breaking news
Vintalu Visheshalu
-
ఉబర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్లో కోడింగ్..!
మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదలుకుని నచ్చిన జాబ్లో కొనసాగాలంటే చాలా ధైర్యం కావాలి. తీరా మనకు నచ్చిన రంగంలో కొనసాగాక..సమస్యలు వెంటాడితే ఇక అంతే సంగతులు. అంతా సవ్యంగా ఉంటే పర్లేదు. ఏదైనా సమస్య వస్తేనే ఇబ్బంది. అందులోనూ భారీ వేతనం లభిస్తున్న ఉద్యోగం వదలాలన్న గట్స్ కావాలి. అయితే ఈ టెక్కీ అంత సాహసం చేశాడు. అది కూడా యూట్యూబ్లో కోడింగ్ నేర్పడం కోసం అంత పెద్ద ఉద్యోగం వదిలేశాడు. అబ్బా ఇదేంటని అడిగితే.. తాను కోరుకున్నది ఇదేనని నవ్వుతూ చెబుతాడు సదరు టెక్కీ. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారడమే గాక టెక్కీ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తే అక్షయ్ సైనీ. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మాజీ ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్షయ్ సైనీ ఐదేళ్ల క్రితం సురక్షితమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకున్న తన జర్నీని పంచుకున్నాడు. ఈ నిర్ణయం అతడికి తన డడ్రీమ్ లైఫ్ని నిర్మించుకునేందుకు సహాయపడింది. అంతేగాదు సైనీ తన యూట్యూబ్ ఛానెల్లో రెండు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నిజానికి తాను ఉబర్లో ఉద్యాగాన్ని వదులుకోవడానికి సిద్ధపడినప్పుడూ..అందరు తనని మతిస్థిమితం లేనివాడిగా చూశారని చెప్పుకొచ్చాడు. కేవలం యూట్యూబ్లో బోధించేందుకు మంచి జీతం, మంచి బ్రాండెడ్ కంపెనీ తదితరాలన్నీ కాదనుకుంటున్నావా అని కూడా ప్రశ్నించారని రాసుకొచ్చాడు. ఇది చాలా తెలివితక్కువ నిర్ణయమని. అంతగా కావాలనుకుంటే జాబ్ చేస్తూనే వారాంతాలలో య్యూట్యూబ్ కంటెంట్క్రియేటర్గా, కోడింగ్ బోధించమని సలహ ఇచ్చారని తెలిపాడు. కొందరైతే ఏకంగా ఉబర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్యాగ్తో పెళ్లి అయిపోని.. ఆ తర్వాత నచ్చినదాంట్లో కొనసాగమని సూచించారు కూడా. అయితే నా దృష్టిలో వివాహాం పెద్ద మేటర్ కాదు కాబట్టి..గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలనే నిర్ణయించుకున్నా. అందుకోసం తొందరపడలేదని..జీతం లేకుండా పది నెలలకు పైగా సెలవులు తీసుకుని మరి ఒక నిర్ణయానికి వచ్చినట్లు వివరించాడు. ఆ విరామ సమయంలో బోధన, డెవలపర్ విద్యపై దృష్టి సారించి నమస్తేదేవ్ అనే వేదికపై పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో తాను కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మాత్రమే ఇప్పుడు..వ్యవస్థాపకుడిగా, సీఈవోగా, మార్కెటర్గా, సేల్స్గైగా, ప్రొడక్ట్ మేనేజర్గా, ఫైనాన్స్గైగా, కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్గా అన్ని రోల్స్ నిర్వరిస్తున్నా అని ఆనందంగా చెబుతున్నాడు. అంతేగాదు మనకు బయట స్టార్టప్లు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏళ్లుగా ఎన్నో విమర్శలు, ఆన్లైన్ ద్వేషాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వెనుతిరగలేదని, ఎన్నోప్రతికూలతలను దాటుకుంటూ చాలా దూరం వచ్చానంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు సైని. అలా ఇప్పటికీ ఐదేళ్లు అయ్యిందని, స్వస్థలం డెహ్రాడూన్, అక్కడే ఒక చిన్న రిమోట్ బృందంతో పనిచేస్తున్నట్లు తెలిపాడు. దీని వల్ల కుటుంబంతో గడపగలుగుతున్నానని, పనిని ఆనందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్..అందరి మనుసుని గెలుచుకోవడమే గాక..ఇలాంటి నిర్ణయాల తీసుకునేందుకు చాలా గట్టి ధైర్యం కావాలని, ఆత్మసంతృప్తినిచ్చే పని ఎంతో నచ్చుతుందని. దానికి మించింది మరొకటి లేదని పోస్టులు పెట్టారు. అలాగే అన్నివేళలా సురక్షితమైన ఉద్యోగం కంటే..ఓర్పుతో నచ్చిన వృత్తిలో గెలుపు అందుకోవడంలో ఉన్న కిక్ వేరేలెవెల్ అంటూ మరికొందరూ పోస్టుల్లో పేర్కొన్నారు.When I left Uber, a lot of people thought I had lost my mind.Good salary, big brand, stable life.And I was walking away from it to do YouTube, teaching, content creation. In India.People told me very seriously, “This is not a good decision.”Some said, why don’t you do…— Akshay Saini (@akshaymarch7) February 9, 2026 (చదవండి: ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటలెక్కించారు..కానీ..!) -
మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..!
కోమాలో ఉన్న వ్యక్తుల కుటుంబాలకు ఈ ఘటన సరికొత్త ఆశను అందిస్తోంది. అచ్చం సినిమాని తలపించే సన్నివేశంలా..ఈ కేసులో ఆ బిడ్డ కోమా నుంచి బయటపడ్డాడు. వైద్యులు సైతం చేతులెత్తేశారు. కానీ మాటలు, సందేశాలే మంత్రాలుగా మారి మిరాకిల్ చేశాయి. ఆ బిడ్డకు ఊపిరిపోసి..కోమా నుంచి పూర్తిగా బయటపడేలా చేశాయి. ఆ తల్లి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..ఈ అద్భుత ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యుయాంగ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు లియుచుక్కి నవంబర్ 2025లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు ప్రమాదంలో చిన్నారి చుక్కికి మెదడు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయలయ్యాయి. దాంతో పరిస్థితి విషమంగా మారి కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు సైతం కోమా నుంచి బయటడే అవకాశాలు తక్కువని అని తేల్చి చెప్పేశారు. కానీ ఆ బాలుడు తల్లి ఆశ వదులుకోలేదు. వైద్యుల సూచనల మేరకు అతడికి రోజు సుపరిచితమైన శబ్దాలు, మాటలు..వినేలా వాతావరణం కల్పించాలని చెప్పారు. దాంతో ఆ బాలుడు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి వారి మద్దతు..స్కూల్లో అసెంబ్లీలో ప్లే అయ్యే సాంగ్స్, ప్రార్థన గీతాలు వినిపించేలా చేసింది. అలాగే వీడియో కాల్ ద్వారా ఆ బాలుడి స్నేహితుల మాటలు అతనికి వినిపించేలా చేసింది ఆ బాలుడి తల్లి. రోజు అతడి స్నేహితులు.. రేయ్..! చుక్కి కళ్లుతెరవరా.., మాతో మాట్లాడరా, ఫుట్బాల్ ఆడదాం త్వరగా లేగు అన్న మాటలు ఆ బాలుడిలో స్పందన తెప్పించాయి. ఆ తల్లి అలా అతడి క్లాస్మేట్స్ మాటలు రోజు వినేలా చేయడంతో.. అతడి పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. అంతేగాదు 45 రోజుల కోమా అనంతరం తొలిసారిగా కనురెప్పలు కదపడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన ఉపాద్యాయుడి గొంతు విని నవ్వాడు. అలా 55వ రోజుకి స్పృహలోకి వచ్చి తన ఎడమ చేతిని కదిపాడు. తన పాఠశాల సంగీతం, సహ విద్యార్థులు సందేశాల రికార్డింగ్ ఆ బాలుడుని కోమా నుంచి బయటపడటానికి, కోలుకోవడానికి హెల్ప్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా కదిస్తోంది. A touching story😭😭An 8-year-old boy in Hunan, #China, woke from a 55-day coma after hearing the collected messages of love and well wishes from classmates🥺🥺It's the power of #friendship and #hope. ❤️ pic.twitter.com/M8sEcX8o9Z— GeoSight (互fo) (@ShanxiDaily) January 22, 2026 (చదవండి: ఒబెసిటీ డాక్టర్ వెయిట్లాస్ స్టోరీ..! కేవలం 18 నెలల్లో 56 కిలోలు..) -
తొమ్మిదేళ్లకే పెట్టుబడులు పెట్టేస్తున్నాడు!
నిజమైన అభ్యాసం అంటే పరీక్షలు రాసి గ్రేడ్లు సాధించడం కాదు.. జీవితాన్ని కనుగొనడం, సృష్టించడం అని తొమ్మిదేళ్లకే అర్థం చేసుకున్నాడు గుజరాత్లోని సూరత్కు చెందిన వేదార్థ్. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తరగతి గది గోడలుగా మార్చుకున్నాడు. ప్రతి క్షణాన్ని ఏదో అన్వేషించడానికి, సృష్టించడానికి.. తద్వారా ఉన్నతస్థాయికి ఎదగడానికే వినియోగిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 100కి పైగా పుస్తకాలు చదివాడు. రోబోటిక్స్, ఎల్ఈజీవో నిర్మాణం వంటి అంశాలపై వర్క్ షాపులకు వెళుతుంటాడు. ఏ సవాల్నైనా ఉత్సాహంతో ఎదుర్కొంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని జీవితంలో ఎలా వినియోగించుకోవాలా అని ఆలోచించడం.. అతడి నిత్యకృత్యంగా మారిపోయింది.విద్యాభ్యాసాన్ని సరికొత్తగా పునర్ నిర్వచించుకున్న వేదార్థ్ (Vedarth) అక్కడితో ఆగిపోలేదు. సొంతగా కప్కేక్స్ తయారు చేసి విక్రయిస్తుంటాడు. చాక్లెట్ స్టాల్ ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ సొమ్మును సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు అతడు రూ.10 వేల వరకు పొదుపు చేశాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడిగా వేదార్థ్ గుర్తింపు పొందాడు.తల్లే తొలి గురువు... వేదార్థ్ తల్లి విశ్రుతి తన తొలి గురువు. ఆమె వేదార్థ్ జీవితానికి నిజంగా కావాల్సింది ఏమిటో ఓనమాల నుంచే నూరిపోశారు. స్కూల్లో బట్టీ పట్టడం ద్వారా వచ్చిన జ్ఞానం తన జీవితంలో పెద్దగా ఉపయోగపడలేదని గ్రహించిన విశ్రుతి.. తన కొడుకుకు ఉత్సుకత, వాస్తవ ప్రపంచ అనుభవంతో నిండిన బాల్యాన్ని అందించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో అన్ స్కూలింగ్ అని పిలిచే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.చదవండి: హీరోయిన్ హోటల్ ముందు క్యూ కట్టిన జనం అన్ స్కూలింగ్ (unschooling) విధానంలో నిర్ణీత పాఠ్యాంశాలు, షెడ్యూల్ లేదా పరీక్షల వంటివి ఉండవు. ఇక్కడ కేవలం ఆసక్తి ఆధారిత అభ్యాస విధానం, విద్య సహజమైన ఉత్సుకత, స్వీయ–నిర్దేశిత అన్వేషణ ఆధారంగా సాగుతుంది. ఇందులో భాగంగా విశ్రుతి డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో వేదార్థ్ తల్లి ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమవుతున్నాడు. వేదార్థ్.. నువ్వు వెరీవెరీ స్పెషల్..– గౌతమి గిద్దిగాని, సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘పీస్’ ఫుల్ఫామ్.. ‘పి’ ఫర్ పెయిన్–మేకర్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించిందనే వార్త ప్రపంచాన్ని అయోమయంతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ట్రంప్ ఆనందానికి అవధులు, ఆనకట్టలు, డ్యామ్లు, కాలువలు లేవు.‘ఈసారి కచ్చితంగా నాకే’ అని గన్షాట్ ఆశ పెట్టుకున్న ట్రంప్ను గతంలో ఎస్నో సార్లు ‘పీస్’ ప్రైజ్ వెక్కిరిస్తూ వచ్చింది.పరాభవానికి గురైన ట్రంప్ ‘శాంతి’ బహుమతిపై అశాంతి, కసి, కోపం, పగ, ప్రతీకారం, రివేంజ్.. ఇలాంటివి ఎన్నో పెట్టుకున్నాడు. అంతేకాదు...‘పి’తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానేశాడు. ‘పి’తో మొదలయ్యే వంటకాలను తినడం మానేశాడు.‘పి’తో మొదలయ్యే డ్రింక్స్ తాగడం మానేశాడు.అలాంటి ట్రంప్ను ‘పీస్’ ప్రైజ్ వరించడంతో... ఆ ప్రైజ్పై అతడికి అభిమానం, అనురాగం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ, మమత, సమత... ఇలాంటి భావాలెన్నో కలిగాయి. ఆ ఆనంద కిక్లో వైట్హౌజ్లో ప్రెస్మీట్ పెట్టాడు.‘అరచేయి అడ్డుపెట్టి అప్పడం కాలకుండా చేయగలరా? నో... నెవర్! పీస్ ప్రైజ్ నాకు రావడం కూడా అలాంటిదే. ఈ శుభ సందర్భంగా ప్రపంచశాంతిని ఆశిస్తూ ఒక పాట పాడుతాను’ అని గొంతు సవరించాడు ట్రంప్. ఆ పాట వినడానికి సభాసదుల చెవుల వైశాల్యం రెట్టింపు అయ్యింది. ‘నేను విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ’ అని పాడడం ప్రారంభించాడు శ్రీ ట్రంప్.‘సోడా బుడ్డికి ప్రపంచ శాంతికి సంబంధం ఏమిటి?’ అని అడగబోయిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక విలేఖరికి వెజెజువెలా ప్రెసిడెంట్ గుర్తుకు వచ్చాడు. ‘అంత పెద్ద ప్రెసిడెంట్నే మాయం చేసిన వాడికి నేనొక లెక్కా’ అని జాగ్రత్తగా లెక్కలు వేసుకొని నీట్గా రూట్ మార్చాడు.చదవండి: చుక్కల్లో పసిడి ధరలు.. చదివింపుల గుబులు‘మీరు పాడిన పాట ఏ భాషదో తెలియదుగానీ... ఎంత అద్భుతంగా పాడారు సర్!’ అని మెలికలు తిరిగిపోయాడు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అని చెప్పిన ట్రంప్కు తన పాట ఎంత బ్లడ్పాతం సృష్టించిందో తెలియదు. దీనికి సాక్ష్యం... వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి చెవిలోని నుంచి ఆగకుండా కారుతున్న రక్తం!!!!కసి మెరుపు: ఇంతకీ... ట్రంప్కు ‘పీస్’ ప్రైజ్ ప్రకటించింది నోబెల్ కమిటీ కాదు.‘హారిబుల్’ కమిటీ! అర్జెంటీనాలోని ఫాక్స్నక్కపాలెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కమిటీ... మూర్ఖత్వం, అహం మూర్తీభవించిన ప్రతిభా‘వాంతు’లకు ప్రతి యేటా ‘పీస్’ ప్రైజ్ ప్రకటిస్తుంది. ఇంతకీ... ఈ ‘పీస్’ ప్రైజ్లో శాంతి పిసరంత కూడా ఉండదు.– యాకుబ్ భాషఇంతకీ... వీరి ‘పీస్’ ఫుల్ఫామ్...‘పి’ ఫర్ పెయిన్–మేకర్: బాధలు తయారుచేసే వ్యక్తి‘ఇ’ ఫర్ ఎంప్టీ హెడ్: ఖాళీ బుర్ర‘ఎ’ ఫర్ ఆరగెంట్: గర్వం మూర్తిభవించిన వ్యక్తి‘సి’ ఫర్ క్రేజీ: తెలివితక్కువ–సెన్స్లెస్కు ఎక్కువ‘ఇ’ ఫర్ ఇగోయిస్టిక్: అహంకారి -
హీరోయిన్ హోటల్ ముందు భారీ క్యూ
నచ్చిన వాటిని దక్కించుకోడానికి 'క్యూ' కట్టడం మన దేశంలో సర్వ సాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు టికెట్ల కోసం ధియేటర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీటర్ల వరకు క్యూ కట్టేస్తాం. ఈ మధ్యన బట్టలు కొనేందుకు కూడా షాపుల ముందు నించుంటున్నారు జనం. ఇక మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవర్గ్రీన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో కనిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డబ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు, అంత ఫేమస్సా?ముంబై మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అమ్మకై అనే రెస్టరెంట్ (AmmaKai Restaurant) ముందు జనం క్యూ కట్టిన వీడియోను ఎక్స్లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్తగా ప్రారంభమైన అమ్మకై రెస్టరెంట్.. రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత అల్పహారం ఆఫర్ చేసింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడతామని ప్రకటించింది. ముందుగా వచ్చిన వారికి మాత్రమే వడ్డిస్తామని షరతు పెట్టింది. ఇది చూసిన జనం రెస్టరెంట్ ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు.బిచ్చగాళ్ల మాదిరిగా..ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసిన యూజర్.. జనం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడతామంటే జనం బిచ్చగాళ్ల మాదిరిగా రెస్ట్రెంట్ తెరవడానికి 2 గంటల ముందే క్యూ కట్టారని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవరూ పేదవారులా కనిపించలేదన్నారు. కనీసం రెండుమూడు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసిస్తున్న లక్షధికారుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీగా వస్తుందంటే చాలు వెనుకాముందు చూడకుండా ఎగేసుకుని వచ్చేస్తారంటూ నిష్టూరమాడారు. ఒక ప్లేట్ బ్రేక్ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారని ధ్వజమెత్తారు. 'ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాలను తప్పుబడతాం. కానీ దానికి మన బాధ్యత ఉందని అనుకోం. మన ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద'ని ఎక్స్లో రాశారు. ఫ్రీగా వస్తుందంటే జనం ఇలాగే ఎగబడతారని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. అమ్మకైగా మారిన బాస్టియన్ఇంతకీ అమ్మకై రెస్టరెంట్ ఎవరిదో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోటల్. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో కలిసి ఈ రెస్టరెంట్ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్లో దీన్ని మూసివేస్తున్నట్టు ఎక్స్లో శిల్పా శెట్టి ప్రకటించారు. ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోటల్ మూసేస్తున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్ను కొత్తగా మార్చి అమ్మకై పేరుతో మళ్లీ ప్రారంభించారు. ప్రమోషన్ కోసం ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ (Free Breakfast Offer) పెట్టారని ముంబై జనం అనుకుంటున్నారు. చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!AmmaKai,a newly launched restaurant by Shilpa Shetty in Bandra announced free breakfast for anyone and everyone with first come first serve basis and this is how the people responded like absolute beggars,standing in que since 7.00 A.M in the morning,2 hours before the… pic.twitter.com/AAz8iqdcFU— DG (@RetardedHurt) January 27, 2026 -
ఇంటిపేరే ‘బెంగళూరు’..!
కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.బెంగళూరుకు చెందిన విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె తన వాయిస్ ఓవర్తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vipra Bangalore (@vip_z_z) (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!) -
గజగజలాడే చలిలో వెచ్చదనంతో కూడిన దయ..!
గజగజలాడే చలిలే కాసింత వెచ్చదనం ఇచ్చే హాయి అంత ఇంత కాదు. వసంత పంచమి తర్వాత హిమచల్ప్రదేశ్ వంటి హిమాలయ పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతంతో పరుచుకున్న సంగతి తెలిసింది. అక్కడున్న చాలా గ్రామాలు మంచుదుప్పటి కప్పుకున్నాయా..? అన్నంతగా మంచు కురుస్తుంది. పాపం పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఈ మంచు తుఫానులో చిక్కుకున్నారు.వారి కార్లన్నీ రోడ్లపై దిగ్బంధించి ఉన్నాయి. విద్యుత్, నీటి సరఫరా అంతరాయంతో బిక్కుబిక్కుమంటున్నారు అక్కడి పర్యాటకులు. ఈ విపత్కర సమయంలో స్థానికులు స్పందించిన విధానం నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతీది రీల్స్లా మారిపోయింది. కానీ ఇక్కడ స్థానికి మహిళలు చాలా నిశబ్దంగా మంచు తుఫానులో చిక్కుకున్న పర్యాటకులకు వెచ్చటి చాయ్ని అందించి స్వాంతన చేకూర్చారు. మనాలీ సమీపంలోని గోజ్రా గ్రామానికి చెందిన స్థానిక మహిళలు గడ్డకట్టిన వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి వేడినీటి ప్లాస్క్లతో బయటకు వచ్చి వారికి సర్వ్ చేయడం విశేషం. ఎక్కడా.. హడావిడి గానీ హంగామా గానీ లేదు..సౌమ్యంగా సహాయం చేస్తున్న విధానం అందరి మనసులకు హత్తుకుంది. గణతంత్రపు దినోత్సవం ప్లస్ వారాంతపు సెలవు కలిసిరావడంతో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరిగ్గా దానికి తగ్గట్టు కఠినమైన వాతావరణం ఇబ్బంది పెడితే.. స్థానికులు మాత్రం ఆతిథ్యంతో 'స్వచ్ఛమైన హిమచల్ స్ఫూర్తి'ని కనబర్చి మానవత్వం చాటుకోవడం అందర్నీ ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది పర్యాటకానికి సంబంధించిన రీల్స్ కాదు..నిశబ్దంగా చెబుతున్న మానవత్వపు చర్య ఇది అంటూ పోస్టులు పెట్టారు. The most beautiful video on Tourism Day.Local women serving hot tea to tourists stranded in Manali’s snowfall traffic jam. No noise, no show off, just warmth and kindness.Across tourist states, one thing stays common. Be polite, be gentle, and people will always step up to… pic.twitter.com/gmxhGX3mt9— Nikhil saini (@iNikhilsaini) January 25, 2026 (చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!) -
'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగిలించిందా..!
ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్ వెనుకున్న కథేంటంటే..!.నిజానికి పెంగ్విన్లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. అంతేకాదు చాట్జీపీటీ సైతం పెంగ్విన్ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్ చేయగా..ఈ క్లిప్ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్ వాక్ని డెత్మార్చ్ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్ల గుంపులో కలిపారు. View this post on Instagram A post shared by ज़िन्दगी गुलज़ार है ! (@zindagi.gulzar.h) కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్ ఒక రోల్మోడల్ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by @reels.olizzzz (చదవండి: కొండల నుంచి సభకు..!) -
కొండల నుంచి సభకు..!
గిరిపుత్రులుగా పిలిచే గిరిజనులు..కొన్నితెగలు ఇప్పటకీ చాలా వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ నాటి ఆచార సంప్రదాయాలు, కట్లుబాట్లు వారిలో భాగం అన్నట్లుగా ఉంటుంది వారి సంస్కృతి. కొందరు ఇప్పటికీ సిటీ ముఖమే చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి గిరిజనుల్లో ఒక తెగ అసలు బయటకే అడుగుపెట్టరు. వాళ్లకస్సలు..పట్టణాలు, నగరాలు గురించి బొత్తిగా తెలియనే తెలియదు. ముఖ్యంగా అక్కడ మహిళలు తమ ఇల్లు, గ్రామం తప్ప బయట ముఖమే తెలియని వాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాళ్లంతా ఏదో పార్టీలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారనుకుంటే పొరపాటేతమిళనాడు నీలగిరిలోని దేవర్చోలై పంచాయతీలోని కౌండన్కొల్లై కుగ్రామానికి చెందిన ఓ గిరిజన తెగ చాలా అరుదుగా బయటకు వస్తారు. అలాంటి నేపథ్యం ఉన్న గిరిజన మహిళలు అసెంబ్లీనికి చూసేందుకు రావడం విశేషం. ఎవరి వల్ల వాళ్లు ఇంత ధైర్యంగా అసెంబ్లీ సందర్శనకు రాగలిగారంటే..గూడలూరు ఎమ్మెల్యే పొన్ జయశీలన్ మద్దతుతో అసెంబ్లీకి వచ్చారు. ఆ తెగకు చెందిన ఎక్కువమందిని అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే..కేవలం ఐదుగురు మాత్రమే ఇక్కడకు రావడానికి అంగీకరించారట. అంతేగాదు వాళ్లంతా తమకు ఈ అవకాశం ఇచ్చిన సదరు ఎమ్మెల్యే, స్పీకర్కు కృతజ్ఞతలు తెలిపారు. తాము అసెంబ్లీ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతుహలంతో వచ్చామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే పొన్ జయశీలన్ ఆ తెగకు చెందిన చాలామంది ఇక్కడకు రావాలని ఆశించా, కానీ ఐదురుగు మాత్రమే వచ్చారని ఆయన అన్నారు. అంతేగాదు ఆయన మారుమూల గిరిజన ప్రాంతాలలో గృహాలను నిర్మించడంలో ఎదుర్కొంటున్న లాజిస్టికల్ సవాళ్లను పేర్కొంటూ, గిరిజన గృహాలకు ఆర్థిక సహాయాన్ని 5.25 లక్షల నుంచి 7.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కూడా. (చదవండి: వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!) -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!
అత్యంత పరిశుభమైన దేశాల్లో ఒకటి జపాన్. చాలా పరిశుభ్రంగా ఉడే దేశాల్లో కూడా ఎక్కడో ఒక విషయంలో అధ్వాన్నంగా ఉంటుందేమో గానీ జపాన్ మాత్రం సూది మొనంత ధూళి కూడా కనిపించకుండా అందాల మెరిసిపోతుంది. అంత పరిశుభ్రంగానా అని అంతా ఆశ్యర్యపరిచేలా ఉంటుంది. అంతలా స్వచ్ఛత ఉండాలంటే..అక్కడ అందరిలో యూనిట్ కంటే..ఎలాంటి మనసతత్వం ఉంటే ఇది సాధ్యమైందో తెలిస్తే అవాక్కవుతారు. ఆ కారణం తెలుసుకున్నా..పాటించాలంటే కాస్త కష్టమే..!జపాన్ అంత శుభ్రంగా ఉండటానికి ఆ మానస్తత్వమే కారణమంటూ అక్కడ జరిగిన ఓ సంఘటను భారతీయ మహిళ ఊర్వశి రికార్డు చేసి మరి నెట్టింట షేర్ చేశారు. ఆమె షేర్ చేసిన వీడియోలో ఎవరో ఒక రెస్టారెంట్ వెలుపల వాంతులు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే అలాంటివి మనదేశంలో చాలా కామన్..సాయంత్ర దాక అది అలానే ఉంటుంది. రేపు రోడ్లు ఊడ్చేవాళ్లు వచ్చేదాక అంతే పరిస్థితి అన్నట్లు ఉంటుంది. కానీ జపాన్లో ఆ రెస్టారెంట్ సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఏ మాత్రం అసహ్యించుకోకుండా నేరుగా చేతులతోనే క్లీన్ చేయడం విశేషం. పైగా అతడి ముఖంలో ఎలాంటి చిరాకు, అసహ్యం కనిపించలేదు. ఏదో తన పని తాను చేసుకున్నట్లుగా చాలా నిశబ్దంగా క్లీన్ చేసి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీడియోకి ఊర్వశి అక్కడ ధూళి కంటే మనస్తత్వం అత్యంత ముఖ్యం అనే క్యాప్షన్ జోడించి మరి నెట్టింట పోస్ట్ చేశారు. అక్కడ దాన్ని ప్రజా బాద్యతగా భావించి క్లీన్ చేస్తారు కాబట్టే జపాన్ అంత శుభ్రంగా ఉంటోంది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Urvashi in Japan ⛩️🎏 (@uruchan_in_japan) (చదవండి: పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!) -
ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. సూపర్బ్!
ప్రేమలో పడటం సులభమే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఒక పెద్ద టాస్క్! మన వీరేంద్ర కువేల్కర్ మాత్రం రొటీన్కు భిన్నంగా ఆలోచించి, తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక అదిరిపోయే ‘బైక్ డ్రామా’ ప్లాన్ చేశాడు. ఇన్స్ట్రాగామ్లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.అసలేం జరిగింది? సాదాసీదాగా బైక్ మీద షికారు వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు వీరేంద్ర. పాపం ఆ అమ్మాయి వెనకాల కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటోంది. కానీ వీరేంద్ర మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ‘సిగ్నల్’ కోసం వెయిట్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే.. ముందుగా ఒక బైకర్ వచ్చి ఓవర్టేక్ చేసి ముందు నిలబడ్డాడు. అతని టీషర్ట్ వెనకాల ‘విల్’అని ఉంది. వెంటనే రెండోవాడు వచ్చాడు.. అతని టీ షర్ట్పై ‘యూ’అని ఉంది. మరో ఇద్దరు తోడయ్యారు.. వారి టీ షర్టులపై ‘మ్యారీ’, ‘మి’అని ఉంది. అక్షరాలు కలిపి చదివితే.. టడడడాయ్! ‘విల్ యూ మ్యారీ మీ’.. అని ఒక గాలిలో తేలే ప్రపోజల్ సిద్ధమైంది. ఆ నలుగురు బైకర్లు వరుసగా కళ్లముందు వెళ్తుంటే, ఆ అమ్మాయి షాక్ నుంచి తేరుకుని నవ్వే లోపే.. మన హీరో వీరేంద్ర జేబులోంచి మెరిసే ఉంగరం తీసి ఆఫర్ ఇచ్చేశాడు! మాకూ ఇలాంటి గ్యాంగ్ కావాలి ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బైకర్స్ కమ్యూనిటీ అంతా ‘బ్రదర్హుడ్ అంటే ఇదీ!’అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘రింగు తెచ్చాడు.. దానికి థ్రిల్ కూడా అటాచ్ చేశాడు!’.. అని ఒకరు.. ‘ఆయన హ్యాపీ, ఆమె హ్యాపీ, బైకర్స్ అందరూ హ్యాపీ!’.. అని మరొకరు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ సెటప్లు లేకపోయినా.. నలుగురు దోస్తులు, రెండు లీటర్ల పెట్రోల్ ఉంటే చాలు, ఇలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చని ఈ జంట నిరూపించింది.చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! View this post on Instagram A post shared by VIRENDRA KUVELKAR |🇮🇳 (@greek_god_26) -
పావలా నాణేలతో జాతీయ జెండా!
మనిషన్నాక కాసుంత కళాపోషణ ఉండాల అన్నట్టు ఈ హెడ్ కానిస్టేబుల్ వినూత్న ఆలోచనలతో నాణేలతో కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు.తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సురేష్రెడ్డి తన భార్య సుమతి సహకారంతో 2001 నుంచి 1.60 లక్షల 25 పైసల (పావలా) నాణేలను సేకరించి 12 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో భారీ జాతీయ జెండాను (National Flag) రూపొందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కోసం తాను ఉండే పోలీస్ క్వార్టర్స్ మిద్దెపైన ఈ జెండాను ప్రదర్శించారు. పోలీసు అధికారులతోపాటు ఔత్సాహికులు ఈ నాణేల పతాకాన్ని వీక్షించి అబ్బురపడుతున్నారు.సురేష్రెడ్డి గతంలో 25 పైసల నాణేలతో చార్మినార్, తంజావూరు బృహదీశ్వరాలయం, గేట్ వే ఆఫ్ ఇండియా, కేరళలోని ఆనంద నిలయం (Ananda Nilayam) వంటి పుణ్యక్షేత్రాలతోపాటు చారిత్రాత్మక ఘట్టాల ఆకృతులనూ రూపొందించారు. రిటైరయ్యేలోపు ఐదు లక్షల నాణేలతో భారీ జాతీయ పతాకాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఉన్నట్టు సురేష్రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే సురేష్రెడ్డి తాతముత్తాతల నుంచి అందరూ పోలీసు శాఖలోనే పనిచేయడం మరో విశేషం. చదవండి: తెల్లవారుజాము నుంచే క్యూ కడతారు.. ఒకటి మాత్రమే అమ్ముతారు! -
మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..
ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.వసంతాన్ని ఆహ్వానిస్తూ..ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.ప్రధాని ప్రశంసఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.The stage is all set, the performers are pumped up.#BagurumbaDwhou - just a few hours to go! pic.twitter.com/PfSiC6CQLy— Himanta Biswa Sarma (@himantabiswa) January 17, 2026 (Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!) -
తెల్లవారుజాము నుంచే క్యూ కట్టాల్సిందే!
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్ను ముందుగా దక్కించుకోవడానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంటల తరబడి వేచివుంటారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు పడిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియన్ సిలికాన్వ్యాలీలో దర్శనమిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్లోకి రాలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మరి దేనికోసం?బెంగళూరులోని ఓ దుకాణం ముందు మహిళలు పెద్ద ఎత్తున క్యూ కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారంతా తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు వేచివున్నట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిలబడ్డారని తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, సగం ధరకు అమ్మేవో కాదు.. చాలా ఖరీదైన పట్టు చీరలు. ఏంటీ.. అంతేసి డబ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను దక్కించుకునేందుకు ఇంత కష్టపడాలా అని జనం నోరెళ్లబెడుతున్నారు. విషయం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ కడతారు!మైసూరు పట్టు చీరలను దక్కించుకునేందుకు మహిళలంతా కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగళవారం ఇలా క్యూ కట్టారు. లైన్లో వేచివున్న మహిళల కోసం ప్రత్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీరనైనా దక్కించుకోవాలన్నట్టుగా మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్యక్తి 'ఎక్స్'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు ఖరీదు చేసే మైసూరు పట్టుచీరల కోసం మహిళలు తెల్లవారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్నవారిని మాత్రమే దుకాణం లోపలికి అనుమతిస్తారని 'కన్నడప్రభ' తెలిపింది. అందరికీ చీరలు దక్కాలన్న ఉద్దేశంలో ఒక్కొక్కరికి ఒకటి మాత్రమే విక్రయిస్తారని వెల్లడించింది.కేఎస్ఐసీ (KSIC) మాత్రమే అసలు సిసలైన మైసూరు సిల్క్ సారీలను తయారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత తయారీ హక్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది కలిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్షణ ఇచ్చిన వారు మాత్రమే మైసూరు పట్టు చీరలను నేస్తుండడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోతోంది. అందుకే తమ దుకాణానికి వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక చీర మాత్రమే విక్రయిస్తోంది. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా ఒరిజినల్ పట్టుచీరలను తయారు చేస్తోంది కాబట్టే మహిళలు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజినల్ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మరి!Women queue up from 4.00 AM outside a Karnataka Soviet (sorry Silk) Industries Corporation showroom to buy silk sarees starting from ₹23,000 and going up to ₹250,000. Only 1 saree per customer and you need a token to be in the queue.There is an ongoing shortage (or more… pic.twitter.com/d100w3hql0— Rakesh Krishnan Simha (@ByRakeshSimha) January 20, 2026నెటిజన్ల స్పందన..''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మగాళ్లు 12 గంటలు ముందుగానే క్యూ కట్టడం మామూలు విషయం. కానీ చీరల కోసం మహిళలు క్యూలో వేచివుండడం ఆసక్తికరం.''''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే కన్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివరకు దాన్ని దక్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటే.. వారంతా బాగా డబ్బున్న ఉన్నవారే అయుంటారు.''''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్యతపై నమ్మకంతోనే మహిళలు ఇక్కడ పట్టు చీరలు కొనేందుకు వస్తున్నారు.''చదవండి: కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా? -
కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా?
లదాఖ్లోని లేహ్–కార్గిల్ హైవేలో ఉన్న మేగ్నెటిక్ హిల్ ప్రాంతం అయస్కాంత శక్తికి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ రోడ్డుపై భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వస్తువులు, వాహనాలు మూవ్ అవుతున్నట్టు మనం గమనించవచ్చు. కారును న్యూట్రల్ గేరులో పెట్టి స్టార్ట్ పాయింట్ దగ్గర ఆపితే, ఆటోమెటిక్గా కారు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండపైకి వెళ్తుంది.మొదట్లో ఇది ఒక భ్రమలా, మాయలా అనిపించవచ్చు. కానీ అక్కడికి వెళ్లినవాళ్లకు ఇది నిజంగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై చాలా మంది పరిశోధనలు కూడా చేస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం ఇది ఒక గొప్ప అనుభూతిని అందించే ప్రదేశంగా మారిపోయింది.హిడెన్ స్కీయింగ్ ప్యారడైజ్బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్లోని ఔలి ఒకటి. రిషికేష్ నుంచి బద్రినాథ్కు వెళ్లే మార్గంలో ఉన్న జ్యోషిమఠం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన హిల్ స్టేషన్ (Hill Station) ఉంటుంది.చలికాలంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారికి ఔలి కంటే బెస్ట్ డెస్టినేషన్ ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా స్కీయింగ్ కోసం ఔలి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందాదేవి, కామెత్ వంటి హిమాలయ పర్వత శ్రేణులు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఔలిలో ఒక ఆర్టిఫిషియల్ లేక్ కూడా ఉంది. చలికాలంలో ఈ సరస్సు చుట్టూ మొత్తం మంచు పేరుకుపోయి, ఈ ప్రదేశం మంచు స్వర్గంలా మారిపోతుంది. జ్యోషిమఠం నుంచి ఔలికి రోప్వే ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ ప్రయాణం మొత్తం హిమాలయాల అందాలను ఆస్వాదించేలా ఉంటుంది.కుటుంబంతో కలిసి ఒక మంచి హిమాలయన్ అడ్వెంచర్ ట్రిప్ (himalayan adventure trip) ప్లాన్ చేయాలనుకుంటే, మీ లిస్టులో ఔలిని తప్పకుండా టాప్ 3 డెస్టినేషన్లలో చేర్చుకోవచ్చు. అలాగే జ్యోషిమఠంలో ఉన్న పాలరాయితో నిర్మించిన నరసింహ స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. చదవండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు! -
ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు
భారతదేశంలో కొన్ని ప్రదేశాలు మ్యాపులో సింపుల్గా కనిపించినా.. అక్కడి వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి ఒక ప్రదేశమే మలానా గ్రామం. హిమాచల్ ప్రదేశ్లోని పార్వతీ లోయ పక్కనే, కొండల మధ్యలో ఉన్న ఈ గ్రామం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఒక పురాతన ప్రదేశం.ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఆలయాలను, గోడలను, మనుషులను తాకితే అధికారులు ఫైన్ వేస్తారు. స్థానికులకు ఎవరైనా బయటి వారు డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేలపై లేదా కౌంటర్పై పెడతారు కానీ చేతికి ఇవ్వరు. పొరపాటున బయటి వాళ్లు టచ్ అయితే వెంటనే వెళ్లి స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడి ప్రజల విశ్వాసం.మలానా గ్రామాన్ని (Malana Village) చాలా మంది ప్రపంచంలోనే అతిపురాతనమైన ప్రజాస్వామ్యం ఉన్న ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ పోలీసు వ్యవస్థతో పని లేకుండా, జమ్లూ దేవత అనే స్థానిక దైవశక్తి సాక్షిగా తీర్పులు, నిర్ణయాలు జరుగుతాయి. మలానా ప్రజలు కానాశీ అనే ఒక సీక్రెట్ భాషలో మాట్లాడుతారు.ఇది ఎంత సీక్రెట్ అంటే, వారు మాట్లాడే పదాలు చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులకు కూడా అర్థం కావు. అలాగే అలెగ్జాండర్ (Alexander) సైనికుల వంశం ఇక్కడ కొనసాగుతుందని కూడా కొంతమంది అంటారు, కానీ దానికి స్పష్టమైన రుజువులు లేవు.చదవండి: ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు -
ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు!
నేడు జీవితం మొత్తం స్మార్ట్ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్ స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది. ఇదే ఇపుడు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్ అద్భుతమైన ఆలోచనకు నాంది పలికింది. పిల్లలను, యువతను డిజిటల్ స్క్రీన్నుంచి బయటపడవేసే మహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ నిర్ణయం ఇపుడు అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తూ, ఆ గ్రామం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చేస్తోంది.మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న అగ్రాన్ దుల్గావ్ (Agran Dhulgaon) అనే ఒక చిన్న గ్రామం డిజిటల్ స్క్రీన్ వినియోగంపై పరిమితులను విధించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు డిజిటల్ స్క్రీన్కి దూరంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే నిర్ణయించారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి మొత్తంగా ఒక రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.నిర్ణీత సమయానికి గ్రామంలో ఒక సైరన్ (Siren) మోగుతుంది. ఆ సైరన్ వినగానే అందరూ తమ మొబైల్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పక్కన పెట్టేస్తారు. ఈ డిజిటల్ అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలని, వారు ప్రతిరోజు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించేలా ఈ నిబంధనను తీసుకువచ్చారు.ఈ డిజిటల్ డిటాక్స్ (Digital Detox) నిర్ణయం గ్రామంలో ఎంత అద్భుతమైన ఫలితాల్ని తీసుకు వచ్చిందంటే... ఏకంగా ఆ గ్రామంలోని 53 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్లను గెలుచుకునేంతగా... మరికొంత మంది విద్యార్థులు యూపీఎస్సీ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ వంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. గ్రామ సర్పంచ్ శివ్దాస్ భోస్లే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ట్రెండ్సెట్టర్ సీతారామన్! -
అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారపు గాజులను'..
ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లని, ప్రాణ స్నేహితుల్ని నమ్మడానికి వీల్లేని రోజులు. సాయం చేసిన వాడినే నాశనం చేసే దారుణమైన గడ్డు రోజుల్లో. 'మనిషన్న వాడు కానిరాడమ్మా..' అనే ఆర్యోక్తిలా ఉన్నాయి పరిస్థితులు. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో ఉదంతలే నిదర్శనం. కానీ దాన్నే తలదన్నేలా ఇక్కడ జరిగిన సంఘటన హైలెట్గా నిలిచింది. పైగా 'నమ్మకానికి' కొండంత విలవ ఉంది అని నిరూపించే అపురూపమైన ఘటన ఇది.మెట్రో ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిందే. జనంతో కిటకిటలాడుతూ..అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి బెంగళూరు మెట్రో ప్రయాణంలో జరిగిన ఘటన నెట్టింట అందరి మనసులను తాకింది. రోజువారి ప్రయాణంలో కనిపించిన దయకు సంబంధించిన ఓవిషయాన్ని నెట్టింట ఒక మహిళ పంచుకుంది. ఆ పోస్ట్లో ఆ మహిళ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడూ..ఒక చిన్న అమ్మాయి మణికట్టుపై అందమైన బంగారు గాజుని గమనించింది. అయితే ఆ గాజు డిజైన్ ఆమెను ఆకట్టుకుంది. వెంటనే ఆమె ఆ అమ్మాయిని కాస్త ఆ గాజుని ఫోటో తీసి ఇవ్వగలరా..నేను అదేలాంటి డిజైన్ గాజుని తయారుచేయించుకుంటానని అడిగింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. పైగా ఆ మహిళను విస్తుపోయాలే చేసింది ఆ అమ్మాయి. అప్రయత్నంగా తన చేతి గాజుని తీసి ఆ మహిళ చేతిలో పెట్టేసి మీకు నచ్చినట్లుగా చేయించుకోండి అని సింపుల్గా అంటుంది. ఆ హఠాత్పరిణామనికి ఆ మహిళ నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి.. ఇది ఒరిజనల్ బంగారు గాజు కాదని, ఇంది వన్ గ్రామ్ గోల్డ్ బంగారు గాజు అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె విశాల హృదయం, నిజాయితీ ఆమె మనసుని తాకడమే గాక ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకం ఇంకా బతికే ఉందా అని ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. అంతేగాదు ఆ అపురూపమైన క్షణానికి గుర్తుగా ఆ గాజుని తన వద్ద ఉంచుకుంది. పైగా అందుకు సంబంధించిన అపురూపమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ గాజు తన సొంతం ఎలా అయ్యిందో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.(చదవండి: పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..) -
1 BHK ఫ్లాట్ నెల అద్దె రూ. 8 లక్షలు!
'ఏంటీ ఇంత రెంటా' అని అవాక్కయ్యారా?. అవును మీరు చదివింది నిజమే. సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ఒక్క నెల కిరాయి అక్షరాలా 8 లక్షల రూపాయలు. మామూలుగా సిటీలో సింగిల్ బెడ్రూం ఫ్లాట్ నెల అద్దె 10 వేల రూపాయల వరకు ఉండొచ్చు. ప్రైమ్ ఏరియా అయితే ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మరీ 8 లక్షలంటే చాలా చాలా ఎక్కువ కదా! ఈ వార్త గురించి తెలిసిన వారంతా ఇలాగే ఫీలవుతున్నారు. ఇంతకీ ఈ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ ఎక్కడనేగా మీ డౌటు? ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.దీపాంషి చౌదరి అనే మహిళ షేర్ చేసిన 1 బీహెచ్కే అపార్ట్మెంట్ (1BHK Flat) హోం టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది. అన్ని సదుపాయాలతో కూడిన సింగిల్ బెడ్రూం ఫ్లాట్ను ఆమె తన వీడియోలో చూపింది. లాబీ, లివింగ్రూం, వాష్రూం, బెడ్రూం, కిచెన్తో చూడటానికి ఫ్లాట్ మామూలుగానే ఉంది. కానీ ఏకంగా 8 లక్షలు అద్దె అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే అపార్ట్మెంట్ ఉన్న ఏరియాను బట్టి చూస్తే అంత అద్దె కరెక్ట్ అంటున్నారు దీపాంషి చౌదరి.తాను చూపించిన ఫ్లాట్ సెంట్రల్ లండన్లో (Central London) ఉందని ఆమె వెల్లడించారు. ఈ ఫ్లాట్లోంచి ప్రఖ్యాత సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చిని ప్రత్యక్షంగా చూడొచ్చని చెప్పారు. క్రిస్మస్ సీజన్లో నెల రోజులకు మాత్రమే బుక్ చేసుకున్నందున అద్దె ఎక్కువ అని వివరించారు. “అవును, అద్దె చాలా ఎక్కువగా ఉంది. కానీ లోకేషన్ను బట్టి చూస్తే కిరాయి విలువ కరెక్టేనని అనిపిస్తుందని అన్నారామె. ఈ వీడియో చూసిన వారంతా “ఇది చాలా ఎక్కువ” అంటున్నారు. “లండన్లో చాలా మంది ఇంత అద్దె భరించలేరు. ఇంత ఖరీదైన ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నారంటే.. మీరు ఏం ఉద్యోగం చేస్తార”ని ఒక నెటిజన్ ప్రశ్నించారు.చదవండి: మనకు 2026.. వారికి 2018!హాంప్స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండంతస్తుల ఇళ్లు నెలకు 2 నుంచి 3 వేల ఫౌండ్ల (సుమారు 3 లక్షలు) కిరాయికి అందుబాటులో ఉన్నాయని కొంతమంది తెలిపారు. లండన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 4 నుంచి 5 వేల ఫౌండ్ల అద్దెకు దొరుకుతాయని కూడా వెల్లడించారు. తాను ఉంటున్నత్రిబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్కు నెలకు 3,200 ఫౌండ్లు చెల్లిస్తామని లండన్లోని కానరీ వార్ఫ్లో ప్రాంతంలో ఉంటున్న నెటిజన్ ఒకరు తెలిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ సెంట్రల్ లైన్కు కేవలం 10-15 నిమిషాల దూరంలో ఈ ఫ్లాట్ ఉందన్నారు. View this post on Instagram A post shared by Deepanshi Chaudhary (@its.deepanshi14) -
ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..
కుంభమేళ, మాఘమేళ వంటి మహోత్సవాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్నో ఆసక్తికర కథల కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి, విస్మయానికి గురిచేస్తాయి కూడా. గొప్ప గొప్ప మేధావులు, మహా సంపన్నులు ఇలాంటి కుంభమేళాల్లో సాధువులుగా కనిపించిన ఘటనలు కూడా చూశాం. మరొకరు ఏకంగా తలపై మొక్కలను పెంచడం, పావురాల బాబా వంటి ఎన్నో విచిత్రాలను చవిచూశాం. భక్తి, ఆధ్యాత్మికతల గొప్పదనం ఈ మహోత్సవాలు ఎలుగెత్తి చాటుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి వింత ఘటనలు. అలాంటి తరహాలోనే ఈ ఏడాది జరగుతున్న మాఘమేళాలో కనువిందు చేసింది. అదేంటంటే.. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం (గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద జరిగే ఒక మహత్తర ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మాఘమేళా. ఇది మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసి, దీక్షలు చేపట్టి, మోక్షం కోసం ప్రార్థనలు చేస్తారు. దీన్ని అచ్చం కుంభ మేళలాంటి చిన్నకుంభమేళాగా పేర్కొనచ్చు. ప్రతి ఏటా జనవరిలో మొదలవుతుంది. ఈ ఏడాది జనవరి 3న మొదలైన ఈ మాఘమేళాలో ఒక 26 ఏళ్ల సాధువు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు. ఎందుకుంటే అతడు గత ఏడేళ్లు అస్సలు కూర్చోలేదు, పడుకోలేదట. శంకర్పురిగా పిలిచే ఈ సన్యాసి బిహార్లోని సీతామర్హి జిల్లాకు చెందిన యువ సన్యాసి. ప్రస్తుతం జరుగుతున్న మాఘమేళాలో నిరంతరం ఒక కాలిపై నిలబడి కనిపించిడంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అయితే పడుకోవడం కోసం తన తలను ఒక చెక్కకు ఆన్చుకుని అలానే పడుకుంటారట ఆ సన్యాసి. తినడం నుంచి ఇతర రోజువారీ కార్యక్రమాలన్ని ఆ భంగిమలోనే చేస్తారట. ఆయన నైమిశారణ్యానికి చెందినవారట. అక్కడ సుమారు 88వేల మంది రుషులు ఉంటారనేది భక్తుల విశ్వాసం. అలాంటి పుణ్యభూమిలో తాను జన్మించానని, అక్కడే తనకు ఓ ఆశ్రమం కూడా ఉందని ఈ శకంర్పురి సన్యాసి చెబుతున్నారు. ఇలా ఒంటి కాలిపై ఎందుకంటే..ఆ నైమిశారణ్యంలో ఉన్నప్పుడే తనకు ఇలా ఒంటికాలినై నిలబడాలనే ఆలోచన వచ్చిందట. అప్పటి నుంచే ఈ భంగిమలో ఉన్నట్లు తెలిపారు ఆ సాధువు. ఆయన ఆరేళ్ల వయసులోనే సాధువుగా మారారట. ఎప్పుడైనా కూర్చొన్నారా అని అడిగితే..ఏడేళ్లుగా ఇలా నిలబడే ఉన్నాని చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఊయలలాంటి చెక్క నిర్మాణంపై తల ఆనించి నిద్రపోతానని, ఆహారం, నీరు నుంచి ప్రతీ పని ఈ భంగిమలోనే చేస్తానని చెప్పారు. కాగా, జనవరి 3న ప్రారంభమైన ఈ మాఘమేళ 44 రోజులపాటు సాగే మహత్తర ఉత్సవం. ఇది ఫిబ్రవరి 15న ముగుస్తుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి, మోక్షం కోసం పూజలు చేస్తుంటారు. (చదవండి: రెస్టారెంట్ మేనేజర్గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..) -
ఇంకా ఆ దేశం 2018లోనే ఉంది.. ఎందుకలా!
