breaking news
East Godavari
-
చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేదు
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3న మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారుతో ఢీకొన్న ఘటనలో మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు కలగడం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని వైద్య విద్యార్థులతో కలిసి మంగళవారం సాయంత్రం స్థానిక శ్యామలా నగర్ రామాలయం జంక్షన్ నుంచి ప్రసాదిత్య మాల్ వరకూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడానికి ఆయన పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు జాతీయ రహదారిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆయన నివాసం వద్దకు భారీ ఎత్తున చేరుకుని ఈ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, ఆయన మెడికోలతో కలసి అక్కడే ప్లకార్డులతో శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల తీరు సరికాదు ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తుల వల్ల ప్రియాంక అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు ఈవిధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ నెల 3న ఈ ఘటన జరిగితే ఆరో తేదీ వరకూ నిందితులు ఎక్కడున్నారు? వారికి ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కేసు విచారణ అధికారిగా ఉన్న ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దారుణాన్ని పోలీసులు ఏదో చిన్న కేసుగా, నిర్లక్ష్యపు యాక్సిడెంట్గా సెక్షన్లు పెట్టి వదిలేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రసాదిత్య మాల్ చుట్టుపక్కల అన్నివైపులా సీసీ కెమెరాలున్నాయని, నిందితులు ఆ మూడు రోజులూ ఎక్కడున్నారు? ఎటువైపు వెళ్లారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నా పోలీసులు ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న తమపై అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు వేసి, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్ సీపీ అండగా నిలబడి పోరాడుతుందని భరత్రామ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్టినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రియాంక కుటుంబానికి న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తమకు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఒక మెడికో ఇంత దారుణంగా హత్యకు గురైతే పోలీసులు ఇప్పటి వరకూ సరిగ్గా స్పందించలేదని, ఇప్పటికీ నిర్లక్ష్యం విడనాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కష్టపడి మెరిట్ సీట్ తెచ్చుకుని, డాక్టర్ కోర్సు చదువుతున్న ప్రియాంకను దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని, ఆమె తల్లిదండ్రుల వేదన ఎవ్వరూ తీర్చలేనిదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసి వెంకటరావు, తిరగాటి దుర్గారావు, పలువురు వైద్య విద్యార్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ ప్రియాంక మరణానికి సంతాపంగా చేపట్టిన శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవడం దుర్మార్గం ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం ఫ ప్రకాష్ నగర్ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ ఫ నిందితులకు కఠిన శిక్షలు పడే వరకూ పోరాడతామని స్పష్టీకరణ -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
రాజవొమ్మంగి: మోటారు సైకిల్ అదుపు తప్పి తిరగబడడంతో లాగరాయి గ్రామానికి చెందిన సుబ్బయ్య (సుబ్బు) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సుబ్బయ్య మోటారు సైకిల్పై సిమెంటు ఇటుకలను పెట్టుకుని పొరుగూరు నుంచి లాగరాయి వస్తున్నాడు. మార్గం మధ్యలో కొండవాగుకు వాలుగా ఉన్న కల్వర్టు దాటుతూ బైక్తో సహా జారిపడ్డాడు. అతడిని వెంటనే అదే గ్రామంలోని పీహెచ్సీకి తరలించగా, వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఇంటికి వచ్చిన సుబ్బయ్య కాసేపటికి ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని తిరిగి ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతితొండంగి: బైక్ అదుపు తప్పి మహిళకు ఢీకొన్న ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, మోటారు సైకిలిస్టు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగాల కాలనీకి చెందిన పూసర్ల లక్ష్మణరావు (55) మంగళవారం ఉదయం బైకుపై కత్తిపూడి వెళుతున్నాడు. తమ్మయ్యపేట సమీపంలోని బీపీసీఎల్ బంకు అతడి బైక్ అదుపు తప్పి రోడ్డుపై వెళుతున్న ఆ గ్రామానికి చెందిన పెయ్యల రమణమ్మ అనే వృద్ధురాలిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో రమణమ్మకు కాలికి, రోడ్డుపై పడిపోయిన లక్ష్మణరావు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లక్ష్మణరావును కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణరావును వైద్యులు పరిశీలించి వైద్యం అందించగా కొద్ది సేపటికీ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. లక్ష్మణరావు లింగాల కాలనీలో కిరణా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య జ్యోతి, కుమార్తె అనూరాధ, కుమారుడు తేజ ఉన్నారు. లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలుకంబాలచెరువు: లాలాచెరువు వద్ద లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శంభునగర్కు చెందిన దేశాబత్తుల త్రిమూర్తులు, దేశాబత్తుల దివ్యరేఖ జీఎల్ఎస్ ఆసుపత్రికి వెళుతున్నారు. వీరిని రెడీ టు మిక్స్ కంకర లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
16 వరకు ఎయిర్పోర్టులో రెడ్ అలర్ట్
కోరుకొండ: ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ నెల 16 వరకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ విధించినట్టు డైరెక్టర్ కె,ప్రీత తెలిపారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు అపరిచితులకు అనుమతులు నిలిపివేశామని పేర్కొన్నారు. ఎయిర్పోర్టును చూసేందుకు సందర్శకులకు కూడా అనుమతులుండవని స్పష్టం చేశారు. ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 7న నిర్వహించిన ఈ పరీక్షలో ఎంపికై న విద్యార్థుల వివరాలు ఈ నెల 12 నుంచి బీఎస్ఈ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో ఉంటాయన్నారు. ఎంపికై న విద్యార్థులు వెంటనే బ్యాంకు ఖాతా తెరిచి, దానిని తమ ఆధార్తో అనుసంధానం చేసుకుని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఉపకార వేతనం జమయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులు వెబ్సైట్ నుంచి తమ మెరిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని, పేరు, పుట్టిన తేదీ, తండ్రి, తల్లి పేరు తదితర వివరాలు ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా వివరాలు సరిపోవాలని సూచించారు. అనంతరం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాల్లో ఏవైనా తేడాలుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని డీఎన్వో, ఏసీజీకి వెంటనే తెలియజేయాలని వాసుదేవరావు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
గిట్టుపోటు
పెరవలి: ఆరుగాలం కష్టించి పంటలను పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. అప్పుడే వారు అన్ని రకాలుగా ముందుకు సాగుతారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వచ్చాక రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటల రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంట దిగుబడులు బాగున్నా గిట్టుబాటు ధర లేక నష్టాల్లో మునిగిపోతున్నారు. కొబ్బరి జిల్లాలో 8,050 హెక్టార్లలో కొబ్బరి తోటల సాగు జరుగుతుండగా, వీటి నుంచి నిత్యం 50 లారీల సరుకును ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులతో పాటు దింపు, ఎగుమతి, దిగుమతి, వలుపు కూలీలతో పాటు వ్యాపారులు సుమారు 30 వేల మంది ఆధారపడ్డారు. ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.16 వేలు మాత్రమే పలుకుతోంది. కోకో కోకో పంటను జిల్లా వ్యాప్తంగా 5,517 హెక్టార్లలో సాగు చేస్తుండగా, దీనిపై సుమారు 10 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కోకో గింజలకు మంచి డిమాండ్ ఉనప్పటికీ ఈ ఏడాది వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయలేదు. దీనితో రైతులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.1,050 ఉంటే నేడు రూ.500 మాత్రమే పలుకుతున్నాయి. ఆయిల్పామ్ జిల్లాలో 20,219 హెక్టార్లలో సాగు చేస్తున్న ఈ పంట నుంచి సుమారు ఒక లక్ష టన్నుల దిగుబడి వస్తుంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైతులు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్నారు. అరటి జిల్లాలోని సుమారు 7,500 హెక్టార్లలో అరటి తోట సాగు జరుగుతోంది. వీటిలో చెక్కరకేళి, కూర అరటి (బొంత), ఎర్ర చెక్కరకేళి, అమృతపాణి, కర్పూర తోటలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం జిల్లా నుంచి 40 లారీల సరుకు వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణకు ఎగుమతి అవుతోంది. అరటికి ఈ ఏడాది మొదట్లో గిట్టుబాటు ధర లభించినా తర్వాత ధర పతనమైంది. మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షలు పలికితే నేడు రూ.85 వేలకు పడిపోయింది. రైతులతో పాటు సుమారు 12వేల మంది అరటి తోటలపై ఆధారపడ్డారు. జామ జిల్లాలో సుమారు 300 హెక్టార్లలో జామ తోటలను సాగు చేస్తున్నారు. దేశవాళీ రకంతో పాటు కేజీ జామ, తైవాన్ జామను పండిస్తున్నారు. మార్కెట్లో జామ కాయలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల వద్ద కిలో జామకాయలను రూ.25 నుంచి రూ.30కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారందరూ నష్టాలబాటలో పయనిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.50ను కొనుగోలు చేసేవారు. మొక్కజొన్న జిల్లాలో 1500 హెక్టార్లలో ఖరీఫ్, రబీ సీజన్లలో మొక్కజొన్నను పండిస్తున్నారు. వీటికి గరప, ఎర్ర రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అందుకే ఎక్కవగా లంకల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.రూ.1800 మాత్రమే పలుకుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో క్వింటాల్ రూ.2,600 పలికింది. పొగాకు, ఇతర పంటలు పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఏడాది 10 కిలోలు రూ.3500 పలికితే, ఈ ఏడాది రూ.2500కు తగ్గిపోయింది. అలాగే పుట్టు కంద (236 కిలోలు) ధర రూ.5 వేలకు పడిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దాని ధర రూ.11 వేలు ఉంది. టన్ను మామిడి కాయలు రకాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేలు పలుకుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో వాటి ధర రూ.25 వేల నుంచి రూ.35 వేలు ఉండేది. పంట ఉత్పత్తులకు లభించని గిట్టుబాటు ధర నష్టాల బాటలో ఉద్యాన రైతులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రోత్సాహం నేడు పట్టించుకోని చంద్రబాబు సర్కార్ 64,536 హెక్టార్లలో సాగు జిల్లాలో వాణిజ్య పంటలైన కొబ్బరి, కోకో, ఆయిల్పామ్, మామిడి, జామ, కంద, పసుపు, బొప్పాయి, నిమ్మ, తమలపాకులు, జీడిమామిడితో పాటు కూరగాయలను సుమారు 64,536 హెక్టార్లలో పండిస్తున్నారు. దాదాపు 90 వేల మంది రైతులు సాగు చేస్తుంటే, వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి మరో మూడు లక్షల మంది జీవిస్తున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కోల్కతా, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి పంటకు ముందస్తుగానే గిట్టుబాటు ధర నిర్ణయించి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు ప్రారంభించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. దారుణం కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారస్తులు సిండ్కేట్గా మారి ధర తగ్గించేశారు. గతంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.500 మాత్రమే వస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు నష్టమే మిగిలింది క్వింటాల్ మొక్కజొన్న ధర గతేడాది రూ.2,600 ఉంటే నేడు రూ.2200కు తగ్గిపోయింది. దీనితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. ఇలా జరిగితే సాగు చేయడం కష్టమే. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు ధరకు కోత అరటి పంట తీవ్ర నష్టాలను మిగిల్చింది. తోటలు అమ్మకాలు చేసినప్పుడు మంచి ధర లభించింది కానీ నేడు మార్కెట్లో ధరలు పతనం కావడంతో సగానికి కోతలు విధిస్తున్నారు. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, అరటి రైతు, ఖండవల్లి -
రేపు ఓటర్ల జాబితా పరిశీలకురాలి రాక
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకురాలు కె.మాధవీలత బుధవారం రాజమహేంద్రవరం రానున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాలను ఆమె పరిశీలిస్తారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్లో సమావేశమవుతారని పేర్కొన్నారు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు. సమావేశం అనంతరం మాధవీలత క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. సముద్రంలోకి 1.53 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 1,53,810 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులు ఉంది. ఎగువన కాళేశ్వరంలో 5.56 మీటర్లు, పేరూరు 9.53, దుమ్ముగూడెం 6.80 మీటర్లు, భద్రాచలంలో 19.60 అడుగులు, కూనవరంలో 9.32 మీటర్లు, కుంట 5.08, పోలవరం 6.31, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.95 మీటర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి. ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలి రంగంపేట: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రాంతానికి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను అధిగమింవచ్చని అన్నారు. రంగంపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కిసాన్ మేళా–రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకష్ణారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. వాతావరణ ఆధారిత పంటల ఎంపిక, నీటి పొదుపు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు కేవలం వరి పైనే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, మెట్ట ప్రాంతాలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. యూరియాను అధికంగా వినియోగించడం వల్ల తాత్కాలికంగా పైరు పచ్చగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో నేల సారం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక సహాయకుల ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ సేద్య పద్ధతులకు సబ్సిడీపై దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. రంగంపేట మండలంలో అర్హులైన ప్రతి రైతుకు మైక్రో ఇరిగేషన్ సదుపాయాలు శాచ్యురేషన్ విధానంలో అందిస్తామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో పంట బీమా రైతుకు రక్షణ కవచంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. తొలుత చండ్రేడు, పెదరాయవరం గ్రామాల్లోని రైతు బిక్కిన సత్యనారాయణ పొలాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ ఎ.దుర్గేశ్, డీపీఎం బి.తాతారావు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి సత్యదేవుని జయంత్యుత్సవాలు అన్నవరం: సత్యదేవుని జయంత్యుత్సవాలకు అన్నవరం దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రోజు ఉదయం 8.30 గంటలకు ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి. ఈసారి సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ కూడా స్వామివారి జయంత్యుత్సవం నాడు రావడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవార్లకు, శివలింగానికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ జపతపాలు, పారాయణలు, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. సత్యదేవుని జయంత్యుత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 20 మంది పండితులను ఘనంగా సత్కరించనున్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. -
ఎందుకీ గోప్యత?
