Ananthapur
-
ప్రమాదంలో యువకుడి మృతి
బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్కుమార్తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే సతీష్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవు అనంతపురం: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలని, అయితే పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని పరిమితికి మించి ఆటోల్లో తరలించరాదన్నారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదన్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు, దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు. -
బస్టాండ్లో బంగారు నగల అపహరణ
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్లోని బంగారు నగలను దుండగులు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి పట్టణానికి చెందిన శ్రావణి, మధుమోహన్ దంపతులు ఆదివారం యాడికిలో జరుగుతున్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. రాత్రికి తిరుగు ప్రయాణమై గుత్తి బస్టాండ్లో బస్సు దిగారు. ఆ సమయంలో శ్రావణి బ్యాగులోని 10 తులాల బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలను దుండుగులు అపహరించారు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాధిత దంపతులు చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, బస్టాండ్లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఆర్షియా తాడిపత్రి టౌన్: జాతీయ స్థాయి కబడీ పోటీలకు తాడిపత్రిలోని సాయిచైతన్య స్కూల్ విద్యార్థి ఆర్షియా ఎంపికై ంది. ఈ మేరకు ఆ పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసింహ సోమవారం తెలిపారు. ఈ నెల 16న పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఆర్షియ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా ఆర్షియను పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్థులు అభినందించారు. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ఇటీవల జరిగిన హార్టికల్చర్ కాంక్లేవ్లో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ఎంఓయూల అంశంపై సోమవారం కలెక్టరేట్ నుంచి ఉద్యాన శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కాంక్లేవ్లో ఏడు ఎంఓయూలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి రాబోయే మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళికను ఆయా కంపెనీల ప్రతినిధులు వారంలోపు అందజేయాలన్నారు. కాన్ఫరెన్స్లో ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, టెక్నికల్ అధికారి పల్లవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
● తొలిరోజు 638 మంది విద్యార్థుల గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 31,169 మంది విద్యార్థులకు గాను 30,531 మంది హాజరయ్యారు. 638 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 30 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీవైఈఓ శ్రీనివాసరావు వివిధ కేంద్రాలను పరిశీలించారు. వసతుల్లేక ఇబ్బందులు.. అనంతపురం నగరంలోని నంబర్–1 ఉన్నత పాఠశాల కేంద్రంలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా గదులు కనీసం శుభ్రం చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. జిల్లాలో పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ శామ్యూల్ ప్రత్యేక దృష్టి సారించడంతో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లలో గుబులు పట్టుకుంది. దీనికితోడు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏ కేంద్రాలకు వెళ్లాలనేది ఆర్జేడీ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ విధుల్లో ఉన్న టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది. పటిష్ట బందోబస్తు.. అనంతపురం: పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో డ్రోన్లతో పర్యవేక్షించారు. 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు పెట్రోలింగ్ చేపట్టాయి. పరీక్షలు ముగిసేంత వరకు జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్లు మూసివేయించారు. విద్యార్థులు, పరీక్షల నిర్వహణ అధికారులు, ఆయా పాఠశాల సిబ్బంది మినహా ఎవరినీ పరిసర ప్రాంతాల్లోకి రానీయలేదు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్ల కుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు గార్లదిన్నె: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటుకూ తావివ్వొద్దని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ పేర్కొన్నారు. పరీక్షల అధికారులతో సోమవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్ నుంచి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష పేపర్లను సకాలంలో జాగ్రత్తగా కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్ష ముగిసిన తరువాత పక్కాగా భద్రపరచాలన్నారు. పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాల్సిందే
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో వెడల్పు చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. అలాగే పంట కాలువలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. ఉరవకొండ మండలం ఇంద్రావతి, ముష్టూరు గ్రామాల్లో హంద్రీ–నీవా కాలువను సోమవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరులే కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు ప్రారంభించే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు పది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత డిజైన్ 3,850 క్యూసెక్కుల కంటే తక్కువకు కుదించి లైనింగ్ పనులు చేపడితే అది రైతులకు మరణశాసనమవుతుందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చడంతో పాటు హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. ఈ విషయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి, మధుసూదన్, శ్రీనివాసులు, కౌలు రైతు సంఘం నాయకులు పెద్దముష్టూరు వెంకటేష్, మురళి, రామాంజినేయులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రలు విధులు బహిష్కరించి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అద్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, సీసీ డీఈఓలుగా పనిచేస్తున్న వారికి 17 ఏళ్లుగా క్యాడర్ అమలు చేయకపోవడంతో ఎంటీఎస్ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తింపు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యసేవ ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబాలకు సాధారణ వ్యక్తికి చెల్లించినట్లే ఎక్స్గేషియాతో సరిపెడుతూ ఇతర ఎలాంటి ప్రయోజనాలు అందివ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవన్నారు. ప్రభుత్వ సైట్లో ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుండడంతో సంక్షేమ పథకాలు కూడా అందడం లేదన్నారు. తమ ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు అరుణ, రామాంజినేయలు, తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రల నిరసన -
ప్లాస్టిక్ సంచుల కలకలం
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రానికి సమీపంలోని నిర్జన ప్రదేశాల్లో ప్లాస్టిక్ బస్తా నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విషయం తెలుసుకున్న సీకేపల్లి సివిల్, హిందూపురం రైల్వే పోలీసులు ఉరుకుల పరుగులతో గాలింపు చేపట్టారు. అయితే ఒకటి కాదు... రెండు కాదు... అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పడేసిన మూడు ప్లాస్టిక్ బస్తాల్లో నుంచి కుళ్లిన దుర్వాసన వెలువడుతుండడంతో పోలీసులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఏడు గంటల పాటు ఉత్కంఠ చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న యర్రంపల్లి రైల్వే వంతన కింద ప్లాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని పసిగట్టిన స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే సీఐ అశోక్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, హిందూపురం రైల్వే ఎస్ఐ సాయినాథ్రెడ్డి, ఐడబ్ల్యూ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి, కానిస్టేబుల్ రమేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆందోళనతో అక్కడకు పరుగు తీశారు. కేబుల్ వైర్ కోసం తీసిన గుంతలో ప్లాస్టిక్ బస్తాను గుర్తించి వెలికి తీశారు. ఈ లోపు అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకుని అక్కడకూ ఆగమేఘాలపై చేరుకున్నారు. బస్తాల పరిమాణాన్ని బట్టి ముగ్గురు వ్యక్తులను హతమార్చి ప్లాస్టిక్ సంచుల్లో కూరి పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపు ఏడు గంటల పాటు యర్రంపల్లి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాత ఒక్కో బస్తాను తెరిచి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో అందరూ ఊహించినట్లుగా వ్యక్తుల మృతదేహాలు కాకుండా మేక పిల్లల కళేబరాలు బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అనేది తేలాల్సి ఉంది. అర కిలోమీటరు దూరంతో మూడు సంచులు రైల్వే, సివిల్ పోలీసుల పరుగులు బస్తాల్లో బయటపడిన మేక పిల్లల కళేబరాలు -
సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చామన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఫైళ్ల దగ్ధంపై ఉన్నతాధికారుల విచారణ ● క్లూస్ టీంతో పోలీసుల దర్యాప్తు ఉరవకొండ: స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సోమవారం ఏడీఏ కార్యాలయంలో క్లూస్ టీంతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఘటనపై వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ విలేకర్లతో మాట్లాడారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో ప్రమాదం సంభవించిందని ఏఈఓ భరత్ ద్వారా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశామన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో కార్యాలయానికి చేరుకుని ఫైళ్లు పరిశీలించినట్లు తెలిపారు. డిసెంబర్ 2021 వరకు డిపార్ట్మెంట్ ఆడిట్ జరిగిందని, ఆ ఫైల్స్ మొత్తం భద్రంగా ఉన్నాయన్నారు. 2013 తరువాత ఫైళ్లు కొన్ని కాలిపోయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం కాలిపోయిన వాటిలో ఎక్కువ శాతం రైతులకు అవగాహన కల్పించే కరపత్రాలు, బుక్లెట్లు ఉన్నాయన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిలకడగా చింత పండు ధరలు హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు.ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగాయి. పదో తరగతి విద్యార్థులకు గాయాలు బొమ్మనహాళ్: పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు బొమ్మనహాళ్, ఉద్దేహాళ్లోని పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీంతో సోమవారం ప్రారంభమైన తొలి పరీక్షకు విద్యార్థులు రంజిత్, సురేష్తో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గోవిందవాడ గ్రామం వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పడంతో కిందపడ్డారు. ఘటనలో రంజిత్, సురేష్కు బలమైన గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరీక్షల వేళ సకాలంలో బస్సులను నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని, ఫలితంగా పిల్లలు ద్విచక్రవాహనంపై పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
దౌర్జన్యంగా బండలు నాటారు
రెండేళ్ల క్రితం మా గ్రామంలోని జగనన్న కాలనీలో (సర్వే నంబర్ 483/4) నా భార్య గొల్ల కవిత పేరున ప్లాట్ నంబరు 15 మంజూరు చేస్తూ పట్టా (ఏఎన్ఏ01934178) ఇచ్చారు. అయితే, ఆ ప్లాట్లో వేరొకరు దౌర్జన్యంగా బండలు నాటుకున్నారు. సమస్యను గ్రామ సర్పంచుకు చెప్పినా.. సచివాలయంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. – గొల్ల తిరుపాలు, బొమ్మలాటపల్లి, బుక్కరాయసముద్రం మండలం పట్టించుకోవడం లేదు యర్రగుంట పొలం సర్వే నంబరు 380–7 లో ఎకరా, 380–6లో 36 సెంట్లు మొత్తం 1.36 ఎకరాలు సాగు చేసుకుంటున్నా. ఈ భూమికి ప్రభుత్వం 2004లో డి.పట్టా, పాసుపుస్తకం మంజూరు చేసింది. భూమిలో బోరు వేసుకుని పంట సాగు చేసుకుంటున్నా. అయితే వెబ్ల్యాండ్లో మిగులు భూమిగా నమోదు చేశారు. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలు సమర్పించి నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. – జి.ప్రసాద్, బండమీదపల్లి, రాప్తాడు మండలం -
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
అనంతపురం అర్బన్: ‘వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏ–జేజీయూఏ)’ పకడ్బందీగా అమలు చేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పైప్లైన్ల మరమ్మతు చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్లు, ఆస్పత్రులు, రైతు బజార్లు, దేవాలయాలు, మీ సేవ, ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గ్రామాలను బాగుచేయాలి.. ‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్’ కింద గిరిజనుల గ్రామాలను బాగు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పథకం కింద జిల్లాలో గుండాల తండా, వెంకటంపల్లి చిన్న తండా, వెంకటంపల్లి పెద్దతండా, చిన్నవరం, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాలను ఎంపిక చేశామన్నారు. వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం సంపూర్ణ స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీఎంఏవై 2.0’ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ బాధ్యతలను డీఆర్ఓ నిర్వర్తించాలన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
ప్రకృతి వ్యవసాయంపై 22 నుంచి సదస్సు
అనంతపురం అర్బన్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ వినోద్కుమార్ విడుదల చేసి, మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. -
పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బెళుగుప్పలోని పరీక్ష కేంద్రానికి గ్రామం నుంచి ఆటోలో బయలుదేరిన విద్యార్థులు... అంకంపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ తప్పించబోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి దూసుకెళ్లింది. ఘటనలో స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఆటోను తిరిగి రోడ్డుపైకి చేర్చి విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. కాగా, విషయం తెలుసుకున్న డీఎస్పీ అష్రఫ్ అలీ, ఎస్ఐ శివ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచారు. కాగా, బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలం కావడంతోనే పిల్లలను ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ‘అనంత’ ప్రతిభ గుంతకల్లు: వైఎస్సార్ జిల్లా పులివెందుల వేదికగా జరిగిన 34వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం జిల్లా బాలికల జట్టు రన్నరప్ను దక్కించుకుంది. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. ఫైనల్లో శ్రీకాకుళం జట్టుతో తలపడిన అనంత జట్టు ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. కాగా, రన్నర్స్ ట్రోఫీని దక్కించుకున్న జిల్లా జట్టును కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి
ధర్మవరం: మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలని ఏపీ మీటర్ రీడర్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రమశెట్టి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మీటర్ రీడర్లు ప్రతి నెలా వచ్చే కమీషన్ల ద్వారా పూట గడవడం దుర్భరంగా మారుతోందన్నారు. ఉద్యోగభద్రత కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించక పోగా రీచార్జ్ మీటర్లు ఏర్పాటు చేసి మీటర్ రీడర్ల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. మీటర్ రీడర్ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18న డీఈ కార్యాలయాన్ని, 20న ఎస్ఈ కార్యాలయాన్ని, 27న సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు దస్తగిరి, రాజు, జగదీష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రహ్లాద సమేత నారసింహుడు ఇక్కడే..
కదిరి: నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి అర్చక పండితులు చెబుతున్నారు. సైన్స్కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన అనంతరం మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు బయటకు వస్తుంటాయి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినా మళ్లీ వస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికే ఇలా స్వేద బిందువులు వస్తుంటాయని భక్తుల నమ్మకం. -
●మోహన మూర్తీ.. భక్త జన దీప్తి
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వయ్యారాలు ఒలకబోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో కనిపించిన శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ధగధగ మెరిసే పట్టు చీర ధరించి, గుభాళించే కదిరి మల్లెల అలంకరణలో కనిపించిన ఖాద్రీశుని వైభవాన్ని చూస్తే తప్ప చెప్పటం సాధ్యంకాదు. శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడగా, అమృతాన్ని పంచడానికి శ్రీమహావిష్ణువే మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలకృష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తుల వద్దకే వసంతవల్లభుడు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. మంగళవారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి బ్రహ్మ రథోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పోలీసు జీపుపై జాగిలాన్ని కూర్చోబెట్టి పూలమాల, శాలువాతో సత్కరించారు. పూలు చల్లుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ వింగ్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైళ్లల్లో దొంగలను పట్టించడంతో పాటు అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో జాగిలం రాజా విశేష ప్రతిభ కనబరిచేదన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య, ఏఎస్ఐ అబ్రహామ్, డాగ్ హ్యాండ్లర్స్ టి.శంకర్, డి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలాన్ని నాంధేడ్లోని అనిమల్ సొసైటీలో అప్పగించనున్నట్లు తెలిసింది. -
బాధితులకు అండగా ఉంటాం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంతపురం రూరల్ పాపంపేట పొలం 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి భవనాలను చట్ట విరుద్ధంగా, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఎలాంటి సర్వే లేకుండా, నోటీసులు ఇవ్వ కుండా కూల్చి వేశారు. 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి దుర్మార్గంగా పేదల నివాసాలపై దాడులు చేశారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడతాం’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అక్కడికి వెళ్తే పక్కకు నెట్టేశారని, జడ్జిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పేదల ఆర్తనాదాల మధ్య పరిటాల కుటుంబం జయకేతనాలు ఎగుర వేస్తోందన్నారు. ‘ఏ కోర్టు ద్వారా భవనాలను కొట్టించారో అదే కోర్టు ద్వారా బాధితులకు స్థలాలు ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు మునిసిపాలిటీ పరిధిలోని భూమిని స్వాధీనం చేయాల్సి ఉండగా పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ 1990లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనంతపురం నగరంలో 106 సర్వే నంబరులో 68 సెంట్లు శోత్రియందారులకు స్వాధీనం చేయమని హైకోర్టు సూచించిందన్నారు. ప్రభుత్వ ప్లీడరు, అడ్వొకేట్ జనరల్, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ కలిసి పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ఒక 420 వెధవ తనకు సంబంధం లేని ఆస్తులపై కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. 8 మంది బాధితులు సివిల్ కోర్టులో ఫైల్ చేసిన కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. సహదేవనాయుడు అనే వ్యక్తికి 2023లో కోర్టు పర్మినెంట్ ఇంజెంక్షన్ ఇచ్చిందన్నారు. వీరి స్థలాల జోలికి వెళ్లొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ధిక్కరించి తొలగించారని చెప్పారు. రూ. 2 వేల కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో కట్టడాలను కూల్చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఆ చుట్టుపక్కల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు భయంతో తమను సంప్రదిస్తున్నారన్నారు. ‘డబ్బు చెల్లించాలి, లేదంటే ఇళ్లు కూల్చేస్తాం, భూములను ఖాళీ చేయిస్తాం’ అనే మెసేజ్ను వారందరికీ పరిటాల కుటుంబం పంపిందని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే సునీత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అప్పట్లోనే కలెక్టర్కు విన్నవించా.. అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్కుమార్కు ఈ కేసులో లొసుగులన్నీ తెలుసని, అందుకే ఏరికోరి ఆయనను ఇక్కడికి తెచ్చుకున్నారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాధితుల తరఫున అప్పటి కలెక్టర్ను కలిసి వివరించగా, అప్పట్లో తహసీల్దార్ మోహన్కుమార్ మొత్తం రికార్డులు కలెక్టర్ ముందు ఉంచారన్నారు. మునిసిపాలిటీ పరిధి 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లను స్వాధీనం చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని, శ్రావణ్కుమార్ అడుగుతోంది పాపంపేట 106–1 సర్వే నంబరు భూమి అని, దీనికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ అప్పట్లో అధికారులు హైకోర్టుకు తెలిపారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు మునిసిపాలిటీ భూములకు మాత్రమే వర్తిస్తుందనే విషయం తెలిసీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కచ్చితంగా ఆర్డీఓ, తహసీల్దార్ను కోర్టుకు లాగుతామన్నారు. కలెక్టర్కు తెలిసి చేశారా.. తెలీక చేశారా.. ఫలితం మాత్రం అనుభవిస్తారన్నారు. 68 సెంట్ల స్థలాన్ని పరిటాల కుటుంబం స్వాధీనం చేసుకుని కాంప్లెక్స్ కడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. సమా వేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఎంపీపీ వరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు కురుబ వెంకటేశ్వర్లు, సందీప్యాదవ్, నాయకులు బండి పవన్, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, గోపాల్రెడ్డి,అంజనరెడ్డి, ఎర్రిస్వామి, నిఖిల్యాదవ్ పాల్గొన్నారు. పేదల ఆర్తనాదాల మధ్య పరిటాల కుటుంబం జయకేతనాలు హైకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కూల్చివేతలు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునే క్రమంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా... అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు, జీవితంపై విరక్తితో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ● నార్పల: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నార్పలలోని సుల్తాన్పేట కాలనీకి చెందిన కవిత(26), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న వెంకటశివ శనివారం రాత్రి గ్రామ శివారులో విడిచిన గొర్రెల వద్దకు కాపలాకు వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అదే కాలనీకి చెందిన యువకుడు బండి లక్ష్మీనారాయణ... ఇంట్లోకి చొరబడి కవితాపై అత్యాచార యత్నం చేశాడు. ఆ సమయంలో కేకలు వేస్తూ అతని బారి నుంచి బయటపడిన ఆమె... లోపలి గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అదే సమయంలో తలుపులు బద్ధలుగొట్టేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో కవిత ఉరి వేసుకుంది. ఇంతలో శబ్ధాలకు చుట్టుపక్కల వారు.నిద్ర లేచి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి లక్ష్మీనారాయణ పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించిన స్థానికులు అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కవితను గమనించి సమాచారం ఇవ్వడంతో వెంకటశివ అక్కడకు చేరుకుని బోరున విలపించాడు. రెండేళ్లుగా కవితను బండి లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే కవితను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడంటూ తల్లి నాగసుబ్బమ్మ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పెద్దవడుగూరు: మండలంలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రైతు తలారి రాము(43) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న రాము... మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులకు వడ్డీల భారం పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్న రాము... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● కూడేరు: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం కలగళ్లకు చెందిన అమర్నాథ్(28) మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చేరుకుని తలుపులు వేసుకుని నిద్రించాడు. ఇంటి బయట నిద్రించిన తండ్రి కొండయ్య ఆదివారం ఉదయం లేచి తలుపులు తీయాలని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, అమర్నాథ్కు భార్య ఉంది. సంతానం లేరు. -
మీ మార్కులు మీరే వేసుకోండి!
అనంతపురం: విశ్వసనీయత, సప్రమాణత అనేవి పరీక్షల మూల్యాంకనం యొక్క కనీస ధర్మం. మార్కుల నమోదు ప్రక్రియ అనేది అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వర్తించాల్సి ఉంటుంది. తద్వారా అందే సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది. అయితే జేన్టీయూ(ఏ) పరీక్షల విభాగం ఉన్నతాధికారులు కనీస నిబంధనలు పాటించకుండా మార్కుల నమోదును నేరుగా ఆయా కళాశాలలకు అప్పగించి వృత్తి ధర్మాన్ని విస్మరించారు. మీకు ఇష్టం వచ్చిన మార్కులు మీరే నమోదు చేసుకోండి అంటూ స్వేచ్ఛను ఇచ్చేశారు. వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘స్వయం ’కోర్సులు తప్పనిసరి.. సాంకేతిక కోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు వీలుగా స్వయం పేరుతో ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్లో తమకు నచ్చిన కోర్సును పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహిస్తారు. బీటెక్ మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్లో 100 మార్కులకు చొప్పున ఈ స్వయం కోర్సులను తప్పనిసరి చేశారు. పరీక్షల అనంతరం ఆన్లైన్ విధానంలోనే ఐఐటీ, ఎన్ఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించి మార్కులు కేటాయిస్తారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... ఈ తర్వాతి ప్రక్రియను జేఎన్టీయూ(ఏ) పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన మార్కులను తప్పనిసరిగా వర్సిటీ పరీక్షల విభాగం సిబ్బంది నమోదు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలోనూ ఇదే తరహాలోనే మార్కులు నమోదు చేశారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఆయా కళాశాలలకే ఈ బాధ్యత అప్పగించారు. దీంతో వారికి ఇష్టం వచ్చిన రీతిలో మార్కులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయం కోర్సుల్లో మార్కులు నమోదు చేసే అధికారం ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు అధికారం లేదు. లేని అధికారాన్ని కట్టబెట్టారు. ఇంటర్నల్ మార్కుల తరహాలోనే స్వయం కోర్సుల మార్కులు నమోదు చేయాలని పరీక్షల విభాగం ఉన్నతాధికారులు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. దీంతో తమ కళాశాల విద్యార్థులకు ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు వేసేస్తూ ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. స్వయం కోర్సులు స్వీయ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రవేశపెట్టారు. విద్యా ప్రణాళికలో పేర్కొన్న అంశాలే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కోర్సులు స్వయంగా నేర్చుకునేందుకు స్వయం కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. వీటికి మార్కులు సైతం కేటాయించారు. క్రెడిట్లు లెక్కిస్తారు. ఇలాంటి కీలకమైన అంశాలను తేలికగా తీసుకోవడమే కాకుండా మార్కుల నమోదును ఏకంగా కళాశాలలకు అప్పగించడం వివాదస్పదమవుతోంది. నియంత్రణ లేని తీరు.. పరీక్షల విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఫలితాలు విడుదల చేసే ముందు అన్ని పరిశీలించి, సర్క్యులర్పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకం చేసిన తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఈ నెల 5న ఎంటెక్, సప్లిమెంటరీ ఫలితాలను కంట్రోలర్ లేకుండానే ప్రకటించారు. ఫలితాల విడుదల సర్క్యులర్పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టమ్ పాస్వర్డ్ అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి పాస్వర్డ్ అప్పగించి ఫలితాలు ప్రకటించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేవలం ఎక్సెల్ షీట్లోనే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో పాస్వర్డ్తో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మార్కులు తారుమారు చేస్తే ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. బీటెక్లో స్వయం ఆన్లైన్ కోర్సులు తప్పనిసరి మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్లో 100 మార్కులకు చొప్పున పరీక్షలు కోర్సు పూర్తయ్యాక ఆన్లైన్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం, మార్కుల కేటాయింపు ఈ మార్కుల నమోదుకు నేరుగా ఆయా ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందికి స్వేచ్ఛ జేఎన్టీయూ (ఏ) పరీక్షల విభాగం ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు పరిశీలిస్తాం స్వయం కోర్సులకు సంబంధించి మార్కులను ఆయా కళాశాలలే నమోదు చేసినా, ఆ తర్వాత ర్యాండమ్గా వాటిని మేమూ పరిశీలిస్తాం. సీఈ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేశారనడం అవాస్తవం. సర్కులర్పై ఆయన సంతకం లేనంత మాత్రాన ఆయన గైర్హాజరైనట్లు కాదు. – ప్రొఫెసర్ నాగప్రసాద్నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్టీయూ (ఏ) -
‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పోలీసు జీపుపై జాగిలాన్ని కూర్చోబెట్టి పూలమాల, శాలువాతో సత్కరించారు. పూలు చల్లుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ వింగ్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైళ్లల్లో దొంగలను పట్టించడంతో పాటు అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో జాగిలం రాజా విశేష ప్రతిభ కనబరిచేదన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య, ఏఎస్ఐ అబ్రహామ్, డాగ్ హ్యాండ్లర్స్ టి.శంకర్, డి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలాన్ని నాంధేడ్లోని అనిమల్ సొసైటీలో అప్పగించనున్నట్లు తెలిసింది. -
నియామకాల్లో నిర్లక్ష్యంపై కొరడా
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కొరడా ఝళిపించారు. ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళం, అంధులు, పక్షవాత బాధితులు, దివ్యాంగ టీచర్లు, చివరకు రిటైర్డ్ అయిన వారినీ విధులకు కేటాయించిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ‘పది పరీక్షల నిర్వహణలో గందరగోళం’, ‘పదింతల నిర్లక్ష్యం’ కథనాలు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. సామాజిక మాద్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ప్రాథమిక విద్య కమిషనర్, కలెక్టర్ కూడా స్పందించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కారణంగా భావిస్తున్న కీలక అధికారిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. ‘టిస్’ ఉన్నా అలసత్వం.. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ద్వారా ఇటీవల ఉపాధ్యాయుల పూర్తి వివరాలు సేకరించారు. ఏ స్కూల్లో ఏ టీచరు పని చేస్తున్నాడు... పేరు, వయసు, పుట్టిన రోజు, పీహెచ్ కేటగిరీ తదితర వివరాలున్నాయి. ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయిన వారి వివరాలు కూడా ఇందులో అప్డేట్ అయ్యాయి. ఈ వివరాలన్నీ డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పక్క గదిలోనే లభిస్తాయి. అయినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే పరీక్షల నిర్వహణ విభాగం అదికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలు, హెచ్ఎంలకు పంపి ఉంటే... 10–15 రోజుల ముందే ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు జాబితాలు పంపి రిమార్కులు అడిగి ఉంటే కూడా చాలా వరకు తప్పిదాలకు అవకాశం ఉండేదికాదు. అలా చేయకుండా కేవలం పరీక్షల విభాగం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు అనేకమంది టీచర్లను ఇక్కట్లు పాలు చేశాయి. ఈ క్రమంలోనే అంధులు, పక్షవాత బాధితులు, చంటిపిల్లల తల్లులు, బాలింతలు, దివ్యాంగ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, మెడికల్ లీవ్లో ఉన్న వారినీ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఇలాంటి వారే 200 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల చీఫ్లకు అందజేసి చేతులు దులుపుకోవడం వల్ల సమాచార లోపించి ఆర్డర్లు జారీ చేసి రెండు రోజులు దాటినా 40 శాతానికి మందికి పైగా ఉత్తర్వులు అందజేలేదు. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీల్లో అవకతవకలపై ఆర్జేడీ చర్యలు ఐదుగురికి షోకాజ్ నోటీసులు తీవ్ర చర్చనీయాంశమైన ‘సాక్షి’ వరుస కథనాలు -
ఏడీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
● కొన్ని ఫైళ్లు దగ్ధం ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఉరవకొండ: ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏడీఏ కార్యాలయం పక్కనే ఉన్న చెత్తకు నిప్పంటుకుని కిటికీలో నుంచి నిప్పు రవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైరింజన్ చేరుకుని మంటలు ఆర్పింది. అప్పటికే కొన్ని ఫైళ్లు కాలిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాల్లో చురుకుగా ఉండే రౌడీషీటర్లకు ఆయా పీఎస్ల అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం వారి జీవన విధానం, ప్రవర్తనలపై ఆరా తీశారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్పై పోలీసు నిఘా ఉంటుందని, వారి ప్రతి కదలికనూ పోలీసులు పసిగడుతూ ఉంటారని, నేరాలకు పాల్పడితే మీతో పాటు మీ కుటుంబసభ్యులూ సమాజంలో గౌరవంగా జీవించలేని పరిస్థితి ఉంటుందన్నారు. నేరాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చీనీ చెట్ల నరికివేత పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లిలో శనివారం రాత్రి రైతు నాగరాజుకు చెందిన 110 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఉదయాన్నే తోట వద్దకు వెళ్లిన ఆయన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాదిత రైతు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకట నరసింహ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 135 కేంద్రాల్లో 32,803 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు. ఆర్జేడీ ప్రత్యేక ఫోకస్.. పరీక్షల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మూడు రోజులుగా జిల్లాలోనే మకాం వేశారు. పరీక్షల నిర్వహణలో ఏ చిన్నపొరబాటు చేసిన ఉపేక్షించబోనని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. గంట ముందుగానే చేరుకోవాలి.. తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్టికెట్ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్టికెట్ చూపిస్తే చాలు ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు. పేపర్ లీక్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు. పటిష్ట బందోబస్తు అనంతపురం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పి. జగదీష్ పేర్కొన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు కేంద్రాల సమీప ప్రాంతాల్లో జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్లు మూసివేయాలన్నారు. 135 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 32,803 మంది విద్యార్థులు అందరూ సహకరించాలి ప్రతిష్టాత్మకమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి. కేంద్రాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి స్థాయిలో వారు బాధ్యతగా పని చేయాలి. ఏ చిన్న పొరబాటుకూ తావివ్వొద్దు. చాలా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయనే సంగతిని ఎవరూ మరవొద్దు. – ఎం.ప్రసాద్బాబు, డీఈఓ -
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు. -
●‘సన్’డే.. మండే..