ప్రపంచ దేశాలన్నీ జనవరి ఒకటిన 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలికితే ఒక దేశం మాత్రం ఇంకా 2018 సంవత్సరంలోనే కొనసాగుతోంది! అదే ఆఫ్రికా దేశమైన ఇథియోపియా. ఒక దేశం ఇంకా భూతకాలంలోనే ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రపంచవ్యాప్తంగా గ్రెగేరియన్ కేలండర్ విస్తృతంగా వాడకంలో ఉండగా ఇథియోపియా మాత్రం శతాబ్దాల నాటి సౌర కేలండర్ ‘గీజ్’ను అనుసరిస్తుండటమే ఈ మిస్టరీకి కారణం.ప్రాచీన ఈజిప్టు కాప్టిక్ కేలండర్ ఆధారంగా ఇథియోపియా కేలండర్ (Ethiopia Calendar) అయిన గీజ్ రూపొందింది. గ్రెగేరియన్ కేలండర్తో పోలిస్తే గీజ్ కేలండర్ 7–8 ఏళ్లు వెనుకబడి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మ సంవత్సర లెక్కల్లో తేడాల వల్ల ఈ అంతరం ఏర్పడింది. గ్రెగేరియన్ కేలండర్ను యూరొప్ 1582లో వాడుకలోకి తెచ్చుకొనేటప్పుడు దియోనిసియస్ ఎక్సిగస్ అనే సాధువు ఏసుక్రీస్తు పుట్టుక గురించి వేసిన లెక్కలపై ఆధారపడింది. ఈ లెక్కల ప్రకారం అది తొలి సంవత్సరం అయింది. కానీ అదే సమయంలో ఇథియోపియా, ఈజిప్టులోని చర్చీలు మాత్రం అలెగ్జాండ్రియన్ క్రైస్తవ లెక్కలను అనుసరించాయి.వాటి ప్రకారం క్రీస్తు పుట్టుక కొన్నేళ్ల తర్వాత జరిగింది. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇథియోపియా ఇంకా 2018లోనే కొనసాగుతోంది. పైగా గీజ్ కేలండర్లో 12కు బదులు 13 నెలలు ఉంటాయి. 30 రోజుల చొప్పున 12 నెలలతోపాటు 13వ నెలలో ఐదు రోజులు (లీప్ ఇయర్లో ఆరు రోజులు) ఉంటాయి. పైగా ఇథియోపియా నూతన సంవత్సరం (New Year) మిగతా దేశాల్లోలాగా జనవరితో ప్రారంభం కాదు.. అది సెపె్టంబర్ నెలతో మొదలవుతుంది. ఈ లెక్కన మనకు 2025 సెప్టెంబర్ నాటికి ఇథియోపియా 2018 సెపె్టంబర్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నమాట. – సాక్షి, సెంట్రల్ డెస్క్చదవండి: బంగారం పేపర్లతో భగవద్గీత! -
ఏడేళ్ల వయసుకే.. ఏడు ఖండాలు..!
పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఈ చిన్నారి చిన్న వయసుకే అత్యంత అరుదైన ఘనత సృష్టించాడు. నిండా పట్టుమని పదేళ్లు కుడా లేవు. ఏకంగా ఏడు ఖండాలు చుట్టేశాడు అమెరికన్ బుడ్డోడు వైల్డర్ మెక్గ్రా. జస్ట్ ఏడేళ్లకే అంటార్కిటికాతో సహా ఏడు ఖండాలు చుట్టొచ్చి.. అరుదైన ఘనతను సాధించాడు. అంటే ఈ చిన్నారి ప్రయాణం శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమైందని తెలుస్తోంది. అతడి సాహసయాత్రలను తల్లిదండ్రులు జోర్డి లిప్పే మెక్గ్రా, రాస్ మెక్గ్రాలు నమోదు చేశారు. ఏడు ఖండాలను చుట్టొచ్చే చిన్నారిగా తమ కుమారుడిని పెంచలేదని చెబుతున్నారు అతడి తల్లిందండ్రులు. తమకు పర్యాటనలంటే మహాఇష్టమని, ఆ నేపథ్యంలోనే తాము నచ్చిన ప్రదేశాలకు పర్యటిస్తున్నామని ఆ కుటుంబం చెబుతోంది. ఇక తమ కుమారుడు వైల్డర్ జర్నీ ఎనిమిది వారాల వయసులో పోర్చుగల్ పర్యటనతో ప్రారంభమైందని, తర్వాత అతడి రెండో పుట్టినరోజు ముందు కరేబియన్, కెనడా, మెక్కికోలను సదర్శించినట్లు వెల్లడించాడు తండ్రి రాస్. అతను పెద్దయ్యాక యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు వెళ్లడం జరిగిందని అన్నాడు. అయితే తాము దక్షిణ అమెరికా పర్యటనకు ముందు తమ బిడ్డ ఐదు ఖండాలు సందర్శించాడని గుర్తించాం అని చెప్పుకొచ్చాడు తండ్రి రాస్. దాంతో అప్పుడే తమకు వైల్డర్ ఈ ఖండాల జాబితాను పూర్తి చేస్తే ఎలా ఉంటుది అనే ఊహ వచ్చిందని, అందుకు అనుగుణంగా ట్రిప్లు ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు పేరెంట్స్. అలా ఈ కుటుంబం సాహసయాత్ర కాస్తా అంటార్కిటిక్ ఖండానికి చేరుకుంది. ఆ విధంగా తమ బిడ్డ వైల్డర్ ఈ ఖండంలో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కులలో ఒకడిగా నిలిచాడని ఆనందంగా చెబుతున్నారు. అంతేగాదు ఈ అంటార్కిటక్ పర్యటనలో తన భార్య జోర్డికి అత్యంత ప్రత్యేకం అంటున్నాడు వైల్డర్ తండ్రి రాస్. ఎందుకంటే ఆమె ఈ అంటార్కిటికా ఖండంలో గర్భవతిగా(వైల్డర్ కడుపులో ఉండగా) అడుగు పెట్టిందట. అంటే జోర్డీ డెలివరీ అయ్యాక తన బిడ్డతో కలిసి మరోసారి అంటార్కిటికాకు వచ్చారామె. కాగా, ఆ కుటుంబం ఈ పర్యటనలు కేవలం గమ్యస్థానాలు లేదా రికార్డుల కోసం మాత్రం కాదని, ఆయా విభిన్న సంస్కృతులను అనుభవించడం, మరుపురాని జ్ఞాపకాలను పొందుపర్చుకోవడం అని చెబుతుండటం విశేషం. ఈ టూర్ల వల్ల వైల్డర్కి సహనంగా ఉండటం అలవడిందని చెబుతున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ ఫ్యామిలీ విజయవంతంగా ఏడు ఖండాలు చుట్టేసినా..ఇక్కడ నుంచి ప్రశాంతమైన ప్రయాణాలపై దృష్టి సారించనున్నాం అని చెబుతుండటం విశేషం. ఇక ఇప్పుడే వెళ్లే టూర్లన్ని తమ బిడ్డకు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని వెళ్లేలా జర్నీ ప్లాన్ చేయనున్నాం అని నవ్వుతూ చెబుతున్నారు వైల్డర్ తల్లిదండ్రులు.(చదవండి: భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!) -
భార్య కేన్సర్ చికిత్సకు నిధులుగా..50 టన్నుల చిలగడ దుంపలు!
సాయం అంటే ఏదో మనకు తోచింది, చేతనైనది చేస్తాం. కానీ ఈ వ్యక్తి ఎంత గొప్పగా సాయం చేశాడంటే..ఆ సాయ ఫలితం తానొక్కడే అనుభవించకూడదు అనుకున్నాడో ఏమో..! గానీ అదర్నీ భాగమయ్యేలా చేసి గొప్ప సందేశం అందించాడు. అందరం తల ఓ చేయి వేస్తే ఎంత కష్టమైన పరార్ అనే గొప్ప విషయాన్ని గొంతెత్తి చెప్పినట్లుగా ఉంది నిశబ్దంగా చేసిన అతడి సహాయం. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఇది చైనాలో చోటు చేసుకుంది. చైనాకు చెందిన జియా చాంగ్లాంగ్ అనే 35 ఏళ్ల వ్యక్తికి అందిన ఉదార సహాయం అందర్నీ ఆలోచింపచేసేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ ఘటన అందరి హృదయాలను తాకింది. జియా భార్య లీకి జూలైలో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రారంభ చికిత్స తదనంతరం ఇంట్లోనే ఆమె కోలుకుంటోంది. జియా ఇప్పటికే ఆమె చికిత్స కోసం దగ్గర దగ్గర రూ. 45 లక్షలు పైనే ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆమెకు బోన్మ్యారో(ఎముక మజ్జ మార్పిడి) చేయాల్సి ఉంది. అయితే ఇందుకు సుమారు రూ. 51 లక్షలు పైనే ఖర్చు అవుతుందట. ఈ దంపతులిద్దరు సెకండరీ స్కూల్లో సహా విద్యారులు. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వాళ్లు చైనాలోని పాన్డాంగ్ ప్రావిన్స్లోని యాంటాయ్లో నివశిస్తున్నారు. వారికి ఎనమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడుని తామిద్దరం కలిసి అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడుతున్నారు. అందుకు విధి సహకరిస్తుందో లేదో అనే బెంగతో ఉన్నారా ఆ దంపతులు. తమకు వచ్చిన ఈ గండం గట్టేక్కేందుకు చేయవల్సిన ప్రయత్నాలన్ని చేశారు. తమ బంధువుల, స్నేహితులు, పొదుపు ద్వారా పోగు చేసిన సొమ్ము అంతా ఖర్చు అయిపోయింది. దాంతో చేసేది లేక తన భార్య ట్రీట్మెంట్ ఖర్చుల కోసం నిధులు సేకరించే పనిలో పడ్డాడు జియా. తన వద్ద ఉన్న ఒక్క కంప్యూటర్ని కూడా అమ్మేశాడు. ఇక అమ్మేందుకు ఏమి మిగలేదు జియా వద్ద. దాంతో ఇలా నిధులు ఆఫ్లైన్లో, సోషల్ మీడియా వేదికగా తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఇంతలో అనూహ్యంగా ఓ మిరాకిల్ జరిగింది. ఫాంగ్ అనే ఇంటిపేరు గల ఒక అజ్ఞాత దాత మెసేజింగ్ యాప్ ద్వారా జియాను సంప్రదించి, చిలగడదుంపలను అందివ్వడంతో అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అజ్ఞాత దాత జియాకి సుమారు 50 టన్నుల చిలగడ దుంపలు అందించి తన వంతు చేస్తున్న సాయం అని పోస్ట్ పెట్టాడు. నిజానికి ఫాంగ్ అని ఇంటిపేరున్న వ్యక్తి స్వయంగా చిలగడ దుంపలు పండిస్తాడట. అయితే జియా తన భార్య పట్ల ఎంతో భాధ్యతగా వ్యవహరించిన తీరు అతడిని కదిలించిందట. అందుకే ఇలా సాయం చేస్తున్నట్లు పోస్ట్లో పేర్కొన్నాడు. ఇప్పుడ జియా ఆ చిలగడదుపంలను 'కృతజతా ఛారిటీ అమ్మకం' అనే లేబుల్ పెట్టి అమ్ముతుండటం విశేషం. దాని ద్వారా వచ్చిన సొమ్మును తన భార్య వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తున్నాడు. ఆ అజ్ఞాత వ్యక్తి సాయం అనే పదానికి అద్భుతమైన అర్థం ఇచ్చాడు. అతను కాయకష్టం చేసుకునే రైతుల నుంచి చిలగడదుపంలు కొని జియాకు అందజేశాడు. అటు రైతులకు ఫలం అందింది. అలాగే జియా కూడా సులభంగా డబ్బు పొందితే విలువ తెలుసుకోలేడనే ఉద్దేశ్యంతో ఆ ఆజ్ఞాత వ్యక్తి ఇలా డబ్బుని కాకుండా ఆ చిలగడదుంపలనే అందించాడు. అంటే శ్రమతో కష్టపడి అమ్మి విరాళం పొందేలా చేసి..ఈ సాయంలో సాధారణ ప్రజలు కూడా భాగమయ్యేలా చేశాడు. అంతేగాదు కష్టకాలంలోని ఉన్న వ్యక్తికి ఎలాంటి అండదండ ఇవ్వొచ్చో అందరికి అవగతమయ్యేలా చేశాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తిని అంతా హ్యాట్సాప్ బ్రో అని నెటిజనులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పైగా ఇది అలాంటి ఇలాంటి సహాయం కాదు..మాటల్లేవ్ అంతే అని కీర్తిస్తున్నారు కూడా.(చదవండి: మురికి వాడలో పెరిగిన ఆ అబ్బాయ్ ..ఎన్నో జీవితాలను అద్భుతంగా మార్చాడు!) -
వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!
ప్రస్తుతం ఉన్న కాలుష్యం, ఉరుకుల పరుగుల జీవన విధానం వంటి కారణాలతో చాలామంది జుట్టు రాలు సమస్యను ఫేస్ చేస్తున్నారు. దానికి తోడు సరైన జీవనశైలి కూడా లేకపోవడంతో ఈ సమస్య ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే కదా..! మళ్లా ఇదంతా ఎందుకనుకుంటున్నారా..?. ఏం లేదండి ఏకంగా జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమే ఉంది ఆ దేశంలో. కురులు మంచి ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే ఆ ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శిస్తే చాలట. అంతేకాదండోయ్ ఏటా వేలాది మంది ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి తరలి వస్తుంటారట.వినడానికి ఇది..ఇదేం విచిత్రం రా బాబు అనిపిస్తోంది కదూ..!. ఎక్కడైన జుట్లు రాలకుండా లేదా ఆరోగ్యం కోసం ఆలయం ఉంటుందా?..నమ్మశక్యంగా అనిపించడం లేదు కదా..!. అయితే వెంటనే జపాన్లోని క్యోటోలో ఉన్న మికామి పుణ్యక్షేత్రానికి వచ్చేయండి. ఇది జుట్టు కోసం అంకితం చేయబడిన ఆలయమట. జుట్టు పెరుగుదల, ఆరోగ్యం, జుట్టు రాలడం వంటి ఆందోళనలు నివారించుకోవాలనుకుంటే తక్షణమే ఈ ఆయానికి వెళ్లి ప్రార్థిస్తే చాలట. అంతేకాదు కొత్త హెయిర్ స్టైలిస్టులుగా బ్యూటీషియన్ రంగంలోకి అడుపెట్టే విద్యార్థులు సైతం ముందుగా ఈ ఆలయానికి వచ్చి ప్రార్థించాక..తమ కోర్సుని నేర్చుకుంటారట. అంతేకాదండోయ్ ఇక్కడ ప్రార్థన అత్యంత విచిత్రంగా ఉంటుంది. అక్కడ మసాయుకి ఫుజివారా అనే దేవుడు కొలువై ఉంటాడు. ముందుగా ఆ ఆలయానికి చేరుకునే మునుపే ఒక ప్రార్థన కవర్ని కొనుగోలు చేయాలట. అక్కడ ఆలయ పూజారులు మన జుట్టులో కొంత జుట్టుని కత్తిరించి ఆ కవర్లో వేస్తారట. ఆ తర్వాత మనం దాన్నితీసుకుని ఆ ఆలయంలో ఉన్న మసాయుకి ఫుజివారా దేవుడి వద్ద పెట్టి ప్రార్థించి అక్కడ ఉండే పూజారికి ఇవ్వాలట ఆ కవర్ని. అలా చేస్తే వారి జీవితంలో జుట్టుకి సంబంధించిన సమస్యలు రావు, పైగా ఒత్తుగా పెరుగుతుందనేది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అంతేకాదండోయ్ ఆ ఆలయం వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది. అదేంటంటే..ఓ క్షరకుడి నైపుణ్యానికి ప్రతీక..మికామి మందిరం జపాన్లోని మొట్టమొదటి కౌరశాల అట. ఫుటివారా ఉనెమెనోసుకే మసాయుకి అనే క్షరకుడు తన వృత్తిని దైవంగా భావించి పనిచేసేవాడట. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంతో అద్భుతంగా జుట్టుని కత్తిరించడం, స్టైలింగ్ చేయడం వంటివి చేశాడట. అలా తన జీవితం మొత్తం ఆ వృత్తికి అంకితం చేసి..మంచి పునాది వేశాడట. అంతలా ఆ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించందుకు గుర్తుగా అత్యున్నతంగా గౌరవించాలని అక్కడి ప్రజలు నిర్ణయించి.. ఇలా ఒక ఆలయాన్ని నిర్మించి పూజించుకుంటున్నారట. అంతేగాదు అతడి గౌరవార్థం చనిపోయిన 17వ తేదీన ప్రతినెల జపాన్ అంతటా క్షరకులు సెలూన్ల నిర్వాహకులు నివాళులర్పిస్తూ..దుకాణాలు కూడా మూసివేస్తారట. అలాగే ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఆ మసాయుకి దేవుడిని ప్రార్థించాక.. జుట్టుకి సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టడంతో..ఈ దేవాలయానికి మరింత పేరుప్రఖ్యాతలు వచ్చి.. జుట్టు ఆరోగ్యానికి సంబంధించిన ఆలయంగా స్థిరపడిందట. అంతేగాదు ఇక్కడకు పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుందట. View this post on Instagram A post shared by Shervin Abdolhamidi (@shervin_travels) (చదవండి: బ్రయాన్ జాన్సన్లా భారత్ యువకుడు..! ఏకంగా ఏడువేల..) -
యుద్ధం అనాథను చేస్తే..సేవతో అందరి మనసులను దోచుకుంది..!
యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్ చిన్నారి కథ..!.ఆమె లియోనింగ్ ప్రావిన్స్లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను. అలా ఆమె జు జెన్స్ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి. అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె. 1980లో తన బిడ్డతో షెన్యాంగ్కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది. అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్క్రాస్ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్ ఆ పని అస్సలు చేయలేదు. నిజానికి ఆ సమయంలో జపనీస్ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.(చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! మన హైదరాబాద్కి జస్ట్..) -
నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..
ఏ డైట్ అయినా హెల్దీగా ఉండేందుకు బరువు తగ్గడం కోసం లేదా అదుపులో ఉంచుకునేందుకు. చెప్పాలంటే స్లిమ్గా..చూడచక్కని ఆకర్ణణీయమైన లుక్ కోసం అంతలా డైట్పై ఫోకస్ పెడుతుంటారు. అయితే మన హాలీవుడ్ ఐకాన్, మాజీ బాడీబిల్డింగ్ ఛాంపియన్ మాత్రం కొత్త ఏడాదిలో సరికొత్త క్రాష్ డైట్ని ఫాలో అవుతున్నాననంటూ తన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. అయితే ఇదేమి త్వరితగతిన బరువు తగ్గి..స్లిమ్గా మారే డైట్ మాత్రం కాదట. ఎందుకోసమో వింటే షాక్ అవుతారు. అందుకోసం ఇలాంటి డైట్లు కూడా ఉంటాయా? అని విస్తుపోవడం మాత్రం ఖాయం.78 ఏళ్ల హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆస్ట్రియన్-అమెరికన్ చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ బాడీబిల్డర్. అంతేకాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్ రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) రాజకీయ నాయకుడు. ఆయన 2003, 2011ల మధ్య కాలిఫోర్నియాకు 38వ గవర్నర్గా కూడా పనిచేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్ మ్యాగ్జైన్లో చోటు సైతం దక్కించుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన క్రాష్ డైట్ ప్రారంభిస్తానంటూ చేసిన పోస్ట్ అదర్ని విస్తుపోయేలా చేయడమే కాకుండా అమితంగా ఆకర్షించింది. అసలేంటి ఈ డైట్ అంటే..ఆర్నాల్డ్ ప్రకారం క్రాష్డైట్ బరువు తగ్గడం కోసం కాదట..ప్రతికూలతలను తొలగించే లక్ష్యంతో మానసిక రీసెట్ కోసం అనుసరించే డైట్ అని పోస్ట్లో పేర్కొన్నారు. సాధారణంగా క్రాష్ డైట్ అనగానే..త్వరితిగతిన మార్పులు, ఫలితాన్ని అందుకునేవి అనే అందరూ భావిస్తారు. కానీ ఇది అందుకు విరుద్ధం. అయితే తాను చెప్పే డైట్ బాడీ కోసం కాదని, మెదడు కోసమని చెప్పుకొచ్చారు. ఈ డైట్ ప్రకారం..ఒక వారం పాటు ప్రతికూలత ఆలోచనలు, విషపూరితమైన ఆలోచనలు, ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి వంటి ఏమి లేకుండా వ్యవహరించడం. ఇది ఒక్కసారి ప్రయత్నిస్తే..మానసిక శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుందని అన్నారు. నిజానికి ప్రతికూలత అనేది భావోద్వేగపరంగా శరీరానికి చాలా హానికరమని నొక్కి చెప్పారు. నెగిటివిటీ అనేది మనల్ని అక్షరాల చంపేస్తుందని హెచ్చరించారు.నటుడు ఆర్నా ల్డ్సందేశం ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసినా..ప్రేరణగా నిలిచింది. అంతేగాదు డైట్లు అనేవి కేవలం శారీరక అనుకూలత కోసమే కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఏర్పరచుకోవచ్చు అని సరికొత్త ఆలోచనకు నాంది పలికారు ఆర్నాల్డ్. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానసిక-శారీరక శ్రేయస్సు కోసం ఇలాంటి "జీరో నెగటివిటీ డైట్" తప్పక తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంతేగాదు ఆశావాదులే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైందని గుర్తు చేశారు. అందువల్ల మనం నిరాశవాదం, విమర్శలు, కోపాన్ని త్యజిద్దాం అని ప్రజలను కోరారు. అందుకోసం మన రోజులో ఇవి లేకుండా ఉండే క్రాష్ డైట్ని జీవితంలో భాగం చేసుకుందామని అన్నారు. ఈ డైట్లో ఏం చేయాలంటే..ప్రతి రోజు మూడు పూటలా కనీసం ఓ పదినిమిషాలు సోషల్ మీడియాను చూడకుండా ఉండటం. ఉద్యోగ దరఖాస్తులుపై మనసు లగ్నం చేయడం లేదా చేయవలసిన ముఖ్యమైన పనులపై ఫోకస్ పెట్టడంరోజు మనకు ఎదురయ్యే సవాళ్లకు కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే అవి మనలోని అంతర్గత శక్తిని బహిర్గతం చేస్తాయి. చివరగా ఆర్నాల్డ్ ప్రతికూలతలను తగ్గించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధిరించడానికే కాదు..జీవితాన్ని మారుస్తుంది, కాపాడుతుంది కూడా. (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా) -
సాగరంలో సాహస నృత్యం
పుదుచ్చేరికి చెందిన పదకొండు సంవత్సరాల తారుగై ఆరాధన ‘అండర్ వాటర్’ భరతనాట్యంతో ఆహా అనిపించడమే కాదు, ప్లాస్లిక్ పొల్యూషన్ గురించి ప్రచారం నిర్వహిస్తోంది.శిక్షణ ΄పొందిన భరతనాట్య నృత్యకారిణి అయిన ఈ చిన్నారి సర్టిఫైడ్ డైవర్ కూడా. సముద్రజీవులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన కలిగించడానికి నీటిలో 20 అడుగుల లోతున డైవింగ్, భరతనాట్యం చేసింది ఆరాధన. పూర్తిగా సాంప్రదాయ దుస్తులు, అలంకరణతో ఆరాధన చేసిన నృత్యం ఆహా అనిపించింది. శుభ భరద్వాజ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ అండర్ వాటర్ భరతనాట్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నృత్యాన్ని సముద్రాన్ని కాపాడుకునే మిషన్గా మార్చింది ఆరాధన’ అని ప్రశంసించింది శుభ. ‘చిన్న వయసులో ఆరాధన చేసిన సాహస నృత్యం అభినందనీయం’ అన్నారు నెటిజనులు. -
ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!
వన్స్ అపాన్ ఏ టైమ్... లవ్ స్టోరీలు కావచ్చు... జస్ట్ నిన్న మొన్నటి లవ్స్టోరీ కావచ్చు... లవ్స్టోరీలు ఎప్పుడూ హాట్ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్కు చెందిన ఇంజినీర్ రాహుల్ కుమార్ లవ్స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన రాహుల్ జపాన్లోని ఆటోమొబైల్ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. టోక్యోలో జరిగిన అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో జపనీయురాలైన మెరీనాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారింది.‘నా జీవితంలోని కీలకమైన మలుపు టోక్యోలో జరిగిన వ్యాపార సమావేశంలో మొదలవుతుందని ఊహించలేదు. మేము మొదట స్నేహితులం. స్నేహం నమ్మకంగా పరిణామం చెందింది, ఆ నమ్మకం ప్రేమగా వికసించింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చినప్పటికీ ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవడంప్రారంభించాం’ అని రాశాడు రాహుల్.మొదట్లో వీరి పెళ్లికి ఇరుపక్షాల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ ఆ తరువాత పచ్చజెండా ఊపారు. పెళ్లి వేడుకలు దిల్లీలో, రిసెప్షెన్ దిల్లీలో జరిగింది. ఆ తరువాత వీరు బిహార్లోని మాదేపుర గ్రామానికి వెళ్లారు. అది రాహుల్ కుమార్ స్వగ్రామం. ‘నమస్తే ఇండియా. ఐయామ్ మెరీనా యాదవ్’ అని తనను తాను పరిచయం చేసుకున్న మెరీనా తమ లవ్ స్టోరీ (Love Story) ఎలా ప్రారంభమైందో వివరించింది. మొత్తానికైతే వీరి వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.చదవండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేకపోయాం View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian) -
ఆ గ్రామంలో న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుగుతాయంటే..!
కొద్దిసేపటిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో నగరాలు, పట్టణాలు ఏ రేంజ్లో సందడిగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎటు చూసిన ఆధునిక హంగులతో, డీజే మోతలతో అదరహో అనిపించే రేంజ్లో దద్దరిల్లిపోతాయి. అయితే ఈ గ్రామంలోని న్యూ ఇయర్ వేడుకలు నాటి కాలంలోకి, మరుపురాని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయేలా అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ కాలంలో ఇలా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం అస్సలు చూసుండరు. ముఖ్యంగా పర్యాటకులను సైతం ఆకర్షించేలా న్యూ ఇయర్ వేడుకలుకు అత్యంత ముగ్ధమనోహరంగా సిద్ధమైంది ఆ గ్రామం.ఆ గ్రామమే మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా దేవ్గఢ్ గ్రామం ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మధ్యప్రదేశ్ పర్యాటక బోర్డు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇలా విన్నూతన మార్గంలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అక్కడ మూడురోజులు పాటు న్యూ ఇయర్ వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయిఆ మూడు రోజుల కార్యక్రమాల్లో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా సంప్రదాయ భారతీయ ఆటలు, విందు వినోదాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నాటి అనుభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఎలా జరుగుతాయంటే..సందర్శకులు గాలిపటం ఎగరవేయడం, స్కిప్పింగ్(తాడాట), కర్రబిళ్ల, పిట్టు, గోళీలు, లట్టు, ఎద్దుల బండి సవారీలు, వంటి నాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చేలా సాంస్కృతిక కార్యకలాపాలతో అలరించనుంది. అక్కడ సుందరమైన పరిసరాల మధ్య ఈ ఏర్పాట్లు చేశారు పర్యాటక నిర్వాహకులు. ముఖ్యంగా నారింజ తోటలలో టీ ఆస్వాదిస్తూ..ఈ ఆటపాటల్లో ఆడిపాడి సందడి చేయొచ్చు. అయితే ఈ ఆటల్లో పాల్గొనడం, ఎంజాయ్ చేయడం అన్ని ఉచితమేనట. ఇది కేవలం సందర్శకులకు గ్రామీణ జీవితాన్ని పరిచయం చేస్తూ..అందులో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఈ న్యూ ఇయర్ని వేడుకలను ఇలా అసాధారణమైన రీతిలో జరుపుతోంది అక్కడి ప్రభుత్వం. దీన్ని అక్కడి పర్యాటక బోర్డు, జిల్లా పురావస్తు పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్థానిక క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026ని స్వాగతించడానికి అసాధారణమైన సాంస్కృతిక మార్గాన్ని ఎంచుకుని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనుంది.చరిత్రకు, ప్రకృతికి నెలవైన గ్రామందేవ్గఢ్ ఒకప్పుడు 18వ శతాబ్దంలో గోండ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన దేవాలయాలు, కోటలు, సుందరమైన బెత్వా నది ఉన్నాయ. ఇవి చారిత్రక సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. పర్యాటకులకు సాంప్రదాయ ఆతిథ్యంతో స్వాగతం పలుకుతూ..దీనిని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విహార కేంద్రంగా మార్చే యోచనలో ఉండి అయక్కడ యంత్రాంగం. (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..) -
గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్కి..
ఈరోజుతో 2025కి గుడ్ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్ 31 రాత్రి ఉండే సందడి, జోష్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. దీనికి మించి బ్యూటిఫుల్ స్పాట్ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్ నేషనల్ పార్క్ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ప్లేష్. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్ఫుల్గా ఉంటుంది. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్ స్పాట్గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో సవాయి మాధోపూర్కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం. ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్ వేడుకలు మరింత స్పెషల్ ప్రియాంక గాంధీ కుటుంబానికి. ప్రత్యేకతలు..పెద్దపులులకు నిలయం ఈ పార్క్. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి. అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్ కండిషనింగ్, వైఫై, వాలెట్ సేవలు, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది. కాగా న్యూఇయర్ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్ ఉద్యానవనంని రాహుల్ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.(చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్గా ఏకంగా రూ. 40 కోట్ల..!) -
ఎకో ఫ్రెండ్లీ వాటర్ ఏటీఎం..! బాధ్యతయుతమైన పర్యాటకానికి కేరాఫ్గా..
తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఊటీ. దీనిని "భారతదేశపు స్విట్జర్లాండ్" అని కూడా పిలుస్తారు, ఇది వేసవికాలంలో గొప్ప విడిది స్థలం. ఊటీ ఎల్లప్పుడూ హృదయానికి హాయిగా అనిపించే హిల్స్టేషన్లలో ఒకటి. ఈ ముగ్ధ మనోహరమైన పట్టణాన్ని చూసేందుకు పలు కుటుంబాలు, జంటలు, ఒంటరి పర్యాటకులు, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారు ఇక్కడి ఎత్తైన కొండలను అన్వేషించేందకు వాలిపోతుంటారు. ఓ పక్క అందమైన మేఘాల కదలికలు..మరోవైపు వేడి టీ ఆస్వాదిస్తూ..పైన్ అడువుల గుండా నిశబ్దంగా వెళ్తుంటే..మిమ్మల్ని వేగాన్ని తగ్గించి ప్రతి క్షణం ఆస్వాదించేలా అనుభూతి చెందేలా చేస్తుంది అక్కడి ప్రకృతి కమనీయ దృశ్యాలు. ప్రస్తుతం ఇది అందానికే కాదు, బాధ్యతాయుతమైన పర్యాటకాలో మేటి అనిపించికుంటోంది ఊటీ. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజుల క్రితం ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ బార్గవి సిలాపర్శెట్టి ఊటీ ట్రిప్కి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేసింది. అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించడంతో చాలామంది ప్రయణికులు ఆ మిషన్ల వద్ద వాటర్ని నింపుకుని తెచ్చుకోవడం ఆసక్తిని రేకెత్తించడంతో ఆ విషయాన్ని బార్గవి ఇలా వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా సందర్శకులు హైడ్రేటెడ్గా ఉండటానికి సహాయపడే నీటి ATMలను పట్టణంలో ఏర్పాటు చేశారు. అక్కడ భార్గవి నీటి ఏటీఎం కియోస్క్కు చేరుకుని అక్కడ లోపల ఉన్న ఒక మహిళకు ఆ బాటిల్ని అందజేయగానే ఆమె వేడి నీటిని నింపి తిరిగి భార్గవికి అందజేస్తుంది. ధర ఎంత అనడగగానే కేవలం రూ. 10 అని చెబుతుండటం కనిపిస్తుంది వీడియోలో. ఈ వీడియోని చూసిన నెటిజన్లంతా ప్రతి పర్యాటక ప్రదేశంలోనూ దీన్ని అమలు చేయాలని కొందరూ, దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక పద్ధతి ఉండాలని మరికొందరూ ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ ఊటీలో చూడదగ్గ కమనీయ ప్రదేశాలేంటంటే..1. ఊటీ సరస్సుపట్టణంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ బోటింగ్కు వెళ్లవచ్చు, సరస్సు చుట్టూ విశ్రాంతిగా నడవవచ్చు లేదా కూర్చుని దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ఉల్లాసంగా ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉంటుంది.2. నీలగిరి పర్వత రైల్వేఇక్కడ టాయ్ ట్రైన్ ప్రయాణం తప్పనిసరిగా చేయాలి. ఇది సొరంగాలు, అడవులు, టీ తోటల గుండా నెమ్మదిగా కదులుతుంది. అక్కడ ప్రకృతి దృశ్యాలను ఫోటోలు తీస్తూ మునగిపోతాం. 3. టీ తోటలు, టీ ఫ్యాక్టరీఊటీలోని టీ ఎస్టేట్లు అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. పచ్చని పొలాల గుండా నడిచి టీ ఎలా తయారు చేస్తారో చూడటానికి టీ ఫ్యాక్టరీని సందర్శించొచ్చు. అక్కడ తప్పనిసరిగా తాజా టీ కొనడం మర్చిపోవద్దు.4. బొటానికల్ గార్డెన్ఇక్కడ రంగురంగుల పూలతో నిండిన ఈ తోట గుండా ప్రశాంతంగా నడవడం అద్భుతంగా ఉంటుంది. ఇది ఉదయం లేదా మధ్యాహ్నం చాలా అందంగా ఉంటుంది.5. దొడ్డబెట్ట శిఖరంఊటీలోని ఎత్తైన ప్రదేశం నీలగిరి విస్తృత దృశ్యాలను అందిస్తుంది. పర్యావరణ అనుకూలలమైన రోజున ఈ కొండను ఎక్కేందుకు అద్భుత క్షణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఊటీ ప్రయాణం అందంతోపాటు బాధ్యతయుతమైన పర్యాటకంగా అందరి మనసులను దోచుకుంటోంది. View this post on Instagram A post shared by Bhargavi Silaparsetty (@bhargavi_silparsetty) (చదవండి: 'అరటికాండంతో పప్పు' రెసిపీ ..ఆరోగ్యానికి ఎంతో మేలు..!) -
పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్
కొన్ని చిన్న చిన్న పనులు..చాలా ఎఫెక్ట్వ్గా ఉంటాయి. చాలా చాలా సాధాసీదా పనులే అయినా వాటి ప్రభావం మాములుగా ఉండదు. మనకు మన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మంచి మంచి విందులు ఇప్పిస్తారు. అదులో పెద్ద విషయం ఏం లేదు. కానీ మనం సంపాదించే రేంజ్కి వచ్చినప్పుడు కూడా వారి చేత ట్రీట్ ఇప్పించుకునే తింటే ఆ ఆనందమే వేరు. అది మన తల్లిదండ్రలకు గొప్ప అనుభూతి కూడా. అదెలాగో అందుకు సంబంధించిన వీడియోని జత చేస్తూ పోస్ట్లో వివరించారు చాయ్ సుట్టా బార్ సహ-వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే . ఆయన తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం గురించి చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకుంది. ఆ వీడియోలో వ్యాపారవేత్త దూబే తన తల్లిదండ్రులను ఒక కేఫ్లో డేట్ కోసం తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. అంతేగాదు మీరు కూడా ఇలా పేరెంట్స్ని ట్రీట్ కోసం వెళ్దామని ప్రోత్సహించడంని పిలుపునిస్తూ..అక్కడ జరిగిన దృశ్యాన్ని ఇలా పంచుకున్నారు. తన కోసం కూడా తన తండ్రినే ఆర్డర్ చేయమని ఆ వ్యాపారవేత్త అడిగారు. ఆయన తమ ముగ్గురు కోసం భోజనం ఆర్డర్ చేసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ తర్వాత చివరిలో బిల్లు కూడా తండ్రి చేత పే చేయించాడు ఆ వ్యాపారవేత్త. ఆ తర్వాత చివరగా నాన్న కొంచెం ఛేంజ్ ఉంటే ఇవ్వరూ అని అడిగి మరి తీసుకున్నాడు. ఆయన కూడా చాలా ఆనందంగా ఇచ్చారు. ఇలా ఎందుకు చేశానో వివరిస్తూ..ఇలా చెప్పుకొచ్చారు. "మనం పేరంట్స్చేత బిల్లు కట్టించి ఫ్రీగా ట్రీట్లు తీసుకోమని కాదు నా ఉద్దేశ్యం. మనం మంచి ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించే రేంజ్లో ఉన్నా..వారి చేతనే డబ్బులు కట్టించి వారికి నచ్చిన ఐటెం ఆర్డర్ చేయిపించి తింటే మనం ఎప్పటికీ వారిపై ఆధారపడి ఉన్నామని, మనం ఎప్పటికీ వారి పిల్లలమే అనే భావన కలుగుతుంది. అదే సమయంలో వారికి తాము వృద్ధులం అనే భావన కలగదు. మన పిల్లలు చిన్న వాళ్లు వాళ్ల కోసం మనం దృఢంగా ఉండాలనే భావన, ఆశ కలుగుతుంది. మన పిల్లలు ఎప్పటికీ పిల్లలే, చిన్నవాళ్లు మనపై ఆధారపడుతున్నవాళ్లు అన్న ఫీలింగ్ వారికి గొప్ప అనుభూతిని, జీవితంపై గొప్ప ఆశను రేకెత్తిస్తుందంటూ". పోస్ట్లో రాసుకొచ్చారు అనుభవ్ దూబే. ఇది చాలామంది మనసుని తాకడమే కాదు..ఇలాంటి చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకు మంచి అనుభూతిని కలిగించడంలో సహయపడటమే గాక, పిల్లలతో వారి బంధాన్ని మరింత బలపరుస్తాయని అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anubhav Dubey (@anubhavdubey1) (చదవండి: పక్షవాతం బారినపడిన వ్యక్తి అసామాన్య ప్రతిభ..! జస్ట్ ఒక్క చేతి వేలు, కాలి బొటనవేలితో..) -
ఎవడ్రా వీడు..మరి ఇంత టాలెంటెడా..?! .
శరీరంలో ఏ అయవం కదలదు అంటే..ఎవ్వరైనా చతికిలపడిపోతారు. జీవితమే లేదు అన్నంతగా బాధపడిపోతారు. కానీ అతడి శరీరంలో ఏ చిన్న అవయవం కదిలిన చాలు..అద్భుతం చేయొచ్చు అనుకున్నాడు. ఆ దృఢ సంకల్పమే జస్ట్ ఒకేఒక చేతి వేలు, కాలి బొటనవేలుతో అద్భుతమే సృష్టించి తన కుటుంబానికి ఆసరాగానే కాదు..టెక్నాలజీ తెలియని అమ్మను అన్ని నేర్చుకునేలా చేసి ముందుండి నడుపించిన గొప్ప కొడుకు అతడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు సంపదతో పనిలేదు అని చెప్పే ప్రేరణాత్మక స్టోరీ..!.36 ఏళ్ల లి జియా, నైరుతి చైనాలోని చాంగ్కింగ్కు చెందిన వ్యక్తి. అతను కేవలం ఐదేళ్ల ప్రాయంలో కండరాల బలహీనత ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అనారోగ్యం కారణంగా ఐదోతరగతితోటే పాఠశాల చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చింది. అయితే చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా..చదవడం, రాయడం మాత్రం లీ కొనసాగించడం విశేషం. స్వీయంగా చదువుకోవడం ప్రారంభించాడు. అతనికి కంప్యూటర్ సైన్స్, భౌతిక శాస్త్రం అంటే మహా ఇష్టం. కంప్యూటర్ని తనకు పరిచయం చేసిన వ్యక్తి అతడి చెల్లెలు. పాఠశాల నుంచి తెచ్చే పుస్తకం ద్వారా కంప్యూటర్పై మక్కువ ఏర్పడటం మొదలైంది. పుస్తకంలో ప్రతి అధ్యయం అతడికి ఆకర్షణీయంగా కనిపించేది. ప్రతి కొత్త విద్యాసంవత్సరంలో ఏ కొత్త కంప్యూటర్ పుస్తకం విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసేవాడు. అంత ఇష్టం కంప్యూటర్ అంటే. వాటిని పదేపదే క్షణ్ణంగా చదివేవాడు. ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ల సాయంతో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకపక్క లీ పరిస్థితి దారుణంగా దిగజరిపోవడం ప్రారంభించింది. నడిచే సామర్థ్యాన్నికోల్పోయాడు. ఆ తర్వాత తినడం, శ్వాస తీసుకోవడం వంటివన్నీ సమస్యాత్మికంగా మారిపోయాయి. కేవలం ఒక చేతి వేలు, కాలి బొటనవేలు మాత్రమే కదిలించగలిగేవాడు. అంతేగాదు 2020లో కోమాలోకి వెళ్లిపోయాడు కూడా. వైద్యులు ట్రాకియోటమీ చేసి, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు కూడా. ఆ సమయంలో అతడి జీవితం అత్యంత కటిక చీకటి అలుముకున్న క్లిష్టతరమైన సమయంగా పేర్కొనవచ్చు. అయితే 2021 ప్రారంభంలో లీ నేలలేని స్మార్ట్ వ్యవసాయం గురిచి తెలుసుకున్నాడు. అది అతడికి కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇంచ్చింది. ఆధునిక వ్యవసాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని అనుసంధానించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని స్ట్రాంగ్ఆ నిర్ణయించుకున్నాడు.ఆఖరికి వెంటిలేటర్పై ఉన్నప్పుడు కూడా, అతను ఒక వేలు మరియు ఒక కాలి బొటనివేలితో వర్చువల్ కీబోర్డ్ను ఆపరేట్ చేస్తూ.. పూర్తి స్మార్ట్ ఫామ్ కంట్రోల్ సిస్టమ్ను విజయవంతంగా సృష్టించాడు. 2017లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత లీ తల్లి వు డిమెయ్ అతని సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ప్రతి శారీరక పనిలోనూ కొడుకు సూచనలను అనుసరించేది. అలా కాలక్రమేణ తనకు అస్సలు తెలియని సాంకేతిక నైపుణ్యాలను సులభంగా ఒడిసిపట్టిందామె. సర్క్యూట్లు గురించి తెలియకపోయినా.. కంట్రోల్ బోర్డులను సోల్డరింగ్ చేయడం, నెట్వర్క్ వైరింగ్ను ఇన్స్టాల్ చేయడం, సర్క్యూట్లను అసెంబుల్ చేయడం, వ్యవసాయ పరికరాలను నిర్వహించడం వంటి వాటిల్లో మంచి నైపుణ్యం సాధించింది. తన కుమారుడు లీ మార్గదర్శకత్వంలో తల్లి వు మాన్యువల్గా రిమోట్ కంట్రోల్డ్ డ్రైవర్లెస్ వాహనాన్ని కూడా నిర్మించింది. ఇది వారి ఉత్పత్తులను డెలివరీలు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాదు అతడి తల్లి వుకి సాంకేతిక సూత్రాలు ఏమి తెలియకపోయినా..వైర్లను ఎలా కనెక్ట్ చేయాలని, సిస్టమ్ని ఎలా సెటప్ చేయాలో ఆమెకు తెలుసు. ఇక లీ నిర్మించిన స్మార్ట్ వ్యవసాయం విజయవంతంగా నడుస్తోంది, లాభాలను ఆర్జిస్తోంది. ప్రస్తుతం అతడి జీవితం ఒక కొత్త విజయవంతమైన అధ్యయనానికి నాంది పలికింది. బాల్యమంత అనారోగ్యమయంతో గడిపినా..కనీసం శరీరంలో ఏ భాగాలు కదిలించలేకపోయినా..కేవలం వేళ్ల సాయంతో తన జీవితాన్ని అందంగా నిర్మించాలనుకోవడం మాములు టాలెంట్ కాదు కదూ..!. ఎంత కష్టమైనా సరే ఎదిగే చిన్న అవకాశం చాలు..ఉవ్వెత్తున ఎగిసిపడే స్థాయికి..చేరి విజయాన్నిపాదాక్రాంతం చేసుకోవచ్చని ప్రూవ్ చేశాడు..ఎందరికో అతడి కథ స్ఫూర్తిని కలిగించడమే గాక, మనసుని తాకింది కూడా.(చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..) -
ఆ గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం..!
ఇంతవరకు అధిక జనాభా అన్న మాటలే విన్నాం. భారత్, చైనా దేశాలు అనగానే అధిక జనాభానే గుర్తుకొస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఇవే. కానీ జనాభా తగ్గిపోయినా..ఒక్కసారిగా సంతానం కనుమరుగైతే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా, ఘోరంగా ఉంటుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. ఏమైందో గానీ ఒక్కసారిగా ఆ దేశంలోని గ్రామం జనాభా కుంటుపడిపోయింది..అనూహ్యంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది..పాఠశాలలకు వెళ్లే చిన్నారులు లేక మూతపడేపరిస్థితికి వచ్చేశాయ్. కారణం తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఇంతకీ ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడంటే..ఇటలీలోని పర్వత గ్రామమైన పగ్లియారా డీ చిన్నగ్రామమైనప్పటికీ అక్కడ నెలకొన్న పరిస్థితి ఇటలీ అంతటా ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. అక్కడ పాఠశాలలు ఖాళీగా దర్శనమిస్తాయి. కేవలం వృద్ధ జనాభానే అధికంగా కనిపిస్తుంది. అక్కడి గ్రామాలు, పట్టణాలు మనుషులు సందడి లేక వెలవెలబోయాయి. అక్కడ ఎటుచూసినా యథేచ్ఛగా తిరుగుతున్న పిల్లులు దర్శనమిస్తుంటాయి. నిజానికి ఆ గ్రామంలో దశాబ్దాలుగా జనాభా క్షీణతతో నిశబ్దం అలుముకుంది. ఆ నిశబ్దాబ్న్ని చేధిస్తున్నట్టుగా సుమారు 30 ఏళ్ల తర్వా తొలి బిడ్డ జననం..ఒక్కసారిగా ఆ గ్రామాన్ని ఆనందకేళి ముంచెత్తింది. ప్రస్తుతం ఆ చిన్నారి రాకతో ఆ గ్రామ జనాభా 20కి చేరిందట. ఆ చిన్నారి పేరు లారా బుస్సీ ట్రాబుకో. ఆమెను చూసేందుకు చుట్టపక్కల గ్రామాలతో సహ, ఇంతవరకు ఈ పగ్లియారా డీ అనే గ్రామం పేరు వినని వాళ్లు సైతం ఇక్కడకు తరలి రావడం విశేషం. అక్కడ ప్రసవాలు అరుదు కావడంతో లారా ప్రధాన ఆకర్షణగా మారింది. లారా తల్లి సిన్జియా ట్రాబుకో..తన కూతురు జననంతో మా ఊరి పేరు కూడా వార్తల్లో నిలిచిందంటూ మురిసిపోయింది. కేవలం తొమ్మిదినెలలు వయసుకే ఎంత ఫేమస్ అయ్యిందో అంటూ కూతురుని చూసి తడిసి ముద్దవుతోంది ఆ తల్లి. ఇక్కడ ఆ చిన్నారి లారా జననం అక్కడ వారిందరిలో ఆనందాన్నినింపినప్పటికీ..ఈ ఘటన ఒకరకంగా ఆక్కడ ఉన్న తీవ్రమైన జనాభా సమస్యను హైలెట్ చేసింది. జాతీయ గణాంకాల ప్రకారం..2024లో అక్కడ జననాల సంఖ్య మూడు లక్షలకు పడిపోయింది. గత 16 ఏళ్లుగా పరిస్థితి అలానే కొనసాగుతోంది. అక్కడ సంతానోత్పత్తి రేటు కూడా రికార్డు స్థాయిలో కనిష్టానికి చేరుకుంది, అలాగే మహిళలు సగటున కేవలం 1.18 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. కారణాలు..సరైన ఉద్యోగం లేకపోవడం, యువత విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం చేసే తల్లులకు మద్ధతు లేకపోవడం..దీనికి తోడు పురుషలలో వంధ్యత్వం సమస్యలు అధికంగా ఉండటం, కొందరు జంటలు పిల్లలను వద్దనుకోవడం తదితర కారణాల రీత్యా జనాభా క్షీణిస్తుండటం మొదలైంది. 2025 నాటి జననాల సంఖ్య మరింత దారుణంగా పడిపోతూ వచ్చింది. ఇది ఒక్క పాగ్లియారా డీ మార్సిలో కనిపిస్తున్న పరిస్థితి కాదు..మొత్తం ఇటలీలోనే ఇదే పరిస్థితి. ఇది ప్రభుత్వ సేవలు, ఆర్థివ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోందట. జనాభా క్షీణించినా కూడా .. పరిస్థితి ఇంత అధ్వానన్నంగా ఉంటుందా అని అనిపిస్తోంది కదూ..!.(చదవండి: 'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..) -
అమ్మ కెనడియన్, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..!
కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్ తల్లి, ఇటాలియన్ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్హుడ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్ భవన్లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్కి తాను తల్లిదండ్రులతో భారత్లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.జీవితమే మారిపోయింది.. కాగా, బియాంకా నీడు తాను భారత్లో పెరగడం వల్ల తన లైఫ్ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా. View this post on Instagram A post shared by Bianca Nieddu (@biancanieddu) (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
ఈ మొక్కలు వేటాడతాయి!