అందుకేనా హైదరాబాద్కు?కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స అందించారు. ఈ దారుణాన్ని సాక్షి మొదటిసారి వెలుగులోకి తీసుకువచ్చింది. అనంతరం, సోషల్ మీడియాలో కారు ఢీకొన్న ఘటన వీడియో క్లిప్పింగ్లు హల్చల్ చేయడంతో విద్యార్థి వర్గాలు ఆవేదన, ఆపై ఆగ్రహంతో రగిలిపోయాయి. ఇది మరింత ముదిరి ఆందోళనకు దారి తీస్తుందనే భయంతోనే ప్రియాంకను మెరుగైన చికిత్స పేరుతో హైదరాబాద్కు పంపించారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రధాన ఆసుపత్రి అయిన జీఎల్ఎస్ ట్రస్టు ఆ మాత్రం వైద్యం అందించలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి తరలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడం.. రోజుల తరబడి మృత్యువుతో పోరాడి ఆమె మృతి చెందిన ఘటనలో ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ జవాబు లేనివిగానే కనిపిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం కలిగించిన ఈ దారుణం రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి తెర వెనుక అధికార పార్టీ నగర నాయకులు కథ నడిపారనే విమర్శలు వచ్చాయి. వారెవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ అపవాదును తుడుచుకునేందుకు అటు పోలీసులు, ఇటు నగర ప్రజాప్రతినిధులు పోటీ పడిన తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి, చావుబతుకుల్లో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె బంధువులు ఈ నెల 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సాక్షికి ఈ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెర వెనుక వ్యక్తులెవరు? ఆ రోజు ప్రసాదిత్య మాల్ వద్ద సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఎడ్వర్డ్ మద్యం తాగి, తమ కారుతో ప్రియాంక ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగానే మూడుసార్లు ఢీకొన్నారు. అనంతరం, ఆమె తలపై నుంచి కారు ఎక్కించి, అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘోరంపై అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందింది. ఆ రోజు రాత్రి స్థానిక స్వతంత్ర ఆసుపత్రికి వెళ్లి, ఈ సంఘటనలో గాయపడిన ప్రియాంక స్నేహితుడి వాంగ్మూలం సేకరించారు. ప్రియాంకను ఢీకొన్న వెంటనే అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయిన కారును పోలీసులు ఆ మర్నాడు కానీ సీజ్ చేయలేదు. తీవ్రమైన ఈ సంఘటన సమాచారాన్ని పోలీసులు తొలుత బహిర్గతం చేయలేదు. దీంతో, కొంత మంది కూటమి నాయకులు వారిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని చిన్న ప్రమాదంగా కూడా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని, దీని వెనుక ఉన్న పెద్దలెవరనే ప్రశ్నలు సర్వత్రా వస్తున్నాయి. ఆ సమయంలో దర్యాప్తు అధికారికి వచ్చిన ఫోన్లపై సైతం పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాదం పెద్దది అవుతూండటంతో పోలీసులు ఎట్టకేలకు నిందితుల్ని అరెస్టు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్ వద్ద ప్రదర్శనకు పెట్టారు. ఆ సమయంలో కారు నంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించారనే విషయం స్పష్టమవుతోంది. ప్రసాదిత్య మాల్లో సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉండకపోతే ఈ సంఘటన వెలుగులోకే వచ్చేది కాదని పలువురు అంటున్నారు. ఒకరిపై ఒకరు నింద వేస్తూ.. కారు ఢీకొన్న సమయంలో అక్కడే కొందరు మీడియా ప్రతినిధులున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వారెవరనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. నిందితుల్లో ఒకరు విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే ఈ దారుణ ఘటనలో అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను చిన్నదిగా చూపించేందుకు ఎవరి ప్రయత్నం వారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రియాంక తండ్రి విలేకర్లతో మాట్లాడిన రోజే ఆయనను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హడావుడిగా హైదరాబాద్కు వెంట పెట్టుకుని వెళ్లారని, దీనిలో ఆంతర్యమేమిటనే ప్రశ్న కూడా జవాబు లేనిదిగానే మిగిలింది. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిగితేనే అసలు విషయాలన్నీ వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రియాంక స్కూటీని ఢీకొంటున్న కారు (సీసీ కెమెరా చిత్రం) నిందితులు ధస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్ఫ డాక్టర్ ప్రియాంక మరణం వెనుక జవాబు లేని ప్రశ్నలెన్నో.. ఫ ఈ నెల 3న కారుతో ఢీకొట్టిన నిందితులు ఫ మూడు రోజుల పాటు వెలుగులోకి రాని ఘటన ఫ దీనిపై సర్వత్రా అనుమానాలు ఫ చిన్న ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన పెద్దలెవరో? -
ఫ ముందే వచ్చిన ‘మువ్వన్నెల’ సంబరం
మువ్వన్నెల సంబరం ముందే వచ్చింది. ఉప్పలగుప్తం ఎంపీడీఓ డి.కృష్ణ ఆధ్వర్యాన గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ నుంచి గొల్లవిల్లి సెంటర్ వరకూ విద్యార్థులు మూడు రంగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి, దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్తి సత్యకృష్ణ, ప్రధానోపాధ్యాయిని జి.కనకదుర్గ, పీడీలు గొలకోటి ఫణీంద్ర, డి.సరస్వతి, పీఈటీ విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. – ఉప్పలగుప్తం -
విద్యుత్ షాక్తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
మోతుగూడెం: విద్యుత్ స్తంభాలపై మరమ్మతులు నిర్వహిస్తుండగా షాక్ కొట్టడంతో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. స్థానిక పవర్ హౌస్ నుంచి పొల్లూరు సబ్ స్టేషన్ వరకు 33 కేవీ విద్యుత్ స్తంభాల మరమ్మతులను మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్థానిక ఏపీ జెన్కో ఉద్యోగులతో పాటు సుమారు ఎనిమిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆ పనిలో పాల్గొన్నారు. వారిలో మడివి ముత్తయ్య అనే కార్మికుడు పోల్ ఎక్కి రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఒక్కసారి కింద పడి మృతి చెందాడు. అతడితో పాటు మరో కాంట్రాక్ట్ కార్మికుడు నవీన్, ఏపీ జెన్కో ఉద్యోగి షేక్ రంజాన్ వలీకి చిన్నపాటి గాయాలు అయ్యాయి. వారిని ఏపీ జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుడి బంధువుల ఆందోళన కాంట్రాక్ట్ కార్మికుడు ముత్తయ్య మృతి చెందడంతో సీఐటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెంకట్, మృతుడి కుటుంబ సభ్యులు, నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ముత్తయ్య మృతి చెందాడని, కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబంలో ఒకరికి జెన్కోలో ఉద్యోగంతో పాటు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారితో ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ రాజారావు, ఎస్ఈ బాలకృష్ణ, చిన్న కామేశ్వరరావు, ఇతర అధికారులు చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.27 లక్షల ఎక్స్గ్రే షియా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ కార్మికుడిగా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించారు. మోతుగూడెం ఎస్సై కృష్ణ, డొంకరాయి ఎస్సై చరణ్ నాయక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మరో ఇద్దరికి గాయాలు స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం అధికారుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన -
అన్యాయంపై ఆగ్రహం
రాజానగరం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అతి పెద్దదిగా పేరొందింది. దీనికి 415 అనుబంధ కళాశాలతో పాటు 73 పీజీ సెంటర్లు, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. సుమారు 2.25 లక్షల మంది విద్యార్థులు ఈ వర్సిటీలో ఉన్నత విద్య చదువుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కళాశాలలో రెగ్యులర్ సిబ్బందితో పాటు ఔట్సోర్సింగ్ విధానంలో 170 మంది వరకూ నాన్ టీచింగ్ సిబ్బంది, అడ్హాక్ (తాత్కాలిక) పద్ధతిలో 125 మంది వరకూ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరూ డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివారు. ఐదు నుంచి 20 సంవత్సరాల సర్వీసు ఉన్నవారే. వీరి విధులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా.. ఒక్కోసారి అంతకు మించి ఉంటుంది. కానీ, రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు లక్షల రూపాయల్లో ఉండగా.. తమకు చాకిరీ ఎక్కువ. జీతాలు మాత్రం గొర్రెతోక బెత్తెడు చందమేనని వీరు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడానికి, పిల్లలను చదివించుకోవడానికి వీరు నానా కష్టాలూ పడుతున్నారు. వీరిలో ఎక్కువ సర్వీసు అంటే రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్న వారిలో చాలామంది వయస్సు ఇప్పటికే 50 సంవత్సరాలు దాటింది. ఈ క్రమంలో ఇప్పటికై నా సర్వీసులు రెగ్యులర్ కాకపోతే వీరందరూ చిరుద్యోగులుగానే రిటైర్ కావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ సర్వీసు రెగ్యులర్ చేయాలన్నది వీరి చిరకాల డిమాండ్. అయితే, దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా వారి స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించేందుకు టెండర్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఆ చిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఎప్పటికై నా తమను రెగ్యులర్ చేస్తారని, ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆశ పడుతూంటే.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా తీసుకుంటున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, వర్సిటీ పాలకుల తీరును నిరసిస్తూ నన్నయ వర్సిటీ ముఖద్వారం వద్ద ఆరు రోజులుగా మొక్కవోని పట్టుదలతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. స్పందించని ప్రభుత్వం తమను యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించిన తరువాతనే కొత్త సిబ్బంది నియామకానికి టెండర్లు పిలవాలని ఔట్సోర్సింగ్, అడ్హాక్ ఉద్యోగులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న చిరుద్యోగులతో రాజమహేంద్రవరం ఆర్డీఓ శివరాముడుతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి చర్చలు జరిపారు. రెండు దశాబ్దాలుగా తక్కువ జీతాలతో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని, ముందుగా ప్రస్తుతం జారీ చేసిన టెండరు నోటీసు రద్దు చేయాలని, తమను వర్సిటీ ఉద్యోగులుగా గుర్తించాలన్నవే తమ ప్రధాన డిమాండ్లని వారు స్పష్టం చేశారు. అప్పటి వరకూ దీక్షలు విరమించేది లేదని స్పష్టం చేశారు. వారికి అధికారులు ఎటువంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు. దీంతో, ఆ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నాయకుల సంఘీభావం ఉద్యోగ భద్రత కోసం నన్నయ వర్సిటీ వద్ద సిబ్బంది చేస్తున్న రిలే దీక్షలను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం సందర్శించారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా రెండు రోజుల క్రితం ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రతిపక్షంగా తన మద్దతు ఇస్తానని భరోసా ఇచ్చారు. ఫ నన్నయ వర్సిటీలో రోడ్డెక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఫ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ఫ రెండు దశాబ్దాల శ్రమకు గుర్తింపు దక్కలేదని ఆవేదన ఫ ఆరో రోజుకు చేరిన రిలే దీక్షలు డిగ్రీలు చదువుకుని.. చిప్ప చేత పట్టుకుని తిరగలేక.. జానెడు పొట్ట నింపుకొనేందుకు.. కుటుంబాన్ని పోషించుకునేందుకు.. ఆ చిన్నపాటి ఉద్యోగంలో చేరారు.. చాలీచాలని జీతమే అయినా.. ఎప్పటికై నా తమ తలరాతలు మారకపోతాయా అనే ఆశతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండు దశాబ్దాలు గడిచినా వారు కలలుగన్న బంగారు భవిష్యత్తు అందని ద్రాక్షగానే మిగిలింది. వెట్టిచాకిరీ చేస్తున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేకపోగా.. చంద్రబాబు సర్కారు తీసుకున్న పిడుగుపాటులాంటి నిర్ణయంపై మండిపడుతూ ఆ చిరుద్యోగులు పిడికిళ్లు బిగించి, ఉద్యమ బాట పట్టారు. భవిష్యత్తు కోసమే పోరాటం ఇచ్చే జీతాలు తక్కువైనా భవిష్యత్తులో రెగ్యులర్ కాకపోతాయా అనే ఆశతోనే సంవత్సరాల తరబడి చాకిరీ చేస్తున్నాం. అయినా మాపై పాలకులు, అధికారులు దయ చూపడం లేదు. చేస్తున్న చాకిరీకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో టెండర్ నోటీసు జారీ చేయడంతో భవిష్యత్తు కోసం పోరుబాట పట్టక తప్పలేదు. – నాగారాపు విజయబాబు, అధ్యక్షుడు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ (ఔట్సోర్సింగ్) సంక్షేమ సంఘం చిరుద్యోగిగానే రిటైర్ కావాలా? నాకు ఇప్పటికే 53 సంవత్సరాలు వచ్చేశాయి. 20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పని చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఇస్తున్న జీతాల్లో పెద్దగా పెరుగదల లేదు. కానీ, వయస్సు మాత్రం రిటైర్మెంట్కు చేరువవుతోంది. ఇలాగే రిటైరవుతాననే భయం ఈమధ్య బాగా వేధిస్తోంది. – జి.మిల్టన్ కుమార్, ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగి, రాజమహేంద్రవరం -
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం
తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మామ అఽధికారం.. మేనల్లుడి పెత్తనం!