అనంతపురం అగ్రికల్చర్: ‘సన్’ డే చుక్కలు చూపించింది. ఆదివారం గార్లదిన్నెలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి, బెళుగుప్ప, పెద్దవడుగూరు, తాడిపత్రి, పుట్లూరు, యాడికి, శింగనమల తదితర మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తలుపుల, ఎన్పీ కుంట, కొత్తచెరువు, పెనుకొండ, పుట్టపర్తి తదితర మండలాల్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా మడకశిర, శెట్టూరు, బెళుగుప్ప, కనగానపల్లి, రాప్తాడు, గుడిబండ, సోమందేపల్లి తదితర కొన్ని మండలాల్లో మాత్రమే ఉదయం 14 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల మేర నమోదవుతూ సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఏప్రిల్, మే నెలలో చాలా మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లా దుర్గ్ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్పూర్ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్, లాప్టాప్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు. అంగన్వాడీలకు అందని నూనె తాడిపత్రి రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు వంట నూనె ప్యాకెట్లు అందలేదు. సగానికి పైగా కేంద్రాలకు నూనె ప్యాకెట్లు అందక పోవడంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. కానీ ఈ నెల రెండవ వారం దాటుతున్న కొన్ని కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం గమనార్హం. గతంలోనూ పలుమార్లు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు, వంట నూనె పంపిణీలో వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతూ వస్తున్నారు. నూనె ప్యాకెట్లు లేకపోవడంతో ఇతర సరుకులు సైతం తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. వీటి కోసం గర్భిణులు, బాలింతలు రోజూ అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశంపై తాడిపత్రి స్టాక్ పాయింట్ ఇన్చార్జ్ శంకరయ్య మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు సంబంధించిన ఈ–పాస్ మిషన్లకు స్టాక్ను అప్డేట్ చేయకపోవడంతో సమస్య తలెత్తినట్లు వివరించారు. డీఎం కార్యాలయంలో అప్డేట్ చేసిన వెంటనే డీలర్ల వద్ద ఉన్న ఈ–పాస్ మిషన్ల ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. పథకాల అమలులో ప్రభుత్వం విఫలం : సీపీఐ పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి పెద్దలు పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగప్ప, మండల కార్యదర్శి వెంకట్రాముడుయాదవ్ ధ్వజమెత్తారు. పెద్దవడుగూరు సీపీఐ మండల శాఖ మహాసభ ఆదివారం నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలకు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు బీటుపల్లి నారాయణ, తాడిపత్రి సీపీఐ టౌన్ కార్యదర్శి చిరంజీవియాదవ్, గుత్తి మండల కార్యదర్శి రాందాస్, గుత్తి పట్టణ కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
డబ్బా కొట్టుకునేందుకే ఆవిర్భావ వేడుక
ఉరవకొండ: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తన సొంత డబ్బా కొట్టుకునేందుకే కాకినాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు గురించి ఇందులో ఒక్కమాట కూడా ప్రస్తావించకుండా తన నైజాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవిర్భావ సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపరిచారన్నారు. హిందీ– తమిళ్ వివాదం తెరపైకి తెచ్చి మరో వివాదానికి తెరలేపారన్నారు. ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలను తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీశారని, ఇదే తరహాలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ సైతం కేంద్రాన్ని నిలదీయకపోగా భాషలు, డిలిమిటేషన్పై మోదీ సర్కార్కు వత్తాసు పలకడం ఆశ్చరాన్ని కలిగిస్తోందన్నారు. జిల్లాకు వరదాయినిగా ఉన్న హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేస్తే అది హంద్రీ–నీవా ఆయకట్టు దారులకు మరణశాసనమే అవుతుందన్నారు. హంద్రీ–నీవా కాలువను భవిష్యత్తులో వెడల్పు చేయకుండా ఉండేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. జిల్లాలోని 3.50లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నీటితో నింపి భూగర్భ జలాలు పెంపొదించడమే హంద్రీ–నీవా ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. లైనింగ్ పనులు చేపడితే తాగు, సాగునీరుతో పాటు చెరువులకు కూడా నీరు అందకుండా పోతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే హంద్రీనీవా మొదటి దశ 95శాతం, రెండోదశ 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం రెండో విడతలో హంద్రీనీవా పనులు ఒక్క కిలోమీటరు చేయకుండా కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికి లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే హంద్రీ–నీవా పనులను చంద్రబాబు తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీవీరన్న, నాయకులు ఈడిగ ప్రసాద్, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని చంద్రబాబు, పవన్ నిలదీయాలి లైనింగ్ పనులతో హంద్రీనీవాకు మరణశాసనమే మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు
అనంతపురం అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొట్టిశ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో పొట్టిశ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలంటూ మద్రాసులో 1952 అక్టోబరు 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారం భించి డిసెంబరు 15న అసువులు బాసారన్నారు. ప్రతిఒక్కరూ ఆ మహనీయుడి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, తదితరులు పాల్గొన్నారు. అమ్మూ... ఇక నేను బతకలేనమ్మా! ● బేకరీ షాపు నిర్వాహకుడి ఆత్మహత్య బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇవే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలు.. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీ షాపులో పనిచేశాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రిన్షా, కుమారుడు రోహన్ ఉన్నారు. రిన్షా ప్రస్తుతం జపాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. రోహన్ బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా బేకరీ షాపులో వ్యాపారం సరిగా జరగకపోవడంతో జయప్రకాష్ ఆందోళన చెందుతుండేవాడు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని భయపడేవాడు. ఈ విషయాలను భార్యతో చెప్పుకుని మదనపడుతుండేవాడు. అమ్మూ (రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదంటూ బాధ పడేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే ఆమె బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడుకు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. అతడు వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీటెక్ విద్యార్థి అదృశ్యం
నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పుట్లూరు: నాయకునిపల్లి సమీపంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో రామమునిరెడ్డి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్శాఖలో సిబ్బంది కొరత కారణంగా కొన్నేళ్లుగా రామమునిరెడ్డి ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి సహాయకుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో పుట్లూరుకు చెందిన ఓబులేసు పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తున్న సమయంలో షాక్కు గురై చనిపోయాడు. ఎస్ఐ వెంకటనరసింహ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామమునిరెడ్డి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 2024–25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంటెక్ నాలుగో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ, ఎం ఫార్మసీ నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఒకటో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–25), రెగ్యులర్ ఒకటో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, ఫార్మా డి నాలుగు, మూడో, రెండో సంవత్సరం (ఆర్–17) అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించండి అనంతపురం అగ్రికల్చర్: అరటికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పండ్లతోటల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం సంఘం నాయకులు కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, శ్రీనివాసులు తదితరులతో కలిసి ఉద్యాన శాఖ కార్యాలయంలో డీడీ బీఎంవీ నరసింహారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా నార్పల, పుట్లూరు, యల్లనూరు, బెళుగుప్ప, యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో 13 వేల మంది వరకు రైతులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నారన్నారు. గ్రాండ్–9 రకం అరటి ఏటా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందన్నారు. అరబ్ దేశాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోందన్నారు. అయితే నెల కిందట వరకు టన్ను రూ.26 వేల వరకు పలికిన అరటి ధర ఇపుడు రూ.13 వేలు, రూ.14 వేలకు ధర పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీలకు సరఫరా చేసే దళారులు కుమ్మకై ్క రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నట్లు తెలిపారు. టన్ను రూ.26 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామలింగచౌదరికి అవార్డు అనంతపురం: ఎస్కేయూలోని గ్రామీణాభివృద్ధి శాఖలో అకడమిక్ కన్సెల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ జి.రామలింగచౌదరికి భారత మానవాభివృద్ధి శాఖ అవార్డు ప్రదానం చేసింది. భారత సామాజిక మండలి శాస్త్ర పరిశోధన సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఎస్కేయూ గ్రామీణాభివృద్ధి విభాగంలో మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి.శ్రీధర్ పర్యవేక్షణలో ‘కరువు ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధి భద్రతను మెరుగుపరచడం’పై పరిశోధనలు చేశారు. అంతేకాకుండా పలు అంతర్జాతీయ సదస్సుల్లో గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ నీటి పారుదల సౌకర్యాల ప్రాధాన్యతలను గురించి అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రామలింగచౌదరిని పలువురు అభినందించారు. -
దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్
తాడిపత్రి: చుక్కలూరు పారిశ్రామికవాడలో రెండు రోజుల క్రితం మహిళను బెదిరించి రూ.10 వేలు దోచుకెళ్లిన ఘటనలో రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశార. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివవగంగాధర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. పారిశ్రామిక వాడలోని ఓ నల్లబండల పరిశ్రమను వెంకటేశ్వరమ్మ, కళాచారి దంపతులు బాడుగకు తీసుకుని నడుపుతున్నారు. ఈ నెల 14న తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామానికి చెందిన నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడులు ద్విచక్రవాహనంపై నల్లబండల పరిశ్రమ వద్దకు వెళ్లారు. అక్కడ కళాచారిని ఒకరు మాటల్లో పెట్టి.. మరొకరు ఇంట్లోకి చొరబడి వెంకటేశ్వరమ్మను గొంతు పిసికి, చంపుతామని, బెదిరించి, ఆమె వద్ద ఉన్న రూ.10 వేల నగదు లాక్కుని బైక్పై ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడును చుక్కలూరు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపినట్లు రూరల్ సీఐ తెలిపారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన రూరల్ ఎస్ఐ ధరణీబాబు, ఏఎస్ఐ కాటమయ్య, కానిస్టేబుళ్లు అంకన్న, సుధాకర్లను సీఐ అభినందించారు. -
కొడుకు లేని జీవితం వద్దని..
● రైలుకిందపడి తల్లి ఆత్మహత్య తాడిపత్రి: ప్రేమ వివాహానికి తాను అంగీకరించకపోవడం వల్లే తనయుడు ప్రాణం తీసుకున్నాడని మనోవేదనకు గురైన తల్లి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన వివరాలిల ఉన్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన కొండజోగుల శైలజ (40), సురేంద్రబాబు దంపతులకు శ్రీచరణ్ ఏకై క సంతానం. కుమారుడు అనంతపురంలో డిప్లొమా పూర్తి చేశాడు. శ్రీచరణ్ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు కొద్ది రోజుల క్రితం వీరిద్దరి వివాహం చేసేందుకు ఒప్పుకోవాలని శైలజను కోరారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో శ్రీచరణ్ అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లిలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తాడిపత్రిలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడి చావుకు కారణమయ్యావంటూ బంధువులు, కుటుంబ సభ్యులు విమర్శలు చేయడంతో మానసికంగా కుంగిపోయిన శైలజ శనివారం ఉదయం రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ నాగప్ప తెలిపారు. మగ్గం వర్క్పై ఉచిత శిక్షణ అనంతపురం: రూడ్సెట్ సంస్థలో ఏప్రిల్ 3 నుంచి నెల రోజులపాటు నిరుద్యోగ మహిళలకు జర్దోసి మగ్గం వర్క్పై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వారై ఉండి, ఆధార్, రేషన్ కార్డు కలిగిన మహిళలు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 94925 83484 నంబరులో సంప్రదించాలన్నారు. -
పాలనలో పారదర్శకత పాటించాలి
అనంతపురం అర్బన్: పాలనలో పారదర్శకత పాటించినప్పుడే విమర్శలకు, ఆరోపణలకు అవకాశం ఉండదని జిల్లా ఇన్చార్జ్ అధికారి, రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి వివిధ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మండలస్థాయిలో అధికారుల బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింతగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని పారిశ్రామికవేత్తలకు అందించాలని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఏపీఐఐసీ కింద పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అన్ని పంచాయతీల్లో పూర్తి చేయాలన్నారు. డ్వామా కింద కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం
గుంతకల్లుటౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్’ కార్యక్రమంపై శనివారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన ప్రవర్తనలో కూడా స్వచ్ఛత ఉండాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్కు స్వస్తి చెప్పాలని కోరారు. స్వచ్ఛభారత్ నిర్మాణానికి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కాగా ప్లాస్టిక్ భూతాల వేషధారణలతో పారిశుధ్య కార్మికులు అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.భవానీ, ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ నయీమ్ అహ్మద్, డీఎల్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకే గుండాల తండా ఆదర్శం కావాలి.. గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని గుండాల తండా గ్రామం జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శం కావాలని, ఆ విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గుండాల తండాలో నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలను ప్రారంభించారు. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లుగా గ్రామాన్ని కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలి గుంతకల్లుటౌన్: ‘విలువలతో కూడిన విద్యకు మార్కులతో కొలమానం లేదు. విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ విలువలతో కూడిన విద్యనభ్యసించాలి’ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి అన్నారు. స్థానిక శ్రీవివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో పాఠశాల 24 వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నైపుణ్యాలను పాఠశాల నుంచే అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు గొప్పగా తయారవుతారని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, విద్యాసంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మంజునాథ్, కరస్పాండెంట్ ఓంకారప్ప, తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్
● రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు పెనుకొండ: పరీక్షల వేళ సెల్ఫోన్ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్ఫోన్ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. చెట్టుపైనుంచి పడి కూలీ మృతి కుందుర్పి: శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. -
వైభవంగా శివలక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
పెద్దవడుగూరు(యాడికి): యాడికిలోని శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంరించిన రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. వేలాది భక్తుల చెన్నకేశవస్వామి నామస్మరణతో రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆర్యవైశ్య వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వైఎస్సార్సీపీ నాయకులు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు స్వామి లడ్డూ, చిత్రపటాలను పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాలు, ఆటబొమ్మలు, వివిధ రకాల దుకాణాలు వెలియడంతో యాడికిలో సందడి నెలకొంది. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రతాప్రెడ్డి, ఆలయ ఈఓ దుర్గప్రసాద్, గ్రామపెద్దలు పాల్గొన్నారు. వేలాది మంది భక్తుల నడుమ సాగుతున్న రథోత్సవం -
●గరుడ వాహనంపై దేవ దేవుడు
కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణ మధ్య ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు అంజన్ కుమార్ ఆచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్ఠమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, బాధల నుంచి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి ఈ వాహన సేవకు ప్రాధాన్యత ఉంది. రాజగోపుర దర్శనానికి పోటీ ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మ గరుడ సేవలో తూర్పు రాజగోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పు అయిన నృసింహుడిని అక్కడ దర్శించుకోవడానికి పోటీ పడ్డారు. విద్యుత్ దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా బేరి వర్తకులు బీపీ నారాయణప్ప శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండలం జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాకర్తలపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. గురువారం రాత్రి బాలంపల్లి వైపు నుంచి వస్తున్న అశ్వర్థ, దేవేగౌడలపై మార్గ మధ్యంలో కాపుకాచిన టీడీపీ కార్యకర్తలు సాయికుమార్, శ్రీనివాసులు, గోవిందప్ప మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి శుక్రవారం హిందూపురం జిల్లా సర్వజనాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. అనంతరం వేణురెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నేతల అరాచాకాలను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత కక్షలే దాడులకు కారణమని, ఇరుపక్షాలపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ఆంజనేయులు ప్రకటించారు. నిందితులు టీడీపీ కార్యకర్తలు -
ఆర్డీటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి విషద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు..పట్టణానికి చెందిన ఎరుకల మల్లికార్జున స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో అకౌంటెంట్గా పని చేసేవాడు. శుక్రవారం ఉరవకొండ శివారులో విషద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు అనంతపురం తీసుకెళ్లారు. బాధితుడి నుంచి పోలీసులు సూసైట్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఇలా.. ‘ఆరేళ్లుగా ఉరవకొండ, గుంతకల్లు ఆర్డీటీ కార్యాలయాల్లో అకౌంటెంట్గా పని చేశా. కొంత కాలం క్రితం ఏటీఎల్ గ్రామస్వరాజ్యనిధి చెక్కును ఇచ్చి విత్డ్రా చేసుకురావాలని ఆదేశించారు. వారు చెప్పిన విధంగా డ్రా చేసి మొత్తం నగదు వారికి అందించా. ఉరవకొండ, గుంతకల్లు నుంచి బదిలీ అయ్యే సమయంలో రికార్డులన్నీ పరిశీలించి, నా నుంచి ఎలాంటి డ్యూస్ లేవని క్లియరెన్స్ చేసి సీనియర్ అకౌంటెంట్ నాకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే గ్రామ స్వరాజ్య నిధులు తానే స్వాహా చేసినట్లు అధికారులు ఆరోపించి తన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి ఆర్డీటీ ఆఫీసుకు పిలిచి డబ్బు కట్టాలని బెదిరించాడు. డబ్బు మొత్తం ఆర్డీటీ అధికారులకు ఇచ్చా. ఇందులో నా ప్రమేయం లేదు. ఆర్డీటీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ లేఖలో పొందుపరిచాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్ -
ఉపాధ్యాయులను విస్మరించిన ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోచంరెడ్డి అశోక్కుమార్రెడ్డి విమర్శించారు. ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్కు ప్రభుత్వ గుర్తింపు వచ్చి ఏడాదైన సందర్భంగా శుక్రవారం నగరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో సక్సెస్ స్కూల్స్ ద్వారా ఇంగ్లిష్ మీడియంను తీసుకొచ్చి 36 వేలమంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. వివిధ డీఎస్సీల ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులు రెండేళ్ల అప్రెంటిస్ పీరియడ్ చేసి సర్వీస్ చేసినందుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ పక్షపాతిగా వ్యవహరించారన్నారు. తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేశారన్నారు. ఈ కారణంగా దాదాపు 30 వేల మంది టీచర్లు ప్రమోషన్లు పొందారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మార్చారన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల హామీలను తొమ్మిది నెలలు పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్స్, ఆర్జిత సెలవుల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్టీఏ గుర్తింపుకు కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధీర్కు జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణ, గోపాల్, రామకృష్ణ, జిల్లా నాయకులు ఓబిరెడ్డి, కేశవరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి -
మద్యం మత్తులో యువకుడి మృతి
కంబదూరు: మండల కేంద్రంలో ఓ యువకుడు మద్యం మత్తులో వరి మడిలోకి జారిపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కంబదూరుకు చెందిన రామాంజినేయులు, మణెమ్మ దంపతుల కుమారుడైన అజయ్కుమార్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వరి పంటకు నీళ్లు కట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో వరి మడిలో జారిపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో బురదలో నుంచి పైకి లేవడానికి చేతకాక ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి మొదటి భార్య వదిలేయడంతో మూడు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. చీనీచెట్లు దగ్ధం ఆత్మకూరు: వడ్డుపల్లిలో రైతు ఓబిరెడ్డికి చెందిన చీనీ చెట్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. బాధితుడి వివరాల మేరకు..రైతు నాలుగేళ్ల క్రితం 4 ఎకరాల్లో 600 చీనీచెట్లు సాగు చేశాడు. ఇందుకోసం దాదాపు రూ.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. ఈ ఏడాది కాపు వదలాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగి చీనీచెట్లు, చింతచెట్లు, డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు. బాలుడిపై దాడి గుత్తి రూరల్: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్లో ఓ బాలుడిపై శుక్రవారం ఇంటి పక్కన వారు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి బంధు వులు తెలిపిన వివరాలు.. కల్లూరు ఆర్ఎస్కు చెందిన రామాంజనేయులుకు ఇంటి పక్కన వారితో చిన్నపాటి విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి రామాంజనేయులుపై ఇంటి పక్కన వారు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తన తండ్రిని కొడుతున్నారని బాలుడు యహోషువా వెళ్లి అడ్డుపడ్డాడు. దీంతో వారు అతడిపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాలుడిని గుత్తిలో ఉన్న బంధువులు వెంటనే కల్లూరు నుంచి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
కమిషన్ గురించి తెలుసుకోవాలి
మేము 30 ఏళ్లుగా వినియోగదారుల సమస్యలపై పోరాడుతున్నాం. సమాజంలో ఎన్ని రకాలుగా మోసపోతున్నామో అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు చైతన్యవంతులుగా మారి.. ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలి. వినియోగదారులు పొందాల్సిన వస్తు సేవల్లో నాణ్యత లేకపోయినా చూసీచూడనట్టు వదిలేయడం వల్లే సమాజంలో నానాటికీ మోసాలు మరింత పెరుగుతున్నాయి. కార్మిక న్యాయస్థానాలు, వినియోగదారుల కమిషన్ గురించి అవగాహన ఉండాలి. అప్పుడే వ్యాపారుల్లోనూ, అధికారుల్లోనూ చలనం ఉంటుంది. చట్టం గురించి తెలుసుకున్న వారు ఎన్నో విజయాలను సాధించారు. – చల్లా కిషోర్, వినియోదారుల సంఘం రాష్ట్ర సభ్యుడు -
అనంతలో పరిశ్రమల స్థాపనకు కృషి
● పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకూలమని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం ఆయన తాడిపత్రిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి స్వగృహానికి వెళ్లిన ఆయన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో విస్తారంగా గనులు ఉన్న కారణంగా లభ్యమయ్యే ముడిసరుకు ఆధారిత పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆజాద్గ్రూప్, సోలార్ సంబంధిత ప్రాజెక్ట్లు క్లియర్ అయ్యాయన్నారు. ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్వీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్కు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దానిమ్మ తోట దగ్ధం రాయదుర్గంటౌన్: జుంజురాంపల్లిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దానిమ్మ చెట్లు, డ్రిప్ పరికరాలు దగ్ధమయ్యాయి. బాధిత రైతు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు మఠం తిప్పేస్వామి నాలుగెకరాల్లో దానిమ్మ సాగు చేశాడు. విద్యుత్ ప్రధాన తీగలు షార్ట్సర్క్యూట్ జరిగి నిప్పులు కిందున్న ఎండుగడ్డిపై పడటంతో మంటలు చెలరేగి పొలమంతా వ్యాపించాయి. దీంతో దానిమ్మ చెట్లు, డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ఘటనలో రూ.8 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. టీకాలతో గాలికుంటు నివారణ శింగనమల: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ రమేష్రెడ్డి తెలిపారు. మండలంలోని గుమ్మేపల్లిలో శుక్రవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు త్వరగా వ్యాపిస్తుందన్నారు. పాడి పశువులు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. గాలికుంటు నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువైద్యాధికారి మల్లిక, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
బ్రహ్మసముద్రం: వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాలు..పాలవెంకటాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు నటరాజ్ , ప్రశాంత్ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భీం రాజ్తో కలిసి కర్ణాటకలోని మొలకాల్మూరు కోర్టుకు హాజరై బొలెరో వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం వద్దకు రాగానే పూటుగా మద్యం సేవించిన టీడీపీ కార్యకర్తలు వినాయక్, గొల్ల శివ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో వాహన అద్దం ధ్వంసమైంది. ఘటనపై బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిజ్వాన్ ● మరికొందరికి రాష్ట్ర కమిటీలో చోటు అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాగజ్ఘర్ రిజ్వాన్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రిజ్వాన్ గతంలో వక్ఫ్బోర్డు జిల్లా చైర్మన్గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా షేక్ రహ్మంతుల్లా, దాండియా ఖాజామైనుద్దీన్, ఎస్ తబ్రిజ్ షోకత్ హామి, వీ అబుజార్ నదీం అహ్మద్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ అఫ్జల్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా షేక్ నియాజ్ అహ్మద్, రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా పీ మంజునాథ్ యాదవ్ నియమితులయ్యారు. పావురం గుడ్ల కోసం వెళ్లి.. ● బావిలో పడి చిన్నారి మృతి రాప్తాడు: పావురం గుడ్ల కోసం వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి చెందిన ఘటన భోగినేపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పామాల లక్ష్మి ఏకై క కుమారుడు పామాల పునీత్కుమార్ (8) శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. హోలీ సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పాడు బడిన బావి వద్దకు వెళ్లారు. బావిలోని రంధ్రాల్లో ఉన్న పావురాల గుడ్ల వెతుకుతుండగా పునీత్కుమార్ కాలుజారి బావిలో పడిపోయాడు. చిన్నారి స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడికి చేరుకుని వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతదేహంపై పడి చిన్నారి తల్లి రోదించిన తీరు పలువురి కంట నీరు తెప్పించింది. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం చిన్నారి తండ్రి నారాయణస్వామి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. -
నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం
●తూకాలు, కొలతలు, వస్తు నాణ్యతలో తస్మాత్ జాగ్రత్త ●మోసాలను అడ్డుకోకపోతే తప్పదు భారీ మూల్యం అనంతపురం /అనంతపురం కల్చరల్: అనంతపురంలో కలెక్టరేట్ సమీపంలోని పెన్నార్ భవన్కు ఎదురుగా ఒక వినియోగదారుడు కిలో ఆపిల్ పండ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చి ఎలక్ట్రికల్ వేయింగ్ మెషిన్లో చూడగా 800 గ్రాములు మాత్రమే వచ్చింది. పాతూరులో ఓ వినియోగదారుడు మూడు కేజీల ఉల్లిపాయలు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లో చూడగా 2.5 కేజీలు మాత్రమే ఉన్నాయి. ఇలా వీరిద్దరే కాదు ప్రతిచోటా సరుకు తూకాలు, కొలతలు, నాణ్యత తదితర విషయాల్లో వినియోగదారులు బోల్తాపడుతూనే ఉన్నారు. సేవల్లో లోపాలున్నా భరిస్తూనే ‘ఇదంతా మూమూలే’ అనుకుని సర్దుకుపోతున్నారు. ఇలాంటి సమయాల్లో వినియోగదారులకు అండగా అనేక చట్టాలు, కమిషన్లు పనిచేస్తున్నాయి. ఏ మాత్రం ఖర్చు లేకుండానే మధ్యవర్తిత్వం ద్వారానో, కమిషన్ ద్వారానో న్యాయ పోరాటం చేసి నాణ్యమైన వస్తు సేవలను పొందవచ్చు. జిల్లాలో పదుల సంఖ్యలో వినియోగదారుల సంఘాలుండేవి. 2016 తర్వాత వాటిలో చురుగ్గా పనిచేసే 18 సంఘాల వారు ఏకమై ‘వినియోగదారుల సంఘాల సమాఖ్య’ ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించే సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మార్చి 15న ‘అంతర్జాతీయ వినియోదారుల హక్కుల పరిరక్షణ దినం’ నిర్వహించుకుంటున్నాం. ఫిర్యాదు చేయండిలా.. వినియోగదారులు ఎవరైనా మోసపోయినపుడు తెల్ల కాగితంపై అర్జీ రాసి జిల్లా స్థాయిలో డీసీఐసీ, మండల స్థాయిలో ఎంీసీఐసీ ద్వారా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసినట్లు రసీదు కచ్చితంగా ఉండాలి. విక్రయించే ప్రతి వస్తువుపైనా ఎంఆర్పీ, తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్, వినియోగదారుల హెల్ప్లైన్కు చెందిన నంబరు విధిగా ముద్రించి ఉండాలి. అలా లేని పక్షంలో వస్తువుల విక్రయ దుకాణాలపై ప్రభుత్వం జరిమానా విధించాలి. అనుమతి లేకుండా సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో తేడాలున్నా, సేవల్లో లోపాలను పసిగట్టినా.. ప్రశ్నించి న్యాయం పొందడానికి చట్టాలపై అవగాహన ఉండాలి. వినియోగదారులు మోసపోతే తగిన ఆధారాలతో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019 ద్వారా పరిహారం పొందవచ్చు. జిల్లా కమిషన్ ఎదుట కోటి రూపాయల పరిహారం లోపు. రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య రాష్ట్ర కమిషన్ ఎదుట. రూ.10 కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన్ ఎదుట దాఖలు చేయవచ్చు. వినియోగదారులు ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. సందర్భంబ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన ఎరుకల అంజనప్ప గతేడాది సత్తార్ అనే వ్యాపారి వద్ద వేరుశనగ విత్తనం కొన్నాడు. నాసిరకం విత్తనం కావడంతో పంట పూర్తిగా నష్టపోయాడు. జరిగిన నష్టాన్ని వినియోగదారుల సంఘం ద్వారా పోరాడి ఎకరాకు రూ.15 వేల చొప్పున నష్టపరిహారం పొందాడు. రశీదు ఉండడంతో వినియోదారు సమాఖ్య ద్వారా న్యాయపోరాటం చేయగలిగాడు. రాయదుర్గంలో విశ్రాంత హెచ్ఎం సత్యనారాయణ తన ఇంటి వద్ద తోట ఏర్పాటు చేసుకుని, సపరేటు మీటర్ ద్వారా కరెంటు వినియోగిస్తున్నారు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కమర్షియల్ కేటగిరీ కిందకు మార్చేసి రూ.400 వచ్చే బిల్లును ఏకంగా రూ.11 వేలకు ఇచ్చారు. బిల్లు చెల్లించలేదని కరెంటు సరఫరా నిలిపివేశారు. అధికారులకు అడిగినా లాభం లేకపోవడంతో వినియోగదారు సమాఖ్య ద్వారా మధ్యవర్తిత్వం చేయించారు. కరెంటు సరఫరా పునరుద్ధరణతో పాటు గతంలో ఎంత బిల్లు వచ్చేదో ఇప్పుడూ అంతే బిల్లు వస్తోంది. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