మనుషుల్లో మాదిరిగా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నట్లుగానే మొక్కలలో కూడా ఉంటాయి. కొన్ని మొక్కలు సూర్యకాంతిని, నేలనుంచి పోషకాలను తీసుకుని జీవిస్తాయి. మరికొన్ని మొక్కలు మాత్రం అలా కాదు ఆహారం కోసం ఇతర వనరులపై ఆధారపడతాయి. అవే మాంసాహార మొక్కలు.. ప్రకృతిలో ఈ మొక్కలు భిన్నంగా ఉంటాయనేది మీకు తెలుసా..?నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ఈ నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ పోషకాలను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నా... కొన్ని రకాల కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. అటువంటి మొక్కలను ‘కార్నివోరస్ ప్లాంట్స్’ లేదా మాంసాహార మొక్కలు అంటారు. వీటికి పత్రహరితం ఉన్నప్పటికీ, కొందరు పూర్తిగా, మరికొందరు పాక్షికంగా వేరే జీవులపైన ఆధారపడతాయి. మరెందుకని ఆ మొక్కలు మాంసాహారంగా మారాయి? మామూలుగా మొక్కలకు ఎదుగుదలకు, ఇతర జీవక్రియలకు అవసరమయ్యే ముఖ్య పోషకాల్లో ఒకటి నైట్రోజన్. ఇది నేలలో లభిస్తుంది. అయితే, కొన్ని ప్రాంతాల నేలల్లో నైట్రోజన్ సరిపడా ఉండదు. అటువంటి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు... కీటకాలు లేదా ఇతర చిన్న జీవులను పట్టుకుని, వాటి నుంచి నైట్రోజన్ను తీసుకుంటాయి. ఈ మాంసాహార మొక్కలు (Carnivorous Plants) నీటిలో, ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండే చిత్తడి నేలల్లో పెరుగుతాయి.మాంసాహార మొక్కల్లో రకాలు.. మాంసాహార మొక్కల్లో రకాలు ఈ మొక్కలన్నిటికీ వేటాడుకునే, ఆహారం పట్టుకునే పద్ధతులు వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలు కీటకాలను ఆకర్షించడానికి తీయని మకరందాన్ని స్రవిస్తాయి. మరికొన్ని ఆకులను ఉపయోగించి వేటాడతాయి. కొన్ని మొక్కలు కీటకాలు దానిపై వాలగానే మూసుకుపోతాయి. మరికొన్ని జిగురు వంటి ద్రవాన్ని స్రవించి, కీటకాలను అంటి పెట్టుకునేలా చేస్తాయి. మరికొన్ని మొక్కలు ప్రత్యేక ఆకారం ఉన్న గదులను కలిగి, అందులో కీటకాలు పడగానే బయటకు రానివ్వవు. ఇలా రకరకాల పద్ధతుల్లో ఆ మొక్కలు వేటాడతాయి. ఈ మాంసాహార మొక్కలు భూమిపై దాదాపు 630 జాతుల్లో ఉన్నట్లుగా చెబుతారు. ఈ మాంసాహార మొక్కల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..?వీనస్ ఫ్లైట్రాప్వీనస్ ఫ్లైట్రాప్ దీనిని ఫ్లైట్రాప్ అని కూడా అంటారు. ఇది నార్త్ కరోలినా, సౌత్ కరోలినా ప్రాంతాల్లో ఉంటుంది. చిత్తడి నేలల్లో పెరిగే అరుదైన మొక్క. దీని ఆకులు రెండు వైపులా ముడుచుకుని పోయే విధంగా ఉంటాయి. లోపలి భాగంలో కీటకాలు వాలగానే దవడల్లా మూసుకుపోతాయి. ఈ ఆకుల అంచులలో వెంట్రుకల వంటి కొసలు ఉంటాయి. కీటకం పడగానే, వెంట్రుకల వంటి భాగాలు అడ్డుగా మారి, కీటకం బయటకు రాకుండా అడ్డుకుంటాయి. ఆ తర్వాత మొక్క జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, కీటకంలోని పోషకాలను సంగ్రహిస్తుంది. జీర్ణక్రియ పూర్తవడానికి సుమారు 10 రోజులు పడుతుంది.జీర్ణక్రియ అయిపోయిన తర్వాత, ఆకు మళ్లీ తెరుచుకుంటుంది. సన్డ్యూ ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 జాతుల్లో లభిస్తుంది. దీని ఆకులు సన్నని వెంట్రుకల మాదిరిగా, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. దీని కొనభాగం తీయని జిగురువంటి ద్రవాన్ని స్రవిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షిస్తుంది. ఆ జిగురు కీటకాలను ఆకర్షించి, వాటిని బంధిస్తుంది. పట్టుకున్న తర్వాత, మొక్క కీటకాలను చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవిస్తుంది.నెపెంథస్.. ఇది ఒక రకమైన క్లైంబింగ్ మొక్క. దీని ఆకులు కిందకు వేలాడుతూ కుండ లేదా పిచర్ ఆకారంలో ఉంటాయి. దీని లోపలి భాగం తేనెవంటి మకరందాన్ని స్రవిస్తుంది. తీయని వాసనతో ఆకర్షించబడిన కీటకాలు అందులోకి జారుతాయి. లోపలి భాగం జిగురుగా, జారుడుగా ఉండడం వల్ల కీటకాలు బయటకు రాలేవు. కింది భాగంలో జీర్ణక్రియ ఎంజైములు ఉంటాయి. అందులో పడిన కీటకాలను జీర్ణం చేసుకుని పోషకాలను తీసుకుంటుంది. ఈ పిచర్ ప్లాంట్ జాతులలో కొన్ని.. చిన్న ఎలుకలను, ఇతర చిన్న జీవులను కూడా తినేంత పెద్దవిగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో ఈ మొక్కలు పెరుగుతాయి. కాటిల్ పర్పుల్ పిచర్ ఇవి కీటకాలను పట్టుకోవడానికి ప్రత్యేక ఆకారం ఉన్న ఆకులను కలిగి ఉంటాయి. పిచర్ ఆకారంలో ఉండే ఆకుల్లో వర్షపు నీరు నిల్వ అవుతుంది. కీటకాలు అందులో పడగానే బయటకు రాలేవంత బలంగా ఉండే వెంట్రుకల వంటి నిర్మాణాలు లోపలి వైపు ఉంటాయి. సాలీడులు, ఈగలు, చీమలు వంటి వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా చిత్తడి నేలల్లో పెరుగుతాయి.చదవండి: కావేరి వామన్.. ఐదడుగుల అరటి!వాటర్వీల్ ప్లాంట్.. ఇది నీటి అడుగున పెరుగుతుంది. ఈ మొక్క కీటకాలను పట్టుకోవడానికి వీనస్ ఫ్లైట్రాప్ని పోలిన యాంత్రిక పద్ధతిని ఉపయోగిస్తుంది. నీటిలోని చిన్న చిన్న కీటకాలు ఆకులపై వాలగానే, అవి చాలా వేగంగా మూసుకుపోతాయి. ఇది ప్రధానంగా ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియాలోని మురికి నీటిలో పెరుగుతుంది. బటర్వార్ట్ ఈ మొక్కలు ఆకుపచ్చ, పసుపు లేదా గులాబీ రంగుల్లో కనిపిస్తాయి. దీని ఆకుల పైభాగం జిగురుతో కప్పబడి ఉంటుంది. ఇది కీటకాలను పట్టుకోవడానికి సన్డ్యూ మొక్కను పోలిన విధానాన్ని అనుసరిస్తుంది. చిన్న చిన్న కీటకాలు ఆ జిగురుకు అతుక్కుపోతాయి. పట్టుకున్న తర్వాత, ఈ మొక్క ఆకును నెమ్మదిగా కీటకం చుట్టూ చుట్టి, జీర్ణక్రియ ఎంజైములను స్రవించి, పోషకాలను గ్రహిస్తుంది. ఈ మొక్కలు ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియాలోని చిత్తడి నేలల్లో పెరుగుతాయి.కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్.. కోబ్రా లిల్లీ దీనిని కాలిఫోర్నియా పిచర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా కాలిఫోర్నియా, ఒరెగాన్ ప్రాంతాల చిత్తడి నేలల్లో పెరుగుతుంది. దీని ఆకు, కోబ్రా పాము తల మాదిరిగా ఉంటుంది. లోపలికి జారుడుగా ఉండే ఆకుల్లోకి కీటకాలు వెళ్ళగానే, వెనుకకు రాలేక లోపల చిక్కుకుంటాయి. ఇవి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. డయోనియా మస్సిపుల లేదా వీనస్ ఫ్లైట్రాప్, ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అందమైన మాంసాహార మొక్కల్లో ఒకటి. ఇది కీటకాలను పట్టుకోవడానికి దాని ఆకులను ఉపయోగించి వేగంగా మూసుకుపోతుంది. డ్రోసెరా లేదా సన్డ్యూ మొక్క, జిగురు లాంటి ద్రవాన్ని స్రవించి కీటకాలను బంధిస్తుంది. - పసుపులేటి వెంకటేశ్వరరావు -
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్ఆర్ఐ పోస్ట్) -
ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోన్లేని ప్రపంచాన్నే ఊహించలేం. అదీగాక చేతిలో ఫోన్ లేకపోతే ఏ పని సాగదు, కాలు కూడా కదపలేం. అంతలా టెక్నాలజీపై ఆధారపడిపోయాం లేదా బానిసలమైపోయాం అనొచ్చేమో..!. ఏ చిన్న సందేహమైనా..ఏదైనా.. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా.. చేతిలో ఫోన్ ఉంటే చిటికెలో పనైపోతుంది. అంతలా మనకు అన్నింటిని అరచేతిలోకి వచ్చేసేలా అమర్చి పెట్టేసింది. అలాంటి స్మార్ట్ పోన్ని స్వచ్ఛంధంగా వాడకూడదని నిషేధం విధించుకుంది ఓ గ్రామం. అలా ఎందుకు చేసిందో తెలిస్తే..కచ్చితంగా సెల్యూట్ చేస్తారంతా. అయితే ఇది మరోకంగా విమర్శలకు దారితీసింది. ఆ నిషేధం కూడా సమంజసంగా ఉంటే..ఇతర గ్రామాలకు ఆదర్శంగానూ, అభినందనీయంగానూ ఉండేది. ఇంతకీ ఎందుకోసం స్మార్ట్ ఫోన్ని సీరియస్గా బ్యాన్ చేశారంటే..రాజస్థాన్లోని జలోర్ జిల్లాలోని 15 గ్రామాలు ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాయట. యావత్తు ప్రపంచం 6జీ వైపు దూసుకుపోతే అక్కడ మాత్రం మహిళలను కీప్యాడ్ పోన్ల యుగానికి వెళ్లిపోదాం అంటోంది. చౌదరి కమ్యూనిటీకి చెందిన సుంధమాతా పట్టి పంచాయితీ స్మార్ట్ఫోన్ ఉపయోగించకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా అక్కడ మహిళలు, బాలికలు వినయోగించకూడదు. అత్యవసరం అనకుంటే కీప్యాడ్ ఫోన్లే ఉపయాగించాలి అక్కడి మహిళలు. ఇదంతా ఎందుకంటే..మైబైల్ ఫోన్ ఒక వ్యసనంగా మారి పక్కదారి పట్టిస్తోందని, ముఖ్యంగా చిన్నారులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉందనే ఆయా గ్రామాలు స్మార్ట్ ఫోన్ని ఉపయోగించకూడదని నిషేధం విధించాయట. అంతేగాదు చదువుకునే పిల్లలు సైతం తమ ఇంట్లో ఫోన్ ఉపయోగించుకోవచ్చు గానీ బయటకు తీసుకురావడానికి వీల్లేదట. మహిళలే ఎందుకంటే..కచ్చితం అమ్మతోపాటు పిల్లలు ఉంటారు. దాంతో తరుచుగా చిన్నారులు వాటిని వినియోగించే అవకాశం ఉన్నందున మహిళలు కీప్యాడ్ ఫోన్లే ఉపయోగించాలని నిర్ణయించిందట పంచాయతీ. కాగా, ఆదివారం ఘాజీపూర్ గ్రామంలో జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. 14 పట్టి సమాజం అధ్యక్షుడైన సుజనారామ్ చౌదరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. అక్కడి పంచాయతీ ప్రకారం..దేవరామ్ కర్నోల్ వర్గం ముందుకు తెచ్చిన ప్రతిపాదనను పంచ్ హిమ్మతారామ్ చదివి వినిపించారు. చర్చల అనంతరం, సమావేశానికి హాజరైన పంచ్ సభ్యులందరూ ఈ నిబంధనను అమలు చేసేందుకు మొగ్గుచూపారు. ఈ తీర్మానం జనవరి 26 నుంచి అమలవుతుందట.ఏయే గ్రామాల్లో ఇది అమలు అంటే..ఈ నిర్ణయం భిన్మల్ ప్రాంతంలోని పలు గ్రామాలలో అమలు చేయబడుతుంది. వీటిలో ఘాజీపూర్, పావలి, కల్డా, మనోజియావాస్, రాజికావాస్, దట్లావాస్, రాజ్పురా, కోడి, సిద్రోడి, ఆల్డి, రోప్సి, ఖానాదేవల్, సావిధర్, హత్మీ కి ధాని, ఖాన్పూర్ గ్రామాలు ఉన్నాయి. నిజానికి పంచాయితీ చర్య సామాజిక కార్యకర్తలు, మహిళా హక్కుల సంస్థల నుంచి తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం మహిళా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఏ నిషేధం అయినా లింగ సమానత్వానికి పెద్ద పీటవేసేలా ఉండాలి గానీ, మహిళలే లక్ష్యంగా నిషేధం అంటే సహించదగినది కాదంటున్నారు సామాజికకార్యకర్తలు, మహిళా సంఘాలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు హాట్టాపిక్గా మారింది కూడా. (చదవండి: Sobhita Dhulipala: ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! నాటి రాణుల వైభవాన్ని తలపించిలా..) -
వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి.. చివరికి ర్యాపిడో డ్రైవర్గా!
ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే.. మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది.ఏం జరిగిందంటే.. చిరాగ్ తన పోస్ట్లో "ఇవాళ ర్యాపిడో బైక్లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడో డ్రైవర్తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్లో రాసుకొచ్చాడు."ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని.. కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్ల మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల రూ.4 లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు. దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆ ర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్లో రాసుకొచ్చాడు. తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట.. తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.Life is so unfair, man. I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff. Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025 (చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్కి..! ఆ ఉద్యోగాల వల్లే..) -
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్లోని H&M స్టోర్లోని హైటెక్ ట్రయల్ రూమ్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్దేవా. చక్కటి మ్యూజిక్ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..) -
అక్కడ 'చెత్త' ఆదాయంగా మారుతోంది..!
చాలాచోట్ల పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అనే నినాదం మాటలకే పరిమితమైంది. కానీ కొన్నిచోట్ల కార్యరూపానికి నోచుకుని సరికొత్త విధానంతో మార్పుకి నాంది పలుకుతూ.. స్ఫూర్తిని కలిగిస్తోంది. అది ఒకరకంగా అటు పర్యావరణ పరంగా, ఆర్థికంగా గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది కూడా. ఇలాంటి వినూత్న మార్గాలు ఆదర్శంగానే కాదు యావత్తు దేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్కి నిలయంగా ఉండేలా చేస్తాయి కూడా. అలాంటి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి..దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. అంతేకాదు చెత్తతో సంపద సృష్టించి మొత్తం దేశాన్నే ఆకర్షించింది కూడా. అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!.బిహార్లోని సివాన్ జిల్లాలోని లఖ్వా గ్రామ పంచాయతీ గృహ వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చి..ఆదర్శం గ్రామంగా నిలిచింది. ఏకంగా మొబైల్ అప్లికేషన్తో గృహవ్యర్థాలను కొనుగోలు చేసిన తొలి గ్రామం కూడా ఇదే. లోహియా స్వచ్ఛ బీహార్ అభియాన్ (LSBA) కింద ప్రారంభించిన ఈ చొరవ గ్రామస్తులు తమ గృహ వ్యర్థాల వివరాలను 'కబాద్ మండి' యాప్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సమాచారం అందిన వెంటనే సంబంధిత ఏజెన్సీ అస్రాజ్ స్కేప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యర్థాలను తూకం వేసి, నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా డబ్బులను తత్క్షణమే చెల్లిస్తుంది. ఈవ్యవస్థ ఒక రకంగా పారదర్శకత, సరళత, విశ్వసనీయతను నిర్థారిస్తుంది. ఇక్కడ వాళ్లు సేకరించిన వ్యర్థాలలో ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ రేటు ఉంటుంది. దాంతో సులభంగా ప్రజలు ఈ విధానాన్ని ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అక్కడ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర సమాచార, విద్య, కమ్యూనికేషన్ సలహాదారు(ఎల్ఎస్బీఏ) సుమన్ లాల్కర్న్ ప్రకారం..ఈ కార్యక్రమం విజయానికి దాని స్పష్టమైన ధరల విధానమేనని అన్నారు. దీనివల్ల గృహ వ్యర్థాల విభజన సులభమైందని కూడా చెబుతున్నారు. ఇంతకీ వ్యర్థాల ధరలు వస్తువుల వారీగా ఎలా ఉంటాయంటే..ప్లాస్టిక్ సీసాలు: కిలోకు రూ. 15టిన్: కిలోకు రూ. 10పెద్ద కార్డ్బోర్డ్: కిలోకు రూ. 8మధ్యస్థ కార్డ్బోర్డ్: కిలోకు రూ. 6తెల్లటి పాలిథిన్ కవర్లు(ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉండేవి): కిలోకు రూ. 5చిన్న కార్డ్బోర్డ్: కిలోకు రూ. 4కాగితం: కిలోకు రూ. 3బ్లాక్ ప్లాస్టిక్: కిలోకు రూ. 2సేకరించిన వ్యర్థాలను ఏం చేస్తారంటే..సేకరించిన వ్యర్థాలను ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు (PWMU), వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లకు (WPU) రవాణా చేస్తారు. ఆ తర్వాత వ్యర్థాలను ల్యాప్టాప్ బ్యాగులు, మహిళల పర్సులు, డైరీలు, కీ రింగ్లు, కప్బోర్డ్లు, బెంచీలు వంటి ఇతర మన్నికైన ఉత్పత్తులుగా రీసైకిల్ చేస్తారు. ఈ ప్రక్రియ పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా స్థానికులకు ఉపాధిని కూడా అందిస్తోందిరాష్ట్రవ్యాప్త ప్రభావంవ్యర్థాల నిర్వహణలో బిహార్ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని గ్రామీణాభివృద్ధి రవాణా మంత్రి శ్రావణ్ కుమార్ హైలైట్ చేశారు. ప్రస్తుతం, బీహార్లో దాదాపు 7 వేలకు పైగా గ్రామ పంచాయతీలలో వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లను, 171 ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేసింది. దీంతో వేల టన్నుల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి.. తిరిగి ఉపయోగించుకునేలా మార్చి.. బిహార్ స్వావలంబన, పరిశుభ్రతకు శ్రీకారం చుట్టింది. చెప్పాలంటే ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలిచింది. (చదవండి: అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..ఎలాగో తెలుసా..!) -
ఎవరీ రీసైకిల్ కింగ్ కరణ్? ఏకంగా 400 టన్నుల..
ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కరణ్ తన ‘ఫినోబాదీ’ స్టార్టప్ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశాడు. 3,318 మొక్కలను నాటాడు. డైబ్భై మందికి పైగా కార్మికులకు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కల్పిస్తున్నాడు...‘స్టెబిలిటీ–క్లారిటీ–డిగ్నిటీ’ నినాదంతో ‘ఫినోబాదీ’ అనే రీసైకిలింగ్ కంపెనీని ప్రారంభించాడు కరణ్ కుమార్. కరణ్ తండ్రి అయిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆస్తిపాస్తులు లేవు. కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించాడు. ‘నాన్నకు చదువు లేదు. ఆస్తి లేదు. అయినా సరే ఏదో రకంగా జీవనోపాధిని సృష్టించుకోగలిగాడు. ఇది చూసిన తరువాత శూన్యం నుంచి అవకాశాన్ని సృష్టించుకోవచ్చు’ అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటాడు కరణ్.ఎందుకు? ఏమిటి? ఎలా?రకరకాల గాడ్జెట్స్కు సంబంధించి ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆసక్తి కరణ్లో ఉండేది. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలనుకునేవాడు. చేతికి దొరికిన ప్రతి గ్యాడ్జెట్ను విడదీసి, తిరిగి వాటిని యథాతథ స్థితిలోకి తీసుకువచ్చేవాడు. ఇది సరదా కోసం చేసిన పని కాదు. వాటి అంతర్గత పనితీరు తెలుసుకోవడానికి చేసింది. ఏదైనా గ్యాడ్జెట్ పనిచేయకపోతే దాన్ని బాగు చేసి పనిచేసేలా చేసేవాడు. దీంతో ఇరుగు పొరుగు వారు రిపేర్ పని ఏదైనా ఉంటే కరణ్ దగ్గరికి వచ్చేవారు. పాకెట్ మనీకి కరణ్కు లోటు ఉండేది కాదు.నేర్చుకున్న తొలిపాఠంకోవిడ్ టైమ్లో తండ్రి వర్క్షాప్ మూతబడడంతో తమ్ముడితో కలిసి చిన్నపాటి ‘డోర్–టు–డోర్ మిల్క్ డెలివరీ సర్వీస్’ ప్రారంభించాడు కరణ్. అయితే దీంతో నష్టమే తప్ప లాభం రాలేదు. ‘వ్యాపారం అనేది సమస్యను పరిష్కరించేలా ఉండాలి. సమస్యను కొని తెచ్చుకునేలా ఉండకూడదు అనే పాఠాన్ని ఆ అనుభవం నుంచి నేర్చుకున్నాను’ అంటాడు కరణ్.ఇంటర్మీడియెట్ చేస్తున్నప్పుడు దిల్లీ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ‘ఉద్యమ్ శిక్ష’ అనే కార్యక్రమంలో చేరాడు కరణ్. నిజజీవిత సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులకు ఉపకరించే శిక్షణా కార్యక్రమం ఇది.‘ఉద్యమ్ శిక్షలో చేరిపోవడం నా జీవితాన్ని మార్చేసింది. నేను కొత్త వారితో మాట్లాడేవాడిని కాదు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడిని. అయితే ఉద్యమ్ శిక్ష నాలోని బెరుకును పోగొట్టింది. బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోమని చెప్పింది. ఈ క్రమంలోనే నాలో చిన్నగా ఆత్మవిశ్వాసం మొదలైంది’ అంటాడు కరణ్.ఫిన్ ప్లస్ కబాదీఢిల్లీలో చెత్తకుప్పల సమస్య తీవ్రంగా ఉండేది. చెత్తకుప్పలను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలయ్యేవి. ఇది చూసి షాక్ అయ్యాడు కరణ్. ఈ చెత్త కుప్పలను కాల్చడం ద్వారా విషవాయువులు విడుదలవుతాయి అనేది ఒక కోణం అయితే, మరో కోణం వాటిని పునర్వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోవడం. సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కబాదీవాలాస్(స్క్రాప్ డీలర్లు)తో మాట్లాడాడు కరణ్. వారి పని విధానం ఎలా ఉంటుందో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకున్నాడు. ‘విలువ లేని వస్తువులను విలువైన వస్తువులుగా మారుస్తాం’ అని వారు చెప్పిన మాట కరణ్ను ఆకట్టుకుంది. వారి మాటల స్ఫూర్తితో ‘ఫినోబాదీ’ పేరుతో రీసైక్లింగ్ కంపెనీ మొదలు పెట్టాడు కరణ్. ఫిన్ (ఫైనాన్స్), కబాదీ(స్క్రాప్) అనే రెండు మాటలు ఒక దగ్గర చేర్చి తన కంపెనీకి ‘ఫినోబాదీ’ అనే పేరు పెట్టాడు.ఆ మొక్కలు లక్ష్యాన్ని గుర్తు తెస్తాయిస్కూలు ఫ్రెండ్స్తో కలిసి ఢిల్లీలోని చంచల్ పార్క్లో పునర్వినియోగపరచదగిన వస్తువులను సేకరించడం మొదలుపెట్డాడు కరణ్. అయితే వారు పనికొస్తాయనుకున్న వస్తువులలో పనికిరాని వస్తువులే ఎక్కువ! ‘ఈ అనుభవంతో ప్లాస్టిక్, మెటల్, పేపర్కు సంబంధించి సూక్ష్మస్థాయిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏ వస్తువు పనికొస్తుంది, ఏది పనికి రాదు అనే విషయంలో స్పష్టత తెచ్చుకున్నాం’ అంటాడు కరణ్. ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ‘బిజినెస్ బ్లాస్టర్స్ ప్రోగ్రాం’ ద్వారా సీడ్ క్యాపిటల్ సంపాదించాడు.కంపెనీ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. యాప్ తీసుకువచ్చాడు. గల్లీలో మొదలైన ‘ఫినాబాదీ’ ఢిల్లి అంతటా విస్తరించింది. నోయిడా, గురుగ్రామ్లోకి అడుగుపెట్టింది. వంద కిలోల వ్యర్థాలను రీసైకిల్ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటడం సంప్రదాయంగా చేసుకుంది ఫినోబాదీ. ‘మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ మొక్క గుర్తు తెస్తుంది’ అంటాడు కరణ్ కుమార్.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే..) -
అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..
ఈ పిల్లి రైలులో స్టేషన్మాస్టర్. ఔను మీరు వింటుంది నిజం. ఇదేంటి పిల్లి స్టేషన్మాస్టర్ అనుకోకండి. అది చక్కగా విధులు నిర్వర్తించి శెభాష్ అనిపించుకోవడమే కాదు..ఏకంగా నష్లాల్లో ఉన్న రైల్వేని లాభాల బాట పట్టించిందట. అంతేకాదండోయే ఈ పిల్లి క్రేజ్కి నోటమాటరాదు. విధులు నిర్విర్తిస్తూ అనారోగ్యంతో చనిపోతే..దానికి వీడ్కోలు పలికేందుకు ఏ రేంజ్లో జనాలు వచ్చారో తెలిస్తే..కంగుతింటారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేద్దామా..!.ఇప్పుడు చెప్పుకోబేయే పిల్లి పేరు నిటామా. జపాన్లోని వాకాయామా కిషి స్టేషన్కు స్టేషన్మాస్టర్గా ఉండేది. వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే కోలో స్టేషన్ మాస్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఉండేది. ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఆరోగ్య క్షీణించడంతో ఇటీవలే కన్నుమూసింది. 15 ఏళ్ల వయసులో మరణించింది.పిల్లి ఎలా విధులు నిర్వర్తిస్తుందంటే..వాకాయామా నగరంలో జన్మించిన ఈ పిల్లిని ఓ వర్షం కురిసిన రోజు కారు కింద నుంచి రైల్వే వారు రక్షించారట. అప్పటి నుంచి దీని బాగోగులు అన్ని ఆ రైల్వేనే చూసుకునేదట. అంతకుముందు ఈ రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేసిన టామా నుంచి నేరుగా శిక్షణ తీసుకుందట ఈ నిటామా. అంతేకాదండోయ్ టామా వారసురాలిగా దాని స్థానంలో రానున్న ఈ నిటామా పిల్లికి అత్యంత స్ట్రిట్గా ట్రైనింగ్ ఇచ్చేదట ఆ టామా పిల్లి. ఎవ్వరితోనైనా సౌమ్యంగా ఉడే ఆ టామా..నిటామా పిల్లి వద్దకు వచ్చేటప్పటికీ..సరిగా పని నేర్చుకోవాలని సీరియస్ ఉండేదట. అలా ఆ టామా తదనంతర స్టేషన్మాస్టర్గా విధులు నిర్వర్తించిందట. అయితే ఈ కిషి స్టేషన్లో పనిచేయడాని కంటే ముందు అదే ట్రాక్లో ఇడాకిసో స్టేషన్లో స్టేషన్మాస్టర్గా పనిచేసేదట. ఆర్థికంగా నష్టాల్లో ఉన్నఈ రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా వీటిని స్టేషన్ మాస్టార్లుగా నియమించిందట జపాన్ ఎలక్ట్రిక్ రైల్వే కో లిమిటెడ్. అంతేగాదు ఆ రైల్వేలో సెలబ్రిటీ మాదిరిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ నిటామా పిల్లి అంత్యక్రియలకు ఏకంగా 500మంది దాక హాజరయ్యారట కూడా. అంతేగాదు ఆ పిల్లిచివరి కార్యక్రమాలన్నింటిని ఆ వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కోజిమా చూసుకున్నారట. అయితే ఈ నిటామా ఎంతమేరకు ఈ రైల్వే మార్గానికి రైడర్షిప్ అందించిందనేది రహష్యంగా ఉన్నా..గతంలో టామా అనే పిల్లి మాత్రం ఏకంగా రూ. 82 కోట్లు పైనే ఆదాయాన్ని ఇవ్వడమే గాక ఏకంగా 17% రీడర్షిప్ని కూడా అందించిందట.(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్లో హాట్టాపిక్గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?) -
అక్కడ క్రిస్మస్ రోజున..దెయ్యాన్ని కాల్చడం, భోగి మంటలు..
మనలో చాలా మందికి క్రిస్మస్ పండుగ వేడుక అనగానే క్రిస్మస్ చెట్టు లేదా శాంతా క్లాజ్ మాత్రమే కావచ్చు కానీ పలు దేశాల్లో ప్రజలకు మాత్రం ఇంకా చాలా చాలా గుర్తొస్తాయి. కొందరికి దెయ్యం దహనం గుర్తొస్తే మరికొందరికి వీధుల్లో భోగి తరహాలో వేసే మంటలు గుర్తోస్తాయి. ఈ అంతర్జాతీయ పండుగను ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారం ఇది..ఐస్లాండ్లో క్రిస్మస్ జానపద కథలు సంప్రదాయాలతో నిండి ఉంటుంది. ఇక్కడి శాంతా క్లజ్ లాగానే అనిపించే దుష్ట సోదరుల సమూహం అయిన యూల్ లాడ్స్ చిన్నారులను అలరిస్తారు. మొత్తం 13 రోజుల పాటు ప్రతి చిన్నారికి రాత్రి వేళల్లో చిన్న చిన్న బహుమతులు అందిస్తారు అది కూడా కిటికీల దగ్గర ఉంచిన బూట్లలో వాటిని పెట్టి వెళ్లిపోతారు. వారి రాక పండుగ సీజన్ అంతటా ఉత్సాహాన్ని సృష్టిస్తుంది.జపాన్లో క్రిస్మస్ ఉల్లాసంగా చాలా ఆధునికంగా ఉంటుంది. నగరాలన్నీ విద్యుత్ కాంతులతో మెరుస్తాయి క్రిస్మస్ ఈవ్ను ఒక రొమాంటిక్ అకేషన్గా భావిస్తారు. దాంతో జంటల సందడి కనిపిస్తుంది. అలాగేక్రిస్మస్ విందులో భాగంగా కెఎఫ్సిని ఆస్వాదించడం అనేది 1970లలో ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా కెఎఫ్సి బకెట్ల కోసం కుటుంబాలు ముందస్తుగా భారీ ఆర్డర్లు ఇస్తాయి. అలాగే క్రీమ్ స్ట్రాబెర్రీలతో అలంకరించిన క్లాసిక్ క్రిస్మస్ కేక్ను కూడా వీరు ఆస్వాదిస్తారు.ఇండోనేషియా దేశం ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ, అక్కడి క్రై స్తవ సమాజాలు ఈ పండుగను గొప్పగా వైభవంతో జరుపుకుంటాయి. ఆ దేశంలోని ఉత్తర సుమత్రాలో, బటాక్ జాతీయులు ఈ పండుగ సందర్భంగా మార్బిండా అనే సంప్రదాయాన్ని పాటిస్తారు దీనిలో భాగంగా జంతు బలి కూడా ఉంటుంది. బంధుత్వాన్ని గౌరవించడానికి విందును పంచుకుంటారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రమైన బాలిలో, పెంజోర్ బాంబూ పోల్స్తో వీధుల్ని అలంకరిస్తారు. కుటుంబాలు ఇంట్లో తయారుచేసిన వంటకాలను బహుమతిగా పంచుకునే న్గేజోట్ అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.గ్వాటెమాలాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా లా క్వెమా డెల్ డయాబ్లో పేరిట దెయ్యాన్ని దహనం చేయడం అనే విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. డిసెంబర్ 7న, కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దుష్టశక్తులను తరిమికొట్టడానికి అదృష్టాన్ని స్వాగతించడానికి పాత చెత్తతో పాటు దెయ్యం ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. వీధులు భోగి మంటల తరహాలో మంటలు, సంగీతం సమావేశాలతో వీధులన్నీ కళకళలాడతాయి. ఈ సీజన్ అర్ధరాత్రి వేడుకల్లో బాణసంచా కుటుంబ విందులతో కొనసాగుతుంది,గ్రీస్ పండుగ పడవ సంప్రదాయం గ్రీస్లో కరవాకి అని పిలిచే రంగురంగుల చెక్క పడవలు గ్రీస్ సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే పండుగ చిహ్నాలుగా వెలిగిపోతాయి. క్రిస్మస్ సందర్భంగా, పిల్లలు ఇంటి నుంచి ఇంటికి వెళ్లి కలంద అనే సాంప్రదాయ కరోల్లను పాడుతూ, త్రిభుజాలు లేదా డ్రమ్స్ వాయిస్తారు. ఇళ్ళు మెలోమకరోనా (సాంప్రదాయ గ్రీకు క్రిస్మస్ కుక్కీలు) వంటి తేనె బిస్కెట్ల సువాసనతో నిండిపోతాయి, కుటుంబాలు క్రిస్టోప్సోమో (క్రీస్తు రొట్టె)ను ప్రతీకాత్మక విందు గా కాలుస్తాయి(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్లో హాట్టాపిక్గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?) -
ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్ 'ఆహారమే'..! అదెలాగంటే..
ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్ లేదా రెస్టారెంట్) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..అమెరికాలో జరిగి అరుదైన సందర్భం. 78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ స్టాఫ్కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్ రాలేకపోతాడు. ఇంతలా సడెన్గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్లోని 45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ ఆరా తీశారు. దశాబ్దకాలంగా అతనికి సర్వీస్ అందిస్తున్న ఆ చెఫ్ వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్తో ఆ చెఫ్ డోనెల్ స్టాల్వర్త్ అతని డోర్ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్ నేలపై పడి ఉండటం చూసి షాక్ తింటాడు చెఫ్ డోనెల్. అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్ డోనెల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్ తీసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్ పక్క అపార్ట్మెంట్లోకే షిఫ్ట్ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.అయితే చెఫ్ డోనెల్ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్ డోనెల్. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.(చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్లు..! అతడి ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.) -
అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్ పోలీసుగా సేవ!
"నిస్వార్థమెంత గొప్పదో…నీ పదము రుజువు కట్టదా..సిరాలు లక్ష ఓంపదాచిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్ కాలేదా..ఉచితంగా సర్వీస్ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. తన కొడుకు తాను కలిసి టివీ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపైర్ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్ ఫిక్స్ అవ్వుతాడు. ఆ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసు మాదిరిగా డ్రెస్ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా ఆ జంక్షన్ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్ వేయలేకపోయాయి.ఆ సేవ వృధాగా పోలేదు..ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్ సెంటినల్గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. అంతేగాదు అతనికి మొబైల్ ఫోన్ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
ఆ కారు నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..! వైరల్గా ఓ తండ్రి పోస్ట్..
కారు కొనడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు తీరనిక కల అని చెప్పొచ్చు. డేర్ చేసి కొత మొత్తం కట్టి ఇన్స్టాల్మెంట్లో కొన్నా..ఆ డబ్బులన్నీ నెల నెల కట్టగలనా అనే భయం వెంటాడేస్తుంటుంది. అందుకే అంత మెంటల్ టెన్షన్ ఎందుకని..కారు కొనాలనే ఆలోచనే విరమించుకుంటా. కానీ ఈ వ్యక్తి ఆ సంశయాత్మక ధోరణి నుంచి బయటపడండని అంటున్నాడు. ముఖ్యంగా పిల్లలు ఉంటే మరో ఆలోచన చేయకుండా ధైర్యంగా కారు కొనాలనే నిర్ణయానికి రావడం మంచిదని సూచిస్తున్నాడు కూడా. ఎందుకలా అంటున్నాడంటే..ప్రస్తుతం బయట కాలుష్యం ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆ కాలుష్యం కోరల నుంచి తన బిడ్డ ఊపిరితిత్తుల పాడవ్వకుండా తాను కొన్న కారు ఎలా రక్షించింది సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. అతడు రెడ్డిట్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. భారీ వాహనాలు, లారీ, ట్రక్కుల వెనుక ఉంటే ఏ రేంజ్లో పొగ దుమ్ము ఆవిరిస్తుందో చెప్పక్కర్లేదు. అలాంటప్పడు మనకు కారు చాలా సురక్షితం అని చెబుతున్నాడు. తాను గతవారమై రూ. 10 లక్షలు ఖరీదు చేసే మారుతి ఫ్రాంక్స్ కారుని రూ. 3లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించి, రూ. 7లక్షల లోన్పై తీసుకున్నట్లు తెలిపాడు. అయితే మొదట అనవసరంగా లక్షలు చెల్లించి మరి ఇఎమ్ఐలో కారు కొన్నాని చాలా బాధపడ్డాడట. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు పన్వేల్ నాసిక్ మీదుగా తన ఏడాది కూతురు, భార్యతో కలిసి కారులో వెళ్తున్నప్పుడూ తన అభిప్రాయం మారిందట. తాను తీసుకున్న నిర్ణయమే సరైనది అనిపించిందట. తాను ఆ జర్నీలో కొన్ని డీజిల్ ట్రక్కుల మధ్య ట్రాఫిక్లో చిక్కుకున్నాడట. అక్కడ దట్టమైన పొగ, దుమ్ము, కారు అద్దాలపై ఆవరించి అసలు బయట ఏమి కనిపించలేదట. కారు లోపల ఏసి ఆన్ అయ్యి ఉంది కాబట్టి తమకు అంత చికాకుగా అనిపించలేదట. ఒకవేళ్ల కారు కొనకపోయి ఉంటే ఈ ట్రాఫిక్లో బైక్ తన కుటుంబమంతా ఉండేది. అస్సలు ఆ కాలుష్య ఏడాది వయసున్న తన చిన్నారి ఊపరితిత్తులను ఎంతగా ప్రభావితం చేసేది అన్న ఆలోచన భయాందోళనకు తోను చేసిందట. దేవుడి దయవల్ల సరైన నిర్ణయం తీసుకునే కారుకొన్న లేదంటే అమ్మో ఈ భయానక కాలుష్యానికి మొత్తం కుటుంబమే అనారోగ్యం పాలయ్యేది అని రాసుకొచ్చాడు. అందుకే చెబుతున్నా..కారు కొనాలా వద్ద అన్న మీమాంసలో ఉన్న తమ లాంటి పేరెంట్స్ అంతా ప్రస్తుత కాలుష్య దృష్ట్యా డేరింగ్ నిర్ణయం తీసుకోండి. త్వరితగతిన కారు కొనండి అని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు కారు అనేది లగ్గరీ కాదని మన పిల్లల పాలిట మొబైల్ ఎయిర్ ప్యూరిఫైయర్గా పేర్కొన్నారు. అలాగే ఖర్చు అని కాకుండా రక్షణను పరిగణలోకి తీసుకుని ధైర్యంగా కార కొనండని పిలుపునిచ్చాడు తన పోస్ట్లో. అయితే నెటిజన్లు అతని సూచనకు మద్దతివ్వడమే కాకుండా కారు రక్షణ, భద్రతా కూడా అది విస్మరించారు మీరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: వయసులో ఫిట్..పరుగులో హిట్..!) -
కాలినడకన.. 27 ఏళ్లు.. 31 వేల మైళ్లు! అంటే.. ప్రపంచం చుట్టొచ్చాడా?
ప్రపంచం చుట్టి రావాలనుకోవడం ప్రస్తుత రోజుల్లో పెద్ద విషయం కాదు. డబ్బుకి లోటు లేదు అనుకుంటే సులభంగా చుట్టొచ్చేయొచ్చు. అలాకాకుండా కాలినడకన చుట్టి రావాలనుకోవడం మాత్రం..కాస్త ఆలోచించాల్సిందే. అసలు ఈ ఆలోచన సాధ్యమేనా అనే సందేహం కచ్చితంగా వచ్చేస్తుంది. కానీ ఇతడు దృఢ సంకల్పమే ఆయుధంగా ఎలాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకన ప్రపంచం చుట్టి రావాలనుకున్నాడు. ఇప్పుడు దాదాపు చాలామేరకు చుట్టేశాడు. ఇంకొద్ది రోజుల్లో అతడి యాత్ర ముగింపుకి రానుంది. ఇంత పెద్ద ఘనతను సృష్టించిన ఆ వ్యక్తి ఎప్పుడు ఈ ప్రపంచ యాత్రను ప్రారంభించాడు?, ఎలా సాగింది వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.29 ఏళ్ల బ్రిటిష్ మాజీ పారాట్రూపర్ కార్ల్ బుష్బీ, ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఎలాంటి మోటారు వాహనాలు ఉపయోగించకుండా ప్రపంచం చుట్టి రావాలనే అసాధారణ లక్ష్యంతో బయలుదేరాడు. ఇప్పటికీ అతడి కల తీరనుంది. దాదాపు 29 ఏళ్ల సుదీర్ఘ యాత్ర అనంతరం 56 ఏళ్ల వయసుకు చేరుకున్న దశలో పూర్తి చేయనున్నాడు. అప్పటికీ పూర్తిగా మారిపోయిన ప్రపంచం, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి వంటి సవాళ్లను అధిగమించి మరి ప్రపంచ యాత్రను ఇంకొద్ది రోజుల్లో విజయవంతంగా పూర్తిచేయనున్నాడు. తన యాత్ర పూర్తి అవ్వడానికి జస్ట్ వెయ్యి మైళ్ల దూరంలోనే ఉన్నాడంతే. ఇప్పటి వరకు చేసిన సాహస యాత్రల్లో ఈ వ్యక్తి చేసిన యాత్ర అత్యంత సుదీర్ఘమైన యాత్రగా నిపుణులు పేర్కొన్నారు. ఇక బుష్బీ తన ప్రపంచ యాత్రను 1998లో చిలీ సరిహద్దుల నుంచి ప్రారంభించాడు. అలా నడుచుకుంటూనే తన స్వదేశం ఇంగ్లాండ్కు చేరుకుంటానని భీష్ముడు మాదిరిగా ప్రతినబూనడట. ఇంతవరకు ఈ యాత్రలో ఎలాంటి యాంత్రిక రవాణాను వినయోగించకపోవడం విశేషం. ఇప్పడు తన యాత్ర చివరి దశలో ఉన్నాడు. అంతేగాదు అతడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 2026 నాటికి తన స్వస్థలమైన ఇంగ్లాండ్కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నన్నా. ఇప్పటి వరకు 25 దేశాలు, ఎడారులు, యుద్ధ ప్రాంతాలు, అడవులు, గడ్డకట్టిన సముద్రాలను దాటాడు. ఈ డేరింగ్ యాత్ర అతడి అద్భుతమైన ఓర్పు, సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం 27 ఏళ్ల అనంతరం బుష్బీ ప్రయాణం పటగోనియా, ఆండీస్ పర్వతాలు, మధ్య అమెరికా, మెక్సికో, యుఎస్, రష్యా, మంగోలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల గుండా సాగనుంది. అతడు బ్రిటిష్ సైన్యంలో పారాటూపర్గా పనిచేసిన అనుభవమే ఈ సాహన యాత్రకు పురికొల్పిందని అంటాడు బుష్బీ. సైన్యంలో ఉన్నప్పుడూ అద్భుతమైన ప్రదేశాలను చూశాను. అదే తనని ఈ ప్రపంచమంతా చుట్టిరావాలనే సంచార కాంక్షను ప్రేరేపించిందని చెప్పుకొచ్చాడు. యాత్ర సాగిన విధానం..బుష్బీ 31,000-మైళ్ల యాత్ర సుమారు ఎనిమిది నుండి పన్నెండేళ్లు పడుతుందని అతను అంచనా వేశాడు. 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక భౌగోళిక రాజకీయ, ఆర్థిక, లాజిస్టికల్ అడ్డంకుల కారణంగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంగా మారిపోయింది.అతను తన నడకను దక్షిణ అమెరికా దక్షిణ కొనలో ఉన్న చిలీలోని పుంటా అరేనాస్లో ప్రారంభించాడు. పనామా, కొలంబియా మధ్య ఉన్న ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ను దాటడంతో సహా అమెరికా ఖండాల పొడవునా నడిచాడు. మార్చి 2006లో, అతను తోటి సాహసికుడు డిమిత్రి కీఫర్ అలాస్కా నుండి సైబీరియాకు కాలినడకన గడ్డకట్టిన బేరింగ్ జలసంధిని దాటిన మొదటి వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు.అనధికారిక సరిహద్దు పాయింట్లోకి ప్రవేశించిన తర్వాత వీసా సమస్యలు, ఐదు సంవత్సరాల ప్రవేశ నిషేధం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. దాంతో రష్యా గుండా వెళ్లటం సాధ్యపడలేదు. టండ్రా పరిస్థితుల దృష్ట్యా శీతాకాలం చివరిలో, వసంతకాలం ప్రారంభంలో మాత్రమే నడక మార్గం అనుకూలంగా ఉండేది బుష్బీకి. ఆగస్టు 2024లో, రాజకీయ ప్రమాదాల కారణంగా ఇరాన్ లేదా రష్యాలోకి ప్రవేశించకుండా కజకిస్తాన్ నుంచి అజర్బైజాన్కు కాస్పియన్ సముద్రం మీదుగా ఈదాడు. దీనికై విశ్రాంతి కోసం సహాయక పడవలతో 31 రోజులు పట్టిన 179-మైళ్ల క్రాసింగ్.ఆ తర్వాత కాకసస్, టర్కీ గుండా నడిచాడు, 2025లో బోస్ఫరస్ జలసంధిని దాటి యూరప్లోకి ప్రవేశించాడు. 2025 చివరి నాటికి, అతను యూకే నుంచి 1,400 మైళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రొమేనియా గుండా నడక ప్రారంభించాడు. అయితే బుష్బీ సంకల్పించినట్లుగా తన ప్రధాన నియమం విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తపడ్డాడు. కాలినడకనే తిరిగి ఇంటికి వెళ్లానే తన పట్టుదలను ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుష్బీ హంగేరీలో ఉన్నాడు. ఇంగ్లాండ్లోని తన స్వస్థలమైన హల్ నుంచి దాదాపు 932 మైళ్ల దూరంలో ఉన్నాడు. అతడి యాత్ర విజయవంతమైతే గనుక నిరంతరాయంగా నడిచిన తొలి వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుని రికార్డు క్రియేట్ చేస్తాడు. చివరగా బుష్బీ 29 ఏళ్ల వయసులో ప్రపంచ యాత్ర మొదలుపెడితే 56 ఏళ్ల వయసుకు పూర్తి చేయనున్నాడు. నిజంగా ఇది అతిపెద్ద డేరింగ్ యాత్ర కదూ..!(చదవండి: ఆ యువ సైక్లిస్ట్ గట్స్కి మాటల్లేవ్..! ఆ వ్యాధిపై అవగాహన పెంచడం కోసం..) -
ఆ దేశంలో న్యాప్ కేఫ్లు ఉంటాయి!
