్ 26న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయించే బాధ్యత తనదేనన్నారు. ఇప్పటికే పదహారు నెలలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మరో ఎనిమిది నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయడం అసాధ్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనుల నిర్వహణకు కొన్ని చిక్కుముడులుండటంతో కాంట్రాక్టర్ రోడ్డు ఎర్త్ వర్క్ చేసి ఎక్కడికక్కడే పనులు ఆపేశాడు. అలైన్మెంట్ మార్పుతోనే.. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగడానికి ఆర్అండ్బీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గతంలో హెచ్చెల్సీ అక్విడెక్ట్కు కొంత దూరంలో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు అనుకొన్నారు. అయితే ఆ ప్రాంతంలో శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పైప్లైన్ ఉన్న విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో బ్రిడ్జి అలైన్మెంటు మార్చాల్సి ఉంది. బ్రిడ్జి అలైన్మెంటు మార్పుతో డిజైన్ మార్పు కూడా అనివార్యమైంది. ప్రస్తుతం ఆర్అండ్బీ అధికారులు బ్రిడ్జి డిజైనింగ్ రూపకల్పనలో ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఈ బ్రిడ్జి నిర్మించే ప్రదేశం ఫారెస్ట్ శాఖ పరిధిలో కొంత భాగం వస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ స్థలాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేయాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడానికి ఇది మరో కారణమని తెలుస్తోంది. వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ రాయదుర్గ నుంచి ఉరవకొండకు బస్సులు, లారీలు, కార్లు, ఇతరాత్ర వాహనాలన్నీ కణేకల్లు–మాల్యం మీదుగా వేదవతి నదిపై రాకపోకలు సాగిస్తున్నాయి. వర్షం వస్తే నదిలో నీటి ప్రవాహం పెరిగి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈక్రమంలో హై లెవల్ బ్రిడ్జి పనులు 2004 సెప్టెంబర్లో ప్రారంభం కావడంతో ప్రజలంతా ఈ బ్రిడ్జిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బ్రిడ్జి పూర్తయితే ఎలాంటి వరదలొచ్చినా సమస్య ఉండదని భావించారు. అయితే బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిరాశ చెందుతున్నారు. నత్తనడకన కణేకల్లు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కాలవ హామీ 16 నెలలుగా ఎర్త్ వర్క్ మాత్రమే పూర్తి అలైన్మెంటు మార్పుతో పనులకు బ్రేక్ -
మరోసారి నేలచూపు
● టమాట ధరలు భారీ పతనం ● నష్టాలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అనంతపురం అగ్రికల్చర్: రైతు ఇంట జాక్పాట్ పంటగా మారిన టమాట మళ్లీ నేలచూపు చూస్తోంది. జనవరి నెలంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇప్పటికే భారీ నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. గురువారం కక్కలపల్లి మార్కెట్లో టమాట కిలో రూ.5 నుంచి రూ.11 మధ్య క్రయ విక్రయాలు జరిగాయి. 15 కిలోల బాక్సు గరిష్టం రూ.165 పలకగా కనిష్టం రూ.75 ప్రకారం అమ్ముడుబోయాయి. ఇందులో గరిష్టం అనేది కొన్ని లాట్లు మాత్రమే విక్రయాలు జరగ్గా.. 70 నంచి 80 శాతం లాట్లు బాక్సు రూ.75 ప్రకారం పలకడం గమనార్హం. దీంతో పెట్టుబడి కాదు కదా... కాయ కోత, రవాణా, కమీషన్ల ఖర్చులు కూడా దక్కక రైతులు దిక్కులు చూస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ ఖరీఫ్, రబీలో జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాటా సాగులోకి వచ్చింది. చాలామంది రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టమాటా సాగుపై దృష్టి సారించడంతో విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే సీజన్ ఆరంభంలో అంటే గత జూన్, జూలై, ఆగస్టులో మార్కెట్ పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో కొంత లాభపడ్డారు. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో మార్కెట్ పరిస్థితి తారుమారు కావడంతో మళ్లీ నష్టాలు చవిచూశారు. తిరిగి నవంబర్, డిసెంబర్లో పరిస్థితి కొంత మెరుగైంది. మళ్లీ జనవరి నెలంతా నష్టపోయారు. ఇపుడు ఫిబ్రవరిలో కూడా నష్టపోయే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మచ్చ ఉన్నవి, నాసిరకం, చిన్నసైజు టమాటాలను కొనేవారు లేరని చెబుతున్నారు. కిలో రూ.20 పలికితే కానీ పెట్టుబడులు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. -
ఏసీబీ వలలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి
● బిల్లుల మంజూరుకు వార్డెన్ నుంచిలంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ● కేసు నమోదు చే సిన ఏసీబీ డీఎస్పీకదిరి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి(ఏబీసీడబ్ల్యూఓ)గా పనిచేస్తున్న గుర్రం బాలాజీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. బకాయిల మంజూరు కోసం వార్డెన్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల మేరకు..గాండ్లపెంట మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్ వార్డెన్గా లక్ష్మినారాయణ పనిచేస్తున్నారు. హాస్టల్ నిర్వహణకు సంబంధించి ఈయనకు బిల్లులు రావాల్సి ఉంది. వీటిని మంజూరు చేయాలంటే రూ.18 వేలు లంచం ఇవ్వాలని ఏబీసీడబ్ల్యూఓ గుర్రం బాలాజీ డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వార్డెన్ లక్ష్మినారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా వార్డెన్ గురువారం కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో ఉన్న ఏబీసీడబ్ల్యూఓ నివాసానికి వెళ్లి.. ఆయనకు రూ.15 వేల నగదు అందజేశారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి బాలాజీని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈయనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 9440446182 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో నిరక్షరాస్యతను నిర్మూలించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ‘అక్షరాంధ్ర’ లక్ష్యమని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరం మున్నా నగర్లోని వయోజన విద్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో మొత్తం 1,25,578 మందిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా ‘అక్షరాంధ్ర’ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఏ, డ్వామా, మెప్మా శాఖల ద్వారా వాలంటరీ టీచర్లు, అభ్యాసకులను గుర్తించి, వారికి బోధనాభ్యసన ప్రక్రియను అందిస్తున్నట్లు వివరించారు. ‘అక్షరాంధ్ర’లో భాగంగా మెప్మా పరిధిలోని స్వయం సహాయక బృందాల సభ్యుల్లో 37,500 