● చట్టాన్ని టీడీపీ చుట్టంగా మార్చుతున్న పోలీసులు ● ఏకపక్షంగా వెళ్తామంటే చూస్తూ ఊరుకోం ● రైతుల సమస్యలపై రాజీ పడను...జైలుకు వెళ్లేందుకూ సిద్ధం ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీమేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడా నిర్భందాలు చేయలేదు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీ వారిని పిలిపించి అక్రమ కేసులు బనాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రౌడీ రాజ్యం నడుస్తోంద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో కురుబ బాలన్న అనే యువకుడిని టీడీపీ వారు కట్టెలతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. సిద్ధరాంపురం ఏమైనా పాకిస్తాన్లో ఉందా.. అందుకు ప్రత్యేక వీసాలు కావాలా.. అని ప్రశ్నించారు. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి వెళ్తుంటే దాదులూరు వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు వచ్చి అడ్డుకుని బందోబస్తు ఇవ్వలేమని పర్యటన వాయిదా వేసుకోవాలంటూ చెప్పారన్నారు. పోలీసులు ప్రజల కోసమా..సునీత కోసమా? పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ కోసం పని చేస్తున్నారా? లేదంటే టీడీపీని బలపరిచేందుకు పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లికి వస్తే పెద్దపెద్ద గొడవలు అవుతాయని రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ చెబుతున్నారని, ఆయన టీడీపీ ఏజెంటుగా పని చేస్తున్నారా? అని నిలదీశారు. ఊరిలో లేని సమస్యను సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వాళ్లకు లేని ఉద్దేశాలను ఎస్ఐ కల్పిస్తూ ఎస్పీ, డీఎస్పీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు స్టేషన్కు వెళ్తే అగౌరవంగా మాట్లాడటడంతోపాటు కింద కూర్చోమని చెబుతారని ఎస్ఐ సుధాకర్యాద్పై మండిపడ్డారు. సీఐ, ఎస్ఐలు పద్ధతులు మార్చుకోవాలి అనంతపురం రూరల్ మండలంలోని తమ పార్టీ నేతలను పోలీస్స్టేషన్కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. పుట్టపర్తిలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్లడంతో వారికి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. జనాలను బాగా పిలుచుకెళ్లిన లీడర్లను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ చుట్టంగా మార్చొద్దని పోలీసులకు హితవు పలికారు. తాను గుండీలు ఇప్పుతా రా కొట్లాడదామని రాప్తాడు సీఐ పిలుస్తారని, ఆయన సీఐనా రౌడీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో లాఅండ్ ఆర్డర్ సమస్యంతా ఇటుకలపల్లి సీఐతోనే ఉత్పన్నమవుతోందన్నారు. తోపుదుర్తిలో 30 మంది ఇంట్లోకి దూరి మహిళపై దాడి చేస్తే..బాధితులపైనే కేసు కడతాడన్నారు. వారి ఆగడాలు చూస్తూ ఊరుకున్నారంటే తాము సంయమనం పాటించమని చెప్పడమే కారణమనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికై నా ఇటుకులపల్లి, రాప్తాడు సీఐలు, రామగిరి ఎస్ఐ పద్ధతులు మార్చుకోవాలని హితవుపలికారు. చంద్రబాబు, సునీత చరిత్రహీనులుగా నిలిచిపోతారులైనింగ్పనులు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని, దీనిపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకాష్రెడ్డి అన్నారు. ఈ పనులు జరిగితే చంద్రబాబు, పరిటాల సునీత చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు. నియోజకవర్గ రైతుల సమస్యలపై రాజీ పడననని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. సిద్ధరాంపురం గ్రామానికి చెందిన బాధితుడు కురుబ బాలన్నను పరామర్శించడానికి వెళ్లనీయకపోవడంతో ఇక్కడికే బాధితుడిని పిలిపించి మీడియాకు చూపించారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనరు బాలపోతన్న, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, రామగిరి కన్వీనర్ మీనుగ నాగరాజు పాల్గొన్నారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ ఆదేశించారు. ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లాలోని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శామ్యూల్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్దన్నారు. తప్పులు లేని సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకమని, ఎవరూ స్వల్పకాలిక ప్రయోజనాలకు ఆశ పడొద్దని హితవు పలికారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ పాల్గొన్నారు. గంట ఆలస్యంగా సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుందని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సమాచారం అందించారు. వారంతా 1.30 గంటలకే చేరుకున్నారు. అయితే 3 గంటల తర్వాత సమావేశం ప్రారంభం కావడంతో ఉసూరుమన్నారు. జిల్లా సరిహద్దు మండలాల స్కూళ్ల నుంచి ఉదయం బయలుదేరి వచ్చామని, ఇంత ఆలస్యంగా ప్రారంభమైతే తాము తిరిగి ఊళ్లకు ఎలా వెళ్లాలంటూ వాపోయారు. కోడింగ్లో పొరబాట్లకు తావివ్వొద్దు పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్లో పొరబాటుకు తావివ్వొద్దని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సూచించారు. అనంతపురంలోని సైన్స్ కేంద్రంలో రాయలసీమ జిల్లాల్లోని కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్జేడీ మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నారు రెగ్యులర్ పరీక్షలతో పాటు ఓపెన్ పరీక్షలకు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల డీఈఓలు తదితరులు పాల్గొన్నారు. -
కంబదూరులో చిరుతల హల్చల్
కంబదూరు: మండల కేంద్రంలోని సిద్దుల కొండ సమీపంలో గురువారం చిరుతలు హల్చల్ చేశాయి. కొండ సమీపంలో ఉన్న తమ వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులకు కనిపించాయి. దీంతో భయాందోళన చెందిన రైతులు పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పెద్దోడు అనే రైతు వాటి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయని రైతులు తెలిపారు. గుడ్డు.. వెరీ బ్యాడు! కూడేరు: ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారు. వాటిని పిల్లలు తినలేక పారేస్తున్నారు. గురువారం కూడేరు మండల పరిధిలోని ఎంఎంహళ్లి ప్రాథమిక పాఠశాలలో ఉడకబెట్టిన కోడి గుడ్లు కుళ్లిపోయాయి. తెల్లటి సొన నల్లగా మారింది. మండలంలోని పాఠశాలలకు కొన్ని రోజులుగా ఏజెన్సీ నిర్వాహకులు నాసిరకం కోడి గుడ్లు సరఫరా చేస్తున్నారు. దీంతో పిల్లలు వాటిని తినకుండా పారేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. చిక్కీలో పురుగులు.. అధికారుల పరుగులు! అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని కస్తూరిబా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలకు సరఫరా చేసిన చిక్కీల్లో పురుగులున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తి నేరుగా సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు మొబైల్కు ఓ వీడియో పంపడం కలకలం రేపింది. ఆయన వెంటనే పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్కు దాన్ని పంపి విచారణకు ఆదేశించారు. గురువారం జిల్లా పర్యటనలో ఉన్న ఆర్జేడీ...మధ్యాహ్నం ఉరుకులు, పరుగుల మీద పాతూరులోని కస్తూరిబా బాలికల పాఠశాలకు వెళ్లారు. ఆయనతో పాటు డీఈఓ ప్రసాద్బాబు, డీవైఈఓ శ్రీనివాసరావు, విద్యాశాఖ ఏడీ కృష్ణయ్య, తమ సిబ్బందితో వెళ్లారు. ఒకేమారు ఇంతమంది అధికారులు రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. కోడిగుడ్లు, చిక్కీలు ఉంచిన గది తాళాలు తెప్పించి చిక్కీల ప్యాకెట్లన్నీ పరిశీలించారు. ఫిబ్రవరి 17వ తేదీ, ఈనెల 4వ తేదీతో ముద్రించిన చిక్కీలను గుర్తించారు. వాటన్నింటినీ పాకెట్లు తీసేసి ఒక్కొక్కటీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ ఒక్క చిక్కీలోనూ పురుగులు కనిపించలేదు. ఆర్జేడీ, డీఈఓ అక్కడి నుంచి వెళ్లిపోయినా డీవైఈఓ, ఏడీ రెండుగంటలకు పైగా పరిశీలించారు. ఈ మొత్తం వ్యవహారమంతా వీడియో రికార్డ్ చేశారు. చివరకు ఎస్పీడీ నుంచి వచ్చిన వీడియో ఇక్కడికి సంబంధించినది కాదని తేల్చారు. విషయాలన్నింటిపై ఎస్పీడీకి నివేదిక పంపుతున్నామని డీఈఓ తెలిపారు. -
హనుమద్వాహనంపై నృసింహుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి అనంత పురం జిల్లా వాసులే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం ఖాద్రీశుడు హనుమద్వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించినట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడు శుక్రవారం (నేడు) గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమివ్వనున్నారు. నృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే ‘కదిరి పున్నమి’ పేరుతో పండుగ జరుపుకుంటారు. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు -
పరీక్షలు ముగిశాయ్.. ఇక ఎంజాయ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 1న ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ పేపర్–1, కామర్స్ పేపర్–1, సోషియాలజీ పేపర్–1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు ఈనెల 17, 19న ఉంటాయి. ఇక.. చివరిరోజు పరీక్షకు 806 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 24,159 మందికి గాను 23,489 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,878 మందికి గాను 1,742 మంది హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్ 4, కమిటీ సభ్యులు 5, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 14, కస్టోడియన్లు 11 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సందడే సందడి పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు సందడి సందడి చేశారు. చాలారోజులుగా జిల్లా కేంద్రంలో అద్దె గదులు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు పరీక్షలు పూర్తవగానే కేంద్రాల వద్ద సంతోషంగా గడిపారు. ఒకరికొకరు సెండాఫ్ చెప్పుకున్నారు. లగేజీలతో సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తమ వెంట పిలుచుకెళ్లారు. ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. -
మొల్లమాంబ మహోన్నతురాలు
అనంతపురం అర్బన్: మొల్లమాంబ మహోన్నతురాలని కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కొనియాడారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న ముఖ్యఅతిథులుగా హాజరై మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ మొల్లమాంబ రాయలసీమలో జన్మించడం గర్వకారణమన్నారు. వాల్మీకి రామాయణం సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగులో రచించారని, ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. మొల్లమాంబ చరిత్రను భావితరాలకు అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కుమ్మరుల సమస్యలను సంఘం నాయకులు, కులపెద్దలు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి అభ్యున్నతికి సంపూర్ణంగా కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు. అనంతరం బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాధిక, కుమ్మర శాలివాహన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కుమ్మర ఓబుళపతి, జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, నాయకులు ఓబులేసు, పోతులయ్య, వెంకటరమణ, రమణ, బానుకోట రామాంజినేయులు, గోపాల్, సహకార సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి ప్రతిబింబించేలా ‘కాఫీ టేబుల్ బుక్’ జిల్లాలో చారిత్రాత్మక సంస్కృతి ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ‘కాఫీ టేబుల్ బుక్’ రూపొందించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరన్స్ హాల్లో జిల్లా టూరిజం కౌన్సిల్ (డీటీసీ) సమావేశం నిర్వహించారు. అధికారులు, ఇంటాక్ సభ్యులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చారిత్రక కట్టడాలు, సందర్శన స్థలాలు, వ్యవసాయం, పంటలు, పర్యాటకం, దేవాలయాలు, ప్రాచీన చెరువులు, హస్త కళలు, సంప్రదాయ వంటలు, సంస్కృతి సమాచారం సేకరించాలన్నారు. కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని సమగ్ర ‘కాఫీ టేబుల్ బుక్’ను రూపొందించి, సందర్శకులకు అందుబాటులో ఉండేలా ఇన్స్టిట్యూట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రాంగణాల్లో ఉంచాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, పురావస్తు శాఖ ఏడీ రజిత, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, దేవదాయశాఖ అధికారి ఆదిశేషునాయుడు, ఇంటాక్ కన్వీనర్ రామ్కుమార్, ఇతర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ -
ఫిర్యాదులొచ్చాయి..
ఔషధ నియంత్రణ శాఖపై ఫిర్యాదులొచ్చిన మాట వాస్తవమే. ఈ విభాగాన్ని పూర్తిగా గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు చేపట్టాం. వసూళ్లకు పాల్పడిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాం. –వినోద్ కుమార్, కలెక్టర్ ● అనంతపురం సుభాష్ రోడ్డులో ఉన్న కొన్ని బడా మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్లు లేకుండానే మందులు అమ్ముతున్నారు. రోజూ వేల మందికి మాత్రలు కట్టబెట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ షాపులవైపు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ● నెలరోజుల క్రితం అనంతపురం సాయినగర్లో ఆయుర్వేద డాక్టర్ ఒకరు అల్లోపతి మందులు అమ్ముతూ విజిలెన్స్ తనిఖీల్లో దొరికారు. ఏళ్ల తరబడి ఆయన ఈ పని చేస్తున్నట్లు వెల్లడైంది. ● ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో ఓ ఆర్ఎంపీతో చికిత్స చేయించుకున్న వ్యక్తి మృతి చెందాడు. సదరు ఆర్ఎంపీ ప్రమాదకర మందులు వినియోగించడం వల్లే రోగి పరిస్థితి విషమించినట్లు వెల్లడైంది... ఇవొక్కటే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మందుల షాపుల నిర్వాహకులు, ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కానరావడం లేదు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఔషధ నియంత్రణ వ్యవస్థ నీరుగారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ మందులతో రోగులకు హాని జరగకుండా చూడాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు నెలవారీ మామూళ్లతో తనిఖీలే మరచిపోయారు. ఏ మందుల షాపులో ఎలాంటి మందులు అమ్ముతున్నా అడిగేవారు లేరు. నాసిరకం మందులతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. కొత్త లైసెన్సు కావాలంటే డబ్బు, ఫార్మసిస్ట్ లేకుండా అమ్ముతుంటే డబ్బు,ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతుంటే తనిఖీ చేయకపోవడానికి డబ్బు.. ఇలా ఒకటేమిటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రగ్ అధికారులు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారు. నిబంధనలు తుంగలోకి.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,150 వరకూ హోల్సేల్, రీటెయిల్ మందుల షాపులున్నాయి. వీటిల్లో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలన్నీ అమలు కావడం లేదు. మండలస్థాయిలో ఉన్న షాపులు ఆరు మాసాలకు రూ.3 వేలు, అదే అర్బన్లో అయితే ఆరుమాసాలకు రూ.5,500 లెక్కన ముట్టజెబుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు తాజాగా ఆ శాఖ ఏడీకి సెపరేటు కమీషన్ ఉన్నట్లు సమాచారం. ఏడాదిలో కనీసం రూ.2 కోట్ల వరకూ మెడికల్ షాపుల నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్కు, ఏడీలకు వెళుతున్నట్టు అంచనా. ఇందులోనే పై అధికారులకూ ఇస్తామని షాపుల యజమానులతో చెబుతున్నట్టు తెలిసింది. ఈ స్థాయిలో వసూళ్లు చేస్తున్నప్పుడు తనిఖీలు ఎలా చేస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ నిబంధనలు తప్పనిసరి.. ప్రతి మందుల షాపులోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. మందులు అమ్మిన ప్రతి బిల్లులోనూ పేషెంటు వివరాలు నమోదు చేయాలి. బిల్లులో మొబైల్ నంబరు కచ్చితంగా ఉండాలి. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదు. ఎన్ఆర్ఎక్స్ అంటే నార్కొటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు. షెడ్యూల్ బుక్ విధిగా నిర్వహించాలి. రెస్టిల్, ఆల్ప్రాక్స్, యాంక్సిట్, డైజోపాం, లోరాజెపామ్, క్లోనాజెపాం, కోడెయిన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఏ ‘మాత్రమూ’ తనిఖీల్లేవ్ మందుల షాపుల నిర్వాహకుల ఇష్టారాజ్యం ఏవి అమ్మినా.. ఎలా అమ్మినా అడిగే నాథుడే లేరు నార్కొటిక్స్ మందులూ విచ్చలవిడిగా విక్రయం మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు జిల్లాలో నీరుగారిపోయిన ఔషధ నియంత్రణ శాఖ -
విత్తనం.. లెక్కలేనితనం
ఏపీ సీడ్స్కు ‘చంద్ర’గ్రహణం ● బకాయిలు చెల్లించకుండా మొండికేసిన వైనం ● ఇటీవల రూ.100 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి అకౌంట్లు ఫ్రీజ్ ● ఖరీఫ్లో నాణ్యమైన విత్తన సరఫరాకు ఇబ్బందే అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయమే దండగని చెప్పే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు నాణ్యమైన విత్తనాలూ అందకుండా చేస్తోంది. ఏకంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)నే నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ఈ సంస్థకు బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన నిధులనూ వాడుకోకుండా బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. కనీసం రైతులు చెల్లించిన నాన్ సబ్సిడీ సొమ్ము కూడా పూర్తిస్థాయిలో అందకుండా చేసినట్లు తెలుస్తోంది. దీంతో రోజురోజుకూ ఏపీ సీడ్స్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందకుండాపోయే దుస్థితి నెలకొంది. అలా ఇచ్చి.. ఇలా లాగేసుకుంటోంది.. గతేడాది (2024–25) ఖరీఫ్, రబీ సీజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,79,245 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో పంపిణీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.261.09 కోట్లు బకాయి పడింది. ఇటీవల అందులో రూ.100 కోట్లు ఏపీ సీడ్స్ పీడీ అకౌంట్కు జమ చేస్తున్నట్లు జీఓ ఇచ్చారు. అయితే, సొమ్ము డ్రా చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్ జిల్లా అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు ఇస్తున్నట్లు బయట చెప్పుకోవడానికి తప్ప ఏపీ సీడ్స్కు పైసా అందించడం లేదు. గతంలో అంటే 2018–19లో అప్పటి చంద్రబాబు సర్కారు దిగిపోయే సమయంలో కూడా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి ఏపీ సీడ్స్కు రూ.171.99 కోట్ల బకాయి పెట్టింది. కూటమి సర్కారు ఇప్పుడూ అదే చేస్తోంది. ప్రభుత్వ నిర్వాకంతో ఏపీ సీడ్స్ రైతులను ప్రోత్సహించి, ఉత్పత్తి చేసిన సర్టిఫైడ్ సీడ్ను కొనలేదు. ఈ క్రమంలో రైతులు నాణ్యమైన సీడ్ను తక్కువ ధరకు బయటి సంస్థలు, వ్యక్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరోపక్క పంటలు పండించే రైతులు బయటి మార్కెట్లో నాసిరకం సీడ్ కొనుక్కోవాల్సి వస్తుంది. మొత్తంమీద అన్నదాతకు అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి ‘అనంత’ బకాయిలు రూ.94 కోట్లు గతేడాది ఖరీఫ్, రబీకి సంబంధించి ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఏపీ సీడ్స్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.94 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు పైసా విడుదల చేయలేదని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.దీనివల్ల రానున్న ఖరీఫ్ లో రైతులకు నాణ్యమైన విత్తనం సరఫరా కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 వేల క్వింటాళ్లు సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తికి రైతుల ద్వారా 3,500 ఎకరాల్లో వేరుశనగ, కంది పంటలను ప్రోత్సహించారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో రైతుల నుంచి నాణ్యమైన విత్తనం సేకరించడం కష్టమంటున్నారు. ఇప్పుడీ విత్తనం పరుల పాలవుతుందని, చివరకు మిల్లర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా నాసిరకం విత్తనం సరఫరా చేయాల్సి వస్తుందనే ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వంలో అవార్డులు.. గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏపీ సీడ్స్కు ఎప్పటికప్పుడు నిధులు అందేవి. దీనివల్ల రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ద్వారా గ్రామ స్థాయిలోనే రైతులకు ఏపీ సీడ్స్ నాణ్యమైన విత్తనం సరఫరా చేసేది. దీంతో రైతులకు ఖర్చు తగ్గి, పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చేది. ఏపీ సీడ్స్ నిర్వహించిన కీలక పాత్రతో 2021–22, 2022–23లో జాతీయ అవార్డులు కూడా అందుకుంది. 2022లో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు కూడా దక్కించుకుంది. -
●మద్యం.. మరణ శాసనం
కుటుంబాల్లో చిచ్చుపెట్టడంతో పాటు ఎందరినో బలితీసుకుంటున్న మద్యం మహమ్మారికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముకుతాడు వేయగా.. కూటమి సర్కార్ వచ్చీరావడంతోనే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. ఊరూరా బెల్టుషాపులతో మద్యాన్ని ఏరులైపారిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా మందుబాబులు నిత్యం మత్తులోనే తూగుతున్నారు. తక్కువ ధరకే దొరికే చీప్ సరుకు ఒక్కోసారి ప్రాణాలే తీస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి గురువారం మద్యంమత్తులో ఇలా అనంతపురం ఆర్టీసీ బస్టాండు మరుగుదొడ్ల వద్ద ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజనాసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు త్రీ టౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. బంధువులు ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని కోరారు. – అనంతపురం -
జర్మనీ భాషపై శిక్షణ, ఉద్యోగావకాశాలు
అనంతపురం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో జర్మనీ భాషపై శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టమ్, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమో పూర్తి చేసిన వారై 18 నుండి 40 సంవత్సరాల్లోపు వయస్సు కలిగివారై ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. రోజుకు 8 గంటలు చొప్పున వారానికి 40 గంటలు పనిచేయాలి. రెండు సంవత్సరాల కాంట్రాక్టు కింద ఉద్యోగాలు కల్పిస్తారు. నెలకు ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2.52 లక్షల నుంచి రూ.3.28 లక్షలు చెల్లిస్తారు. వీసా, విమాన చార్జీలు భరించాల్సి ఉంటుంది. రూ.30 వేలు డాక్యుమెంటేషన్ చార్జీలు, రూ.40 వేలు డిపాజిట్ చేయాలి. జర్మనీకి వెళ్లిన అనంతరం తిరిగి ఆ నగదు ఇస్తారు. ఏ–2 స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్లో ఆఫ్లైన్ శిక్షణ, బీ–1 స్థాయిలో ఇతర రాష్ట్రంలో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ శిక్షణ కల్పిస్తారు. పాస్పోర్టు, స్కూల్ లీవీంగ్ సర్టిఫికెట్, డిప్లొమో/ డిగ్రీ సర్టిఫికెట్, ఉద్యోగ అనుభవ సర్టిఫికెట్, లైట్ లేదా హెవీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ నెల 25లోపు దరఖాస్తు చేయడానికి గడువుగా నిర్దేశించారు. skillinternational@apssdc. inలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 99888853335, 87126 5586, 8790118349 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. -
సమస్యలు పరిష్కరిస్తాం
అనంతపురం అర్బన్: రవాణా సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఆకాశవాణి కేంద్రం నుంచి ‘అనంతమిత్ర ఫోన్ఇన్’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 17 మంది ఫోన్ ద్వారా సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో డీటీసీ వీర్రాజు, ఆల్ఇండియా రేడియో ప్రోగ్రాం డైరెక్టర్ నాగేశ్వరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ఫిర్యాదుదారు: నా పేరు వెంటరాముడు. మాది గార్లదిన్నె మండలం కోటంక గ్రామం, అనంతపురం నుంచి మా గ్రామానికి 2014లో రెండు బస్సులు తిరిగేవి. ప్రస్తుతం విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం మాత్రమే తిప్పుతున్నారు. పురుషులు దాదాపు 20 కిలోమీటర్లు బైకులో వెళుతున్నారు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి అదనపు ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకోండి. కలెక్టర్: ఆర్టీసీ అధికారులు మీ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే మరో బస్సును గ్రామానికి నడిపేలా చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారు: నా పేరు బాబు. అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి. ఇంటెల్ కళాశాల రోడ్డులో పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ రోడ్డు దాటుకోవడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. డివైడర్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. కలెక్టర్: మీరు చెబుతున్న ప్రదేశాన్ని రవాణా, పోలీసు శాఖల అధికారులు పరిశీలిస్తారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారు: నా పేరు మహబూబ్బాషా. మాది గార్లదిన్నె. చిన్న పిల్లలు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలను నడపుతున్న వారికి పోలీసులు ఫైన్ వేస్తూ ‘మీ సేవ’లో కట్టాలని చెబుతున్నారు. అక్కడి వెళితే ఫైన్తో పాటు అదనంగా రూ.30 కట్టాల్సి వస్తోంది. అలా కాకుండా ఒక యాప్ ఉన్నట్లయితే దాని నుంచి ఫైన్ కడితే రూ.30 మిగులుతాయి. ఈ సౌకర్యాన్ని కల్పించాలి. కలెక్టర్: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. యాప్ ద్వారా ఫైన్ కట్టే సౌలభ్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తా. తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు ‘వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు. మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శ్రీ సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టు బోర్డు కమిటీ సమావేశాన్ని జెడ్పీ చైర్పర్సన్ బోయగిరిజమ్మతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా పైప్లైన్ల ఏర్పాటు, దెబ్బతిన్న పైప్లైన్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, సీఈఓ రామచంద్రారెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రిశేఖర్, హెచ్ఎల్సీ ఎస్ఈ రాజశేఖర్, డీపీఓ నాగరాజునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తాడిపత్రిలో విధ్వంసకాండ
తాడిపత్రి టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో విధ్వంసకాండ ఆగడం లేదు. తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు చిన్నపోలమడ గ్రామ సమీపంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయ భవనంలోకి చొరబడి భవన సామగ్రి, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చొరవతో దాదాపు రూ.కోటి వెచ్చించి దాతల సహకారంతో భవనం నిర్మించారు. కార్యాలయం నిర్మాణంలో ఉండగానే ఆర్టీఓ అధికారులు వాహనాల ఎఫ్సీలు వంటి విధులు నిర్వర్తించేవారు. కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకునేందుకు తాడిపత్రి టీడీపీ నాయకులు విశ్వయత్నాలు చేశారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాడిపత్రి మోటర్వెహికల్ ఇన్స్పెక్టర్లతో కలిసి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు కార్యాలయం వైపు చూడటం మానేశారు. దీంతో భవనం కాస్త నిరుపయోగంగా మారింది. సామగ్రి ధ్వంసం.. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి కనబడిన వాటినల్లా ధ్వంసం చేశారు. భవనం ప్రారంభ శిలాఫలకాలు, తలుపులు, గాజు వాకిలి, విద్యుత్ బోర్డ్లు పగులగొట్టారు. అయితే ఇది గంజాయి మూకల పనా.. లేక గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకుల పనా అంటూ పట్టణంలో చర్చ సాగుతోంది. ఈ విషయమై మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును వివరణ కోరగా గత ప్రభుత్వంలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాలతో భవనం ప్రారంభోత్సవం అయితే జరిగిందని, ఆ భవనంలో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినా పైనుంచి అనుమతులు రాలేదన్నారు. ప్రస్తుతం భవనం తమ పర్యవేక్షణలో లేదని, ధ్వంసం విషయం తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. -
రూ.46 లక్షల విత్తనాలకు స్టాప్సేల్స్
అనంతపురం అగ్రికల్చర్: నాసిరకం కలింగర విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని బుధవారం స్థానిక శ్రావణి సీడ్స్ దుకాణం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైతు మురళీ ఆరోగ్యం నిలకడగా ఉంది. గురువారం వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏవో జే.శశికళ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం, పంట పెట్టుబడికి రూ.6.90 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రైతు తెలిపారన్నారు. అందుకు సంబంధించి బిల్లులు సేకరించామన్నారు. బీఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన కళింగర విత్తనాలకు సంబంధించి వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించి రూ.20 లక్షల విలువ చేసే విత్తనాలకు అమ్మకాల నిలిపివేత (స్టాప్సేల్స్) ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అలాగే సాంయత్రం శ్రావణి సీడ్స్ దుకాణంను తెరపించి తనిఖీ చేశామన్నారు. స్టాకు, సేల్స్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. బీఏఎస్ఎఫ్తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన రూ.26 లక్షలు విలువ చేసే కళింగర, కర్భూజా విత్తనాలకు స్టాప్ సేల్స్ ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా రూ.46 లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలు నిలిపివేశామన్నారు. కమిషనరేట్, జేడీఏ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ, నాసిరకకం, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిఘా మరింత పెంచుతామని తెలిపారు. కళింగర పంట పరిశీలన బత్తలపల్లి: నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన గుజ్జల మురళి సాగు చేసిన కళింగర పంటను హార్టిక్చలర్ అధికారిణి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు డి.చెర్లోపల్లిలో పంట సాగు, పెట్టుబడి వివరాలను సర్పంచు గుజ్జల రమాదేవి, ఇతర రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మురళి 3.74 ఎకరాల్లో కళింగర పంట ‘మాక్స్’ రకంను నవంబర్ 27న నాటారన్నారు. పంట కాల పరిమితి 70–75 రోజులు దాటినా కాయ లోపల తెలుపు రంగులో ఉండడంతో వ్యాపారస్తులు ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లనే ఇలా జరిగిందని, తద్వారా పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏఓ జే.శశికళ ఆత్మహత్యకు యత్నించిన రైతుకు పరామర్శ -
హోలీ.. రంగుల కేళి!