దక్షిణ కొరియాలో ‘న్యాప్ కేఫ్’ల పేరుతో కేఫ్లు ఉంటాయి. పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవాలనుకునేవారు వీటికి వెళుతుంటారు. బొలీవియాలో ‘పలాసియో డి సాల్’ పేరుతో పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మించిన హోటల్ ఉంది. సిక్కింలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో టిబెటన్ నూతన సంవత్సర లోసర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను చూడడం అద్భుతమైన అనుభవం.ఫిబ్రవరి మాసంలో అరుణాచల్ప్రదేశ్లో ఆరు రోజుల పాటు క్రీడలు, సాంస్కతిక ఉత్సవాలు ‘తవాంగ్సు టైడ్స్ ఇంటర్నేషనల్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. దేశ,విదేశాలకు చెందిన ఆటగాళ్లు, కళాకారులు ఈ క్రీడా, కళా ఉత్సవాలలో పాల్గొంటారు. తవాంగ్సు నది ఒడ్డున రాత్రులు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అందంగా వెలిగిపోతాయి. క్రీడా ప్రతిభను గుర్తించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పేరులో ‘గ్రీన్’ మాట ఉన్నప్పటికీ....‘గీన్ల్యాండ్’తో పోల్చితే ‘ఐస్ల్యాండ్’లోనే పచ్చదనం ఎక్కువ. View this post on Instagram A post shared by Santosh Jha (@career_first_) (చదవండి: వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్) -
వన్స్ అపాన్ ఏ టైమ్... వండర్ఫుల్ పోస్టర్స్
ఇప్పుడంటే...ఆధునికం అని ఏమిటి, అత్యాధునికమైన కెమెరాలు ఉన్నాయి. ఫొటోషాప్లు ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. కానీ...వన్స్ అపాన్ ఏ టైమ్ పెద్దగా ఏమీ లేవు.అయినా...ఎన్నో పరిమితులు ఉన్నా, ట్రావెలింగ్కు సంబంధించిన పోస్టర్లను అద్భుతంగా డిజైన్ చేసేవారు ఆర్టిస్ట్లు. ‘అవి ఆ కాలానికి మాత్రమే’ అనుకోవడానికి లేదు. కాలాతీతమైనవి. అందుకే అలనాటి ట్రావెలింగ్కు సంబంధించిన అద్భుత పోస్టర్ల ఎగ్జిబిషన్ గురుగ్రామ్లోని ‘హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం’లో జరుగుతోంది...1920లలో...మన దేశంలోని రైల్వే బోర్డు తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి అనేదాని గురించి ఆలోచించింది. ఆదాయం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే ఆకర్షణీయమైన ప్రకటనలు రూపొందించాలి అని నిర్ణయించుకుంది.అలా మొదలైంది...దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ చిత్రకారులతో పోస్టర్లు, ఇతరత్రా విజువల్స్ రూపొందించారు. ఇవి రైల్వే స్టేషన్ గోడలపై, ఓడరేవులు, వ్యాపారకేంద్రాలు, మార్కెట్లు, పోస్టాఫీసుల దగ్గర కనిపించేవి. విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగించేలా డిజైన్ చేసిన పోస్టర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పోస్టర్లలో అత్యంత పాత పోస్టర్... 1914కు చెందిన కనర్డ్ లైన్ అడ్వర్టైజ్మెంట్. అద్భుతమైన లేఔట్తో ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్లపై ‘విజిట్ ఇండియా’ ‘సీ ఇండియా’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఆరోజుల్లో రైల్వే యాడ్స్ను రూపొందించడం అనేది ఖరీదైన వ్యవహారంలా ఉండేది. ఆ ఖరీదుకు తగ్గట్టే పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించేవి.ఎయిర్ ఇండియా... మహారాజా మస్కట్ఇక విమానాల విషయానికి వస్తే... ‘ఎయిర్ ఇండియా’ పోస్టర్లు ‘మహారాజ మస్కట్’ తో ఆకట్టుకునేవి. ‘ఎయిర్ ఇండియా–రోమ్ ΄ోస్టర్’ ‘ఎయిర్ ఇండియా–యూరప్ పోస్టర్’....ఇలా రకరకాల పోస్టర్లు డిజైన్ చేసేవారు. అలనాటి న్యూ బోయింగ్ 747ను ప్రమోట్ చేయడానికి కూడా ఎయిర్ ఇండియా పోస్టర్లు రూపొందించింది.కళాత్మక విలువలునవీన సాంకేతికతతో ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడానికి ముందే పదిమందిని ఆట్టుకునేలా ఈ పోస్టర్లను రూపొందించడం విశేషం. గ్రాఫిక్ ఆర్టిస్ట్ల లితోగ్రాఫిక్ ప్రింట్స్ ఎక్కువగా ఉండేవి. గౌరీ శంకర్, పి.సమ్దార్, కుషల్ ముఖర్జీ, శోభాసింగ్, బి.సన్యాల్లాంటి చిత్రకారులు ఎక్కువగా పోస్టర్లు డిజైన్ చేసేవారు.‘మొక్కుబడిగా డిజైన్ చేసినట్లు కాకుండా కళాత్మక విలువలు ఉట్టిపడేలా ఆనాటి ట్రావెల్ పోస్టర్లు కనిపిస్తాయి’ అంటారు విశ్లేషకులు.ఆ కాలానికి స్వాగతంఅలనాటి అద్భుత విజువల్స్ ఈతరానికి పరిచయం చేయడానికి గురుగ్రామ్లోని హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియం నడుం కట్టింది. 1930 నుంచి 1970 మధ్యలో రూ΄÷ందించిన ట్రావెల్ పబ్లిసిటీ ΄ోస్టర్లను హెరిటేజ్ ట్రాన్స్΄ోర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ‘΄ోస్టర్స్ దట్ మూవ్డ్ ఇండియా: టూరిజం, ట్రావెల్ అండ్ ట్రాన్స్΄ోర్ట్’ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 2026 వరకు కొనసాగుతుంది. -
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్సమ్గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది. ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్జీపీటీతో ఇంగ్లిష్లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట. భారత్లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది. వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది. జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్ని ప్రేమిస్తున్నట్లు వివరించింది. గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..టాప్–10 (అంచనా వాటా):భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)జపాన్ – ~10% (≈ 80 వేలు)యుకే – ~8% (≈ 64 వేలు)జర్మనీ – ~7% (≈ 56 వేలు)ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)కెనడా – ~6% (≈ 48 వేలు)దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)ఈ సంఖ్య భారత్లో సుమారు 1.44 లక్షలుపురుషులు: ≈ 67,000స్త్రీలు: ≈ 67,000ట్రాన్స్జెండర్లు: ≈ 2,500భారత్లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలుఇంగ్లిష్/హింగ్లిష్: ~55%హిందీ/హింగ్లిష్: ~25%ప్రాంతీయ భాషలు: ~20% (చదవండి: సూపర్స్టార్ రజనీకాంత్ ఫిట్నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..) -
రాబందుల గూళ్లలో 750 ఏళ్ల నాటి పురాతన చెప్పులు..!
పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలు ఎన్నో కొంగొత్త విషయాలకు లేదా పురాతన చరిత్రకు ఆలవాలం. మధ్యయుగ కాలంలో మనుషులు ఇలా ఉండేవారని వాటి ఆనవాళ్లు, గుర్తులు ఉపయోగించిన పరికరాలతో అంచానా వచ్చేవాళ్లం. కానీ ఆ విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరిచి మన పరిశోధకులుకు అందించి విస్మయపరిచాయి ఈ రాబందుల గూళ్లు. అవన్ని ఎలా పాడవ్వకుండా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నది పరిశోధకులకు ఊహకందని మిస్టరీలా మారింది.దక్షిణ స్పెయిన్లో ఒక గుహలో శతాబ్దాల నాటి రాబందుల గూళ్లు పరిశోధకులకు ఆసక్తిని రేకెత్తించాయి. ఆ పర్వత గుహల్లో రాబందులు లోతైన భారీగూళ్లను నిర్మించడమే ఇందుకు కారణం. నిజానికి ఇవి మనం చూసే రాబందులుకు కాస్త భిన్నంగా గడ్డంతో ఉంటాయి. అలాగే వేటాడటంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అంతేగాదు ఆగూళ్లు పదిలంగా ఉండేలా..తాజా కొమ్మలు, ఉన్ని, ఎముకలు, ఇతర పదార్థాలను జోడించి మరి అందంగా నిర్మించాయి. దాంతో ఆ భారీ గూళ్లలో ఏ వస్తువు దాచినా భద్రంగా ఉంటాయట. అయితే ఈ గూళ్లను పురావస్తు పరిశోధకులు 2008, 2014 మధ్య కాలంలో గుర్తించి తవ్వడం ప్రారంభించారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఈ జాతులు సుమారు 70-130 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాయి. కానీ అవి వదిలి వెళ్లిన ఈ గూళ్ల కారణంగా నాటి చరిత్రకు ఆధారాలు లభించినట్లయ్యిందని చెబుతున్నారు పరిశోధకులు. అయితే ఈ గూళ్లలో వేలాది జంతువుల ఎముకల తోపాటు 200 కి పైగా మానవ నిర్మిత కళాఖండాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలో శాస్త్రవేత్తలను అత్యంత అమిత ఆశ్చర్యానికి గురిచేసింది మాత్రం దాదాపు 650-750 సంవత్సరాల క్రితం తయారు చేసిన చెప్పులు. అవి ఇప్పటికీ పాడవ్వకుండా ఉండటం చాలా మిస్టరీగా అనిపించింది పరిశోధకులకు. అందులోనే పెయింటింగ్ వేసిన గొర్రె చర్మపు తోలు, గుడ్డ ముక్కలు, గడ్డితో నేసిన పనిముట్లు, మధ్యయుగ క్రాస్బౌ బోల్ట్ తదితరాలను గుర్తించారు. ఈ పక్షులకు వేటాడటంలో ప్రత్యేకతతోపాటు ఎముకలను పగలు కొట్టి వాటి మజ్జను తినడంలో స్పెషలిస్ట్లట. ఈ గూళ్లను చూస్తే సహజ మ్యూజియంలా అనిపిస్తున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే..మధ్యయుగం నాటి పర్యావరణ వ్యవస్థలు, పక్షి ఆహారం, అలాగే ఆ కాలంలోని మానవ కార్యకలాపాలపై అసామాన్యమైన అంతర్దృష్టిని అందించాయని చెప్పారు. ప్రస్తుతం దక్షిణ స్పెయిన్లో రాబందులు కనుమరుగైనప్పటికీ..వాటి గూళ్లు పరిశోధనలకు, అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు గొప్ప మార్గాన్ని అందించాయని అన్నారు. ఈ గడ్డం రాబందులు ఈ వస్తువులన్నింటిని ఎత్తుకెళ్లి..ఒకరకంగా నాటి మానవజీవితంపై ఒక ఆలోచనను అందించాయని అన్నారు. కాగా, ఈ పరిశోధన ఇటీవల ఎకాలజీ జర్నల్లో ప్రచురితమైంది.(చదవండి: రూ.1.3 కోట్ల ఉద్యోగ ఆఫర్..! కానీ ట్విస్ట్ ఏంటంటే..ఏకంగా ఆరు నెలలు..) -
ఆ విపత్తు ముడివేసిన వైవాహిక బంధం..!
కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్ జిబిన్, లియు జిమెయ్ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్స్టోరీని పంచుకున్నారు. రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..2008లో వెంచువాన్లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్కి సమీపంలోని మరో టేబుల్ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్ లియాంగ్ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్. తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్ విధి ముడివేసిన బంధం..తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్.(చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..! అంత ఖరీదా..?) -
క్యారెట్స్, ఆపిల్స్ తీసుకువెళ్లడం ఎంత పనైపాయే..! ఆ ఎలుగుబంటి..
సర్క్స్లోనూ, పార్క్ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్ఫులగా ఉండాలి. లేదంటే ఈ కీపర్కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని హాంగ్జౌ సఫారీ పార్క్లో జంతువుల సర్కస్కి సంబంధించి లైవ్ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్లోకి తరలించారు. అది జూకీపర్ సంచి నిండా యాపిల్స్, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు. ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.A zoo handler was briefly attacked by a black bear during a performance at Hangzhou Safari Park. The worker is safe, the bear has been removed from public shows, and officials say smell of treats may have triggered the animal’s reaction. pic.twitter.com/qtI38aBV0B— Open Source Intel (@Osint613) December 7, 2025(చదవండి: షీస్ ఇండియా షో..) -
రోడ్డుపై రాయి.. రూ.5 వేల ధర ఎలా పలికిందంటే..!
రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు. ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్ వేశాడు. చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్ గడియారాన్ని డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది. దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు. అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Sabke Bhaiya JI (@deluxebhaiyaji) (చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!) -
అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..
మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్ అట్లాస్ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్లైన్లో ఒక గంటకు భర్తలను బుక్ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్, వడ్రండి,టెలివిజన్ ఇన్స్టాలేషన్ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. పురుషుల కొరతకు రీజన్దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్ అట్లాస్ ప్రకారం లాట్వియన్ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. (చదవండి: అమెరికా-భారత్కి మధ్య ఇంత వ్యత్యాసమా..!) -
అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?
ఆ ప్రాంతంలో కాన్పు కోసం గర్భిణీని అంగడికి తీసుకువెళతారు. తీసుకెళ్లాల్సింది ఆస్పత్రికి కదా అంగడికి ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే...కాన్పు జరగడంలో ఆలస్యం అయితే చాలు అక్కడ ముందు అంగడికి తీసుకువెళతారు. గర్భిణీ తన కొంగు జాపి కూరగాయలు అడుక్కుంటుంది. ఇంటికి వచ్చిన తరువాత ఆ కూరగాయలను వండుకునే సంప్రదాయం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మంజీర నది పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాల్లో దశాబ్దాల కాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తొమ్మిది నెలలు నిండిన తరువాత కాన్పు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడడం సహజం. పూర్వ కాలంలో కాన్పు ఆలస్యం అవుతుందంటే చాలు దగ్గరలో జరిగే అంగడికి తీసుకువెళ్లేవారు. ఆమె వెంట తల్లీ, కుటుంబ సభ్యులు వెళ్లి గర్భిణి కొంగు పట్టుకుని ఐదు రకాల కూరగాయలు సేకరిస్తారు. కూరగాయలు అమ్మేవారు గర్భిణిని చూడగానే కూరగాయలు ఆమె కొంగులో వేసి దీవిస్తారు. తరువాత గర్భిణికి ఇష్టమైన పదార్థాలను తినిపిస్తారు. అంగడికి తీసుకువెళ్లడం మూలంగా గర్భిణికి శారీరక వ్యాయామం కలుగుతుంది. ఇంట్లో కూర్చుని కాన్పు కోసం పడే ఆందోళన కూడా తగ్గుతుంది, కాన్పు సులభంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ ఆచారం మొదలైంది అంటారు.తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మహ్మద్నగర్, పిట్లం, బాన్సువాడ, బిచ్కుంద, పెద్దకొడప్గల్, జుక్కల్ తదితర మండలాలతో పాటు పొరుగున ఉన్న మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో గర్భిణులను అంగడికి తీసుకువెళ్లే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి (చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!) -
అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..!
ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అనగానే భారత్లోనే ఎక్కడ అని ఆత్రుతగా వెతక్కండి. ఎందుకంటే..అతి పెద్ద ఆలయం మన ఇండియాలో లేదు కంబోడియాలో ఉంది. చుట్టూ కందకంతో చుట్టుబడి అద్భుతానికి ప్రతిరూపంలా అలారారుతోంది ఆ ఆలయం. అది హిందూ దేవాలయమేనా కాదా అనేది చరిత్రకే తెలియని ఓ మిస్టరీ. ఇప్పటికీ ఈ దేవాలయం చర్చనీయాంశంగా ఉంటుందట. ఎందుకంటే ఇందులో అడగడుగున కనిపించే అద్భుతమైన కళా సంపద, ఆ గోడలపై కనిపించే రాతి కళా నైపుణ్యం మనల్ని కట్టిపడేయడమే కాదు..ఎన్నో అనుమానాలు, సందేహాలను రేకెత్తిస్తుంటదట. మరి అలాంటి ఆలయం ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కించుక్ను కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం దాదాపు 400 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కంబోడియాలోని ఒక అందమైన, కందకంతో చుట్టుముట్టిన అంగ్కోర్ వాట్ దేవాలయం అతి పెద్ద ఆలయంగా ఖ్యాతీ దక్కించుకుంది. ప్రతి ఏడాది వేలాదిగా ప్రయాణికులను మంత్రముగ్ధులన్ని చేసే ఈ గుడి గొప్ప సంక్లిష్టంగా చెక్కిన ఆలయ సముదాయం. నిజానికి ఈ దేవాలయం దానికదే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది అందులోకి అడుగుపెట్టగానే. దీన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ II విష్ణువు దేవుని కోసం నిర్మించిన స్మారక చిహ్నంగా చెబుతుంటారు. పశ్చిమాన ఉన్న అరుదైన ఆగ్నేయాసియా దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. అంతేగాదు అంగ్కోర్ పురావస్తు ఉద్యానవనానికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. అది హిందూ దేవాలయమా?నివేదికల ప్రకారం, అంగ్కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత ఆయమే గానీ హిందూ దేవాలయమేనే అనేది నేటికి మిస్టరీనే. ఎందుకంటే దాని సంక్లిష్ట చరిత్ర కారణంగా దీనిని కొన్నిసార్లు హిందూ-బౌద్ధ దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదట హిందూ దేవాలయంగా నిర్మించిన అంగ్కోర్ వాట్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. సియామ్ రీప్లోని అంగ్కోర్ ఖైమర్ రాజ్యానికి కేంద్రంగా ఉండేది. పైగా ఇది అనేక స్మారక చిహ్నాలు, పట్టణ ప్రణాళికలు, పెద్ద నీటి జలాశయాలను కలిగి ఉంది. అంగ్కోర్ లోపల, అంగ్కోర్ వాట్, బయోన్, ప్రీహ్ ఖాన్, టా ప్రోహ్మ్ వంటి దేవాలయాలు గొప్ప కళా సంపదకు నిలయంగా ఉన్నాయి.అయితే ఈ ప్రాంతంలో హిందూ మతం క్రమంగా తగ్గుముఖం పట్టి బౌద్ధమతం అభివృద్ధి చెందడంతో, ఆలయం కూడా క్షీణించకుండా దినదినాభివృద్ధి చెందింది. పైగా ఈ ఆలయానికే బౌద్ధ మందిరాలు కూడా జోడించారు. దాంతో చాలామంది సన్యాసులు ఇక్కడికి తరలివచ్చేవారు. అంగ్కోర్ సామ్రాజ్యంలోని ఇతర నిర్మాణాలను అడవి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ ఆలయం చాలా కాలం పాటు సజీవంగా, ప్రార్థనా మందిరంగా ఉంది.వందలాది విభిన్న దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయంగా ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం గుండా నడవడం, రాతితో చెక్కిన పురాతన ఇతిహాసం గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అర కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న బాస్-రిలీఫ్ గ్యాలరీలు రామాయణం, మహాభారతం, ఖగోళ యుద్ధాలు, ప్రసిద్ధ క్షీర మహాసముద్ర మథనం వంటి దృశ్యాలను వర్ణిస్తాయి. అంగ్కోర్ వాట్ మూడు స్తంభాలు ఖైమర్ వాస్తుశిల్పానికి విలక్షణమైనది. పైగా హిందూ మతంలోని దేవతల నివాసమైన మౌంట్ మేరు సాంప్రదాయ ఆలయ శిఖరాన్ని(పర్వతాన్ని) సూచిస్తాయి. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపించినా..దగ్గర నుంచి చేస్తే ఇప్పటికీ ఈ కట్టడం ఎలా మనగలిగింది అనే సందేహం మెదులుతుంటుంది.(చదవండి: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్మాస్టర్ టైటిల్! అసలేంటి గేమ్..) -
వావ్.. ఇల్యూషన్ ఆర్ట్
జేఎన్టీయుహెచ్ వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎస్ఎస్ఆర్. కృష్ణ త్రీడీ ఇల్యూషన్ ఆర్టిస్ట్. ఈయన నేలపై వేసే చిత్రాలు మనిషికి భ్రమ కల్పిస్తాయి. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు.. భ్రమ కల్పించటమే ఈ 3డీ ఆర్ట్ ప్రత్యేకత. ఇలాంటి 3డీ ఆర్టిస్ట్లు దేశం మొత్తంలో తక్కువ మంది ఉన్నారు. అమ్మ ప్రోత్సాహంతో.. చిన్నప్పటి నుంచి కృష్ణ బొమ్మలు గీస్తూ ఉండటంతో ఆసక్తిని గమనించి బొమ్మలు గీయడం నేరి్పంచారు ఆయన తల్లి. అక్కడి నుంచి బొమ్మలు వేయడం సాధన చేయడంతో 3డీ చిత్రాలు వేయడం అలవాటైంది. మిగతా ఆర్టిస్టులకు భిన్నంగా బొమ్మలు గీయడంలో ప్రత్యేకత ఉండాలనే కోరిక సింగారపు శివరామకృష్ణను 3డీ ఆర్టిస్టుగా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం కొండగట్టులో బీటెక్ అభ్యసించే సమయంలో మెకానికల్ విభాగం హెచ్ఓడీ ఎన్వీఎస్ రాజు మెకానికల్ విద్యకు సంబంధించి పాఠ్యపుస్తకం రాశారు. ఇందులో బొమ్మలు వేయడానికి అతడికి అవకాశం ఇచ్చారు. మంథని నుంచి అమెరికా వరకూ అతడి ప్రతిభకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. రాహుల్ గాంధీ జోడో యాత్రలో 3డీ ఆర్ట్స్ గీశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా ఆర్ట్ ఫెస్టివల్కు ఆయనను ఆహా్వనిస్తారు. ప్రస్తుతం జేఎన్టీయులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకల్లో ఆయనకు యంగ్ అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమై స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
వివాహాల్లో సరికొత్త లగ్జరీ ట్రెండ్..! హ్యాంగోవర్ రాకుండా..
పెళ్లిళ్లలో అతిథులను కట్టిపడేసేలా ఆతిథ్యం ఇవ్వడం గురించి విని ఉంటారు గానీ ఇలాంటిది విని ఉండరు. ఏకంగా పెళ్లికి వెళ్లగానే అక్కడ కాస్త ఎక్కువ తిని, తాగి అలసిపోతాం కామన్. అలా అలసిపోయి హ్యాంగోవర్కి గురికాకుండా ఉండేలా అక్కడే ట్రీట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లగ్జరీ ట్రెండ్ హవా వివాహాల్లో హైలెట్గా నిలవనుంది. వామ్మో ఇదేంటి ఆఖరికి వచ్చిన అతిథుల ఆరోగ్యం బాగోగుల కూడా అంటే తడిసిమోపుడవుతుందా కదా అంటారా..! అయినా సరే డోంట్ కేర్ అంటూ ..ఈ ట్రెండ్కే సై అంటోంది యువత.అలాంటి ట్రెండ్ న్యూడిల్లీలోని రాజౌరి గార్డెన్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన హెయిర్ క్లినిక్ కయాన్ ఆ పెళ్లికి వచ్చేసిన అతిధులకు ఐవీ బార్(క్లినిక్ మాదిరి సౌకర్యం) ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan) IV బార్ అంటే..విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్ వంటి వాటిని నేరుగా సిరల్లోకి ఎక్కించేందుకు (IV ఇన్ఫ్యూషన్) వీలు కల్పించే ఒక క్లినిక్ లేదా సౌకర్యం. ఇది ఎందుకంటే పెళ్లికి విచ్చేసిన అతిధులు అక్కడ వడ్డించే భోజనం, ఆల్కహాల్ ఎక్కువగా లాగించేసి ఉత్సాహంతో ఆడిపాడి సందడి చేస్తారు. దాంతో కాసేపటికే అలిసిపోయి హ్యాంగోవర్ లేదా తలనొప్పితో బాధపడుతుంటారు. అలా ఇబ్బంది పడకూడదని ఈ ఐవీ బార్లు ఏర్పాటు చేస్తున్నారట. వీటి సాయంతో తలనొప్పి లేదా హ్యాంగోవర్తో ఇబ్బందిపడే వాళ్లకు ఈ గ్లూటాతియోన్ షాట్లను అందిస్తారు. దీని వల్ల రీహ్రైడ్రైట్ అయ్యి..యాక్టివ్గా మారతారట. అలాగే పెళ్లిళ్లలో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారని ప్రస్తుతం ఈ ట్రెండ్ని ఎక్కువగా ఫాలోఅవుతున్నారట. సదరు కయాన్ బృందానికి హ్యాంగోవర్ రాకుండా ఉండేలా చేయలేమని, కేవలం నిర్వహిస్తామని క్లియర్గా స్పష్టం చేసింది. పాపం ఆ పెళ్లిలో సర్వీస్ అందిస్తున్న ఐవీబార్ కయాన్ బృందానికి ఇప్పటికీ వందలకొద్ది ప్రశ్నలు వచ్చాయట ఆ హ్యంగోవర్ సమస్యపై. తాము ఆల్కహాల్ తాగొద్దు అని సలహ ఇవ్వలేం గానీ దానివల్ల వచ్చే హ్యాంగోవర్ని తగ్గించే ప్రయత్నం చేయగలమని సమాధానం చెప్పడం విశేషం. అంతేకాదండోయ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే హెల్త్ ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఐవీ బార్ బృందాన్నే ఏర్పాటు చేస్తున్నారట. అంటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా పెళ్లిళ్లల్లో సేవలు కూడా అందించేస్తున్నారన్నమాట. ఆఖరికి హైడ్రేషన్ సేవ కూడా వచ్చేస్తోందన్నమాట. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమా? లేక అతిథుల పట్ల కేరింగ్నా తెలియని కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లూ చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Skulpted™ by Kan | Skin & Hair Clinic (@skulptedbykan)(చదవండి: ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!) -
ఎలుక మాదిరి విచిత్రమైన జీవి..14 గంటల వరకు ఆడజీవితో..!
ఈ భూమ్మీద ఉండే ప్రతి జీవి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కొన్ని విచిత్రమైన జీవులు మనం రోజూ చూసే జీవుల మాదిరిగా ఉండి, అత్యంత విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే ఎలుక మాదిరి ఈ మార్సుపియల్. ఇది చూడటానికి అచ్చం ఎలుకను పోలి ఉంటుంది. దీనికున్న ప్రత్యేక లక్షణాలు గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి అవేంటో చకచక చూసేద్దామా..!.ఆ జీవి పేరు ఆంథెకనస్. ఇది ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే చిన్న ఎలుక లాంటి మార్సుపియల్. వీటిని పెద్ద పాదాల మార్సుపియల్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇవి ఎలుకలు మాత్రం కాదట. వీటిలో అత్యంత విలక్షణమైనది సంతానోత్పత్తి కాలం. సంవత్సరానికి రెండు నుంచి మూడు వారాలు మాత్రమే ఉండే ఈ సంతానోత్పత్తి కాలంలో మగ ఆంథెకనస్ కోసం తీవ్రంగా అన్వేషిస్తుందట. అయితే ఈ మగ మార్సుపియల్ ఆడ మార్సుపియల్లతో ఏకంగా 14 గంటల వరకు సంభోగం చేస్తుందట. అందుకోసం మగ మార్సుపియల్లు నిద్రను సైతం పక్కనపెట్టేస్తాయట. దాంతో వాటి శరీరంలో టెస్టోస్టెరాన్, ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు అమాంతం పెరిపోతాయి. దాంతో వాటి అంతర్గత అవయవాల పనితీరు దెబ్బతిని, రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా మగ ఆంథెకినేసులు ఏడాది వయసు కూడా రాకమునుపే చనిపోతాయట. అలాగే ఈ ఆడ ఆంథెకినేసులు పునరుత్పత్తి వ్యవస్థ సైతం ఇతర జీవుల కంటే భిన్నంగా ఉంటుందట. అచ్చం కంగారుల మాదిరిగా పూర్తి స్థాయి బొడ్డు సంచి ఉండదట. కేవలం చర్మ సంచి మాత్రమే ఉంటుందట. గర్భధారణ కాలం దాదాపు 25 నుంచి 35 రోజులు. ఆ తర్వాత అపరిపక్వ పిల్లలను అనేక వారాల పాటు తల్లి శరీరాన్ని అంటిపెట్టుకుని పెరుగుతాయట. వీటికి బీటిల్స్, సాలెపురుగులు, స్లగ్స్, వంటి కీటకాలు ఆహారం, ఒక్కోసారి చిన్న చిన్న సరీసృపాలను కూడా వేటాడతాయట. ఇవి టార్పోర్ అనే ప్రత్యేకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయట. అంటే.. శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటుని తగ్గించి శక్తిని ఆదా చేసేలా ఒక రకమైన లోతైన నిద్రలాంటిది ఈ టార్పోర్. ఇక వీటి తోకలు వాటి శరీరం కంటే చాలా పొడవుగా ఉండి, మందపాటి బూడిద లేదా గోధుమ వర్ణం బొచ్చుని కలిగి ఉంటాయి.(చదవండి: ఆ ఇద్దరు అప్పుడు క్లాస్మేట్స్..ఇవాళ శబరిమలలో..!)) -
ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్కి మాటల్లేవ్ అంతే..
ఒక చిత్రం గీశాక..అది అద్దం ముందు మరో చిత్రంలా అగుపించడం అంటే మాములు టాలెంట్ కాదు. ఇలాంట నైపుణ్యాన్ని ఆప్టికల్ ఇల్యూషన్ అని పిలస్తారు. అలాంటి స్కిల్ని పుణికిపుచ్చుకున్నాడు 69 ఏళ్ల వ్యక్తి. ఎంత అద్భుతంగా ఇద్దరు వ్యక్తులను ఒక చిత్రంలో పొందుపరిచి..అద్దం చూపగానే మరొకరిలా కనిపిస్తుంది. నేరుగా చూస్తే..ఇంత టాలెంటా.. ? అని విస్తుపోవడం మనవంతు అవుతుంది. అంతలా అద్భుతంగా చిత్రిస్తాడు. అతడి ఆర్ట్ నైపుణ్యానికి మాటల్లేవ్ అంతే..! అనేయొచ్చు.అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అతడే అక్బర్ మోమిన్. గుజరాత్లోని సిధ్పూర్కు చెందిన అక్బర్ తన అద్భుతమైన.. భ్రమని కల్పించే చిత్రాలకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. ఆయన్ను అంతా త్రీడీ ఆర్టిస్టు అని పిలుస్తారు. ఎందుకంటే చిత్రించిన ప్రతి బొమ్మ మరోలా ఏదో మాయ చేసినట్లుగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Bharatiya Gujju 🇮🇳 (@bharatiya.gujju)ఒక వ్యక్తి చిత్రపటం ముందు అద్దం పెట్టగానే మరొక వ్యక్తిని ప్రతిబింబిస్తుంది. కాస్త షాకింగ్కి గురిచేసే ఆర్ట్ ఇది. ఆయన పంచుకున్న వీడియో ఒకదానిలో రాముడి పెయింటింగ్ అద్దంలో హనుమాన్ జీగా కనిపిస్తుంది. అత్యంత నేచురుల్గా ఉండే ఆప్టికల్ ఇల్యూషన్ ఎవ్వరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక మరో వీడియోలో ప్రధాని మోదీ చిత్రపటం ముందు అద్దం ఉంచగానే అమిత్షా కనిపిస్తారు. View this post on Instagram A post shared by Brightside of Bharat 🇮🇳 (@brightside.of.bharat)అక్కడ ఏదో మిరాకిల్ జరిగిందా అన్నట్లుగా.. ఒక ఇమేజ్ మరొలా కనిపిస్తుంది. 45 ఏళ్లుగా అక్బర్ ముంబైలో ఈ ఆర్ట్పై మంచి ప్రావీణ్య సంపాదించి..తన స్వస్థలానికి తిరిగి వచ్చి ఒక స్టూడియోను ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్టూడియో ప్రతి వారాంతంలో కళాప్రియులను అమితంగా ఆకర్షిస్తోంది. అతని కళా నైపుణ్యం ఉమ్మడి సాంస్కృతిక స్ఫూర్తిని చాలా అందంగా సూచిస్తోంది. ప్రతి పెయింటింగ్ వెనుక మరో వ్యక్తిని దాచిపెడుతూ..ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులను చూసే విలక్షణమైన ఆర్ట్ ఇది. ఈ ఆర్ట్ సృజనాత్మకతకు, సాంకేతికత దూరదృషికి సంబంధించిన అసాధారణ స్కిల్. ఇంకెందుకు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోలపై ఓ లుక్ వేయండి మరి. (చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
ఇది నవంబర్ కాదు మోవంబర్!
ఈ నెల నవంబర్ కదా మరి ఇదేంటి మోవంబర్ అని అంటున్నారేంటి అనుకోకండి. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేపథ్యంలో ఆ గమ్మత్తైన తమాషా స్టోరీ ఏంటో చూసేద్దామా..!నవంబర్ నెలలో మీసాలను పెంచే కార్యక్రమమే... మోవంబర్. ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్లో మీసాలకు సంక్షిప్త నామం... మో. దీనికి నవంబర్ నెలను జత చేసి ‘మోవంబర్’ ను సృష్టించారు. ‘మోవంబర్’ సరదా కార్యక్రమేమీ కాదు. దీనికి సామాజిక ప్రయోజనం ఉంది. పురుషుల ఆరోగ్య సమస్యలైన ప్రోస్టేట్ కేన్సర్పై అవగాహన కలిగించడం, పురుషుల ఆత్మహత్యలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం... మొదలైనవి ‘మోవంబర్’లో భాగం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కేంద్రంగా మోవంబర్ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.(చదవండి: నేటి పురుషుడికి 10 సవాళ్లు) -
చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?
చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్లో ఉండేది. ఒకరోజు చిలక్కి, ఆ పక్షి శాస్త్రవేత్తకీ మాటా మాటా వచ్చింది. చిలుక చికాకును ప్రదర్శించింది. అందుకు ఆ శాస్త్రవేత్త హర్ట్ అయ్యారు. వెంటనే ఆ చిలుక, ‘‘క్షమించండి’’ అంది. నిజానికి చిలుక తప్పేం లేదు. చిలుక అరటి పండు అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏవో గింజల్ని పెట్టారు. చిలుక మౌనంగా ఉంది. ‘‘ఊ, ఇదుగో అరటిపండు. తినూ..’’ అని మళ్లీ గింజల్నే పెట్టి, ఆ చిలుకను మోసం చేసే ప్రయత్నం చేశారు ఆ శాస్త్రవేత్త! చిలుక కోపంగా ఆ గింజల్ని శాస్త్రవేత్తపై విసిరికొట్టింది. చికాకును ప్రదర్శించింది. వెంటనే ‘సారీ’ కూడా చెప్పేసింది! నిజంగా చిలుకలకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా? తెలివితేటలదేముందీ... ఎన్నైనా ఉండొచ్చు. వాటిని ప్రదర్శించటానికి ఈ మూగ జీవులకు మాటలెలా వస్తాయన్నదే ఆశ్చర్యం. ఆ చిలుక పేరు అలెక్స్, ఆ శాస్త్రవేత్త పేరు ఐరీన్ పెప్పర్బర్గ్(Irene Pepperberg). మాటలేనా, భాషలు కూడా!బ్రిటన్లో 2010లో ఒక పెంపుడు చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అది మాట్లాడే చిలుక. తన యజమాని మాట్లాడుతుండే బ్రిటిష్ యాసను చక్కగా అనుకరిస్తూ ఉండేది. చిలుక ఎగిరిపోయినందుకు ఆ యజమాని చాలా బాధపడి పోయాడు. తిరిగి నాలుగేళ్ల తర్వాత ఆ చిలుక, యజమాని కలుసుకున్నారు! అయితే చిలుక తన యజమాని మాట్లాడే బ్రిటిష్ భాషను మర్చిపోయింది. బదులుగా స్పానిష్ భాషను మాట్లాడుతోంది! అంటే చిలుకలు మాట్లాడటమే కాకుండా, భాషలు కూడా నేర్చుకుంటాయా? అవును!!మైనాలూ అచ్చు గుద్దేస్తాయిపక్షి జాతిలో మనిషి భాషను అద్భుతంగా అనుకరించేవి చిలుకలతో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి. (బాక్సులలో చూడండి) మనుషుల మాటల్నే కాక, ఇతర శబ్దాలను కూడా గొంతులోంచి అవి అచ్చు గుద్దేయగలవు! వాటిల్లో ప్రధానమైనవి మైనాలు. మైనాల్లో కూడా ముఖ్యంగా ‘కామన్ హిల్’ జాతి మైనాలు మనుషుల స్వర స్థాయులలోని హెచ్చు తగ్గుల్ని పట్టేసి మాట్లాడేయగలవు. స్పష్టత కూడా ఏం తగ్గదు! దక్షిణాసియా, ఆగ్నేయాసియా కొండ ప్రాంతాలు ఈ మైనాల జన్మస్థలాలు. అండమాన్, నికోబార్ దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనా, మయన్మార్, థాయ్లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో మైనాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇండియాలో మరీ అంత విస్తారంగా కనిపించవు కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రపక్షి ఈ‘మైనా’నే. ఇంకా.. స్టార్లింగ్ పక్షులు (ఐరోపా); కాకి జాతిలోని – కోర్విడ్స్, ఆవెన్స్, మేగ్పీస్ (ఆస్ట్రేలియా); జేస్ (బ్రిటన్, కెనడా); లైర్బర్డ్స్, మాకింగ్ బర్డ్స్ (అమెరికా, మెక్సికో); టూయ్ (తేనె భక్షించే న్యూజీలండ్ పక్షి), కానరీ పక్షులు (స్పెయిన్).. మనిషి మాటలనే కాదు.. అలారాలు, ఫోన్ రింగ్టోన్లు, వివిధ రకాల యంత్రాల ధ్వనులను వాటికవి, మంచి మూడ్లో చక్కగా మిమిక్రీ చేస్తాయి! ఇదెలా సాధ్యం?!యునీక్ సిరింగ్స్ అనాటమీమాట్లాడే పక్షుల గొంతులోనూ మానవ స్వరాల్లా గమకాలు పలకటానికి ఉన్న సదుపాయం ఏంటంటే.. వాటి శ్వాసనాళ నిర్మాణంలోని ‘యునీక్ సిరింగ్స్ అనాటమీ’! పక్షులకు పెదవులు, దంతాలు ఉండవు. అవి ఉంటేనే కదా, మనకైనా గొంతులోంచి, నోట్లోంచి ధ్వని వెలువడుతుంది. అయితే ఈ మాట్లాడే పక్షుల్లో పెదవులు, దంతాలకు బదులుగా, వాటి శ్వాసనాళం దిగువన ఉండే ‘సిరింక్స్’ అనే స్వరనాళాలు మాట్లాడేందుకు వీలు కల్పిస్తాయి. మనుషులకు స్వరపేటిక ఎలాగో, పక్షులకు స్వరనాళాలు అలాగ! మాటలకు అవసరమైన స్వర తంతువులు మనుషుల్లో వారి ‘లారింక్స్’ (స్వరపేటిక)లో ఉంటే, పక్షుల్లో వాటి ‘సిరింక్స్’ (స్వర నాళాలు)లో ఉంటాయి. మనుషుల స్వర పేటికలోని స్వర తంతువుల మాదిరిగా కాకుండా, పక్షులు శబ్దాలను సృష్టించటానికి తమ ‘సిరింక్స్’లోని మృదువైన కండరాలను నియంత్రించుకుంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఏర్పాటు – పక్షులు భిన్నమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ – శక్తిమంతమైన, వైవిధ్యభరితమైన గాత్రధ్వనులను జనియింపజేయటానికి వీలు కల్పిస్తుంది. వేగవంతమైన పిచ్ స్విచింగ్ఉత్తర అమెరికాలో ‘కార్డినల్’ అనే పక్షి, మాటల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిందా అనిపిస్తుంది! చిలుకల జాతికి ‘చెందని’ ఈ పక్షిలోని సిరింక్స్.. వేగవంతమైన, సంక్లిష్టమైన శబ్దాలను ఉత్పత్తి చేయటానికి వీలు కల్పిస్తుంది. పియానో స్వరాల కంటే కూడా ఎక్కువగా, సెకనులో పదో వంతు లోపు ఈ పక్షులు తమ గొంతును సజావుగా మార్చుకోగలవని పక్షి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటికున్న ఆకట్టుకునే స్వర నియంత్రణ – అధునాతన ధ్వని ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా – వాటిని అప్పటికప్పుడు శబ్దాలను ఉత్పత్తి చేయటానికి అనుమతిస్తుంది. నాలుకలోనే నైపుణ్యమంతా!చిలుకలు తమ నాలుకలను ముందుకు, వెనుకకు కదిలించడం ద్వారా; ముక్కును తెరిచి, మూయటం ద్వారా శబ్దాలను మలచుకుంటాయి. మనుషుల మాటల్ని కూడా ఇదే విధంగా అనుకరిస్తాయి. చిలుకలకు పెదవులు లేనప్పటికీ భాషలోని అచ్చులను, హల్లులను పలకటానికి మానవులు చేసే విధంగా అవి తమ నాలుకలను ప్రత్యేక నైపుణ్యంతో ఉపయోగిస్తాయి. ఈ నైపుణ్యం చిలుకలు, ఇతర మాట్లాడే పక్షులలో అసాధారణమైన స్పష్టతకు, మనుషుల్ని అనుకరించటానికి సహాయ పడుతుంది. చిలుకలు, మరికొన్ని జాతుల పక్షులు మాత్రమే మనుషుల మాటల్ని అనుకరించటానికి కారణం.. మిగతా పక్షుల్లో ఈ విధమైన స్వర నిర్మాణాలు లేకపోవటమే. కలుపుగోలు పలుకులుచిలుకల్లో ప్రకృతి సిద్ధమైన ‘సంభాషణ స్వభావం’ ఉంటుంది. అడవిలో అవి తమ జాతి గుంపులతో బలమైన బంధాలను ఏర్పచుకుంటాయి. ఆ సహజ స్వభావం వల్లనే పంజరాలలో బందీలుగా ఉన్న చిలుకలు కూడా తమ మానవ సహచరులతో బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాయి. మాటా మాటా కలుపుతాయి. మనుషుల మాటల్నే తిరిగి పలుకుతాయి. అన్నవాహిక హెల్ప్ చేస్తుందిమనిషి భాష మాట్లాడటం పక్షులకు అంత తేలికైన పనేమీ కాదు. భాషలో మనకు అచ్చులు, ఉచ్చారణ విధానాలు ఉంటాయి. కొన్నిసార్లు పలకటానికి కొరుకుడు పడని ఉచ్చారణలూ ఉంటాయి. అయితే ఈ ఇబ్బందిని చిలుకలు తమ స్వర మార్గాన్ని మార్చుకోవటం ద్వారా పలుకులో స్పష్టతను సాధిస్తాయి. చిలుకల్లో పెదవులు లేని లోటును తీర్చి, ఉచ్చారణ అడ్డంకులను తొలగించేందుకు, శబ్దాన్ని నోటి ద్వారా బయటికి పంపించటానికి వాటి అన్నవాహిక తోడ్పడుతుంది. అచ్చుల కోసం, అవి తమ నాలుకలను కదిలిస్తాయి. కచ్చితమైన శబ్దాలను బయల్పరచటానికి తమ ముక్కును సర్దుబాటు చేసుకుంటాయి. పాటల పక్షులకు భిన్నంగా..!చిలుకల మెదడులోని నాడీ మండల విద్యుత్ ప్రవాహాలు ప్రత్యేకమైనవిగా ఉన్నందు వల్ల అవి మానవ భాషను వినగలుగుతాయి. గుర్తుపెట్టుకోగలుగుతాయి. సంక్లిష్టమైన ధ్వనులను సైతం ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ సామర్థ్యాలన్నిటినీ అనుసంధానించే వ్యవస్థ చిలుకల మెదడులో ఉంటుంది. పాటలు పాడే పక్షుల్లో ఉండే ఒకే మాదిరి వ్యవస్థ కాకుండా, చిలుకలకు అదనపు సర్క్యూట్ ఉంటుంది. ఇది వాటి జాతుల పిలుపులను, మానవ జాతుల పిలుపులను నేర్చుకోవడానికి వాటికి అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ విధమైన ప్రత్యేక శరీర నిర్మాణంతో చిలుకలు పలకగలవు. అరవగలవు. తిట్టగలవు. ఇక్కడి మాటలు అక్కడ చెప్పనూ గలవు!శిక్షణ ఇస్తే మరింత జ్ఞానం ముఖ్యంగా, శిక్షణ తర్వాత చిలుకలు సందర్భోచితంగా, అర్థవంతంగా పదాలను ఉపయోగించటాన్ని అధ్యయన వేత్తలు గమనించారు. రాత్రి పడుకునే ముందు ‘గుడ్ నైట్’ చెప్పడం, తినేందుకు ఏదైనా పెట్టమని అడగడం, లేదా వస్తువులను లెక్కించడం, వస్తువులను తీసుకురావటం వంటి పనులను చేసే సామర్థ్యం చిలుకల్లో ఉందని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించిన విషయమే. చక్కటి శిక్షణ పొందిన ఆఫ్రికన్ బూడిద రంగు చిలుక ‘అలెక్స్’, తన రంగు గురించి అడిగినప్పుడు శిక్షకులు నివ్వెర పోయారు. తనకు తానుగా ప్రశ్న వేసిన తొలి చిలుకగా అలెక్స్ చరిత్రలో నిలిచిపోయింది. మహా జ్ఞానవతి అలెక్స్!ఫొటోలో కనిపిస్తున్న బూడిద రంగు చిలుక పేరే.. ‘అలెక్స్’. ఈ మహాజ్ఞాని పక్కన ఉన్నది జంతుజ్ఞాన శాస్త్రవేత్త ఐరీన్ పెప్పర్బర్గ్. అలెక్స్కు ఏడాది వయసున్నప్పుడు ఐరీనే ఒక దుకాణంలో దానిని కొనుక్కుని అలెక్స్ అని పేరు పెట్టారు. 31 ఏళ్ల వయసులో అలెక్స్ 2007 సెప్టెంబర్ 6న తన పంజరంలోనే విగతజీవిగా కనిపించింది. ఐరీన్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పంజరాలలో ఉండే చిలుకల ఆయుర్దాయం 45 సంవత్సరాలు. (అడవి చిలుకలు అడవిలో ఏదో ఒక ప్రమాదంతో ఇంకా ముందుగానే చనిపోతాయి).‘‘నువ్వంటే నాకిష్టం!’’అలెక్స్ అలా హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో ఐరీన్కు అంతుచిక్కలేదు. ఆ ముందు రోజు రాత్రి అలెక్స్ పలికిన చివరి పలుకులు : యు బీ గుడ్ (నువ్వు బాగున్నావు), ఐ లవ్ యు (నువ్వంటే నాకిష్టం), సీ యూ టుమారో (రేపు కలుద్దాం)... అనేవి. ల్యాబ్లో పంజరం ఉండేది. ఐరీన్ ఆ ల్యాబ్లో పని చేస్తుండేవారు. ల్యాబ్ నుండి ఐరీన్ ఇంటికి వెళ్లే ప్రతి రాత్రీ ఆ చిలుక ఆమెకు ఈ మూడు మాటలతోనే వీడ్కోలు చెబుతుండేది. శవ పరీక్షలో చిలుక మరణానికి స్పష్టమైన కారణాలు బయపడలేదు. ఆ తర్వాతి పరీక్షల్లో ‘గుండెపోటు’ అని నిర్థారణ అయింది.విసిగిస్తే ‘అంతేగా, అంతేగా..’ దాదాపుగా 30 ఏళ్ల పాటు అలెక్స్ సహజజ్ఞానంపై పరిశోధనలు జరిపారు ఐరీన్. అలెక్స్ తెలివి తేటలకు అనేక పరీక్షలు కూడా పెట్టారు. అలెక్స్ 80 శాతం పరీక్షల్లోనెగ్గింది. ఒకసారి అలెక్స్ ముందు రకరకాల రంగుల బ్లాక్స్ (ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనివి కావు) ఉంచి, రెండు ఎరుపు బ్లాకులు, మూడు నీలం బ్లాకులు, నాలుగు ఆకుపచ్చ బ్లాకులు) ఉంచి, ‘‘ఏ రంగు బ్లాకులు మూడు ఉన్నాయి?’’ అని ఐరీన్ ఆ చిలుకను అడిగారు. అలెక్స్ తప్పకుండా నీలం రంగు బ్లాకులు అని చెబుతుందనే అనుకున్నారు ఐరీన్. అయితే అప్పటికే నానా రకాల ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అలెక్స్.. ‘‘ఫైవ్’’ అని చెప్పింది. ఐరీన్ వదలకుండా, ‘‘అవునా? ఆ ఫైవ్ ఏ రంగులో ఉన్నాయి?’’ అని మళ్లీ అడిగారు. సమాధానంగా అలెక్స్, ‘‘ఏవీ లేవు’’ అని చెప్పింది. దాన్ని బట్టి చిలకలు కూడా, అడిగిందే అడుగుతుంటే మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని, కావాలని తప్పుగా సమాధానం చెబుతాయని ఐరీన్ గుర్తించారు. ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’అలెక్స్కు 100 కంటే ఎక్కువ పదాలు తెలుసు. ఒకసారి తనను తను అద్దంలోకి చూస్తూ, ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’ అని అలెక్స్ అడగటం ఐరీన్ను నివ్వెరపరిచింది. ‘నువ్వు బూడిద రంగు (గ్రే కలర్)లో ఉంటావు అని ఆరుసార్లు చెప్పగానే ఆ రంగు అలెక్స్కు గుర్తుండిపోయింది. అదలా ఉంచితే, తనకు తనుగా ఒక ప్రశ్న అడిగిన మానవేతర జీవిగా అలెక్స్ నిలిచిపోయింది! (సంకేత భాషను ఉపయోగించటంలో శిక్షణ పొందిన వానరాలు సైతం ఇప్పటి వరకు వాటికై అవి ఒక్క ప్రశ్ననూ అడగలేకపోయాయి). అలెక్స్ చిలుక మానవ భాషనే కాదు, వాక్య నిర్మాణాన్ని కూడా అర్థం చేసుకోగలిగిందని ఐరీన్ వెల్లడించారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
అతను నిద్రపోయి అరవైఏళ్లు దాటింది.. ! వైద్య ప్రపంచానికే అంతుచిక్కని మిస్టరీ..
వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్లోని ఒక మారుమూల ప్రశాంతమైన గ్రామం లో.. 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ నివసిస్తున్నాడు. అతని కథ ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలను మాత్రమే కాదు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే సడలి, వడలిపోయే సాధారణ మనుషుల ధోరణికి భిన్నంగా ఈ రైతు జీవితం ఉండడమే ఈ ఆశ్చర్యాలకు కారణం. ఒకటీ రెండూ కాదు ఏకంగా 62 ఏళ్ల నుంచీ ఈ తాత కళ్లు మూతపడలేదట.గత 1962 నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని న్గోక్ పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధంలో తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న తర్వాత, 20 సంవత్సరాల వయసులో అతనికి ఈ అసాధారణ పరిస్థితి ప్రారంభమైంది. జ్వరం తగ్గింది కానీ, అతని నిద్ర సామర్థ్యం తిరిగి రాలేదు. ఆరు దశాబ్దాల క్రితం అధిక జ్వరం తర్వాత తన నిద్రలేమి ప్రారంభమైందని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్గోక్ గుర్తుచేసుకున్నాడు. ‘నేను మందులు తీసుకున్నాను, ఇంటి చిట్కాలు ప్రయత్నించాను, నిద్రపోవడానికి మద్యం కూడా తాగాను, కానీ ఏదీ పని చేయలేదు.‘ అంటూ చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు పొరుగువారు కూడా ఇన్ని సంవత్సరాలలో అతను ఎప్పుడూ నిద్రపోవడం తాము చూడలేదని చెబుతున్నారు.అయినప్పటికీ, న్గోక్ అసాధారణంగా అందరిలాగే చురుకైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతిరోజూ, అతను తన పొలానికి వెళ్తాడు, భారీ బరువులు ఎత్తుతాడు, రైస్ వైన్ తయారు చేస్తాడు పొరుగువారితో చాట్ చేస్తాడు. మనుగడ కు మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనదని భావించే ప్రపంచంలో, అతని కథ మానవ జీవశాస్త్రం గురించి సైన్స్ మనకు చెప్పే ప్రతిదానినీ సవాలు చేస్తుంది.మీడియా నివేదికల ప్రకారం, పలువురు వైద్యులు ఆ గ్రామాన్ని సందర్శించి న్గోక్ ను చాలాసార్లు పరీక్షించారు అతనికి ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు లేవని కనుగొన్నారు. అతని రక్తపోటు, గుండె. మెదడు అన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. అదే వైద్య నిపుణులను కలవరపెడుతుంది, ఎందుకంటే జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి అంతర్గత అవయవాల పనితీరు కోసం శరీరం విశ్రాంతిపై ఆధారపడటం వల్ల మానవులు నిద్ర లేకుండా కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేరని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.గత 2023లో, అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్సీక న్గోక్ ఇంటికి వెళ్లాడు. అతనితో గడిపిన బిన్సీ్క, న్గోక్ కార్యకలాపాలను నిశితంగా గమనించాడు తన పొలాలకు వెళ్లి పనిచేయడం, రైస్ వైన్ తయారు చేయడం.. అవన్నీ అయిపోయాక అతను నిశ్శబ్దంగా, పూర్తిగా మేల్కొని కూర్చోవడం చూశాడు. పెద్ద మొత్తంలో మద్యం సేవించిన తర్వాత న్గోక్ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి పొంది ఉండవచ్చని బిన్సీక తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు, అయితే ఇది వైద్యపరంగా ఎప్పుడూ నిర్ధారితం కాలేదు. విచిత్రమేమింటే... న్గోక్ రోజువారీ అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవి కావు...పైగా ఆందోళనకరంగా ఉంటాయి. డ్రూ బిన్సీక వీడియో ప్రకారం, అతను దాదాపు రోజుకు అర లీటరు రైస్ వైన్ తీసుకుంటాడు, దాదాపు 70 సిగరెట్లు తాగుతాడు. అయినప్పటికీ అతను శారీరకంగా చురుకుగా ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడుసాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకునే గ్రామంలోని ఇతరుల మాదిరిగా కాకుండా, తన రాత్రులను పనిలో లేదా ఆలోచనలో న్గోక్ గడుపుతాడని స్థానికులు చెబుతున్నారు. అతని ఇలాంటి పరిస్థితి అతన్ని ఇప్పుడు ప్రపంచ ఉత్సుకతగా మార్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్గోక్ కథ, విస్మయం, ప్రశంస సానుభూతి మిశ్రమాన్ని రేకెత్తించింది. కొంతమంది ఆన్లైన్ వినియోగదారులు అతని బలం, ఉత్పాదకతను ప్రశంసిస్తూ, ‘నేను చనిపోయినప్పుడు నిద్రపోతాను‘ అనే నానుడిని న్గోక్ మరొక స్థాయికి తీసుకెళ్లాడని చమత్కరించారు. మరికొందరు అతని పరిస్థితిని యుద్ధ గాయం తాలూకు శాశ్వత ప్రభావంగా, విషాదకరమైన జ్ఞాపకంగా పరిగణించారు, వియత్నాం యుద్ధం ప్రసాదించిన బాధాకరమైన ఒత్తిడికి అతని నిద్రలేమికి ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘ఇది యుద్ధం తాలూకు శాశ్వత ప్రభావాలను చూపిస్తుంది అనుభవజ్ఞులు ఏమి అనుభవిస్తారో వెలుగులోకి తెస్తుంది. ఈ వ్యక్తి తన నిద్రలేని సంవత్సరాలలో అద్భుతమైన పని చేశాడు, కష్టపడి పనిచేస్తూ తన అద్భుతమైన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు(చదవండి: 'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...)) -
'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...