మందిని, డీఆర్డీఏ ద్వారా 62,500 మందిని, ఉపాధి హామీ పథకం పరిధిలో 25,000 మంది వేజ్సీకర్స్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న లబ్ధిదారులకు మొత్తం 100 గంటల పాటు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం (కూడికలు, తీసివేతలు)పై బోధన అభ్యసన ప్రక్రియ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ప్రభుత్వం గుర్తించిన వాలంటరీ టీచర్ల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం అవసరమైన పాఠ్య పుస్తకాలు, వర్క్ షీట్లు అందజేయడంతో పాటు, వీడియో పాఠ్యాంశాల ద్వారా కూడా బోధన కొనసాగుతున్నట్లు తెలిపారు. బోధనాభ్యసన ప్రక్రియ అనంతరం లబ్ధిదారుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ నెల చివరి వారంలో ప్రీ–ఫైనల్ పరీక్షలు, మార్చి 29న ఫైనల్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ వయసులో చదువు అవసరమా అనే సందేహాలు పక్కనపెట్టి, అక్షరాస్యత వల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు సంపంగి వెంకటేశ్వర్లు, సిబ్బంది సూర్యనారాయణ, శ్రీధర్, రమణ, లక్ష్మీనారాయణ, లక్ష్మీప్రసన్న, ఆర్పీలు రాణి, సునంద, మాధవి, వాలంటరీ టీచర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అనంతపురం అర్బన్: ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ను ఏపీ ఎన్జీజీఓ సంఘం నాయకులు కోరారు. కలెక్టర్ను గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్, కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలుకా నాయకులు కలిశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం సంఘం క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శ్రీధర్బాబు, దస్తగిరి, జమీల బేగం, లక్ష్మినారాయణ, అనంతయ్య, లింగమేష్, కోశాధికారి ప్రవీణ్, సంయుక్త కార్యదర్శులు రిషికేష్, లక్ష్మినరసయ్య, నగర అధ్యక్షుడు మనోహర్రెడ్డి, నాయకులు అక్కులప్ప, శ్రీనివాసులు, మధుబాబు, సుదర్శన్శర్మ, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
లంచం ఎందుకివ్వాలంటూ.. ఆవులతో నిరసన
కళ్యాణదుర్గం రూరల్: పొలాలకు దారి చూపండంటే లంచం అడుగుతున్నారంటూ ఇద్దరు రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఆవరణలోకి ఆవులను తోలుకొచ్చి కట్టేశారు. తమకు న్యాయం చేయండని విన్నవించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం మహంతపురం గ్రామానికి చెందిన రైతులు లింగన్న, రామాంజినేయులు తమ వ్యవసాయ పొలాల్లో పాడి పెంపకం కోసం షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. పెద్దవంకలోని రస్తా గుండా 50 ఏళ్లుగా వీరి పొలాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కుందుర్పి రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్ఓ గోపాల్ సహకారంతో అతని బంధువులు, టీడీపీ సానుభూతిపరులు పెద్ద వంకలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడటంతో రస్తా చూపించాలంటూ సదరు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు ‘మీకు న్యాయం చేస్తే.. మాకు ఏమిస్తారు’ అని అనడంతో రైతులు కంగుతిన్నారు. ‘మా భూముల్లోకి వెళ్లడానికి మేమెందుకు ఇవ్వాలి’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత పొలాల్లోకి వెళ్లే దారిలో జేసీబీతో మట్టిని అడ్డువేసేశారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారులు, టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. రైతులు మరోమారు కార్యాలయానికి వెళ్లి అడిగితే సదరు అధికారి.. ‘మీరు ఎక్కడికి వెళ్లినా పని జరగదు. మేము అడిగినంత కాకుండా... ఎంత ఇస్తారో చెప్పండి’ అంటూ బేరమాడారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే లంచం అడిగేసరికి ఏమిచేయాలో పాలుపోని రైతులు గురువారం కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయానికి ఆవులను తోలుకొచ్చారు. ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఆవులను అక్కడే ఒకచోట కట్టేశారు. పాడి ఆవులను పొలాల్లోకి తీసుకెళ్లడానికి దారి చూపండి లేదా వీటిని ఇక్కడే అయినా ఉంచుకోండి అంటూ నిరసన తెలిపారు. చివరకు రైతుల నుంచి అర్జీ స్వీకరించిన సిబ్బంది.. సమస్యను పరిష్కరిస్తామని తెలపడంతో రైతులు తమ ఆవులను తోలుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీస్రూల్స్ అమలుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంఈఓలు, సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులు, డీఈఓ, సమగ్రశిక్ష కార్యాలయాలు, డైట్ ఉద్యోగుల వర్క్షాపు గురువారం నిర్వహించారు. స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో జరిగిన వర్క్షాపును జేడీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోక్సో కేసుల్లో త్రీమెన్ కమిటీని నియమించి మూడు నెలల్లో విచారణ నివేదిక తీసుకోవాలన్నారు. క్రమశిక్షణ చర్యల కేసులను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొన్ని కేసుల్లో సస్పెన్షన్లు చేస్తున్నా...తర్వాత వాటిని రీఓక్ చేయడం లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏడాదికి మించి సస్పెన్షన్లో ఉండకూడదన్నారు. కొందరు దూరప్రాంతాల్లో పని చేస్తున్న వారు కావాలనే చిన్నచిన్న తప్పులకు సస్పెన్షన్లు చేయించుకుంటున్నారన్నారు. 3–4 ఏళ్లు సస్పెన్షన్లోనే ఉంటూ అరజీతం పొందుతున్నారన్నారు. సమావేశంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా డీఈఓలు ఎం.ప్రసాద్బాబు, కిష్టప్ప, ఏడీ మునీర్ఖాన్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకమని పంచాయతీరాజ్శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జేఎన్టీయూ ఆడిటోరియంలో జిల్లావ్యాప్తంగా డెప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్మెంట్ అధికారులతో ‘పీఆర్ కార్యకలాపాల’పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుధాకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10లోగా అన్ని పంచాయతీల్లోనూ 100 శాతం పన్నుల వసూలు చేయాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే డిప్యూటీ ఎంపీడీఓలను వెంట తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఇన్చార్జ్ డీపీఓ విజయకుమార్రెడ్డి, అనంతపురం డీడీఓ నాగశివలీల, గుంతకల్ డీడీఓ విజయలక్ష్మీ, కళ్యాణదుర్గం డీడీఓ నాగేశ్వరావు, డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ సౌజన్య పాల్గొన్నారు. అండర్ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్ ● ఫీల్డింగ్ కోచ్గా షోయబ్ అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 