కాకినాడ రూరల్: మామ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేనల్లుడు పెత్తనం సాగించాలని చూస్తున్నాడు. ఇతడి చర్యలతో ప్రజలు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఖాళీ స్థలాలకు అమాంతం విలువ పెరిగిపోయింది. ఇదే అదనుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికార అండతో వ్యవస్థఽలను తమ గుప్పెట్లో పెట్టుకుని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాకినాడ నగరంలో విలీన ప్రతిపాదిత వాకలపూడిలో ప్రస్తుతం నెలకొన్న స్థల వివాదం మత్స్యకారుల్లో ఆగ్రహానికి కారణమయింది. గ్రామంలో కోరమాండల్ కమ్యూనిటీ హాలు ఎదురుగా ఉన్న స్థలంలో ఆరు ప్లాట్లల్లో రెండు ప్లాట్లపై వివాదం తలెత్తింది. ఆరు సైట్లకు సంబంధించి గ్రామానికి చెందిన మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆయన భార్య రాణి, కుటుంబ సభ్యులు ఎరిపల్లి జయమణి, కోనాడ బేబి పేరిట ఉండడంతో వారి ఆధీనంలో స్థలాలు ఉన్నాయి. వీటిలో రెండు సైట్లు తమ కుటుంబ సభ్యులకు చెందినవిగా రెడ్డి నాయుడు అనే వ్యక్తి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి ఇటీవల గోడలు పెట్టించే ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. తమ స్థలంలో గోడలు పెట్టడమేంటని శ్రీను, ఆయన కుటుబ సభ్యులు నిలదీయగా తమ కుటుంబ సభ్యుల పేరిట డాక్యుమెంట్లు ఉన్నాయని రెడ్డి నాయుడు గోడలు పెట్టే కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు సర్పవరం పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మేనల్లుడి అండతోనే.. జనసేన నాయకుడు, బాధితుడు చింతకాయల శ్రీను మాట్లాడుతూ పార్టీ కోసం కష్టించి పనిచేశామని, ఈరోజు తమకే దిక్కు లేకుండా పోయిందన్నారు. జనసేన నాయకులే తమ స్థలాలపై గుండాలతో గోడలు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగా ఎమ్మెల్యే మేనల్లుడు తూము కృష్ణచైతన్య (బన్ను) తమపై అధికార బలం ఉపయోగించి పోలీసులను లాఠీలతో బెదిరింపు చర్యలకు దింపారని, గుండాలను తీసుకువచ్చి గోడలు పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై సీసీ ఫుటేజీలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తాము ఓట్లు వేస్తేనే గెలిచామా అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు అవమాన పరిచారని తెలిసిందన్నారు. స్థల వివాదంపై ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదన్నారు. తమపై పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. పవన్కల్యాణ్ కలగజేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బాధిత స్థల యజమాని కోనాడ బేబి మాట్లాడుతూ తనకు చెందిన స్థలం కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మేనల్లుడి అండతో ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాడబలిజ సంఘం ఆగ్రహం వాడోళ్లు ఏమి చేస్తారులే అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు బన్ను అవమానించినట్టు తమ దృష్టికి వచ్చిందని, వాడోల్ల ఓట్లు కావాలా అని వాడబలిజ సంఘ నాయకులు గంపల చిన్నబ్బాయి అనే శివరావు, శీకోటి సింహాద్రి, గొల్లపల్లి పెద్ద అప్పారావు, పిరాధి అప్పారావు, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాన్ని అవమాన పరిచారని ఓడబలిజ సంఘానికి చెందిన మత్స్యకారులు సోమవారం వాకలపూడిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమ కులానికి చెందిన చింతకాయల శ్రీను జనసేన కోసం ఎంతో కష్టపడితే ఇప్పుడు ఆయన స్థలాన్నే కబ్జా చేయాలని చూస్తున్నారని దీనిపై జనసేన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఎమ్మెల్యే మేనల్లుడు తమను అవమానిస్తే సహించేది లేదన్నారు. ఇదే తీరు కొనసాగిస్తే మత్స్యకారులంతా సంఘటితమవుతామన్నారు. తమ బంధువులకూ రెండు సైట్లు ఇదిలా ఉండగా స్థల వివాదానికి సంబంధించి మరో వర్గానికి చెందిన రెడ్డి నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ బంధువుల పేరిట రెండు సైట్లు ఉండడంతో వాటికి గోడలు పెట్టే ప్రయత్నం చేశామని తాము ఎవరి సహాయం తీసుకోలేదని చెప్పారు. సివిల్ వివాదాల్లో తలదూర్చడంతో విమర్శల వెల్లువ వాకలపూడిలో తిరగబడిన మత్స్యకారులు తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మేనల్లుడిపై ఆగ్రహం జనసేన పార్టీకి పనిచేసిన తనకే దిక్కు లేదని మత్స్య సహకార సంఘ మాజీ అధ్యక్షుడి ఆవేదన -
రెడ్బుక్ రాజ్యం.. ప్రజాస్వామ్యం అపహాస్యం
● డీఎస్సీ స్కామ్పై ర్యాలీలకు వైఎస్సార్ సీపీ ప్రణాళిక ● అడ్డుకోవడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుయుక్తులు ● అనుమతులు నిరాకరిస్తూ హడావుడిగా నోటీసులు ● నివ్వెరపోతున్న ప్రజాస్వామ్యవాదులు సాక్షి, రాజమహేంద్రవరం: రెడ్బుక్ రాజ్యంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతోంది. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు పోలీసు శాఖను చంద్రబాబు అండ్ కో ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది. ఈ క్రమంలో పోలీసులు మరో అడుగు ముందుకేసి ఆదివారం అర్ధరాత్రి, సోమవారం వేకువజామున వారి ఇళ్లకు చేరుకుని, తీవ్ర నేరాలకు పాల్పడినట్టు.. హడావుడి చేశారు. సోమవారం నిర్వహించతలపెట్టిన ర్యాలీలకు అనుమతి లేదంటూ నోటీసులు అందించారు. సర్కారు నియంతృత్వ పోకడలు చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. ఉద్యమం ఉధృతమవడంతో.. డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్ సీపీ చేపట్టిన దశల వారీ ఉద్యమం అన్ని ప్రాంతాల్లోనూ ఉధృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో నాలు గు రోజులు చేపట్టిన రిలే దీక్షలకు అన్ని వర్గాల నుంచీ విశేష మద్దతు లభించింది. దీనికి కొనసాగింపుగా సోమవారం భారీ ర్యాలీలకు పార్టీ అధిష్టానం పిలుపునివ్వడంతో కూటమి పెద్దలకు భయం పట్టుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ నమ్ముతున్నారని, ఈ ర్యాలీలు విజయవంతమైతే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందనే ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే మంత్రి లోకేశ్ జైలుకెళ్లాల్సి వస్తుందనే ఆందోళన ఆ పార్టీ కేడర్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ర్యాలీలను అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అర్ధరాత్రి వేళ తలుపులు తట్టి.. ● డీఎస్సీ స్కామ్కు వ్యతిరేకంగా తలపెట్టిన ర్యాలీలకు అనుమతి కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో కూటమి పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు ఆదివారం రాత్రి రంగప్రవేశం చేశారు. రాత్రి 10 గంటల సమయంలో రామచంద్రపురం చేరుకుని మరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు నోటీసులు అందించారు. ఆయన నిరాకరించడంతో సోమవారం ఉదయం మళ్లీ ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చారు. ● జక్కంపూడి రాజాకు నోటీసులు అందించిన పోలీసులు ఆయన రాజానగరం వెళ్లకుండా హౌస్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుని, అక్కడి రహదారులను బారికేడ్లతో పూర్తిగా మూసేశారు. దీంతో, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు రామచంద్రపురంలో నోటీసులు అందించేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయన అక్కడి నుంచి తప్పించుకుని, మండపేట చేరుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి ఆదివారం రాత్రి నోటీసులు అందించిన పోలీసులు అనపర్తిలో హౌస్ అరెస్టు చేశారు. ● ఉండ్రాజవరంలో వైఎస్సార్ సీపీ అగ్రికల్చరల్ విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ర్యాలీకి వెళ్లకుండా చాలా సేపు అడ్డుకున్నారు. ● దేవరపల్లి, కొవ్వూరు నియోజకవర్గాల్లోని పలువురు నాయకులకు సైతం ఆదివారం రాత్రి నోటీసులు అందించారు. భరత్రామ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్కు పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు అందించి, హౌస్ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం భారీగా చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల సాయంతో ఆయన ర్యాలీకి సిద్ధమైనప్పటికీ పోలీసులు అనుమతించలేదు. సుమారు గంటకు పైగా నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో భరత్రామ్ గేటు దాటి రోడ్డు పైకి చేరుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. -
బ్రాహ్మణగూడెంలో చోరీ
చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెంలో ఓ ఇంట్లో దొంగలు చొరబడి బంగారం, వెండి వస్తువులు, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాధవరెడ్డి రత్నకుమారి గత మంగళవారం విజయవాడలోని బంధువుల ఇంటికి పరామర్శ నిమిత్తం వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చారు. తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా పగులగొట్టి వస్తువులు మంచం మీద చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ వస్తువులు, వంటగదిలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, వెండి వస్తువులు, రూ.40 వేల నగదు, విలువైన రెండు వాచీలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు. తన కుమారుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారని, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని, ఊరు వెళుతున్న సమయంలో ఇంట్లో లైట్లు వేసి వెళ్లానని ఆమె చెప్పారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్వాంటం టెక్నాలజీస్దే భవిష్యత్ ప్రపంచం రాజానగరం: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్వాంటం టెక్నాలజీస్ భవిష్యత్ ప్రపంచాన్ని మరింత ప్రభావితం చేయగలదని పలువురు నిపుణులు అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి యువత ఈ రంగంపై అవగాహనను పెంచుకుని, అవసరమైన నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. రాజానగరం సమీపాన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో ‘క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ కంప్యూటింగ్–ఇండస్ట్రీ పెర్స్పెక్టివ్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ విషయాలను పలువురు నిపుణులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రొ.చాన్సలర్ కె. శశికిరణ్వర్మ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగునంగా విద్యార్థులు కూడా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యార్థులు సంప్రదాయ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో పాటు క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం అల్గారిథమ్స్, క్వాంటం సెక్యూర్టీ, క్వాంటం సాఫ్ట్వేర్ విభాగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. -
ఐదో రోజుకు చేరిన రిలే దీక్షలు
రాజానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు దీక్షలను విరమించేది లేదని సోమవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ నాన్ టీచింగ్ (ఔట్సోర్సింగ్) సిబ్బంది స్పష్టం చేశారు. యూనివర్సిటీ ముఖద్వారం వద్ద వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, రాజమహేంద్రవరం ఆర్డీఓ శివరాముడు, రాజానగరం తహసీల్దార్ దివ్యభారతి, డీఎస్పీ జీవన సోమవారం దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్షలను విరమింపజేసేందుకు వారితో జరిపిన చర్చలు సఫలీకృతం కాలేదు. ఈ సమయంలో దీక్షాపరులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. 20 ఏళ్ల నుంచి తాము చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, ఈ సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో కొత్తవారిని నియమించే విధంగా టెండర్ నోటీసు జారీ చేయడం బాధాకరమన్నారు. తక్షణమే టెండర్ నోటీసును వెనక్కి తీసుకుని, తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ దీక్షలను విరమించేది లేదన్నారు. చర్చల్లో నాన్ టీచింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారపు విజయబాబు, జనరల్ సెక్రటరీ వై.వీరభద్రచౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో చర్చలు విఫలం -
రాష్ట్ర స్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ చాంపియన్గా ‘తూర్పు’
దేవరపల్లి: ప్రకాశం జిల్లా బాపట్ల కాజీపాలెంలో ఆదివారం జరిగిన అండర్–17 బాలికల విభాగం రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ పోటీల్లో తూర్పుగోదావరి బాలికల జట్టు చాంపియన్గా నిలిచింది. ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ జిల్లాకు చాంపియన్ షిప్ దక్కిందని టెన్నిస్బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు తంగెళ్ల మునేశ్వరరావు, చెల్లయమ్మ సోమవారం తెలిపారు. జట్టులో చిక్కాల, చిన్నాయగూడెం, గోపాలపురం జెడ్పీ హైస్కూలు విద్యార్థులున్నారని మునేశ్వరరావు తెలిపారు. జిల్లా జట్టు ప్రథమస్థానంలో నిలవడానికి పీడీలు కేవీవీ సత్యనారాయణ, డి.అశోక్, టి.గంగాధరరావు కృషి చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా జట్టులో మండలంలోని చిన్నాయగూడెం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ముగ్గురు పాల్గొని ప్రతిభ చూపినట్టు పీడీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. జట్టులో పి.సిరి చందన, ఎం.కీర్తన ఆడినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉద్యమ కెరటాలై..