కూతురు కోసం ఏ తండ్రైనా దేన్నైనా త్యాగం చేస్తాడు..ఎంత కష్టమైనా భరిస్తాడు. తమ కంటిపాప కంటే తమేకేది ఎక్కువ కాదు అనేంత ప్రేమను చూపిస్తారు. కానీ ఈ నాన్నలా ఇంతలా ప్రేమించడం మాత్రం కష్టమే. అందరి నాన్నల కంటే ఈ తండ్రి ప్రేమ అంతకుమించి..అని చెప్పొచ్చు. ఇతడి కూతురి ప్రేమను చూడగానే ఆకాశమంత మూవీలోని ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. "ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా..ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా.. అమ్మరా..మేఘాల పల్లకి తెప్పిస్తా.. లోకాన్ని కొత్తగ చూపిస్తా.. వెన్నెలే తనపై కురిపిస్తా.." అంటూ సాగే పాట కళ్లముందు కదలాడుతుంది. ఆ సినిమాలో మాదిరిగానే ఈ తండ్రికి కూడా పై చదువుల కోస దూరంగా వెళ్తున్న కూతురిని విడిచిపెట్టి ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఆమె అక్కడ భోజనం విషయంలో ఇబ్బంది పడుతుందని తెలిసి..మొత్తం మకాం ఆమె వద్దకు మార్చేశాడు. కూతురు పక్కన లేనిదే జీవితం వృధా అని మొత్తం తన లైఫ్నే త్యాగం చేసేశాడు. మరి ఆ ఆసక్తికరమైన ఆ పేరెంట్ కథేంటో చూసేద్దామా..!చైనాకు చెందిన లీ బింగ్డ్ అనే టీనేజర్ జిలిన్ ప్రావిన్స్లో జిలిన్ నార్మల్ యూనివర్సిటీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. దాదాపు ఒక ఏడాది తర్వాత బింగ్డ్ తన యూనివర్సిటీ క్యాంటిన్లో భోజనం అస్సలు బాగుండటం లేదని తండ్రి లీతో చెప్పింది. తాను ఇంటి భోజనం చాలా మిస్సవ్వుతున్నానని వాపోయింది. అంతే ఆ తండ్రి బార్బెక్యూ రెస్టారెంట్లో చేస్తున్న ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసి..వంట మంచిగా చేయడం ఎలాగో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత కూతురు ఉండే యూనివర్సిటీ సమీపానికి తన మకాం మార్చేసి..అక్కడే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపన్ చేశాడు. మొదటి రోజు అతడు వండిన వంటకాలకు స్వలంగానే లాభం పొందాడు. అది తన కూమార్తె బింగ్డ్ ట్యూటర్గా సంపాదించే దాంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పొచ్చు. తండ్రి శ్రమను చూసి చలించిపోయిన ఆ కూతురు..తన కథను సోషల్మీడియాలో షేర్ చేసింది. అంతేగాదు తన తండ్రి శుభ్రమైన వంటకు ప్రాధాన్యత ఇస్తాడని, అతని అమ్మకాలు మరింత మెరుగుపడాలంటే తగిన సలహాలు ఇవ్వగలరు అని పోస్ట్లో జోడించింది. వెంటనే ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే గాక..తండ్రి ఫుడ్స్టాల్ వద్ద జనాలు క్యూలో నిలబడేలా రద్దీగా మారేందుకు దారితీసింది. కొత్తమంది కస్టమర్లు ఆమె తండ్రి వ్యాపారానికి మద్దతిచ్చేలా మరిన్ని ఆర్డర్లు కోరారు. అంతేగాదు ఆ తండ్రికి కూతురుపై ఉన్న అచంచలమైన ప్రేమకు ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు కూడా.లాభం కంటే కూతుర చెంత చాలు..స్టాల్ రద్దీగా మారిపోవడంతో లీ తన తండ్రికి సహాయం చేయడం ప్రారంభించింది. గత నెలలో స్టాల్ నడుపుతున్నప్పుడూ చాలాచలిగా అనిపించిందని, కానీ ఇప్పుడూ కస్టమర్ల తాకిడితో అది వెచ్చగా మారిపోయిందని చమత్కరిస్తోంది లీ. తన తండ్రి పెద్దపెద్ద లాభాలనేమి ఆశించడం లేదని, కేవలం తన కూతురుకి దగ్గరగా జీవించాలన్నదే తన ఆశ అని వివరించింది. తన తల్లి కొన్నేళ్ల క్రితమే లుకేమియాతో మరణించిందని, దాంతో తాము ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ప్రేమను పెంచేసుకున్నామని బింగ్డ్ చెప్పుకొచ్చింది. చాలామంది నా తండ్రి లీ ప్రేమను చాలా గొప్పగా అభివర్ణిస్తున్నప్పటికీ..నాకు మాత్రం ఆయనప్రేమ సూర్యుడి వలే వెచ్చని హాయిని అందిస్తుందని సంతోషభరితంగా చెబుతోంది కూతురు బింగ్డ్.(చదవండి: హాట్టాపిక్గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?) -
కూతురి కలను నిజం చేసిన నాన్న!
పిల్లలకు ప్రేమ పంచడంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. బిడ్డలను కంటిరెప్పలా సాకడంతో పాటు, వారి ఆనందం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. పిల్లల కళ్లలో సంతోషం చూడటానికి ఎన్ని ఇబ్బందులనైనా పంటి బిగువున భరిస్తారు. తన గారాలపట్టి ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.అందరి లాగే బచ్చు చౌదరికి తన కుటుంబమే ప్రపంచం. ముఖ్యంగా కూతురంటే అతడికి ఎనలేని ప్రేమ ఆమె ఏది అడిగినా కాదనడు. అలాగనీ అతడేమి పెద్ద జమీందారు కాదు. అతడో చాయ్ వాలా. పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లా (Midnapore District) మౌలా గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం స్కూటీ కొనిపెట్టమని తన కూతురు సుష్మ అడిగింది. అంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బచ్చుకు బండి కొనడం అంటే కష్టమే అనిపించింది. కానీ కూతురు సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు.బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రతి రోజు తాను సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించాడు. టీ అమ్మి సంపాదించిన డబ్బు నుంచి రోజూ కొన్ని 10 రూపాయల నాణేలను పక్కన పెట్టేవాడు. వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసేవాడు. అతడు ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేశాడు. నాణేలతో డబ్బా నిండిపోవడంతో ఇటీవల దగ్గరలోని టూవీలర్ షోరూమ్కు వెళ్లాడు.రూ. 69 వేల నాణేలు!వెంటనే వెళ్లి నాణేలతో కూడిన పెద్ద డబ్బాను షోరూమ్కు తెచ్చాడు. డబ్బాలోని నాణేలను నేల మీద పోయగానే... అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. నాణేలతో పాటు కొన్ని నోట్లను కూడా బచ్చు పొదుపు చేశాడు. వీటన్నింటిని 8 మంది రెండున్నర గంటల పాటు లెక్కించారు. డబ్బాలోని నాణేలన్ని కలిపి రూ. 69 వేలుగా లెక్క తేలింది. నోట్ల రూపంలో కూడబెట్టింది కూడా కలుపుకుంటే లక్ష రూపాయలు అయ్యాయి. మరో విశేషం ఏంటంటే బచ్చు చౌదరి కూతురు సుష్మ కూడా రూ. 10 వేలు పొదుపు చేసింది.ఆశ్చర్యపోయాంషోరూమ్ ఉద్యోగి అరిందమ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ''బచ్చు చౌదరి మా దగ్గరికి వచ్చి మొదట స్కూటర్ల ధరల గురించి అడిగారు. నాణేలు తీసుకుంటారా అని అడిగితే, తీసుకుంటామని చెప్పాం. డబ్బా నిండా నాణేలు తెచ్చి మా ముందు పోయడంతో ఆశ్చర్యపోయాం. మా కెరీర్లో ఇలాంటి అనుభవం మాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. కూతురి సంతోషం కోసం అతడు చూపించిన అంకిత భావం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింద''ని అన్నారు.చదవండి: చిన్న కారణాలు.. పెద్ద భయాలుమా కల నెరవేరిందితన కూతురి కోసం స్కూటర్ కొనడం చాలా సంతోషంగా ఉందని బచ్చు చౌదరి తెలిపారు. "నా కూతురు చాలా సంవత్సరాల క్రితం స్కూటర్ (Scooter) అడిగింది. అప్పుడు నేను దానిని కొనలేకపోయాను. కాబట్టి, నేను నాకు వీలైనంత పొదుపు చేయడం ప్రారంభించాను. దీనికి సమయం పట్టింది, కానీ నేను ఆమె కోసం దాన్ని చేశాను. స్కూటర్ కొనుక్కోవాలనేది నా కూతురు కల మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మా కల సాకారమయిందని" బచ్చు తెలిపారు. -
అదిగో అదే భారత్లో అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం..!
భారత్ని సందర్శించిన జర్మన్ వ్లాగర్ అలెక్స్ వెల్డర్ ఇప్పటివరకు తాను చూసిన వాటిలో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అంటూ దాని గురించి వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాదు..నెట్టింట ఆ ప్రదేశం హాట్టాపిక్గా మారింది. జర్మన్ వ్లాగర్ అలెక్స్ భారతదేశంలో తాను చూసిన అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం ఇదేనని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియోలో తాను దక్షిణ గోవాని సందర్శించిన అనుభవాన్ని పంచుకున్నాడు. "బహుశా భారతదేశంలో నేను చూసిన వాటిల్లో ఇదే అత్యంత పరిశుభ్రమైన ప్రదేశం అయ్యి ఉండొచ్చు. కచ్చితంగా ఈ గోవా సూపర్ పార్టీ హాట్ స్పాట్ అవుతుంది. ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అయినా ఇక్కడ చెత్త ఉంటుదని అంచనవేయలేంద. ఈ దక్షిణ గోవా చుట్టూ తిరxగా ఎక్కడా.. చిన్న చెత్త ముక్క దొరకలేదు అంటూ ఆశ్చర్యపోయాడు. తాను అక్కడ ముగ్గురు స్థానికులను చూశానని, వాళ్లు ఆకాశం వైపు చూసి నవ్వుతూ ఉండటం చూశానని అన్నాడు. ఈ ప్రదేశం అందానికి నిజంగా మంత్ర ముగ్దుడుని అయిపోయా..ఇది నిజంగా యూరప్లా అనిపిస్తోంది. కచ్చితంగా దీన్ని చూడాగానే ఎవ్వరైనా..ఉష్ణమండల దేశమైన భారత్ అని అనుకోరు. ఇక్కడ ఎక్కడ మీకు ఒక్క చెత్త డబ్బ కనిపించదు. ఈ ప్రదేశానని చూసి కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఇది నిజంగా అందంగా ఉంది అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు అలెక్స్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ప్రదేశం ఎప్పటికీ అలానే ఉండాలి అని ఆశిస్తున్నాం, కోరుకుంటుంన్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Alexander Welder (@alexweldertravels) (చదవండి: అతిపెద్ద సాలీడు గూడు..ఏకంగా లక్షకు పైగా సాలెపురుగుల నైపుణ్యం..!) -
అంతరిక్షంలో వంట.. అదెలా!
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం. ఏ చిన్నపాటి నిప్పురవ్వ అంటుకున్నా రోదసీలోనే అంతా అంటుకుని అగ్నిగోళంగా మండిపోయే అత్యంత సున్నిత ప్రాంతం. అలాంటి అంతరిక్ష కేంద్రంలోనూ వేడివేడి చికెన్ వింగ్స్ను అది కూడా ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ను వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోని ఓ ప్రైవేట్ స్పేస్స్టేషన్లో ఇలా ఓవెన్లో చికెన్ను వండుకుని తినడం ఇదే తొలిసారి. అసలు అంతరిక్ష కేంద్రంలో వంటచేయడం కూడా ఇదే ప్రప్రథమం. తాము అభివృద్ధి చేసిన స్పేస్ కిచెన్ సాంకేతికతను చైనా ఇలా విజయవంతంగా పరీక్షించింది. పరీక్షించడమేకాదు పనిలోపనిగా ఆ వేడివేడి చికెన్ను వ్యోమగాములంతా తిని భారరహిత స్థితిలో మాంసాహార వంటకంలోని మజాను ఆస్వాదించారు. ఇందుకు తియాంగాంగ్ స్పేస్స్టేషన్ ( Tiangong Space Station) వేదికైంది. కనీసం 500 సార్లు భూమి మీద విస్తృతస్థాయిలో పరీక్షించాక దానిని తియాంగాంగ్ స్పేస్స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా ఆహారం దిశగా పయనం వ్యోమనౌక ద్వారా తీసుకొచ్చిన అతిశీతల ఆహార పదార్థాలకు మళ్లీ వేడి చేసి తినడానికి బదులుగా అప్పుడే వండిన వేడివేడి ఆహారం తినాలనే ఆశ నుంచి హాట్–ఎయిర్ ఓవెన్ ఆలోచన పుట్టుకొచ్చింది. ఓవెన్లో పెట్టే వస్తువులను పట్టి ఉంచే పట్టీ, వేడిచేసే మెష్, ఉడికించే ట్రే, సమంగా కాల్చే రోటేటింగ్ బుట్టలతో వినూత్న ఓవెన్ను తయారుచేశారు. ‘‘ఓవెన్ గరిష్ట ఉష్ణోగ్రతను 100 డిగ్రీ సెల్సియస్ నుంచి 190 డిగ్రీ సెల్సియస్కు పెంచాం. దీంతో చికెన్, మటన్ వంటి పదార్థాలను అప్పటికప్పుడు వేడివేడిగా తినొచ్చు’’అని చైనా శాస్త్రవేత్త, చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్, ట్రైనింగ్ సెంటర్లో పరిశోధకుడు యువాన్ యోంగ్ చెప్పారు. ఈ ఓవెన్ను ఇటీవల షెంజువాన్–21 వ్యోమనౌక ద్వారా భూమి నుంచి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తాజాగా దీనిని చికెన్, మటన్ ముక్కలను బేక్ చేసి పరీక్షించారు. చికెన్ వింగ్స్ను చైనా షెంజువాన్–21, షెంజువాన్–22ల వ్యోమగాములు (astronauts) ఎంచక్కా ఆరగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.పొగరాకుండా ఏర్పాట్లు భారరహిత స్థితిలో పొగ కమ్మితే అది ఎప్పటికీ బయటకు పోదు. దాంతో వ్యోమగాముల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వంటలను వండినప్పుడు పొగ వెలువడకుండా ఓవెన్లో ప్రత్యేక ఏర్పాటుచేశారు. బహుళ పొరల ఫిల్టర్లను దానిలో అమర్చారు. అత్యధిక వేడిమిని ఇచ్చే రసాయన చర్యలు, సాంకేతికత మేళవింపుతో ఓవెన్ను తయారుచేశారు. భారరహిత స్థితిలోనూ అది సవ్యంగా పనిచేయడం విశేషం. అంతరిక్ష కేంద్రంలోనూ వాడగల ప్రపంచంలోనే మొట్టమొదటి ఓవెన్ ఇదేనని ఆస్ట్రోనాట్స్ సిస్టమ్లో డెప్యూటీ చీఫ్ డిజైనర్ లూ వీబో చెప్పారు. మొక్కజొన్న పొత్తులు వేయించుకునేందుకూ ఇందులో ఏర్పాటు ఉంది. కేక్ (Cake) సైతం తయారు చేసుకోవచ్చు.చదవండి: షట్డౌన్ తెచ్చిన ఆహార సంక్షోభంతయాంగాంగ్ స్పేస్స్టేషన్లో ఉన్నప్పుడు ఏదైనా చైనా జాతీయ ప్రత్యేక దినోత్సవాలు వచ్చినప్పుడు వేడుకల్లో భాగంగా ఈ వంటకాలను ఇందులో తయారుచేయొచ్చు. దీర్ఘకాల అంతరిక్ష ప్రాజెక్టుల్లో వ్యోమగాములకు రుచికరమైన ఆహారం అందించే లక్ష్యంతో ఈ ఓవెన్ను తయారుచేసినట్లు చైనా తెలిపింది. స్పేస్ బార్బెక్యూతో పసందైన వంటకాలను తినబోతున్నామని చైనా వ్యోమగాములు చెప్పారు. గతంలో రష్యా, అమెరికా, చైనా సంయుక్తంగా నిర్మించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చాక్లెట్చిప్ కుకీలను బేక్ చేసినా అందుకు చాలా సమయం పట్టింది. కానీ చైనా వ్యోమగాములు కేవలం 28 నిమిషాల్లోనే చికెన్ వింగ్స్ను సంపూర్ణంగా ఉడికించి శెభాష్ అనిపించుకున్నారు. మటన్ ముక్కలనూ బేక్ చేశారు. -
'ఇంత స్వేచ్ఛగా ఎప్పుడూ అనిపించలేదు'!
మన మాతృగడ్డపై చాలామంది విదేశీయలు పలు విధాలుగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక్కడ తన మనసుకి హత్తుకున్న వాటి గురించి కూడా మాట్లాడారు. తాజాగా ఆ కోవలోకి జర్మన్ మోటార్ సైకిల్ రైడర్ చేరిపోయాడు. ఆయన కూడా భారతదేశంలో పర్యటించేటప్పుడూ తనకు కలిగిన అనుభూతిని పంచుకోవడమే కాదు, ఇతర దేశాలతో పోల్చుతూ ఇక్కడే లభించే ఆనందం మాటలకందనిది అంటూ తన అనుభూతిని సోషల్ మీడియలో షేర్ చేసుకున్నాడు.జర్మన్కి చెందిన మోటార్ రైడర్ మార్క్ ట్రావెల్స్గా పేరుగాంచిన మార్కస్ ఎంగెల్ భారతదేశాన్ని బెస్ టూరిస్ట్ ప్లేస్గా అభివర్ణిస్తూ..ఈ మాతృగడ్డపై తన అనుభవాన్ని షేర్ చేశారు. తన పర్యటనలో భారతదేశం అంతటా ప్రయాణించేటప్పుడూ..ప్రపంచంలో మరెక్కడా లేనంత స్వేచ్ఛను అనుభవించానంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో భారతదేశం గురించి ఇంతకముందు చెప్పాను..మళ్లీ ఇప్పుడూ చెబుతాను. నేను ఇప్పటివరకు చాలా దేశాల్లో పర్యటించాను, కానీ భారతదేశంలో పొందిన స్వేచ్ఛ మరెక్కడ పొందలేదు. ఈ ప్రదేశం నాకెంతో ఇష్టమైనది అని వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, మార్కస్ ఎంగెల్ సాహసయాత్రలు, సుదూర మోటార్ సైకిల్ పర్యటనలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ నేపథ్యంలోనే భారత్ వచ్చి కొన్నాళ్లు ఇక్కడ గడిపాడు కూడా. అతను కేవలం ద్విచక్ర వాహనంపై ఆ ప్రాంతంలోని సంస్కృతిని అన్వేషిస్తాడు. ఇక మార్కస్ వీడియోలో తాను మళ్లీ కచ్చితంగా భారత్కి తిరిగి వస్తానని చెప్పాడు. ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టం. చాలాకాలం ఇక్కడ ఉన్నా. అయినా నాకు ఇక్కడ ఉండేలా ఐదేళ్ల వీసా ఉంది. కాబట్టి మళ్లీ అవకాశం వచ్చినప్పుడల్లా భారత్లో వాలిపోతా. ఇక్కడ పర్యటిస్తే కలిగే ఫీల్ వేరేలెవెల్. అని వీడియోని ముగించాడు. ఈ వీడియో నెట్టింట రెండు లక్షలు పైనే వ్యూస్, వేలల్లో లైక్లు వచ్చాయి. భారతదేశం అద్దం లాంటిదని..ఇక్కడ తన అందమైన గమ్యస్థానాలను చూపిస్తూ..తనలో కలిపేసుకుంటుంది. అలానే మిమ్మల్ని వశపరుచుకుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, 15 సంవత్సరాలకు పైగా ప్రొఫెషనల్ సంగీతకారుడిగా పనిచేసిన తర్వాత మార్క్ 2020లో పూర్తి సమయం మోటో-వ్లాగర్గా మారాడు. View this post on Instagram A post shared by Marc Travels (@marc.travels.blog)(చదవండి: వండర్ బర్డ్స్..థండర్ కిడ్స్..) -
జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి
ముగ్గురు కళాశాల డ్రాపౌట్లు 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకి ప్రవేశించారు. తద్వారా మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ రికార్డును చెరిపేశారు. ఫోర్బ్స్ ప్రకారం, మెర్కోర్ (Mercor )అనే AI-ఆధారిత రిక్రూటింగ్స్టార్టప్ వ్యవస్థాపకులైన ముగ్గురుస్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్, సూర్య మిధా,ప్రపంచంలోనే అతి చిన్న బిలియనీర్లుగా నిలిచారు. ఈ ముగ్గురూ, స్వయంకృషితో బిలయనీర్లుగా ఎదిగారు. వీరిలో హిరేమత్ భారతీయసంతతికి చెందినవాడు కావడం విశేషం. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మెర్కోర్ కంపెనీ ప్రస్తుత విలువ రూ. 88,560.68 కోట్లకు (10 బిలియన్ డాలర్లు)గా ఉంది. 350 మిలియన్ల డాలర్ల తాజా నిధులతో కంపెనీ వాల్యుయేషన్ ఈ స్థాయికి ఎగిసింది. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన సెల్ఫ్-మేడ్ బిలియనీర్లుగా ఈ ముగ్గురూ నిలిచారు. మెర్కోర్ సీఈవో బ్రెండన్ ఫుడీ, CTO ఆదర్శ్ హిరేమత్ , బోర్డు చైర్మన్ సూర్య మిధా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు.ఈ ముగ్గురి ప్రయాణంకాలిఫోర్నియాలోని శాన్జోస్లోని బెల్లార్మైన్ కాలేజ్ ప్రిపరేటరీ బోయిస్ స్కూలు నుంచే మొదలైంది.అక్కడ డిబేట్ టీమ్లో టాప్ మెంబర్స్గా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంవత్సరంలో మూడు మేజర్ పాలసీ డిబేట్ టోర్నమెంట్స్ గెలుచు కున్న తొలి వ్యక్తులు.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న సమయంలో మెర్కోర్పై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి చదువును విడిచి పెట్టాల్సి వచ్చింది. మెర్కోర్లో పని చేయకపోతే, రెండు నెలల క్రితమే పట్టభద్రుడయ్యేవాడినని, ఇంతలోనే తన జీవితం 180-డిగ్రీల యు-టర్న్ తీసుకుందని పేర్కొన్నాడు. అలాగే సూర్య మిధా జార్జ్టౌన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం చదువుతున్న సమయంలోనే బ్రెండన్ ఫుడీని కలిశాడు. దీంతో హిరేమత్తో పాటు మిధా, ఫుడీ ఇద్దరూ తమ చదువును వదిలేశారు. అలా వారి అభిరుచులు కలిసి, నైపుణ్యాన్ని మేళవించి మెర్కోర్ నాంది పలికింది. ప్రపంచ రికార్డుకు దారి తీసింది. -
నో ఫోటో షూట్, నో హగ్స్ : వరుడి10 డిమాండ్లు
‘పెళ్లి చూసి చూడు..ఇల్లు కట్టి చూడు’ అనేది ఇప్పటికీ నూటికి నూరుపాళ్లు నిజం అనిపించే మాట. దీనికి ఇండియాలో కొనసాగుతున్న ట్రెండ్ మరింత ఆజ్యం పోస్తుంది. ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట అనేదిఒకప్పటి మాట. ఇవాల్టి పెళ్లి ళ్ల ట్రెండ్ దీన్ని దాటేసి మరింత ముందుకు పోయింది. లక్షలకు, లక్షలకు కుమ్మరించి, హంగూ ఆర్భాటాలతో నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్, షూట్లు, ఖరీదైన బట్టలు, డైమండ్ నగలు, ఖరీదైన రిసార్ట్లు, పెళ్లి పందిటిలో స్క్రీన్లు,డ్రోన్ కెమెరాలు, ఇక భోజనాల సంగతి సరేసరి ఇంత తతంగం లేనిది ఏ మధ్య తరగతి ఇంట్లో పెళ్లి జరగడంలేదు. తాజాగా ఒక పెళ్లి కొడుకు 10 డిమాండ్లు మాత్రం సంచలనంగా నిలిచాయి. అవేంటో చూద్దామా..అసలే రానున్నది అంతా పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఇప్పటి తరం లో కొంత మార్పు వచ్చినప్పటికీ గిప్ట్లు, కానుకలు పేరుతో తెరవెనుక, ఒప్పందాలు, భారీ ఎత్తు లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి. అబ్బాయి తరపు కుటుంబం గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు అమ్మాయి తరబు కుటుంబాలు శక్తికిమించి ఖర్చు చేస్తాయి, తమ కుమార్తె సంతోషంగా ఉంటుంది కదా అని అప్పు చేయడానికైనా వెనుకాడరు. కానీ ఒక వరుడు మాత్రం కట్నం వద్దు కానీ 10 కోరికలు అంటూ షేర్ చేసిన డిమాండ్లు అందర్నీ ఆలోచింప చేస్తున్నాయి. 10 డిమాండ్లు ఏంటంటే..ప్రీ-వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.అతని వధువు లెహంగాకు బదులుగా చీర ధరించాలిపెళ్లిలో బిగ్గరగా, అసభ్యకరమైన సంగీతానికి బదులుగా, వాయిద్య సంగీతం ఉండాలి.దండలు మార్చుకునే సమయంలో ప్రశాంతంగా తామిద్దరమే ఉండాలి. దండలు మార్చుకునేటపుడు ఎవరైనా వరుడ్నిగానీ, వధువును గానీ పైకి ఎత్తడం లాంటి చేస్తే..తక్షణం వాళ్లు వేదికను వీడాల్సి ఉంటుంది.పెళ్లికి సంబంధించి ఇతర తంతులో కూడా ఫోటోగ్రాఫర్లు ,వీడియోగ్రాఫర్లు జోక్యం అస్సలు ఉండకూడదు.వేడుక ప్రారంభమైన తర్వాత పూజారిని అస్సలు ఎవరూ అడ్డుకోకూడదు.తాను , తన వధువు ఫోటోగ్రాఫర్లు అడిగి పిచ్చి పిచ్చి పోజులు ఇవ్వబోం.వివాహం పగటిపూట జరగాలి. సాయంత్రం నాటికి బధాయి(వధువును అత్తారింటికి సాగనంపే వేడుక) అన్ని సర్దుకోవాలి. తద్వారా అర్థరాత్రి కార్యక్రమాలు 'అతిథులకు అసౌకర్యం' లాంటివి ఉండవు.పెళ్లి తరువాత, వధూవరులు హగ్గులు, కిస్లు ఇలాంటివేవీ ఉండకూడదు.అంతేకాదు ఇది అగ్ని దేవుడి సాక్షిగా జరిగే పవిత్ర పవిత్ర వివాహం, సినిమా షూట్ కాదు."నెటిజన్లు ఏమన్నారంటే..!ఈ డిమాండ్లు కొందరికి న్యాయంగా అనిపించినప్పటికీ, మరికొందరు మాత్రం వీటిని తోసిపుచ్చారు. కొంతమంది అతను చెప్పింది సహేతుకమే అన్నారు. అయితే కట్నం తీసుకోకపోవడం అక్షరాలా చట్ట విరుద్ధం.. అదేదో నువ్వు గొప్పవ్యక్తిలా ఫోజులివ్వనక్కర లేదు అని ఒకరు, వివాహంలో సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు బ్రో అని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. పెళ్లి కూతురు పెళ్లిలో ఎలాంటి దుస్తులు ధరించాలో, పెళ్లి కొడుకు ఎందుకు డిసైడ్ చేయాలి అని కొందరు విమర్శించారు. "ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాకే అసహనానికి లోనైతే అతను పెళ్లి చేసుకుని ఇతరుల జీవితాలను పాడుచేయకూడదు ఒక యూజర్ అన్నారు. మరికొందరు అతన్ని సమర్థిస్తూ, "ఇది చాలా బాగుంది !!! వివాహం అనేది ఒక పవిత్ర బంధం, ఇన్స్టాగ్రామ్ లైక్ల కోసం కాదు !!!" అని అన్నారు. -
సేఫ్టి షర్ట్..!
‘అన్న షర్టేస్తే మాస్!’ మాత్రమే కాదు, ఇప్పుడు అన్న ఈ షర్టేస్తే సేఫ్ కూడా! అవును, జర్మన్ పరిశోధకులు సృష్టించిన ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్తో తయారైన షర్ట్ చూడ్డానికి సాధారణ షర్ట్లాగే ఉంటుంది. కాని, ఇందులో దాగి ఉన్న మ్యాజిక్ మాత్రం అదిరిపోతుంది! ఈ ఫ్యాబ్రిక్లోని మాలిక్యూల్స్ను వారు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ చూడ్డానికి మృదువుగా, ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. కాని, దానిపై ఒక్కసారిగా బలమైన దెబ్బ పడితే, వెంటనే గట్టి కవచంలా మారిపోతుంది. అచ్చం, క్షణాల్లో మారే సాఫ్ట్ షర్ట్ బుల్లెట్ ప్రూఫ్లాగా. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల మాదిరి రక్షణ ఇస్తూనే, చాలా తేలికగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికీ సౌకర్యంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్లలో ప్రమాదాలు, క్రీడల్లో గాయాలు, వాహన ప్రమాదాలు వంటి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వారికి ఉపయోగపడేలా దీనిని తయారు చేశారట శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో ఈ షర్ట్ ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు, సేఫ్టీ వేర్ కూడా! (చదవండి: Railway TTE of Rs 50 bribery charge: 44 ఏళ్ల నాటి లంచం కేసు..! చనిపోయినే కొన్నేళ్లకు క్లీన్ చిట్) -
అందరి నోట.. ‘అమ్మ పాట’, ఏకంగా పదికోట్లు
సాక్షి, సిటీబ్యూరో: ‘అమ్మ పాటే.. జోల పాట.. అమృతానికన్న తియ్యనంటా’.. అంటూ సాగే అమ్మ పాట సోషల్ మీడియాలను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ప్రతి 2, 3 ఏళ్లకోసారి ఇలాంటి ఒక పాట వైరల్ అవ్వడం మామూలే.. అయితే అలా వచ్చిన పాటల్లో ఎక్కువ కాలం అందరినోట.. ‘అమ్మ పాట’ మెదిలింది.. అంతేకాదు.. అందరి మనసుల్లో అల్లుకుపోయింది. అమ్మ ప్రేమలోని కమ్మదనం, జానపదంలోని నాటుదనానికి అధునాతన సంగీతాన్ని జోడించి ఈ తరం సంగీత ప్రియులను అత్యద్భుతంగా అలరించింది. మిట్టపల్లి సురేందర్ రచించిన ‘అమ్మ పాట’ను గాయని జాహ్నవి శంకర్ ఆలపించారు. ఈ తెలుగు పాట దేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారందరికీ చేరువైంది. ఈ పాట 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని చేరిన నేపథ్యంలో ఫిల్మ్నగర్లోని శ్రీకాంత్ షూటింగ్ హౌస్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. చదవండి: Happy Birthday to Nita Ambani దాతగా, వ్యాపారవేత్తగా ఆమెకు ఆమే సాటి!ఇప్పటికీ వినిపిస్తోంది.. అమ్మపాట 100 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా జాహ్నవి శంకర్ తన సంతోషాన్ని పంచుకున్నారు.. ‘అమ్మ పాట’ కేవలం ఒక పాట కాదు.. ఇదొక అద్భుతమైన అనుభూతని, ప్రతి తల్లికీ అంకితం అన్నారు. తనను, తన పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విడుదలైన ఈ పాట.. ఈ రోజుకీ అనేక మంది నోట వినిపిస్తోందన్నారు. ఈ సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా నటి శ్వేతా వర్మ హాజరై జాహ్నవిని అభినందించారు. అమ్మ ప్రేమను మరోసారి ఈ పాట గుర్తు చేసిందని శ్వేతా అన్నారు. ఇందులో సోషల్ మీడియా క్రియేటర్లు, అభిమానులు, ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఉల్లి, తొక్కే కదా, అని తీసి వాడేస్తున్నారా? -
ఆమె ఇల్లే ఓ ల్యాండ్ మార్క్!
ఎవరికైనా ఇంటి అడ్రస్ చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మార్క్ చెబుతాం తేలిగ్గా కనుక్కోవడానికి! కానీ ఇల్లే అలా ల్యాండ్మార్క్ అయిన అబ్బురం గురించి విన్నారా? ఆ ఘనత క్రికెటర్ దీప్తి శర్మకు దక్కుతుంది. ఆమె ఇంటి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తి శర్మ మార్గ్: సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ కనపడుతుంది. ఇప్పుడు ఎందుకీ ప్రస్తావన అంటే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీలే! ఆల్రౌండర్గా అందులో ఆమె చూపిస్తున్న ప్రతిభనే సందర్భంగా దీప్తి పరిచయం.. ఆగ్రాలోని షాగంజ్, అవద్పురి కాలనీలో పుట్టి పెరిగారు దీప్తి. చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్ బ్యాట్తో ఆగ్రా వీధులను చుట్టారు. తన స్పిన్ బౌలింగ్తో ఆ ఊరి దారులను సుపరిచితం చేసుకున్నారు. క్రికెటర్ కావాలన్న ఆ దీక్షే ఆమెను ఈ రోజు స్టేడియంలో నిలబెట్టింది. వరల్డ్ కప్ టీమ్లో భాగస్వామిని చేసింది.అన్నయ్యే తొలి గురువుగా.. దీప్తికి క్రికెట్ మీద ఆసక్తి ఏర్పడింది అన్నయ్య సుమిత్ శర్మ క్రికెట్ ఆడటాన్ని చూసే. అన్నయ్యను అనుకరిస్తూ ఆమె క్రికెట్ ఆడేవారు. అది అన్నయ్య దృష్టిలో పడింది. క్రికెట్ అంటే దీప్తికున్న మక్కువనూ, ఆ ఆటలో ఆమె ప్రతిభనూ గమనించాడు. అంతే! చెల్లికి తొలి కోచ్గా మారాడు. ‘ఆడపిల్లకు క్రికెట్ ఏంటీ?’ అన్న బంధువుల మాటలకు తలొగ్గిన తల్లి .. చెల్లిని క్రికెట్ ఆడనీయకుండా ప్రయత్నించేది. కానీ అమ్మకు తెలియకుండా చెల్లిని గ్రౌండ్కి తీసుకెళ్లి క్రికెట్లోని మెలకువలను నేర్పించాడు అన్నయ్య. ఆట పట్ల ఆ పిల్లలకున్న నిబద్ధతను చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించడం మొదలుపెట్టారు. బంధువుల మాటను బేఖాతరు చేసి. చదువునూ సీరియస్గా తీసుకోవాలనే షరతు పెట్టారు. అలా ఆ ఇంటి పెద్దలు రెండిటి మధ్య సమన్వయం పాటించినట్లే దీప్తి కూడా చదువు, క్రికెట్ రెండిటినీ సమన్వయం చేసుకుంది. ప్రొఫెషనల్ క్రికెటర్గా..గ్రౌండ్లో అన్నాచెల్లెళ్ల క్రికెట్ కమిట్మెంట్ చూసిన స్థానిక కోచ్లు దీప్తికి తదుపరి శిక్షణనివ్వడానికి ముందుకు వచ్చారు. ఆ శిక్షణ ఆమె బ్యాటింగ్ను, బౌలింగ్ స్కిల్స్ను మెరుగుపరచాయి. దానికి తోడు గ్రౌండ్లో గంటల కొద్దీ ప్రాక్టీస్.. ఆమెను ఆల్రౌండర్గా మలిచింది. ఆ ప్రత్యేకతే నేషనల్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. పదిహేడేళ్ల వయసులోనే ఆమెకు ఇండియన్ విమెన్స్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించేలా చేసింది. ఆమె ప్రతిభ యూపీ వారియర్స్ (ఐపీఎల్)కి కెప్టెన్ను చేసింది. తర్వాత అంతర్జాతీయ క్రికెట్కూ చేర్చింది. సవాళ్లు.. విజయాలుగెలుపు దారి అంత సులువుగా ఉండదు. ఇందుకు దీప్తి క్రికెట్ ప్రయాణం మినహాయింపు కాదు. ఆడపిల్ల క్రికెట్ ఆడటం ఏంటీ అని పెదవి విరవడాల దగ్గర్నుంచి క్రికెట్లో లింగవివక్ష లాంటి నుదురు చిట్లింపుల వరకు ప్రతి చిన్నా పెద్దా సవాళ్లకు ఎదురొడ్డింది దీప్తి. అన్నిటినీ బౌల్డ్ చేసింది.. మూస ఆలోచనలను బౌండరీకి ఆవల నెట్టేసింది. ఒక్కమాటలో క్రికెట్లో ఆమె ప్రకంపనలు సృష్టించిందని చెప్పవచ్చు. వన్ డే ఇంటర్నేషనల్స్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు క్రికెట్లో ఉన్న పురుషాధిపత్యాన్నీ బ్రేక్ చేసింది. ఇలా ఆటలోని ఆమె శైలి, వ్యూహం, స్థిరత్వం అన్నీ మన దేశ మహిళా క్రికెట్ను ఉన్నత స్థితికి చేర్చాయి. అందుకే మన మహిళా క్రికెట్లో ఆమెను ఒక అద్భుతంగా అభివర్ణిస్తారు క్రికెట్ విశ్లేషకులు. చిన్న పట్టణం నుంచి పెద్ద కలతో విశాలమైన మైదానంలోకి అడుగుపెట్టి ఆ కలను ఆమె సాకారం చేసుకున్న తీరు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకూ స్ఫూర్తే! అందుకే దీప్తి శర్మ అర్జున అవార్డ్ అందుకున్న వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఆమె ఇంటిముందున్న రోడ్లను సువిశాలం చేసి.. ఆమె ఉంటున్న వీథికి మౌలిక సదుపాయాలను కల్పించారట. ఆ గౌరవంతోనే అవద్పురి వాసులు తమ వీథి ముందు ‘అర్జున అవార్డీ క్రికెటర్ దీప్తిశర్మ మార్గ్ : సర్వజన్ వికాస్ సమితి అవద్పురి మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది’ అనే ఆర్చ్ను ఏర్పాటు చేశారు. ‘జీవితంలో.. ఆటలో ఎక్కడైనా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే విజయం. ఆ చాలెంజెసే మనల్ని అద్భుతమైన ప్లేయర్గా తీర్చిదిద్దుతాయి ఆటలో అయినా.. జీవితంలో అయినా!– దీప్తి శర్మ -
ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు!
ఒకేసారి రెండు స్కిల్స్ని ప్రదర్శించడం మాటలు కాదు. అది కూడా సంగీతాన్ని, స్మిమ్మింగ్ని మిళితం చేస్తూ..ప్రదర్శించడానికి ఎంతో ప్రాక్టీస్ ఉండాల్సిందే. లేదంటే నీటిలో తేలుతూ..సంగీత వాయిద్యా పరికరాలను వాయించడం అంత సులువు కాదు. అదికూడా రివర్స్(బ్యాక్ స్టోక్)తో ఈత కొడుతూ వాయిద్యడం అంత ఈజీ కాదు. కానీ ఈ యువకుడు ఆ అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను సృష్టించింది బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మ్యూజిక్ టీచర్ రూబెన్ జాసన్ మచాడో. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కాలేజ్ స్విమ్మింగ్ పూల్లో 700 మీటర్లకు పైగా వెనుకకు(బ్యాక్స్ట్రోక్) ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ ఈ 30 ఏళ్ల సంగీతకారుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఉదయం పదిగంటలకు బ్యాక్స్ట్రోక్ ప్రదర్శనను ప్రారంభించి..150 మీటర్లు వరకు ఈత కొడితే చాలన్నుకున్నాడట. కానీ అనుహ్యంగా 700 మీటర్ల వరకు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(GBWR)లకెక్కాడు. ఈ మేరకు GBWR రూబెన్కి అధికారిక సర్టిఫికేట్ను అందజేసింది. తన తండ్రి సూచన మేరకు ఈ వినూత్న రికార్డుని ప్రయత్నించానని చెబుతున్నాడు రూబెన్ జాసన్ఎవరీ రూబెన్ జాసన్..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ సేఫ్టీ (NIWS) ధృవీకరించిన లైఫ్ సేవర్ రూబెన్కు హిందూస్తానీ, వెస్ట్రన్ ఫ్లూట్ రెండింటిలోనూ ప్రావీణ్యం ఉంది. అలాగే సాక్సోఫోన్, గిటార్, వంటి ఇతర వాయిద్యాలను వాయించడంలో దిట్ట. ఇక ఆయన బాలీవుడ్, శాండల్వుడ్, కోస్టల్ చిత్రాలలో పలు పాటలకు సంగీతం సమకూర్చారు. అంతేగాదు భారతదేశం అంతటా అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు కూడా. ఆయన 2016 వరల్డ్ కల్చర్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నాడు. ఇక రూబెన్కు ఈ ఫ్లూట్ ప్రదర్శనలో సుమారు 15 ఏళ్లకు పైగా అనుభవం ఉండటం విశేషం. (చదవండి: ఎవరీ అయ్యలసోమయూజుల లలిత..? 'స్పెషల్ కేసు'గా ఆ మినహాయింపు..) -
అమెజాన్లో రూ. 2 లక్షల ఫోన్ ఆర్డర్ : పార్సిల్ చూసి టెకీ షాక్
ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటున్న వారికి షాకింగ్ న్యూస్. దీపావళి సందర్భంగా బెంగళూరు టెక్నీషియన్కు ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే. దాదాపు రెండు లక్షల రూపాయల స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి ( టైల్స్) వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ద్వారా రూ.1.87 లక్షల విలువచేసే తనకెంతో ఇష్టమైన శామ్సంగ్ స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేశాడు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమానంద్. దీపావళి నాటికి ఫోన్ తన చేతిలో ఉండేలా అక్టోబర్ 14న అమెజాన్ యాప్లో స్మార్ట్ఫోన్ కోసం ఆర్డర్ ఆర్డర్ పెట్టాడు. క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. ఇక ఎపుడు డెలివరీ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూశాడు. తనకిష్టమైన ఫోన్రాలేదు సరికదా రాయి వెక్కిరించింది. అయితే అదృష్టం ఏమిటంటే అక్టోబర్ 19న డెలివరీ అయిన సీల్డ్ ప్యాకేజీని అన్బాక్స్ చేస్తున్న వీడియోను అతను రికార్డ్ చేశాడు. దీంతో అమెజాన్ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించింది.అలాగే దీనిపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశాడు మరియు తరువాత అధికారిక ఫిర్యాదు నమోదు చేయడానికి కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. FIR నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. "నేను రూ. 1.87 లక్షల విలువైన Samsung Galaxy Z Fold 7ని ఆర్డర్ చేశాను, కానీ నాకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్కు బదులుగా పాలరాయి రాయి వచ్చింది. దీంతో నా పండుగ ఉత్సాహం అంతా నాశనమైపోయింది. ఆన్లైన్లో, ముఖ్యంగా అమెజాన్లో షాపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ అనుభవం తీవ్ర నిరాశపరిచింది" అని ప్రేమానంద్ తన అనుభవాన్ని షేర్ చేశాడు.ఇదీ చదవండి: స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక్ స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్! -
కొడుకు కెరీర్ కోసం..ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే విస్తుపోతారు..!
పిల్లల కోసం కన్నవాళ్లు ఎంతైన కష్టపడతారు. ఏం చేయడానికైనా వెనుకాడరు. అలానే ఈ తండ్రి తను కుమారుడు కెరీర్ కోసం చేస్తున్న పని అందర్నీ ఆలోచింప చేసేలా ఉండటమే గాదు, అందరి హృదయాలను తాకింది. మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నించే ఎంబీఏ స్టూడెంట్స్కి ఇవి గొప్ప పాఠాలు.ఒక క్యాబ్డ్రైవర్ తన వాహనాన్ని మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్గా మార్చాడు. వాట్ అనుకోకండి అసలు కథలోకి వెళ్దాం. రోజువారిగా ప్రయాణీకులను డ్రాప్ చేసి వారితో సంభాషిస్తు..తన కుమారుడి కెరీర్కు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు. అదికూడా సాంకేతిక సాయంతో. దీన్ని గమనించిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ దివ్యుషి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆమె క్యాబ్ డ్రైవర్ సీటుకి అటాచ్ చేసిన క్యూర్ కోడ్ని చూసి డిజిటల్ చెల్లింపు అనుకుందామె. అదే విషయం డ్రైవర్ని అడగగా..ఇది చెల్లింపులకు సంబంధించినది కాదని, తన కొడుకు స్వయంగా తయారు చేసుకున్న రాప్ సంగీతాన్ని ప్రదర్శించే యూట్యూబ్ ఛానెల్ ప్రత్యక్ష లింక్ని సమాధానమిస్తాడు. ఎలాంటి అధికారిక విద్య నేపథ్యం లేకపోయినా..ఇతడి ఆలోచన తీరుకి దివ్యుషి ఇంప్రెస్ అయ్యింది. ప్రతి ప్రయాణికుడిని ఎక్కించుకుంటూ..దీని గురించి వాళ్లకి చెబుతూ..కుమారుడి డిజిటల్ కంటెంట్ని పైసా ఖర్చు లేకుండా ప్రమోట్ చేస్తున్నాడాయన అని రాసుకొచ్చింది పోస్ట్లో దివ్యుషి. పరిమితమైన వనరులతో తను చేయగలిగింది చేస్తున్న ఈ తండ్రి సాయం నెటిజన్లు హృదయాలను గెలుచుకుంది. అంతేగాదు స్థానిక ట్యాక్సీలు డిజిటల్ విజయానికి లాంచ్ప్యాడ్లా ఉంటాయని ఇప్పుడే తెలిసిందని మరికొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: మన వంటకం దోసె..బ్రిటిష్ చెఫ్ని ఎంతలా మార్చేసింది..!) -
చుక్క నెత్తురు రాలకుండా...