రాష్ట్ర క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఎస్ మహ్మద్ షోయబ్, జట్టులో సభ్యుడిగా కే రోహిత్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు చైన్నెలో జరగనున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ పోటీల్లో రోహిత్ ఆంధ్ర జట్టు సభ్యుడిగా బరిలో దిగనున్నాడు. లెఫ్టార్మ్ చైనమన్ (హిందూపురం) బౌలర్గా స్టేట్ ప్రాబబుల్స్ మ్యాచ్లలో 13 వికెట్లు తీసుకున్నాడు. హిందూపురం ఎంజీఎం స్కూల్లో రోహిత్ విద్యనభ్యసిస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ షోయబ్ ఏసీఏ లెవెల్ 0 క్రికెట్ కోచ్. గుంతకల్లు రైల్వే సబ్ సెంటర్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ బుక్కరాయసముద్రం: మండల పరిఽధిలోని సిద్దరాపురం జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని నందిని జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిందని హెచ్ఎం నీరజ, పీడీ నాగరాజు తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారన్నారు. అందులో నందిని అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఇటీవల డిల్లీలో జరిగిన జాతీయస్థాయి రగ్బీ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచినట్లు తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది. నందిని -
నేటి నుంచి గ్రామోత్సవ్
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్లో ఉన్న అంబేడ్కర్ భవన్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘అనంత గ్రామీణ మహోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు, నేస్తం ఎన్జీఓ సంయుక్తంగా 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో వివిధ జిల్లాల నుంచి నేతన్నలు, ఎస్హెచ్జీ, రైతులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు, ఆభరణాలు, పనిముట్ల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. నాబార్డు ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో పాటు రూడ్సెట్, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులతో పాటు ఉమ్మడి జిల్లా రైతులు, మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగు బార్లు కేటాయింపు అనంతపురం సెంట్రల్: జిల్లాలో రీ టెండర్ పిలిచిన వాటిలో నాలుగు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్లు జారీ చేశారు. గురువారం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ అధ్యక్షతన ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు. అనంతపురంలో మూడు బార్లకు దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా కేటాయించారు. గుంతకల్లులో రెండు బార్లకు దరఖాస్తులు కోరగా ఒక బార్కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, మరో బార్కు ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో అర్హత లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. అలాగే రాయదుర్గం, తాడిపత్రిల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు బార్లకు దరఖాస్తులు రాలేదని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్రెడ్డి తెలిపారు. గుంతకల్లు మున్సిపాలిటీలో పరిధిలో వాయిదా పడిన ఒక బార్కు ఒక దరఖాస్తు మాత్రమే వచ్చిందని, అర్హత లేకపోవడంతో దరఖాస్తు గడువును ఈనెల 7వరకూ పొడిగించామన్నారు. ఉరవకొండ హౌసింగ్ డీఈగా వాసుదేవరెడ్డి అనంతపురం టౌన్: గృహ నిర్మాణ సంస్థ ఉరవకొండ డివిజనల్ ఇంజనీర్గా వాసుదేవరెడ్డిని నియమిస్తూ ఆశాఖ ఎండీ అరుణ్బాబు ఉత్తర్వులను జారీ చేశారు. పులివెందుల డీఈగా పని చేస్తున్న వాసుదేవరెడ్డిని అనంతపురం జిల్లా ఉరవకొండ డీఈగా బదిలీ చేశారు. ఇక్కడ ఇన్చార్జ్ డీఈగా పని చేస్తున్న హనుమప్పను డీఈగా పదోన్నతి కల్పిస్తూ కుప్పంకు బదిలీ చేశారు. -
‘చలో ఢిల్లీ’లో పాల్గొన్న ఎస్టీయూ నాయకులు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి, సీపీఎస్ను రద్దు చేయాలనే డిమాండ్లతో అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐజేఏసీటీఓ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు తెలిపారు. వారు మాట్లాడుతూ 2010 కంటే ముందు నియామకం పొందిన 30 లక్షల మంది ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. లేదా పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా నుంచి ఎస్టీయూ నాయకులు కృష్ణమూర్తి, సుధాకర్, చెన్నారాయప్ప, రవన్న, తిప్పేస్వామి, రాధాకృష్ణంరాజు, సుబ్బరామప్ప, శివలింగప్ప. మంజునాథ్, రామాంజనేయులు, చిరంజీవి పాల్గొన్నారు. -
చిన్నారి అనుమానాస్పద మృతి
● టీకా వికటించడం వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ యల్లనూరు: వ్యాధి నిరోధక టీకా వేసిన కొన్ని గంటల తర్వాత ఓ చిన్నారి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. టీకా వికటించడం వల్లే ప్రాణం పోయిందంటూ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నిట్టూరుకు చెందిన అనిత, ఓబులేసు దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో మూడో సంతానమైన మూడు నెలల కుమార్తెకు బుధవారం ఉదయం 11 గంటలకు ఏఎన్ఎం ఎస్తేర్ రాణి ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకా వేయించారు. అయితే సాయంత్రం చిన్నారికి జ్వరం వచ్చింది. ఈ సమయంలో తల్లి పాలు పట్టింది. అయితే చిన్నారికి నోరు, ముక్కులోంచి పాలురావడం, అపస్మారకస్థితికి చేరుకోవడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయారు. టీకా వేయడం వల్లే ఇలా జరిగిందని భావించిన వారు హుటాహుటిన తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న యల్లనూరు వైద్యులు లోకేష్కుమార్ తాడిపత్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. నిట్టూరులో ఈ చిన్నారితో పాటు మరో ముగ్గురికి టీకాలు వేసినట్లు గుర్తించారు. టీకా గడువు కూడా ముగియలేదు. ఒకవేళ టీకా వికటించి ఉంటే మిగిలిన చిన్నారుల ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. చనిపోయిన చిన్నారికి ఇంకేదైనా అనారోగ్యం ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని స్పష్టం చేశారు. అయినప్పటికీ చిన్నారి మృతిపై గ్రామంలో విచారణ కొనసాగుతోందని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. టీకా వికటించడం వల్లే చిన్నారి చనిపోయిందనే అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని డాక్టర్ లోకేష్కుమార్ చిన్నారి తల్లిదండ్రులతో చర్చించారు. -