● డీఎస్సీ అక్రమాలపై జిల్లావ్యాప్తంగా ఎగసిన నిరసన ● లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ ● అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ● ఆంక్షలను ఛేదించి మరీ ఆందోళనలు ● వైఎస్సార్ సీపీ పిలుపునకు విశేష స్పందన సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి సీమపై ఉద్యమ కెరటం ఎగసింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు నైతిక బాధ్యత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలనే డిమాండ్లతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన వేలాదిగా ప్రజలు సోమవారం భారీ నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఉవ్వెత్తున ఎగసిన ఈ నిరసనను అడ్డుకునేందుకు కూటమి పెద్దల కుట్రలు పన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేశారు. ఫలితంగా పలువురు నాయకులు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వేళ నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఈ కుట్రలను, ఆంక్షల సంకెళ్లను ఛేదించుకుని మరీ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మూరులో అడ్డుకున్న పోలీసులు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ధవళేశ్వరం బ్యారేజీ కాటన్ విగ్రహం నుంచి సాయిబాబా గుడి వరకూ నిరసన ర్యాలీ చేపట్టాలని వైఎస్సార్ సీపీ నేతలు తొలుత నిర్ణయించారు. దీంతో, పోలీసులు ఆదివారం రాత్రి నుంచే పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో పాటు ముఖ్య నేతలకు నోటీసులు జారీ చేశారు. దీంతో, వేణు బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలతో కలసి జాతీయ రహదారి పైకి ర్యాలీ ప్రారంభించారు. కొద్ది దూరం కూడా వెళ్లక ముందే వారిని భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన వేణు, పార్టీ శ్రేణులు అక్కడే బైఠాయించి, నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, చంద్రబాబు నిరంకుశంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, బ్రిటిషర్లను మించిపోయిన నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొడుకు లోకేశ్ను రక్షించుకునేందుకు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన శాంతియుతంగా పోరాడుతున్న వారిని పోలీసుల అండతో అడ్డుకోవడం దారుణమన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువత, ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, డీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి జీవితంలో స్థిరపడాలనుకున్న అనేక మంది అభ్యర్థుల ఆశలను చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చిదిమేసిందని అన్నారు. చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరచి అర్హులకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. మార్గాని హౌస్ అరెస్టు నిరసన ర్యాలీని అడ్డుకునే లక్ష్యంతో రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, మార్గాని భరత్రామ్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారి తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆయన ఇంటి వద్దనే ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే అక్రమ కేసులతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సాయంతో వైఎస్సార్ సీపీ ఆందోళనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. రోడ్డుపై జక్కంపూడి రాజా బైఠాయింపు రాజానగరంలో నిర్వహించాల్సిన ర్యాలీకి హాజరు కావాల్సిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అయినప్పటికీ రాజా తదితరులు తమ ఇంటి వద్ద రోడ్డు పైనే బైఠాయించి, ఆందోళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందనే భయం మంత్రి లోకేశ్ను వెంటాడుతోందని అన్నారు. రాజా తల్లి, పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, పోలీసులు కాదు, మిలిటరీని దించినా వైఎస్సార్ సీపీ ఉద్యమాన్ని అణగదొక్కలేరని అన్నారు. ర్యాలీలు అడ్డుకోవడం అప్రజాస్వామికం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో శాంతియుతంగా ర్యాలీలు చేస్తూంటే అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యాన మండపేటలోని పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ప్రారంభించిన ర్యాలీని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తోటను నిర్బంధించేందుకు విఫలయత్నం చేశారు. ఈ ర్యాలీకి కార్యకర్తలను వెళ్లనీయరాదంటూ వివిధ గ్రామాల్లోని పార్టీ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేస్తూ హెచ్చరికలు చేశారు. కొందరిని గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు, విద్యార్థులు మొక్కవోని పట్టుదలతో మండపేట మెయిన్ రోడ్డు మీదుగా జాతీయ మహనీయుల విగ్రహాల సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అవకతవకలు జరగకపోతే భయమెందుకు? డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరగకపోతే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు, లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ప్రశ్నించారు. కొవ్వూరులో ప్రారంభించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన, పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి లోకేశ్ తప్పుకోవాలని నినాదాలు చేశారు. డీఎస్సీ పారదర్శకంగా నిర్వహించకపోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు పేరుకుపోవడంతో పేద విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ తక్షణం తప్పుకోవాలి డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఉదయం అనపర్తిలో హౌస్ అరెస్టు చేయడంతో ఆయన మధ్యాహ్నం 3 గంటలకు బిక్కవోలు చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంతెన వద్ద బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి, కొత్తూరుపేటలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛను హరిస్తున్నారని, ర్యాలీలు అడ్డుకోవడం నియంతృత్వ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. -
ప్రియాంక హంతకులను కఠినంగా శిక్షించాలి
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం, ఏపీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రియాంకకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ స్థానిక ఏపీ ఎన్జీవో హోమ్ నుంచి గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ మీసాల మాధవరావు మాట్లాడుతూ, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ డాక్టర్ ప్రియాంక దారుణ మరణానికి కారకులైన వారిని తక్షణమే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పిస్తూ చట్టాలను పక్కాగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1న చలో విజయవాడ రాజమహేంద్రవరం సిటీ: ిసీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లతో వచ్చే నెల 1న చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్లను నగరంలోని ఏపీ ఎన్జీవో హోమ్లో ఆ సంఘం జిల్లా కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యాన నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు ిసీపీఎస్ విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 1న విజయవాడలో జరిగే నిరసన మహా ప్రదర్శనకు రాజమహేంద్రవరం పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సత్యనారాయణరాజు, ఏపీ జేఏసీ కో కన్వీనర్లు షరీఫ్, కేజీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. కడలిలోకి 1.52 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 1,52,250 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులు ఉంది. ఎగువన కాళేశ్వరంలో 5.66, పేరూరు 9.54, దుమ్ముగూడెం 6.72 మీట ర్లు, భద్రాచలంలో 19.50 అడుగులు, కూనవరంలో 9.30 మీటర్లు, కుంట 5.40, పోలవరం 6.3, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.13 మీట ర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్కు 296 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 296 అర్జీలు సమర్పించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 157 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ ఎస్.భాస్కరరెడ్డి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని గడువులో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
టమాటా లారీ బోల్తా
● డ్రైవర్, క్లీనర్కు గాయాలు జగ్గంపేట: రాజమహేంద్రవరం వైపు నుంచి కోల్కతాకు టమాటాల లోడుతో వెళుతున్న లారీ మండలంలోని రామవరం పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో టమాటాలన్నీ రోడ్డు పక్కన పడిపోయాయి. దీంతో దారి వెంట వెళుతున్న ప్రజలు చేతికందిన టమాటాలను తీసుకుపోయారు. లారీ, డ్రైవర్ క్లీనర్కు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు రంగప్రవేశం చేసి టమాటాలు ఎవరూ తీసుకుపోకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వైద్య విద్యార్థిని ప్రియాంకకు పోస్టుమార్టం పూర్తి కంబాలచెరువు: రాజమహేంద్రవరం ప్రసాదిత్యమాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకకు సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య విద్యార్థిని ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కాకినాడ గేట్ వే పోర్ట్ వద్ద 500 కోట్ల భారీ ప్రాజెక్టు తొండంగి: కాకినాడ గేట్వే పోర్ట్కు చెందిన స్థలంలో రూ.500 కోట్ల పెట్టుబడితో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ నిల్వ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కాకినాడ గేట్వే పోర్ట్ డైరెక్టర్, సీఈఓ రామ్రెడ్డి ఓజిలి తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1,50,000 కిలోలీటర్ల సామర్థ్యంతో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్ను గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ఏర్పాటు చేయనుంది. ఈమేరకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్, రెండు సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల కూడా తూర్పు తీరంలో కాకినాడ గేట్ వే పోర్ట్ వ్యూహాత్మక మైరెన్ ఎనర్జీ హబ్గా నిలుస్తుందని వివరించారు. 17 లోగా ఉత్తమ అవార్డుకు దరఖాస్తు చేసుకోండికంబాలచెరువు: జిల్లా 2026 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రైవేటు యాజమాన్యం మినహా మిగిలిన అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తూ, పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ పూర్తి వివరాలతో డీఈవో.ఈజీడీటీ వెబ్సైట్ నందు తెలిపిన నిబంధనలు, అప్లికేషన్, చెక్ లిస్ట్లను పూర్తి చేసి ఈనెల 17వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖాధికారికి అందజేయాలన్నారు. ఉరేసుకుని యువతి ఆత్మహత్యకొత్తపల్లి: రొయ్యల శుద్ధి పరిశ్రమంలో పనిచేసేందుకు వచ్చిన ఒక యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పాడేరు జిల్లా హుకుంపేట మండలం మద్దిపుట్టు గ్రామానికి చెందిన మాదేల కాంతమ్మ (22) కొత్త మూలపేటలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చింది. ఆమె గత కొద్ది రోజులుగా ఆమె స్నేహితురాలితో కలిసి మూలపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. సోమవారం బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె భర్త, తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
అనపర్తి: తన తల్లి మృతిపై సందేహాలున్నాయని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఈ మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని సోమవారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు మారోజు రత్నం(65)కు నలుగురు సంతానం. భర్త మరణానంతరం ఆమె మండల కేంద్రమైన బిక్కవోలులోని గాజుల వారి వీధిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారని తెలిపారు. వృద్ధురాలు ప్రతిరోజూ సుమారు 8 సవర్ల 8 బంగారు గాజులు, సుమారు 5 సవర్ల బంగారు చంద్రహారం, 2 సవర్ల బంగారు గొలుసు, 2 సవర్ల బంగారు చెవిపోగులు (మాటీలు), వెండి కాలి గజ్జెలు ధరించేది. ఫిర్యాదుదారుడు మృతురాలి కుమారుడు రాంబాబు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన తల్లిని చూడడానికి ఇంటికి వెళతారని ఈ నెల 4న ఉదయం సుమారు 8 గంటలకు ఫిర్యాదుదారు తన తల్లి ఇంటికి వెళ్లి, ఆమెకు అల్పాహారం ఇచ్చి పనికి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలకు, ఫిర్యాదిదారు తన తల్లిని చూడటానికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే సమీపాన ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించి ఆమెను పరీక్షించిన తర్వాత, ఆమె మరణించినట్లు వైద్యుడు ప్రకటించారు. దీంతో రాంబాబు బంధువులకు తల్లి మరణ వార్తను తెలియజేశారు. మరుసటి రోజు ఉదయం, అంత్యక్రియలకు ముందు మృతురాలి కుమార్తె మృతురాలికి స్నానం చేయిస్తుండగా, ఆమె ధరించిన ఎనిమిది బంగారు గాజుల్లో రెండు గాజులు, మూడు పొరల బంగారు గొలుసులో ఒక పొర కనిపించకుండా పోయినట్లు గమనించారు. ఆ తర్వాత ఆమె పొట్టపై గీతలు, పెదవులపై ఎండిన రక్తపు మరకలను గమనించారు. మరణం సహజ మరణం కాకపోవచ్చని అనుమానించి గ్రామ పెద్దలకు, బంధువులకు ఈ విషయం తెలియజేశారు. అయినప్పటికీ, వారు అంత్యక్రియలను కొనసాగించమని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో 5న ఉదయం సుమారు 11 గంటలకు బిక్కవోలులోని దేవుడి మాన్యం వద్ద ఉన్న విశ్వబ్రాహ్మణ శ్మశానవాటికలో రత్నం మృతదేహాన్ని ఆచారం ప్రకారం ఖననం చేశారు. తన తల్లి మరణించిన పరిస్థితులు, కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాల గురించి మృతురాలి కుటుంబబ సభ్యులకు తీవ్రమైన అనుమానాలు కొనసాగడంతో, వారు ఈనెల 8న బిక్కవోలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీసి పరిశీలించినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అనపర్తి సీఐ సుమంత్, తహసీల్దార్ టీవీఎస్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పిస్తాం
ములుగు రూరల్: మావోయిస్టు పార్టీ నుంచి లొంగిపోయిన వారు సమాజంలో విలీనమై జీవించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం కర్రెగుట్టల పర్యటన అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు హెల్త్ కార్డులు, రివార్డు చెక్కులు అందజేశారు. రాజమండ్రి జిల్లా ఆర్యాపురానికి చెందిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత అలియాస్ మాధవి అలియాస్ దుర్గ అలియాస్ షకీల (దివంగత మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి భార్య) డీజీపీ పర్యటన సందర్భంగా ములుగు జిల్లాలో ఆమె లొంగుబాటును చూపించారు. ఆమెకు ప్రభుత్వం నుంచి అందించే రూ.20 లక్షల రివార్డు చెక్కు అందించారు. డీజీపీ మాట్లాడుతూ.. సమత 40 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పని చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసి బతకడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణ్రావు అలియాస్ గణపతి, అతడి భార్య లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులు తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. కేసులు ఎత్తివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో చర్చించి తీసుకోవలసిన నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా పోయిందని తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతంలో అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో మల్టీజోన్ వన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సీఆర్పీఎఫ్ ఏడీజీ విక్రమ్సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఏఎస్పీ మమన్ పాల్గొన్నారు. -
మృతి చెందిన రైతు కుటుంబానికి వైఎస్ జగన్ ఆర్థిక సాయం
ఏలూరు: గుండె పోటుతో మృతిచెందిన పొగాకు రైతు కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం అందించారు. గత నెలలో బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంలో పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనస్థాపం చెంది గుండెపోటుకు గురై పాల వెంకటేశ్వర్లు అనే రైతు మృతి చెందారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా రైతు కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.2 లక్షల చేక్కును పంపించారు వైఎస్ జగన్. ఈ చెక్కును పోలవరం నియోజవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ తెల్లం బాలరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాధరావుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. -
భార్యను హత్యచేసిన భర్త
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. -
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్కళ్యాణ్.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్నగర్ పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.మా కడుపు కోతను అర్థం చేసుకోండి‘మా కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్ఫిరేషన్గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. కీలక ఆధారాలు సేకరించాంవైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్ చెన్నైలో బీటెక్ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబురాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వారం రోజులు మృత్యువుతో పోరాడి రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక (28) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
చదువుతో క్రీడలూ అవసరం
● ఎమ్మెల్సీ రాజశేఖర్ ● ముగిసిన రాష్ట్రస్థాయి జూనియర్స్ సాఫ్ట్ టెన్నిస్ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం అని ఎమ్మెల్సీ పి.రాజశేఖర్ తెలిపారు. ఆదివారం జిల్లా సాఫ్ట్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్స్ సాఫ్ట్ టెన్నిస్ పోటీలు క్రీడామైదానంలో ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలుర విభాగంలో ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ జిల్లా, గుంటూరు జిల్లా ప్రధమ, ద్వితీయ, తృతీయస్థానాలు, బాలికల విభాగంలో ఎన్టీఆర్ జిల్లా, కడప, గుంటూరు జిల్లాలు మొదటి మూడుస్థానాలు సాధించాయి. సంఘ కార్యదర్శి నీలిమ మాట్లాడుతూ అక్టోబరులో కాశ్మీర్లో జరిగే జాతీయస్థాయి పోటీలలో విజేతలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, డీఎస్డీఓ సతీష్కుమార్, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
నిర్వీర్యం కాదు.. బలోపేతం చేయాలి
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లును రద్దు చేయడం కాదు. చంద్రబాబు ప్రభుత్వానికి చేతనైతే మరింత బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గం. ఇటువంటి బిల్లును రద్దు చేయడంతో మహిళలకు భరోసా దూరమవుతుంది. –తానేటి వనిత, మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం ఇన్చార్జి రద్దు చేయడం దుర్మార్గం చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలు, యువతులకు రక్షణ కరు వైంది. ఇటువంటి పరిస్థితుల్లో దిశ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమైన చర్య. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వానికి మహిళల రక్షణ విషయంలో చిత్తశుద్ధి లేదనేందుకు ఆ ఘటనే నిదర్శనం. –జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు -
శుభానికి వచ్చి తిరిగి వెళ్తూ ప్రమాదం!
● టైరు పంచరై బోల్తా పడిన బొలెరో ● వ్యక్తి మృతి, పలువురికి గాయాలు ● బాధితులంతా ఎన్టీఆర్ జిల్లా వాసులు గండేపల్లి: కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందోత్సాహాలు కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. అంత వరకు సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్న వారికి దుఃఖం మిగిలింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, అంజనాపురానికి చెందిన అల్లాడి గోపాలకృష్ణ, రాజేశ్వరి దంపతుల ఆరు నెలల చిన్నారి అరణ్య అన్నప్రాశనం నిమిత్తం కమ్మంపాడు, విజయవాడ, సత్తెన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన బంధువులు శనివారం వ్యాన్లో అన్నవరానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బసచేసి ఆదివారం ఉదయం అన్నప్రాశన అనంతరం వారు తలుపులమ్మ తల్లిని దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా వారి వాహనం మండలంలోని బొర్రంపాలెం శివారు భారత్ పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి వ్యాన్ వెనుకబాగం ఎడమ వైపు టైర్ పంచరై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాదస్థలం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో చిన్నారికి వరసకు తాత అయ్యే సత్తెన్నగూడేనికి చెందిన అల్లాడి చిన్నారావు (46) అక్కడిక్కడే మృతి చెందగా మేడిపల్లి నాగేంద్రమ్మ, అట్లూరి స్నేహ, అన్నాబత్తుల సామ్రాజ్యంలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుని భార్య అల్లాడి సరోజిని, బోగి అశోక్కు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే అంబులెన్స్లో జెడ్ రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యాధికారి నీలిమ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు రిఫర్ చేశారు. చిన్నారావుకు కుమార్తె శిరీష, కుమారుడు సుధీర్ ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగ్గంపేట సీఐ బి.తిరుపతి, గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు ప్రమాదం వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
నేరస్తుల్లో భయం తగ్గుతుంది
దిశ బిల్లు రద్దయితే మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే మద్యం ఏరులై పారుతోంది. ప్రతి వీధిలోనూ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గంజాయి ఎక్కడికక్కడే దొరుకుతోంది. వాటిని తాగి మత్తులో ఆకతాయిలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందువల్లే గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దిశ బిల్లు రద్దు చేస్తే నేరగాళ్లలో భయం తగ్గి రెచ్చిపోయే ప్రమాదం ఉంది. –నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం -
● పట్టు జారితే ప్రమాదమే!