బ్రిటిష్ పార్లమెంటులో 1947 జూలై 5న ప్రవేశపెట్టిన ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ దరిమిలా భారత దేశంలో విభజన అల్లర్లు ఒక్కసారిగా ఊపందు కున్నాయి. మరోవైపు స్వతంత్రంగా ఉన్న 562 సంస్థానాలను సర్దార్ వల్ల భాయి పటేల్ ఆధ్వర్యంలో ‘స్టేట్స్ డిపార్ట్మెంట్’ ఒకటి ఏర్పాటుచేసి ‘ఇన్స్ట్రు మెంట్ ఆఫ్ యాక్సెషన్’ (విలీన ఒప్పందం) ద్వారా ఇండియాలో విలీనం చేయనారంభించారు. ఆగస్టు 15 నాటికి హైదరాబాద్, కశ్మీర్, జూనాగఢ్ మినహా మిగతా రాజ్యాలు చాలావరకు భారత దేశంలో కలసిపోయాయి. హైదరాబాదుతో పాటు భోపాల్,రాంపూర్, మహమూదాబాద్ వంటి 11 సంస్థానాలు ముస్లిం నవాబుల అధీనంలో ఉండేవి. కశ్మీరు, హైదరా బాదు అలీనంగా ఉండదలచుకుని విలీన పత్రంపైసంతకం చేయలేదు. కానీ, గుజరాత్లోని జూనాగఢ్ నవాబు మహబత్ ఖాన్ మాత్రం తన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపనున్నట్లు ఆగస్ట్ 14న వెల్లడించారు. జూనాగఢ్ దీవాన్ (ప్రధాని) షానవాజ్ భుట్టో (పాకిస్తాన్ మాజీ అధ్య క్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి), ముస్లిం లీగ్ నేత జిన్నాను సంప్రదిస్తూనే ఉన్నారు. వేరావలి పోర్టు నుండి పాకిస్తాన్ యుద్ధ సామగ్రి జూనాగఢ్ చేరు తున్న వార్తలు రావటంతో, ఇండియన్ నేవీ నౌకలను పర్యవేక్షణ కోసం అటు పంపా లనే పటేల్ సలహాను భారత నౌకాదళానికి చెందిన బ్రిటిష్ అధికారి అడ్మిరల్ జాన్ టి. హాల్ తోసిపుచ్చారు. ఆ తిరస్కారాన్ని పటేల్ సహించలేక పోయారు. నెహ్రూ తటస్థ వైఖరి కూడా ఆయనకు నచ్చలేదు. ‘24 గంటల్లో జూనాగఢ్కు భారత్ మిలిటరీ వెళ్లకుంటే, నేను కేబినెట్ నుండి తప్పుకుంటా’ అని ప్రధాని నెహ్రూకు అల్టిమేటం ఇచ్చారు. ఇంతలో హిందూ–ముస్లిం అల్లర్లు రాజుకున్నాయి. పటేల్ తీసుకున్న రాజ కీయ నిర్ణయంతో ఆ రోజు రాత్రి నెహ్రూ, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. మరుసటి రోజు జూనాగఢ్ సరిహద్దుప్రాంతాల్లోని భావనగర్, పోర్బందర్, నవానగర్లకు భారత సైన్యం, నౌకా బలగాలు చేరుకున్నాయి. ఇక ఏ క్షణంలోనైనా జూనాగఢ్ ప్యాలెస్ ముట్టడి జర గొచ్చు. పరిస్థితిని అర్థం చేసుకున్న నవాబ్ మహబత్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి 1947 అక్టోబరు 24న ప్రత్యేక విమానంలో కరాచీ వెళ్ళి పోయారు. నవంబరు 1న ఇండియన్ ఆర్మీ జూనాగఢ్ చేరుకుంది. తర్వాత దివాన్ షానవాజ్ భుట్టో రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని భారత్కు అప్పగించి పాకిస్తాన్ చేరుకున్నాడు. పటేల్ తీసుకున్న కఠిన నిర్ణయంతో ఏ రక్తపాతం లేకుండా జూనాగఢ్ భారత్లో కలిసిపోయింది. (జాన్ జూబ్రిజీకి రచన ‘డీత్రోన్’ ఆధారంగా)– జిల్లా గోవర్ధన్ ‘ మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై(రేపు (31 October) సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ) -
ఆద్యంతం సంగీతమే...! ఆ మ్యూజిక్ సిటీ ఏదంటే..
ఆ నగరంలో ప్రతీ వీధీ వీనుల విందు చేస్తుంది. ప్రతీ మదీ గానాలాపానలో మునిగి తేలుతుంది. నలు చెరగులా సంగీత ప్రదర్శనల సందడి, చరిత్ర సృష్టించిన సంగీతజ్ఞుల ఒరవడి కనిపించే ఏకైక నగరం అది. అందుకే దానిని మ్యూజిక్ సిటీగా పేర్కొంటారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు గత 2017లో యునెస్కో ద్వారా సంగీత నగరంగా అధికారికంగాఎంపికైంది, ఇంతకీ ఆ నగరం ఏది?ఆ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి?గొప్ప వారసత్వం...ఆస్ట్రియా రాజధాని నగరం.. వియన్నా సంగీత నగరంగా పేరొందింది. శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వంతో లోతైన సంబంధానికి ప్రసిద్ధి చెందిన వియన్నా, మొజార్ట్, బీతొవెన్, షుబెర్ట్, హేద్న్, స్ట్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలను అందించింది, వీరే తదనంతర కాలంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మూలంగా నిలిచారు. గత 18వ 19వ శతాబ్దాలలో, ఈ నగరం గొప్ప స్వరకర్తలు సంగీతకారులను ఆకర్షించి, యూరప్ కు కళాత్మక రాజధానిగా మారింది. ఆస్ట్రియన్ రాచరికం, గ్రాండ్ ఒపెరా హౌస్లు, ప్రేక్షకుల మద్దతు కలిసి వియన్నాను సృజనాత్మకతకు చిరునామాగా మార్చింది.వీధి వీధినా...వీనుల విందేగా...వియన్నాలో సంగీతం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రతి వీధి, కచేరీ హాల్, కేఫ్ కాలాతీత సంగీత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం సింఫొనీలు ఒపెరాల నుంచి వీధి ప్రదర్శనల వరకు నిర్వహిస్తుంది. ఇక్కడ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే ఒక సజీవ సంప్రదాయం. సంగీత నగరంగా వియన్నాను మార్చిన ప్రసిద్ధ స్వరకర్తలలో వోల్ఫ్గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ ఒకరు.. ఆయన వియన్నాలో నివసిస్తున్నప్పుడు ది మ్యాజిక్ ఫ్లూట్ ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో వంటివి సృష్టించారు. అందులో వియన్నాలో తొమ్మిదవ సింఫనీతో సహా గొప్ప సింఫొనీలను కంపోజ్ చేసిన లుడ్విగ్ వాన్ బీథోవెన్, వియన్నా స్థానికుడు, వందలాది పాటలు సింఫొనిక్ భాగాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాంజ్ షుబెర్ట్, సింఫొనీ పితామహుడు జోసెఫ్ హేద్న్, వియన్నా వాల్జ్ను ప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేసిన జోహన్ స్ట్రాస్ ఉన్నారు. అలా ఎంతో కాలంగా వియన్నా సంగీతానికి ప్రపంచ కేంద్రంగా ఎదుగుతూనే ఉంది. చాంబర్ రిసైటల్స్ నుంచి గ్రాండ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనల వరకు. ఈ నగరం ప్రతి సంవత్సరం 15,000 కంటే ఎక్కువ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. వియన్నా ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా, వియన్నా స్టేట్ ఒపెరా వియన్నా బాయ్స్ కోయిర్ వంటి సంస్థలు నగర సంగీత వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆకట్టుకునే కచేరీ హాళ్లలో లేదా బహిరంగ వేదికలలో ప్రతీ చోటా ఈ సిటీ దైనందిన జీవితంలో సంగీతం భాగమై ఉంటుంది. ప్రతి హృదయం సంగీతంతో మమేకమైపోయి లయబద్ధంగా ధ్వనిస్తుంది.విశేషాలెన్నో...ప్రపంచంలోని ఏ ఇతర నగరంలో లేని విధంగా 60 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలకు వియన్నా నిలయంగా ఉంది. నగరంలోని దాదాపు ప్రతి ప్రదేశం సంగీతంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంటుంది.ప్రసిద్ధ నృత్యం వాల్జ్ 19వ శతాబ్దంలో వియన్నాలో ఉద్భవించింది యూరప్ అంతటా ఆకట్టుకునే నృత్యంగా మారింది.1842లో స్థాపితమైన వియన్నా ఫిల్హార్మోనిక్ ప్రపంచంలోని పురాతన అత్యంత పేరొందిన ఆర్కెస్ట్రాలలో ఒకటి, ఇది ఆస్ట్రియా కు చెందిన గొప్ప సంగీత శైలిని ప్రతిఫలిస్తుంది. వియన్నాలో ప్రతి రాత్రి 10 కంటే ఎక్కువ శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతాయి,ఫిల్హార్మోనిక్ ప్రదర్శించే వార్షిక నూతన సంవత్సర కచేరీని 90 కి పైగా దేశాలకు ప్రసారం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు.వియన్నా నగరవాసుల్లో దాదాపు సగం మంది సంగీత వాయిద్యం వాయించేవారు లేదా గాయక బృందంలో పాడేవారో అయి ఉంటారు.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
ఆ గేదె, గుర్రం ధర వింటే..నోట మాటరాదు..!
మంచి మేలు జాతి రకం గేదె, గుర్రం ధర మహా అయితే లక్షల విలువ పలుకుతాయ్ అంతే. ఎంతలా చూసినా..అంతకుమించి పలికే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ పశువుల సంతలో గుర్రం, గేదెల ధర వింటే..నోటమట రాదు. వింటుంది నిజమేనా అనే సందేహం కలుగక మానదు. మరి ఇంతకీ అదెక్కడ తెలుసుకుందామా..!.రాజస్థాన్లో జరిగే వార్షిక పుష్కర్ పశువుల సంతలో ఈ వింతను చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పశువులు కనిపిస్తాయి. దీన్ని తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తుంటారట. ఈ ఏడాది ఒక గుర్రం, గేదె ఖరీదు ప్రకారం..చాలా హైలెట్గా నచ్చాయి. ఈ ఉత్సవంలో షాబాజ్ అనే గుర్రం ఏకంగా రూ. 15 కోట్లు ధర పలికింది. రెండున్నర ఏళ్ల ఈ గుర్రం ఇప్పటికే పలు ప్రదర్శనల్లో గెలుపొందిందట. ప్రతిష్టాత్మక మార్వారీ జాతికి చెందన ఈ గుర్రాన్ని కొనుగోలు చేస్తామంటూ.. రూ. 9కోట్లు నుంచి రూ. 15 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయని చెబుతున్నాడు సదరు యజమాని. అంతేకాదండోయ్ ఈ గర్రం పెంపకానికే దగ్గర దగ్గర రూ. 2 లక్షలు దాక ఖర్చు అవుతుందట. View this post on Instagram A post shared by PUSHKAR TOURISM ( Rahul meena ) (@pushkartourism24hr) ఆ తర్వాత అందరీ దృష్టిని ఆకర్షించిన మరో జంతువు అన్మోల్ అనే గేదె. దీని ధర సుమారు రూ. 23 కోట్లు పైనే పలుకుతుందని సదరు యజమాని చెబుతున్నారు. ఇది రాజకుటుంబానికి చెందినదట. దీనికి ప్రతిరోజు పాలు, దేశీ నెయ్యి, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక ఆహారం పెడతాడట యజమాని. ఇక పశువుల ఫుష్కర ఫెయిర్లో వీటితోపాటు రాణ అనే గేదె రూ. 25 లక్షలు పలకగా బాదల్ అనే మరో ఛాంపియన్ హార్స్ రూ. 11 కోట్లు వరకు పలుకుతుండటం విశేషం. కాగా, ఈ పుష్కర్ ఫెయిర్ అనేది రాజస్తాన్ పశుసంవర్ధకానికి సంబంధించిన సంప్రదాయ వేడుక. View this post on Instagram A post shared by PUSHKAR TOURISM ( Rahul meena ) (@pushkartourism24hr) ఈ కార్యక్రమంలో ఉత్తమ జాతి పశువులను ఎంపిక చేసి బహుమతులను ప్రదానం చేస్తారు. అలాగే ఈ వేడుకలో ఉత్తమ ఏ2 పాలను ఉత్పత్తి చసే గిర్ ఆవులకు ప్రత్యేక స్థానం ఇస్తారట. ఇక ఈ రాజస్థాన్లో నాగౌర్ ఎద్దుల పోటీ ఈ వేడుక కంటే ప్రధాన ఆకర్షణగా ఉండటమే గాక సందర్శకుల తాకిడి కూడా అత్యధికమేనని చెబుతున్నారు స్థానికులు. ఈ వేడుక అక్టోబర్ 23 నుంచి మొదలై, నవంబర్ ఏడు వరుకు జరుగుతుందట. అయితే ఈ ఏడాది వేడుకలో ఇప్పటివరకు సుమారు మూడు వేల పైనే ఉత్తమ పశువులుగా ఎంపికవ్వడం విశేషం. (చదవండి: రిటర్న్ గిఫ్ట్.. రిఫ్లెక్షన్ ఆఫ్ జాయ్..) -
మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం
అబ్బుర పరిచే వింతలకు, లగ్జరీ భవనాలకు విశేషాలకు నిలయం సౌదీ అరేబియా. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి "స్కై స్టేడియం" నిర్మాణానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్, ది లైన్లో భాగంగా 'నియోమ్ స్టేడియం' పేరుతో ఈ స్కై స్టేడియాన్ని నిర్మించనుంది.సోషల్లో షేర్ అవుతున్న నివేదికల ప్రకారం 2034 FIFA (FIFA World Cup 2034) ప్రపంచ కప్ కోసం మ్యాచ్లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్నిప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించననున్న ఏ స్టేడియం 2034 ఫీఫా ప్రపంచకప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. 46,000 మంది కూర్చోవచ్చట. 48-జట్ల టోర్నమెంట్ను నిర్వహించడానికి సౌదీ అరేబియా నిర్వహించే గ్లోబల్ ఈవెంట్కు ఇది మరింత వన్నె తెస్తుందని అంచనా. 🚨Saudi Arabia is set to construct the planet's inaugural "sky stadium," dubbed the NEOM Stadium, seamlessly embedded within the visionary metropolis of The Line. Elevated an astonishing 350 meters (1,150 feet) in the air, this innovative venue will boast 46,000 seats and rely… pic.twitter.com/Djn8QZsyPB— KILOWI BLOG ⚽🏀🥊 (@larry_graphics_) October 22, 2025మరోవై పుప్రపంచ కప్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందా అనేదానిపై చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. 2017లో ప్రారంభించబడిన నియోమ్, ఇప్పటికే జాప్యాలు, లాజిస్టికల్ సవాళ్లు, మానవ హక్కులు మరియు పర్యావరణ సమస్యలపై విమర్శలను ఎదుర్కొంది. అయితే దీనిపై సౌదీ అధికారులు మాత్రం ఆశాజనకంగానే ఉన్నారు. ఇది సాకారం అయితే, స్కై స్టేడియం చరిత్రలో అత్యంత అద్భుతమైన క్రీడా వేదికలలో ఒకటిగా మారనుంది. ప్రపంచ వేదికపై సౌదీ అరేబియా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మచ్చుతునకగా మిగిపోనుంది. కాగా 2034 ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు బిడ్ సమర్పించిన ఏకైక దేశం సౌదీ అరేబియా. ఇంతకు ముందు ఎన్నడూ లేని నిర్వహించనున్న ప్రపంచ కప్ ఈవెంట్లో ఇదే స్పెషల్ కానుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా! -
అమ్మో.. మలుగు బెన్
మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.(చదవండి: -
ఆ దేశానికి ఎయిర్పోర్ట్, సొంత కరెన్సీ లేవు..కానీ వరల్డ్లోనే అత్యంత ధనిక దేశం..
ఒక దేశ సామర్థ్యాన్ని సైనికబలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటివాటిని కొలమానంగా చేసుకుని అంచనా వేస్తారు. ప్రధానంగా చూసేవి వాటినే. కానీ ఈ దేశానికి అవేమి లేకపోయినా..సుసంపన్నమైన దేశంగా కీర్తిగడిస్తుంది, పైగా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరు గడిస్తోంది. ఒక దేశం గొప్పతనాన్ని తెలిపే, అంతర్జాతీయ విమానాశ్రయం , సొంత కరెన్సీ లేని ఈ దేశం ఎలా అత్యంత ధనిక దేశం పేరు గడించిందో తెలిస్తే విస్తుపోతారు. ప్రతిదీ సృష్టించి భుజాలు ఎగరువేయడం కాదు..పరిమిత వనరులనే ఉత్తమంగా ఉపయోగించుకుంటే.. అత్యంత సంపన్న దేశంగా అవతరించొచ్చని చాటిచెబుతోంది ఈ దేశం. ఆ దేశమే చిన్న యూరోపియన్ దేశం లీక్టెన్స్టీన్(Liechtenstein). ప్రపంచంలోని అత్యంత స్థిరమైన సంపన్నదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ దేశం సొంత కరెన్సీని కూడా ముంద్రించదు, పైగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు. మరి సంపన్న దేశంగా ఎలా పేరుగడిస్తోందంటే..చాలా దేశాలు తమ సార్వభౌమాధికార చిహ్నాలైనా..కరెన్సీ, భాష, జాతీయ విమానాయన సంస్థ వంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. కానీ లీక్టెన్స్టీన్ అందుకు విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. అప్పుతో కూడా సమర్థవంగా నిర్ణయించొచ్చని ప్రూవ్ చేస్తూ..స్విస్ ఫ్రాంక్ని అధికారిక కరెన్సీగా స్వీకరించింది. దాంతోనే బలమైన స్థిరమైన ఆర్థిక నిర్మాణానికి అంకురార్పణ వేసింది. ఫలితంగా కేంద్రబ్యాంకు అవసరం, కరెన్సీ నిర్వహణ భారం పడకుండా చేసుకుంది. అదేవిధంగా ఎయిర్పోర్టుల బదులుగా స్విట్జర్లాండ్, ఆస్ట్రియా రవాణా నెట్వర్క్లను ఉపయోగించుకుని, బిలియన్ల డాలర్లను ఆదా చేస్తోంది. అదే ఈ దేశం బలం..పరిశ్రమ, ఆవిష్కరణలే ఈ దేశం బలాలు. దంత వైద్యంలో ఉపయోగించే మైక్రో-డ్రిల్ల నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ, ఆటోమొబైల్ బాగాల వరకు ప్రతిదాన్ని ఉత్పత్తి చేస్తూ ఇంజీనీరింగ్ పరికరాల ఉత్పత్తిలలో అగ్రగామిగా రాజ్యమేలుతోంది. అంతేగాదు నిర్మాణ పరికరాల్లో ప్రపంచ నాయకుడైన హిల్టి ఆ దేశ పారిశ్రామిక బలానికి ప్రధాన చిహ్నం. ఇక్కడ చాలామటుకు రిజిస్టర్డ్ కంపెనీలే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే..జనాభా కంటే రిజిస్టర్డ్ సంస్థలే చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ నిరుద్యోగం అనేదే కనిపించదు. అదీగాక పౌరుల ఆదాయాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అంటే పేదవాడనే వాడే ఉండడు. ఇక్కడ జనాభా కూడా అత్యంత తక్కువే కేవలం 40 వేల మందే. రుణ, నేర రహిత దేశం..ఈ దేశంలో దాదాపు అప్పులనేవి ఉండవు, ప్రభుత్వ ఆదాయంలోని మిగులుతూనే దేశాన్ని నడిపిస్తుంది. మరో విశేషం ఏంటంటే..ఇక్కడ కొద్దిమంది ఖైదీలే ఉంటారట. అంతేగాదు ఈ దేశంలోని పౌరులు రాత్రిళ్లు ఇళ్లకు తాళలు కూడా వేయరట. ఇది ఆదేశ భద్రదా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తేటతెల్లం చేస్తోంది. పైగా ఇలా నిర్భయంగా బతకడంలోనే అసలైన జీవితం ఉందని ఈ ఆ దేశం తన చేతలతో నిరూపిస్తోంది. ఈ దేశం కేవలం సంపదకు చిహ్నం మాత్రమే కాదు, అత్యున్నత స్థాయి, భద్రత, శాంతి వంటి వాటికి చిరునామా అని కీర్తిస్తున్నారు పలువురు. (చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!) -
శ్రీనివాసులంతా ‘గ్రూపు’ కట్టేశారు! రికార్డు కొట్టేశారు!
విద్యానగర్(కరీంనగర్): కలియుగ దైవం శ్రీనివాసుడి నామ థ్యేయంతో ఒకటైన శ్రీనివాసులందరిది సమాజ సేవే లక్ష్యం కావాలని చిలుకూరు బాలాజీ శ్రీసుందరేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, ధర్మసంస్ధాపన అధ్యక్షులు రామదాసి ఆత్మరాం సురేశ్శర్మ అన్నారు. ఆదివారం కరీంనగర్లోని పీవీఆర్ ప్లాజాలో శ్రీనివాస మిత్రుల ద్వితీయ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీనివాసుడిపై భక్తి విశ్వాసాలను పెంచుకున్న ఉమ్మడి రాష్ట్రంలోని ఆయన భక్తులు.. తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకుని వారిలో ఆ దేవదేవుడిని నిత్యం దర్శిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసులందరూ దైవకార్యాలతోపాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వూట్కూరు శ్రీనివాస్ రెడ్డి, ఎలగందుల శ్రీనివాస్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన శ్రీనివాస్ నామధ్యేయులు పాల్గొన్నారు. తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో శ్రీనివాసులు రక్తదానం చేశారు.వాట్సాప్ గ్రూపుతో ముందుకు..తొలిసారిగా 2023 అక్టోబర్ 29న మనమంతా శ్రీనివాసులమే పేరుతో వుట్కూరి శ్రీనివాస్రెడ్డి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 28 వాట్సాప్ గ్రూపుల్లో శ్రీనివాసుల సంఖ్య 23వేలకు చేరింది. గతేడాది అక్టోబర్ 27న కరీంనగర్లోని టీటీడీ కల్యాణ మండపంలో తొలి వార్షికోత్సవం నిర్వహించగా.. 760 మంది హాజరయ్యారు. ద్వితీయ వార్షికోత్సవానికి శ్రీనివాసులు పెద్ద ఎత్తున హాజరుకావడంతోపాటు వండర్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు.ఏకనామం సదాప్రీతిఏకనామం.. సదా ప్రీతి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఒకే భావజాలంతో శ్రీవారి సేవకు అంకితమవుతాం. ఇప్పటికే 23వేల మంది సభ్యుల ఐక్యత, భక్తి తత్పరత ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం. ఆ శ్రీనివాసుని చల్లని దీవెనలు అన్నివే«ళలా అందరిపై ఉండాలని కోరుకుంటాను. – నంది శ్రీనివాస్, అధ్యక్షులు సాహితీ గౌతమి, కరీంనగర్పూర్వ జన్మ సుకృతంపూర్వ జన్మలో చేసుకున్న అదృష్టం కావచ్చు ఈ జన్మలో మా తల్లిదండ్రులు ఏడుకొండల వాడి పేరు మాకు పెట్టారు. ఆ పేరు సార్థకం చేసుకుంటూ.. సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నాం. శ్రీనివాస్ పేరు ఉన్నవారందరం ఒక చోట, ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – గాండ్ల శ్రీనివాస్, న్యాయవాది, శ్రీనివాసుల సేవా సంస్థ లీగల్ ఆడ్వైజర్, కరీంనగర్ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉందిలక్ష్మీనివాసుడైన శ్రీనివాసుడి పేరు మాకు ఉండడం అదృష్టం. ఇంత మంది శ్రీనివాసులు ఒకే వేదిక మీద కలువడం అద్భుతంగా ఉంది. శ్రీనివాస్ పేరు తలిస్తేనే అధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అలాంటి మహాత్మ్యం మరో పేరులో లేదు. అలాంటి పేరు మాకు ఉండడం చాలా సంతోషంగా ఉంది. -కన్నోజు శ్రీనివాస్, ఇనుగుర్తి శ్రీనివాస్, జగిత్యాలపేరు ప్రాధాన్యం తెలపడానికిఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరిద్దరికి శ్రీనివాస్ పేరు పెట్టేవారు. ప్రస్తుతం కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. శ్రీనివాస్ పేరు ప్రాధాన్యాన్ని నేటి తరం వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనమంతా శ్రీనివాసులం అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ పేరున్న అందరినీ ఒకటి చేస్తున్నా. – వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసుల సేవా సంస్ధ అధ్యక్షులుకలియుగ దైవం పేరుకలియుగ దైవం శ్రీనివాసుడంటే అందరికీ భక్తి, నమ్మకం. అ నమ్మకంతోనే మా తల్లిదండ్రులు ఆయన పేరును మాకు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆయన ఆశీస్సులు ఉంటే అంతామంచి జరుగుతుందనే నమ్మకం. శ్రీనివాస్ పేరున్న ప్రతి ఒక్కరి విశ్వాసం, ఆయన పేరు మాకు ఉండడం మా అదృష్టం. – పల్లెర్ల శ్రీనివాస్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి,కరీంనగర్మాది పేరు బంధంకలియుగ ప్రత్యక్ష దైవం శ్రీని వాసుడు. ఆయన పేరును కు టుంబసభ్యులు మాకు పెట్ట డం అదృష్టంగా భావిస్తాను. శ్రీనివాసులందరిదీ దైవబంధం. ఆ శ్రీనివాసుడు ఏమీ ఆశించకుండా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదే విధంగా మేమందరం కూడా సామాజిక సేవలో నడువాలన్నదే ధ్యేయం. – ఎలగందుల శ్రీనివాస్, వాసుదేవ హాస్పిటల్, కరీంనగర్ -
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఇంత కష్టం ఉంటుందా..?
ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది. ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లుఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు. View this post on Instagram A post shared by Bianca Adler (@bianca_adler1) (చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?) -
అక్కడ మహాలయ అమావాస్యే దీపావళి పండుగ..!
దేశమంతా దివ్వెల కాంతులు అద్దుకుని, తారాజువ్వలతో నింగి కూడా మెరిసి΄ోయేది దీపావళి అమావాస్య నాటి రాత్రే! కానీ కర్ణాటక, దావణగేరేలోని లోకికేరే పల్లెలో మాత్రం సీన్ చిత్రంగా ఉంటుంది. ఆ ఊరివాసులు దాదాపు రెండువందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవట్లేదు. ఆ రాత్రి అక్కడ ముంగిళ్లలో దీపాల కొలువు.. టపాసుల సందడి కాదుకదా కనీసం వీధి దీపాలు కూడా వెలగని విషాదం కనిపిస్తుంది. దానికి ఒక నేపథ్యం ఉంది.అదేంటంటే...రెండు శతాబ్దాల కిందట.. దీపావళికి ముందు.. పండుగకోసం అవసరమైనవి తీసుకురావడానికి లోకికేరేకి చెందిన కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఆ వెళ్లినవారు ఎంత పొద్దెక్కినా తిరిగి రాలేదు. గ్రామస్తులంతా ఆ అడవికి వెళ్లి అణువణువు గాలించారు. అయినా లాభం లేక΄ోయింది. వాళ్ల ఆనవాళ్లను కూడా కనిపెట్టలేకపోయారు. ఆ యువక బృందం ఆ రాత్రే కాదు.. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ బాధలో వాళ్లు దీపావళి జరుపుకోలేదు. తర్వాత ఏడాదికీ ఆ విషాదాన్ని మరువలేక΄ోయింది ఆ గ్రామం. కొంతమంది పండుగ ఆనవాయితీకి అంతరాయం ఎందుకు కలిగించాలని ప్రయత్నించి పండుగ జరిపారు. యాదృచ్చికంగా వాళ్లు నష్టాలను చవిచూడటం, అనారోగ్యం, ఇంట్లో దొంగలు పడటం లాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. కుర్రాళ్లు కనిపించకుండా ΄పోయిన బాధను మరిచి వాళ్లు పండుగ జరుపుకున్నందుకే ఆ అరిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని నమ్మారు. దాంతో ఆ నమ్మకమే స్థిరపడి నాటినుంచి ఆ ఊళ్లో దీపావళినాడు ఊరంతా దీపాలు వెలిగించి దీపావళి జరపకోవడాన్నే సంప్రదాయంగా మలుచుకున్నారు. అదలా ఇప్పటికి రెండువందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.అయితే...మహాలయ అమావాస్యను మాత్రం ఆ పల్లెలోని పూర్వీకుల సంస్మరణ దినంగా పండుగ జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ల సంప్రదాయ, సంస్కృతుల మేరకు దీపావళి నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తారు. అంటే మహాలయ అమావాస్యనాడు తమదైన తీరులో దీపావళి జరుపుకుంటారు. ఒకరకంగా మహాలయ అమావాస్యే వారికి దీపావళి. ఇదీ లోకికేరే దీపావళి కథ! (చదవండి: దీపావళి 2025: ఆ పండుగ పేరుతోనే రెండు గ్రామాలు..కానీ అక్కడ..) -
చెట్టు చనిపోయింది... ఊరు దుఃఖసముద్రం అయింది!
ఛత్తీస్గఢ్లోని సారా గోండి అనే ఊళ్లో...రెండు దశాబ్దాల క్రితం డియోల బాయి నాటిన రావి మొక్క రావి చెట్టు అయ్యింది. ‘ఇది నేను ప్రాణం పోసిన చెట్టు’ అని ఆ చెట్టును చూస్తూ గర్వంగా చెప్పేది డియోల బాయి. ‘ఇది డియోల బాయి చెట్టు’ అని గ్రామస్తులు పిలుచుకునేవాళ్లు. అయితే ఆ రావి చెట్టును ఒక వ్యక్తి తన స్వార్థం కోసం కొట్టివేయడంతో డియోల బాయి కుప్పకూలిపోయింది. కొట్టివేసిన రావి చెట్టును చూస్తూ 85 సంవత్సరాల డియోల బాయి కన్నీరు మున్నీరు అయింది. ఈ సంఘటన గ్రామాన్ని దుఃఖంలో ముంచెత్తింది. స్థానికులను ఆగ్రహావేశాలకు గురి చేసింది. చెట్టుకొట్టి వేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.‘ఇది ఆమె బాధ కాదు. ఊరంతటి దుఃఖం’ అంటున్నారు గ్రామస్థులు. ‘ఇది కేవలం చెట్టు కాదు. మా విశ్వాసం. మా భక్తికి చిహ్నం’ అంటున్నాడు మాజీ సర్పంచ్ సంజయ్సింగ్. ఈ సంఘటన తరువాత గ్రామస్తులు అదే స్థలంలో కొత్త రావి మొక్కను నాటారు. దాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేశారు.డియోల బాయి ఆ మొక్క దగ్గర ప్రార్థనలు చేసింది. (చదవండి: ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్) -
ప్లీజ్ సరిగా కూర్చోండి..! యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు ఫైర్
భోజనం హాయిగా నచ్చిన విధంగా ఆస్వాదిస్తేనే కదా మజా..!. దానికి కూడా ఆంక్షలు అంటే చిర్రెత్తుకొచ్చేస్తుంది ఎవ్వరికైనా. అది సహజం. అందులోనూ సరదాగా వీకెండ్లో నచ్చిన హోటల్ లేదా రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు వెచ్చిస్తున్నా..ఇలాంటి మాటలు ఎదురైతే ఎవ్వరికైన ఒళ్లు మండిపోతుంది. అలాంటి అనుభవవే యువర్ స్టోరీ వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మకి ఎదురైంది. పాపం ఆమె ఇదేంటి డబ్బులు కట్టేది కూడా నేనే అయినప్పుడూ ఇదేంటంటూ తనకెదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అసలేం జరిగిందంటే..ఆమె ఢిల్లీలో హౌస్ ఆఫ్ మింగ్లో ప్రసిద్ధ తాజ్ మహల్ హోటల్కి వెళ్లింది. ఆ హోటల్లో తనకెదురైన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారామె. దీపావళి సందర్భంగా ఏదైనా వెరైటీగా చేయాలనకున్నామని తెలిపింది. ఆ నేపథ్యంలోనే తను సోదిరితో కలిసి తాజ్ హోటల్లో విందుకు వచ్చినట్లు వెల్లడించింది. అంతా బాగానే సాగుతుండగా ఇంతలో మేనేజర్ వచ్చి అతిథుల్లో ఒకరికి మీ వల్ల ఇబ్బంది ఉందంటూ..సరిగా కూర్చొమని చెప్పడం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ శ్రద్ధా కూర్చిమీదనే షూస్ వదిలేసి పద్మాసనంలో కూర్చొన్నారు. అది మన భారతీయ సంప్రదాయ విధానమే. అయినా..అలా అనడం శ్రద్ధాని బాగా బాధించడంతో ఈ విషయాన్ని సోషల్మీడియాలో వివరిస్తూ..తానెలా కూర్చొందో కూడా వీడియో రూపంలో చూపించింది. ఇది ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ అని తనకు తెలుసని, ఇక్కడకు చాలామంది ధనవంతులు వస్తుంటారని తనకు తెలుసంటూ ఆగ్రహంగా మాట్లాడారామె. అయినా తాను సంపాదించిన డబ్బుతోనేగా ఇక్కడకు రాగలిగింది అంటూ తన ఆవేదనను వెలిబుచ్చారు. ఎవరికో సమస్య ఉంటే ..తనను ఇలా కాళ్లు దించి సరిగా కూర్చోమని చెప్పడం సరికాదు, ఎందుకంటే డబ్బులు కట్టేది తానే కదా అంటూ వాపోయారు. ఇక్కడ సంస్కృతిని, సంపదతో వేరుచేసి చూస్తూ..గోడలు కట్టుకుంటున్నామంటూ మండిపడ్డారమె. అయినా తాను సల్వార్ కుర్తా ధరించి సరిగానే కూర్చొన్నా, మర్యాదగానే ప్రవర్తించాన, మరి దీనికెందుకు అభ్యంతరం చెప్పాలంటూ నిలదీశారు. నిజానికి పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా తన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని, కానీ ఇవాళ ఆయనకు చెందిన తాజ్ హోటల్ తనను చాలా నిరాశపరిచేలా అవమానించిందని బాధగా చెప్పుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ పోస్ట్ని చూసి..లగ్జరీ హోటళ్లు డ్రెస్ కోడ్లంటూ ప్రవర్తన నియమావళి పెడుతున్నారని, ఇవి తప్పనిసరి కాదంటూ ఆమెకు మద్దతు పలికారు. అయినా సరదాగా విందుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడూ ఆ సమయం మనది మనకు నచ్చినట్లు ప్రవర్తించే హక్కు ఉందని, ఎందుకంటే ఆ వ్యవధికి బిల్లు చెల్లించేది మనమే కదా అంటూ శ్రద్ధని సపోర్టు చేస్తూ పోస్టుల పెట్టడం గమనార్హం. మనం వెళ్లే ప్రదేశం బట్టి దానికి అనుగుణంగా మన వ్యవహారశైలి ఉండాలి గానీ, మరి ఇలా సవ్వంగా ఉన్నాకూడా అతి చేస్తే..అసలుకే పెనుముప్పు కదూ..!. హాయిగా ఆస్వాదించే భోజనం వద్ద ఇలా రూల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం సబబు కాదనేది అంగీకరించాల్సిన వాస్తవం.एक आम इंसान, जो मेहनत करके, अपना पैसा कमा कर, अपनी इज़्ज़त के साथ ताज होटल में आता है — उसे आज भी इस देश में ज़लील और अपमानित होना पड़ता है।और मेरी गलती क्या है? सिर्फ़ ये कि मैं बैठ गई एक “regular padmasana style” में?क्या ये मेरी गलती है कि ताज मुझे सिखा रहा है कि कैसे बैठना… pic.twitter.com/vKBYjg8ltb— Shradha Sharma (@SharmaShradha) October 21, 2025 (చదవండి: శతాధిక బాడీబిల్డర్..ఇప్పటికీ పోటీల్లో పాల్గొనడం, శిక్షణ..) -
తెలుగోడి సత్తా.. భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం
టాప్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్కు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల (Satya Nadella ) తన ఘనతను చాటుకున్నారు. ఏఐ (Artificial Intelligence-AI)) నిపరుగులుపెట్టించిన మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO)గా ఆయన జీతం భారీగా పెరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం ఎ గిసి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.847.31 కోట్లు. దశాబ్దం క్రితం ఈ పదవిని చేపట్టినప్పటి నుండి సత్యా నాదెళ్ల అందుకుంటున్నఅత్యధిక జీతం. ఏఐ)లో కంపెనీ సాధించిన పురోగతి ఈ పెరుగుదలకు కారణమని బోర్డు చెప్పిందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగిందని "ఈ తరాల సాంకేతిక మార్పుకు సత్య నాదెళ్ల చ అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్ను స్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్గా నిలబెట్టిందని బోర్డు పరిహార కమిటీ మంగళవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ,వాటాదారులకు రాసిన నోట్లో పేర్కొంది. దీని ప్రకారం సత్య నాదెళ్ల బేసిక్ సాలరీ 2.5 మిలియన్ డాలర్లు. మిగిలిన కంపెనీ షేర్ల రూపంలో అందుకోనున్నారు. నాదెళ్ల జీతంలో దాదాపు 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్న సంగతి తెలిసిందే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్)సత్యనాదెళ్ల ప్రస్థానం1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించారు సత్య నాదెళ్ల. తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి ప్రభావతి లెక్చరర్. హైదరాబాద్లో పాఠశాల విద్య అనంతరం, కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ పట్టా పొందారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ నుంచి 1990లో ఎంఎస్ పూర్తి చేశారు.1992లో మైక్రోసాప్ట్లో ఉద్యోగంలో చేరిన అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాల్లో సత్తాచాటుకున్నారు. 2014లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ రేపుతున్న సంచలనం ఆయనకు వరంగా మారింది.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ -
వింత ఘటన: బొద్దింకను చంపబోయి..అపార్ట్మెంట్కే నిప్పటించింది..!
ఒక్కోసారి మనం చేసే పనులు ఎంత సీరియస్గా మారుతాయో అనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. బహుశా అందుకే కాబోలు ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని అంటుంటారు పెద్దలు. ఈ ఘటన వింటే..ఎంత జాగురకతో ఉండాలో కచ్చితంగా అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియాలో జరిగిన ఒక వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడమే కాదు, అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు ఇలా ఎలా జరిగిందని..అనుమానాలు లేవనెత్తేలా చర్చనీయాంశమైంది. ఒక మహిళ ప్రమాదవశాత్తు భవనానికి నిప్పంటిచడంతోనే ఈ ఘటన వార్తలో నిలిచింది. కేవలం బొద్దింకను చంపేందుకు ఫ్లేమ్ త్రోవర్(మండే స్ప్రే)ని ఉపయోగించడంతోనే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆమె బొద్దింకను చంపేందుకు ఎప్పుడైతే ఫ్లేమ్ త్రోవర్ ఉపయోగించిందో..ఆ మంటలు కాస్త వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి..మొత్తం 32 అపార్ట్మెంట్ల రెసిడెన్సీ మంటల్లో చిక్కుకుపోయింది. రెండు నెలల శిశువుతో అదే ఫ్లోర్లో పొరుగున ఉన్న ఒక జంట ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. పాపం వారు తమ బిడ్డను కాపాడుకునేందుకు పక్కంటి వారికి శిశువుని అప్పగించి కిటికీ గుండా తప్పించుకోవాలనుకున్నారు. ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తు వస్తున్న చైనాకు చెందిన మహిళ పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించిందామె. అంతేగాదు ఈ మంటలు గ్రౌండ్ఫ్లోర్లో వాణిజ్య యూనిట్లు, అక్కడే నివాసం ఉంటన్న కొన్ని కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రమాదం కారణంగా ఎనిమిదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. పాపం ఏదో బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలై పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు పాపం ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ ప్రాణాన్ని పొట్టనుబెట్టుకోవడం, పలువులరు గాయపడటానికి దారితీసింది.(చదవండి: క్యాబ్ డ్రైవర్గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..) -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. ఎక్కడంటే..!?
ఆ ఊర్లో ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ లాంటి లగ్జరీ కార్లు కనిపిస్తాయి. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 11 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. వీటిల్లో ఊరి జనమంతా కలిసి 1000 కోట్ల రూపాయలకు పైగా దాచుకున్నారు. జనానికి కావాల్సిన సదుపాలయాన్నీ ఆ ఊరిలో ఉన్నాయి. అయితే ఇదేదో సిటీ అనుకుంటున్నారా? కానేకాదు పక్కా పల్లెటూరు. విలేజ్లో ఇంటికో విలాసవంతమైన కారు ఎలా అబ్బా.. అని ఆశ్చర్యపోతున్నారా? మరి అదే ఆ గ్రామం ప్రత్యేకత.మనం చెప్పుకోబోయే గ్రామం పేరు ధర్మజ్. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఉంది. మన దేశంలో అత్యంత ధనిక గ్రామంగా, ఎన్నారై విలేజ్గా ఆఫ్ ఇండియాగానూ (NRI Village of India) ప్రసిద్ధికెక్కింది. సగటు పల్లెలకు భిన్నంగా ధర్మజ్ సక్సెస్ సాధించడం వెనుక చాలా పెద్ద ప్రయాణమే ఉంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా సొంతూరిని మరిచిపోకపోకుండా ఉండడమే ఈ ఊరి విజయ రహస్యం. ఇక్కడి నుంచి పలు దేశాలకు వలసవెళ్లిన వారు పంపించిన సొమ్ములతో ధర్మజ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.అలా మొదలైంది..ధర్మజ్ గ్రామ విజయయాత్ర 1895లో మొదలైంది. ఈ గ్రామం మొదటి తరానికి జోతారామ్ కాశీరామ్ పటేల్ చతుర్భాయ్ పటేల్ ఉగాండా దేశానికి వలసవెళ్లి మార్గదర్శకులుగా నిలిచారు. తర్వాత నుంచి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లడం క్రమంగా పెరిగింది. జోతారామ్, చతుర్భాయ్ తర్వాత ప్రభుదాస్ పటేల్ వంటి వారు మాంచెస్టర్కు వెళ్లి స్థిరపడ్డారు. గోవింద్ భాయ్ పటేల్ ఒక అడుగు ముందుకేసి యెమెన్లోని పోర్ట్సిటీ ఆడెన్లో పొగాకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ధర్మజ్ నుంచి విదేశాలకు వెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. ఎంతగా అంటే అక్కడి కుటుంబాల్లో సగానికిపైగా విదేశాల్లోనే ఉండేంతగా. తాజా గణాంకాల ప్రకారం బ్రిటన్లో 1700, అమెరికాలో 800, కెనడాలో 300, ఆస్ట్రేలియా- న్యూజిలాండ్లో 150 కుటుంబాలు నివసిస్తున్నట్టు అంచనా. ఆఫ్రికాతో పాటు మిగతా దేశల్లోనూ చాలా కుటుంబాలు ఉన్నాయి.ప్రపంచ దేశాలకు వలస వెళ్లిన వాళ్లంతా తమ మూలాలను మర్చిపోకుండా తమ గ్రామాభివృద్ధి బాటలు వేయడమే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్న ప్రవాసులను 2007లో ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడంతో ధర్మజ్ (Dharmaj) రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఊరంతా విశాలమైన సిమెంట్ రోడ్లతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ.. ప్రతి గ్రామస్థుడు పాటించేలా చేస్తున్నారు. యువత, పెద్దల కోసం సువిశాలమైన పార్క్ ఉంది. ఇందులో తక్కువ ధరకే ఈత కొలను, బోటింగ్ చేయొచ్చు. గ్రామంలో పశువుల మేత కోసం ప్రత్యేకంగా 50 బిఘాల భూమిని కేటాయించారు.11 బ్యాంకులు.. వెయ్యి కోట్లు11,333 మంది జనాభాతో 17 హెక్టార్లలో విస్తరించి ధర్మిజ్ గ్రామం ఆర్థిక విజయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరిలోని 11 బ్యాంకుల్లో రూ. 1000 కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. 1959, డిసెంబర్ 18న దేనా బ్యాంక్ మొదటి శాఖను ఇక్కడ ప్రారంభమైంది. దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ధర్మజ్ గ్రామ వాసి హెచ్ఎం పటేల్ (HM Patel) వ్యవస్థాపక అధ్యక్షతన 1969, జనవరి 16న గ్రామ సహకార బ్యాంకు ఏర్పాటైంది. విదేశాల్లో స్థిరపడిన ధర్మజ్ వాసులు సొంతూరికి డబ్బులు పంపిస్తుండటంతో ఇక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా పుంజుకుంది. అలాగే ఊరి ప్రజల జీవనశైలి కూడా మెరుగుపడింది. ధర్మజ్ రోడ్లపై ఇప్పుడు మెర్సిడెస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు చక్కర్లు కొట్టడం సర్వసాధారణ విషయం. అక్కడ ఇళ్లు కూడా వివిధ దేశాల శైలిని ప్రతిబింబిస్తుంటాయి.గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నారు మహాత్మ గాంధీ. ఆర్థిక పరిపుష్టి, పౌరుల సంపూర్ణ మద్దతు ఉంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తాయడానికి ధర్మజ్ ప్రత్యక్ష నిదర్శనం. డబ్బులు పంపి చేతులు దులుపుకోవడమమే కాదు ప్రతిఏడాది జన్మభూమికి వస్తుంటారు విదేశాల్లోని ధర్మజ్ వాసులు. ప్రతి సంవత్సరం జనవరి 12న నిర్వహించే ధర్మజ్ దివస్కు (Dharmaj Diwas) పెద్దసంఖ్యలో హాజరవుతారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోతారు. అనుభూతులను పంచుకుంటారు. అభివృద్ధి గురించి చర్చిస్తారు.ధర్మజ్ అంటే కేవలం డబ్బు ఉన్న గ్రామం మాత్రమే కాదు. గ్లోబల్ సక్సెస్, లోకల్ లవ్ కలిసి ఎంతటి విజయం సాధించగలవో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ.చదవండి: అమెరికాలో ఐదేళ్లలో 100 మంది భారతీయుల మరణం -
ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్లు, పేస్ట్రీలు ఉండవు..
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపర కుభేరుడు, ఎలాన్ మస్క్ వ్యవస్థపక విజయాలన్నీ..కొత్త వ్యాపారం చేయాలనుకునేవారికి మార్గదర్శకం. అలాంటి టెక్ దిగ్గజం ఒక 'బేకరీ'ని కూడా నడుపుతున్నట్లు మీకు తెలుసా..!. అయితే ఆ బేకరీలో కేక్లు, పేస్ట్రీలు, బ్రెడ్లు ఉండవు ఉండవు. మరీ ఏం తయారవుతాయంటే..ఈ బేకరీ స్టార్షిప్ అంతరిక్ష నౌకలో ఉపయోగించే సిరామిక్ హీట్ షీల్డ్ టైల్స్ తయారు చేస్తుంది. చలా జాగ్రత్తగా రూపొందించే ఈ టైల్స్ పదునైన షడ్భుజాకారాల్లో ఉంటాయి. అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండే ఉష్ణోగ్రతలో అంతరిక్ష నౌకను రక్షిస్తాయి. వీటి ష్ణోగ్రతలో కొన్నిసార్లు 1,400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంటుందట. ఆ నేపథ్యంలోనే వీటికి ప్రత్యేకమైన డిజైన్ ఉంది. ఇందులో సంక్లిష్టమైన పిన్ అటాచ్మెంట్లు, చిన్న విస్తరణ అంతరాలు ఉంటాయి. ఇవి పగుళ్లు లేకుండా వంగడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తాయి. ప్రతి స్టార్షిప్కు 18,000 షడ్భుజాకార టైల్స్ అవసరం. ఇవి నల్లటి బోరోసిలికేట్ గాజుతో పొరలుగా ఉన్న అధునాతన సిలికా-ఆధారిత సిరామిక్స్తో నిర్మిస్తారు. దీనిలో వేసే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తికి చేరుకునే ప్రక్రియకు సుమారు 40 గంటలు పైనే పడుతుందట. ఈ బేకరీ ప్రతిరోజు వేలాది టైల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ పేరే ఎందుకంటే..ఇక్కడ టైల్స్ కఠినమైన బేకింగ ప్రక్రియకు లోనవ్వుతాయి కాబట్టి. బ్రెడ్ను తయారు చేసినట్లుగానే ఈ ప్రత్యేకమైన టైల్స్ని అధిక ఉష్ణోగ్రత వద్ద సంపూర్ణ ఏకరీతి నిర్మాణాంలోకి వచ్చేలా చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. అంతలా చేస్తేనే అంతరిక్ష ప్రయాణాన్ని సరసమైన ధరలో లభించేలా చేసేందుకు దోహదపడుతుంది ఇది ఎలాన్ మస్క్ కలల వెంచర్. అలాగే ఈ స్టార్షిప్ని ఇంతల బేక్ చేయడం వల్లే చంద్రుడు, భూమి, అంగారక గ్రహాలపై బహుళ రీ ఎంట్రీలు, ల్యాండింగ్లు నావిగేట్ చేసేటప్పుడూ తీవ్ర ఉష్ణోగ్రతలను ఈజీగా తట్టుకుంటుందట. Our fully automated bakery in Florida is setup to produce thousands of heat shield tiles per day to outfit the coming fleet of Starship vehicles pic.twitter.com/9Ki278wakx— SpaceX (@SpaceX) October 13, 2025 (చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
పిట్ట కొంచెం.. కూత ఘనం..! మూడున్నరేళ్ల వయస్సులోనే..
ఆ చిన్నారికి మూడున్నరేళ్లే.. అయినా టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అద్భుతంగా పాడుతోంది. ఆమె పాటలు వింటున్న గ్రామస్తులు చిన్నారిని అభినందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన ఆవునూరి సంజీవ్, మౌనిక కూతురు వరుణవి. టీవీల్లో వచ్చే పాటలు విని తిరిగి అలాగే పాడుతుండడంతో తల్లిదండ్రులు రికార్డు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఓ ప్రైవేటు టీవీ నిర్వహించే ప్రోగ్రామ్కు ఆహ్వానించారు. ఆమె పాడిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సుమారు నాలుగు నెలలుగా ప్రోగ్రామంలో పాల్గొంటోందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..) -
ఏకంగా 200 రకాల వెరైటీ సమోసాలు..! ఎక్కడంటే..
సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వేడివేడి చాయ్తో ఆరగించే స్నాక్ ఐటెం అది. ఈ చిరు తిండిని బంగాళ దుంప మసాల, లేదా బఠానీలతో క్రిస్పీగా అందించడం విన్నాం. బంగారు త్రిభుజాకారంలో నోరూరించే ఈ వంటకం భారతీయుల వంటకాలలో అంతర్భాగం. మహా అయితే ఆ సమోసాలో మూడు, నాలుగు రకాల వెరైటీలు చూసుంటాం. కానీ ఏకంగా వందల రకాల వెరైటీ సమోసాలు అందించే ఫుడ్స్టాల్ గురించి విన్నారా?. ఔను మీరు వింటుంది నిజమే. నో ఛాన్స్ అనుకోకండి..అన్ని రకాలు అమ్ముతూ నెట్టింట వైరల్ అయ్యాడు ఈవ్యక్తి. ఎక్కడుందంటే ఆ ఫుడ్ స్టాల్.. పంజాబ్లో జలంధర్(Jalandhar)లోని వీధిలో ఈ దుకాణం దర్శనమిస్తుంది. అక్కడ ఇన్ని రకాల సమోసా వెరైటీలను(Samosa Varieties) చూడొచ్చు. పది రకాల సమోసాలు విక్రయిస్తేనే..వామ్మో..! అనేస్తాం. కానీ ఇక్కడ ఏకంగా 200 రకాల సమోసాలను అందిస్తున్నారు ఆహారప్రియులకు. అవేంటో చూద్దామా..ముందుగా లేడిఫింగర్ సమోసాతో మొదలై..బీన్స్ సమోసా, పచ్చి అరటి సమోసా, పనీర్ సమోసా, గోబీ సమోసా, సోయా సమోసా, నూడిల్స్ సమోసా, మాకరోని, పుట్టగొడుగులు ఇలా పలు రకాల సమోసాలు దర్శనమిస్తున్నాయి. వాటిని చూడగానే..ఆ రకరకాల సమోసాలు టేస్ట్ చేయగలమా అనే సందేహం తప్పక కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం బ్రో నేను ఆలుతో చేసిన సమోసా తప్ప మరేది ట్రై చేయను అని ఒకరు, బాబోయ్ సమోసాపై ఉన్న ఇష్టాన్ని చంపేశావు కదా అని మరొకరు ఇలా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Foodpandits! (@foodpandits) (చదవండి: చలి పులి వచ్చేస్తోంది..ఆరోగ్యం జాగ్రత్త! హెచ్చరిస్తున్న నిపుణులు) -
పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!