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీ ప్రజల హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణ తరలించుకుపోతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సీమకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారు? ఈ ప్రాంత రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీమ ప్రాజెక్టులపై ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
27 నుంచి ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
కదిరి టౌన్: కోరి కొలిచిన భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాలు మార్చి 13వ తేదీ మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి బ్రహ్మోత్సవాల వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రాత్రి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 28వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. మార్చి 1వ తేదీ హంస వాహనం, 2న సింహ వాహన సేవలు, 3న హనుమంతవాహనం, 4న బ్రహ్మగరుడసేవ, 5న శేష వాహనం, 6వ తేదీ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ. 7న మోహినీఉత్సవం. 8న ప్రజాగరుడసేవ, 9న గజవాహనం, 10వ తేదీన కీలకమైన బ్రహ్మరథోత్సవం, 11న అలుకోత్సవం, అశ్వవాహన సేవ, 12వ తేదీన తీర్థవాది. 13వ తేదీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. భక్తులు అందరూ పాల్గొని శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. విశిష్ట సంఖ్యతోనే ప్రభుత్వ ప్రయోజనాలు అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించాలంటే రైతులకు 11 అంకెల విశిష్ట సంఖ్య (యూనిక్ నంబర్) తప్పనిసరి చేశారని వ్యవసాయశాఖ జిల్లా అఽధికారి ముదిగల్లు రవి తెలిపారు. ఈ నంబరు కలిగిన రైతులకు మున్ముందు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, విత్తనాలు, ఎరువులు, పీఎం కిసాన్, సుఖీభవ, యాంత్రీకరణ పరికరాలు, ఈ–క్రాప్, ఎంఎస్పీ అమ్మకాలు, ఇతరత్ర పథకాలు, కార్యక్రమాలు వర్తిస్తాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆధార్ కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ) ఇవ్వడానికి వ్యవసాయశాఖ పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) కింద అగ్రిస్టాక్ యాప్ కింద రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారన్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సి ఉంటుంది. ఆర్ఎస్కే అసిస్టెంట్లు, వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి నేరుగానూ లేదా ఓటీపీ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,42,666 మంది రైతులకు యూనిక్ నెంబర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 2,73,403 మందికి విజయవంతంగా పూర్తయిందన్నారు. మిగలిన 69,263 మంది రైతులకు విశిష్ట సంఖ్య ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, గుత్తి, రాయదుర్గం, యాడికి, తాడిపత్రి, గుంతకల్లు తదితర 15 మండలాల్లో 70 నుంచి 95 శాతం వరకు నమోదు కాగా.. మిగతా మండలాల్లో వెనుకబడ్డాయని తెలిపారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్మ రాప్తాడురూరల్: పోలీసు ఏఆర్ విభాగంలో హెడ్కానిస్టేబుల్ (హెచ్సీ)గా పని చేస్తున్న సాకే సుబ్బరాజు (51) ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం ఏఆర్లో పని చేస్తున్న సుబ్బరాజు కుటుంబం నవోదయకాలనీలో నివాసం ఉంటోంది. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం సాయంత్రం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేర్వేరయ్యాయి. ఆయన జేబులో ఉన్న ఆధార్, ఐడీ కార్డు ఆధారంగా ఏఆర్ హెచ్సీగా గుర్తించారు. అయితే సుబ్బరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ఎడమకాలి పాదం వద్ద బ్యాండేజీ ధరించి ఉన్నాడు. ఏదైనా గాయం కారణంగా చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యమా? లేదంటే కుటుంబ కులహాలా? మరేదైనా కారణమా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న భార్య, పిల్లలు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేశారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి తద్వారా రాయలసీమ ద్రోహిగా నిలిచారు. సీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించేందుకు పోతిరెడ్డి పాడు వద్ద గురువారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాయలసీమ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
ఏపీ సూపర్ కప్ విన్నర్స్ ‘గోదావరి లెజెండ్స్’
అనంతపురం అర్బన్: ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ విన్నర్గా నిలిచి ఎఫ్సీ ఏపీసూపర్ కప్ ఫుట్బాల్–2026ను సొంతం చేసుకుంది. అదనపు సమయం తరువాత జరిగిన పెనాలిటీ షూటౌట్లో కోరమాండల్ ఎఫ్సీపై 3–0 గోల్స్తో విజయం సాధించి టైటిల్ను కై వసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి. నిర్ణీత సమయంలోనూ, అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దృఢమైన రక్షణాత్మక ఆటతో ఇరు జట్ల డిఫెండర్లు ప్రత్యర్థులకు స్పష్టమైన గోల్ అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు మ్యాచ్ పెనాలిటీ షూటౌట్కు చేరింది. గోల్స్గా మార్చిన గోదావరి లెజెండ్స్ పెనాలిటీ షూటౌట్లో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ఆటగాళ్లు మూడు పెనాలిటీలను గోల్స్గా మార్చారు. రాజా దేబ్నాథ్, విఘ్నేష్ వేలమురగన్, రమేశోర్ మీతే గోల్స్ సాధించారు. గోల్ కీపర్ సచిన్ ఝూ రెండు కీలక పెనాలిటీలను అడ్డుకుని జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఈ విజయంతో గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ ప్రతిష్టాత్మక ఏపీ సూపర్ కప్ను గెలుచుకోవడంతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీని అందుకుంది. టోర్నమెంట్లో కోరమాండల్, కొల్లేరు, పెన్నా, గోదావరి, విశాఖ, వంశధార, నల్లమల, తుంగభద్ర జట్లు పాల్గొన్నాయి. ఎనిమిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహించి నాకౌట్ దశల ద్వారా విజేతను నిర్ణయించారు. ఈ గెలుపు గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ స్టార్ ఆటగాడు, సహ యజమాని పృథ్వికి వ్యక్తిగతంగా కూడా మైలురాయిగా మారింది. కలెక్టర్ ఆనంద్ అభిందన ఏపీ సూపర్ కప్–2026 కైవసం చేసుకున్న గోదావరి లెజెండ్స్ జట్టును కలెక్టర్ ఓ.ఆనంద్ అభినందించారు. కలెక్టర్ను ఆయన చాంబర్లో ఆటగాళ్లు పృథ్వి, షాజెబ్, రాజేష్లు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. -