మహిళలు సైతం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ..ఎ.కొత్తపల్లి–తొండంగి రహదారిలో పరిమితికి మించిన ప్రయాణికులతో..కళ్లముందే రహదారి ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. రహదారి నిబంధనలను బేఖాతరు చేస్తూ పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలను ఆహ్వానిస్తున్నారు. ఆషాఢమాసం కావడంతో కాకినాడ పరిసర ప్రాంతాలు, కోనసీమ జిల్లాకు బీచ్రోడ్డు దగ్గరి మార్గం కావడంతో తుని మండలం నుంచి అన్నవరం మీదుగా, తేటగుంట తిమ్మాపురం మీదుగా తొండంగి, ఒంటిమామిడి, పెరుమాళ్లపురం బీచ్రోడ్డు మీదుగా కాకినాడ వెళ్తున్నారు. ఒంటిమామిడి వద్ద పోలీస్స్టేషన్ ఉన్నప్పటికీ నిమిత్త మాత్రమే. అధికారులు ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. – తొండంగి -
ప్రియాంక కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికో ప్రియాంక ప్రమాద సంఘటనపై చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత స్పందించకపోవడంపై ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియా ముందు కనీసం పరామర్శించలేదని తన ఆవేదనను వ్యక్తపరిచారన్నారు. ప్రియాంక ప్రమాద సంఘటనకు సంబంధించిన వీడియోను జగనన్న కనెక్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వెంటనే డిలీట్ చేసిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుండడంతో యువత పాడై పోతుందన్నారు. మద్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రియాంక కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కారు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
గండేపల్లి: జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో కారులో నలుగురు ప్రయాణికులకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు మండలంలోని మురారిలో అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్న కారు గ్రామంలో డివైడర్ వద్ద రోడ్డు దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి జగ్గంపేట వైపు వస్తున్న బొలెరో వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనతో కారు డివైడర్ గ్రిల్స్పైకి దూసుకుపోయి నిలిచింది. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న పోలీసులు, రోడు సేఫ్టీ వాహన సిబ్బంది కారును పక్కకు తీయించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాల్ యాజమాన్యంపై చర్యలకు డిమాండ్
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరంలో ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద జరిగిన ఘటనలో మెడికో ప్రియాంక మృతి చెందగా, ఆమె కుటుంబాన్ని మాల్ యాజమాన్యం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి ఆ మాల్ వద్ద వైఎస్సార్ సీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రియాంకను కారుతో పలుమార్లు ఉద్దేశ పూర్వకంగా ఢీకొని ఆమె మృతికి కారకులైన ఇద్దరు యువకులపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. మద్యం తాగిన వ్యక్తులను మాల్ యాజమాన్యం ఏ విధంగా లోపలకు అనుమతించిందని ప్రశ్నించారు. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. యువజన నేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ మాల్లోకి తాగుబోతులు రావడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. కనీసం మానవత్వం లేకుండా మాల్ యాజమాన్యం ప్రవర్తించడం, ఘటనపై పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకపోవడం వారి నిర్లకా్ష్య్నికి అద్దం పడుతుందన్నారు. ప్రియాంక మృతిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గణేష్ డిమాండ్ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీలి ఆనంద్, నాయకులు నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, మహిళా నాయకురాలు సంకిస భవానీప్రియా, బీసీ మహిళా నాయకురాలు బర్ల సీతారత్నం, సరిత, రాణి, తగరం సోము, ఏఎస్ఎఫ్ నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం వ్యాన్ బోల్తా.. అంతలోనే అంతా గప్చుప్!
● హైవే పెట్రోలింగ్ వాహనం వచ్చేలోగా అంతా సర్దేసిన ఆగంతకులు ● కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఆలమూరు: మండలంలోని మడికి 216ఏ జాతీయ రహదారి మడికి వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ ఆదివారం బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం రావులపాలెం వైపు నుంచి సుమారు రెండు టన్నుల బియ్యంతో వెళ్తున్న వ్యాన్ పొట్టిలంక సమీపంలో డివైడర్ దాటుతుండగా అదుపు తప్పి హైవే మధ్యలో తిరగబడింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ తప్పించుకుని వెళ్లిపోగా, వెంటనే కొందరు మరో వ్యాన్లో వచ్చి కూలీలతో పది నిమిషాల్లో బియ్యాన్ని తిరిగి లోడ్ చేసేసి వెళ్లిపోయారు. హైవే సేఫ్టీ పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే వారంతా బోల్తా పడ్డ వాహనాన్ని అక్కడే వదిలేసి బియ్యంతో పరారవ్వడం స్థానికంగా అనుమానాలకు తావిస్తోంది. రేషన్ బియ్యం కావడం వల్లే అధికారులకు చిక్కకుండా ఇలా తరలించారని స్థానికులు అనుకుంటున్నారు. కాగా బోల్తా పడిన వాహనం ఆధారంగా అందులో ఉన్నది రేషన్ బియ్యమా కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. రహదారి మధ్యలో వాహనం బోల్తా పడడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
రాజమహేంద్రవరం సిటీ: జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతి నేపథ్యంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రకటించారు. ఆదివారం ప్రియాంక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల కిందట ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మెడికో డాక్టర్ ప్రియాంకను ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకుని, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడవడం చాలా బాధాకరమన్నారు. ప్రియాంక తండ్రి ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ ఇలా ఎవరు తమ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని అన్నారని తెలిపారు. ఇంతటి తీవ్రమైన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని అనిపిస్తుందన్నారు. ప్రధానంగా ప్రకాశ్నగర్ సీఐ ఈ ఘటనను కేవలం ప్రమాదంగా నమోదు చేసి, నిందితులకు స్టేషన్ బెయిల్ లభించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, సోమవారం రాజమహేంద్రవరంలో అన్ని కాలేజీలు, విద్యాసంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్టు భరత్రామ్ ప్రకటించారు.ఫ నేడు విద్యా సంస్థల బంద్ ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ -
ఆత్మ రక్షణకు తైక్వాండో అవసరం
జిల్లా జడ్డి శ్రీనివాస్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆధునిక సమాజంలో తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు అవసరమని జిల్లా జడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. అతిథులుగా డీఎస్డీఓ సతీష్ కుమార్; తైక్వాండో సంఘ అధ్యక్షుడు మధుసుదనరావు హాజరయ్యారు. ముఖ్య అతిథి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులను అభినందించారు. డీఎస్డీఓ సతీష్కుమార్ ఈ ఏడాది శాప్ సహకారంతో డీఎస్ఏ ఆధ్వర్యంలో వేసవి తైక్వాండో శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన బి.అర్జునరావును అభినందించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, క్యాడెట్ విభాగంలో 42 కేజీల విభాగాల్లో బాలురకు, బాలికలు వేరువేరుగా నిర్వహించిన పోటీలకు 350 మంది హాజరయ్యారు. విజేతలకు సతీష్కుమార్, అర్జునరావు పతకాలు అందజేశారు. -
ముగిసిన సీబీఎస్ఈ క్లస్టర్ క్రీడలు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్ఈ టేబుల్ టెన్నిస్ క్లస్టర్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ వీవీ బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. విజేతల వివరాలు డబుల్స్ విభాగంలో..: అండర్–19 బాలుర విజేత – చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్, రన్నరప్ – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, అండర్ 19 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సింగిల్స్ విభాగంలో..: అండర్ 19 బాలుర విజేత – చేతన్ సాయి, చిరాక్ స్కూల్, రన్నరప్ – టీ.సాయి శ్రవణ్, శ్రీ ప్రకాష్, పెద్దాపురం, అండర్ 19 బాలికల విజేత – మౌపర్ణ దాస్, శ్రీ ప్రకాష్ సినర్జీ, పెద్దాపురం, రన్నరప్ – ఎం. లినిషా, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ పోలవరం కాలువలో మృతదేహం లభ్యం దేవరపల్లి: పోలవరం కుడి కాలువలో అనంతపల్లి వంతెన వద్ద 45 ఏళ్ల వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు కనుగొన్నారు. నీలం రంగు చొక్కా, ఫ్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు నల్లజర్ల సీఐ రవికుమార్ తెలిపారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఇంత క్రూరం ఏంటో!
వైద్య విద్యార్థినుల ఆవేదన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంత క్రూరం ఏంటో.. బయట తిరగాలంటే భయమేస్తోందంటూ వైద్య విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్కు మెడికో ప్రియాంక తండ్రి, కుటుంబ సభ్యులు వస్తున్నారన్న సమాచారం తెలిసి ఆదివారం ఇక్కడికి రాజానగరం జీఎస్ఎల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న ప్రియాంక తోటి స్నేహితులు, మెడికోలు చేరుకున్నా రు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమతో కలిసి తిరిగిన ప్రియాంక అకారణంగా బలైపోయిందని వారు ఆవేదన చెందారు. కారుతో ఢీకొట్టి దుర్మార్గంగా వ్యవహరించిన ఆ ఇద్దరిని కఠినంగా శిక్షించాలన్నారు. ● కావాలనే ఢీకొట్టారు ప్రియాంకను కారుతో కావాలనే ఢీకొట్టారు. మేము సీసీ పుటేజీ చూశాం. అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కావాలనే మూడుసార్లు ఢీకొట్టారు. దానివల్లే ప్రియాంక చనిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే ప్రియాంకకు న్యాయం జరగాలి. నిందితులకు శిక్ష పడాలి. లేకపోతే చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుంది. –సౌమ్య, మెడికల్ విద్యార్థిని, జీఎస్ఎల్ కళాశాల● ● నిందితులను వదలకూడదు ప్రియాంక మేడం మామల్ని చాలా బాగా చూసుకునేవారు. మేము ఆమె వద్ద నర్సింగ్ విద్యార్థినిగా శిక్షణ తీసుకుంటున్నాం. మాతో చాలా బాగుండేవారు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. అటువంటి ఆమె ఈ రోజు అన్యాయంగా బలైపోయారంటే రేపొద్దున్న మా పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని భయమేస్తోంది. నిందితులను వదలకూడదు. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. –దీవెన, నర్సింగ్ విద్యార్థిని ●● హేయమైన చర్య ప్రియాంక నా రూమ్మేట్. శనివారం ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చింది. తర్వాత సినిమాకు వెళ్లింది. తను సినిమాకి వెళ్లడం తప్పు కాదు. కావాలని కారుతో ఢీకొట్టడం హేయమైన చర్య. ప్రియాంక నా సీనియర్, కానీ మేము చాలా స్నేహంగా ఉండేవాళ్లం. ప్రియాంకకు నిశ్చితార్థం అయ్యిందని అంటున్నారు. అటువంటిదేమీ లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి. –తేజస్విని, మెడికో, ప్రియాంక స్నేహితురాలు ● -
బియ్యాన్ని శాసిస్తున్న కార్పొరేట్లు
ఆలమూరు: సన్న బియ్యం కొనలేరు.. రేషన్ (దొడ్డు) బియ్యం తినలేరు.. బియ్యం ధర వింటేనే ముద్ద గొంతు దిగని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ, అలసత్వ విధానాల వల్ల ధాన్యాగారంగా పేరొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలకు పూట గడవని పరిస్థితి నెలకొంది. బియ్యం ధరల ప్రభావంతో సగటుజీవి నెలవారీ బడ్జెట్ గాడి తప్పుతోంది. మూడు నెలల వ్యవధిలో క్వింటా సన్న బియ్యం కిలోకు రూ.40 వరకూ పెరిగింది. దీంతో నాణ్యమైన పాత సోనామసూరి బియ్యం 26 కేజీల బస్తా బహిరంగ మార్కెట్లో రూ.1700 వరకూ చేరుకుంది. కార్పొరేట్ బ్రాండ్లు అయితే రూ.1900 లోపు లభించడం లేదు. రేషన్ బియ్యానికి నాణ్యత లేకపోవడంతో సగటు జీవి తినడానికి విముఖత చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు బియ్యం సరఫరా తగ్గించి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి క్వింటా రూ.పది వేలకు చేరుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక రైస్ మిల్లుల వద్ద సన్న రకాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. ఇదే క్రమంలో రైతులు పండించే సన్న రకాల ధాన్యం బస్తా ధర మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. కార్పొరేట్ల గుత్తాధిపత్యం సన్నబియ్యం వ్యాపారం ఏకఛత్రాధిపత్యంగా తయారైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాపారులే గుత్తాధిపత్యం సాధించి బియ్యం ధరలను నియంత్రిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 350 వరకూ రైసుమిల్లులు ఉండగా వారి ఆధీనంలో 80 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, తెలంగాణ, ఒడిషా రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది టన్నుల ఽసన్నరకాల ధాన్యాన్ని అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇక్కడి గోదాముల్లో కొన్ని నెలల పాటు నిల్వ చేస్తారు. అనంతరం మిల్లింగ్ చేసి, విక్రయించి లాభాలు ఆర్జించడం ఆనవాయితీగా మారింది. కాగా ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సన్న బియ్యానికి కొరత ఏర్పడనున్న నేపథ్యంలో కార్పొరేట్ మిల్లర్లు సైతం ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు. చిన్న మిల్లుల వద్ద ఇప్పటికే నిల్వలు నిండుకున్నాయి. దీంతో బియ్యం వ్యాపారం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లి రోజు రోజుకు ధరలు పెరిగిపోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది 26 కేజీల బియ్యం బస్తా ధరల వ్యత్యాసం (రూపాయల్లో) బియ్యం రకం ఏప్రిల్లో ఆగస్టులో సోనామసూరి 1400 1750 స్టీమ్డ్ రైస్ 1150 1500 ఆర్ఎన్ఆర్ 1200 1550 హెచ్ఎంటీ 1250 1600 బీపీటీ (కొత్తరకం) 1100 1500 బీపీటీ పాతరకం 1200 1650 దంపుడు బియ్యం 1250 1600 కృత్రిమ కొరత సృష్టిస్తున్న మిల్లర్లు కిలో సన్నబియ్యం ధర రూ.72 పైమాటే మూడు నెలల్లో రూ.400 వరకూ పెరుగుదల బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు జగన్ ప్రభుత్వంలో కిలో రూ.39కే ఇచ్చారని గుర్తు చేసుకుంటున్న ప్రజలు అందుబాటులో లేని కౌంటర్లు సన్న బియ్యం ధరల పెంపుపై వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు పౌరసరఫరాల శాఖ హడావుడిగా కౌంటర్లను ఏర్పాటు చేసి అంతంత మాత్రం నాణ్యత ఉన్న ఆవిరి చేసిన సన్న బియ్యాన్ని విక్రయిస్తోంది. ఒకొక్క రేషన్ కార్డుకు పది కిలోల వరకు బియ్యం ఇస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. గత వైఎస్సార్ సీపీ హయాంలో బియ్యం ధరలు కొద్దిగా పెరిగితేనే అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కేవలం కేజీ రూ.39కే విక్రయించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్న బియ్యం కేజీ ఽరూ.52 వరకూ ఉండటం వల్ల ఆ ధర ఎక్కువనే భావనతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. -