అనంతపురం కల్చరల్ : పేద, ధనిక తారతమ్యాలన్నింటినీ రంగుల్లో కడిగేసే మధుర క్షణాలు హోలీ రూపంలో వచ్చేశాయి. రోజూ ఎన్నో ఒత్తిళ్లు, ఉరుకులు పరుగులతో కాలం గడచిపోతుంటే కాస్తంత ఉపశమనానికన్నట్లు సప్తవర్ణాల శోభను అద్దుకునేందుకు రంగుల కేళీ హోలీ శుక్రవారం సందడి చేయనుంది. పౌరాణిక గాథలు, చారిత్రక కథనాలతో కూడా హోలీకి తరతరాల బంధం ఉంది. సహజంగా అన్ని వర్గాల వారు ఎంతో ఇష్టపడే హోలీ జిల్లాలో అధిక శాతం స్థిరపడిన ఉత్తరాదివారు మరింత ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. ఆనందాల హోలీ విషాదాల కేళీ కాకుండా ఉండేందుకు సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని వైద్యులంటున్నారు. సహజరంగులే ముద్దు సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మసమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలుండడమే. ఈ తరహా రంగులు చర్మానికి హాని స్తాయనడంలో సందేహం లేదు. పొరపాటున కళ్లలో పడితే మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టే రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు రసాయనాలకు బదులుగా సహజసిద్ధంగా ఇంటి వద్దనే తయారు చేసుకునే రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని సూచిస్తున్నారు. దానికి తోడు వేసవి వచ్చేయడంతో నీటి ఇబ్బంది మరో రూపంలో సమస్యను తెచ్చిపెడుతుంది. విపరీతంగా నీళ్లను వృథా చేయడం కూడా మంచిది కాదని అందరూ చెప్పే మాట. ఈ సూచనలు పాటిస్తే మేలు ● చవకగా దొరుకుతాయని రసాయనాలు కలిపిన రంగులతో హోలీ ఆడకుండా ఉండడం. ● ఎక్కువగా ఎరుపు, పింక్ రంగులనే వాడితే మంచిది. ఎందుకంటే ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడం వల్ల శరీరంపై నుంచి సులభంగా తొలిగిపోతాయి. ● హోలీ ఆడడానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్, తలకు నూనెను రాసుకోవాలి. వీటి వల్ల రంగులు శరీరంలో ఇంకవు. శుభ్రం చేయడం కూడా సులువవుతుంది. ● ముఖంపై పడిన రంగులను శుక్రం చేసుకోవడానికి సబ్బు కన్నా క్లెన్సింగ్ మిల్క్ ఉత్తమమైనదని బ్యూటీషియన్స్ చెబుతారు. ● తక్కువ నీరుతో రంగులు పోవాలంటే మనం హోలీలో ఉపయోగించే రంగుల్లో ఎక్కువ మోతాదు ఆయిల్ వాడకం తగ్గించాలి. ఇంట్లో దొరికే పసుపు, కుంకుమ వంటివి ఎక్కువ హాని చేయవు. సందర్భం రంగుల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి ఆనందంతో పాటూ ఆరోగ్యమూ ముఖ్యమే -
సిబ్బందికే ఉపాధి హామీ
● ఫీల్డ్ అసిస్టెంట్ల కూలీల అవతారం ● వేతనం తీసుకుంటూనే కూలీలుగా అదనపు బిల్లులు ● వారి పేర్ల మీదే సింగిల్ జాబ్ కార్డుల సృష్టి కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ‘ఉపాధి’ హామీ పథకంతో సంపద సృష్టించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడ్డారు. గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను బలవంతంగా తొలగించి, తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఆ బాధ్యతలను అప్పగించారు. తద్వారా నిరుపేద కూలీలకు దక్కాల్సిన నిధులను అప్పనంగా స్వాహా చేసేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల మొదలు మండల స్థాయి నేతల వరకు ఈ అక్రమాలు ఊపందుకున్నాయి. ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తుండడంతో ఉపాధి కూలీలు నివ్వెర పోతున్నారు. తారస్థాయికి చేరుకున్న అక్రమాలు బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి, పాల వెంకటాపురం, ఎస్. కొండాపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీల అవతారమెత్తారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి కుటుంబ సభ్యులకు ఉపాధి హామీ పథకంలో సింగిల్ జాబ్ కార్డులను సృష్టించి పేదల సొమ్మును దోచేసుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ప్రతి నెలా స్టాఫ్ శాలరీ కింద రూ.12,250 వరకు వేతనం అందుతుంది. అంతటితో ఆగకుండా కుటుంబ సభ్యుల పేరుతో సింగిల్ జాబ్ కార్డులు సృష్టించి అప్పనంగా ఉపాధి నిధులను దోచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ పేరుతోనే కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ కార్డులు సృస్టించుకుని పనులు చేయకుండానే చేసినట్లుగా రికార్డులు చూపిస్తూ నిధులను బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. తారస్థాయికి చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమాలు వెలుగు చూస్తున్నా... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉపాధి అధికారులు ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నా.. అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఓ వైపు ప్రభుత్వ వేతనం తీసుకుంటూనే మరోవైపు ఉపాధి కూలీలుగా అవతారమెత్తి వేతనాలను దక్కించుకుంటున్నారు. బిల్లులు చేయించుకునేందుకు ఉపాధి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ మొదలు ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీ, ఎంపీడీఓ స్థాయి వరకూ మామూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం. విచారించి చర్యలు తీసుకుంటాం ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం తరఫున వేతనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా వీరు జాబ్కార్డులు కలిగి ఉండకూడదు. అలాగే భార్య, భర్తలకు సంబంధించి సింగిల్ జాబ్కార్డులు జారీ చేయకూడదు. అలా జరిగి ఉంటే విచారించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. – నంద కిషోర్, ఎంపీడీఓ, బ్రహ్మసముద్రం మచ్చుకు కొన్ని... బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల నాగరాజు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి నెలకు రూ.9,750 చొప్పున వేతనం అందిపుచ్చుకున్నారు. అయినా తన భార్య గొల్ల లక్ష్మీదేవి పేరుతో సింగిల్ జాబ్ కార్డు (ఏపీ–12–020– 001–001/404231) సృష్టించాడు. ఆమె పేరున బ్యాంక్ ఖాతాకు గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకూ రూ.10,402 బిల్లులు చేసుకున్నాడు. గొల్ల సన్నయ్య పేరుతో ఉన్న జాబ్ కార్డు నంబర్ (ఏపీ–12–020–001–001/010021)లో ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల నాగరాజు ఉపాధి కూలీగా తన పేరును నమోదు చేసుకున్నాడు. గత ఏడాది 9వ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు రూ.22,272 బిల్లులు తన ఖాతాకు మళ్లించుకున్నాడు. పాల వెంకటాపురం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల రామచంద్ర అతని పేరు మీద సింగిల్ జాబ్ కార్డు (ఏపీ–12–020– 015–012–80814) సృష్టించుకున్నాడు. ఇతను కూడా కూలీ పనులు చేసినట్లుగా మస్టర్లు సిద్ధం చేసి గత ఏడాది 9వ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు రూ.13,861 బిల్లులు చేసుకున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ గొల్ల రామచంద్ర తన భార్య జి.సునీత పేరుతో సింగిల్ జాబ్ కార్డు (ఏపీ–12–020–015–012–80813)ను సృష్టించి, గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ వరకు రూ.19,505 నగదును ఆమె ఖాతాకు మళ్లించాడు. ఎస్.కొండాపురం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ శివమణి తన తల్లి బి.లక్ష్మీదేవి పేరుతో డ్రై ల్యాండ్ హార్టీకల్చర్ పథకం కింద 8 ఏళ్ల క్రితం మామిడి మొక్కలను నాటారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెకు సింగిల్ జాబ్ కార్డు సృష్టించి అప్పట్లో నాటిన మొక్కలకు ఈ ఏడాది ఫిబ్రవరి 3న మెటీరియల్ బిల్లు అంటూ రూ.15,303 నగదును ఖాతాకు మళ్లించుకున్నారు. -
ప్రభుత్వ మెడలు వంచుతాం
ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షంగా వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, కరెంటు బిల్లులు తగ్గించాలని ఇప్పటికే వినతి పత్రాలు అందించాం. ప్రభుత్వంలో మార్పు రాకపోతే మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యక్ష పోరుకు దిగుతాం. కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా పథకాలు అమలు చేయిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు ఉంటే గత ఏడాది ఈ సర్కారు ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. ఏటా ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది రూ.2,600 కోట్లే. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ 17 వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు కళాశాలలు అవసరం లేదని, ఉన్న కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తోంది. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
విద్యా వ్యవస్థ నిర్వీర్యం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ వైఖరి పట్ల యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెస్తాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. – చంద్రశేఖర్ యాదవ్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
పోలీసుల ఆంక్షలు దాటుకుని..
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ విజయవంతం కాకుండా కూటమి సర్కారు కుట్రలు పన్నింది. పోలీసులను రంగంలోకి దింపి అడుగడుగునా ఆంక్షలు విధించింది. అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల విద్యార్థులు ‘యువత పోరు’కు వచ్చేందుకు సిద్ధం కాగా, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులకు పరీక్షలున్నాయని, బయటకు వెళ్లడానికి వీళ్లేదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, పలువురు ప్రజా సంఘాల నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరీక్షలు లేకున్నా ఏ విధంగా వారిని అడ్డుకుంటారని నిలదీశారు. ర్యాలీ సజావుగా జరిగేలా చూడాల్సిన పోలీసులే యువతను రెచ్చగొట్టేలా వ్యవహరించడం దారుణమని రమేష్ గౌడ్ విమర్శించారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. విద్యార్థులు పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే అడ్డుకోవడమేంటని విద్యార్థినులు ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. -
అదనపు బస్సు సర్వీసుల ఏర్పాటు
ఉరవకొండ: జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే రూట్లకు అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సుమంత్.ఆర్.ఆదోని తెలిపారు. బుధవారం ఉరవకొండ ఆర్టీసీ డిపోను ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. జిల్లాకు 48 కొత్త బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పాత బస్సుల స్ధానంలో 98 కొత్త బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీలో ప్రస్తుతం నష్టాలు తగ్గాయని, త్వరలోనే లాభాల బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. రెండేళ్లలో కారుణ్య నియమాకాల కింద రెండు దఫాలుగా 131 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. త్వరలో మరో 38 మందిని కండెక్టర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. ఉరవకొండ డిపో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉరవకొండ డీఎం హంపన్న, ఎస్టీ రమణమ్మ పాల్గొన్నారు. ‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి కళ్యాణదుర్గం రూరల్: ఉపాధి కూలీలకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యుడు అచ్యుత్ కలసి కళ్యాణదుర్గం మండలం యరరంపల్లి, గరుడాపురం, శెట్టూరు మండలం యాటకల్లు గ్రామాల్లో బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీలతో మాట్లాడారు. సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు 6 నుంచి 8 వారాల పాటు బిల్లులు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పదేళ్ల క్రితం మంజూరు చేసిన పనిముట్లతోనే కాలం నెట్టుకొస్తున్నారన్నారు. తక్షణమే కొత్త పనిముట్లు అందజేయాలని, పని ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ‘పీఎంఏవై’లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు లబ్ధి అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తోందని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఓ ఎ.మలోల, హౌసింగ్ పీడీ శైలజతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 82,159 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 35,351 ఇళ్లు పూర్తయ్యాయని, 28,560 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలు ఆర్థిక లబ్ధి ఉంటుందన్నారు. ఇందులో నిబంధనలు వర్తిస్తాయన్నారు. తద్వారా జిల్లాలో 15,882 మంది బీసీలు, 4,232 మంది ఎస్సీలు, 904 మంది ఎస్టీలకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీవరకు లబ్ధిదారుల ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెళ్లి అదనపు లబ్ధి గురించి వివరించి, వారి ఇంటిని ఫొటో తీసుకుంటారన్నారు. -
‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం
కళ్యాణదుర్గం: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కత్తులు చేత పట్టుకుని హల్చల్ చేశారు. ఏకంగా రెండిళ్లలో చోరీలకు పాల్పడి, మరో ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.... కళ్యాణదుర్గంలోని పార్వతీ నగర్లో నివాసముంటున్న దీప, అనిల్ దంపతులు మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి పైకెళ్లి నిద్రించారు. విషయాన్ని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాను ధ్వంసం చేసి, నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న శిల్ప ఇంట్లో చొరబడి బ్రాస్లైట్ను అపహరించారు. ముదిగల్లు బైపాస్ వద్ద శ్రీకాంత్కు చెందిన నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్లారు. ముసుగులు ధరించి... కత్తులు చేతపట్టి పార్వతీనగర్ శివారు ప్రాంతంలోని అక్కమాంబ కొండ సమీపంలో నివాసముంటున్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు బాబు ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి 2.10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, కత్తులతో హల్చల్ చేశారు.ఒకరు ప్రహరీ దూకి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. పరిశీలించిన డీఎస్పీ రవిబాబు వరుస దోపిడీల సమాచారం అందుకున్న డీఎస్పీ రవిబాబు, అర్బన్ సీఐ యువరాజు, సిబ్బంది బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల ఆధారాలు సేకరించారు. కాగా, దుండగులు కత్తులు పట్టుకుని సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన వారు దొంగలా లేక పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. రెండిళ్లలో వరుస చోరీలు ముదిగల్లు బైపాస్లో నాలుగు గొర్రెల అపహరణ అర్ధరాత్రి కత్తులతో దుండగుల హల్చల్ -
●సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి నాల్గవ రోజైన బుధవారం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నర–సింహ అవతారమెత్తి హిరణ్య కశిపుడిని సంహరించారు. స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే ఎప్పటి లాగానే తమిళనాడుకు చెందిన నాదస్వరం, డోలు విద్వాంసులు శ్రీవారి వాహనం ముందు భక్తితో పాటు తమ కళను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ప్రజాహితమే పార్టీ ధ్యేయం
●వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ●ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం అనంతపురం కార్పొరేషన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2011 మార్చి 12న వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఆవిర్భవించిన వైఎస్సార్సీపీ నాటి నుంచి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిందన్నారు. 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమమే ఊపిరిగా మనుగడ సాగించిందన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ... దేశ ప్రధాన మంత్రులు సైతం ఇచ్చిన మాటను అమలు చేయని సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని, అలాంటిది సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊహకందని విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఆదేశిస్తే దానిని కూడా చిత్తశుద్ధితో గత 9 నెలలుగా అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో కూటమి ప్రభుత్వంపై పోరాటాలు సాగిస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ జగన్, పార్టీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి కార్యకర్త పార్టీని అంటి పెట్టుకుని ఉండడం అభినందించదగ్గ విషయమన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున యువతపోరు కార్యక్రమాన్ని నిర్వహించడం అధినేత వైఎస్ జగన్ రెడ్డి పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా, ప్రశ్నించిన వారిని భయపెట్టేలా వ్యవహరిస్తోందన్నారు. అన్ని వర్గాలభ్యున్నతి ఒక్క వైఎస్సార్సీపీతోనే సాధ్యమవుతుందని, మరోమారు సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేసుకోవడంలో భాగంగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్ల డబ్బును ప్రజల ఖాతాల్లోకి నేరుగా చేరేలా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తదితర వెనుకపడిన కులాలు అన్ని విధాల అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే వైఎస్సార్సీపీ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారుడు ఆలూరు సాంబశివారెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్రెడ్డి, వాసంతి సాహిత్య, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ నాయకులు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, రమేష్గౌడ్, సాకే చంద్రశేఖర్, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, చామలూరు రాజగోపాల్, చంద్రశేఖర్ యాదవ్, వెన్నం శివరామిరెడ్డి, చింతా సోమశేఖర్ రెడ్డి, కాగజ్ఘర్ రిజ్వాన్, అనిల్కుమార్ గౌడ్, సతీష్, రాధాకృష్ణ, చింతకుంట మధు, కేశవరెడ్డి, అశ్వత్థనాయక్, సైఫుల్లాబేగ్, మల్లెమీద నరసింహులు, లబ్బే రాఘవ, అమర్నాథ్రెడ్డి, కొర్రపాడు హుస్సేన్ పీరా, శ్రీనివాస్దత్తా, కై లాష్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శివశంకర్ నాయక్, కృష్ణవేణి, శ్రీదేవి, దేవి, భారతి, శోభాబాయి, శోభారాణి, కార్పొరేటర్లు కమల్భూషణ్, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి పాల్గొన్నారు. -
ఉద్యాన రైతులకు మరింత లబ్ధి
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం బాగా పెరిగినందున మెరుగైన ఫలసాయం, మార్కెటింగ్ సదుపాయం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ అనుబంధ రంగాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. ప్రధానంగా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖలు, మార్క్ఫెడ్ ద్వారా పంట ఉత్పత్తుల కొనుగోళ్లు అంశాలపై ఆరా తీశారు. అరటి, మామిడి, చీనీ, టమాట, మిరప పంటలను ఐదు గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి ద్వారా రైతులు ఆర్థికంగా లాభపడేలా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలోని ఉత్తరాది ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతులు పెంచాలన్నారు. నెలాఖరులోపు లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం మామిడి కీలక దశలో ఉన్నందున నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే 50 శాతం రాయితీతో ఇస్తున్న ఫ్రూట్ కవర్లు రైతులు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానశాఖ స్ఫూర్తితో పట్టుపరిశ్రమశాఖ అధికారులు కూడా జిల్లాలో మల్బరీ విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది 800 ఎకరాల లక్ష్యానికి గానూ 300 ఎకరాలు మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెటింగ్ పరిస్థితి బాగున్నందున ఏడాదిలో 10 పంటలు పండించే పరిస్థితి ఉన్నందున రైతులు ఆర్థిక పురోగతి సాధించడానికి మల్బరీని ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన కందులు, పప్పుశనగను మార్క్ఫెడ్ ద్వారా చేపట్టిన కొనుగోళ్లపై ఆరాతీశారు. కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) దక్కేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, పశుశాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకటస్వామి, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు, పట్టుశాఖ అధికారి డి.ఆంజనేయులు, మార్కెటింగ్శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసనాయక్, ఆత్మ పీడీ మద్దిలేటితో పాట ఏపీడీలు, ఏడీఏలు, ఏఓలు, హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
●ఇమామూ.. నీ సేవకు సలాం
ఇదో రైతు బిడ్డ వ్యధ. హలం పట్టి పొలం దున్నే సమయంలో ప్రజల ఆకలి దప్పికలు తీర్చే ఆలోచన తప్ప మరొకటి లేదు. వరుస పంట నష్టాలను తాళలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో డ్రైవర్గా మారినా ప్రజల దాహార్తీని తీర్చడం మరువలేదు. పది మంది మంచిగా ఉంటే చాలనే మంచి మనసు అన్నదాతకు తప్ప మరెవ్వరకూ లేదని అని నిరూపించారు ఓబుళదేవరచెరువు మండలం సున్నంపల్లికి చెందిన దూదేకుల ఇమాములు. కాలం కలసి రాక వ్యవసాయం మాని 30 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని అనంతపురానికి చేరుకున్న ఇమాములు ఆటో డ్రైవర్గా మారాడు. ఇద్దరు పిల్లలకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు.. తన ఆటోలో చల్లని మంచినీటి ట్యాంక్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. ‘నేను రైతు బిడ్డను. చల్లని తాగునీరు ఉచితం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని రైతు సంక్షేమాన్ని మరవొద్దంటూ నేటి తరానికి ఆయన అందిస్తున్న సందేశం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. – అనంతపురం సిటీ -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
డి.హీరేహాళ్(రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రూతమ్మ దంపతుల మూడవ కుమార్తె అర్పిత (5) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన అర్పిత బాత్రూమ్లోకి వెళ్లింది. ఆ సమయంలో విద్యుత్ బల్బుకు అనుసంధానం చేసిన వైరు తెగి రేకు తలుపుపై పడింది. విషయాన్ని గమనించని బాలిక తలుపు తీసేందుకు ప్రయత్నించినప్పుడు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాత్రూమ్కు వెళ్లిన బిడ్డ ఎంతసేపటికి రాకపోవడంతో అటుగా వెళ్లి గమనించిన తల్లికి విగత జీవిగా పడి ఉన్న అర్పిత కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని విద్యుత్ సరఫరాను ఆపి అర్పిత మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. కాగా, బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన తండ్రి తిప్పేస్వామికి విషయాన్ని చేరవేయడంతో ఆయన బయలుదేరినట్లు సమాచారం. క్లస్టర్ రీసోర్స్ సెంటర్లకు నిధుల మంజూరు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో కొత్తగా ఏర్పడిన 135 క్లస్టర్ రీసోర్స్ సెంటర్ల నిర్వహణకు నిధులు మంజూరయ్యాయి. జిల్లాకు కేటాయించిన రూ. 1.35 కోట్ల క్లస్టర్ రీసోర్స్ గ్రాంట్ను ఆయా క్లస్టర్ పాఠశాలల హెచ్ఎంలకు నాలుగు పద్దుల కింద విడుదల చేసినట్లు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. మీటింగ్ ఏటీ గ్రాంట్, మెయింటినెన్స్ గ్రాంట్, కంటిన్జెన్సీ గ్రాంట్, టీఎల్ఎం గ్రాంట్ కింద ఒక్కో క్లస్టర్ రీసోర్స్ సెంటర్కు రూ. లక్ష చొప్పున విడుదల చేశామన్నారు. నిబంధనల మేరకు ఖర్చు చేసి వివరాలను మండల విద్యాశాఖ అధికారి ఆమోదంతో టీసీఎస్ వారు రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సమగ్రశిక్ష ద్వారా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ దామాషాలో భాగంగా మొత్తం రూ. 16 లక్షలను ఆయా కళాశాలలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. నిధులను ఖర్చు చేసి ఎంఈఓల ఆమోదంతో టీసీఎస్ రూపొందించిన యాప్, ప్రబంద్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. టీడీపీ నేతల దాష్టీకం ● వైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్రలతో దాడి ఆత్మకూరు: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయణస్వామి, రమేష్, భరత్పై చర్యలు తీసుకోవాలని కోరాడు. -
తాగునీటి ఇక్కట్లు తీర్చండి
కూడేరు: తాగునీటి ఇక్కట్లు తీర్చాలంటూ కూడేరు మండలం ముద్దలాపురానికి చెందిన కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు మాట్లాడుతూ... లక్ష్మీదేవమ్మ, జగనన్న కాలనీకి రెండింటికీ కలిపి మంచి నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బోరుబావిలో నీటి మట్టం తగ్గి తాగునీటి సమస్య జఠిలంగా మారిందన్నారు. గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. కాలనీ పక్కనే వెళ్లిన సీపీడబ్ల్యూఎస్ స్కీం పైపులైన్ ద్వారా పైపులైన్ ఏర్పాటు చేసిన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సూపరింటెండెంట్ కేశవకు వినతి పత్రాన్ని అందజేశారు. నేరాలు అరికట్టేలా సమష్టి కృషి అనంతపురం: నేరాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ పి.జగదీష్ పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ అనర్థాలు, మహిళల పట్ల వేధింపులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని పలు స్వచ్ఛంధ సేవా సంస్థల (ఎన్జీఓ) ప్రతినిధులతో బుధవారం ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, పోక్సో మహిళా సంరక్షణ చట్టాలు తదితర అంశాలపై ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. డ్రగ్స్ అనర్థాలపై యువతను చైతన్య పరిచేలా ఎన్జీఓలు కృషి చేయాలన్నారు. అనంతరం సైబర్ సురక్షలో భాగంగా ప్రజల్లో అవగాహన తేవడానికి రూపకల్పన చేసిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైబర్ సీఐ జాకీర్, వివిధ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చింత పండు ధర తగ్గుముఖం హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం 1573.50 క్వింటాళ్ల చింత పండు విక్రయానికి రాగా... మీడియం ప్లవర్ రకం క్వింటా గరిష్టం రూ. 13వేలు, కనిష్టం రూ.4,300 చొప్పున సగటున రూ.6వేలతో అమ్ముడుపోయింది. అలాగే కరిపులి (ఫైన్) క్వింటా గరిష్టం రూ.33వేలు, కనిష్టం రూ.8వేలు, సగటు రూ.15వేలు చొప్పున ధర పలికింది. గత సోమవారం క్వింటా కరిపులి గరిష్ట ధర రూ.40వేలు కాగా, బుధవారం రూ.33వేలకు చేరుకోవడం గమనార్హం. -
‘విత్తనం’పై నీలి నీడలు
అనంతపురం అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు నాణ్యమైన విత్తనాలూ అందకుండా ఏకంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)నే నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ఈ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన నిధులనూ వాడుకోకుండా సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసేసినట్లు సమాచారం. కనీసం రైతులు చెల్లించిన నాన్ సబ్సిడీ సొమ్ము కూడా పూర్తిస్థాయిలో అందకుండా చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఏపీ సీడ్స్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అలా ఇచ్చి.. ఇలా లాగేసుకుంటోంది..గతేడాది (2024–25) ఖరీఫ్, రబీ సీజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,79,245 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో పంపిణీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.261.09 కోట్లు బకాయి పడింది. ఇటీవల అందులో రూ.100 కోట్లు ఏపీ సీడ్స్ పీడీ అకౌంట్కు జమ చేస్తున్నట్లు జీవో ఇచ్చారు. సొమ్ము డ్రా చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ను ఫ్రీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్ జిల్లా అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిధులు ఇస్తున్నట్లు బయట చెప్పుకోవడానికి తప్ప ఏపీ సీడ్స్కు పైసా అందడంలేదు. గతంలో అంటే 2018–19లో అప్పటి చంద్రబాబు సర్కారు దిగిపోయే సమయంలో కూడా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి ఏపీ సీడ్స్కు రూ.171.99 కోట్లు బకాయి పెట్టి వెళ్లిపోయింది. -
అభివృద్ధి పనుల తీర్మానాల్లో రాజకీయ జోక్యం
ఆత్మకూరు: గ్రామాల అభివృద్ధి పనుల్లో టీడీపీ నేతల జోక్యం తారస్థాయికి చేరుకుంది. ప్రజాప్రతినిధులను కాదని టీడీపీ నేతలు సూచించిన పనులకే అధికారులు సైతం తీర్మానాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు తీర్మానాలు రూపొందించాలని అధికారులను ఆత్మకూరు ఎంపీపీ సుబ్బర హేమలత కోరారు. తీర్మానాల కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ కార్యాలయంలోనే ఆమె వేచి చూసినా ఫలితం లేకపోయింది. చివరకు టీడీపీ నేతలు సూచించిన పనులకు సంబంధించి 30 తీర్మానాలను సిద్ధం చేశారు. వీటిలో ప్రజాప్రతినిధులు సూచించిన ఏ ఒక్క పని కూడా లేకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న ఎంపీపీ హేమలత... అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చెబితేనే తీర్మానాలు సిద్దం చేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పరిష్కారం చూపే దిశగా గత వారం సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇచ్చినా ఏ ఒక్క అధికారి కూడా సమావేశానికి హాజరుకాలేదన్నారు. ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.50 లక్షలకు పైగా ఉన్నా... వాటితో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండానే తీర్మానాలు రూపొందించి, ఆమోదం తెలిపినట్లుగా రికార్డులు సిద్ధం చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల నేతల కనుసన్నల్లో పనిచేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంపై కలెక్టర్ స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నాయకులు చెబితేనే సిద్ధం చేస్తామంటున్న అధికారులు ప్రొటోకాల్ ధిక్కరించి టీడీపీ నేతలు ప్రతిపాదించిన తీర్మానాలకు ఆమోదం -
కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా? సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు -
ఆకట్టుకున్న కర్రసాము
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గుత్తి రూరల్: మండలంలోని చెర్లోపల్లి వద్ద ఉన్న సేవాగఢ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26వ విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, బ్యాక్లాగ్ కోటా కింద 6, 7, 8, 9వ తరగతులలో నూతన ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్స్పాల్ ఫయాజ్ అహమ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 5వ తరగతిలో 80 సీట్లు భర్తీ చేయనున్నారు. ఎస్టీలకు 78శాతం, ఎస్సీలకు 12శాతం, బీసీలకు 5శాతం, ఓసీలకు 2శాతం, ఏఈక్యూ కోటాకు 3శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీ బ్యాక్లాగ్ కోటా కింద 6వ తరగతిలో 49, 7వ తరగతిలో 30, 8వ తరగతిలో 19, 9వ తరగతిలో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు https:// twreiscet.apcfss.in/వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న రాత పరీక్ష నిర్వహించి, ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్లు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 98853 69079, 89782 39363లో సంప్రదించవచ్చు. యువకుడిపై పోక్సో కేసు నమోదు బెళుగుప్ప: మండలలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను వేధించిన ఘటనలో అదే గ్రామానికి చెందిన వెంకటేశులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ మంగళవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేసేవాడని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. -
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది. కష్టాలొచ్చినా ఎదురొడ్డి.. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలను విని విజయానికి చేరువయ్యారు. పాలన అంటే ఇలా ఉండాలని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ‘ఆసరా’, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్దే. అయితే, ప్రజలను ఎలాగోలా మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యం పేద, సామాన్య మధ్య తరతగతి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి చేశారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ వైఎస్సార్ సీపీ. మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏర్పాటు చేసి 14 ఏళ్లు అయ్యింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం అఖండ విజయాన్ని అందించింది. గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా నిలిచింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు. రూ.లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’ ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి.. సీఎంగా పాలన అంటే ఇలా ఉండాలని చూపించిన జగన్ నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం -
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్లా రైతులను ఇబ్బంది పెట్టేందుకే హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు ●రైతు సదస్సులో విశ్వేశ్వరరెడ్డి
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలి
కళ్యాణదుర్గం రూరల్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని భట్టువానిపల్లి, పాలవాయి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. భట్టువాని పల్లిలో సహజసిద్ధ వ్యవసాయం (న్యాచురల్ ఫార్మింగ్) చేస్తున్న రైతులతో సమావేశం నిర్వహించారు. సహజంగా పండించిన పంటలకు ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని వ్యవసాయ అధికారులను రైతులు కోరారు. రబీలో రైతులు పండించిన పంటలు వేరుశనగ, మొక్కజొన్న పంటలకు దళారుల బెడద తప్పించి ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ ఎల్లప్ప, మండల వ్యవసాయ అధికారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పాములు పట్టుకుంటూ .. తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు. దారిన పోతూ చోరీ ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డిను ఏఎస్పీ అభినందించారు. రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం -
‘యువత పోరు’ను జయప్రదం చేద్దాం
అనంతపురం కార్పొరేషన్: ‘విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఈ క్రమంలో సర్కారు మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం చేపడుతున్న వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ ర్యాలీని జయప్రదం చేయాలి’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం సమీపంలోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు,పెద్ద ఎత్తున యువత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని, ‘విద్యా దీవెన’ పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 12,612 కోట్లు, ‘వసతి దీవెన’ ద్వారా రూ. 5,992 కోట్లు అందించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రూ.4,600 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు.. సీఎం అయ్యాక మాట తప్పార న్నారు. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వంలో వాటిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ‘కూటమి’ ఆగడాలను తిప్పికొడతామని ‘అనంత’ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
ఉపాధ్యాయుడికి ప్రతిభా పురస్కారం
తాడిపత్రి: కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని విశిష్టమైన వ్యక్తులు అందజేసే పురస్కారం ఈ ఏడాదికి గాను తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామాంజినేయులుకు దక్కింది. ఈ నెల 9న హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన పురస్కారాల ప్రదానంలో శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారాన్ని ఆయనకు హైదరాబాద్ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇటికాల వీరయ్య, తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు అందజేసి, ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాఠశాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినందుకు 2018లోనూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రామాంజినేయులు అవార్డు అందుకున్నారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన పాలుపంచుకుంటున్నారు. కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ శాలివాహన ఉన్నతాధికారులు, ట్రస్ట్ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగులకు ‘షోకాజ్’ గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆయన గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు ఉద్యోగులు ఉదయం 10 గంటలవుతున్నా విధులకు హాజరు కాలేదు. అంతేకాక ప్రభుత్వం చేపట్టిన సర్వేలోనూ ఊబిచెర్ల సచివాలయ ప్రగతి వెనుకంజలో ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తనిఖీలకు వెళ్లిన ఆయన తొలుత రికార్డులు, ఉద్యోగుల హాజరు పట్టిక పరిశీలించారు. ఇద్దరు మినహా మిగిలిన ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. గైర్హాజరైన వారికి ఫోన్ చేసి సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సదరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఊరేగింపులో అపశ్రుతి పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన శేష వాహనం ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముస్తఫా(18) ఊరేగింపులో తన మిత్రులతో కలసి చిందేస్తూ ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. -
●హంస వాహనంపై వీణాపాణి
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు సింహవాహనంపై శ్రీవారి దర్శనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటిచెప్పడానికే శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. అర్చకులు ఉదయం యాగశాలలో పుణ్యాహవచనం జరిపి వాస్తు, అగ్ని ప్రతిష్ట చేస్తారు. రాత్రివేళ స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు. -
తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను కలిపి మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తారు. ఈ విషయంపై పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలి. గతంలో చదివిన పాఠశాల కావాలా లేక మోడల్ ప్రైమరీ స్కూల్ కావాలా ఆరా తీయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విద్య, అనుబంధ శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ అంశంపై ఎంఈఓలు గ్రామపంచాయతీ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ విధానాలను వివరించాలన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను లిఖితపూర్వకంగా ఆమోదం పొందేలా చూడాలన్నారు. మండల, క్లస్టర్ కమిటీల ఏర్పాటు, పాఠశాల నిర్వహణ కమిటీతో సంప్రదించి తల్లిదండ్రుల అంగీకారంతో పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఇబ్బందులున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, మూడు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో ఆ సౌకర్యం కల్పించాలన్నారు. సమస్యలను ప్రజాప్రతినిధులు, డిప్యూటీ డీఈఓ, డీఈఓ స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల పునర్వ్యస్థీకరణలో భాగంగా యూడైస్ డేటా ప్రకారం పోస్టుల కేటాయించాలన్నారు. సమావేశంలో డీఈఓ ప్రసాద్బాబు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ, గిరిజిన సంక్షేమ అధికారి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా టాప్–6లో ఉండాలి పంచాయతీ సెక్ట్, జీఎస్డబ్ల్యూఎస్ తదితర అంశాల్లో జిల్లా టాప్–6లో ఉండేలా పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు. త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉంటుందని, అప్పటిలోగా రాష్ట్రస్థాయిలో ఆయా అంశాల్లో జిల్లాను టాప్–6లో ఉంచేందుకు కృషి చేయకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
మద్దతు ధరతో పప్పుశనగ కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం రబీలో రైతులు పండించిన పప్పుశనగ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్వింటా రూ.5,650 ప్రకారం కొంటామన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ–క్రాప్ చేయించి ఉండాలన్నారు. 14 శాతం లోపు తేమ ఉన్న నాణ్యమైన పప్పుశనగ తీసుకురావాలని సూచించారు. ఆర్ఎస్కేల్లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు గుంతకల్లు: ధర్మవరం రైల్వే జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం(17215) ఎక్స్ప్రెస్ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్ప్రెస్ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అనంతపురం ఎడ్యుకేషన్: స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నెలకు సంబంధించి 15న నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా... పదో తరగతి పరీక్షల నేపథ్యంలో 12 (నేడు)న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులకు సమాచారం పంపా రు. డీఈఓ అన్ని కాంప్లెక్స్లకు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థుల గ్రాండ్ టెస్ట్ పరీక్షల నిర్వహణ, సన్నద్ధత, పాఠశాల వార్షికోత్సవాలు, పదో తరగతి వీడ్కోలు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీల్లో చాలామంది టీచర్లు ఉన్నారు. ముస్లిం టీచర్లు రంజాన్ మాసపు ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఉన్నట్లుండి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఉదయం పాఠశాలలు జరిపి మధ్యాహ్నం కాంప్లెక్స్ మీటింగ్లకు హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు సెంటర్లుగా ఉన్న పాఠశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై టీచర్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రాయల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్. సిరాజుద్దీన్ మండిపడ్డారు. కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట కేజీబీవీలో 9వ తరగతి విద్యార్థిని పి.రుచిత (14) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు...కురుగుంట వైఎస్సార్ కాలనీకి చెందిన రాజేష్, మునీశ్వరి దంపతుల కుమార్తె పి.రుచిత స్థానిక కేజీబీవీలో చదువుతోంది. ఇటీవల కొంతకాలంగా కేజీబీవీలో రుచిత వ్యవహారం వేరే విధంగా ఉండేది. ఇతర అమ్మాయిలతో అతి చనువుగా ఉండేది. వారు విభేదించడంతో చేతులు కోసుకోవడం లాంటి ఘటనలకు పాల్పడింది. ఈ విషయం నాలుగు రోజుల క్రితం టీచర్ల దృష్టికి వచ్చింది. ఎస్ఓతో పాటు టీచర్లూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా మార్పు రాకపోగా చేష్టలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తల్లి మునీశ్వరిని కేజీబీవీకి పిలిపించారు. కొన్నిరోజులు ఇంట్లో పెట్టుకుని సర్దిచెప్పి పంపాలని సూచించారు. విద్యార్థిని నానమ్మ కేజీబీవీ సమీపంలో ఉండే రాధాస్వామి మందిరంలో వాచ్ఉమెన్గా ఉంటోంది. దీంతో మునీశ్వరి తన కుమార్తెను నేరుగా ఆ మందిరం వద్దకు పిలుచుకెళ్లారు. అక్కడే తండ్రి కాస్త గట్టిగా మందలించాడు. బాగా చదువుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లి డ్రస్సు తెస్తామని తల్లిదండ్రులిద్దరూ వెళ్లారు. వారు అలా వెళ్లగానే మందిరం కాంపౌండ్లో ఓ చెట్టుకు రుచిత ఉరి వేసుకుంది. రూరల్ పోలీసులు పరిశీలించి.. మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. -
హోరాహోరీగా ఇరుసు ఎత్తు పోటీలు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి గ్రామీణ యువకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పోటీ పడ్డారు. గుంతకల్లు మండలం తిమ్మాపురం వీరేష్ ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన నరేష్, తృతీయ స్థానంలో నాగలాపురం గ్రామానికి చెందిన నరేంద్ర నిలిచారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ అనంతపురం: పిటీషనర్ల సమస్యలపై సత్వరమే స్పందించాలని సిబ్బందిని ఎస్పీ పి. జగదీష్ ఆదేశించారు. పోలీస్కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే పిటీషన్లను నిర్ణీత గడువు లోపు చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డీవీ రమణ మూర్తి, మహిళా పీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితా లోపభూయిష్టం : వైఎస్సార్టీఏఅనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలో అనేక లోపాలున్నాయని వెఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణప్ప, రాష్ట్ర కార్యదర్శి ఏ. గోపాల్, రవీంద్రారెడ్డి గోవిందరెడి, రామకృష్ణ, కృష్ణా నాయక్, సిద్ధ ప్రసాద్, వెంకటరెడ్డి సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా తయారీలో భాగంగా వివిధ సబ్జెక్టుల్లో ప్రమోషన్ పొందిన తేదీలను జాయినింగ్ తేదీలుగా నమోదు చేశారని, మరికొందరు మరుసటి రోజు జాయినింగ్ డేట్గా నమోదు చేయడంతో జాబితా మొత్తం తప్పుల తడకగా మారిందన్నారు. అంతర్ రాష్ట్ర బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయుల సీనియారిటీని కాకుండా వారు కేడర్లో చేరిన తేదీని సీనియారిటీ జాబితాలో చూపించారన్నారు. ఫలితంగా జూనియర్లయినా వారు జాబితాలో మాత్రం సీనియర్లుగా కనిపిస్తున్నారన్నారు. అలాగే ఒక మేనేజ్మెంట్ నుంచి మరొక మేనేజ్మెంట్కు మారిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి జాబితా సరి చేయాలని కోరారు. -
నాడు హామీలు... నేడు అరెస్టులా!