కడు దుర్భరమైన జీవితం గడిపి..కనీస అవసరాలనే సమకూర్చుకోలేని స్థితిలో గడిపాడు ఆ యువకుడు. ఎంతలా అంటే కనీసం బాత్రూం కూడా లేని ఇంట్లో జీవితం భారంగా నెట్టుకొచ్చాడు. ఈ స్థితిని చూసి చిన్నపాపల ఏడుస్తున్నా తల్లిని చూసి..ఏ చేయలో తోచని చిన్నతనంలోనే ఆ యువకుడి మదిలో నిలిచిన ధ్యేయం..అతడితోపాటు పెరుగుతూ వచ్చింది. అదే తన పేదరికాన్ని జయించే స్థితికి చేరేలా చేసింది. ఇవాళ తన అమ్మ సంబరపడేల కలల సౌధాన్ని నిర్మించాడు. కష్టబడితే మన కలలన్నీ ఎన్నటికి వృధాకావు అనే మాటకు అర్థాన్నిచ్చేలా స్ఫూర్తిగా నిలిచాడు. ఈ స్టోరీ రెడ్డిట్లో షేర్ అవ్వడంతో నెట్టింట వైరల్గా మారింది.రెడ్డిట్లో ఆ యువకుడు అంతకుముందు తాము ఉండే పాత ఇల్లు తాలుకా ఫోటోను షేర్ చేస్తూ..అప్పుడూ తన లైఫ్ ఎంత దయనీయం ఉంటుందో చెప్పుకొచ్చాడు. వర్షం వస్తే ఇంట్లోకి వచ్చేసే మురుగు నీరు మధ్య ఎలా బిక్కుబిక్కుమంటూ గడిపామా గుర్తు చేసుకున్నాడు. అది చూసి తన తల్లి పసిపాపలా ఏడ్చిన ఘటన ఇంకా మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఏం చేయలేని చిన్నవాడిని కావడంతో..ఎలాగైనా దీన్ని మార్చాలని కలలు కనేవాడని అంటూ తన పరిస్థితిని వివరించాడు. కనీసం ఇంట్లో బాత్రూం కూడా లేకపోవడంతో తన తల్లి, అక్క తాత్కాలిక కచ్చా నిర్మాణాన్ని ఏర్పరుచుకున్నారని, తను తండ్రి ఆఫీస్లోని వాష్రూమ్ వాడుకునేవాడినంటూ నాటి పేదరిక జీవితంలోని గడ్డు పరిస్థితులను తెలిపాడు. ఇదంతా ఎలా మార్చాలనేది తెలియకపోయినా..తండ్రికి భారం కాకుండా చదువుకోవడంపై దృష్టిపెట్టి..చిన్న చిన్న ట్యూషన్లు చెప్పేవాడినని అన్నాడు. అయితే ఏదో ఒకరోజుకి ధనవంతుడిని అవుతాననే కలను మాత్రం వదిలేయలేదని..అది ఎప్పుడూ కళ్ల ముందు సాక్షాత్కారిస్తూనే ఉండేదని చెప్పుకొచ్చాడు. అదే చివరికి నాకు తన తల్లి మెచ్చుకునేలా కలల సౌధాన్ని నిర్మించేలా చేసిందని, కానీ కొంత అప్పుకూడా చేయాల్సి వచ్చిందని వివరించాడు. అప్పుడు తాన ఎలాంటి ఇంట్లో జీవించేవాడో..ఇప్పుడూ ఎలాంటి ఇంట్లో నివసించే రేంజ్కి వచ్చాడో తెలిపేలా అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. చివరికి తాను "పేదరికం అనే యుద్ధంపై గెలిచేశా, నా తల్లి కలలుగన్న ఇంటిని కట్టేశా" అనే క్యాప్షన్ జోడించి మరి తన కథను వివరించాడు. ఈ స్టోరీ నెటిజన్లను ఆకట్టుకోవడమే కాదు..తమను ఎంతాగనో ప్రేరేపించిందంటూ..సదరు వ్యక్తిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..) -
చరిత్రకు కేరాఫ్..మనసుకు టేకాఫ్..
తెలంగాణ రాష్ట్రం భాగ్యనగరంలో చారిత్రక పర్యాటకం అనగానే చాలా మందికి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట.. ఇవే గుర్తుకొస్తాయి. కానీ అందరికీ తెలిసిన ఈ చారిత్రక విశేషాలు మాత్రమే కాకుండా.. కాలగమనంలో మరుగునపడిపోయిన అనేక కట్టడాలు నిశ్శబ్దంగా దర్శనమిస్తున్నాయి. కొత్త మెరుపుల మధ్య వాటి వెలుగులు మసకబారుతున్నాయి. అద్భుతమైన కట్టడాలు.. ఆకట్టుకునే విశేషాలను తడిమి చూస్తే ఎన్నో మధురానుభూతులను కలి్పంచే అనేక పర్యాటక విశేషాలు ప్రాచుర్యానికి నోచుకోవడంలేదు.. ఇవి తప్పక చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కనబడకపోవచ్చు. కానీ వాటిని సందర్శిస్తే మనకు తెలియని హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని మన కళ్ల ముందు ఉంచుతాయి. పర్యాటకులు, సందర్శకుల గుర్తింపుకు నోచుకోకుండా.. గోల్కొండ కోట వెనుక భాగంలో, ఆక్రమణల మధ్య మరుగున పడిన నయా కిలాకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. దీనిని 1656లో షాజహాన్ పరిపాలన సమయంలో జరిగిన మొఘల్ దాడికి ప్రతిస్పందనగా నిర్మించారు. ఒకప్పుడు గోల్కొండ రక్షణ వ్యవస్థలో భాగంగా ఉండేది.. ఇప్పుడు ప్రధాన కోట కాంప్లెక్స్ నుంచి వేరుగా ఉంది. ఇందులోనే మజూ్న, లైలా బురుజులు, హైదరాబాద్ స్థాపనకు ముందు 1561లో నిర్మితమైన ముస్తఫా ఖాన్ మసీదు, డెక్కన్ కవి పేరిట నెలకొన్న ముల్లా ఖయాలి మసీదు, ఆఫ్రికన్ సన్యాసులు నాటినదిగా చెప్పే 400 ఏళ్ల నాటి పాత బోబాబ్ చెట్టు వంటి విశేషాలెన్నో ఉన్నాయి. స్మృతుల నిధి.. రేమండ్ సమాధి.. ఇది చాదర్ఘాట్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని హిల్స్పైన అస్మాన్ ఘడ్ ప్యాలెస్లో ఉంది. (మిచెల్ జోచిమ్ మేరీ రేమండ్) అనే ఫ్రెంచ్ జనరల్ సమాధి. ఆయన నిజాం అలీ ఖాన్ (ఆసఫ్ జాహ్–2) దగ్గర సేనాధిపతిగా సేవలందించారు. ఆయన్ని హిందువులు ‘మూసా రామ్, ముస్లింలు’, ‘మూసా రహీం’గా పిలిచేవారని చెబుతారు. నిజాంలు కూడా 1940ల వరకూ ఇతని వర్థంతి సందర్భంగా నివాళులర్పించేవారట. దీనిని 2003లో పునరుద్ధరించినా, భారత–ఫ్రెంచ్ స్నేహానికి ప్రతీకగా నిలిచే ఈ స్థలం ఇప్పటికీ పర్యాటక ఆకర్షణగా మారలేదు. బహుత్ పురానా.. ఈ ఠాణా..పర్యాటక అర్హతలున్న పోలీస్ స్టేషన్ సైతం ఉన్న నగరం మనదే అని చెప్పొచ్చు. ఎప్పుడో 1867లో నిర్మించిన జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, నగరంలోని పురాతన బ్రిటిష్ కాలపు కట్టడాలలో ఒకటి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కనే ఉన్న ఇది.. బ్రిటిష్ శాసన కాలంలో కంటోన్మెంట్ ప్రాంతంలో కీలక పరిపాలనా కేంద్రంగా ఉపయోగించబడింది. ఆర్చ్లా మార్చిన వరండాలు, స్టోన్వాల్స్, కలోనియల్ శైలిని ప్రతిబింబించే నిర్మాణ పద్ధతులతో పాటు.. ప్రత్యేకమైన బ్రిటిష్ శైలి ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలంటే దీన్ని సందర్శించాలని ఆర్కిటెక్ట్స్ అంటున్నారు. అందమైన కథ.. బ్రిటిష్ రెసిడెన్సీ.. వైట్ మొఘల్ అనే పుస్తకంలో రాసిన ఓ అందమైన ప్రేమ కథకు మౌన సాక్షి గా ఈ భవనాన్ని పేర్కొంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యాలయం కోసం సుమారు 1805లో ఆర్కిటెక్ట్ సామువెల్ రస్సెల్ ఆధ్వర్యంలో నిజాంల దగ్గర బ్రిటిస్ రెసిడెంట్ అయిన జేమ్స్ అకిలిస్ కిర్క్పాట్రిక్ (వైట్ మఘల్ గా ప్రసిద్ధుడు) కోసం నిర్మితమైంది. దీనిని పల్లాడియన్ శైలిలో డిజైన్ చేశారు. ఈ విశాలమైన విల్లాలో ఆరు కొరింథియన్ స్తంభాలు, ద్వితీయ అంతస్తుకు తీసుకెళ్లే ద్విపాద మెట్లదారి, పెయింటింగ్స్తో నిండిన పైకప్పులు.. పార్కే ఫ్లోర్స్ బ్రిటిష్ సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. అమెరికాలోని వైట్ హౌస్ని తలపించే ఈ భవనంలో చరిత్రను తెలియజేసే చిన్న మ్యూజియం కూడా ఉంది. ఈ భవనం 1949 తర్వాత కోఠి మహిళా కళాశాలలో భాగమైంది. కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరగా దీన్ని 2022లో పునరుద్ధరించారు. -
ఏంటి క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డు? కేవలం ఖర్చే కాదు ఆదాయం కూడా..
సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్గా కూడా గిన్నిస్ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్ కార్డులు(credit cards) ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్లో. అలా ఏకంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు. అంతేకాదండోయ్ అన్నేసి కార్డులు ఉపయోగించడంతో గిన్నిస్ రికార్డుల్లకెక్కాడు కూడా.అతడే మనీష్ ధమేజ్. ఇతడి కథ అత్యంత విచిత్రంగా అనిపించినా..తెలివిగా, స్మార్ట్గా బతకడంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 30, 2021న గినిస్ రికార్డు నెలకొల్పాడు. వాట్ క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డా..? అని విస్తుపోకండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డుని ఖర్చు చేసి.. అప్పలు పాలవ్వలేదు. దాన్ని ఆయన ఎలాంటి అప్పు లేకుండా..మంచి ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అలా ఆయన వద్ద మొత్తం 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన రోజు క్రెడిట్ లేకుండా మొదలవ్వదట. అంతలా క్రెడిట్ కార్డులంటే ఇష్టమట. కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ రైల్వే లాంజ్, ఎయిర్పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఇంధనం ఇలా ఎన్నో క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తారట.ప్రతి రివార్డు పాయింట్లను వేస్ట్ చేయకుండా ఉపయోగించేయడంతో.. అవన్నీ అప్పులుగా కాకుండా ఆదాయ వనరుగా మారింది మనీష్కి. ఆ నేపథ్యంలోనే ఆయన వద్ద అంతలా క్రెడిట్ కార్డుల కలెక్షన్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు 2016లో నోట్ల రద్దు సమయంలో అందరూ డబ్బులు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే.. ఇతడు మాత్రం క్రెడిట్ కార్డుతో పనికానిచ్చేశాడట. ఆయన బ్యాంకు నగదు కోసం త్వరపడడట. క్రెడిట్ కార్డుల సాయంతో డిజటల్గా డబ్బుని ఖర్చు చేయగలను అని చెబుతున్నారు. ఇక ఆయన విద్యా నేపథ్యం ఏంటంటే..కాన్పూర్ సీఎస్జీఎం విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, లక్నో ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఇగ్నో నుంచి సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ తదితరాలు పూర్తి చేశారు. ఈయన్ను చూస్తే..సాంకేతికతను వినియోగించుకుంటూ..తెలివిగా ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తే..సాధారణ విషయాలు కూడా అసాధారణంగా మారిపోతాయనేందుకు మనీష్ స్టోరీనే ఉదాహరణ కదూ..!.During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z— Fact Point (@FactPoint) October 10, 2025 (చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..) -
గ్రామాల్లో ‘బిగ్’బజార్!
సామాన్య, పేద, మద్యతరగతి ప్రజలకు వారసంతలు బిగ్ మార్ట్లయ్యాయి. మరోవిధంగా చెప్పాలంటే.. ఉన్న ఊరులోకే నడిచే వచ్చే మొబైల్ మార్ట్లుగా మారాయి. ఇక్కడ నిత్యావసరాలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మసాలా, కూరగాయల విత్తనాలు, టమాట, వంకాయ, ఉల్లినారు, నువ్వులు, పెసలు, బబ్బెర్లు, అలసందలు, పసుపు, కొన్నిరకాల డిష్వాష్, డిటర్జెంట్ పౌడర్లు, సబ్బులు, చింతపండు, కారప్పొడి, ఎండు మిరపకాయలు, టీ పైడర్ ఇలా ఒక్కటేమిటీ.. అన్నిరకాల దుస్తులూ చవకగా లభిస్తున్నాయి. గతంలో మండల కేంద్రాల్లోనే జరిగే వారసంతలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి సుమారు నాలుగు వరకు అనుబంధ గ్రామాలు ఉంటున్నాయి. మండల కేంద్రాల్లో నిర్వహించే వారసంతలో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిఖని, వరంగల్, జమ్మికుంట, పరకాల, పెద్దపల్లి, కరీంనగర్ తదితర దూర ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు వచ్చి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరా మొబైల్ మార్ట్లు.. సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు మొబైల్ మార్ట్లుగా రూపాంతరం చెందిన వారసంతలు.. ఇప్పుడు ఒక్కోగ్రామంలో ఒక్కోవారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అటు వినియోగదారులకు, ఇటు చిరువ్యాపారులకు ఇవిఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వ్యాపారులకు ఉపాధి, వినియోగదారులకు బడ్జెట్ ధరల్లోనే అవసరమైన సరుకులు లభ్య మవుతున్నాయి. పంచాయతీలకూ ఆదాయం ఆయా గ్రామాల్లో నిర్వహించే వారసంత(మొబైల్ మార్ట్)ల ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం కూడా సమకూరుతోంది. ఒక్కో దుకాణ నిర్వాహకుడి(చిరు వ్యాపారి) నుంచి కనీసం రూ.20 నుంచి రూ.100 వరకు రుసుం వసూలు చేస్తున్నారు గ్రామపంచాయతీ సిబ్బంది. చాలామందికి ఉసాధి వారసంతలో వ్యాపారుల నుంచి నిర్వహణ రుసుం(చిట్టి) వసూలు చేసుకునేందుకు గ్రామానికి చెందిన పలువురు వ్యాపారులు.. ఏడాదిపాటు అనుమతి కోసం రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు బహిరంగ వేలం ద్వారా అనుమతి పొందుతున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.(చదవండి: దీపావళి కానుకగా రూ. 2 లక్షల నగదు..!) -
'శివ తాండవ స్తోత్రం'తో మారుమ్రోగిన ఇటలీ ..!
మన దేశంలో ఏ పండుగ లేదా ఏదైనా వివాహ ఆచారంలో దేవుడి పాటలతో ఆధ్యాత్మికానుభూతి పొందడం అత్యంత సహజం. కానీ ఇలాంటి దైవిక పాటలు పాశ్చాత్య దేశాల్లో అందులోనూ యూరోపియన దేశమైన ఇటలీలో ప్లేచేస్తే..ఔను మీరు వింటుంది నిజమే..అక్కడ ఈ పాటతో అందరూ ఒక విధమైన తన్మయత్వంతో ఊగిపోయారు. అంతేగాదు ఈపాట వైబ్ అక్క ప్రజలను ఓ ఊపు ఊపేసింది. వెస్ట్రన్ కల్చర్తో విభన్నంగా ఉండే మ్యూజిక్ ఫెస్ట్వెల్ ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత విశేషం. అసలేం జరిగిందంటే..ఇటలీలో జరిగిన ఒక మ్యూజిక్ వేడుకలో ఒక మహిళా డీజే శివతాండవ స్తోత్రాన్ని ఎలక్ట్రానిక్ డ్యాన్ మ్యూజిక్(ఈడీఎం) ట్రాక్గా ప్లే చేసి అందరిన్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సాంగ్ పవర్కో మరేమో గానీ అక్కడి ప్రజలు ఒక విధమైన ఎనర్జీతో ఊగిపోయారు. ఆ పాటకు లయబద్ధంగా డ్యాన్స్చేస్తూ ఆసక్తి కనబర్చడం విశేషం. కూడా ఈ పాట జోష్కి మమైకమైపోతూ చిందులేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారి చర్చనీయాంశంగా మారింది. ఇదేంటి విదేశాల్లో మన శివుడి భక్తిపాట అని విస్తుపోయారు. అయితే నెటిజన్లు కొందరూ భక్తిపాటలు ఇలా ప్లే చేయొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేయగా..శివుడిని అర్థం చేసుకున్నవారు, శివుడు తత్వం తెలుసకున్నావారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది అని కౌంటరిస్తూ పోస్టులు పెట్టారు. రావణుడి బ్రహ్మ పాడిన ఈ పాట విదేశీ శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేయడమే గాక, భారతదేశంలోని భక్తి పారవశ్యంతో కూడిన సంగీతం పవర్ ఏంటో నొక్కి చెప్పింది కదూ..!. View this post on Instagram A post shared by Times Now (@timesnow) (చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
భర్త క్షేమం కోరి కర్వా చౌత్ ఉపవాసం ఉంటే..పాపం విధి మరోలా..
"ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు" అన్న పాటలానే జీవితం ఉంటుంది. అప్పటి వరకు మనతో ఆడుతూ పాడుతూ సందడి చేసినవాళ్లు హఠాత్తుగా మనల్ని వదిలేసి వెళ్లిపోతే కచ్చితంగా ఠక్కున మన ఘంటసాలగారు పాడిన పాటల మదిలోకి వచ్చేస్తుంది. మనం ఒకటి అనుకుని సరదాగా గడిపితే విధి మరోలా మన కథ రాసేస్తుంటుంది. అలాంటి విషాద ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర సంఘటన పంజాబ్లో జరిగింది. పంజాబ్లోని బర్నాలాలో కర్వాచౌత్ వేడుకల సందర్భంగా తన భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంది 59 ఏళ్ల ఆశా రాణి. దక్షిణ భారతదేశంలో జరుపుకునే అట్లతద్ది మాదిరిగా జరుపుకునే పండుగే ఈ కర్వా చౌత్. అయితే ఈ కర్వాచౌత్ పండుగలో ఉపవాస విరమణ భర్తచేతుల మీదుగా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ ఆశారాణి అనే మహిళ కూడా భర్త క్షేమం కోరి ఉపవాసం ఉంది. అయితే ఈ వేడుకను ఆ రోజు(శుక్రవారం) సాయంత్రం స్నేహితుల ఇంటిలో జరుపుకోవాలని భావించి మనవరాలు, భర్తతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రుడి రాకకై నిరీక్షిస్తూ..అంతా సందడి సందడిగా గడిపారు. ఈలోపు నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేలా కాస్త ఆటపాటలు, నృత్యాలతో నిరీక్షిస్తున్నారు. ఈ ఆశారాణి కూడా అందులో భాగంగానే ఓ పాటకు వారందరితో కలిసి నృత్యం చేస్తూ..ఒక్కసారిగా కుప్పకూలిపోయింద. సకాలంలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు దృవీకరించారు వైద్యులు. అప్పటిదాక ఆనంద సంతోషాలతో తేలియాడిన ఆ రెండు కుటుంబాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉండి..ఆమెనే సుమంగళిగా మృత్యుఒడికి వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఇలాంటి ఘటనలు చూడగానే.. ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికీ తెలియదు..విధి చాలా బలీయమైనది అన్న మాటలు స్పురణకు వస్తాయి కదూ..!. ..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ..అప్పటి దాక ఆడిపాడి..మనముందే తనువు చాలిస్తే..ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేరెవ్వరూ..!. సో బీకేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో..సదా అప్రమత్తంగా ఉండండి.Karwa Chauth celebration in Barnala turn tr@gic after woman coll@pses while dancing#KarwaChauth #KarwaChauthcelebration pic.twitter.com/dz3G5APp7r— True Scoop (@TrueScoopNews) October 13, 2025 (చదవండి: ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు) -
'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్టాపిక్గా మారి వార్తల్లో నిలిచింది. అతడే న్యూజిలాండ్కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు. ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్లైన్లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..
ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజుని దక్షిణ భారతదేశంలో అట్లతద్దిగా జరుపుకుంటే ఉత్తర భారతదేశంలో పౌర్ణమి తర్వాత నాల్గవ రోజు.. చవితి తిధి నాడు కర్వాచౌత్ పండుగ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలు, వివాహితులకు, కన్నెపిల్లలకు ప్రత్యేకం అనే చెప్పాలి. ఆ రోజు కన్నెపిల్లలు మంచి వరడు కోసం, పెళ్లైన స్త్రీలు తమ భర్త క్షేమం కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంంటారు. సాయంత్రం చంద్ర దర్శన అనంతరం విరమిస్తారు. కానీ ఉత్తర భారతదేశంలో మాత్రంలో చంద్ర దర్శనాన్ని భర్త సమక్షంలో సందర్శించి ఉపవాసాన్ని విరమించడం విశేషం. అయితే ఈ పండుగ భారతీయ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా ప్రజలు విభిన్న రకాలుగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..ఈ ఆచారాన్ని ఓ విదేశీయుడి ఆచారించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. బ్రిటిష్ కంటెంట్ క్రియేటర్ నిక్ బుకర్ తన భార్య కోసం ఉపవాసం ఉండటం సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు హాట్టాపిక్గా మారింది. భారతచరిత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సదా షేర్ చేసుకునే నిక్ బుకర్ "మై డెస్పరేట్ కర్వా చౌత్ సెర్చ్ ఫర్ ది మూన్" అనే వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిక్ తన భార్యతో కలిసి ఈ పండుగను జరుపుకున్నానని, ఉపవాసం కూడా ఉన్నట్లు వెల్లడించాడు. ఆయన ముంబైలోని జుహూ బీచ్ సమీపంలో తన నివాసంలో ఈ పండుగను నిర్వహించి ఉపవాసం ఉన్నారు. అయితే త్వరితిగతిన చంద్రుడిని సందర్శించేందుకు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి..అక్కడ లోధి హోటల్ నుంచి చంద్రుడిని చాలా త్వరితగతిన సందర్శించి తన భార్యతో కలిసి ఉపవాసం విరమించినట్లు తెలిపాడు. అంతేగాదు కర్వా చౌత్ను ఎందుకు జరుపుకుంటారు చాలా చక్కగా వివరించి భారతీయులందరి మనసులను గెలుచుకున్నాడు. చివరగా ఆ వీడియోలో ఈ రోజు ఉపవాసం ఉన్నవారందరికీ శుభాకాంక్షలు అని చెప్పాడు. అయితే నెటిజన్లంతా మా భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని నిక్ని ఆశీర్వదిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by IndoGenius | Nick Booker (@indogenius) (చదవండి: 'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!) -
'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!
నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే ఏ ఆఫ్రికాకో, అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ని... గ్లూకోజ్గా, ఆక్సిజన్గా మార్చి శక్తిని పొందటం.మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.2. ఫ్లైపేపర్ ప్లాంట్ జిగట ఉచ్చుల జిత్తులమారి‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్ మోడ్) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్ లుహర్స్ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి. 3. హ్యామర్ ఆర్కిడ్ ‘మాస్టర్స్’ డిగ్రీ మాయలాడి!డ్రాకేయా గ్లిప్టోడాన్ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.4. డెత్ ఆపిల్ ట్రీ వల విసిరే వగలాడి‘హిప్పోమేన్ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్’ అని కూడా అంటారు. అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది. మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్ పండ్లలా కనిపిస్తాయి.5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి‘నెపెంథెస్ అటెన్ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్ నెట్లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్ అటెన్ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద. కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్ అటెన్బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.6. పోర్క్యుపైన్ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి‘సోలనమ్ పైరాకాంతోస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.పోర్క్యుపైన్ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.7. డాల్స్ ఐ ప్లాంట్భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.8. జెల్లీ ఫిష్ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్ టెంటకిల్స్ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.విక్టోరియా వాటర్ లిల్లీ తేలియాడే ‘శివగామి’అమెజాన్ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.10. డెడ్ హార్స్ అరమ్ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ‘హెలికోడిసెరోస్ మస్కివోరస్’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్ లిల్లీస్ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఆ ఊరి జనం కేవలం 130 మందే, స్త్రీలు ఎంతమందో తెలుసా?
హిమాచల్ ప్రదేశ్ స్పిటి వ్యాలీలోని కోమిక్ గ్రామం గురించి విన్నారా? సంవత్సరంలో కొన్ని రోజులు తప్ప ఇక్కడ ఎప్పుడూ మంచే ఉంటుంది. ఇక్కడ ఎంత మంది నివశిస్తారో తెలుసా? కేవలం 130 మంది. వారిలో 90 మంది పురుషులు, 40 మంది స్త్రీలు. మన దేశంలో అత్యంత తక్కువ జనాభా ఉన్న కొండ పల్లె ఇదే.సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉండే కోమిక్ ఆకాశాన్ని తాకే ఎత్తులో, చుట్టూ తెల్లటి హిమకొండలతో, పచ్చిక బయలను తనలో నింపుకుని ప్రకృతి ప్రేమికులను ఎంతగానో మైమరిపిస్తుంటుంది. ఇది బౌద్ధ సంప్రదాయాలకు నెలకొలుపు. ఇక్కడి తంగ్యుద్ మఠం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం సాక్య సెక్ట్కు చెందినది. మాత్రే బుద్ధ (ఫ్యూచర్ బుద్ధ) విగ్రహన్ని కలిగిన ఏకైక ్ర΄ాంతం ఈ కోమిక్. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి తెరిచే రహస్య భాండాగారాలైన డ్రాగన్ గుడ్డు, యూనికార్న్ శృంగం వంటి అద్భుతాలు సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మఠం భారతదేశంలోని అత్యంత ఎత్తైన మఠాల్లో ఒకటి. (5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!)కోమిక్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ప్రకృతి ప్రేమికులకి ఇదొక స్వర్గం. హిమాలయాల మధ్య హైకింగ్ చేస్తూ, ఫాసిల్స్ శోధిస్తూ, స్థానిక యాక్ మిల్క్ టీ సిప్ చేస్తూ, గ్రామస్తుల ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చు. స్పిటియన్ వంటకాలు, బటర్ టీ రుచి చూడటం ఒక అద్భుత అనుభవం. ఢిల్లీ నుండి మనాలీ లేదా షిమ్లా మీదుగా 700–800 కి.మీ. ప్రయాణించి కాజా నుండి ఒక గంటలో కోమిక్ చేరుకోవచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం. ఎందుకంటే శీతాకాలంలో మంచు రోడ్లను కప్పివేసి ప్రయాణాన్ని జటిలం చేస్తుంది. కోమిక్ ఒక అద్భుత ప్రపంచం. ఇక్కడ గడిపే ప్రతి క్షణం జీవితానికి ఒక మధురా నుభూతిని ఇస్తుంది.ఇదీ చదవండి : స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్ -
స్కామ్ కాల్ అనుకుని...కట్ చేస్తే రూ.9 కోట్ల జాక్పాట్
ఒక ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. తనకు వచ్చిన ఫోన్ కాల్, ఏ స్పామ్ కాలో, స్కామ్ కాలో అనుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క క్షణంలో మెటా లాటరీ మిస్ అయ్యిపోయేదే. ఆ తరువాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. విషయం ఏమీ అర్థం కాలేదు. అసలు సంగతి తెలియాలంటే.. ఈ కథనాన్ని చదవాల్సిందే.మిచిగాన్లోని వెస్ట్ల్యాండ్కు చెందిన 65 ఏళ్ల మహిళ వాలెరీ విలియమ్స్ తనకు లాటీరలో అదృష్టం వరిస్తుందేమో ఆశ ఉన్నా.. కచ్చితంగా తనకు కోట్ల రూపాయల అదృష్టం వరించబోతోందని మాత్రం అస్సలు ఊహించలేదు. అందుకే ఫోన్ కాల్ రూపంలో వెతుక్కుంటూ వచ్చిన లక్ను స్కామ్ అనుకుంది. నిజానికి ఆ ఫోన్ కాల్ వాస్తవానికి జీవితాన్ని మార్చే వార్త అని తెలుసుకుని షాక్ అయ్యింది. మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్అవేలో తనను పోటీదారుగా ఎంపిక చేశారని తెలుసుకుని షాక్ అయింది విలియమ్స్. కట్ చేస్తే విలియమ్స్ మిలియన్ డాలర్ల (రూ.8.8 కోట్లు బహుమతిని గెలుచుకుంది. ఇన్నేళ్లుగా రాని అదృష్టం ఇంకేమి వస్తుంది అనుకుంది. కానీ అనూహ్య విజయం అవాస్తవంగా అనిపిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: 5 నిమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!సెప్టెంబర్ 19న డెట్రాయిట్లోని కొమెరికా పార్క్లో బహుమతి చక్రం తిప్పడానికి ఆహ్వానించారని ఈ స్పిన్ ఆమెకు ఈ బహుమతిని సంపాదించిపెట్టింది.కొమెరికా పార్క్లో భారీ జనసమూహం మధ్య ఎలక్ట్రిక్ ఫ్యామిలీ గివ్అవే విజేత వాలెరీ విలియమ్స్కు అభినందనలు అని లాటరీ కమిషనర్ సుజన్నా ష్క్రెలి అనౌన్స్ చేసేదాకా నమ్మలేదని..ఇప్పటికీ షాక్లో ఉన్నాను అని తెలిపింది విలియమ్స్. గెల్చుకున్న డబ్బును ఏం చేయాలనే పెద్ద ప్లాన్లు ఏవీ ప్రస్తుతానికి లేక పోయినా, భర్తతో కలిసి హాలిడే ట్రిప్కు వెళతానని, మిగతాది పొదుపు చేసుకుంటానని తెలిపింది. మిచిగాన్ లాటరీ యాప్ ద్వారా తాను గెలవని టిక్కెట్లను స్కాన్ చేయడం ద్వారా తాను రెండవ అవకాశం బహుమతిగా పొందుతున్నానని ఆమె గ్రహించలేదని మిచిగాన్ లాటరీ అధికారులు చెప్పారు. చాలా మంది విజేతలు రెండో అవకాశాన్ని పట్టించుకోరనీ, కానీ తమ ఖాతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అధికారిక నోటిఫికేషన్ల కోసం అప్రమత్తంగా ఉండాలని గుర్తు చేశారు. -
అద్భుతం.. మనిషికి పంది కాలేయం!
ఆధునిక వైద్య చరిత్రలో మరో అద్భుతం. కాలేయం సమస్యలతో బాధే పడే వారికి ఊరట నిచ్చే వార్త. విజయవంతంగా మనిషికి పంది కాలేయం (Pig Liver) అమర్చారు చైనా వైద్యులు. అంతేకాదు దాని పనితీరు కూడా బేషుగ్గా ఉందని ప్రకటించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినతను 170 రోజులు పైగా బతికివున్నాడని, పంది కాలేయం అమర్చిన వారిలో ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి సిరోసిస్, హెపటైటిస్ బితో బాధపడుతున్నాడు. కాలేయం పూర్తిగా పాడైపోవడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ (Liver transplantation) చేయాలని నిర్ణయించారు. జన్యుమార్పిడి చేసిన పంది కాలేయాన్ని అతడికి అమర్చారు. తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అన్హుయ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ బీచెంగ్ సన్ నాయకత్వంలో ఈ ప్రయోగం జరిగింది.ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కాలేయం పనితీరు బాగానే ఉందని, జీవక్రియలు సాఫీగా సాగాయని వైద్యులు తెలిపారు. అయితే 38వ రోజున చిన్న సమస్య తలెత్తినా పరిష్కరించామన్నారు. జెనోట్రాన్స్ప్లాంటేషన్- సంబంధిత థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపతి కారణంగా ఏర్పడిన గ్రాఫ్ట్ తొలగించామన్నారు. కాలేయ మార్పిడిన జరిగిన వ్యక్తి 171 రోజులు జీవించిన తర్వాత అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించాడని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా కాలేయ మార్పిడిలో ఎదురయ్యే సవాళ్లను చాలా వరకు అధిగమించామని అన్నారు.భవిష్యత్ ఆశాకిరణం"గుండె లేదా మూత్రపిండాలతో పోలిస్తే కాలేయ మార్పిడి చాలా క్లిష్టమైందని అందరూ భావిస్తుంటారు. కానీ మా ప్రయోగం తర్వాత ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను" అని డాక్టర్ బీచెంగ్ సన్ CNNతో అన్నారు. ఈ ప్రయోగాన్ని భవిష్యత్ ఆశాకిరణంగా వర్ణించారు జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీనర్ వెడెమెయర్. కాలేయ మార్పిడి ప్రయోగాల్లో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలనే విషయాన్ని కూడా ఈ ప్రయోగం వెల్లడి చేసిందన్నారు. అతడే ఫస్ట్!రీడింగ్ క్రానికల్ ప్రకారం.. పరిమాణంలో మనిషి అవయవాలకు వరాహ అవయవాలు పోలి ఉండటం, పంది జన్యు- సవరణ సాంకేతికత లభ్యత కారణంగా వీటి నుంచే మనుషులకు అవయవ మార్పిడి చేస్తున్నారు. తొలిసారిగా అమెరికాకు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి 2022లో జన్యుమార్పిడి చేసిన పంది గుండెను (Pig Heart) అమర్చారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది. అవయవ మార్పిడి జరిగిన రెండు నెలల తర్వాత బెన్నెట్ మరణించాడు.పంది కిడ్నీ కూడా..అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమాన్ గత సంవత్సరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండ్రాలను (Pig Kidney) ఆయనకు అమర్చారు. ఆ ప్రక్రియ తర్వాత రెండు నెలల్లో రిచర్డ్ మరణించాడు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజు 25 లక్షల సంపాదన! -
భర్త మానసిక క్షోభకు రూ. 37 లక్షలు : ప్రియుడికి భారీ షాకిచ్చిన కోర్టు
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.తైవాన్కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్తో రిలేషన్లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్కి ఇచ్చింది కోర్టు -
కరెంట్ షాక్ నుంచి పాముని కాపాడారు!
జడ్చర్ల టౌన్: విద్యుదాఘాతంతో గాయపడిన జెర్రిపోతుకు సర్ప రక్షకుడు సదాశివయ్య బుధవారం చికిత్స చేసి కాపాడారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీలక్ష్మి రాజేంద్రనగర్ ఇండస్ట్రీలో పవర్ బోర్డులోకి జెర్రిపోతు చేరడంతో విద్యుదాఘాతానికి గురైంది.ఇది గమనించిన ఇండస్ట్రీ యజమాని సర్ప రక్షకుడు (Snake Saver) సదాశివయ్యకు సమాచారం అందించాడు. దీంతో ఆయన బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాలలోని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంలో చికిత్స చేశారు. ప్రస్తుతం జెర్రిపోతు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.ఒకే విద్యార్థి.. ఒకే ఉపాధ్యాయుడు పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి (parvathagiri) మండలంలోని రావూరు ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి, ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐదుగురు విద్యార్థులు ఉండే విధంగా ఉపాధ్యాయుడు చూడాలని కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓ ఆదేశించారు. అయినా ఆ పాఠశాలకు ఐదుగురు విద్యార్థులు రాలేకపోయారు.పాఠశాలను తీసేద్దామనుకున్న క్రమంలో ఒక విద్యార్థి చేరగా ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. పాఠశాలను గ్రామంలో ఉంచే విధంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులను పెంచే విధంగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. చదవండి: అయ్యో.. హైదరాబాద్లో ఇన్ని కేసులు మూసేశారా? -
35 ఏళ్లకే కోట్ల సంపాదన, బైక్స్ పిచ్చి...నమ్మలేని నిజాలు
పంజాబీ గాయకుడు(Punjabi Singer) రాజ్వీర్ జవాండా (Rajvir Jawanda) అకాల మరణం యావత్ సంగీత ప్రపంచానికి కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,35 ఏళ్ల వయసులో అనంత లోకాలకు చేరుకోవడం అభిమానులను షాక్కు గురిచేసింది. ఒక రత్నాన్ని కోల్పోయామంటూ సంగీతాభిమానులు, పెద్దలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని, ఇంకా మరింత బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఆయన మరణం అత్యంత విషాదకరం. రాజ్వీర్ జవాండా ఆస్తుల విలువ(Net worth) ఎంత అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.ఆస్తి ఎంత అంటే?రాజ్వీర్ జవాండా సంగీతం, పలు మూవీల్లో నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్లు , ఇతర పెట్టుబడుల ద్వారా భారీ సంపదను కూడబెట్టాడు. పంజాబీ సంగీత రంగంలో ప్రముఖ వ్యక్తిగా, రాజ్వీర్ జవాండా తన పాటల బహుళప్రజాదరణ పొందాడు. భారీ ఆదాయాన్ని సంపాదించాడు. సర్దారీ, కంగాని , మేరా దిల్తో సహా అనే పాటలు అనేక ప్లాట్ఫాంలలో మోత మోగిపోయాయి. మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్ సాధించాయి. దీనికి రాయల్టీ కూడా భారీ మొత్తంలోనే సంపాదించాడు. వీటితోపాటు కెనడా,యూకే, యూఎస్ వంటి దేశాలలో అంతర్జాతీయ పర్యటనలు, లైవ్ షోలు మరో ప్రధాన ఆదాయ వనరు. దీనికి సోషల్ మీడియా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజ్వీర్ ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ డీల్స్ తో సంపాదన కూడా తక్కువేమీ కాదు. అలా అక్టోబర్ 8, 2025 నాటికి, రాజ్వీర్ నికర విలువ రూ. 4–5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.సంగీతంతో పాటు,సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్ జాన్ , మిండో తసీల్దార్ని లాంటి పంజాబీ చిత్రాలలో నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాజ్వీర్. అలాగే ముందు చూపుతో ఇతర ఇతర వెంచర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.చదవండి: Mounjaro వెయిట్లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!పంజాబ్లోని లూధియానాలో 1990లో జన్మించిన రాజ్వీర్ జవాండా పాఠశాల విద్య తరువాత జగ్రాన్లోని డీఎవీ కళాశాల నుండి పట్టభద్రు డయ్యాడు. తరువాత పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి థియేటర్ అండ్ టెలివిజన్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తండ్రి కరం సింగ్ బాటలో నడుస్తూ 2011లో పంజాబ్ పోలీస్లో కానిస్టేబుల్గా చేరాడు. అయితే, ఆయన సంగీతం పట్ల తనకున్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే సైడ్ కెరీర్గా పాటలు రికార్డ్ చేయడం , తన షిఫ్ట్ల తర్వాత ప్రదర్శన ఇచ్చేవారు. మంచి పాపులారిటీ రావడంతో పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టేందుకు అందువల్ల, 2019 లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.2020-21లో ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన జరిగినప్పుడు, రాజ్వీర్ కూడా రైతులకు మద్దతుగా వచ్చాడు. నిరసన తెలుపుతున్న రైతుల కోసం వేదికపై ఉచితంగా పాడేవాడు. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా, ఒక ప్రదర్శన సమయంలో తన తండ్రియ చనిపోయారు. ఈ వార్త తెలిసినా కూడా వేదికపై పాటను పూర్తి చేసి, అంత్యక్రియల కోసం బయలుదేరాడు.రాజ్వీర్కు బైక్లంటే పిచ్చిరాజ్వీర్ జవాండాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం. అతను తరచుగా తోటి బైకర్లతో కలిసి కొండలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. ఈ పర్యటనల సమయంలో, అతను హోటళ్లలో బస చేయకుండా రోడ్డు పక్కన క్యాంప్ చేసేవాడు. రాజ్వీర్ కొన్ని నెలల క్రితం రూ. 27 లక్షల విలువైన కొత్త BMW బైక్ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు , దానిని ఒక పాటలో కూడా ఉపయోగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఈ BMW బైక్ను నడుపుతున్నాడు. బైకింగ్కు అవసరమైన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అతన్ణి మృత్యువు వీడలేదు.చదవండి: Rajvir Jawanda పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్రాజ్వీర్ జవాండా కుటుంబంరాజ్వీర్ తాత సౌదాగర్ సింగ్. అమ్మమ్మ సుర్జిత్ కౌర్ తండ్రి రిటైర్డ్ ఏఎస్ఐ కరం సింగ్ . తల్లి పరమ్జిత్ కౌర్ ఈమె మాజీ సర్పంచ్. జవాందా, భార్య అశ్విందర్ కౌర్తో పాటు, ఇద్దరు పిల్లలు కుమార్తె హేమంత్ కౌర్ చ కుమారుడు దిలావర్ సింగ్. జవాందాకు కమల్జిత్ కౌర్ అనే సోదరి కూడా ఉంది. -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు, కొడుక్కి పాలాభిషేకం
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట. విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్స్టాలో వైరల్ అయ్యింది.చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025 ‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు. -
పెర్ఫ్యూమ్ తెచ్చిన తంటా....తీవ్ర ఆందోళనలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ
ఒక చిన్న పొరపాటుతో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఇబ్బందులు పాలయ్యాడు. అమెరికాలోని బెంటన్లో తన అమెరికన్ భార్యతో నివసిస్తున్న కపిల్ రఘును పెర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా అర్కాన్సాస్లో అరెస్ట్ చేశారు. వీసాను రద్దు చేశారు. దీంతో అతని దేశ బహిష్కరణ తప్పదేమో అనే ఆందోళనలో కుటుంబం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫుడ్ డెలివరీ డ్రైవర్గా పనిచేసే రఘు అనే 32 ఏళ్ల వ్యక్తిని మే 3న బెంటన్ పోలీసులు చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా చేసిన తనిఖీల్లో దొరికిన పెర్ఫ్యూమ్ బాటిల్ పెద్ద దుమారాన్నే రేపింది. రఘు కారు సెంటర్ కన్సోల్లో "ఓపియం" (నల్లమందు) అని రాసి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ను కనుగొన్నారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు అనుమానించారు. అది కేవలం పెర్ఫ్యూమ్ అని రఘు పదే పదే వివరణ ఇచ్చినా, పోలీసులు విశ్వసించలేదు. చివరికి రఘుని అరెస్టు చేశారు. అప్పటినుంచి అతనికి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. చట్టపరమైన, ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి దారితీసింది. వీసాను రద్దు చేయడంతో మరింత ఆందోళన నెలకొంది.చదవండి: నో అన్న రెండేళ్లకే గూగుల్ ఇండియా కీలక బాధ్యతలు, ఎవరీ రాగిణీ?మరోవైపు అర్కాన్సాస్ స్టేట్ క్రైమ్ ల్యాబ్ తదుపరి పరీక్షలో ఆ పదార్థం హానికరం కాదని , మాదకద్రవ్యాలు లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, రఘు ఇప్పటికే మూడు రోజులు సెలైన్ కౌంటీ జైలులో గడిపాడు.మే 20న జిల్లా కోర్టు మాదకద్రవ్యాల కేసును కొట్టివేసిన తర్వాత ,ఈలోపు రఘు వీసా గడువు ముగిసిందంటూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని, లూసియానాలోని ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తరలించి, 30 రోజుల పాటు నిర్బంధించారని రఘు న్యాయవాది మైక్ లాక్స్ వెల్లడించారు.దీనిపై బాధితుడు రఘు తీవ్ర ఆందోళన వ్యక్తంచే శారు. తన భార్య యాష్లీ మేస్, మొత్తం భారాన్ని మోస్తోందని, కోర్టు ఖర్చులు, భరించడం కష్టం మారిందని వాపోయారు. ఈ జంటకు ఈ ఏప్రిల్లో వివాహం అయింది. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయానికి రాసిన లేఖలో, రఘు తన వీసాను తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశాడు. కపిల్ రఘు విడుదల అయినప్పటికీ, @బహిష్కరణ' (deportation) స్టేటస్లో ఉంటాడని, మరింత ముఖ్యంగా, ఇది అతను పని చేయకుండా ,డబ్బు సంపాదించకుండా నిరోధిస్తుందని ఇది మరింత ఆందోళన కరమని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే తన భర్తను నిర్దోషిగా బయటకొచ్చే క్రమలో అయ్యే ఖర్చుల కోసం భార్య ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షలు!
మనిషి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హీరో అనుకున్న వారు జీరో కావొచ్చు. ఎందుకూ పనికిరారు అనుకున్నవారు ఎవరూ ఊహించని విధంగా పైకి ఎదగవచ్చు. శిఖరం చేరిన వారు పాతాళానికి పడిపోవచ్చు. ఇలాంటి వారిలో మళ్లీ పైకి లేచేవారూ ఉంటారు. జీవితాన్ని మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టి ముందుకెళ్లడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి ఓ వ్యాపారవేత్త గురించి మనం తెలుసుకుందాం. అయితే ఆయన మనదేశానికి చెందిన వాడు కాదు. స్ఫూర్తి పొందడానికి ఎక్కడివారైతే ఏంటి?చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! చనాకు చెందిన 57 ఏళ్ల టాంగ్ జియాన్ 2000 సంవత్సరం ప్రాంతంలో నెలకు మూడు మిలియన్ యువాన్ల (ప్రస్తుత రేటు ప్రకారం సుమారు ₹3.7 కోట్లు) వరకు సంపాదించేవాడు. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని తీరప్రాంత నగరమైన కింగ్డావోలో (Qingdao) మూడు ప్రసిద్ధ రెస్టరెంట్లు, బార్లు ఉండేవి. జీవితంగా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఊహించని మలుపు తిరిగింది. తెలియని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి టాంగ్ జియాన్ చేతులు కాల్చుకున్నాడు. త్వరగా సంపాదించాలన్న దురాశతో సొంత డబ్బుతో పాటు ఇతరులను నుంచి అప్పులు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయాడు. ఫలితంగా 2015 నాటికి రూ. 57 కోట్లు అప్పులతో దివాళా తీశాడు.వీధి దుకాణంతో రీస్టార్ట్వ్యాపారంలో సర్వం కోల్పోవడంతో అతడి జీవితం తలకిందులైంది. రెస్టరెంట్లను మూసివేశాడు. ఆస్తులు మొత్తం అమ్మినా అప్పులు తీరలేదు. భార్యతో తరచుగా గొడవ పడేవాడు. దీంతో భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఊహించని విధంగా ఒడిదుడుకులు ఎదురు కావడంతో ఎందుకు బతకాలన్న ఆలోచనలు వెంటాడేవి. అయితే తనపై ఆధారపడిన అమ్మ, కన్నబిడ్డ గుర్తుకు రావడంతో ఎలాగైనా జీవితాన్ని ఈదాలని అనుకున్నాడు. 2018లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. పాత రెస్టరెంట్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (street food stall) స్టార్ట్ చేశాడు. ఇంట్లో తయారుచేసిన సాసేజ్లను అక్కడ అమ్మడం ప్రారంభించాడు. 74 ఏళ్ల తల్లి అతడికి సహాయం చేసేది.ఒకప్పుడు బాగా బతికిన టాంగ్ జియాన్ (Tang Jian) చివరికి వీధి దుకాణం పెట్టుకోవాల్సి రావడంతో న్యూనతకు గురయ్యాడు. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించేవాడు. అయితే పొరుగున ఉండే వారిలో ఒకరు అతడిని గుర్తు పట్టడంతో ముఖం దాచుకోవడం మానేశాడు. ధైర్యంగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు. చేతితో తయారు చేసిన నాణ్యమైన సాసేజ్లను తక్కువ ధరకు విక్రయించడంతో అతడి వ్యాపారం దినదినాభివృద్ధి సాధించింది. రోజుకు 2 టన్నుల సాసేజ్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు టాంగ్ జియాన్ రోజుకు దాదాపు 200,000 యువాన్లు (₹25 లక్షలు) సంపాదిస్తున్నాడు. పలు షాపింగ్ సెంటర్లలో అతడి అవుట్లెట్లు ఉన్నాయి.కోవిడ్ దెబ్బ కొట్టినా..సంకల్పం గట్టిగా ఉంటే శిఖరస్థాయికి నుంచి కిందకు పడిపోయినా మళ్లీ పైకి లేవొచ్చని టాంగ్ జియాన్ దీమాగా చెబుతున్నాడు. కోవిడ్-19 (Covid-19) సమయంలో వ్యాపారం మందగించడంతో డిజిటల్ బాట పట్టాడు. ఆన్లైన్ అమ్మకాలతో దాదాపు 12 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. తాజాగా కృత్రిమ మేధస్సు సహాయంతో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాడు. ఒక సెషన్లో మిలియన్ యువాన్ (₹1.25 కోట్లు) విలువైన వ్యాపారం చేసే స్థాయికి చేరుకున్నాడు. 2027 నాటికి అప్పులన్నీ తీర్చేయాలన్న లక్ష్యంతో అతడు ముందుకు సాగుతున్నాడు. స్ఫూర్తిదాయకంటాంగ్ జియాన్ ప్రస్థానాన్ని 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' ప్రచురించింది. దీన్ని చదివిన పాఠకులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడాలని టాంగ్ జీవితం బోధిస్తోందని పేర్కొంటున్నారు. ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయినా పట్టుదలతో పోరాడిన టాంగ్ జీవితం స్ఫూర్తిదాయకమని (inspiring) అంటున్నారు. సంకల్పం, సహనంతో అనుకున్నది సాధించవచ్చని టాంగ్ మరోసారి రుజువు చేశాడని మెచ్చుకుంటున్నారు. చదవండి: డొనాల్డ్ ట్రంప్ నాణెంపై వివాదం -
ఐకానిక్ ఐఫిల్ టవర్ ఎన్ని సార్లు మూత పడిందో తెలుసా?