గిరిజన జీవనశైలి సమాజానికి ఆదర్శం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గిరిజన జీవనశైలి సమాజానికి ఆదర్శమని కలెక్టర్ కీర్తి అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని సెమినార్ హాల్లో ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ తదితర అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రకృతికి అత్యంత సమీపంగా జీవించడం వల్ల గిరిజన సమాజానికి చెట్లు, వాతావరణం, ప్రకృతి చక్రాలపై అపారమైన పరిజ్ఞానం ఉందన్నారు. ఆ సాంస్కృతిక సంపదను, కళలను ఒక తరం నుంచి మరొక తరానికి విజయవంతంగా అందిస్తున్నారని కొనియాడారు. ‘నేను’ అనే స్వార్థ భావన కంటే ‘మనము’ అనే సమష్టి భావన గిరిజన జీవనశైలిలో కనిపిస్తుందని, ఈ గుణాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం రెండు హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులకు హితవు పలికారు. జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ గిరిజన అభివృద్ధి అంటే వారి సంస్కృతి, జీవన విధానాన్ని పూర్తిగా మార్చడం కాదని, వారి మూలాలను పరిరక్షిస్తూ విద్య, వైద్యం వంటి ఆధునిక సదుపాయాలను అందించడమని అన్నారు. డీఆర్ఓ భాస్కర్రెడ్డి, ఆర్డీఓ శివరాముడు, జిల్లా ఉపాధి అధికారి శిరీష, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కుసుమజ్యోతి, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి, ఎస్టీ సంఘాల నాయకులు ఎస్.గన్నయ్య, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలరావుకు పలువురి పరామర్శ
రాజమహేంద్రవరం రూరల్: తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న కృష్ణను పలువురు ప్రముఖులు ఆదివారం పరామర్శించారు. నున్న సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాతేరులోని తిరుమలరావు స్వగృహంలో నున్న సురేష్ పెద్దకార్యం సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరులు నున్న తిరుమలరావు, కృష్ణ, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కేఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, బూరుగుపల్లి శేషారావు, వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి గణేష్, టీడీపీ, బీజేపీ నేతలు, ఇతర ప్రముఖులు ఉన్నారు. ట్రాఫిక్ ఎస్సైపై వ్యక్తి దాడి సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సైపై ఆదివారం సాయంత్రం ఒక వ్యక్తి దాడి చేసిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం బస్సు కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ కూడలి ప్రదేశంలో ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు విధులు నిర్వహిస్తున్నారు. జయలక్ష్మి థియేటర్ రోడ్డులో కల్వర్టు, విద్యుత్ ట్రాన్సుఫార్మర్ వద్ద ఒక వ్యక్తి మోటారు సైకిల్పై కూర్చుని ఉన్నాడు. వాహనాల రాకపోకల వల్ల మలుపులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని గమనించిన ఎస్సై అతడిని దూరంగా వెళ్లాలని సూచించారు. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎస్సైపై దాడి చేయడంతో ఆయన కింద పడి పొయారు. వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. -
భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గాల ఎన్నిక
కొత్తపేట: ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం జిల్లా శాఖల కార్యవర్గాల ఎన్నిక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చక్రాల ఫకీర్రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం కొత్తపేటకు సమీపంలోని కపిలేశ్వరపురం మండలం వీధివారిలంక గ్రామంలో ధనమ్మతల్లి మర్రి వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర భట్రాజు అధ్యక్షుడు, విశిష్ట సేవా రత్న అవార్డు గ్రహీత చక్రాల ఫకీర్రాజు, ప్రధాన కార్యదర్శి చింతా సతీష్రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు జిల్లాల కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోనసీమ జిల్లా అధ్యక్షునిగా చింతా నాగరాజు, కార్యవర్గాన్ని, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా చుక్కన సుబ్బరాజు (తాతాజీ), కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పెంటపాటి రామకృష్ణ రాజు (రాంబాబు) ఇతర కార్యవర్గాలను ఏర్పాటు చేసారు. జిల్లా నూతన అధ్యక్షులకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను ఫకీర్రాజు అందచేశారు. ఇతర జిల్లాల కార్యవర్గాలను త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రాజు తెలిపారు. -
మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది...వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.‘‘గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక ఫ్రెండ్ ఉమేశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
మూడు రోజుల మౌనం వెనుక..
సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
జగనన్న అడుగు పెట్టడంతో..
వేలం కేంద్రంలో మాజీ సీఎం జగన్ అడుగుపెడితే ఽపొగాకు ధర పెరుగుతుందని మాకు నమ్మకం. ఇప్పుడదే జరిగింది. 2021–22లోనూ మార్కెట్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతుల ఇబ్బందులు తెలుసుకుని మార్క్ఫెడ్ ద్వారా 10 మిలియన్ల పొగాకు కొనుగోలు చేసి ఆదుకున్నారు. – సత్తి సాయిఈశ్వరరెడ్డి, పొగాకు రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం రైతులకు న్యాయం జరిగింది జగనన్న వల్లే రైతులకు న్యాయం జరుగుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది. అప్పట్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేశారు. ఎందుకు పనికి రాని లోగ్రేడుకు రూ.120 ధర ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లు పొగాకుకు మంచి ధర లభించింది. పొగాకు రైతులను టీడీపీ ఎమ్మెల్యే వెంకట్రాజు బ్లేడ్ బ్యాచ్గా చెప్పడం మంచి పద్ధతి కాదు. – చిన్నం నాగార్జున, పొగాకు రైతు, గౌరీపట్నం వైఎస్సార్ సీపీ పోరాటంతోనే.. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ పోరాటం చేసింది. జగనన్న పర్యటన ప్రకటన నుంచి ఇప్పటివరకు కిలోకు రూ.26 పెరిగింది. జగన్ పర్యటన వల్ల రైతులకు ఒరిగింది ఏమీ లేదని చెబుతున్న టీడపీ నాయకులు ఇప్పుడు ఏం చెబుతారు? పొగాకు రైతులకు జగనన్న అండగా నిలిచారు. – వల్లభనేని సత్యనారాయణ, పొగాకు రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం వారెందుకు పట్టించుకోలేదు పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి నాలుగు నెలలైంది. గిట్టుబా టు ధర లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా, ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోలేదు? గత ఏడాది సంగాయగూడెంలో పొగాకు రైతు ఆత్మహ త్య చేసుకోగా, ప్రజాప్రతినిధులు కనీసం పరామ ర్శించలేదు. రైతులకు బాసటగా వైఎస్ జగన్ పర్యటి స్తే, పొగాకు ధ్వంసం చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారు. – సుంకవల్లి వెంకట శ్రీనివాస్, పొగాకు రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం -
మూడు రోజుల మౌనం వెనుక..
● నిందితులను రక్షించేందుకు పోలీసులపై ఒత్తిడి? ● కారు నంబరు ప్లేట్లు మాయం ● ప్రజాప్రతినిధులు, పోలీసుల మౌనంపై అనుమానాలు సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యార్థిని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వాధీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
మాడవీధుల్లో మార్మోగిన మాధవనామం
● వాడపల్లి వేంకటేశుని దర్శించిన భక్తులు ● లక్ష మందికి మించి రాక ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిటీ సభ్యులు ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. వారి గోవింద నామస్మరణతో మాడవీధులు మార్మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని సుమారు 80 వేల నుంచి లక్షకు పైగా భక్తులు దర్శించారని, భారీగా ఆదాయం కూడా సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రావడం మొదలుపెట్టిన భక్తులు గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కాలి నడకన సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారీ సంఖ్యలో వచ్చిన వాహనాలతో ఆలయ కారు పార్కింగ్, కొత్త వంతెన, లొల్ల లాకుల వద్ద తరచూ ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తుల వసతుల కల్పనకు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, వేద పండితులు, సేవా కార్యకర్తలు కృషి చేశారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం స్వామి వారి పూజలు, సేవలు, కై ంకర్యాలను పర్యవేక్షించారు. -
అడ్డంగా దొరికి బుకాయింపా!
● డీఎస్సీ నియామకాల్లో దగాపై చంద్రబాబుకు దడ ● అందుకే సీబీఐ విచారణకు వెనకంజ ● బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి ● రిలే దీక్షల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత సాక్షి, రాజమహేంద్రవరం: దగా డీఎస్సీతో అడ్డంగా దొరికిపోయారు.. అయినా బుకాయింపు ఎందుకు బాబూ అంటూ అంతా మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను చిదిమేసిన డీఎస్సీ అక్రమాలపై తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని రిలే దీక్షల్లో యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు పట్టుబడుతున్నారు. అవకతవకలు జరగడం వల్లే సీబీఐ దర్యాప్తునకు చంద్రబాబు, లోకేశ్ భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమూరులో రాజమహేంద్రవరం రూరల్ ఇన్చార్జి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మోరంపూడి జంక్షన్లో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రిలే దీక్షలను ప్రారంభించారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మండపేట, గోపాలపురంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విద్యార్థులకు తీరని అన్యాయం, ద్రోహం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదు. దీంతో మనస్తాపానికి గురై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. డీఎస్సీ స్కామ్పై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రజలు విసుగుచెందారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులను అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకు నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. – జి.శ్రీనివాస్నాయుడు, మాజీ ఎమ్మెల్యే -
అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఆరగించనీ స్వామీ
తాత్కాలిక ఇరుకు షెడ్డులో భోజనాలు వడ్డించుకుంటున్న భక్తులు ఎండలో క్యూలో వేచి ఉన్న భక్తులు ఆత్రేయపురం: పిల్లా పాపలతో అన్న ప్రసాదం తినే భాగ్యం ఎప్పుడు స్వామీ అని భక్తులు వాడపల్లి వేంకటేశ్వరుని ప్రశ్నిస్తున్నారు. ప్రతి శనివారం ఇతర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షకు పైగా వచ్చే భక్తులలో అన్న ప్రసాదం స్వీకరించే భక్తులు 30 నుంచి 40 వేల మంది ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆలయ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. సుమారు రూ.16 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా ప్రాకార మండపాన్ని పూర్తి చేయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతితో రూ.2.8 కోట్లతో కోనేటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రూ.6.25 కోట్లతో వకుళమాత అన్నదాన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. తదనంతర కాలంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఆ పనులన్నింటికీ బ్రేకులు పడ్డాయి. ఈ పనులపై నిత్యం ఆలయ నిర్వాహకులు, అధికారులు సమీక్షిస్తూనే ఉన్నప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. విరాళాలు విరివిగా వస్తున్నా.. అన్నదాన భవనానికి భక్తులు భారీగా విరాళాలు ఇస్తుండడంతో ఆ నిధులు సుమారు రూ.12 కోట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ పనుల్లో పురోగతి లేదు. దీంతో పిల్లా పాపలతో వచ్చిన భక్తులు అన్న ప్రసాదం తినడానికి నానా అవస్థలు పడుతున్నారు. క్యూలైన్లలో కంచాలు తీసుకుని, అన్నం, కూరలు, సాంబారు వడ్డించుకుని తిందామనుకుంటే, సమీపంలో తాగునీరు లేక తిరిగి వడ్డించుకోలేక వారి బ్యాగులు మోయలేక కూర్చోలేక నుంచో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని కమిటీ సభ్యులు.. ఆలయ కమిటీ సభ్యులు శనివారం భక్తుల దర్శనాలకు సంబంధించిన వ్యవహారాలు తప్ప, అక్కడి భక్తుల ఇబ్బందులు పట్టించుకోవడంలేదు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నా ఉత్తుత్తి పర్యటనలు.. దేవదాయ శాఖ మంత్రి నుంచి, కమిషనర్ వరకు పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. తద్వారా అన్నదాతల ఆశయానికి ఇక్కడ తూట్లు పొడుస్తున్నారు. సౌకర్యవంతంగా అన్న ప్రసాదం తినేలా భవనాన్ని త్వరగా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. వకుళ మాత భవనం కోసం భక్తుల ఎదురుచూపు దాతల విరాళాలు రూ.12 కోట్లకు చేరినా జాప్యమే నత్తనడకన వాడపల్లిలో అభివృద్ధి పనులు -
నవోదయానికి అడుగేద్దాం!