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర ధ్వజం అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కూటమి నేతలు సిగ్గుపడాల్సిందిపోయి... వాటి గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అంగన్వాడీల అరెస్టులను నిరసిస్తూ నాయకులు, అంగన్వాడీలు సోమవారం స్థానిక టవర్క్లాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు జిల్లా నుంచి బయలుదేరిన అంగన్వాడీలను వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీలకు వేతనం పెంచలేదన్నారు. చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.15వేలు చెల్లించేలా జీఓ ఇచ్చారన్నారు. సుప్రీం కోర్టు చెప్పినట్లుగా అంగన్వాడీలకు గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటే అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తీవ్రస్థాయిలో పోరాటాలు సాగించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామాంజినేయులు, ముత్తూజా, వెంకటనారాయణ, నాగరాజు, ఎర్రిస్వామి, తిరుమలేషు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం నాయకురాళ్లు అరుణమ్మ, నక్షత్ర, రేవతి, పార్వతి, పద్మ, జ్యోతి, లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
శేషవాహనంపై చెన్నకేశవుడు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దేవేరులతో కలసి శేషవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రాత్రి 10 గంటలకు శేష వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. 12న జాబ్ మేళా గుంతకల్లు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో గుంతకల్లులోని న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో ఈ నెల 12న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు న్యాక్ ఏడీ గోవిందరాజులు, డీఎస్డీఓ ప్రతాప్రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీయువకులు అర్హులు. టాటా క్యాపిటల్, సింధూజ మైక్రో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో జాబ్మేళాకు హాజరు కావచ్చు. యువకుడి దుర్మరణం ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య గుంతకల్లు: స్థానిక తిమ్మనచర్ల రైలు మార్గంలో 440/29 కి.మీ. వద్ద పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు. -
రైతులంటే అంత చులకనా?
అనంతపురం అర్బన్: రైతులంటే సీఎం చంద్రబాబుకు చులకనై పోయారని, రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసంగా కూడా రైతులకు చేసిన మేలు ఏమీ లేదని దుమ్మెత్తిపోశారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం నాయకులు, రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు ఈ తొమ్మిది నెలల కాలంలో రైతులకు చేసిన మేలు ఏమిటో ఒక్కటైనా చెప్పాటని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. 2024–25 ఖరీఫ్, రబీలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతింటే ఈ రోజుకూ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఇదేనా రైతు సంక్షేమం అంటూ నిలదీశారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తామని హెచ్చరిస్తూ కలెక్టర్ వినోద్కుమార్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రామిరెడ్డి, ఆర్వీనాయుడు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా నాయకులు శివారెడ్డి, విరుపాక్షి, మధసూదన్ నాయుడు, రాజారాంరెడ్డి, బీహెచ్రాయుడు, దస్తగిరి, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది నెలలవుతున్నా పత్తాలేని పెట్టుబడి సాయం ప్రహసనంలా మారిన ‘అన్నదాత సుఖీభవ’ పంటలకు గిట్టుబాటు ధర లేదు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా -
గుడి.. గుడి స్థలం కూడా నాదే!
కళ్యాణదుర్గం రూరల్: ‘ఆలయం మా సొంతం. మాకన్నా దేవుడు గొప్ప కాదు. జాతరలో దుకాణం ఏర్పాటు చేయాలనుకునే వారు ఎవరైనా మా మాట వినాల్సిందే. మాకే డబ్బు చెల్లించాల్సిందే’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత డిష్ మురళి దౌర్జన్యాలకు తెరలేపాడు. వివరాలు... కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో అత్యంత ప్రసిద్ధి చెందిన అక్కమాంబ దేవాలయం ఉంది. కొన్నేళ్లుగా ఈ ఆలయానికి ఒంటిమిద్ది, కురాకులతోట, దేవాదులకొండ గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవాదులకొండ గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఏటా ఉగాది పండుగ అయిన మరుసటి రెండు రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వందకు పైగా వివిధ రకాల దుకాణాలు ఏర్పాటవుతుంటాయి. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఉగాదికి ముందుగానే టెండర్లు నిర్వహించి దుకాణాల నిర్వహణకు సంబంధించి అనుమతులు జారీ చేస్తారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తుంటారు. టీడీపీ నేత బరితెగింపు ఈ ఏడాది టీడీపీ నేత డిష్ మురళి బరితెగించి ఆలయ ఆదాయ వనరుల దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో తిష్టవేసి ఉగాది తర్వాత దుకాణాలు నిర్వహించదలుచుకునే వారు తనకే డబ్బు చెల్లించాలని హుకుం జారీ చేశాడు. ఇదేమని పలువురు ప్రశ్నిస్తే ‘దేవుడికి ఇస్తే ఏమొస్తుంది. ఆలయం సొమ్మంతా మాదే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ మా మాటే వినాలి. లేకపోతే ఏ ఒక్కరూ ఇక్కడ దుకాణం పెట్టుకోలేరు’ అంటూ బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా ‘గుడి మొత్తం నా స్థలంలోనే ఉంది. ఎక్కువగా మాట్లాడితే గుడి కూడా నాదే. ఎవ్వరేమీ చేసుకోలేరు’ అంటూ దౌర్జన్యానికి తెరదీశాడు. దీంతో దుకాణాలు నిర్వహించేందుకు సిద్ధపడి వచ్చిన వారు మరోమాట మాట్లాడకుండా డబ్బు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కొ దుకాణానికి రూ.1,500 చొప్పున వందకు పైగా దుకాణాల నిర్వాహకులతో బలవంతంగా డబ్బు వసూలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అక్కమాంబ ఆలయ ఆదాయ వనరుల దోపిడీ జాతరలో దుకాణాల ఏర్పాట్లపై ముందస్తుగానే వసూళ్లు ఇదేమని ప్రశ్నిస్తే దేవుడికన్నా తామే గొప్ప అంటూ టీడీపీ నేత బరితెగింపు -
బాబు తొలి సంతకంపైనే స్పష్టత లేదు
బీఎడ్ పూర్తి చేశా. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ నోటిఫికేషన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, తొమ్మిది నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత లేకుండా పోయింది. నిరుద్యోగులను నట్టేట ముంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిరుద్యోగ భృతి మాటేమో కానీ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. – మహాలింగ, కై రేవు, శెట్టూరు మండలం నిరుద్యోగ భృతి ప్రకటించాలి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అందిస్తామన్న భృతిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. భృతి ఇస్తే ఎంతో తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ప్రభుత్వ చేయూత లేక నిరుద్యోగులు గ్రామాల్లోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికై నా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి. –రామాంజనేయులు, గార్లదిన్నె న్యాయం చేయాలి నేను డిగ్రీ చదివా. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పింది. లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీకి ఓటేశా. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకుండా పోయింది. కనీసం బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. – అశోక్కుమార్, కణేకల్లు -
కమనీయం.. ఖాద్రీశుని కల్యాణం
కదిరి: ప్రహ్లాద వరదుడు, వసంత వల్లభుడు, కాటమరాయుడిగా పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నారసింహుని కల్యాణం కమనీయంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నవ వధువులుగా అలంకృతులైన శ్రీదేవి, భూదేవితో పాటు వరుడు లక్ష్మీ నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యాగశాల నుంచి పల్లకీపై కల్యాణ మండపం చేరుకున్నారు. అప్పటికే అక్కడ కిక్కిరిసిన భక్తజనం నోట శ్రీవారి గోవింద నామస్మరణ మార్మోగి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన అర్చక పండితులు శ్రీవారి కల్యాణోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ముక్కోటి దేవతలు వీక్షించే స్వామివారి వివాహాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ముందుండి జరిపిస్తున్నారని అర్చక పండితులు తెలియజేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ప్రతిరూపంగా విచ్చేసే కంకణ భట్టాచార్యులు మంగళ సూత్రాలను శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం భక్తులందరికీ శ్రీవారి తలంబ్రాలు పంచిపెట్టారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. లోకేష్ రాకతో ఆలయ ప్రాంగణం టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. దీంతో సామాన్య భక్తులు శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించలేకపోయారు. ధ్వజారోహణంతో దేవతలకు ఆహ్వానం నృసింహుని బ్రహ్మోత్సవాలను నలుదిక్కులా చాటేందుకు సోమవారం ఉదయం ప్రధాన ఆలయం ముందున్న ధ్వజ స్తంభానికి అర్చక పండితులు గరుడ దండాన్ని ధ్వజారోహణం చేశారు. సకల దేవతలకు ఇదే శ్రీవారి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక..అని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు పేర్కొన్నారు. పాల్గుణ కృష్ణ అష్టమి నాడు అంటే ఈ నెల 22న జరగనున్న తీర్థవాది ఉత్సవం రోజున శ్రీవారి చక్రస్నానం అనంతరం ఈ గరుడ దండాన్ని అవరోహణం చేస్తారు. దీంతో ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
అర్జీలిస్తూనే ఉన్నా స్పందన లేదు
సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి అనంతపురం అర్బన్: సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్కుమార్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, రామ్మోహన్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 419 వినతులు అందాయి. వినతుల్లో కొన్ని... ● ‘పీఎం’ కిసాన్ డబ్బు అందడం లేదని ఆత్మకూరు మండలం తలపూరుకు చెందిన పి.ఎర్రి స్వామి విన్నవించాడు. 2.30 ఎకరాల్లో చీనీ పంట ఉందని, ‘పీఎం కిసాన్’ కింద డబ్బులు అందించాలని కోరాడు. ● వితంతు పింఛను ఇప్పించాలంటూ శింగనమల మండలం గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన మంజుల అంజనమ్మ విన్నవించింది. తన భర్త వెంకటేష్ గత ఏడాది జనవరి 8న మరణించాడని, అప్పట్లో ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేదని చెప్పింది. ● తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని పుట్లూరు మండలం ఎస్.తిమ్మాపురం గ్రామానికి చెందిన జి.రవినాథ్రెడ్డి విన్నవించాడు. త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. పరిహారం తక్కువిచ్చారు సజ్జలదిన్నె పొలం సర్వే నంబరు 338–1–64, 339–2–74లో మాకు 6 ఎకరాలు ఉంది. జాతీయ రహదారి 544– డీ నిర్మాణం కోసం అందులో 23 సెంట్లు తీసుకున్నారు. ఆరు ఎకరాల్లో వేసిన కంది పంటనూ తొలగించారు. రూ.5.75 లక్షల పరిహారం రావాల్సి ఉంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు. తహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్లో చాలా సార్లు అర్జీ ఇచ్చాను. సమస్య పరిష్కారం కాలేదు. – ఇంజా లక్ష్మిరెడ్డి, వెంకటరెడ్డిపల్లి, తాడిపత్రి మండలం జాతీయ రహదారి 544–డీలో భాగంగా మాకున్న 4 సెంట్ల స్థలంతో పాటు ఇంటిని కోల్పోయాం. 15 ఏళ్ల వేపచెట్లు మూడు తొలగించారు. కేవలం రూ.2.30 లక్షల పరిహారం ఇచ్చారు. మా ఊరిలో చాలా మందికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందింది. అందరితో సమానంగా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు. – సుంకులమ్మ, సీపురం, శింగనమల మండలం అనంతపురం అర్బన్: చిన్నపాటి సమస్యలు జిల్లా కేంద్ర కార్యాలయాలకు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘తిప్పుకుని... తప్పుకుంటున్నారు’’ కథనానికి కలెక్టర్ స్పందించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వారం నుంచి తహసీల్దారు కార్యాలయాల తనిఖీ చేపడతామన్నారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు వారానికి ఒక తహసీల్దారు కార్యాలయాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ ప్రొఫార్మా సంబంధిత కార్యాలయాలకు పంపిస్తామన్నారు. తనిఖీకి వచ్చినప్పుడు ‘వన్ సర్వే నంబర్– వన్ఫైల్’ విధానం అమలును పరిశీలిస్తామన్నారు. చుక్కల భూమికి సంబంధించి ప్రజాసేవ పోర్టల్లో పెండింగ్ ఉన్నవాటిని పరిష్కరించాలన్నారు. మండలస్థాయిలో ప్రజాసేవలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు సన్మానం పెన్షన్ పంపిణీ ఒకటో తేదీ మొదటి గంటలో 100 శాతం పూర్తి చేసిన వారిని కలెక్టర్ సన్మానించారు. ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దాతల భాగస్వామ్యం (పీ4) పోస్టర్లను ఆవిష్కరించారు. లక్ష్యాలను పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకం, ఇతర కార్యక్రమాల కింద కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డ్వామా పీడీ, డీఎల్డీఓలు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఏపీడీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బాధితుల ఆవేదన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 419 వినతులు -
పతాక స్థాయికి నిరుద్యోగం
● గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు ఉన్నా ఫలితం శూన్యం ● ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కాక చిన్న ఉద్యోగాలకూ దిక్కులేని వైనం ● 20 లక్షల ఉద్యోగాలిస్తామని ముఖం చాటేసిన చంద్రబాబు ● భృతి ఇస్తామని చెప్పి రిక్తహస్తం చూపడంపై నిరుద్యోగుల మండిపాటు అనంతపురం నగరంలోని ఓ హోటల్లో రెండు రోజుల క్రితం ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ సేల్స్మెన్ ఉద్యోగాలకు నిర్వహించిన వాక్ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన నిరుద్యోగులు వీరు. ఇంజినీరింగ్ మొదలు ఎంబీఏ పట్టభద్రుల వరకు వందల మంది హాజరయ్యారు. దీంతో హోటల్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. చిన్న సేల్స్మెన్ ఉద్యోగం కోసం వచ్చిన వీరిని చూస్తే జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ● గార్లదిన్నెకు చెందిన రాజశేఖర్ ఇటీవల బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసినా రాలేదు. దీంతో ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. మరో ఉద్యోగంలో చేరదామని ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ● రాప్తాడుకు చెందిన శీనయ్య అనంతపురంలో బీకాం పూర్తి చేశాడు. తన అర్హతకు తగిన జాబు కోసం కొన్ని నెలలుగా ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. దీంతో ఇటీవల ఓ పెట్రోలు బంకు యజమాని వద్ద నిర్వహణ మేనేజర్గా చేరాడు. రేయింబవళ్లు పనిచేస్తే రూ.12 వేలు వేతనం. వీరే కాదు.. ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులది ఇదే పరిస్థితి. -
పెట్టుబడి కూడా అందలేదు
కక్కలపల్లి టమాట మండీకి వచ్చిన సరుకు అనంతపురం అగ్రికల్చర్: టమాటను నమ్ముకున్న రైతులు ఈ సారి కూడా భారీగా నష్టాలు మూటకట్టుకున్నారు. జిల్లాలో ఏకంగా ఖరీఫ్, రబీలో ఈ ఏడాది 45 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగులోకి వచ్చింది. ఈ సారి 8 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడిని రైతులు సాధించారు. టన్ను సరాసరి కనిష్టంగా రూ.15 వేలు ప్రకారం అమ్ముడుబోయినా ఈ సారి రూ.1,200 కోట్ల మేర టర్నోవర్ ఉండేదని అంచనా. కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా 80 శాతం మంది రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాల టమాట సాగులో మొదటి స్థానంలో ఉండగా... 22 వేల ఎకరాలతో శ్రీసత్యసాయి జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి. నాలుగు నెలలుగా పతనావస్థలో.. సీజన్ ఆరంభమైన జూలై నుంచి అనంతపురం సమీపంలో ఉన్న కక్కలపల్లి మండీలో టమాట అమ్మకాలు మొదలయ్యాయి. మొదట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు టమాట సాగుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఫలితంగా సెప్టెంబర్ నుంచి పంట దిగుబడులు, మార్కెట్కు సరుకు రావడం పెరిగింది. ధర కొంచెం బాగున్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు రావడంతో పంట తడిసిందని, మచ్చ ఉందంటూ మండీ నిర్వాహకులు, వ్యాపారులు ‘నో సేల్’ పెట్టడంతో చాలా మంది రైతులకు అసలుకే మోసపోయారు. ఇలా డిసెంబర్ వరకు టమాట అమ్ముడుపోక కొందరు రైతులు తల్లడిల్లిపోయారు. ఇక డిసెంబర్ నుంచి మార్కెట్ పూర్తిగా పతనమైంది. గరిష్ట ధర రూ.10, కనిష్టం రూ.5, సరాసరి రూ.7 చొప్పున గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు కొనసాగుతుండటంతో టమాట రైతులు పూర్తిగా చిత్తయ్యారు. నాలుగైదు లాట్ల గరిష్ట ధర రూ.10 ప్రకారం అమ్ముడుబోగా మిగతాదంతా రూ.5 నుంచి రూ.7 కి మించి ధర పలకలేదు. దీంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాదని గ్రహించి పంటను పొలాల్లోనే వదిలేశారు. ‘కూటమి’ మోసం.. జిల్లాలోని 31 మండలాల్లో ఖరీఫ్లో 42 వేల ఎకరాలు, రబీలో 3 వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు ఉద్యానశాఖ నివేదికలు చెబుతున్నాయి. టమాట రైతులు ఇబ్బంది పడకుండా కిలో రూ.8 చొప్పున టన్ను రూ.8 వేలతో కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మార్కెటింగ్శాఖ ద్వారా ఇటీవల కేవలం 60 టన్నులు అంటే రూ.4.80 లక్షల విలువ చేసే టమాట మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. అనంతపురం మండీకి ప్రస్తుతం కొంత తగ్గినా డిసెంబర్ నుంచి పరిగణనలోకి తీసుకుంటే రోజుకు సగటున 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. కనీసం రోజుకు 100 టన్నులైనా కొనుగోలు చేస్తే కొంత వరకు రైతులకు వెసులుబాటు ఉంటుంది. కానీ సీజన్ అంతా కొన్నది కేవలం 60 టన్నులు మాత్రమే అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. నాలుగు నెలలుగా గిట్టుబాటు ధర లేక భారీగా నష్టాలు కిలో రూ.8 చొప్పున కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం కేవలం 60 టన్నులతో చేతులెత్తేసిన మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోనే అత్యధికంగా 45 వేల ఎకరాల్లో టమాట పంట ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేశా. పంట దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయాను. ఇటీవల మండీలో 15 కిలోల బాక్సు రూ.70కు మించి పలకలేదు. అంటే కిలో రూ.5 చొప్పున కూడా కొనుగోలు చేయడం లేదు. మొదటి నాలుగైదు కోతల్లో నాణ్యమైన కాయ ఉన్నా కొనలేదు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి అందలేదు. ఇలా అయితే రైతులు ఎలా బతకాలి. – సుధాకర్, టమాట రైతు, దయ్యాలకుంటపల్లి, బీకేఎస్ మండలం -
ప్రభుత్వానికి సత్తా చూపుదాం
అనంతపురం కార్పొరేషన్: యువతతో పాటు అన్ని వర్గాలనూ దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ నెల 12న జరిగే ‘యువత పోరు’ కార్యక్రమం ద్వారా మన సత్తా ఏంటో చూపుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ చరిత్ర సృష్టించిందన్నారు. ఆ రోజున విద్యార్థులు, యువతకు అండగా నిలిచేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ సర్కిల్, సంగమేశ్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్కు ర్యాలీ చేరుకుంటుందన్నారు. కలెక్టర్కు వినతి పత్రం అందించి ప్రభుత్వానికి హెచ్చరిక చేయబోతున్నామన్నారు.జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇటీవల బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, దీంతో ఎంతో మంది వైద్యులు, ఇంజినీర్లుగా ఎదిగారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ‘వసతి దీవెన’ పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని తెలిపారు. రూ.4,500 కోట్ల బకాయిలు.. ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ సీఎం చంద్రబాబును వదిలేది లేదని ‘అనంత’ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రూ.4,500 కోట్ల బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఈ విషయాలపై కనీసం బడ్జెట్లో కూడా ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే... కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైందన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ నేతలు రమేష్ గౌడ్, కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, సాకే చంద్రశేఖర్, చంద్రశేఖర్ యాదవ్, చింతకుంట మధు, చింతా సోమశేఖర్ రెడ్డి, కృష్ణవేణి, ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, గౌని నాగన్న, మల్లెమీద నరసింహులు, సైఫుల్లాబేగ్, అమర్నాథ్రెడ్డి, కేశవరెడ్డి, మిక్చర్ రామకృష్ణా రెడ్డి, లబ్బే రాఘవ, దత్తా, అనిల్కుమార్ గౌడ్, రాధాకృష్ణ, కై లాష్, శ్రీదేవి, శోభారాణి, దేవి, శోభాబాయి, పార్వతి, భారతి, కార్పొరేటర్లు ఇసాక్, సాకే చంద్రలేఖ, లావణ్య, సుమతి, ఉష తదితరులు పాల్గొన్నారు. యువతకు అండగా నిలుద్దాం ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ బాబును వదిలేది లేదు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
నేడు కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కార్యక్రమం సాగుతుందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను క్లుప్తంగా అర్జీ రూపంలో తెలియజేయాలని సూచించారు. పట్టుకుంది 144.. కేసులో చూపింది 52! పుట్లూరు: తనిఖీల్లో 144 మద్యం బాటిళ్లు పట్టుపడితే.. కేసులో కేవలం 52 మాత్రమే చూపి పోలీసులు తమ నైజాన్ని బయటపెట్టుకున్నారు. వివరాలు.. పుట్లూరు మండలం చెర్లోపల్లి – నారాయణరెడ్డిపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో మూడు కేసుల్లో మొత్తం 144 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టి.నరసింహులు అనే వ్యక్తి 52 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడినట్లు కేసు నమోదు చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో మిగిలిన 92 మద్యం బాటిళ్లు ఎవరి కోసం దాచారో చెప్పాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా కేసుల నమోదుకు ఈ బాటిళ్లను అడ్డు పెట్టనున్నారా? లేదా పోలీసులే గుట్టుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. రాయదుర్గంలో జోరుగా పావురాల పందేలు రాయదుర్గంటౌన్: నియోజకవర్గ కేంద్రం రాయదుర్గంలో పావురాల పందేలు జోరుగా సాగుతున్నాయి. పావురాలను గాల్లోకి ఎగరవేసి వాటిలో ఏది ముందుగా గమ్యాన్ని చేరితే దానిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో రూ. లక్షల్లో బెట్టింగ్ సాగుతోంది. ఆదివారం పావురాలను ఎగుర వేసి వాటి రాక కోసం పట్టణ శివారులోని పైతోట వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు గుమికూడారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తెలుగు తమ్ముళ్ల కొట్లాట గుత్తి: బోరు బిల్లుల విషయంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. వివరాలు.. ఎన్నికలకు ముందు, తర్వాత బోరు వేసిన బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదని, వీటిని వెంటనే మంజూరు చేయించాలంటూ టీడీపీ కార్యాలయంలో శనివారం రాత్రి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్ ఎదుట బోరు రిగ్గు నిర్వాహకుడు నాగరాజు వాపోయాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత చౌదరి జోక్యం చేసుకుని వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న పలువురు నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అనంతరం ఇదే అంశాన్ని తనకు అత్యంత సన్నిహితుడైన గుత్తి ఆర్ఎస్కు చెందిన రాజాకు చౌదరి తెలిపాడు. దీంతో రాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నాగరాజుకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ఎంత ధైర్యముంటే చౌదరితో వాదనకు దిగుతావ్ అంటూ గద్దించాడు. అదే స్థాయిలో బోర్ రిగ్గు నిర్వాహకుడు కూడా సమాధానమివ్వడంతో ఇద్దరి మధ్య ఫోన్లోనే మాటల యుద్ధం సాగింది. దమ్ముంటే గాంధీ సర్కిల్కు రావాలంటూ ఇద్దరూ సవాల్ విసురుకున్నారు. అక్కడితో ఆగకుండా గాంధీ సర్కిల్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో పెద్దసంఖ్యలో తమ అనుచరవర్గాలను దింపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. -
ఖాద్రీశుడి కల్యాణము చూతము రారండి
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి కల్యాణోత్సవం సోమవారం రాత్రి 9 గంటలకు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి లోకేష్ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తారని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మీడియాకు తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తులందరూ కనులారా వీక్షించేందుకు ఆలయ, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. వేదికపై అర్చకులు మాత్రమే కూర్చునే విధంగా అధికారులు నిర్ణయించారు. కల్యాణోత్సవం జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొందరు అర్చక పండితులు హాజరుకానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ● స్వామివారిని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ను సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఘనంగా అంకురార్పణ.. ముందుగా అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ గావించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మంగళ వాయిద్యాల మధ్య నారసింహుడు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆలయానికి నైరుతి దిశలో ఉన్న మండపానికి చేరుకున్నారు. అర్చక పండితులు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో పుట్ట మన్ను సేకరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 పాలిక(కుండ)లలో నవ ధాన్యాలతో అంకురార్పణ (బీజావాపం) చేశారు. ఈ నవధాన్యాలు దిన దినాభివృద్ధి చెందేలా అర్చకులు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకూ రోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. ఏ ధాన్యం బాగా మొలకెత్తుతుందో ఆ పంట ఈ యేడాది బాగా పండుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు ఈ పక్షం రోజుల పాటు యాగశాలలోనే గడిపి, ఇక్కడి నుంచే తన భక్తులకు దర్శన భాగ్యం కల్గిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేడు స్వామివారి కల్యాణోత్సవం -
అంగన్వాడీలపై ఉక్కుపాదం!