రోడ్డు నిర్మాణం వివాదాస్పదం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి సమీపంలో క్రషర్ల యజమానులు నిర్మిస్తున్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. గురువారం నిర్మాణ పనులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని క్రషర్ల యజమానులకు అండగా నిలిచి తమకు అన్యాయం చేశారంటూ రైతులు వాపోతున్నారు. బాధితులు తెలిపిన మేరకు...అనంతపురం–కదిరి రహదారి నుంచి క్రషర్ల వద్దకు వెళ్లేదారి 8 అడుగులు (బండిరస్తా) మాత్రమే ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ దాదాపు 25 అడుగుల వరకు బీటీ రోడ్డు వేస్తున్నారు. క్రషర్ల యజమానులు సొంత నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. గతంలోనూ ఈ రోడ్ల మీదుగానే తాము తిరుగుతున్నామని దుమ్ముధూళితో పంటలు నష్టపోతున్నామని చెప్ప డంతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని యజమానులు చెబుతున్నారు. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ రైతులు పనులను అడ్డుకోగా. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రైతులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ వాపోయారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. 10 సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు కోల్పోతున్నామని, అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టి జైల్లోకి పెడతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం కూడా చెల్లించకుండా ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో రోడ్లు వేస్తున్నారన్నారు. క్రషర్ల యజమానులు మాట్లాడుతూ... ఇప్పటికే నెల రోజుల పాటు క్రషర్లు బంద్ చేశామన్నారు. రోడ్డు సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాస్తవానికి 40 అడుగుల రోడ్డు ఉందని ఇందులో తాము 30 అడుగుల్లో మాత్రం రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. సొంత నిధులతో రోడ్లు వేస్తున్నా... అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని వాపోతున్న రైతులు, రోడ్డు పనులు చేయిస్తున్న దృశ్యం -
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం
అనంతపురం: స్థానిక సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుభాష్రోడ్డులో బుధవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ రిటైల్ ఫార్మాట్లు, విస్తృత శ్రేణి కలెక్షన్లు, మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. సంప్రదాయలు, వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్కనుగుణంగా నమ్మకం, పారదర్శకత, కస్టమర్ల నమ్మకాన్ని పెంపొందించుకుని రాయలసీమలోనే పెద్ద జ్యువెలరీ మాల్గా గుర్తింపు దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మలబార్ గోల్డ్ హెడ్ రిటైల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా సిరాజ్ పికే, జోనల్ హెడ్ (సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ) నిఖిల్ చంద్రన్, మహమద్మ్ షరీజ్ (హైదరాబాద్ జోనల్ హెడ్), షానిబ్ (తెలంగాణ జోన్ హెడ్), హఫీజ్ మహమ్మద్ (డిప్యూటీ షోరూం హెడ్, అనంతపురం), తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్కూళ్ల అభివృద్ధి అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విద్యాంజలి’లో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. బుధవారం బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు రీజియన్ ట్రైనింగ్ సెంటర్లో విద్యాంజలి కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎంఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యాంజలి పోర్టల్ అనేది ప్రభుత్వ పాఠశాలలు, దాతలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సంబంధిత సేవలకు సంబంధించి దాదాపు 100కు పైగా అంశాలను పోర్టల్లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వారా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు నేరుగా పాఠశాలలకు సాయం చేసే అవకాశం ఉందని చెప్పారు. కంబదూరు ఎంఈఓ, మాస్టర్ ట్రైనర్ మదన్ మోహన్ మాట్లాడుతూ కొంతమంది మోసగాళ్లు ‘విద్యాంజలి’ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు చూస్తున్నామని, ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజు మాట్లాడుతూ విద్యాంజలి అనేది పూర్తిగా స్వచ్ఛంద సేవతో కూడిన కార్యక్రమం అన్నారు. మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించిన గోవర్ధన్, రంగనాయకులు ‘విద్యాంజలి’ పోర్టల్ సాంకేతిక అంశాలను వివరించారు. -
ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలి
రాప్తాడురూరల్: ఫ్యామిలీ సర్వే పక్కాగా చేపట్టాలని జిల్లా పరిషత్ ఇన్చార్జ్ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. డీడీఓ నాగ శివలీలతో కలిసి బుధవారం అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (యూఎఫ్ఎస్)ను పరిశీలించారు. సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వెంకటసుబ్బయ్య సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి వర్ల శంకర్, పంచాయతీ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ శివ పాల్గొన్నారు. ఎస్డీసీ తిప్పేనాయక్ బదిలీ ● కాకినాడ డీఆర్ఓగా నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్డీసీ) డి.తిప్పేనాయక్ను కాకినాడ డీఆర్ఓగా బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిప్పేనాయక్ ప్రస్తుతం అనంతపురం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) ఎస్డీసీగా ఉన్నారు. రస్తా విషయంలో ఇరువర్గాల ఘర్షణ గార్లదిన్నె: రస్తా విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన మండల పరిధిలోని సంజీవపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... యర్రగుంట్ల రెవెన్యూ పొలం సర్వే నంబర్ 26/6లో సంజీవపురానికి చెందిన చితంబరయ్య కుమారులు దివ్యాంగుడు పెద్దన్న, లక్ష్మినారాయణ, శివయ్యలు 8 ఎకరాల పట్టా భూమి సాగు చేసుకుంటున్నారు. బీరప్ప కుమారులు ఎర్రిస్వామి, ఆదినారాయణకు కూడా 3 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇరువర్గాల మధ్య కొంతకాలంగా దారి విషయమై వివాదం నెలకొంది. బీరప్ప కుమారులు ఇటీవల కోర్టు నుంచి శాశ్వత ఇంజెంక్షన్ ఆర్డర్ పొందారు. బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లగా ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో చితంబరయ్య భార్య కొండమ్మ స్పృహతప్పి పడిపోయింది. ఆదినారాయణ భార్య సరస్వతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి ఇరువురినీ చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికను గర్భిణి చేసిన ఆటోడ్రైవర్ గుత్తి రూరల్: ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను గర్భిణిని చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు బాలిక రోజూ ఆటోలో వస్తున్న క్రమంలో డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. శభాష్ వెంకటలక్ష్మి విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం కస్తూరిబా గాంధీ గురుకుల బాలికల పాఠశాల పదో తరగతి విద్యార్థిని వెంకటలక్ష్మి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటింది. తృతీయ స్థానంలో నిలిచింది. వారం క్రితం తమిళనాడులో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్రం తరఫున జట్టులో ప్రాతినిధ్యం వహించిన వెంకటలక్ష్మి అత్యంత ప్రతిభ కనబరిచి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ తులసి విద్యార్థిని అభినందించారు. పేదింట పుట్టినా ఒకవైపు చదువులతో పాటు మరోవైపు క్రీడల్లో కూడా రాణించడం గర్వకారణమన్నారు. ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్ పుట్లూరు: మహిళపై అత్యాచారయత్నం చేసిన యల్లనూరు పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ మారుతికుమార్పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జనవరి 30న పుట్లూరు మండలంలోని అరకటివేముల గ్రామంలో ఓ మహిళపై అత్యాచారయత్నం చేసినట్లు పుట్లూరు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్పై కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు మారుతీకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
ప్రజల పక్షాన పోరాడుతాం
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిని విస్మరించి ఈ ప్రాంతానికి ఉరి వేయాలన్న ఆలోచనను పాలకులు విరమించుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రాయలసీమ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ (రఫ్) తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. – తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు -
క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి అనంతపురం మెడికల్: క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం అందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు, తిరిగి డీఎంహెచ్ఓ కార్యాలయం వరకు సాగింది. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్యాన్సర్ నివారణలో భాగంగా క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. జీవన శైలిలోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్వహించే ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమానికి హాజరవ్వాలన్నారు. మహిళల్లో సర్వైకల్, బ్రెస్ట్, పురుషుల్లో నోటి క్యాన్సర్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ విష్ణుమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, ఓబులు, డెమో నాగరాజు, ఎస్ఓ మహమ్మద్ రఫి పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్ఓ భ్రమరాంబ దేవి -
కలెక్టరేట్లో ‘అవినీతి’ అనకొండ
● వ్యవసాయ భూమి ఫైలు క్లియర్ చేయిస్తానని బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి వద్ద తొలి విడతగా రూ.25 వేలు వసూలు చేశాడు. పని ఎప్పుడు చేస్తారంటూ వాళ్లు తిరుగుతున్నారు. ● భూమి ఫైలు క్లియరెన్స్ కోసం యాడికి మండలం కంబాలపాడుకు చెందిన ఒక వ్యక్తి నుంచి మధ్యవర్తి ద్వారా రూ.30 వేలు వసూలు చేశాడు. పని చేయించు లేదా డబ్బులైన వెనక్కు ఇవ్వు అంటూ మధ్యవర్తి కలెక్టరేట్కు తిరుగుతున్నాడు. ఆ ఉద్యోగి అవినీతికి సంబంధించి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ● భూమి ఫైలు క్లియర్ చేయిస్తానని మదనపల్లికి చెందిన ఒక మహిళ వద్ద అనంతపురం కలెక్టరేట్లో పనిచేసే ఓ ఉద్యోగి రూ.2 లక్షలు వసూలు చేశాడు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయాన బంధువు. అయితే పని చేయించడంలో జాప్యం చేస్తూ వస్తున్నాడు. తన పనిచేయించకపోతే నేరుగా సీఎం వద్దకు వెళతానని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. అనంతపురం అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో ఓ అధికారి వద్ద సీసీగా వ్యవహరిస్తున్న ఉద్యోగి అవినీతి తారస్థాయికి చేరింది. అతను ‘అవినీతి అనకొండ’ అంటూ కార్యాలయ సిబ్బందిలో చర్చ సాగుతోంది. ఆ అధికారి వద్ద అంతా తానై వ్యవహరిస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి. భూముల ఫైళ్లు క్లియర్ చేయిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. ఫైలు స్థాయిని బట్టి రూ.25 వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తాడని సమాచారం. ఫైలు క్లియర్ కావాలంటే అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు నుంచే డబ్బు వసూలు చేశాడంటే ఆ ఉద్యోగి ఎంతటి ఘనుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోనూ ఆరోపణలు అవినీతి ఉద్యోగిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్గా నిశాంత్ కుమార్ ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక ఉద్యోగి వద్ద నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఒక మహిళా హోంగార్డ్ కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఆ ఉద్యోగి అవినీతి వ్యవహారాలు చాలానే ఆరోపణలు ఉన్నాయి. అధికారికి శిష్యుడే... సదరు ఉద్యోగి డిప్యుటేషన్పై కలెక్టరేట్లో అధికారి వద్ద సీసీగా చేరాడు. ఉద్యోగపరంగా అధికారికి ఆ ఉద్యోగి శిష్యుడు అని కార్యాలయ సిబ్బంది చెబుతుంటారు. ఏ ఫైలు ఎలా సిద్ధం చేయాలి అని అతనికి శిక్షణ ఇచ్చింది ఆ అధికారేనని అంటుంటారు. గురువు కూడా తక్కువేమీ కాదని... అయితే ఈ శిష్యుడు గురువును మించినవాడయ్యాడని విమర్శలున్నాయి. భూముల ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో దందా ఫైలు స్థాయిని బట్టి డబ్బు వసూలు సీఎం బంధువు నుంచి రూ.2 లక్షలు గుంజిన వైనం -
సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం
రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. సాక్షాత్తూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. తప్పు చేయలేదంటే ఖండించాలి. కిరణ్కుమార్రెడ్డి హయాంలోనూ హంద్రీ–నీవా కాలువ పనులకు రూ.7 వేల కోట్లు కేటాయిస్తే.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీఓను రద్దు చేయించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. ఈ విధంగా పదేపదే రాయలసీమకు ద్రోహం చేయడం చంద్ర బాబుకు అలవాటుగా మారిపోయింది. – కె.సలీం మాలిక్, మానవతా సంస్థ -
ప్రాజెక్టులపై నిర్లక్ష్యమేల బాబూ..?
● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమకు ద్రోహం చేశారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం పనులు పునఃప్రారంభించాలని వైఎస్సార్సీపీ అధ్వర్యంలో గురువారం నిర్వహించతలపెట్టిన ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమ పోస్టర్లను బుధవారం ఉరవకొండలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విశ్వ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. సీమ జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏకంగా తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాయలసీమలో భవిష్యత్తు తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతో ముఖ్యమన్నారు. ‘హంద్రీ–నీవా’ సామర్థ్యం పెంచాలి వైఎస్సార్సీపీ హయంలో హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని ఆరువేల క్యూసెక్కులకు పెంచుతూ టెండర్లు పిలిచి, దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులు కుడా మంజురు చేశారని విశ్వ తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మూడు వేల క్యూసెక్కులకు కుదిస్తూ హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టారన్నారు. ఈ పనులను కూడా రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టి 100 రోజుల్లో అత్యంత నాసిరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారన్నారు. భూగర్భజలాలు అడుగంటేలా హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు చేపట్టి రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి హంద్రీ–నీవా కాలువను ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో చేసి, హంద్రీ–నీవాను గాలేరు నగరికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో బీటీ ప్రాజెక్టు, పేరూరు డ్యాంతో పాటు ఇతర ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలంటే హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచి వెడల్పు చేయడం ఒక్కటే మార్గమన్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, వివాదాన్ని ఇంతటితో ముగించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ సుశీలమ్మ, కమలమ్మ, పార్టీ రాష్ట్ర నాయకులు బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, సోమశేఖర్రెడ్డి, కురుబ డోనేకల్లు రమేష్, పార్టీ నాయకులు డిష్ సురేష్, కౌడిగి గోవిందు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, జీఎంఎస్ మీరం బాషా, ఆసీఫ్, అంగదాల ఆంజి, నిమ్మల వెంకటరమణ, కాసుల ఆంజి, ఆరె రాజా, జోగి భీమా, జోగి హనమంతు, ప్రకాష్, వడ్డే ఆంజనేయులు, ఈశ్వర్, ధనుంజయ, సుద్దాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లను ఆవిష్కరిస్తున్న విశ్వేశ్వరరెడ్డి -
గడ్డి కొరత.. పాడి కోత !
అనంతపురం అగ్రికల్చర్: చలి కాలం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల రెండో పక్షం నుంచి వేసవి మొదలు కానుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ లు దంచికొట్టనున్నాయి. జూన్లో వర్షాలు వచ్చేదాకా వేసవితాపం కొనసాగనుంది. మధ్యమధ్యలో అంటే ఏప్రిల్, మేలో ఈదురుగాలులు, అకాల వర్షాలకు అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా మండే అవకాశం ఉండగా... రాత్రిళ్లు కూడా 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉక్కపోత కొనసాగే వాతావరణం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పశువులకు గడ్డి కొరత, తాగునీటికి ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పాడి ఉత్పత్తి కూడా తగ్గే పరిస్థితి ఉందని చెబుతున్నారు. గ్రాసం కొరతకు కారణాలివే.. ఇటీవల కాలంలో అటు ఖరీఫ్, ఇటు రబీలో వేరుశనగ పంట సాగు బాగా తగ్గిపోవడంతో పశువుల మేత లభ్యత తగ్గిపోయినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో 10 లక్షల ఎకరాల్లో కేవలం వేరుశనగ సాగవుతుండగా.. ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు పడిపోయింది. వేరుశనగ స్థానంలో కంది, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలు ఆక్రమించాయి. వీటి ద్వారా అనుకున్న స్థాయిలో గడ్డి లభించే పరిస్థితి లేదు. అంతో ఇంతో మొక్కజొన్న ద్వారా లభించనుంది. వరి సాగు స్థిరంగానే కొనసాగుతున్నా... పంటకోతలు దాదాపు యాంత్రీకరణ ద్వారా చేస్తుండటంతో అనుకున్న స్థాయిలో గడ్డి లభించే పరిస్థితి లేదు. వ్యవసాయ పంటల స్థానంలో ఇటీవల ఉద్యాన పంటలు, కూరగాయల సాగు పెరగడంతో గడ్డికి సమస్యగా మారింది. దీంతో చాలామంది రైతులు బళ్లారి, కర్నూలు, నంద్యాల ప్రాంతాలతో పాటు జిల్లాలో వరి సాగు అధికంగా ఉన్న రాయదుర్గం ప్రాంతం నుంచి వరి గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ట్రాక్టర్ గడ్డి రూ.10 వేల ప్రకారం నడుస్తుండటంతో రైతులకు భారంగా మారిందని చెబుతున్నారు. వేరుశనగ పంట తగ్గిపోవడంతో జీవాలకు కూడా సమస్యగా ఉంటుందని తెలుస్తోంది. పాడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం.. ఈ వేసవిలో లక్ష టన్నుల వరకు గడ్డి కొరత ఏర్పడవచ్చని పశు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే పశుదాణా, టీఎంఆర్ (దాణామృతం), ఎండుగడ్డి లాంటివి రాయితీతో పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేసవి గండం నుంచి గట్టెక్కడానికి పాడి రైతులు నానాపాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.94 లక్షలు పశువులు, 1.61 లక్షలు గేదెలు ఉండగా.. 29 లక్షల గొర్రెలు, 4.82 లక్షల మేకల సంపద ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదికి జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి ఉన్నట్లు పశుశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అంటే రోజుకు 13.75 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతోంది. వర్షాకాలం, చలికాలంలో పాడి ఉత్పత్తి బాగానే ఉన్నా.. వేసవిలో గడ్డి కొరత, నీటి సమస్య కారణంగా రోజుకు రెండు లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. -
బైకుల సీజ్.. తల్లిదండ్రులపై చర్యలు
రాప్తాడురూరల్: షర్ట్ విప్పి విన్యాసాలు చేసుకుంటూ రోడ్డుపై బైకు నడిపిన బాలురకు రాప్తాడు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారు నడిపిన బైకులను సీజ్ చేశారు. వివరాలను రాప్తాడు సీఐ శ్రీహర్ష మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అనంతపురం రాణినగర్కు చెందిన బాలురు ఈనెల 1న బుక్కరాయసముద్రంలో జరిగిన తేరుకు వెళ్లారు. అక్కడి నుంచి మూడు బైకుల్లో రాప్తాడు సమీపంలోని అయ్యవారిపల్లి వంక వద్దకు ఈతకు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై విన్యాసాలు చేసుకుంటూ వెళ్లారు. ఓ బాలుడు అత్యుత్సాహంతో షర్ట్ను విప్పేసి బైకు నడిపాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి... ‘గంజాయి బ్యాచ్ హల్చల్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఎస్పీ జగదీష్ స్పందించి రాప్తాడు పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సాంకేతికత ఆధారంగా బాలురు, వారి తల్లిదండ్రులను గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చారు. మైనర్లు నడిపిన బైకులను సీజ్ చేశారు. బైకుల రిజిస్ట్రేషన్ల రద్దుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులపై ఎంవీఐ యాక్ట్ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదని, సదరు వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి నోటీసు జారీ చేస్తామన్నారు. యువకుడి దారుణ హత్య ● గంజాయి బ్యాచ్ పనేనని గ్రామస్తుల ఆరోపణ రొద్దం: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోడిపల్లికి చెందిన బోయ మల్లికమ్మ, పోతన్న ఒక్కగానొక్క కుమారుడు లింగమయ్య (24). ఏడాది క్రితం తండ్రి పోతన్న మృతి చెందడంతో లింగమయ్య రోజూ దానిమ్మ కాయల ప్యాకింగ్కు వెళ్తూ తల్లి మల్లికమ్మను పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు మిత్రులతో కలిసి గ్రామ శివారు ప్రాంతానికి మద్యం సేవించడానికి వెళ్లినట్లు సమాచారం. స్నేహితులు కత్తితో మెడపై విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిసింది. గంజాయి బ్యాచ్ లింగమయ్యను హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజూ గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులతో వాపోయారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఐ రాఘవన్, ఎస్ఐ వీరాంజినేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులతో విచారణ చేపట్టారు. ఓ నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారికి తీర్థవాది వసంతోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి కొండమీదరాయుడిని సతీసమేతంగా హంస వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. విద్యార్థి డిబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న లా మూడు సంవత్సరాల కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షల్లో మంగళవారం మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఎస్ఎస్బీఎన్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రొఫెసర్ జీవీ రమణ హెచ్చరించారు. మామపై అల్లుడు కొడవలితో దాడి పరిగి: మండలంలోని కోనాపురం గ్రామంలో మామపై అల్లుడు కొడవలితో దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు... మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురంలో నివాసముంటున్న సనాతన్కు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ వస్తోంది. తాగుడుకు బానిసైన ఇతని అల్లుడు ప్రశాంత్ డబ్బుల కోసం తరచూ సనాతన్తో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం యథావిధిగా డబ్బులడిగాడు. ఇవ్వకపోవడంతో కొడవలితో సనాతన్పై దాడి చేయగా అతడి చేయి, తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. -
కబళిస్తున్న క్యాన్సర్
అనంతపురం మెడికల్: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే ఎవరైనా భయోత్పాతానికి గురి కావాల్సిందే. రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార, తదితర క్యాన్సర్లు ముదిరితే ప్రాణానికే ముప్పు. అటువంటి భయానక క్యాన్సర్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సత్ఫలితాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ క్యాన్సర్ రోగులను గుర్తించడంలో పూర్తిగా విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఆరోగ్యశాఖ, ప్రజల ముందు చూపుతోనే క్యాన్సర్కు అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ యూనిట్లో సౌకర్యాలు మృగ్యం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్) పరిధిలోని క్యాన్సర్ యూనిట్లో 2024 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 1,600 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 550 మంది కీమో, 87 మంది రేడియో థెరపీ చికిత్సలు తీసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. క్యాన్సర్ రోగులకు పెద్దదిక్కు ఈ యూనిట్టే. ఇక్కడ పాత, నూతన ఓపీలను కలుపుకుని రోజూ వందకుపైగా కేసులు ఉంటాయి. కాగా ఇక్కడ అడ్మిషన్ ఉండదు. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కీమో రోగులు బయట కొనుగోలు చేసుకునే పరిస్థితి. ఇక రేడియేషన్ అవసరమైన రోగులు కర్నూలు, లేకపోతే జిల్లా కేంద్రంలోనే ఓ క్యాన్సర్ ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. కోబాల్ట్ మిషన్ తరచూ మరమ్మతుకు గురవుతోంది. దీంతో రోగులకు అవస్థలు వర్ణనాతీతం. ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడానికి స్క్రీనింగ్ ముఖ్యం. అటువంటి స్క్రీనింగ్ నిర్వహించడంలో ఆరోగ్య శాఖ విఫలమైందన్న విమర్శలున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 663 ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో 19,39,417 మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,37,261 మందికి(32.85శాతం) స్క్రీనింగ్ చేసినట్లు ఆరోగ్యశాఖ రికార్డుల్లో నమోదు చేశారు. కాగా ఆరోగ్యశాఖ నిర్వహించిన స్క్రీనింగ్ను తూతూమంత్రంగా చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రారంభ దశలోనే గుర్తించాలి క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించాలి. తద్వారా రోగులు కోలుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. నాల్గవ స్టేజ్లో వచ్చినప్పుడు రోగులకు కోలుకునేందుకు సమయం తీసుకుంటుంది. క్యాన్సర్ యూనిట్లో వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలందిస్తున్నాం. – డాక్టర్ ప్రశాంతి, అసోసియేట్ ప్రొఫెసర్, క్యాన్సర్ యూనిట్, అనంతపురం నేడు ప్రపంచ క్యాన్సర్ దినం జిల్లాలో పెరుగుతున్న బాధితులు కేసులను గుర్తించడంలో ఆరోగ్యశాఖ విఫలం క్యాన్సర్ యూనిట్లో అరకొర సౌకర్యాలతో రోగుల అవస్థలు -
రీ సర్వే వేగవంతం చేయండి
ఆత్మకూరు: భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార అర్జీలు గడువులోపు పరిష్కరించాలని, పట్టాదార్పాసు పుస్తకాల పంపిణీ సజావుగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాలమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి పాల్గొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు 228 మంది గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 228 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జనరల్ విద్యార్థులు 2.819 మందికి గాను 2,770 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,085 మందికి గాను 985 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు జనరల్ విద్యార్థులు 2,634 మందికి గాను 2,585 మంది, ఒకేషనల్ విద్యార్థులు 881 మందికి గాను 851 మంది హాజరయ్యారు. ఉత్సాహంగా రాతిదూలం లాగుడు పోటీలు కుందుర్పి: అప్పిలేపల్లిలో బొబ్బులకుంట ఆంజనేయస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్థానిక హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి మొత్తం 12 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన వృషభాల యజమానులకు ఆలయ ధర్మకర్త మల్లికార్జునగౌడు, సర్పంచ్ అతావుల్లా తదితరులు నగదు బహుమతులు అందజేశారు. బాలికపై అత్యాచారం ● నిందితునిపై పోక్సో కేసు అనంతపురం సెంట్రల్: ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వంచించాడు. శారీరక వాంఛ తీర్చుకుని గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడికి చెందిన మహేంద్ర అనే యువకుడు అనంతపురంలోని వేణుగోపాల్నగర్లో ఎంబ్రాయిడరీ షాపులో పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన పదో తరగతి బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పలుమార్లు శారీరకంగా కలవడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