రాయవరం: విద్యార్థుల భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో ప్రస్తుత విద్యాసంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులే గడువు. ఈ నెల 10తో గడువు ముగియనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కాగా శనివారం నాటికి 7,770 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత ఏడాది 9,279 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది అంతకు పదిశాతం ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు. కానీ దానికి ఇప్పటి వరకు 1,509 దరఖాస్తులు తక్కువ వచ్చాయి. పెద్దాపురం నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఐదో తరగతి విద్యార్థులు సుమారు 60 వేల మంది ఉన్నారు. పరీక్షా విధానమిదీ ఈ ఏడాది నవంబరు 28న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్దేశిత కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిషు, తెలుగు మాధ్యామాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్షకు, రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మెంటల్ ఎబిలిటీపై 40 ప్రశ్నలు, 50 మార్కులకు, గణితం (అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మొదటి రెండేళ్లు తెలుగు/ఇంగ్లీషు భాషల్లో బోధిస్తారు. పోటీ విధానం అలవడుతుంది జవహర్ నవోదయ విద్యాలయలో సీటు సంపాదించడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకోసం పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంది. సీటు రాకపోయినప్పటికీ నిరాశ చెందకుండా, ఇతర పోటీ పరీక్షలకు హాజరవడం అలవడుతుందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు ఇలా.. జిల్లా 2026–27 2027–28 కోనసీమ 2,233 2,272 తూర్పుగోదావరి 2,521 1,745 కాకినాడ 4,215 3,753 ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం దాఖలుకు రెండు రోజులే గడువు గతేడాది వచ్చిన దరఖాస్తులు 9,279 ఈ ఏడాదిలో ఇప్పటికి వచ్చినవి 7,770 నవంబరు 28వ తేదీన ప్రవేశ పరీక్ష రేపటితో ముగుస్తున్న గడువు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆ మేరకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. – ఎస్.శరత్చంద్ర కీర్తి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం దరఖాస్తుల పెంపుకు కృషి చేయాలి జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో గ్రామీణ విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులతో ఈ పరీక్షలు రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
దిశ రద్దుతో మహిళల రక్షణ గాలికి
ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ అమలాపురం టౌన్: ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేసి మహిళల భద్రత గాలికి వదిలేసిందని ఆర్పీఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం రద్దుతో కూటమి ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న వ్యతిరేక భావం వ్యక్తం అవుతోందన్నారు. స్థానిక అరిగెల పాలంలో శనివారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో లోక్ మాట్లాడుతూ రద్దు వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందని అన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్న క్రమంలో ఈ చట్టాన్ని ఇంకా కట్టుదిట్టం చేయాల్సింది పోయి రద్దు చేయడంపై మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆయన సూచించారు. ఽసమావేశంలో ఆర్పీఐ నాయకులు డి.శ్యామలరావు, ఈవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కాతేరు గామన్ బ్రిడ్జి అండర్ బైపాస్ రోడ్డు కొంతమూరు వైపు వెళ్లే దారిలో శనివారం నాలుగు విద్యుత్ స్తంభాల మధ్య ఉన్న ఇనుపరాడ్కు గుర్తు తెలియని వ్యక్తి చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల మేరకు అస్సాం రాష్ట్రం కచర్ లేకిఫూర్కు చెందిన అహ్మద్ఖాన్గా గుర్తించారు. సుమారు 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడని, అతని మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచినట్టు త్రీటౌన్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.అప్పారావు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు 94407 96532 ఫోన్ నంబరుకు తెలియజేయాలన్నారు. -
ప్రియాంక కుటుంబాన్ని ఆదుకోవాలి
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజారాజమహేంద్రవరం సిటీ: వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో ప్రియాంకను కారుతో ఢీకొన్న ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇటువంటి ఘటనల ద్వారా చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్, సారా విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. కేవలం మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తూ, కూటమి నాయకులు జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గడిచిన రెండేళ్లలో జిల్లాలో 147 కేసుల్లో 6,200 కిలోల గంజాయి పట్టుబడిందంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దేశానికే దిశానిర్దేశం చేసిన ’దిశ’ బిల్లును రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలో మహిళలు, యువతలో చిన్నారులకు చీకటిరోజుగా రాజా అభివర్ణించారు. -
పగాకు నుంచి బాగుకు..
55 శాతం బేళ్ల తిరస్కరణ వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకుండా ట్రేడర్లు తిరస్కరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరస్కరించిన బేళ్లు తిరిగి ఇంటికి తీసుకువెళ్లాలంటే ఆర్థికంగా నష్టపోతున్నారు. బేలుకు దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. తీసుకొచ్చిన బేళ్లలో 55 శాతం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 45 శాతం బేళ్లు అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. ధర పెరిగినప్పటికీ నో బిడ్లు ఎక్కువగా ఉంటున్నాయని వారు గగ్గోలు పెడుతున్నారు. ధరతో పాటు పొగాకు కొనుగోలు శాతం కూడా పెరగాలని రైతులు కోరుతున్నారు. ● పుంజుకొంటున్న పొగాకు ధర ● మాజీ సీఎం జగన్ రాకతో ‘ధర’హాసం ● రెండు రోజుల్లో కిలోకు రూ.16 పెంపు ● రైతుల మోముల్లో ఆనందం దేవరపల్లి: నాలుగు నెలలుగా నిలకడగా సాగిన పొగాకు ధర రెండు రోజులుగా పుంజుకొంటుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ‘ధర’హాసం వచ్చింది. ఈ నెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లిలో పర్యటించి రైతులకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఖరారైన తర్వాత కిలోకు రూ.10 ధర పెరగగా, పర్యటన అనంతరం శుక్రవారం రూ.15 పెరిగింది. శనివారం మరో రూ.1 పెరుగుదలతో మొత్తంగా కిలోకు రూ.26 పెరిగినట్టయ్యిందని రైతులు తెలిపారు. రెండు రోజుల్లోనే రూ.16 పెరగడం విశేషం. తాజా ధరలు ఇలా.. శనివారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.291, కనిష్ట ధర రూ.150, సగటు ధర రూ.242.05 పలికింది. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం 4,645 బేళ్లు అమ్మకానికి రాగా, 2,239 బేళ్లు కొనుగోలు చేశారు. 2,406 బేళ్లు తిరస్కరించారు. 2.91 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇప్పటివరకు 13.18 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 1.92 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో 2.89 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 3.12 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 2.72 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 2.51 మిలియన్ల కిలోల విక్రయాలు జరిగాయి. కిలో సగటు ధరలు దేవరపల్లిలో రూ.237.97, జంగారెడ్డిగూడెం–1లో రూ.242.97, జంగారెడ్డిగూడెం–2లో రూ.241.53, కొయ్యలగూడెంలో రూ.241.22, గోపాలపురంలో రూ.245.64 రైతులకు లభించాయి. -
పుస్తెలతాడు అపహరణ
పిఠాపురం రూరల్: వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును ఓ యువకుడు తెంచుకుని పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిత్రాడకు చెందిన అడబాల కమల (65) శనివారం మధ్యాహ్నం 3 గంటల వేళ పట్టణంలోని పల్లపు వీధిలోని రామాలయం మీదుగా వెళ్తుండగా బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని పుస్తెలతాడును తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై లోకేష్ కేసు దర్యాప్తు చేపట్టారు. పశువుల లారీ సీజ్ కిర్లంపూడి: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. దీనిపై ఆయనను వివరణ కోరగా శుక్రవారం అర్ధరాత్రి కృష్ణవరం టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీల్లో ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీలో 20 ఆవులు, 20 లేగదూడలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీ డ్రైవర్ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, లారీని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. పశువులను రాజమహేంద్రవరంలోని గోశాలకు అప్పగించినట్టు ఎస్సై తెలిపారు. -
టెట్కు 85 మంది గైర్హాజరు
ప్రకాశంనగర్: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. రాజమహేంద్రవరంలోని రాజీవ్గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్, ఇయాన్ డిజిటల్ జోన్ లూథరగిరిలో మూడో రోజు శనివారం ఈ పరీక్షలు జరిగాయన్నారు. రెండు సెషన్లలో తెలుగు పేపర్–1 పరీక్ష జరిగిందన్నారు. సెషన్–1కు 940 మందికి 885 మంది, సెషన్–2లో 940 మందికి 910 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 85 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. డిపార్ట్మెంట్ అధికారులుగా అర్బన్ ఎంఈఓ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, హెచ్ఎం కోలా సత్యనారాయణ, జీవీవీఎస్ గణపతిరావు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సత్యదేవా శరణు శరణుఅన్నవరం: ఆషాఢ బహుళ దశమి, శనివారం కావడంతో అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. రూ.300 వ్రతా లు ఆచరించేందుకు భక్తులు వ్రత మండపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మందికి అన్నప్రసాదం అందించారు. కాగా, ఆ షాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం కూడా రత్నగిరిపై రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు. ఏలేరు తీరంలో విహారయాత్రలు నిషేధం జగ్గంపేట: భావవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని ఏలేరు ప్రాజెక్టు నదీ తీరంలో విహార యాత్రలకు ఎటువంటి అనుమతులు లేవని, ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి పెరిగింది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో సెలువు రోజుల్లో పెద్ద ఎత్తున వస్తు న్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వచ్చి ఓ యువకుడు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ప్రాంతంలో నది బాగా లోతుగా ఉండడంతో నీటిలో దిగితే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్టులోకి రావడానికి కూడా నిబంధనల ప్రకారం వీలుకాదని చెప్పారు. భావవరం ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. -
పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదానికి యువ డాక్టర్ జీవచ్ఛవంలా మారింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఊరి కాని ఊరికి వచ్చిన ఆ యువతి ఇప్పుడు మృత్యువు ముంగిట నిలిచింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కండకావరంతో కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించిన దుర్మార్గులపై కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా): వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక(28) బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల వరకు పోలీసులు కేసును గుంభనంగా ఉంచారన్న దానిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు తాత్సారం ప్రదర్శించారో తెలపాలని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందని నిలదీస్తున్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మోరంపూడి జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మార్గాని భరత్ పాల్గొన్నారు. 'జస్టిస్ ఫర్ డాక్టర్ ప్రియాంక' ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు జరిగిన అన్యాయంపై తాము పోరాడుతున్నామని, న్యాయం జరిగే వరకు పోరాడేందుకు జనమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.''డాక్టర్ ప్రియాంకను కారుతో మూడు సార్లు ఢీకొట్టడం అత్యంత దారుణం. ఆగస్టు 3న ఘటన జరిగితే మూడు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఘటన జరిగిన రోజు రాత్రే నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు కానీ, అధికారికంగా వారి అరెస్ట్ గురించి వెల్లడించలేదు. ఏదో కుట్ర జరిగిందని మాకు అనుమానంగా ఉంది. మాకున్న సమాచారం ప్రకారం.. యాక్సిడెంట్ కేసుగా చూపించి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. పోలీసులపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. డాక్టర్ ప్రియాంక కేసు గురించి పోస్టులు పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లు అందరినీ బెదిరించారు. ప్రజాస్వామాన్ని కూటమి ప్రభుత్వం ఖానీ చేస్తోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ చెప్పారు, ఇప్పుడు రాజమండ్రిలో అదే జరుగుతోంది. ఒక డాక్టర్ను కారుతో తొక్కించిన ఘటనలో నిందితులను పోలీసులు, ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించడం దారుణం. నిందితులపై ముందే ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదు? 3 రోజుల పాటు నిందితులను ఎందుకు దాచారు? ప్రియాంకకు జరిగిన అన్యాయంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ డేటా బయటపెట్టాలి. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. నిందితులను ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎన్ని సూటుకేసులు ఎన్ని చేతులు మారాయి.. ఇవన్ని బయటకు రావాలి. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాల''ని మార్గాని భరత్ అన్నారు.ఈనెల 21 వరకు నిందితులకు రిమాండ్ డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్కు కారణమైన కేసులో నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్లకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
అత్యుత్సాహం ప్రదర్శించి..
టెంట్లు తొలగించి..శాంతియుత నిరసనపై ‘కూటమి’ కుట్ర పన్నింది.. టెంట్లు తొలగించేలా, దీక్ష భగ్నం చేసేలా ఖాకీలకు పని చెప్పింది.. చివరకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించినా, చివరికి నిరసన మొక్కవోని దీక్షతో కొనసాగింది. దీనికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు తోడవడంతో ఆందోళన విజయవంతమైంది. తొండంగి: దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తొండంగిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత దీక్షను కొనసాగించారు. కాకినాడ జిల్లాలోని మండల కేంద్రమైన తొండంగి గ్రామంలోని ఓ ప్రైవేటు స్థలంలో రిలే దీక్షకు ఏర్పాట్లు చేసుకోగా, స్థల యజమానిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరించారు. దీంతోపాటు గురువారం రాత్రి ప్రతిపాదిత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసుకున్న స్టేజీని, ఇతర సామగ్రిని తొలగించారు. పోలీసుల బెదిరింపులకు లొంగని వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత శుక్రవారం ఉదయం తొండంగిలోనే పార్టీ నాయకుని స్థలం వద్ద మళ్లీ టెంట్ ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొండంగి ఎస్సై జగన్మోహన్రావు, ఇతర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ డ్రెస్లో అక్కడకు చేరుకుని రిలే దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేపట్టాయి. అనంతరం, పోలీసులు యూనిఫాం ధరించి దీక్షాస్థలం వద్ద టెంట్లను తొలగించారు. దీంతో, నిరసనకారులు మొక్కవోని దీక్షతో మండుటెండలోనే రిలే దీక్షలో కూర్చున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వారందరికీ గొడుగులు ఏర్పాటు చేయించారు. ఆ గొడుగులు చేతబట్టి సాయంత్రం వరకూ రిలే దీక్ష కొనసాగించారు. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీక్షకు సంఘీభావం దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని యువత చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. దీక్షలో కూర్చుని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రాజా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో వైఎస్సార్ సీపీ యువత చేస్తున్న రిలే దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులను వినియోగించుకుని రెడ్బుక్ పేరుతో దుష్టపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.ఫ తొండంగిలో దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర ఫ తగ్గేది లేదన్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత ఫ సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా -
కథల పోటీ కరపత్రం ఆవిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలో శ్రీమతి అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కథల పోటీ కరపత్రాన్ని శుక్రవారం సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు డాక్టర్ చల్లా రవికుమార్, డాక్టర్ చల్లా మెహర్ ప్రసన్న ఆవిష్కరించారు. పోటీల నిర్వహణ కథా రచయితలకు రచనా అవకాశాలను కల్పిస్తుందని వారన్నారు. ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగర కృష్ణశ్రీ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 15 లోపు ‘కుటుంబ విలువలు’ అనే అంశంపై రాసిన తమ కథలను పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 99631 63163 ఫోన్ నంబరులో సంప్రదించాలని కోరారు. -
గ్రీన్ కారిడార్లు సిద్ధం చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, అగ్నిమాపక, పోలీసు వాహనాలు నిరాటంకంగా వెళ్లేందుకు ప్రత్యేక గ్రీన్ కారిడార్లను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రధాన రహదారులను వారు శుక్రవారం పరిశీలించారు. ఐఎల్టీడీ జంక్షన్, గూడ్స్ గేట్, నందం గనిరాజు సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల మళ్లింపు, పార్కింగ్, భక్తుల నడక మార్గాలు, అత్యవసర సేవల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పుష్కరాల సమయంలో అమలు చేయనున్న రూట్ మ్యాప్ను పరిశీలించి, అవసరమైన మార్పులు, మెరుగుదలకు సూచనలు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రతి జంక్షన్ వద్ద స్పష్టమైన బాధ్యతలను నిర్ణయించాలని ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, పుష్కర్ డిప్యూటీ కలెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు టెట్ ప్రశాంతం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రెండో రోజైన శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. స్థానిక రాజీవ్గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లోని ఇయాన్ డిజిటల్ జోన్లో రెండు సెషన్లలో తెలుగు పేపర్–1 పరీక్ష జరిగిందని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) కె.వాసుదేవరావు తెలిపారు. సెషన్–1కు 940 మందికి గాను 850 మంది, సెషన్–2కు 939 మందికి గాను 819 మంది చొప్పున అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. మొత్తం 210 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకుడు వై.రాఘవరెడ్డి సందర్శించారు. డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా అర్బన్ ఎంఈఓ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, గెజిటెడ్ హెడ్మాస్టర్లు కోలా సత్యనారాయణ, జీవీవీఎస్ గణపతిరావు వ్యవహరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానాను జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన చాంబర్లో కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పరిపాలన, న్యాయ సేవల విస్తరణ, ప్రజలకు అందుతున్న సేవల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా మౌలానా వ్యక్తం చేశారు. ఆయనకు కలెక్టర్ మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా ప్రయోజన కార్యక్రమాల అమలులో న్యాయవ్యవస్థతో సమన్వయం కొనసాగుతుందని చెప్పారు. దిశ బిల్లు రద్దుతో చీకటి రోజులుపిఠాపురం రూరల్: దిశ బిల్లును రద్దు చేయడం అంటే, మహిళా లోకానికి చీకటి రోజులు తీసుకు రావడమేనని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత అన్నారు. మహిళలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా దిశ బిల్లు తెచ్చారని, ప్రమాద సమయంలో ఫోన్ ఊపితే చాలు 15 నిమిషాల్లో పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేవారని గుర్తు చేశారు. ఈ బిల్లును రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నా రు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి వైద్య విద్యార్థిని ప్రియాంక మరణానికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను ఉరి తీయాలని సుజాత డిమాండ్ చేశారు. -
క్రీడా పోటీల నిర్వహణపై సమీక్ష
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అమరావతి చాంపియన్ షిప్– 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపిక పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో శుక్రవారం శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఈ పోటీల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అండర్– 17, 23 బాల బాలికలు సుమారు 1,500 వరకు పాల్గొంటారన్నారు. 12న బాలికలకు, 13న బాలురకు క్రీడలు నిర్వహిస్తారన్నారు. విజేతలు ఈ నెల 19 తేదీ నుంచి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్డీఓ వసతి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఫ వీబీజీ రాంజీ పథకాన్ని అటవీ శాఖ, డీఆర్డీఏ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించేలా, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పండ్లు ఇచ్చే మొక్కలు, వెదురు తోటల పెంపకాన్ని చేపట్టాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రియా, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ పాల్గొన్నారు. -
కొనసాగిన బోధనేతర సిబ్బంది ఆందోళన
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత కోసం యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. 20 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న తమ సర్వీసులను గుర్తించి, రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈనెల ఒకటిన ఇందుకు విరుద్ధంగా జారీ చేసిన టెండర్ నోటీసును తక్షణమే రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి వరకు ఈ దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేశారు. వీరి దీక్షలకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సంఘీభావం తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కరించే వరకూ తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వారికి జక్కంపూడి భరోసా ఇచ్చారు.సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే రాజా -
మిరపురాని రోజులొచ్చేలా..