తాడిపత్రి రూరల్: అంగన్వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న వైనంపై నిరసన తెలిపేందుకు అంగన్వాడీలు సోమవారం విజయవాడలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జిల్లా నుంచి మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. పైగా వారిని భయపెట్టేందుకు సెక్టార్ మీటింగ్ అంటూ డ్రామాకు తెరలేపింది. మహా ధర్నాకు బయలుదేరిన తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీడీఎస్ అధికారులు హెచ్చరికలకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు అంగన్వాడీల కదలికలపై నిఘా ఉంచారు. ముందస్తు నోటీసులు అందించారు. అయినా విజయవాడ మహాధర్నాకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. యూనియన్ నాయకుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకూ వెనుకాడలేదు. అంగన్వాడీ సెంటర్లను మూసివేసి ధర్నాకు వెళ్లే వారి వివరాలను సేకరించాలని గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహా ధర్నాకు వెళ్లి తీరుతామని అంగన్వాడీలు తెలిపారు. అంగన్వాడీల డిమాండ్లు ఇలా... ● అంగన్వాడీలకు నెలకు రూ.28 వేల వేతనంతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలి. ● హెల్పర్ల పదోన్నతులపై విధివిధానాలను అమలు చేయాలి. ● ఇంటి అద్దెలు, టీఏ బిల్లులు మంజూరు చేయాలి. ● సర్వీస్లో మృతి చెందిన వారికి మట్టి ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలి. ● ప్రీ స్కూల్ను బలోపేతం చేసి ‘తల్లికి వందనం’ అమలు చేయాలి. ● ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇవే హామీలు ఇచ్చారని, వీటిని వెంటనే అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. భయపడేది లేదు.. కూటమి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు అంగన్వాడీలు భయపడరు. ప్రభుత్వ మెడలు వంచైనా హామీలను నెరవేర్చుకుంటాం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించినా భయపడలేదు. ప్రస్తుతం మహాధర్నాను అడ్డుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. – శకుంతల, ఉమ్మడి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు సెలవు ఇవ్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఎవరికీ సెలవు ఇవ్వడం లేదు. సెక్టార్ మీటింగ్ పెట్టుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల గురించి వివరించడానికి సూపర్వైజర్లు మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంగన్వాడీలపై ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు చేయడం లేదు. – సాజిదాబేగం, సీడీపీఓ, తాడిపత్రి -
తిప్పుకుని.. తప్పుకుంటున్నారు!
● ‘నీటి కుళాయి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కుళాయి కనెక్షన్ ఇప్పించేలా చూడండి’ అంటూ తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ జనవరి 27న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశాడు. ● తాము నివాసముంటున్న 9వ వార్డులో మురికి కాలువ నిర్మాణం కోసం గ్రామసభలో తీర్మానం చేసినా పనులు చేపట్టలేదని, తగిన చర్యలు తీసుకోవాలని గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహమ్మద్ రఫీ ఈనెల 3వ తేదీన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్కు విన్నవించుకున్నాడు. ● ‘ఇంటి స్థలం సర్వే నంబరు 506–4లో ప్లాట్ నంబరు 86 హద్దులు పోయాయి. అధికారులకు చెప్పి హద్దులు చూపించండి’ అంటూ కూడేరు మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన బషీర్ అహమ్మద్ ఈనెల 3న పరిష్కార వేదికలో అధికారులను కోరాడు. .... ఇవన్నీ గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలే. కానీ, అక్కడి అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక ప్రజలు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఒకటి రెండు కాదు ప్రతి వారం పదుల సంఖ్యలో ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఏస్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఆస్థాయిలోనే పరిష్కారం కావాలి. ఇక నుంచి ప్రత్యేకంగా తహసీల్దారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్ని తనిఖీ చేస్తాం. వాటి స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను పరిశీలించి ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్ ఉన్నాయి..ఎందుకు పెండింగ్ పెట్టారు.. అనేదానిౖపై విచారణ చేస్తాం. అర్జీదారులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. – వి.వినోద్కుమార్, కలెక్టర్ అనంతపురం అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి ప్రజా సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపించాల్సి ఉన్నా ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కానరావడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన ఇక్కడి అధికారులు, సిబ్బందిలో కరువవుతోంది. దీంతో అర్జీదారులు జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘పరిష్కార వేదిక’ను ఆశ్రయిస్తున్నారు. అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయి. అటు తరువాత సర్వే, భూరికార్డుల శాఖ, పోలీసు శాఖకు సంబంధించి ఉంటున్నాయి. నిర్లక్ష్య ధోరణి... అవినీతి! మండలస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యధోరణి, అవినీతి కారణమనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమస్యలు పరిష్కరించండంటూ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కొందరు.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ మరికొందరు అర్జీ రూపంలో తమ సమస్యతో పాటు ఫిర్యాదును పరిష్కార వేదికలో కలెక్టర్, అధికారులకు దృష్టికి తీసుకొస్తుండటమే ఇందుకు నిదర్శనం. మండల స్థాయిలో పరిష్కారం కాని ప్రజాసమస్యలు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్కు వస్తున్న బాధితులు కిందిస్థాయి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
యువతకు అండగా నిలుద్దాం
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వ పాలనలో దగా పడుతున్న యువతకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన యువత పోరును జయప్రదం చేద్దామంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఐక్య విద్యార్థి, కుల సంఘాల నాయకులతో కలసి అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 12న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, తదితర హామీలను నెరవేరుస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ హామీనిచ్చి మోసం చేశారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,35,000 మందికి, వైద్య రంగంలో 75,000 మందికి ఉద్యోగాలను కల్పించిందన్నారు. పేదరికం చదువుకు అడ్డు రాకూడదని ఫీజురీయింబర్స్మెంట్ను పక్కాగా అమలు చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా దగా చేసిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో 5 కళాశాలల్లో 2,550 మంది విద్యార్థులకు అడ్మిషన్లు సైతం కల్పించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని కళాశాలలు వద్దని కేంద్రానికి లేఖరాయడమే కాక, మిగిలిన వాటిని ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర సాగించడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీ, పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, జీవీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్, ఎస్సీ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షుడు బిల్లే జగదీష్, ఎస్వీఎస్ఎఫ్బీసీ చక్రధర్ యాదవ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జేన్నే చిరంజీవి, బీసీ ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేశవ గౌడ్, జీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు కైలాష్ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న ఆందోళనను జయప్రదం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ -
యువతపోరు విజయంతం చేద్దాం
బెళుగుప్ప: నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 12న వైఎస్సార్సీపీ తలపెట్టిన యువతపోరు కార్యక్రమాన్ని విజయంతం చేద్దామంటూ ఆ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. బెళుగుప్ప మండలం కాలువపల్లిలో వైఎస్సార్సీపీ మండల బీసీసెల్ అధ్యక్షుడు వెంకటేశులు స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి దిక్కు లేదన్నారు. ఇలాంటి మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు. కుప్పంకు నీటిని తరలించేందుకే హంద్రీనీవా లైనింగ్ పనులు.. కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించాలనే లక్ష్యంతో జిల్లా రైతుల ఆశలకు శాశ్వతంగా సమాధి కడుతూ హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని విశ్వ మండిపడ్డారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పూర్తి విస్మరించారన్నారు. లైనింగ్ పనులు పూర్తయితే భూగ్బజలాలు అడుగంటి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపడమే కాక జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికీ పార్టీలకు అతీతంగా రైతులందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సెల్ అధికార ప్రతినిధి వీరన్న, సర్పంచ్ పెద్దన్న, డీసీసీబీ మాజీ డైరెక్టర్ శివలింగప్ప, అంకంపల్లి సర్పంచ్ రుద్రానంద, మాజీ సర్పంచ్ తిమ్మన్న, పార్టీ సీనియర్ నాయకులు మోహన్, శ్రీనివాసరెడ్డి, చందూ, కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, తిప్పేస్వామి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి -
‘వెలుగు’లో టీడీపీ నేత చిచ్చు
కుందుర్పి: స్వలాభం కోసం వెలుగు పథకంలో పనిచేస్తున్న ఏపీఎం, సీసీల మధ్య ఓ టీడీపీ నేత చిచ్చు రగిల్చాడు. ఇది కాస్త దావాలనమై కార్యాలయం నాలుగు గోడల మధ్య రెండు రోజుల క్రితం భగ్గున మండింది. పరస్పర దూషణలతో ఏపీఎం, సీసీ రెచ్చిపోయారు. కుందుర్పి మండల వెలుగు కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ నేత బండారం బట్టబయలైంది. ఏం జరిగిందంటే.. కుందుర్పి మండలంలో పనిచేస్తున్న ఏపీఎం సర్ధానప్ప తీరుతో గత రెండు రోజులుగా మండల సమాఖ్య కార్యాలయంలో పెద్ద వివాదం నెలకొంది. పలు గ్రామాలకు చెందిన సంఘాల సభ్యులకు సంబంధించి రుణాల మంజూరుకు సీసీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏపీఎం దృష్టికి పంపారు. అయితే దీనిపై ఏపీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక టీడీపీ నేత సూచించిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను తిరస్కరించారు. దీనిపై సీసీలను బాధిత సభ్యులు నిలదీయడంతో ఇందులో తమ ప్రమేయం లేదని చేతులెత్తేశారు. రుణాల మంజూరు అంశం ఏపీఎం పరిధిలో ఉంటుందని సమాధానమిచ్చారు. కుర్చీలు విసురుకుని... రుణాల అంశంలో అన్యాయానికి గురైన పలువురు సభ్యులు రెండు రోజుల క్రితం వెలుగు కార్యాలయంలో ఏపీఎం, సీసీలను నిలదీశారు. అందరి సమక్షంలో ఏపీఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో చెమటోడ్చి పనులు చేస్తున్నది టీడీపీ నేత కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. వివక్ష మాని అందరినీ సమదృష్టి చూడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో అక్కడే ఉన్న సీసీ తిమ్మప్పపై ఏపీఎం సర్దానప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. టీడీపీ నేత చెబితే పనిచేసి తీరాల్సిందేనని, తాను టీడీపీ నేత మాట వినప్పుడు మీరెందుకు వినరంటూ సీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నువ్వెంతంటే.. నువ్వెంత అని దూషించుకుంటూ కుర్చీలను విసిరారు. అక్కడే ఉన్న సీ్త్ర నిధి మేనేజర్ గోవిందు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సీసీలు ఏమంటున్నారంటే.. ఘటనకు సంబంధించి పలువురు సీసీలు మాట్లాడుతూ.. తమ సంతకాలు లేకుండానే టీడీపీ నాయకులు చెప్పిన వారికి రుణాలు చేస్తానని ఏపీఎం సర్ధానప్ప చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ సంతకాలు లేకుండానే టీడీపీ కార్యకర్తల కుటుంబసభ్యులకు ఏపీఎం రుణాలు మంజూరు చేయడం వివాదానికి కారణమైందన్నారు. ఇదేం పెద్ద సమస్య కాదు ‘ఔను వాళ్లిద్దరూ వాదులాడుకున్నారు. కార్యాలయంలోనే గొడవ పడ్డారు. ఈ విషయంగా వారిని ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజ పిలిపించి మందలించాడు. ఆ సమయంలో నేను విజయవాడలో ఉన్నా. సోమవారం కార్యాలయానికి ఏపీఎం, సీసీలను పిలిపించుకుని మాట్లాడుతాను. ఇదేం పెద్ద సమస్య కాదు’. – నారాయణస్వామి, ఏరియా కో ఆర్డినేటర్, వెలుగు, కళ్యాణదుర్గం టీడీపీ నేత చెబితే చేసి తీరాల్సిందేనంటూ స్వామి భక్తి చాటిన ఏపీఎం సీసీల సంతకం లేకుండానే రుణాలు మంజూరు చేసిన వైనం నాలుగు గోడల మధ్య పరస్పర దూషణలతో రెచ్చిపోయిన వెలుగు సిబ్బంది -
పీఏబీఆర్లో తగ్గుతున్న నీటిమట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 2.99 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. శ్రీసత్యసాయి, అనంత, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి పథకాలకు 55 క్యూసెక్కులు, ధర్మవరం కుడికాలువకు లీకేజీ ద్వారా 35 క్యూసెక్కులు, నీటి ఆవిరి, ఇతర లీకేజీల రూపంలో మరో 40 క్యూసెక్కుల నీరు రోజూ బయటకు వెళుతోంది. అబ్బుర పరిచిన రాతిగుండు పోటీలు పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రాతిగుండు ఎత్తు పోటీలు అబ్బుర పరిచాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన పది మందికి పైగా పోటీల్లో పాల్గొన్నారు. కర్ణాటకు చెందిన కర్ణ అనే యువకుడు గుండును సునాయాసంగా ఎత్తి మొదటి స్థానాన్ని కై వసం చేసుకున్నాడు. అలాగే రెండో స్థానంలో రాయదుర్గం నివాసి రాజశేఖర్, మూడో స్థానంలో డోన్ మండలం దొరసానిపల్లికి చెందిన చందు నిలిచారు. విజేతలను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. జాతీయ రహదారిపై చైన్ స్నాచింగ్బుక్కరాయసముద్రం: మండలంలోని 44వ జాతీయ రహదారిపై ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో నివాసముంటున్న రమేష్, వనజ దంపతులు కొంత కాలంగా గార్లదిన్నెలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వనజ, తన కుమారుడిని స్కూటీ వాహనంపై ఎక్కించుకుని గార్లదిన్నెకు బయలుదేరింది. లోలూరు క్రాస్ వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అడ్రస్ అడిగే నెపంతో వనజ వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో ఆమె దృష్టిని ఏమార్చి మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
● కుంటలో ఈతకెళ్లి ఇద్దరు బాలుర మృతి హిందూపురం: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. వివరాలు... హిందూపురం సమీపంలోని అటోనగర్లో నివాసముంటున్న జహీర్ కుమారుడు రిహాన్ (14), సుహేల్, ఉమేరా దంపతుల కుమారుడు అయాన్ (12) స్థానిక పాఠశాలలో 7, 6 తరగతులు చదువుకుంటున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సమీపంలోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. పిల్లల కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని నీట మునిగిన ఇద్దరినీ వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. చికిత్సకు స్పందించిక రిహాన్, అయాన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆటో నగర్ వాసులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై రెండో పట్టణ పీఎస్ సీఐ అబ్దుల్ కరీం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బీటెక్ విద్యార్థిని అదృశ్యం ధర్మవరం అర్బన్: స్థానిక రామనగర్కు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని కనిపించడం లేదు. అనంతపురం శివారులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు రెండో పట్టణ పీఎస్ సీఐ రెడ్డప్ప తెలిపారు. -
కూటమి దగాపై కదం తొక్కాలి
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’లో కదం తొక్కాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ ఉంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. ర్యాలీలో యువత భారీగా పాల్గొనాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నాఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదన్నారు. పైగా రూ.1.30 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ‘తల్లికి వందనం’ తొలి ఏడాది ఎగనామం పెట్టారన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని యువతను మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడలు వంచైనా యువతకు అండగా నిలుస్తామన్నారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 12న ‘యువత పోరు’కు భారీగా తరలిరావాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు -
ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్ జిల్లా పులివెందుల వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి అనంతపురం జిల్లా బాల, బాలికల కబడ్డీ జట్లను ఆదివారం గుంతకల్లులోని రైల్వే గ్రౌండ్లో ఎంపిక చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్, సెలక్షన్ కమిటీ సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. బాలికల విభాగంలో విష్ణు ప్రియ (అనంతపురం), వర్ష (ప్రసన్నాయపల్లి), నవ్యశ్రీ (తాడిపత్రి), సుచరిత (ఎస్కేయూ), జాను (చిన్మయనగర్), వర్షియా (తాడిపత్రి), హిమవతి (కొర్రపాడు), ప్రణతి (కూడేరు), షాజియా (ధర్మవరం) అనుశ్రీ (విడపనకల్లు), కీర్తన (ప్రసన్నాయపల్లి), తాడిపత్రికి చెందిన యజ్ఞ, నందిని చోటు దక్కించుకున్నారు. బాలురు విభాగానికి లోకేష్ (కౌకుంట్ల), మహమ్మద్ ఆసీఫ్ (ధర్మవరం), మహమ్మద్ ఉస్మాన్ (తాడిపత్రి), మల్లికార్జున (గుంతకల్లు), వరుణ్కుమార్ (బొమ్మనహళ్), పవన్కుమార్ (అనంతపురం), సునీల్ కుమార్ (గుంతకల్లు), చరణ్ (అనంతపురం), రాజు (అనంతపురం), వేణు (వైటీ చెరువు). హర్షవర్థన్ (తాడిపత్రి), ఏసురాజు (ధర్మవరం), విశ్వసందేష్ (అనంతపురం) ఎంపికయ్యారు. -
టీటీసీ పరీక్ష ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ)–2024 థియరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. www. bse.ap. gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ ప్రసాద్బాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణత సర్టిఫికెట్లు జిల్లా కార్యాలయానికి చేరగానే అభ్యర్థులకు పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. 5,847 కేసుల పరిష్కారం అనంతపురం: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ‘జాతీయ మెగా లోక్ అదాలత్’లో 5,847 కేసులకు న్యాయమూర్తులు పరిష్కారం చూపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24 బెంచ్లు నిర్వహించారు. బాధితులు రాజీకి సమ్మతించడంతో 886 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు 80, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు 48, ప్రీ లిటిగేషన్ కేసులు 388 పరిష్కారమయ్యాయి. ప్రమాద కేసుల్లో బాధితులకు రూ. 3.83 కోట్లు పరిహారంగా అందించారు. సివిల్ కేసుల్లో రూ.2.82 కోట్లు, ప్రీ లిటిగేషన్ కేసుల్లో రూ.68 లక్షలు రాజీ ప్రకారం బాధితులకు ఇప్పించారు. లోక్అదాలత్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. శివప్రసాద్ యాదవ్ పర్యవేక్షించారు. జిల్లా కోర్టులో కక్షిదారులకు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కిరికెర సర్పంచ్కు ఉత్తమ పురస్కారం హిందూపురం: పంచాయతీ స్వశక్తి అధినేత్రి ఉత్తమ పురస్కారాన్ని హిందూపురం మండలం కిరికెర పంచాయతీ సర్పంచ్ వైఎన్ భాగ్యమ్మ అందుకున్నారు. ఢిల్లీలో 5,6 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రాష్ట్రం నుంచి ఆరుగురు మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కిరికెర సర్పంచ్ భాగ్యమ్మ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మహిళా సాధికారత, ఫ్రెండ్లీ ఉమెన్, గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి క్లుప్తంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెను ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం సర్పంచ్ భాగ్యమ్మకు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్ వినోద్కుమార్ చేతుల మీదుగా ‘పంచాయతీ స్వశక్తి అధినేత్రి పురస్కారం’తో పాటు జాతీయ ఉత్తమ ప్రశంసా పత్రం, షీల్డ్ అందించి అభినందించారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె..కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే అంకురార్పణ ఘట్ట ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాతే అంటే రాత్రి సమయంలో ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంలో అగ్నిహోమం ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు. నవధాన్యాల మొలక సకల దేవతల ఆహ్వానం అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలిక (కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం గావిస్తారు. అనంతరం అర్చక పండితులు సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. -
నేడు చంద్రమౌళీశ్వరుని బ్రహ్మ రథోత్సవం
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి బ్రహ్మ రథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే గవిమఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, నిత్యాన్నదాన సేవ, తాత్కాలిక మరుగు దొడ్లతో పాటు గవిమఠం ఆవరణలో పోలీసు కంట్రోల్ రూం, ఉరవకొండ సీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్పెషల్ పార్టీ బలగాలు బందోబస్తు చేపట్టనున్నాయి. ఉత్సవాన్ని తిలకించడానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి చంద్రమౌళీశ్వర స్వామి బసవేశ్వర వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే..
● లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం. ● డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సరిగా చేయకపోవడం. ● ఫిర్యాదులను పట్టించుకోకపోవడం. ● కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం. ● జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ లేకపోవడం. ● లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుకు నిధులు ఇవ్వకపోవడం. ● ఇచ్చిన నిధులు కూడా సరిగా వినియోగించకపోవడం. -
మహిళా సాధికారతతోనే దేశ పురోగతి
సమానత్వంతోనే జాతి మనుగడ అనంతపురం: మహిళా సాధికారతతోనే దేశ పురోగతి సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం జేఎన్టీయూ(ఏ) ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న, రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, ప్రశాంతి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుశీలమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.జిల్లాలో బాల్య వివాహాలు సమస్యగా తయారయ్యాయన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ బి. వినూత్న జిల్లాలో బాగా పనిచేశారని, న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసేందుకు వెళ్తున్నారని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ తన భర్త ప్రోత్సాహంతోనే అందరి ముందు ఉన్నానని పేర్కొన్నారు.అనంతరం ఐసీడీఎస్, సెర్ప్, మెప్మా, పోలీసు, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ప్రశాంతి సమాఖ్య , సీ్త్రనిధి, పరిశ్రమల శాఖ పరిధిలో పీఎంఈజీపీ కింద ఎంఎస్ఎంఈ రుణాలు, పీఎం విశ్వకర్మ, స్టాండప్ ఇండియా, ‘ముద్ర’, హ్యాండ్లూం, టెక్స్టైల్స్, మెప్మా పరిధిలో రుణాల చెక్లను మహిళలకు అందజేశారు. అనంతపురం: జాతి మనుగడకు సీ్త్ర, పురుష సమానత్వం ముఖ్యమని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా జడ్జి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం మహిళలకు ఉంటుందన్నారు. మహిళల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కంటి ఆసుపత్రి, అక్బర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 300 మంది పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యవాణి, బార్ ప్రెసిడెంట్ గురుప్రసాద్,ఆలిండియా బార్ కౌన్సిల్ మెంబర్ ఆలూరి రామిరెడ్డి, మహిళా కోర్టు జడ్జి శోభారాణి, పోక్సో కోర్టు జడ్జి రాజ్యలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి నిర్మల, ఎకై ్సజ్ కోర్టు జడ్జి పావని పాల్గొన్నారు. -
బాలిక.. ఇంకా వెనక!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా రాణిస్తున్నా.. జననాల పరంగా మాత్రం అమ్మాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారు. 30 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన ఐదు దశాబ్దాల్లో ఒక్కసారైనా అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య పెరగలేదు. తాజా సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం అమ్మాయిల సంఖ్యా పరంగా ఇప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా అట్టడుగున ఉన్నట్లు వెల్లడైంది. యథేచ్ఛగా లింగనిర్ధారణ.. ఉమ్మడి జిల్లాలో పలు రేడియోడయాగ్నస్టిక్స్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ జరుగు తోంది. ఈ దురవస్థ వ్యాపారంగా సాగుతోంది. కొంతమంది గైనకాలజిస్టులు, రేడియాలజిస్ట్లు అత్యంత గోప్యంగా ఏజెంట్ల ద్వారా అబార్షన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు డయాగ్నస్టిక్ సెంటర్లు, సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వారసుల కోసం ఆరాటం.. ఆస్తిపాస్తులు లేకపోయినా చాలా కుటుంబాల్లో ‘మగపిల్లాడు ఉండాలి.. వారసుడు అంటే మగపిల్లవాడే’ అన్న మూఢ విశ్వాసంతో ఉన్నారు. మహిళ గర్భం దాల్చిందని తెలియగానే ముందుగా ఆడపిల్లా, మగపిల్లాడా అని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన వారు రెండో కాన్పులోనైనా మగ పిల్లవాడి కోసం ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి నమ్మకాల వల్ల కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు లేక అబ్బాయిలకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మాయిల సంఖ్యలో చివరి స్థానంలో ‘ఉమ్మడి అనంత’ ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 977 మందే అమ్మాయిలు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి -
మహిళాభ్యున్నతికి జగన్ పెద్దపీట
అనంతపురం కార్పొరేషన్: మహిళాభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ‘అనంత’.. ముందుగా దివంగత నేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారన్నారు. రూ.25,571 కోట్ల డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేశారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి ఏకంగా రూ.4,969.04 కోట్లను అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో సున్నా వడ్డీ పథకానికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. ‘తల్లికి వందనం’ పథకానికి ఎగనామం పెట్టారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. కృష్ణవేణి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు యాడికి లక్ష్మిదేవి, మహిళా విభాగం నాయకులు ఆశాబీ, పార్వతి, సాకే చంద్రలేఖ, నాగలక్ష్మి, ఉష, ప్రసన్న, శోభాబాయి, శోభారాణి, దేవి, సంధ్యారాణి, విశాల రెడ్ది తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
మహిళా సాధికారతకు ఉపాధ్యాయినులే నిర్దేశకులు
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా సాధికారతరకు ఉపాధ్యాయినులే దిశా నిర్దేశకులు అని సర్వశిక్ష అభియాన్ ఏపీసీ శైలజ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు గాయత్రి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ మహిళా సాధికారత ఎంతో అవసరమన్నారు. ఇందుకు పాఠశాల స్థాయిలోనే పునాది పడాలని సూచించారు. బుక్కరాయసముద్రం ఎంపీపీ సునీత మాట్లాడుతూ మహిళలు తమ అవకాశాలు, హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుజాత మాట్లాడుతూ మహిళలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా చూపుతోందన్నారు. వివక్షత లేనటువంటి సమాజం నిర్మించాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి. నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్ సిరాజుద్దీన్, నాయకులు సర్దార్వలి, కే. వన్నప్ప, సతీష్ కుమార్, నరేష్ కుమార్, ఈజీ నాగభూషణం, నారాయణస్వామి సూర్యనారాయణ, పట్నం శ్రీనివాసులు, హరినాథ్, రామచంద్ర, తిప్పేస్వామి, సోహెల్ ఓబులేసు, సాయప్ప, ఎల్లప్ప, గంగాధర్, రామమూర్తి, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. -
మాటకు కట్టుబడి ఉన్నా
● ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7 నెలల్లో 7,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం ● 50 వేల మంది మహిళల సొంతింటి కలను చిదిమేసిన పరిటాల సునీత ● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం రాప్తాడురూరల్: ‘ఈ ఈవీఎంలతోనో, మరేదో కారణంగానో గెలిచారు. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయాలనే దురాలోచనతో రాష్ట్రంలోని 50 వేలమంది మహిళల సొంతింటి కలను పరిటాల సునీత చిదిమేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో 7,500 ఇళ్లను 7 నెలల్లో పూర్తి చేస్తా. ఇది నా ఛాలెంజ్’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిటాల సునీతకు అనంతపురం ఎమ్మెల్యే భయపడుతున్నారో లేదంటే ఇళ్ల నిర్మాణం బాధ్యతను వదులుకున్నారో తెలీదన్నారు. జన్మలో ఆమె కానీ, ఆమె భర్తకాని సొంత డబ్బుతో పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చారా?, పేదలకు రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేశారా అని పరిటాల సునీతను ప్రశ్నించారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానం పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రొద్దం మండలంలోని పెన్నానది మీదుగా నీళ్లు తీసుకురావొచ్చని తాము చెప్పినా వినలేదన్నారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానంతోనే పరిటాల సునీత 2018లో జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు కాలువ నిర్మాణానికి టెండర్లు పిలిపించి 2019లో పనులు ప్రారంభించారన్నారు. ముందుగానే కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారన్నారు. ఒక రూపాయి కూడా నిధులు తేలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సంబంధించిన కాంట్రాక్టర్కు రూ.170 కోట్ల నిధులు ఇప్పించి పనులు వేగవంతం చేయించామన్నారు. పూర్తిస్థాయిలో పనులు అవ్వాలంటే పదేళ్లు పడుతుందని భావించి అప్పటిదాకా ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం సరికాదని, అప్పటి సీఎం జగనన్నతో మాట్లాడి ప్రత్యేకంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేందుకు జీఓ తెచ్చామన్నారు. తర్వాత దాతలు, రైతుల సహకారంతో 45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిటాల సునీత తత్వం రైతులకు బోధపడింది ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయని, చంద్రబాబుతో పరిటాల కుటుంబం సన్నిహితంగా ఉంటోందని, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నా పరిటాల సునీత ఏరోజూ చంద్రబాబుతోగాని, లోకేష్తో గాని మాట్లాడలేదన్నారు. తీరా మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీళ్లు వదిలే సమయంలో రిపేరీల పేరుతో డ్యాంకు ఉన్న గేట్లు తీయించారన్నారు. వచ్చే ఏడాది నీళ్లిస్తామంటూ కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత తనకు లాభం లేనిదే ఏపనీ చేయరనే తత్వం రైతులకు బోధపడిందన్నారు. ఇక కమీషన్ల కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పేరూరు డ్యాం, చెరువులను ఎండబెట్టి మీ జేబులను మాత్రం కమీషన్లతో నింపుకుంటారా?అని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, పార్టీ నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, వీరాంజి తదితరులు పాల్గొన్నారు. కౌంటరు దాఖలు చేయని దద్దమ్మ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల నిలుపుదలపై రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్తే...మీ చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం కౌంటర్ వేయలేదని ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే విజిలెన్స్ విచారణ ఏంటని, రాక్రీట్ సంస్థకు ఎందుకు బిల్లులు ఆపారని జడ్జిగారు ప్రశ్నిస్తే.... తమకు, ఆ సంస్థకు సంబంధం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కేసు నుంచి ఏమీ సాధించలేమని భావించి కౌంటర్ వేయకుండా నిలిపేశారన్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజిలెన్స్ విచారణలన్నీ పూర్తి చేశారన్నారు. మళ్లీ ఈరోజు సునీత అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఉత్సాహంగా ఉట్ల పరుష