అపురూపమైన అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి పారిస్ నగరంలో ఉన్న ఐఫిల్ టవర్. జీవితంలో ఒక్కసారైనా దీన్ని చూడాలని ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా ప్రేమ పక్షులకు ఇది ఫ్యావరెట్ డెస్టినేషన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే దీనిని ప్రౌడ్ ఆఫ్ ఫ్రాన్స్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఐఫెల్ టవర్ తన అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది.అయితే 136 సంవత్సరాల చరిత్రలో, ఈ స్మారక చిహ్నం అనేక సందర్భాల్లో మూతపడింది. సమ్మెలు , కార్మికుల నిరసనలు, భద్రతా ఆందోళనలు, 2024 ఒలింపిక్స్ సందర్బంగా, కోవిడ్ మహమ్మారి. 2015, పారిస్ ఉగ్ర దాడులు, కత్తిపోట్లు, సందర్భంగా ఐకానిక్ ఐఫిల్ టవర్ను మూసివేశారు.తాజగా ఫ్రాన్స్ అంతటా వేలాది మంది కార్మికుల ఆందోళన, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఐకానిక్ ఐఫిల్ టవర్ ప్రస్తుతం మూతపడింది. అక్టోబర్ 2న దీన్ని మూసివేశారు. ఎపుడెపుడు మూత పడిందంటే!2015, నవంబర్ పారిస్లో ఉగ్రదాడులనేపథ్యంలో మూసివేశారు.2017లో కత్తి దాడి: ఆగస్టు 2017లో, పర్యాటకులు , భద్రతా దళాల ముందు ఒక వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో మూసివేశారు.ఆగస్టు 2018: సిబ్బంది వాకౌట్: ఆగస్టు 2018లో, సందర్శకుల నిర్వహణలో మార్పులకు వ్యతిరేకంగా కార్మికుల సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ను రెండు రోజులు మూసి వేయాల్సి వచ్చింది. 2019, మేలో : ఒక వ్యక్తి ఐపిల్ టవర్పై ఎక్కుతున్నట్లు కనిపించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అధికారులుఐఫిల్ టవర్ను ఖాళీ చేయించారు.2020 కోవిడ్-19 మహమ్మారి: కోవిడ్-19 మహమ్మారివిస్తరణ, లాక్డౌన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా దీన్ని మూసివేశారు.ఘోరమైన కత్తిపోట్లు : డిసెంబర్ 2023 డిసెంబరులో ఐఫెల్ టవర్ దగ్గర ఒక జర్మన్ పర్యాటకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో దీన్ని ఉగ్రవాద దాడిగా భావించిన అధికారులు దీన్ని మూసివేశారు.2024, ఫిబ్రవరి: సిబ్బంది సమ్మె కారణంగా ఐఫెల్ టవర్ మరోసారి మూసివేతను ఎదుర్కొంది. ఈసారి, నిర్వహణ ,సిబ్బంది సంక్షేమంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. SETE అనే ఆపరేటర్ నిర్వహణ బడ్జెట్ను రెట్టింపు చేస్తామని మరియు టిక్కెట్ ధరలను పెంచుతామని హామీ ఇచ్చినా సమ్మె కొనసాగడంతో, ఫిబ్రవరి 24 ఉదయం స్మారక చిహ్నాన్ని మూసివేశారు.చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ఆగస్టు 2024: ఒలింపిక్స్కు ముందు : వేసవి ఒలింపిక్స్ ముగింపు వేడుకకు కొన్ని గంటల ముందు, టవర్ ఎక్కుతూ ఒక దుండగుడు కనిపించడంతో ఐఫిల్ టవర్ను మళ్ళీ ఖాళీ చేయించారు. 3. ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలు2024, సెప్టెంబర్లో: 2024 వేసవి ఒలింపిక్స్ తర్వాత, ఐఫెల్ టవర్ కొన్ని మార్పులకు గురైంది. ఈ క్రీడల కోసం30 టన్నుల ఒలింపిక్ రింగులను ఏర్పాటుచేశారు. వీటిని తొలగించేందుకు సెప్టెంబరులో ఒకసారి మూసివేశారు.కాగా పారిస్లోని చాంప్ డి మార్స్పై 330 మీటర్ల ఎత్తులో లా డామ్ డి ఫెర్ (ఫ్రెంచ్లో "ఐరన్ లేడీ") ఐఫిల్ టవర్ కొలువు దీరింది. ఈ టవర్ను 1889 లో నిర్మించారు. 330 మీటర్ల పొడవైన ఈ టవర్ నిర్మాణానికి 70 లక్షల కిలోల ఇనుమును ఉపయోగించారు. 300 మంది కార్మికులు అందమైన భవనాన్ని 2 సంవత్సరాల 2 నెలల 5 రోజుల్లో పూర్తి చేశారని చెబుతారు. చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..?
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్ఫ్లుయెన్సర్ గీ. View this post on Instagram A post shared by Garrett Gee (@garrettgee) (చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!) -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
ఫ్యామిలీ మొత్తం.. అక్కడే చదివారు!
ఉన్నతవిద్య అభ్యసించడానికి వారికి పరిస్థితులు అనుకూలించలేదు.. సంప్రదాయ విద్యను కొనసాగించే అవకాశమూ ఆ కుటుంబ సభ్యులకు కలగలేదు. కుటుంబ స్థితిగతుల నేపథ్యంలో చిరు ఉద్యోగంలో చేరి ఆ తర్వాత వివాహం, భార్య, పిల్లలు పోషణతో చదువుకు దూరమైన ఓ వ్యక్తి పట్టుదలగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. అంతే కాకుండా భార్య, పిల్లలను కూడా అదే వర్సిటీలో ఉన్నత చదువులు చదివించారు. ఒకే కుటుంబంలోని (entire family) ఐదుగురి ఉన్నత విద్యకు అంబేడ్కర్ వర్సిటీ ఆలంబనగా నిలిచింది. ఇదీ ఓ సార్వత్రిక కుటుంబం కథ. వివరాలు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన ఎస్.శ్రీధర్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో (TTD Board) చిరు ఉద్యోగి. కుటుంబ స్థితిగతులు కొంత మెరుగయ్యాక అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయంలో డిగ్రీలో చేరి ఉత్తీర్ణులయ్యారు. శ్రీధర్ బాటలో భార్య ఉమాదేవి కూడా పయనించి డిగ్రీ పట్టభద్రులయ్యారు. కుమారుడు కార్తీక్ కూడా అదే వర్సిటీ నుంచి ఎం.కామ్ పూర్తి చేసి అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె ఎస్.విద్య కూడా సార్వత్రిక విద్యాలయం నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేశారు. చిన్న కుమార్తె గాయత్రి కూడా ఈ వర్సిటీ నుంచే ఎం.కామ్ (M.Com) చదివి బంగారు పతకానికి ఎంపికైంది. కుటుంబ సభ్యులందరికీ అంబేడ్కర్ సార్వత్రిక విద్యాలయం బాసటగా నిలిచి వారి పురోగతికి దోహదపడింది. లక్ష్యసాధనలో వెనుకడుగు వేయొద్దు.. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుకడుగు వేయవద్దని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బంగారు పతక గ్రహీత ఎస్.గాయత్రీ అన్నారు. వర్సిటీ తిరుపతి అధ్యయన కేంద్రంలో ఎం.కామ్లో అత్యధిక మార్కులు సాధించడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రయోజిత బంగారు పతకానికి (Gold Medal) ఆమె ఎంపికైంది. బుధవారం జూబ్లీహిల్స్లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పతకాన్ని అందించారు.చదవండి: గ్రూప్ 1 ఉద్యోగాల్లో 66 శాతం మంది వారే! -
వర్గల్ శంభుని గుట్ట గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’
యుగాలు, తరాలు మారినా, శాస్త్ర సాంకేతిక పురోగతి రాకెట్ వేగంతో దూసుకెళుతున్నా.. ఆనాటి మానవుని మనోభావాలు, శిలా శాసనాలు ఏదో రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి విశేషాలకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం నిలయంగా మారుతోంది. ఈ ఆధారాలు మానవ వికాస పరిణామక్రమానికి ఎల్లలు లేవనే విషయాన్ని చాటి చెబుతున్నాయి. గజ్వేల్ ప్రాంతంలోని ఆదిమానవుల చారిత్రక విశేషాలు, శిలాశాసనాల ప్రత్యేకతలపై ఈ వారం కథనం. – గజ్వేల్ /వర్గల్(గజ్వేల్)గజ్వేల్ నియోజకవర్గంలో రెండో బాసరగా విశేష ఆదరణ కలిగిన చదువుల తల్లి కొలువుదీరిన వర్గల్ శంభుని కొండ గుహలు, నాడు ఆదిమానవుల నెలవులుగా విలసిల్లిన ఆనవాళ్లు ఉన్నాయి. వర్గల్ గ్రామానికి ఆగ్నేయ దిశలో ఎత్తైన కొండల శిఖరాగ్రాన శ్రీవిద్యాసరస్వతి అమ్మవారి సన్నిధానం ఎడమ పక్కన పెద్ద బండరాయి ఉన్నది. ఈ రాయి అడుగున ఎరుపు రంగులో అర్థం కాని భాషలో నాడు ఇక్కడ ఆవాసమున్న ఆదిమానవులు లిఖించినట్లు చెప్పబడుతున్న అక్షరాలు నేటికీ కనిపిస్తున్నాయి. గుట్ట పరిసరాల్లో ‘రాక్షసగూళ్లు’ శంభుని కొండ పరిసరాల్లో బృహత్ శిలాయుగపు నాటి ఆది మానవుల సమాధులుగా చెప్పుకునే ‘రాక్షస గూళ్లు’ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. మధ్యన సమాధి.. దాని చుట్టూ గుండ్రంగా, వృత్తాకారంలో పెద్ద పెద్ద బండలతో పేర్చినట్లు కని్పస్తాయి. వర్గల్కు నైరుతి దిశలో అటవీ ప్రాంతంతో కూడిన తుని్కఖాల్సా గ్రామ సమీపంలో పెద్ద సంఖ్యలో ‘రాక్షస గూళ్లు’ నాటి చరిత్రకు అద్దం పడుతున్నాయి.చదవండి: Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిపలు గ్రామాల్లో శిలా శాసనాలువర్గల్ మండలంలో రాజుల నాటి శాసనాలు కూడా ఉన్నాయి. వర్గల్లో మూల స్థాన ఆలయానికి క్రీస్తు శకం 970లో కొంత భూమిని అప్పటి రాజులు దానంగా ఇస్తున్నట్లు పేర్కొంటూ కన్నడ భాషలో దాన శిలా శాసనం చెక్కించారు. అలాగే సీతారాంపల్లిలో క్రీస్తు శకం 979 నాటి శిలాశాసనం ఉన్నది. దాదాపు 5 ఫీట్ల ఎత్తున్న శిలపై నాలుగు దిక్కులా కన్నడ భాషలో అక్షరాలు చెక్కించారు. వేలూరు గ్రామ పటేల్ చెరువు పూడిక తీత పనుల్లో బయటపడిన దీనిని గ్రామ కూడలిలో స్థాపించారు.గజ్వేల్ ప్రాంతంలోని కొండపాక రుద్రేశ్వరాలయ ప్రతిష్ట, ఆలయ నిర్వహణకు భూ దానం అంశాన్ని వివరిస్తూ నాడు కాకతీయ రుద్రదేవుడి కాలంలో క్రీ.శ.1194 వేయించిన శాసనమున్నది. అలాగే ఐతేశ్వర సోమనాథ ఆలయానికి సంబంధించి ఒకే శిలపై కాకతీయ గణపతిదేవ చక్రవర్తి కాలం నాటి రెండు శాసనాలున్నాయి.మర్కూక్ మండలం పాములపర్తి పటేల్చెరువు వద్ద క్రీ.శ.1148 నాటి దానశాసనంను గుర్తించారు. అదేవిధంగా ఇటిక్యాలలో మూడు పక్కల తెలుగు, ఒక వైపు సంస్కృత శ్లోకంతో కూడిన శాసనం కనపడుతుంది.చారిత్రక సంపదను సంరక్షించుకోవాలి పురాతన శాసనాలకు, చారిత్రక సంపదకు గజ్వేల్ నియోజకవర్గం నెలవు. అందుకు సంబంధించి అనేక ఆనవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇక్కడి ప్రాచీన చారిత్రక, పురాతత్వ, శిల్ప కళాసంపదలు కాలగర్భంలో కలిసిపోకముందే పరిరక్షించి భావితరాలకు అందజేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – డాక్టర్ హరినాథ్శర్మ రిటైర్డ్ ప్రభుత్వ తెలుగు శాఖాధిపతి -
చిన్న వయసు నుంచే పర్యావరణ కోసం పోరాడుతోంది
పిల్లలూ.... ఈ ప్రకృతి దానిలో భాగమైన భూమి మనకు దొరికిన వరం. ఇది మనుషులైన మనతోపాటు అనేక జీవాలకు ఆవాసం. మరి అంతటి విలువైన ప్రకృతిని సంరక్షించు కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? అనేక రూపాల్లో రోజు రోజుకీ ద్వంసం చేస్తున్నాం. కానీ మణిపూర్కు చెందిన లిసిప్రియా కంగుజాం (Licypriya Kangujam) మాత్రం ‘ఈ సమస్త భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది’ అని తన ఆరేళ్ళ వయసు నుండి పర్యావరణ సమస్యల మీద అవగాహన కల్పించడం ప్రారంభించింది. 2011లో జన్మించిన ఈ బాలిక, 2018లో అంటే ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్ను ఎదుర్కొనేందుకు పిల్లలను సమీకరించింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఆమె ప్రసంగంలో పర్యావరణ రక్షణ కోసం యువత శక్తిని ఉపయోగించాలని నొక్కి చెప్పింది. భారతదేశంలో క్లైమేట్ చేంజ్ను పాఠ్యాంశంలో చేర్చాలని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలని కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె సందేశం లక్షల మంది యువతకు చేరడంతో ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకుంది. లిసిప్రియా, సమకాలీన సమాజంలో యువతకు స్ఫూర్తిగా నిలిచి, పర్యావరణ రక్షణ కోసం అవిశ్రాంత కృషి చేస్తోంది, భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేస్తూ. అంతేకాకుండా ప్రపంచ నాయకులను పర్యావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా కషిచేస్తుంది. -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు. పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్బా తన భార్య జయా బచ్చన్ హైట్పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. -
కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్లైన్లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్. (చదవండి: Sandeep Jangala: క్రికెట్ టు క్లౌడ్ కిచెన్ కమ్ కేఫ్..! చివరికి దేశంలోనే తొలి మిల్లెట్ కేఫ్గా..) -
'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్లో సాధారణ డ్రెస్ వేర్లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) (చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!) -
నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చేసాడు
‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు ఇవేవీ గుర్తు రావు. ఈ ధిక్కారమే ఒక ఆఫ్ఘన్ బాలుడి (Afghan Boy) సాహసోపేత చర్యకు దారి తీసింది. ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్కు వేలాడుతూ ఢిల్లీ దాకా వచ్చేశాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదమని తెలిసినాసాహసానికి పూనుకున్న 13 ఏళ్ల తెగువ ఇపుడు నెట్టింట చర్చనీయాంశంగా నిలిచింది.కాబూల్ నుండి ఢిల్లీకి (Kabul-Delhi) కామ్ ఎయిర్లైన్స్ విమానంRQ-4401 లో ఆదివారం(సెప్టెంబర్ 22) ఉదయం 11.10 గంటలకు 1.5 గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో దిగిపోయాడు. విమానం కాబూల్ నుండి ఢిల్లీకి గంటన్నర ప్రయాణం పూర్తిచేసుకుని ల్యాండ్ అయిన తరువాత అధికారులు ఈవిషయాన్ని గ్రహించారు. టాక్సీవేపై నడుస్తున్న బాలుడిని గుర్తించి ఎయిర్లైన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్కు సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారులు విస్తుపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సహా భద్రతా సంస్థలకు అప్పగించారు.కుందూజ్ ప్రాంతానికి చెందిన ఈ బాలుడు సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్పోర్ట్లోకి చొరబడి విమానం బయలుదేరే ముందు రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్లోకి ఎక్కి దాక్కున్నట్టు అంగీకరించాడు. అంతేకాదు విమానం అటు ఇటు కుదుపులకు గురైనప్పటికీ వేలాడుతూ అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చేరాడు. అయితే మైనర్బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు లేకుండానే మరో విమానంలో తిరిగి కాబూల్కు పంపించివేశారు అధికారులు. గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు? అల్పోష్ణస్థితి , హైపోక్సియా , అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే అని కొందరు, ఇది స్టోరీ మాత్రమే కాదు, ప్రాణాలకు తెగించి పారిపోవాల్సి భయానక పరిస్థితులకు అద్దం అని కొందరు వ్యాఖ్యానించారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా “వీల్-వెల్ స్టోవేవే” అని పిలుస్తారు. -
భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోతుందా..?
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్స్టైల్నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. అది నెట్టింట వైరల్గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. అవేంటంటే..చీర నెమ్మదిగా తన వార్డ్రోబ్లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. అలాగే విక్టోరియాలో భారత్లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty) (చదవండి: భారత్లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..!
ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్తో అలర్ట్గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్ చేస్తూ..కింద ఒక ప్లేట్పై డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by राजस्थानी छोरी🫣 (@lok_nritya) (చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు) -
ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు..!
గ్రామీణ నేపథ్యం అయితే ఇంగ్లీష్ భాషపై అంత పట్టు ఉండదనేది తెలిసిందే. కానీ కొందరు పట్టుదలతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పట్టణాల్లోని యువతతో పోటీపడి సత్తా చాటారు కూడా. కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఆంగ్ల భాషలో మాట్లాడుతున్న తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ధులు వరకు అందరూ అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడతారట. ఔను మీరు వింటుంది నిజమే. ఎక్కడంటే ఇదంతా..పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలోని కాలియాచక్ గ్రామంలో అందరూ ఇంగ్లీష్ భాషలోనే అనర్గళంగా మాట్లాడుతుంటారు. అంతేగాదు ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నారట. ఆ గ్రామ వీధుల్లో నడుస్తుంటే..ఎటు చూసిన ఇంగ్లీష్ ప్రతిధ్వని వినిపిస్తుంది. అది చూసి కొత్తగా వచ్చిన వారికి ఎవ్వరైనా..ఏ విదేశంలోనైనా ఉన్నామేమో అనే అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎక్కడ చూసినా..IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అందుకోసం చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ గ్రామంలో. అంతేగాదు ఇక్కడ ఇంగ్లీష్ కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే కాదు.. కెరీర్, జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.అదెలా సాధ్యమైందంటే..ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. కాలియాచక్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ రాత్రికి రాత్రే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించలేదు. దశాబ్దాల కృషి, పాఠశాలల కృషి , ప్రజల అంకితభావం కలిపి ఈ గుర్తింపును తీసుకొచ్చాయి. కాలియాచక్ గ్రామంలో ఫైజీ అకాడమీ, తర్బియాత్ పబ్లిక్ వంటి పాఠశాలలు ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నాయి. చాలా మంది గ్రామస్తులు ఈ పాఠశాలల నుంచే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అలా ప్రతి వీధిలో శిక్షణ, బోధనా కేంద్రాలు ఉన్నాయి. ఇక ఈ కాలియాచక్ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామంలోని టీచర్స్ తమ గ్రామానికి లేదా పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై , బెంగళూరు వంటి నగరాల్లో కూడా వందలాది మంది టీచర్స్ పాఠాలను బోధిస్తారు. మరోవైపు చాలామంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా విదేశాలలో పిల్లలకు ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వీరి కుటుంబాలు తరువాతి తరం ఇంగ్లీష్ బోధించడంలో రాణించేలా గ్రామంలో చిన్న చిన్న కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నాయిమరో ప్రత్యేకత ఏంటంటే..ఈ గ్రామంలోని పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేలా ప్రోత్సహిస్తారు. అలాగే పండుగలు, ఉత్సవాల్లో ఇంగ్లీష్లో డిబేట్ పోటీలు జరుగుతాయి. ఈ గ్రామం కేవలం విద్యా కేంద్రంగా మాత్రమే కాదు మామిడి, లిచీలను కూడా పండిస్తోంది. పట్టు , జనపనార వ్యాపారం చేస్తుంది. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బోధన అనేది ఈ గ్రామం ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేసిందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: నవరాత్రుల్లో అక్కడ దుర్గమ్మకి నైవేద్యాలుగా చేపలు, మాంసం..! ఎందుకంటే..) -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
అతడికి 72, ఆమెకు 27 : జోధ్పూర్లో ఏడడుగులు వేసిన విదేశీ జంట
రాజస్థాన్ విలాసవంతమైన పెళ్ళిళ్లకు పెట్టింది పేరు. తాజాగా జోధ్పూర్లో జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్పూర్ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన ఒక విదేశీ జంట. బారాత్నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే. హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్కు చెందిన వారు. జైపూర్, ఉదయపూర్, జోధ్పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్పుర్లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. జోధ్పూర్ ఎందుకు?రాజస్థాన్ చరిత్ర, జోధ్పూర్ నగర వైభవం, సాంస్కృతిక వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులువధూవరులిద్దరూ భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి, రత్నాలు పొదిగిన కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్పూర్లోని సుందరమైన ఖాస్ బాగ్లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) -
మూడేళ్లకే లక్షలు సంపాదిస్తున్నాడు
జర్మనీలోని బావరియాకు చెందిన లారెంట్ స్క్వార్జ్ మూడేళ్ల వయసులోనే బొమ్మలు వేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. లారెంట్ వేసే బొమ్మలు ఆన్లైన్ వేదికగా అమ్ముడవుతున్నాయి. ఒక్కోదాన్ని లక్షలు పెట్టి కొంటున్నారు. లారెంట్ తల్లిదండ్రులు ఆ పిల్లాణ్ణి రెండేళ్ల క్రితం సెలవులకు ఇటలీకి తీసుకెళ్లారు. అప్పటికి లారెంట్ వయసు సంవత్సరం. ఆ సమయంలో హోటల్లోని యాక్టివిటీ రూమ్లో ఓ పెయింటింగ్ చూశాడా గడుగ్గాయి. దాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతనికి చిత్రలేఖనం మీద ఆసక్తి కలిగిందని భావించిన తల్లిదండ్రులు ఇంటికొచ్చాక రంగులు, కాన్వాస్, బ్రెష్లు ఏర్పాటు చేశారు. సరదాగా మొదలైన చిత్రలేఖనం సీరియస్ పనిగా మారిపోయింది. ప్రస్తుతం ఇంట్లో తన సొంత స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు. లారెంట్ పెయింటింగ్లు సుమారు 7,000 డాలర్లు (రూ.6 లక్షల) వరకు అమ్ముడవుతున్నాయి. అతని తల్లి అతనికి ఇన్స్ట్రాగామ్ ఖాతాను ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తోంది. అతని అకౌంట్కి సుమారు 9.99 లక్షల మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్క్వార్జ్ తండ్రి, తాత ఇద్దరూ కూడా కళాకారులే. వారి నుంచే ఆ బాలుడికి ఈ కళ అబ్బిందని అందరూ అంటున్నారు. View this post on Instagram A post shared by Laurent Schwarz (@laurents.art) -
కిడ్నీ ఇచ్చి ప్రాణంపోసిన అమ్మకు ‘బంగారు’ గిఫ్ట్ ఇచ్చాడు
వరుణ్ ఆనంద్ చిన్నప్పటినుంచి ఆటల్లో చురుగ్గా ఉంటాడు. తిండి, నిద్ర కన్నా ఆటలే ముఖ్యం అతనికి. అలాంటి వరుణ్ అనుకోకుండా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. దాంతో ఆటల మాట దేవుడెరుగు... కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేనంతటి దుస్థితికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో వారికి అనికా అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ జీవితాన్నిచ్చింది. అంతేకాదు, అతను ఆ వ్యాధి మూలంగా ఏ ఆటల నుంచి అయితే దూరం అయ్యాడో, అవే ఆటల పోటీల్లో అతను మరింత ఉత్సాహంగా పాల్గొని మూడు స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు. ఈ విజయం వెనుక వరుణ్ ఆనంద్ తల్లి ప్రోత్సాహంతోపాటు ఆమె కొడుక్కు పంచి ఇచ్చిన కిడ్నీ కూడా ఓ కారణం. ఆరేళ్ల క్రితం ఓ రోజు.. బెంగళూరు అబ్బాయి వరుణ్ ఆనంద్ ఉన్నట్టుండి ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఇంటికొచ్చేశాడు. ‘‘అదేంట్రా అప్పుడే వచ్చేశావ్?’’ అని తల్లి అడిగితే ‘‘బాగా అలసటగా ఉంది. ఆడాలనిపించడం లేదు. అందుకే వచ్చేశా’ అని నీరసంగా చెప్పాడు. ఆటలో పడితే తనను తానే మరిచిపోయే తన కొడుకు ఇలా చెప్పేసరికి అతని అమ్మ దీపకు జరగరానిదేదో జరగబోతోందన్న భయం, సందేహం అతలాకుతలం చేశాయి. తగ్గట్టే నెమ్మదిగా వరుణ్ ఆటకు దూరమయ్యాడు. కనీసం తన పనులు కూడా చేసుకోలేనంత బలహీనంగా తయారయ్యాడు. ఏ పనీ చేయకుండా ఊరికే తిని పడుకుంటున్నా సరే ఎప్పుడూ అలసటగా కనిపించేవాడు. దీనికి తోడు విడువని జ్వరం..కాళ్ల వాపులు...ఫుట్బాల్ గ్రౌండ్లో చిరుతలా కదిలే వరుణ్ ఎముకలు బలహీనంగా మారడం తో తప్పటడుగులకు కూడా కష్టపడేవాడు. ఇదంతా చూస్తున్న అమ్మానాన్నలు అతడి భవిష్యత్తు గురించి బెంగటిల్లుతుండేవారు. ఇంతలో జరగకూడదనుకున్నదే జరిగింది. ఓ రోజు మాటాపలుకూ లేకుండా పడిపోయాడు వరుణ్. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పిల్లాడిని పరీక్షించారు. వరుణ్ బీపీ చాలా తక్కువగా చూపిస్తోంది. దాదాపు కోమాలో ఉన్నాడు. వెంటనే కొన్ని ఎమర్జెన్సీ టెస్టులు చేయించారు. వాటిలో అతడికి క్రానికల్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు బయటపడింది. వరుణ్ కండిషన్ ను గురించి అతని తల్లిదండ్రులకు చె΄్పారు డాక్టర్. చివరకు వరుణ్ ఇప్పుడున్న స్థితికి అతడికి హీమో డయాలసిస్ చేసి కిడ్నీ మార్చడం తప్ప మరో దారి లేదని చెప్పారు. చెప్పిందే తడవుగా కిడ్నీ ట్రాన్స్ ΄్లాంటేషన్ కోసం సిద్ధమయ్యారు. దాతల గురించి వెతకసాగారు. ఈ క్రమంలో వారికి తెలిసిన విషయం... ఇంత బాధలోనూ అందరికీ ఆనందం కలిగించిన విషయం ఒకటే. వరుణ్కు తల్లి కిడ్నీ సరిగ్గా మ్యాచ్ కావడం. ఆపరేషన్ సక్సెస్ కావడం.. రెండేళ్ల క్రితం.. పెర్త్ వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ ఎరీనా కొత్త వరుణ్ అప్పుడు ఫుట్బాల్ను మాత్రమే వదిలేశాడు. 12, 14 ఏళ్ల విభాగంలో మరి ఇప్పుడు మూడు క్రీడా విభాగాలు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ల ప్రత్యర్థులను చిత్తు చేసి 3 స్వర్ణాలతో విన్నింగ్ స్మైల్తో డయాస్ మీద గర్వంగా నిలుచున్నాడు. ఇదతనికి మరో జీవితం. వీరందరి కన్నా ముందే అనికా ఈ పోటీల్లో పాల్గొంది. ఇది సాటిలేని అనుభవమని ఆమె చెబుతుంది. అనికా ఆర్గాన్ ఇండియా వ్యవస్థాపకురాలు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. అనికా తల్లికి కూడా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. ఒక రకంగా దాని నుంచే ఆమె స్ఫూర్తి పొందింది. అనికా సంస్థ 2023లో ప్రపంచ ట్రాన్స్ప్లాంటేషన్ గేమ్స్లో టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ‘‘మా అమ్మ ఆపరేషన్ సమయంలో నాకు ఎలాంటి ఆసరా, ట్రాన్స్ ప్లాంటేషన్గురించిన సమాచారమూ అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్గాన్ ఇండియాను స్థాపించాను. ఇప్పుడు నేను నాలా ఎవరూ సమస్యలతో సతమతం కాకుండా చూసుకుంటున్నాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతుందామె. ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ 1978 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో 25వ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ జరిగాయి. 51 దేశాల నుంచి 17 క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. ఈ పోటీలకు అర్హతలు ఒకటి అభ్యర్థులు నాలుగేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారై ఉండాలి. అలాగే వారు ప్రాణాధార అల్లోగ్రాఫ్ట్లు (గుండె, పేగు, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్) అలాగే బోన్ మ్యారో మార్పిడి వంటి క్లిష్టమైన ఆరోగ్య సమస్యలనుంచి బయటపడి ప్రస్తుతం మామూలు జీవితం గడుపుతూ తాము పాల్గొనే ఈవెంట్లలో శిక్షణ పొంది ఉండాలి. ఆర్గాన్ ఇండియా ద్వారా వరుణ్ ఫ్యామిలీకి ఈ పోటీల గురించి తెలిసింది. అనికా తన ఆర్గాన్ ఇండియా సంస్థ ద్వారా వరుణ్ లాంటి ఎంతోమందికి జీవితంపై ఆశలు కల్పిస్తోంది. చికిత్స విషయంలో సహాయపడుతోంది. 2023లో ట్రాన్స్ ప్లాంటేషన్ గేమ్స్లో వరుణ్ ప్రతిభను చూసి అనికా ఆశ్చర్యపోయింది. ‘32 మంది సభ్యుల టీమ్ ఇండియా బృందంలో అతనే చిన్నవాడు. కానీ తన శక్తితో దానిని నడిపించాడు. -
ప్రపంచ పజిల్ ఛాంపియన్షిప్లో.. తండ్రీ కొడుకులు
సాక్షి, సిటీబ్యూరో: హంగేరీలోని ఎగర్లో జరగనున్న 18వ ప్రపంచ సుడోకు ఛాంపియన్ షిప్, 32వ ప్రపంచ పజిల్ ఛాంపియన్ షిప్లో నగరానికి చెందిన తండ్రి కొడుకులు దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. హంగేరియన్ పజిల్లర్స్ అసోసియేషన్నిర్వహించే ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని గ్లోబల్ ఎడ్జ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ జైపాల్రెడ్డి, తన కుమారుడు కార్తీక్రెడ్డితో కలిసి ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 24 గంటల పజిల్ ఛాంపియన్ షిప్ కూడా ఉంటుంది. అనుభవజ్ఞుడైన పజిల్ ఔత్సాహికులు జైపాల్రెడ్డి మొదట 2007లో అధికారిక పజిల్ పోటీల్లో భాగస్వామ్యమయ్యారు. తన పాఠశాల రోజుల నుంచి పజిల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశం అంతటా ప్రాంతీయ రౌండ్లలో పాల్గొన్న తర్వాత 2008 నాటికి జాతీయ జట్టులో స్థానం సంపాదించానని, ప్రస్తుతం అంతర్జాతీయ పజిల్ పోటీలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నానని తెలిపారు. ప్రస్తుతం 23 ఏళ్ల కార్తీక్రెడ్డి ఈ అభిరుచిని వారసత్వంగా పొందారని, 2015లో ప్రారంభించిన తన ప్రయాణం త్వరితగతిన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. వీరు దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎం.బాగారెడ్డి వారసులు కావడం విశేషం. -
'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్గా ఉండే ఆర్ట్ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్లా ఉంటుంది. ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్గా పిలిచే హ్యుమన్ వాచ్ని డచ్ కళాకారుడు మార్టెన్బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by S K Ali (@skali85) (చదవండి: పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!) -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్లోని గూగుల్ డీప్మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్గా మార్చగల సాధనం. బాలీవుడ్ని తలపించేలా మన లుక్ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!) -
అగ్గిపెట్టంత జనరేటర్!
ఒక చిన్న అగ్గిపెట్టె పరిమాణంలోని బాక్స్ జేబులో పెట్టుకొని తిరిగితే, లైటు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కంప్యూటర్, మొబైల్ వంటి వాటికి పవర్ వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, జపాన్ సైంటిస్టుల కొత్త ఆవిష్కరణ. వారు తయారు చేసిన ఈ చిన్న మ్యాచ్బాక్స్ సైజ్ జనరేటర్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ, ఏడాదంతా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం పెద్ద వనరులు అవసరం లేదు. కేవలం గాలిలో తేమ చాలు. ప్రత్యేకమైన లేయర్డ్ నానోఫిల్మ్ టెక్నాలజీ ఉపయోగించి, గాలిలోని తేమను ఇది నేరుగా విద్యుత్గా మార్చేస్తుంది. ఎలాంటి మోషన్ పార్ట్స్ లేవు, మెయింటెనెన్స్ కూడా జీరో. ఒక్కసారి సెట్ చేస్తే చాలు. ఈ మధ్యనే దక్షిణ ఆసియా పంట పొలాల్లో టెస్టులు జరిపినప్పుడు ఎటువంటి బ్రేక్డౌన్ , చార్జింగ్ అవసరం లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసింది. త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. (చదవండి: చేపలంటే నోరూరించే వంటకాలు కాదు..! ఇకపై ఫ్యాషన్..)· -
అద్భుతం.. అమ్మాపురం సంస్థానం
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అమరచింత, ఆత్మకూర్ సంస్థానాల పాలన అమ్మాపురం కేంద్రంగా సాగింది. అప్పట్లో 69 గ్రామాలు, 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అమ్మాపురం సంస్థానాన్ని కాకతీయుల కాలం నుంచి రెడ్డి రాజుల కాలం వరకు ముక్కెర వంశీయులు పరిపాలించారు. 1268 నుంచి 1948 వరకు వీరి పరిపాలన కొనసాగింది. ఇది 19వ శతాబ్దంలో భారత యూనియన్లో విలీనమైంది.కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి.. కురుమూర్తి స్వామి క్షేత్రం అభివృద్ధి కోసం ముక్కెర వంశీయులు అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయుల కాలంలో అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలు వెలుగొందాయి. ముక్కెర వంశీయులు ఆ సంస్థానాల్లో పరిపాలన సాగిస్తూ. కురుమూర్తి క్షేత్రం దర్శనానికి వచ్చేవారు. కురుమూర్తి క్షేత్రాన్ని నిత్యం దర్శించుకోవాలనే ఆకాంక్ష, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అమ్మాపురంలో సంస్థానం ఏర్పాటు చేశారు. రాణి భాగ్యలక్ష్మీ దేవమ్మ ఇక్కడి నుంచే అమరచింత, ఆత్మకూర్ సంస్థానాలను పరిపాలించారు.ఇప్పటికీ నాటి ఆనవాళ్లు.. 16వ శతాబ్దంలో రాణి భాగ్యలక్ష్మీదేవి అమ్మాపురంలో నిర్మించిన కోట బురుజు, శివాలయం, మసీదుతో పాటు 200 ఏళ్ల క్రితం వారి వంశీయులు నిర్మించిన రాజ భవనం, సింహద్వారం, రాజ భవనంలోని కోనేరు, గుర్రాల స్థావరాలు, అతిథి గృహాలు నేటికీ ఉన్నాయి.సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు.. ముక్కెర వంశస్తుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామానికో సుభేదారును నియమించారు. వారి ద్వారా వచ్చే కప్పాలతో ఆయా గ్రామాల్లో చెరువులు, బావులను తవ్వించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణం నాటి సంస్థానంలో ఒక భాగంగా ఉండటంతో.. అక్కడే రాజ విడిది భవనాలు నిర్మించారు. ముక్కెర వంశానికి చెందిన పెద్ద సోమ భూపాలుడు తరచూ ఈ ప్రాంతానికి వస్తూ పరిపాలన కొనసాగించే వాడని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఆత్మకూర్లో చెరువును తవ్వింస్తుండగా.. శివుడి విగ్రహం లభ్యం కావడంతో అక్కడే శివాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ చెర్ల పరమేశ్వరుడిగా పిలుస్తున్నారు. అమరచింతలో గుర్రాలను మేపేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి.. వాటి సంరక్షణ బాధ్యతలను హజారి వంశస్తులకు అప్పగించారు. అక్కడ కోటబురుజును నిర్మించారు. వాటితో పాటు తిప్పడంపల్లిలో నిర్మించిన కోట బురుజు నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆత్మకూర్లో సంస్థానాదీశులు నిర్మించిన పలు భవనాలను ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చి.. వర్ధమానపురం (నేటి వడ్డేమాన్)కు గన్నారెడ్డి సామంత రాజుగా ఉండే వాడు. అప్పట్లో గన్నారెడ్డి తన పరివారంతో తిరుపతి యాత్రకు వెళ్లాడు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులున్న ముక్కెర వంశీయుడు గోపాల్రెడ్డిని కలిశాడు. గోపాల్రెడ్డి గుణగణాలు, ధైర్య సాహసాలు మెచ్చి వర్ధమానపురం ఆహ్వానించాడు. గోపాల్రెడ్డి తన కుటుంబ సమేతంగా వర్ధమానపురం చేరుకోగా.. గన్నారెడ్డి అతన్ని గౌరవించి మక్తలవాడ పదవి అప్పగించాడు. చదవండి: ఊరు ఊరంతా ప్రభుత్వ అధికారులే!క్రమంగా గోపాల్రెడ్డి మక్తల, ఊట్కూర్, కడేమార్, వడ్డేమాన్, అమరచింత పరిగణాలపై ఆధిపత్యం సాధించారు. అప్పట్లో కురుమూర్తి క్షేత్రం వడ్డేమాన్ పరిధిలో ఉండటం.. గోపాల్రెడ్డి వైష్ణవ భక్తుడు కావడంతో తన ఇంటి ఇలవేల్పుగా ఆరాధించాడు. అది మొదలుకొని నేటివరకు ముక్కెర వంశీయులు కురుమూర్తిస్వామిని ఆరాధిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ శాశ్వత ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. -
పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!
సాధారణ శిశువు ఆరోగ్యకరమైన బరువు 2.5 నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. అంతకు మించి ఉంటే అసాధారణ శిశువుగా పరిగణిస్తారు. కానీ ఈ బుడతడు పుట్టుకతో వైద్యులనూ, అమ్మనూ విస్తుపోయేలా చేశాడు. ప్రసూతి వార్డులోనే ఇంత పెద్ద శిశువు ఎప్పుడూ చూడలేదని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువుని చూసి ఆ తల్లి ఈ బిడ్డ నా బిడ్డేనా అనే సందేహం వ్యక్తం చేసేలా అతడి ఆకృతి సంభ్రమాశ్చర్యాలకు గరయ్యేలా చేసింది. ఇదంతా ఎక్కడంటే..అమెరికాలోని టంపాకు దక్షిణంగా ఉండే ఫ్లోరిడాలో చేసుకుంది. 42 ఏళ్ల డానియెల్లా హైన్స్ అనే మహిళ సెప్టెంబర్ 03న భారీ మగ శిశవుకి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు దగ్గర దగ్గర ఏడు కేజీలు. అసాధారణ బరువుతో జన్మించి..పుట్టుకతో రికార్డు సృష్టించిన ఘనత దక్కించుకోవడమే కాదు పూర్తి ఆరోగ్యంతో ఉండటం విశేషం. ఇలా పుట్టడం అనేది అత్యంత అసాధారణమైతే, ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా అత్యంత అరుదు. డానియల్కు సీజేరియన్ ఆపరేషన్ చేసి ఆ శిశువుని బయటకు తీశారు. స్పృహ వచ్చాక తన బిడ్డను చూసి..ఇది తన బిడ్డేనా అని ఆశ్చర్యపోయింది. ఇంత పెద్దగానా..! అని నోరెళ్లబెట్టింది. అంతేగాదు ఆమె ప్రసూతి వార్డుకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి ఆ బిడ్డను తిలకిస్తున్నారు. ఆహా పుట్టుకతో సెలబ్రిటీగా మారడమే కాదు, నన్ను కూడా ప్రత్యేకమైన తల్లిగా నిలబెట్టావురా కన్నా..! అంటూ సంబరపడిపోయింది ఆ తల్లి. నిజంగా భగవంతుడు మాకు ఇంత పెద్ద ఆశీస్సులు అందించాడని ఊహించలేకపోయా అంటూ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ సంగతులను వివరించింది డానియోల్లా. అలాగే ఆ శిశువు కూడా అత్యంత పొడవే. డానియెల్లా దంపతులు కూడా పొడుగ్గానే ఉంటారు. అయితే డానియెల్లా గర్భంతో ఉన్నప్పుడూ..మధుమేహంతో బాధపడింది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల అసాధారణత వల్ల గర్భణీలకు ఇంత పెద్దగా శిశువులు పుట్టే అవకాశం ఉందని వైద్యులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కూడా. అయినప్పటికీ ఇలా భారీ సైజులో శిశువు జన్మించడమే అందర్నీ విస్తుపోయేలా చేసింది. కాగా, ఇంతకుమునుపు ఈ రికార్డు బ్రెజిల్లో ఓ తల్లి ప్రసవించిన మగబిడ్డ పేరు మీద ఉండేదట. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు
ఈ ప్రకృతిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనం మన మేధోశక్తితో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని ఒక్కొక్క రహస్యాన్ని చేధిస్తూ వస్తున్నాం. ఉన్నచోటే ఉంటూ మనకు నిత్యం ఆక్సిజన్ అందిస్తున్న చెట్లకు/మొక్కలకు ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ ఆధారాలతో నిరూపించారు. మరి ప్రాణమున్న ప్రతీ జీవి శిలావిగ్రహంలా ఉండిపోదు కదా! ఇంకో ప్రాణితో కమ్యూనికేట్ చేస్తుంది. మనుషులకు భాష ఉన్నట్లు చెట్లకు కూడా వాటిదైన భాష ఉంటుందా అని సందేహం వచ్చింది మనిషికి. పరిశోధన చేశాడు.అన్ని ప్రాణుల్లాగానే చెట్లు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, అవి వాటి సామాజిక నెట్వర్క్లో భాగమని కెనడా శాస్త్రవేత్త సుజానే సిమార్డ్ తన పరిశోధనల ద్వారా నిర్థారించారు. చెట్లు ‘వుడ్ వైడ్ వెబ్’ అని పిలిచే భూగర్భ మైకోరైజల్ ఫంగస్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయట. పోషకాలు, నీరు వంటి వాటి గురించి వాకబు చేసుకోవడం, ఏదైనా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరిక చేసుకోవడం వంటి చర్యల ద్వారా ఇవి కమ్యూనికేట్ అవుతాయి. ఈ నెట్వర్క్ చెట్ల రూట్ సిస్టమ్లను కలుపుతుంది, ఇది మానవ మెదడు న్యూరాన్ల వంటిది.సిమార్డ్, 1997లో నేచర్ జర్నల్లో తన పరిశోధనను పబ్లిష్ చేస్తూ –– పేపర్ బిర్చ్, డగ్లస్ ఫిర్ చెట్ల మధ్య కార్బన్ బదిలీని రేడియోఆక్టివ్ ఐసోటోప్లతో ట్రాక్ చేసినట్టు చెప్పారు. బిర్చ్ చెట్టు అధిక కార్బన్ను ఫిర్ చెట్టుకి పంపితే తరువాత ఫిర్ చెట్టు బిర్చ్ చెట్టుకి కార్బన్ని పంపింది. ఇది చెట్ల పరస్పర సహకారాన్ని చూపిస్తుంది. మరో ఎక్స్పెరిమెంట్లో గాయపడిన డగ్లస్ ఫిర్ చెట్టు పొరుగు చెట్టయిన పాండెరోసా పైన్కు రక్షణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయమని సిగ్నల్ పంపగా అది ప్రతిస్పందిచింది. ఇలాంటి అనేక పరిశోధనల తర్వాత ఇతర జీవుల్లానే చెట్లు కూడా సంభాషించుకుంటాయనే నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు. (చదవండి: 'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్) -
'ఊరంత స్కూలు': ఎర్లీ లెర్నింగ్ విలేజ్
మీ స్కూల్లో మొత్తం ఎంతమంది చదువుతున్నారు? 500 మంది, వెయ్యి మంది.. అంతకంటే ఎక్కువుండటం కష్టం కదూ. అయితే ఒక ఊరంత స్కూల్ మీకు తెలుసా? అక్కడ ఏకంగా 2,100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంకో విశేషమేమిటంటే, వీరంతా ప్రీ–స్కూల్ చదివే చిన్నారులు. సింగపూర్ నగరం లోరాంగ్ చువాన్లోని ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఏఐఎస్) క్యాంపస్ పక్కనే ఈ స్కూల్ ఉంది. దీన్ని ‘ఎర్లీ లెర్నింగ్ విలేజ్ (Early Learning Village) అంటారు. ఏఐఎస్, స్టాంఫోర్డ్ అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ కలిసి దీన్ని నిర్మించాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రీస్కూల్ ఇదే. సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని కట్టించారు. అంటే మొత్తం ఏడు ఫుట్బాల్ మైదానాలంత స్థలంలో ఐదు భవనాలు, 100 కంటే ఎక్కువ తరగతి గదులతో ఈ స్కూల్ని నిర్మించారు. 18 నెలల నుండి ఆరు సంవత్సరాల వయస్సున్న పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. వారికోసం ఈ క్యాంపస్ అంతా చెట్ల పచ్చదనంతో నిండి ఉంటుంది. 2017లో ఈ స్కూల్ని ప్రారంభించారు. స్కూల్ అంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం, పద్యాలు పాడించడం మాత్రమే ఉండదు. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు అనేక ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈత నేర్పేందుకు సిబ్బందితోపాటు 20 మీటర్ల స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఇండోర్ ఎయిర్ కండిషన్డ్డ జిమ్ కూడా ఉంది. ఇక్కడ వివిధ దేశాల చిన్నారులు చేరుతుండటంతో కొన్ని పాఠాలు వారి దేశాలు, ఖండాలకు తగ్గట్లుగా నేర్పిస్తారు. ఈ క్రమంలో ఒకే వయనున్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక అంతస్తు కేటాయించారు. ప్రతి తరగతి విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి, వారు మరింత చురుగ్గా మారేందుకు టీచర్లు శ్రద్ధ చూపిస్తారు. ఈ స్కూల్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తూ ఉంటారు. (చదవండి: నోరూరించే చాక్లెట్తో టేస్టీ..టేస్టీ రెసిపీలు..!) -
ఇంతవరకు ఎవ్వరూ ఈ ట్రైన్ జర్నీని పూర్తి చేయలేదట..!
ఏ ట్రైన్ అయిన తన గమ్య స్థానం చేరుకోవడానికి ఒకటి లేదా రెండురోజులు పడుతుంది. మరి దూరం అనుకుంటే మూడు నుంచి ఐదు రోజులు పట్టేవి కూడా ఉంటాయి. అలా ఇలా కాకుండా ఏకంగా నెలల తరబడి ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకునే రైలు గురించి విన్నారా..?. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. రైలు జర్నీ ఇష్టపడే ఔత్సాహికులకు నచ్చే సుదీర్ఘ ట్రైన్ జర్నీ ఇది. ఎక్కడంటే ఇదంతా..ఈ రైలు పోర్చుగల్ నుంచి ప్రయాణికులను సింగపూర్కి తీసుకువెళ్తుంది. ప్రపంచంలోనే అతి సుదీర్ఘ రైలు జర్నీ ఇదేనట. మొత్తం 18,755 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది ఈ రైలు. ఈ రైలు ప్రయాణం పోర్చుగల్ సముద్ర తీర పట్టణం లాగోస్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి స్పెయిన్ గుండా ఉత్తరం వైపుకి వెళ్లి పారిస్కి చేరుతుంది. ఫ్రాన్స్ రాజధాని చేరుకున్న తర్వాత యూరప్ గుండా పశ్చిమానికి వెళ్లి..సైబీరియన్కు వెళ్తారు. అక్కడ నుంచి బీజింగ్ చేరుకోవడానికి ఆరు రాత్రులు పడుతుందట. అక్కడ నుంచి సుదీర్ఘ ప్రయాణంలో వియంటియాన్ రైల్వే నుంచి బ్యాంకాక్కు పయనమవుతుంది. ఈ జర్నీలో చివరి భాగం మలేషియా గుండా ప్రయాణించి తన గమ్యస్థానమైన సింగపూర్కు చేరుకుంటుంది. మొత్తం ఈ సుదీర్ఘ ట్రావెలింగ్కి దగ్గర దగ్గర 21 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు కానీ, ఒక్కోసారి రైలు ఆగిన స్టాప్లను పరిగణలోనికి తీసుకుంటే నెలల తరబడి సాగే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు రైల్వే అధికారులు. ఎందుకిలా అంటే..ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడం వల్ల యూరోపియన్ లోపల నుంచి రష్యాకు అన్ని రైలు ప్రయాణాలను నిలిపేశారు. అలాగే కామన్వెల్త్ డెవలప్మెంట్ కార్యాలయం(ఎఫ్డీఓ) కూడా రష్యా గుండా వెళ్లే అన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. భద్రత దృష్ట్యా ఇలా రష్యా గుండా వెళ్లే అవకాశం లేకపోవడం తోపాటు యూకేకి నేరుగా విమానాలు లేకపోవడం, అక్కడ ప్రభుత్వానికి ఉన్న పరిమిత సామర్థ్యం తదితరాల దృష్ట్యా ఇలా చుట్టి తిరిగి సింగపూర్కి చేరుకోక తప్పని పరిస్థితి.(చదవండి: వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!! రీజన్ ఇదే..) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్రూమ్కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
మైఖేల్ జాక్సన్ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్పై మీరు ఓ లుక్కేయండి మరి..!.. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)