రాప్తాడు: అయ్యవారిపల్లిలో ఎర్రిస్వామి తాత ఉట్లపరుషను శనివారం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రిస్వామి తాత, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అయ్యవారిపల్లి, బోమ్మేపర్తి, బుక్కచెర్ల, కాటిగానికాలువ గ్రామాలకు చెందిన యాదవ కులస్తులు ఉట్టికొట్టారు. ఈ దృశ్యాన్ని వేలాది మంది తిలకించారు. ఆలయం వద్ద బుల్లే పెద్దఇటుకనల్లప్ప, బండి పెదయ్య, బుల్లే వెంకటరాముడు, బుల్లే రాంభూపాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తాదులకు ఎటువంటి అసౌకార్యాలు కలగకుండా కాల్వగొంచి నిర్వాహకులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాప్తాడు సీఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గుత్తి రూరల్: శ్రీపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారి పక్కన శనివారం బి.రవి(38) అనే భవన నిర్మాణ కార్మికుడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీపురం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ప్యాంటు జేబులో ఉన్న ఓటరు కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు గుంతకల్లు ఉమామహేశ్వరనగర్కు చెందిన రవిగా గుర్తించారు. కుటుంబసభ్యులను ఆరా తీయగా శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. బేల్దారు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడని, గుత్తి బండగేరికి చెందిన మణి అనే యువతిని వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఐదు నెలల క్రితం భార్య తమకు చెప్పకుండా భర్త, పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె గౌతమి, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవిది హత్యా లేక రోడ్డు ప్రమాదమా? శ్రీపురం గ్రామ శివారులో రవి మృతి హత్యనా లేక రోడ్డు ప్రమాదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఘటన స్థలంలోని ఆనవాళ్లు అనుమానాలకు తావిస్తున్నాయి. మృతదేహం పక్కన పెనుగులాట జరిగినట్లు పాదముద్రలు ఉన్నాయి. రవిని ఇద్దరు లేదా ముగ్గురు హత్య చేసి రోడ్డుపై నుంచి లాక్కొచ్చినట్లు జాడలు ఉన్నాయి. తల, భుజం, ఛాతీపై రక్త గాయాలున్నాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో భవన నిర్మాణ పనులకు ఉపయోగించే తాపీ పడి ఉంది. కుటుంబసభ్యులు సైతం రవి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం రవి బైక్పై గుత్తి వైపునకు వేగంగా వస్తూ బైక్ నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును సంప్రదించగా రవి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సమాజంలో మహిళల పాత్ర కీలకం
అనంతపురం: సమాజంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ మహిళలు అభివృద్ధి సాధించారన్నారు. ఏ పోటీ పరీక్షల్లోనైనా మహిళల ప్రతిభ చాటుతున్నారు. పోలీసు శాఖలో మహిళా సిబ్బంది పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత వారోత్సవాల్లో నిర్వహించిన జరిపిన వ్యాసరచన, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థినులకు ఎస్పీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అర్అండ్బీ అతిథి గృహం, అంబ్కేర్ కూడలి, వై.జంక్షన్ల మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, అనంతపురం మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఎస్. మహబూబ్బాషా, అనంతపురం అర్భన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల నియామకం అనంతపురం కార్పొరేషన్: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్సీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో కొన్ని నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేరం స్వర్ణలత, అధికార ప్రతినిధిగా ఆర్.కృష్ణవేణి, రాష్ట్ర కార్యదర్శులుగా భూమిరెడ్డి జాహ్నవి, బోయ సుశీలమ్మ, కేఎల్ దేవి, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాటిల్ రామకృష్ణారెడ్డి, కార్యదర్శిగా నూకల పట్టాభి రామసుబ్బయ్య గుప్తా, రాష్ట్ర ఇంటిలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా బాణ రాఘవేంద్ర, అధికార ప్రతినిధిగా డాక్టర్ పి.శంకరయ్య, కార్యదర్శిగా కట్టుబడి తానీష నియమితులయ్యారు. -
‘డాలీ’ సేవలు ప్రశంసనీయం
అనంతపురం: పోలీసు జాగిలం ‘డాలీ’ జిల్లా పోలీసు శాఖకు అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ పి. జగదీష్ అన్నారు. గత 11 సంవత్సరాలుగా సేవలందించిన ‘డాలీ’ శనివారం విధుల నుంచి నిష్క్రమించింది. ఈ సందర్బంగా డాలీకి ఎస్పీ సన్మానం చేశారు. హ్యాండ్లర్ నాగభూషణను అభినందించారు. 2014 సంవత్సరంలో 6 నెలల వయస్సు ఉన్నపుడు డాలీని అనంతపురం జిల్లాకు కేటాయించారన్నారు. దాదాపు 300పైగా నేర ప్రదేశాల్లో శోధించిందన్నారు. సుమారు 30 నేరాల ఛేదనకు దోహదపడిందని వెల్లడించారు. ముగిసిన హెచ్చెల్సీ కోటా అనంతపురం సెంట్రల్: తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ కోటా శనివారంతో పూర్తయింది. దీంతో నీటిని నిలుపుదల చేశారు. అదనపు జలాలతో కలిపి మొత్తం 33.931 టీఎంసీలు ఈ ఏడాది హెచ్చెల్సీకి విడుదలయ్యాయి. తొలుత దామాషా ప్రకారం కేవలం 26 టీఎంసీలు కేటాయించారు. వర్షాలు కురిసి జలాశయం నిండడంతో హెచ్చెల్సీ కోటా 30.881 టీఎంసీలు, కేసీ కెనాల్ కోటా 3.50 టీఎంసీలు మొత్తం 33.931 టీఎంసీలు విడుదల చేశారు. ఈ క్రమంలో 90,355 ఎకరాలకు సాగునీటిని అందించారు. వాస్తవంగా గత నెలలోనే కోటా పూర్తి కాగా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద పంటలు చివరి దశలో ఉండడంతో అదనంగా 0.5 టీఎంసీలను కేటాయించారు. ప్రస్తుతం కణేకల్లు చెరువులో 0.227 టీఎంసీలు, పీఏబీఆర్లో 3.029 టీఎంసీలు, ఎంపీఆర్లో 0.835 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పీఏబీఆర్ నీటిని రానున్న వేసవిలో తాగునీటి అవసరాలకు వాడుకోనున్నారు. ఎంపీఆర్లో నిల్వ ఉన్న నీటిని సౌత్ కెనాల్, నార్త్ కెనాల్స్కు వరుసగా 200 క్యూసెక్కులు, 90 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’తో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి ఆశించిన స్థాయిలో నీళ్లు విడుదలయ్యాయన్నారు. అదనపు కోటా కలిపి 33.931 టీఎంసీలు విడుదల కావడంతో దాదాపు లక్ష ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు నీరు విడుదల చేశామన్నారు. -
ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా రజిత
గుంతకల్లు: తిరుపతి డిపోలో టీటీఐగా పని చేస్తున్న ఎం.రజిత దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆవుట్ స్టాండింగ్ రైల్వే ఉమెన్ ఎంప్లాయీగా అవార్డు అందుకున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. న్యూఢిల్లీలోని రైల్ నిలయం శనివారం రాత్రి రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ సెంటల్ర్ ఆర్గనేజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్కుమార్ ఆమెకు అవార్డు అందించారన్నారు. గతేడాది డిసెంబర్ 22న తిరుపతి–చిత్తూరు (12697) వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో ఏ2 కోచ్లో బెర్త్ నం.3లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దాదాపు రూ.రెండు లక్షలు విలువ చేసే బ్రాస్లెట్ను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉన్న టీటీఐ రజితకు దొరికిన బ్రాస్లెట్ను చిత్తూరు జీఆర్పీ పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అందజేశారు. ఆమెను డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఏడీఆర్ఎం సుధాకర్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు.అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు గుంతకల్లు: రైళ్లలో ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు జీఆర్పీ సీఐ అజయ్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక జీఆర్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్పీఎఫ్లతో కలిసి రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండంగా ఏడో నంబర్ ప్లాట్ఫారామ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ఒకరిని గుంటూరులోని సోమిరెడ్డి బజార్కు చెందిన హర్షవర్ధన్రెడ్డిగా గుర్తించామన్నారు. ఇతను ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రపోతున్న ప్రయాణికులు బ్యాగులు, విలువైన వస్తువులు తస్కరిస్తున్నట్లు తెలిపారు. హర్షవర్ధన్పై గుంతకల్లు, గుంటూరు, గుత్తి, ఆదోని, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయన్నారు. ఇతని వద్ద నుంచి సుమారు రూ.79 వేలు విలువ చేసే ఓ బంగారు డాలరుతోపాటు వెండి పట్టీలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించామన్నారు. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర, ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
కూడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, రైతు సంఘం రాష్ట్ర నేత రాంభూపాల్ ధ్వజమెత్తారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం ముద్దలాపురం చేరుకుంది. పాదయాత్రకు డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ సంఘీభావం తెలిపారు. ముద్దలాపురంలో బ్యాడిగి మిర్చి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెగుళ్లతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందని, మార్కెట్లో గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోయారు. అనంతరం డాక్టర్ గేయానంద్, రాంభూపాల్ మాట్లాడారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజారాంరెడ్డి, సహాయ కార్యదర్శి నాగేంద్ర కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క్రిష్టమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
తాడిపత్రి టౌన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో శుక్రవారం తాడిపత్రిలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి అశోక్ పిల్లర్ సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేసారు. విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో ఆర్డీటీ సీఓ ఆంజనేయులు చౌడేశ్వరి, విజయభాస్కర్, నల్లపరెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాళ్లు అమర్నాథ్, శివప్రసాద్, పీఈటీ శివప్రసాద్, దాదాఖలందర్, అబ్రహం, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఐటీ కోర్టీం విభాగానికి అవార్డు అనంతపురం: పోలీసు శాఖకు అత్యంత ఉపయోగకరమైన క్రైం క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్కింగ్ సిస్టం, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం అప్లికేషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో జిల్లా ఐటీ కోర్టీం విభాగానికి అవార్డు దక్కింది. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఐటీ కోర్ టీం హెడ్ కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఎస్పీ పి.జగదీష్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు అవార్డులు రాగా, ఒక అవార్డు అనంతపురం పోలీస్ టీంకు వచ్చింది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఒక కేటగిరీ, ఎస్ఐ ఆపై స్థాయి అధికారులకు మరో కేటగిరిలో అవార్డులు ప్రకటిస్తారు. ఐటీ కోర్ హెడ్కానిస్టేబుల్ సుకుమార్ బాబుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును డీజీసీ కార్యాలయంలోని పీసీఎస్ విభాగానికి ఎన్సీఆర్బీ వారు పంపగా, అక్కడ నుంచి జిల్లాకు రావడంతో ఎస్పీ చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. 10న అప్రెంటిషిప్ మేళా అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ బాలురు ఐటీఐలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ (పీఎంఎన్ఏఎం) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఎన్టీసీ పొందిన విద్యార్థులు అర్హులు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 88868 85173లో సంప్రదించవచ్చు. -
చిప్లు అమర్చి.. అక్రమార్జన
అనంతపురం: కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఫిల్లింగ్ యంత్రాల్లో చిప్లు అమర్చి.. రీడింగ్ మీటరుపై చూపిన దానికంటే ఆరు నుంచి పది శాతం తక్కువ ఇంధనం నింపుతున్నారు. అనుమానం వచ్చి పరీక్షించినా ఎక్కడా దొరకకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇది వరకు జిల్లాలో రెండు పెట్రోల్ బంకుల్లో చిప్ అమర్చి తక్కువ ఇంధనం పడుతున్నారని విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. తాజాగా అనంతపురంలోని నడిమి వంక నుంచి బళ్లారి బైపాస్కు వెళ్లే రోడ్డులోని విజయ ఫిల్లింగ్ స్టేషన్లో ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. అదే పెట్రోల్ బంకులోనే రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వైబీపీటీఏ ప్రసాద్ శనివారం విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లీటర్కు 60 నుంచి 100 ఎంఎల్ ఇంధనం తక్కువగా వాహనాలకు పడుతున్నారన్నారు. ఎవరైనా వాహనాలకు కాకుండా బాటిళ్లలో పెట్రోల్ పట్టాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఆఫ్ చేసే వీలుగా ఆపరేట్ చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు శ్రీనివాసులు, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు. -
స్వీపర్ సావిత్రమ్మ ‘సూపర్’
●వివిధ రంగాల్లో మహిళల ప్రతిభ ●పురుషులతో దీటుగా రాణిస్తున్న వైనం ఆది యందు ‘ఆమె’ ఉండెను అప్పటి నుంచీ అన్నీ ‘ఆమె’ అయెను... బడిలో, గుడిలో, నారుమడిలో.. ఆమెలేని చోటులేదు..ఆమెకు సాటి లేదు.. కలం పట్టినా...హలం దున్నినా.. అధికారం చూపినా..అక్కున చేర్చుకున్నా.. అంతా ఆమె...అన్నింటా ఆమె.. సృష్టి, స్థితి, లయకారులకూ ‘ఆమె’నే ధైర్యం.. ‘ఆమె’కెన్నో రూపాలు.. మనం కూడా ప్రతిరూపాలమే.. ఆమె ఒక ధైర్యం..ఆ ఆదరణ లేకపోతే అంతా శూన్యం.. ఆమెను తలిస్తే అన్నీ దర్శించినట్టే.. అందుకే ఆమె కోసం ఓ రోజు.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బతుకుపాఠంలో చెరగని ముద్ర వేసిన మహిళా మణుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. గుంతకల్లుకు చెందిన సుంకన్న, సావిత్రమ్మ నిరుపేద దంపతులు. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు సంతానం. పదేళ్ల క్రితం భర్త కరెంట్ షాక్తో మరణించాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న భర్త ఆశయాన్ని సావిత్రమ్మ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించింది. అవుట్సోర్సింగ్ కింద స్థానిక మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. ఇంజినీరింగ్ చదివిన పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఇస్రోలో ఉద్యోగం సాధించాడు. కన్యాకుమారిలోని ఇస్రోలో గ్రూప్–సీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కుమార్తెకు వివాహం చేసి పంపింది. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పాసై 2019లో సావిత్రమ్మ బ్యాక్లాగ్ పోస్ట్కు ఎంపికై అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పబ్లిక్హెల్త్ వర్కర్(స్వీపర్)గా పనిచేస్తోంది. తన తల్లి సహకారంతోనే తాను ఈస్థాయికి ఎదిగానని, స్వీపర్గా పనిచేస్తూనే తమను ప్రయోజకులుగా తీర్చిదిద్దిందని ఇస్రో శాస్త్రవేత్త దేవేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. – గుంతకల్లు టౌన్: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
‘లైనింగ్’తో హంద్రీనీవాకు మరణశాసనం
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు తలపెట్టి ఆ ప్రాజెక్ట్కు మరణ శాసనాన్ని కూటమి సర్కార్ లిఖిస్తోందని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీ–నీవా కాలువకు పిలిచిన టెండర్లను రద్దు చేయడంతో పాటు లైనింగ్ పనులు ఆపేలా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నామన్నారు. డిమాండ్ సాధనలో భాగంగా కలెక్టర్ వినోద్కుమార్ను శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో నాయకులతో కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏవీఎస్ఎస్ అధ్యక్షుడు కేవీరమణ, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, రైతులు చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విశ్వ మాట్లాడారు. అత్యంత దుర్మార్గం : జిల్లాకు ప్రాణప్రదమైన హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెకులుంటే రోజుకు ఒక టీఎంసీ చొప్పున కృష్ణానదికి వరదలొచ్చిన 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకురావడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా కాలువ వెడల్పు చేసే పనులకు టెండర్లు పిలిచిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని రద్దు చేసి కొత్తగా ఫేస్–1 కింద 3,850 క్యూసెక్కుల సామర్థ్యానికి టెండర్లు పిలవడమే కాక, రూ.192 కోట్ల ఎక్సెస్కు ఆమోదించడం అత్యంత దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హంద్రీ–నీవా లైనింగ్ పనులు కాంట్రాక్టర్లకు తప్ప జిల్లా రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడవన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలి జీడిపల్లి నుంచి ఉమ్మడి జిల్లా సరిహద్దున పుంగనూరు బ్రాంచ్ కాలువ అప్టేక్ వరకు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు పూర్తయితే జిల్లా పరిధిలోని కాలువ పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోరుబావులతో పాటు గ్రామాల్లోని తాగునీటి బోర్లూ ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందన్నారు. అంతేకాక భవిష్యత్తులో కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుండదన్నారు. భూగర్భ జలాలు పెంపొందే పరిస్థితులు శాశ్వతంగా మూసుకుపోతాయన్నారు. కాలువలో ప్రవహించే వర్షపు నీరు కూడా భూమిలోకి ఇంకదన్నారు. ప్రభుత్వం సేకరించిన కాలువ భూమి ఆక్రమణలకు గురవుతుందన్నారు. గతంలో హంద్రీ–నీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీల మంచినీటి ప్రాజెక్టుగా మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జిల్లా ప్రజలు అడ్డుకున్నారని, అదే స్ఫూర్తితో జిల్లా ప్రజానీకం చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి, తదితరులు సాగు, తాగునీటి కష్టాలు తప్పవు కూటమి ప్రభుత్వ చర్యలతో రైతుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందన్నారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే బోరుబావులు ఎండిపోయి సాగు, తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలేరి–నగరిని హంద్రీ–నీవాకు అనుసంధానం చేయడం ద్వారా హంద్రీ–నీవా నుంచి చిత్తూరుకు వెళ్లాల్సిన నీటిని ఆదా చేసి... కర్నూలు, అనంతపురం జిల్లాలకు మాత్రమే వినియోగించుకునేలా చేపట్టిన చర్యలను కొనసాగించాలన్నారు. గాలేరి–నగరి ద్వారా కుప్పానికి సమృద్ధిగా నీటిని ఇచ్చే అవకాశమున్నా... అనంత జిల్లా రైతులను బలిచేసి ఆ ప్రాంతానికి నీటిని తీసుకెళ్లాలనుకోవడం సబబు కాదన్నారు. కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనమూ లేదు మీడియాతో మాజీ ఎమ్మెల్యే విశ్వ లైనింగ్ పనులు ఆపాలంటూ కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం -
కూతురి భవిత కోసం పోరాటం
భర్త అకాల మరణం.. చుట్టుముట్టిన అప్పులు.. అయినా ఆమె వెరవలేదు. వ్యవసాయంలో రాణిస్తూ కష్టాలను అధిగమిస్తూ కూతురికి ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం పోరాడుతోంది. వజ్రకరూరు మండలం పాతకడమలకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ, లలిత దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. తమకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కూతురును చదవించేవారు. నాలుగేళ్ల క్రితం కుమార్తె దీవెన ఎంబీబీఎస్లో చేరింది. ఏడాది తిరిగేలోపే సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డాడు. అప్పులు చేసి రూ.40లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. సత్యనారాయణ చనిపోయాడు. కూతురి ఎంబీబీఎస్ చదువు ఆగిపోయింది. అయితే లలిత మరికొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ తన కుతూరు భవిష్యత్తు కోసం బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేర్పించింది. – ఉరవకొండ: -
ఐరావతంపై చంద్రమౌళీశ్వరుడు
ఉరవకొండ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి శుక్రవారం ఐరావత వాహనంపై భక్తులకు శుక్రవారం దర్శనిమిచ్చారు. ఉదయం స్వామి వారికి మహారుద్రాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కళ్యాణస్వామిజీ, మఠం సహాయ కమిషనర్ కె.రాణి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరస్వామి మూలవిరాట్ను ఊరేగింపుగా ప్రత్యేక వాహనం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఐరావత వాహనంపై ఉత్సవమూర్తిని ఉంచి భక్తు లు ఊరేగించారు. కార్యక్రమంలో మఠం ఏజెంట్ రాజన్నగౌడ్, మఠం జూనియర్ అసిస్టెంట్లు గోపి, నారాయణస్వామి, వీర సంక్షేమ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్గౌడ్ పాల్గొన్నారు. -
నేడు జేఎన్టీయూలో మహిళా దినోత్సవం
అనంతపురం: జేన్టీయూ ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆడిటోరియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. 15లోపు సప్లి ఫీజు చెల్లించాలి అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2016–17 నుంచి 2018–19 విద్యాసంవత్సరాల డిగ్రీ విద్యార్థులకు మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఈ నెల 15లోగా చెల్లించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు రూ. వెయ్యి అదనపు రుసుముతో చెల్లించవచ్చని, 19 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు రూ.3 వేల అదనపు రుసుముతో ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. మెగా సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24న మొదలయ్యే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో పరీక్షల విభాగాధిపతిని సంప్రదించాలని సూచించారు. -
ఫీజు పోరు జయప్రదం చేయండి
అనంతపురం కార్పొరేషన్: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కూటమి సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ఈ నెల 12న నిర్వహించే ‘ఫీజు పోరు’ను జయప్రదం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పార్ట శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని, వైద్య కళాశాలల సంఖ్యను కుదించరాదని 12న ఉదయం పది గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు. అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు మాట తప్పారన్నారు. విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంటే రూ.700 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. ఒత్తిడి తట్టుకోలేకపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 2014–19 టీడీపీ హయాంలో పెండింగ్లో ఉన్న రూ.1,900 కోట్ల బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2019 నుంచి 24 వరకు ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్యకే రూ.26 వేల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి సర్కారు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినా.. బడ్జెట్లో కేటాయింపులే లేవన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేయిస్తే.. కొత్తవి అవసరం లేదని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాక పీపీపీ విధానంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, అలా చేస్తే వైద్యవిద్య పూర్తిగా ప్రైవేట్పరం అవుతుందని అన్నారు. వెడల్పు చేశాక లైనింగ్ చేపట్టండి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులకు రాయలసీమపై చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే మొదట హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి.. ఆ తర్వాత లైనింగ్ పనులు చేపట్టాలని అనంత డిమాండ్ చేశారు. రాయలసీమ కరువును చూపి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని.. ఇక్కడి ప్రజలకు న్యాయం చేయకపోతే ఎలాగ అని ప్రశ్నించారు. వెడల్పు చేయకుండా లైనింగ్ పనులు చేపడితే భవిష్యత్తులో అధికంగా నీరు తెచ్చే పరిస్థితి ఉండదన్నారు. 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువ తవ్వారని, అయితే 12 పంపులున్నా 2,200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,300 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచుతూ జీఓను విడుదల చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 3,850కే క్యూసెక్కులకు సరిపెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు మరో రెండేళ్లలో పూర్తవుతుందని, గోదావరి జలాలను పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా బనకచర్లకు నీటిని తీసుకువచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు చెబుతుండడం సంతోషకర విషయమైనా.. బనకచర్ల ద్వారా అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కర్నూలు, కడపకు మాత్రమే నీరు తీసుకెళ్లేందుకు వీలుంటుందన్నారు. 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయడానికి మంత్రి కేశవ్, టీడీపీ ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలా కాకుండా 3,850 క్యూసెక్కులకే పరిమితం చేస్తే రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసిన వారిగా కూటమి పాలకులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రమేష్గౌడ్, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, చింతకుంట మధు, సైఫుల్లాబేగ్, రాధాకృష్ణ, దత్తా, చంద్రశేఖర్ యాదవ్, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ అందక విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
అట్రాసిటీ చట్టం పటిష్టంగా అమలవ్వాలి
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత ఆదేశించారు. ‘పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం’ అంశంపై జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎస్పీ పి.జగదీష్తో కలసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పరిహారం అందించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.58 లక్షలు నిధులు వచ్చాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో భూములకు సంబంధించి వివరాల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, ఆయా వర్గాల వారికి మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోక్యం చేసు కుని బాధితులకు సరైన సలహాలు, సూచనలు అందించాలని కమిటీ సభ్యులు బీసీఆర్ దాస్, నెరమెట్ల యల్లన్న, సాకే చిరంజీవి, ఇమామ్వలి, రామన్న కోరా రు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసతంతబాబు, శ్రీనివాస్, సాంఘీక సంక్షేమశాఖ జేడీ రాధిక, గిరిజన సంక్షేమాధికారి రామాంజినేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత కీలకం దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్ వద్ద ‘వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2025’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రిన్సిపాల్ పద్మనాభరెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, జేన్టీయూఏ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ శారద, ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగశుభ, నెహ్రూ యువ కేంద్ర సంఘటన ప్రోగ్రామ్ ఇన్చార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పది రోజుల్లో చార్జిషీట్ వేయాలి ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస, నమోదైన కేసులపై జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్పీ పి.జగదీష్తో కలసి ఆయన సమీక్షించారు. తాడిపత్రిలో 7 కేసులు నమోదు కాగా ఐదు కేసుల్లో చార్జిషీట్ దాఖలైందని, ఒకటి తప్పుడు కేసుగా నిర్ధారణ అయిందని తెలిపారు. మరో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందన్నారు. ఎన్నికల కమిషన్ పోర్టల్ ఓపెన్ అయిన నేపథ్యంలో చార్జిషీట్ దాఖలులో పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని ఆర్డీఓ, తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, డీసీఆర్బీ హరినాథ్, తాడిపత్రి టౌన్ సీఐ సాయిప్రసాద్, తహసీల్దారు రజాక్వలి, ఎన్నికల డీటీ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళాభ్యున్నతితోనే మెరుగైన సమాజం
అనంతపురం సిటీ: మహిళాభ్యున్నతితోనే మెరుగైన సమాజం నిర్మితమవుతుందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలసి శుక్రవారం ఆమె కేక్ కట్ చేసి, మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపి, మాట్లాడారు. అమ్మాయి, అబ్బాయిల పెంపకంలో వివక్ష చూపరాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం గర్వంగా ఉందన్నారు. బాలికలు విద్యావంతులైనప్పుడే సమాజంలో సమానత్వం పొందగలరన్నారు. ప్రతి అమ్మాయి స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులతో అమ్మాయిల చదువు ఆగిపోకూడదన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారులు షబ్బీర్నియాజ్, మహబూబ్ వలి, విజయ భాస్కర్రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, ధనుంజయ, కమ్మ నాగరాజు, ఉషారాణి, మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం -
జీడిపల్లి రిజర్వాయర్లో మహిళ మృతదేహం
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రొబేషనరీ డీఎస్పీ అష్రప్ అలీ, ఎస్ఐ శివ, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ రెండు చేతులపై ముగ్గుల బొమ్మల పచ్చబొట్లు ఉన్నాయి. ఎర్ర రంగు జాకెట్ ధరించి ఉంది. కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండడంతో మృతదేహం పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా మారింది. పంచనామ అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళ మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే బెళుగుప్ప పోలీసులను సంప్రదించాలని కోరారు. -
No Headline
అమ్మాయిల చదువులకు తోడ్పాటు అందించడం, సామాజిక సేవాకార్యకర్తగా పర్యావరణ కార్యక్రమాలు, చిన్నారుల సృజనను ప్రోత్సహించడం, విద్యాలక్ష్యాలను చేరుకోవడం కోసం నిత్యం పరితపిస్తుంటారు ఏజీ ప్రమీలారెడ్డి. వయసు ఎనిమిది పదులు దాటినా నేటికీ చురుగ్గా సమాజహితం కోసం పాటుపడుతుంటారు. క్షామపీడిత అనంత సస్యశ్యామలం కావడం కోసం విరివిగా మొక్కల పంపిణీ, పక్షులకు కృత్రిమ గూళ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా కరోనాపై పోరాట మహాయజ్ఞంలో ఏజీఎస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆమె చూపిన చొరవ, ‘హీల్ అనంతపురం’ పేరుతో అందించిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. నిరాశ్రయులకు, అనాథలకు, ఆశ్రమాల్లోని వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వాహనాల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. – అనంతపురం కల్చరల్:సేవకు ప్రతిరూపం ప్రమీల -
మహిళా దినోత్సవం పేరుతో అనధికార వసూళ్లు
● ఒక్కో సభ్యురాలితో రూ.వంద చొప్పున రూ.కోటికి పైగా వసూలు అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మెప్మా అధికారుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొందరు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తీసిపోకుండా మహిళా సంఘాల నాయకురాళ్ల ముక్కుపిండి అనధికారిక వసూళ్లకు అధికారులు తెరలేపారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. 11,530 సంఘాలతో రూ.కోటికి పైగా వసూలు అనంతపురం నగరపాలక సంస్థ, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మునిసిపాలిటీల మెప్మా పరిధిలో 11,530 మహిళా సంఘాలున్నాయి. ప్రతి సంఘంలో 10 నుంచి 12 మంది సభ్యులున్నారు. మహిళా దినోత్సవం పేరుతో వీరి నుంచి ఒక్కొక్కరితో రూ.100 చొప్పున కొందరు ఆర్పీలు వసూళ్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లెక్కన రూ.కోటికిపైగా వసూలైనట్లు తెలుస్తోంది. సభ్యులు ఇదేమిటని ప్రశ్నిస్తే రూ.వంద చెల్లించాల్సిందేనని లేకపోతే భవిష్యత్తులో నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు సంఘం నుంచి తొలగిస్తారని బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వాపోయారు. ఈ బాగోతం వెనుక మెప్మా విభాగంలోని ఓ కీలక అధికారి, ఓ టెక్నికల్ అసిస్టెంట్ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. -
లైనింగ్కు టెండర్లు సరికాదు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అనంతపురం అర్బన్: ‘‘హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల సామార్థ్యంతో వెడల్పు చేయాలి. పంట కాల్వలు తవ్వి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి’ అని రైతులు కోరుతుంటూ లైనింగ్ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరుల అభివృద్ధి కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా అత్యంత వెనబడిన ఉమ్మడి అనంతపురం జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కృష్ణాజలాల కోసం చేసిన పోరాటాల ఫలితమే హంద్రీ–నీవా ద్వారా 2012 నుంచి జీడిపల్లికి కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీలు కాకుండా అదనంగా నీరు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూనే ఉన్నాయన్నారు. హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం చంద్రబాబుతో సానుకూల నిర్ణయం ప్రకటింపజేయాలన్నారు. 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేసేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లలో 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడం, రెండవ దశ కాలువ లైనింగ్ పనులకు సిద్ధపడడం చూస్తుంటే సీఎం చంద్రబాబు తీరు ఏరుదాటాక తెప్పతగలేసినట్లుగా ఉందన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు... కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి గురువారం అర్ధరాత్రి వెళుతున్న అంబులెన్స్ వాహనం గొళ్ల గ్రామం సమీపంలోకి చేరుకోగానే రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన కుళ్లాయప్ప (60)ను ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మంగళకుంట గ్రామం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న అదే గ్రామానికి చెందిన పెద్ద మల్లయ్యను ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందాడు. ఈ రెండు ఘటనలపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం రూరల్: డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు. ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలి. టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు 08554–275575లో సంప్రదించవచ్చు. -
No Headline
ఆమె ఆలోచన పలువురిని కదిలించింది. అంతా ఒక సంఘంగా ఏర్పడి సామాజిక సేవవైపు నడిచారు. తాడిపత్రిలోని ఓంశాంతినగర్కు చెందిన భూమా రాగిణి సారథ్యంలో మొదట నలుగురు స్నేహితులతో కలిసి ‘ఫెమినైన్’ అనే సంస్థను ప్రారంభించారు. ఆస్పత్రిలో రోగులకు అన్నదానంతో ప్రారంభమైన సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. అలా మూడు నెలల వ్యవధిలోనే వివిధ జిల్లాల నుంచి మొత్తం 190 మంది మహిళలు ఇందులో సభ్యులుగా చేరి సేవలో పాలు పంచుకుంటున్నారు. ప్రతి సభ్యురాలు నెలనెలా సేవా కార్యక్రమాల కోసం కొంతమొత్తం వెచ్చిస్తున్నారు. అంతేకాదు సభ్యుల్లోని కుటుంబాల్లో పుట్టిన రోజు తదితర శుభకార్యాల సందర్భాలను పురస్కరించుకుని అభాగ్యులకు అవసరమైన సహాయాలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు వీల్చైర్లు, మూడు చక్రాల సైకిళ్లు, ఒంటరి మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు అందించారు. ఓ పేదరిక కుటుంబానికి ప్రతి నెలా రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. అలివేలు మంగ అనే దివ్యాంగురాలికి పింఛన్ తరహాలో ప్రతి నెలా రూ.1000 ఆర్థికసాయం అందిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఆస్పత్రుల్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. – తాడిపత్రిటౌన్ :అభాగ్యులకు అండగా నిలవాలని.. -
●అన్నింటా ఆమె
ఆమె శాంతం... ఆమె సహనం... ఆమె రౌద్రం... ఆమె లౌక్యం... అన్నింటా ఆమె... అన్నీ ఆమే! జీవన పోరాటంలో ఎన్ని గాయాలైనా లెక్కచేయదు. నేటి మహిళలు అడుగు మోపని రంగమంటూ లేదు. నైపుణ్యమున్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు సైతం తర్వాతి క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారతే లక్ష్యంగా సాగుతున్నారు. ‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: కలెక్టరేట్ వద్ద గంపలో చిరుతిండ్లు విక్రయిస్తున్న వృద్ధురాలు -
బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాల పెంపు
అనంతపురం ఎడ్యుకేషన్: మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించనున్న రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలను పెంచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 16 కేంద్రాలు ఉండగా.. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అదనంగా ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అనంతపురం జిల్లా కన్వీనర్ జోనాథన్ తెలిపారు. కొత్త పరీక్ష కేంద్రాలు శనివారం నుంచి ఆన్లైన్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే 98665 59653, 90523 16764 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అదనంగా పెంచిన కేంద్రాలివే.. ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, కళ్యాణదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, శింగనమల (అనంతపురం రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పక్కన) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, నార్పల (అనంతపురంలోని కొత్తూరు బాలుర జూనియర్ కళాశాల) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, నార్పల (అనంతపురం హౌసింగ్బోర్డు మెయిన్ రోడ్డు ఎస్వీఆర్ కేఫ్ పక్కన) ● ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం, రాయదుర్గం ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం, అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వెనుక, అరవిందనగర్) ● ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం, మోడల్ స్కూల్ దగ్గర ధర్మవరం -
No Headline
ప్రకాశం జిల్లా పామర్రు గ్రామానికి చెందిన భోగ్యం కృష్ణయ్య, పద్మావతి దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో లక్ష్మీప్రసన్న ఒకరు. వారిని పెంచడానికి తండ్రి పడ్డ కష్టాన్ని ఆమె కళ్లారా చూశారు. ఉన్నత చదువులు చదివి ఒక స్థాయికి చేరుకుని బాలికలకు అండగా ఉండాలని భావించారు. పీజీ కోర్సు పూర్తవగానే లక్ష్మీప్రసన్న ఐసీడీఎస్లో సీడీపీఓగా ఉద్యోగం సాధించారు. తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని చాలా సంతోష పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఎనిమిదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం సీడీపీఓగా వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా పలు చోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగారు. లింగ వివక్ష లేకుండా చైతన్యవంతులను చేశారు. భ్రూణహత్యలు జరగకుండా వైద్య సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె సేవలను గుర్తించి 2020లో మహాత్మ జ్యోతిరావు పూలే ఫౌండేషన్ వారు తిరుపతిలో లక్ష్మీప్రసన్నకు ‘సావిత్రి బాయి ఫూలే ఎక్సలెన్స్’ అవార్డు అందజేశారు. ఈ అవార్డు ఆమెలో బాధ్యతను మరింత పెంచింది. – కళ్యాణదుర్గం: బాలికల కోసం పనిచేయాలని... -
డీఎంఎల్టీలో స్టేట్ టాపర్గా కావ్య
అనంతపురం మెడికల్: ఇటీవల జరిగిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పరీక్ష అనంతపురం వైద్యకళాశాలలోని పారామెడికల్ కోర్సు విద్యార్థిని కావ్య... రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంక్ను దక్కించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షల్లో 480 మార్కులకు గానూ 87.77 శాతంతో 416 మార్కులు సాధించింది. విద్యార్థిని ప్రతిభను గుర్తించిన మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు గురువారం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థిని మంచి మార్కులు సాధించం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ షారోన్, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
అనంతపురం: డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి కిందపడిన డ్రైవర్.. తన వాహనం చక్రాల కింద నలిగి దుర్మరణం పాలయ్యాడు. అనంతపురం నగరంలోని రద్దీగా ఉండే అశోక్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు... నగరంలోని మరువకొమ్మ కాలనీలో నివాసముంటున్న ముత్యాలు (38) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పనిలో భాగంగా ట్రాక్టర్ను డ్రైవింగ్ చేస్తూ అశోక్గనగర్లోని హరిహర ఆలయం వద్దకు చేరుకోగానే ముత్యాలుకు మూర్ఛవచ్చింది. వాహన నియంత్రణ కోల్పోవడంతో పాటు అదుపు తప్పి కిందకు జారిపడ్డాడు. అదే సమయంలో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆయన మీదుగా దూసుకెళ్లాయి. ఘటనలో ముత్యాలు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న ట్రాక్టర్ను గమనించిన స్థానిక మెకానిక్లు వెంటనే స్పందించి చాకచక్యంగా బ్రేకులు వేసి, వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, ముత్యాలు మృతదేహాన్ని సర్వజనాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి
రాప్తాడు రూరల్: శ్రీశైలంలో కృష్జజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. త్వరలో హంద్రీ–నీవా కాలువకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో 70 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రోజూ అర టీఎంసీ చొప్పున నీటిని వినియోగిస్తున్నాయని, ఈ లెక్కన 140 రోజుల వరకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈలోపు పేరూరు డ్యాంకు నీళ్లు నింపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ను పరిటాల సునీత కలిసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడగక పోవడం బాధాకరమన్నారు. అప్పట్లో వరుసగా మూడేళ్లు నింపాం వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపినట్లు ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. డ్యాంలో నీళ్లు లేకపోతే రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో వందలాది గ్రామాలు కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయన్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడం ద్వారా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి, 10 వేల ఎకరాల్లో పంటల సాగు అందుబాటులోకి వస్తుందన్నారు. రొద్దం మండలం తురలాపట్నం వంకలో నీళ్లు వదిలితే నేరుగా డ్యాంకు చేరుకుంటాయన్నారు. దీనికి కరెంటు ఖర్చు తప్ప ఇతర ఖర్చులేమీ ఉండవన్నారు. ఇంత చిన్న అంశాన్ని పరిటాల సునీత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. డిమాండ్ రాగానే గేట్లు తొలిగించారు పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్ రైతుల నుంచి మొదలవగానే మరమ్మతుల పేరుతో ఉన్న గేట్లను తొలిగించడం దారుణమన్నారు. రైతులపై కక్ష తీర్చుకునేలా డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పరిటాల సునీత వైఖరి కారణంగా దిగువకు వృధాగా పారాయన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 40 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువను తెచ్చారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచారని గుర్తు చేశారు. పీఏబీఆర్ నుంచి రూ. 90 కోట్లతో మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారన్నారు. జీడిపల్లి అప్పర్ పెన్నార్ లిఫ్ట్ ఇరిగినేషన్ స్కీమ్కు రూ.170 కోట్ల నిధులిచ్చారన్నారు. అయితే టీడీపీ హయాంలో చేసిందేమీలేదని, రూపాయి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అంశాన్ని సైతం ఎమ్మెల్యే సునీత నిర్లక్ష్యం చేస్తుండడం గమనిస్తే నియోజకవర్గ రైతులు, ప్రజల సంక్షేమం పట్టలేదనేది అర్థమవుతోందన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
లేగదూడ దవడకు శస్త్రచికిత్స
అనంతపురం అగ్రికల్చర్: మూగజీవాలకు పశు సంవర్ధకశాఖ ఏడీలు, డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా విరిగిపోయిన లేగదూడ దవడకు శస్త్రచికిత్స చేశారు. వివరాలు.. గార్లదిన్నె మండలం తలకాసులపల్లి గ్రామం వడ్డే నరేష్కు చెందిన పాడి ఆవు మూడు రోజుల కింద కోడేదూడను ఈనింది. దూడ ఆరోగ్యంగా ఉన్నా కింది దవడ ఎముక విరిగిపోవడంతో వేలాడసాగింది. దవడ నొప్పి వల్ల పాలు తాగలేక రోజురోజుకూ నీరసిస్తున్న దూడను గమనించి స్థానిక పశువైద్యాధికారి శింగనమల పశువైద్యశాల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి రెఫర్ చేశారు. దీంతో ఆటోలో అనంతపురంలోని సాయినగర్లో ఉన్న పశువైద్యశాలకు దూడను తీసుకువచ్చి తన బృందంతో డాక్టర్ పద్మనాభం శస్త్రచికిత్స చేశారు. దవడ ఎముకకు రెండు వైపులా 2.5 మి.మీ స్టెయిన్లెస్ స్టీల్ పిన్నులను అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత దూడ దవడ సాధారణ స్థితికి చేరుకోవడం, పాలు తాగడం మొదలు పెట్టింది. దూడకు అవసరమైన ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, అనాల్జిసిక్స్ లాంటి మందులు కూడా అందించినట్లు పద్మనాభం వెలిపారు. శస్త్రచికిత్సలో 1962 అంబులెన్స్ డాక్టర్ సునీత, ట్రైనీ డాక్టర్ నేహ, కమలాకార్, గీత పాల్గొన్నట్లు తెలిపారు. -
యువకుడిపై దాడి
గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లికి చెందిన రామకృష్ణపై నలుగురు యువకులు దాడి చేసి గాయపరిచారు. వివరాలు.. రామకృష్ణ బుధవారం రాత్రి ఎంగిలిబండ వద్ద ఉన్న ధాబా వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు చిన్నపాటి అంశానికి రామకృష్ణతో గొడవ పడ్డారు. అక్కడున్న వారు సర్ది చెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే ఈ అంశంపై కక్ష పెంచుకున్న తొండపాడు గ్రామానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి గొందిపల్లికి చేరుకుని రామకృష్ణ ఇంట్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను కుటుంబసభ్యులు గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుడి సూచన మేరకు అనంతపురానికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 9న రెడ్డి ఉచిత వివాహ పరిచయ వేదిక రాప్తాడు రూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉచిత రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు చిన్నరాసి చంద్రమౌళి రెడ్డి, సెక్రటరీ కిషోర్రెడ్డి తెలిపారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలోని రెడ్డి జన సంఘం కార్యాలయంలో జరిగే వేదికకు హాజరయ్యేవారు కాబోయే అబ్బాయిలు, అమ్మాయిల వివరాలు తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 సంప్రదించాలని కోరారు. సామాజిక స్పృహతోనే వృత్తిలో రాణింపు అనంతపురం: సామాజిక స్పృహ కలిగి ఉన్నప్పుడే వృత్తిలో రాణింపు సాధ్యమవుతుందని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ ఇన్చార్జ్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ అన్నారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవాలన్నారు. హోంగార్డుల దైనందిన విధులు సవాళ్లతో కూడకుని ఉంటాయన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మధు, ఆర్ఎస్ఐ జాఫర్ పాల్గొన్నారు. -
ఒక్కో సంఘానికి ఒక్కో మేట్
● శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి ఎత్తుగడ ● ఉపాధి మేట్లగా 90 శాతం అనుయాయులే ● వారి చేతిల్లోనే హాజరు, కూలీల డిమాండ్ ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (పైల్) రాయదుర్గం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఊపందుకున్నాయి. మస్టర్లలో దొంగపేర్లు రాసి సొమ్మంతా సొంత ఖాతాల్లో వేసుకునేలా టీడీపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న శ్రమశక్తి సంఘాల ముసుగులో దోపిడీకి పక్కాగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి 25 నుంచి 50 మంది కూలీలకు ఓ శ్రమశక్తి సంఘం ఏర్పాటు చొప్పున ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తికావొచ్చింది. మొత్తం ఏడు నియోజకవర్గాలోని 31 మండలాల్లో యాక్టివ్ జాబ్కార్డుల సంఖ్య 2.60 లక్షలు కాగా, వీటి పరిధిలో 4.58 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 13,164 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటయ్యాయి. అనుయాయులకే పెద్దపీట నిబంధనల మేరకు ప్రతి శ్రమశక్తి సంఘానికి ఓ మేట్ను నియమించారు. అయితే స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉపాధి కూలీల్లో సీనియార్టీకి తిలోదకాలు ఇచ్చి టీడీపీ నేతలు సూచించిన వారి అనుయాయులకే పెద్దపీట వేశారు. ఇలా ప్రతి గ్రామంలోనూ టీడీపీ నేతలు గుర్తించిన వారే క్షేత్ర సహాయకులు, మేట్లగా చలామణి అవుతున్నారు. ఈ విధానంపై ఉపాధి కూలీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరోక్షంగా టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే మేట్ల వ్యవస్థను కూటమి సర్కార్ అమల్లోకి తెచ్చిందని మండిపడుతున్నారు. మండుటెండలో శ్రమించే తమపై వీరి పెత్తనం ఏమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని బాహటంగా ప్రశ్నిస్తే వేతనాల్లో కోత వేస్తారమే భయం కూడా కూలీలను వెంటాడుతోంది. మేట్ల ముసుగులోనే అసలు దోపిడీ మేట్లుగా ఎంపికై న వారు కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లడం, వారి అవసరాల మేరకు ఆన్లైన్లో డిమాండ్ పెంచుకోవడం, హాజరు నమోదు, వేతనాలకు సిఫారసు చేయడం లాంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియనే టీడీపీ నేతల అక్రమాలకు ఊతమైంది. మస్టర్లలో దొంగ పేర్లు చేర్చి ఉపాధి కూలీల సొమ్ము కాజేసేలా పక్కా ప్రణాళికను రచించి, ఆ మేరకు అడుగులు వేశారు. మేట్గా ఉన్న వారికి వారి పరిధిలోని ఒక్కొ కూలీపై రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాలో యాక్టివ్గా ఉన్న 4.58 లక్షల మంది కూలీలకు గాను రోజుకు రూ.6.87 లక్షలు మేట్ల ఖాతాలకు చేరుతోంది. 100 రోజులకు రూ.6.87 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూలీల శ్రమదోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది. గతమంతా స్వర్ణయుగం గత వైఎస్సార్సీపీ హయాంలో ఉపాధి కూలీల సంక్షేమానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పనులు కల్పించారు. ఎన్ఐసీ సర్వర్ ద్వారా ప్రతి పనినీ పర్యవేక్షిస్తూ పైసా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టారు. శ్రమశక్తి సంఘాలతో కూలీల శ్రమదోపిడీని గుర్తించి వాటిని రద్దుచేశారు. ప్రతి పైసాను కష్టపడిన కూలీల ఖాతాకు చేర్చారు. ఫలితంగా అప్పటికే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని ఉపాధి పనులతో ఎంతో సంతోషంగా జీవించారు. జిల్లాలో శ్రమశక్తి సంఘాల ఎంపిక దాదాపు పూర్తయింది. ఒక్కో సంఘానికి ఒక్కో మేట్ను నియమించాం. ఆ గ్రూపు పర్యవేక్షణ, హాజరు చూసే బాధ్యత మేట్పై ఉంటుంది. క్షేత్రసహాయకుడు, టెక్నికల్, ఏపీఓ, ఎంపీడీఓ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైన మేట్లు అవకతవకలకు పాల్పడితే సత్వరం తొలగిస్తాం. – సలీమ్ బాషా, పీడీ, డ్వామా -
క్వింటా చింతపండు రూ.31 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్కు గురువారం 1,214.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.31 వేలు, కనిష్టంగా రూ.8,100, సగటున రూ.18 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ.4,200, సగటున రూ. 6,500 ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. -
మట్కా నిర్వాహకుల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక పలు ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్ జిల్లా బాపనపల్లికి చెందిన కొండమనాయుడు, తాడిపత్రిలోని అంబేడ్కర్ నగర్ నివాసి నాగల మణికంఠ, భగత్సింగ్ నగర్కు చెందిన సుబ్బరాయుడు, చాకలి ఆదినారాయణ ఉన్నారు. వీరు గురువారం ఉదయం తాడిపత్రిలోని ఆర్టీసీ బస్డాండ్ వద్ద అరెస్ట్ చేసి రూ.30వేలు నగదు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే చోరీ రాయదుర్గం టౌన్: స్థానిక మారెమ్మ గుడి ప్రాంతంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. వివరాలు... ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న మంజునాథ్ భార్య స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటికి తాళం వేసి ఆటో అద్దెల కోసం మంజునాథ్, ఆయన భార్య ప్రైవేట్ స్కూల్కు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి చేరుకున్న మంజునాథ్.. అప్పటికే ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించాడు. లోపల వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఓ క్యారియర్లో దాచి ఉంచిన రూ.80 వేలును అపహరించి, ఇంటి వెనుక ఉన్న మరో తలుపు నుంచి దుండగులు ఉడాయించినట్లుగా గుర్తించాడు. బీరువాకు వేసిన తాళం తీసేందుకు విఫలయత్నం చేశారని, బీరువా తలుపు తెరుచుకోకపోవడంతో అందులో ఉంచిన బంగారు నగలు భద్రంగా ఉన్నట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారున 67వ జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ జనార్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బొలెరో డ్రైవర్ జనార్ధన్ బుధవారం రాత్రి గుత్తిలో సరుకు అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. కొత్తపేట వద్దకు చేరుకోగానే గుత్తి వైపు వస్తున్న వేగంగా వస్తున్న లారీ ఎదురుగా ఢీకొంది.ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ఇరుక్కొని డ్రైవర్ జనార్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతి కష్టంపై జనార్దన్ను స్థానికులు కాపాడి గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. యువకుడి బలవన్మరణం ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ఎగ్గిడి లోకేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. గేదెల పోషణతో జీవనం సాగించే లోకేష్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కడుపు నొప్పి తీవ్రత తాళలేక స్థానిక బైపాస్ సమీపంలోని ఓ రేకుల షెడ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బైక్ ఢీకొని యువకుడి మృతి
బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు చెందిన తలారి హనుమంతు, పార్వతి దంపతుల కుమారుడు లోకేష్ (35)కు ఏడేళ్ల క్రితం కల్లుహోళ గ్రామానికి చెందిన అంజలితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సొంతూరిలోనే ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న లోకేష్ బుధవారం వ్యక్తిగత పనిపై బొమ్మనహాళ్కు వచ్చాడు. పనిముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. నేమకల్లు చెక్పోస్టు దాటగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో లోకేష్కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు తమిళనాడుకు చెందిన రాజుకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాజును కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. లోకేష్ను మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కాగా, బాధిత కుటుంబసభ్యులను వైఎస్సార్సీపీ సర్పంచ్ పరమేశ్వర పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. -
బెణికల్లులో ‘బెల్టు’ చిచ్చు
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ‘బెల్టు షాపు’ చిచ్చును టీడీపీ నేతలు రాజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ‘వీధికోటి... సందుకోటి’ చొప్పున బెల్టుషాపులు వెలిశాయి. తమ అనునూయులకు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా కూటమి నేతలు గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ‘బెల్టు షాపు’ నిర్వహణ అంశంలో స్థానిక టీడీపీ నేత తీసుకెళ్లిన ఒత్తిడి ఆ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితుడు కణేకల్లు మండలం బెణికల్లు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఎంపీటీసీ ఎర్రిస్వామి తమ పార్టీ కార్యకర్త జీవనోపాధి కోసం బెల్టుషాపు పెట్టించారు. గత పది రోజులుగా బెల్టు షాపు ద్వారా ఆశించిన మేర వ్యాపారం జరగలేదు. దీంతో ఆదాయం తగ్గింది. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్త సదరు నేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్) అమ్మడం వల్లే బెల్టు షాపులో అమ్మకాలు తగ్గాయని, ఇందుకు కారకుడైన అదే గ్రామానికి చెందిన వన్నూరు స్వామిని అరెస్ట్ చేయాలంటూ ఎకై ్సజ్ సీఐ ఉమాబాయిపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో బుధవారం సాయంత్రం తన సిబ్బందితో కలసి సీఐ వన్నూరుస్వామి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎలాంటి మద్యం దొరకలేదు. ఇదే విషయాన్ని సదరు టీడీపీ నేతకు ఆమె ఫోన్ చేసి తెలిపారు. అయితే ఎలాగైనా వన్నూరుస్వామిపై కేసు బనాయించి గ్రామంలో బెల్టుషాపు సజావుగా జరిగేలా చూడాల్సిందేనంటూ ఆయన హుకుం జారీ చేయడంతో వన్నూరు స్వామిని స్టేషన్కు తరలించి చితకబాది కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు ఒప్పించేలా చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చిందో కాసేపటి తర్వాత వన్నూరుస్వామి కుటుంబసభ్యులకు ఓ అధికారి తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి గ్రామానికి చేరుకున్న వన్పూరుస్వామి కుటుంబసభ్యులు నేరుగా ఎర్రిస్వామి ఇంటికెళ్లి తప్పుడు కేసు ఎందుకు పెట్టించావంటూ నిలదీశారు. తాను చెప్పినట్లు వినకపోతే ఏమైనా చేస్తామంటూ ఆ సమయంలో ఎర్రిస్వామి రెచ్చిపోవడమే కాక తన వర్గీయులతో దాడులకు తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా తనపై వన్నూరుస్వామి, ఆయన తండ్రి మల్లికార్జున, తల్లి లింగమ్మ, కుటుంబసభ్యులు అనిత, భూలక్ష్మి, చిన్న వండ్రయ్య దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చావుదెబ్బలు తిన్న తల్లి లింగమ్మ ఫిర్యాదను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఘటనపై వన్నూరు స్వామి మాట్లాడుతూ... తనను స్టేషన్కు తీసుకెళ్లి కొట్టి కర్ణాటక మద్యం అమ్ముతున్నట్లు అక్రమంగా కేసు నమోదు చేశారని, అంతేకాక తన కుటుంబసభ్యులపై దాడి చేసి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై న్యాయపోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. బెల్ట్ షాప్లో ఆదాయం తగ్గిందంటూ వ్యక్తిపై టీడీపీ నేత కుట్ర కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లుగా కేసు నమోదు చేయాలంటూ ఎకై ్సజ్ అధికారులకు హుకుం వాస్తవాలు గుర్తించకుండా పట్టుకెళ్లిన ఎకై ్సజ్ పోలీసులు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ.. ఏకపక్ష దాడులతో ఉద్రిక్తత -
‘ఉపాధిలో అక్రమాలు.. ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
● మరొకరికి షోకాజ్ అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆత్మకూరు మండలం రంగంపేట గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సుశీలమ్మ ఉపాధి పనులు చేపట్టకుండానే కూలీలను మస్టర్లలో నమోదు చేయడంతోపాటు పాత పనులు చేస్తున్న కూలీల ఫొటోలను సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. అలాగే, రాప్తాడు మండలంలోని గొల్లపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మయ్య రెండేళ్ల క్రితం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను తాజాగా చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. 32 మంది కూలీలు పనులకు హాజరు కాగా ఏకంగా 62 మంది ఉన్నట్లు చూపారు. ఈ విషయాలపై అనుమానం వచ్చిన సాంకేతిక నిపుణులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా అక్రమాలు బట్టబయలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. తోపుదుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ను కాపాడేందుకు యత్నాలు.. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్నాయుడు సైతం గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టకుండానే పాత ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు మస్టర్లను సైతం నమోదు చేసి బిల్లుల కోసం పంపినట్లు తెలిసింది. అయితే సురేష్నాయుడును కాపాడేందుకు పలువురు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేవలం షోకాజ్ నోటీసుతో సరిపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఉపాధి పనుల్లో అక్రమాలకు అధికార యంత్రాగం సైతం ‘పచ్చ’జెండా ఊపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
క్వాలిటీ కంట్రోల్.. వసూళ్లు ఫుల్!
పంచాయతీరాజ్ శాఖ క్వాలిటీ కంట్రోల్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘క్యాష్’ కొడితే గానీ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ (ధ్రువీకరణ పత్రం) ఇవ్వడం లేదని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల్లో ఒక శాతం, ఇతర లోపాలు ఏమైనా ఉంటే అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ● పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో వసూళ్ల పర్వం ● టార్గెట్లు విధించి మరీ లాగుతున్న ఓ డీఈ స్థాయి అధికారి ● గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ పరంగా నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో ప్రతి డివిజన్కు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ), ముగ్గురు లేదా నలుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ)లు ఉంటారు. వీరందరిపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఉన్నారు. రోడ్డు గానీ, భవనాలు గానీ నిర్మించాక.. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతాప్రమాణాలు పాటించారా లేదా అని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేస్తారు. నిర్దేశిత నిష్పత్తి మేరకు సిమెంట్, ఇసుక తదితరాలు వాడారా లేదా పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. రూ.30 లక్షల్లోపు బిల్లులు అయితే డీఈఈ స్థాయి, అంతకన్నా ఎక్కువైతే ఈఈ స్థాయిలో క్యూసీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు ఉంటుంది. యథేచ్ఛగా వసూళ్లు.. అయితే, క్యూసీ(క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్)ల మంజూరు మాటున కొందరు అధికారులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బిల్డింగ్ లేదా రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తే.. అందుకు ఒక శాతం అంటే రూ.40 వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. దీంతో కొందరు కాంట్రాక్టర్లు రిపోర్ట్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘క్యూసీ’ సమర్పిస్తే ఎంత బిల్లు వస్తుందో అంతకంటే ఎక్కువ నష్టపోయినా పర్వాలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బరితెగించిన డీఈఈ.. కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీపై వచ్చిన ఓ డీఈఈ బరితెగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులతో పరిచయాలున్నాయని చెబుతూ అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టార్గెట్లు విధించి మరీ కమీషన్లు వసూలు చేసి ఇవ్వాలని తన కింది స్థాయి సహాయ ఇంజినీర్లకు పట్టుబడుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. మరి కొందరు ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనులను చెక్ చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు సకల సౌకర్యాలు కల్పించాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇక.. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో కొందరు ఇష్టారాజ్యంగా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. పర్యవేక్షణ కరువవడంతోనే ఇలా తయారయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా నా దృష్టికి రాలేదు. కమీషన్ కోసం వేధించే అధికారుల గురించి బాధిత కాంట్రాక్టర్లు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా. – మల్లికార్జున మూర్తి, ఈఈ -
అన్న, కొడుకును చంపేందుకు కుట్ర!
రాయదుర్గం: ఆస్తిపై కన్నేసిన ఓ సోదరుడు తన సొంత అన్న, అతడి కుమారుడిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం రాయదుర్గం అర్బన్ పీఎస్లో సీఐ జయనాయక్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాంపురం సమీపంలోని కేకే పుర గ్రామానికి చెందిన మురారి దామోదర్ గౌడ్, మధుసూదన్ గౌడ్లు అన్నదమ్ములు. వీరికి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి సోదరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వారం క్రితం కూడా గ్రామంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దామోదర్ గౌడ్ను మధుసూదన్ గౌడ్ కుమారుడు భార్గవ్ చెప్పుతో కొట్టాడు. దీంతో కసితో రగిలిపోయిన దామోదర్ గౌడ్.. తన అన్న, అతడి కుమారుడిని అంతమొందించాలని భావించాడు. ఇందుకు రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామానికి చెందిన మారుతిరెడ్డికి రూ.23 లక్షలకు సుపారీ ఇచ్చాడు. గురువారం పల్లేపల్లి గేటు సమీపాన రూ.3 లక్షల అడ్వాన్స్, ఇద్దరినీ హత్య చేసేందుకు మూడు వేట కొడవళ్లు అందజేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు.. దామోదర్ గౌడ్తో పాటు మారుతి రెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో ప్రణాళికబద్ధంగా ఆపరేషన్ నిర్వహించినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. రూ.3 లక్షల నగదు, మూడు వేట కొడవళ్లు, రెండు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇటీవల మెచ్చిరి గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో మారుతిరెడ్డి నిందితుడిగా ఉన్నాడని, దీంతో దామోదర్ గౌడ్ అతణ్ని ఆశ్రయించాడని వెల్లడైందన్నారు. కాగా, హత్యల కుట్రను భగ్నం చేసిన సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ రవిబాబు అభినందించి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఆస్తి కోసం సోదరుడి పన్నాగం రూ. 23 లక్షలకు సుపారీ భగ్నం చేసిన రాయదుర్గం పోలీసులు