● పొట్టి మిర్చికి పునర్జన్మ ● కనుమరుగైన పంటను కాపాడే ప్రయత్నం ● అరుదైన పంటగా పరిశోధనల్లో గుర్తింపు ● మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు ఆ రోజుల్లో పొట్టి మిర్చి ఓ వెలుగు వెలిగింది.. పుడమి పుత్రులకు లాభాలు తెచ్చిపెట్టింది.. అలాంటి అరుదైన పంట ఇప్పుడు కనుమరుగైంది. ఈ సాగుకు పుట్టినిల్లు అయిన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో మళ్లీ ఈ పంటను కాపాడే ప్రయత్నం మొదలైంది. ఇది అరుదైన రకంగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలడంతో జీఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేసి, సాగుకు సన్నాహాలు ప్రారంభించారు. పిఠాపురం: ఎర్రగా.. గుండ్రంగా చూడడానికి చెర్రీ పండులా నోరూరించేలా పొట్టి మిర్చి ఉంటోంది. దీనిని కొరికితే చెంబుడు నీళ్లు తాగాల్సి వస్తోంది. అంత కారంగా ఉంటుంది. దీని కారం లాగానే లాభాల ఘాటు కూడా ఎక్కువే. దేశ విదేశాల్లో మిర్చి రకాల్లో పేరొందిన ఈ పొట్టి మిర్చి కేవలం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పుట్టినిల్లు. మిరప పంటతో పాటు, మిరపపొడి (కారం) తయారీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతంలోని రేవడి నేలలు పంటకు అనుకూలంగా ఉంటాయి. రేవడి పంటలో పొట్టి మిర్చి ప్రధానమైనది. ఈ రకం మిర్చిని జిల్లాలో ఒక్క గొల్లప్రోలు ప్రాంతంలోనే సాగు చేసేవారు. దీనినే ‘గొల్లప్రోలు మిర్చి’గా పిలుస్తారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాల్లో సుమారు 600 నుంచి 800 ఎకరాల్లో 350 మంది రైతులు పొట్టి మిర్చి సాగు చేసేవారు. దీనిని ఎండు మిర్చికే వాడతారు. దీనిని మరాఠీ వాసులు అమితంగా ఇష్టపడతారు. దీనిని వారు ‘బోరు’మిర్చి అని పిలుస్తారు. ఉత్తరాది వారు ‘బేర్’మిర్చి అని అంటారు. బోరు అనగా మరాఠీలో నేరేడు పండు అని అర్థం. నేరేడు కాయ సైజులో గుండ్రంగా ఉండటంతో వారు దీనిని బోరు మిర్చి అని పిలుస్తారు. ఇక్కడ పండిన పంటలు 90 శాతం మేర మహారాష్ట్రకు అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుండేది. సొంతంగా విత్తనాభివృద్ధి ఇక్కడ రైతులు సొంతంగానే విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవడం విశేషం. బయట మార్కెట్లో విత్తనాన్ని కొనుగోలు చేయరు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. వారే స్వయంగా విత్తనాభివృద్ధి చేసి తోటి రైతులకు సైతం విక్రయించేవారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాల దిగుబడి వస్తుంది. ఏడాదికి 250 నుంచి 330 టన్నులు గొల్లప్రోలు మండలంలో వివిధ గ్రామాల నుంచి సంవత్సరానికి 250 నుంచి 330 టన్నుల మిర్చి ఎగుమతి జరుగుతుండేది. ఇక్కడి నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబయి, పూణేలకు తరలిస్తుంటారు. అక్కడ వీటిని కారం తయారీకి ఉపయోగిస్తుంటారు. సాధారణ మిరప కంటే మూడు రెట్లు అదనపు ధర లభిస్తుండడంతో రైతులు పొట్టి మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. వాతావరణం అనుకూలిస్తే, పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం లభించేదని రైతులు చెబుతున్నారు. పరిశోధనలు ప్రారంభం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ కమర్షియల్ అగ్రికల్చర్ కేంద్ర వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత విలువైన డిమాండ్ ఉన్న పొట్టి మిరపపై పరిశోధనలు చేసేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. దుర్గాడ పొట్టి మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ సాధించేందుకు రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రి కల్చర్ (ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ) పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) సంయుక్తంగా చర్యలు ప్రారంభించాయి.శాసీ్త్రయ ఆధారాలు లభించాయి ఐసీఏఆర్– నిర్కా శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో దుర్గాడ పొట్టి మిర్చి అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండటమే కాకుండా, ఈ ప్రాంతంలోనే అత్యుత్తమంగా పండుతుందని నిర్ధారించడంతో జీఐ ట్యాగ్కు బలమైన ఆధారాలు లభించాయి. –రాజశేఖరరెడ్డి, సీనియర్ సైంటిస్ట్, ఐసీఏఆర్ ఎన్ఐఆర్సీఏ పూర్వ వైభవం తీసుకొస్తాం దుర్గాడ పొట్టి మిర్చి సాగును రైతులు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. జీఐ గుర్తింపు లభిస్తే ఈ పంటకు ప్రత్యేక గుర్తింపు, అధిక మార్కెట్ విలువ లభించి రైతులకు లాభాలు పెరుగుతాయి. పొట్టి మిర్చికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావడం ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నాం. –డాక్టర్ ఎన్వీ శివరాం ప్రసాద్, పాడా ప్రాజెక్టు డైరెక్టర్ -
కామవరంలో గిత్త, ఆవుపై పులి పంజా
బుట్టాయగూడెం: గత 10 రోజులుగా ఏలూరు జిల్లాలో రెండోసారి సంచరించిన పెద్దపులి పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సంచరిస్తూ పశువులను హతమారుస్తూ అటవీశాఖ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కాగా పెద్దపులి శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం కావిడిగుండ్ల, గోపన్నగూడెం వైపు వెళ్లినట్లు గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే తెల్లవారుజామున కామవరంలోని మడివి కృష్ణకు చెందిన ఒక ఆవు, గిత్తలపై దాడి చేసి హతమార్చింది. మళ్లీ వస్తుందనే అనుమానంతో రాత్రి 9 గంటల వరకూ సరిహద్దుల్లోనే జిలా అటవీశాఖ అధికారి సందీప్రెడ్డి పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పులి ఏపీ సరిహద్దు దాటుతూ తెలంగాణలోకి వెళ్లడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్ నెలలో కావిడిగుండ్ల నుంచే ఏపీలోకి ప్రవేశించి బుట్టాయగూడెం మండలంలో పలు పశువులపై దాడి చేసి చంపిన పెద్దపులి మొదటిసారిగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కింది. మళ్లీ శుక్రవారం అధికారుల డ్రోన్ కెమెరాకు చిక్కింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిన పులి మళ్లీ పోలవరంలో ప్రత్యక్షమై గోదావరి ఈదుతూ పోలవరం జిల్లాలోకి వెళ్లి మళ్లీ ఏలూరు జిల్లాలోని పోలవరం మీదుగా పలు మండలాల్లో సంచరిస్తూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
మత్తోన్మాదుల స్వైరవిహారం
ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాజమహేంద్రవరం నగర ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. ఇద్దరు యువకులు మద్యం మత్తులో అత్యంత దారుణంగా, ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టినా ప్రభుత్వం నుంచి ఎవ్వరూ స్పందించ లేదు. నగరంలో నివసిస్తున్న ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించకపోవడం దారుణం. నిందితులను రక్షించేందుకే తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. చారిత్రక నగరాన్ని బ్లేడ్ బ్యాచ్కు, గంజాయి ముఠాలకు అడ్డాగా మార్చేశారు. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి ● విచ్చలవిడిగా మద్యం, గంజాయి అమ్మకాలు ● రాజమహేంద్రవరంలో రెచ్చిపోతున్న ఆకతాయిలు ● తాజాగా వైద్య విద్యార్థినిని బలి తీసుకున్న ఇద్దరు యువకులు ● నోరు మెదపని కూటమి ప్రజాప్రతినిధులు ● చారిత్రక నగరంలో ప్రశ్నార్థకమైన శాంతిభద్రతలు సాక్షి, రాజమహేంద్రవరం: పావన గోదావరి తీరాన వెలసిన చారిత్రక నగరం.. రాజమహేంద్రవరంలో శ్రీమత్తోశ్రీన్మాదులు పేట్రేగిపోతున్నారు. కూటమి సర్కారులో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, గంజాయి తాగుతూ రెచ్చిపోతున్నారు. తాజాగా స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ప్రసాదిత్య మాల్, మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు దుర్మార్గులు మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టి, హతమార్చిన దారుణ సంఘటన నగరంలో శాంతిభద్రతలను ప్రశ్నార్థకం చేసింది. ఈ అమానుష ఘటనపై స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటిస్తున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలతో పాటు మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ రాజమహేంద్రవరంలోనే నివసిస్తున్నారు. వీరెవ్వరూ ఈ అమానుష ఘటనపై నోరు మెదపకపోవడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, జెన్జీ యువత ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అదృశ్య శక్తుల ఒత్తిడి ప్రియాంకను కారుతో ఢీకొట్టిన యువకులను రక్షించేందుకు తెర వెనుక అదృశ్య శక్తులు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనిక వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. అయితే, ఈ దారుణం జరిగిన నాలుగు రోజుల వరకూ పోలీసులు సీరియస్ చర్యలు తీసుకోకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ప్రియాంకను కారుతో ఢీకొట్టిన విషయం సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షులు, మాల్ సిబ్బంది కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయినప్పటికీ మద్యం మత్తులోనే ప్రియాంకను నిందితులు కారుతో ఢీకొట్టారని పోలీసు ఉన్నతాధికారులు గురువారం మీడియాకు చెప్పడం గమనార్హం. ఇన్ని రోజులూ నిందితులను తెర వెనుక నుంచి రక్షించేందుకు కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ, పోలీసుల తీరును నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ఎండగట్టారు. దీంతో, ఎట్టకేలకు నాలుగు రోజుల తర్వాత ఆ శ్రీమత్మోశ్రీన్మాదులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అసాంఘిక శక్తుల స్వైరవిహారం రాజమహేంద్రవరంలో నిత్యం ఏదో ఒకచోట మద్యం, గంజాయి మత్తులో ఆకతాయిలు, బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల అండతోనే అసాంఘిక శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● వారం రోజుల వ్యవధిలోనే నగరంలో రెండు హత్యలు జరిగాయంటే శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 28న గణేష్ అనే వ్యక్తిని ముగ్గురు స్నేహితులు ఇన్నీసుపేట దుక్కలదొడ్డి వద్ద కడతేర్చారు. ఈ నెల 5న గోరక్షణపేటకు చెందిన ఆటో డ్రైవర్ బుజ్జిబాబును ఇద్దరు వ్యక్తులు హతమార్చారు. ● ఇన్నీసుపేట, ఆల్కాట్ గార్డెన్స్, దుక్కలదొడ్డి, ఆదెమ్మదిబ్బ, కోటిలింగాల ఘాట్, క్వారీ సెంటర్, గోరక్షణపేట, అన్నపూర్ణమ్మపేట ప్రాంతాల్లో ఆకతాయిలు, మందుబాబుల అలజడి ఎక్కువగా ఉంది. ● జిల్లాలోని సుమారు 100 ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నచిన్న పొట్లాల్లో జరుగుతున్న గంజాయి విక్రయాలను పోలీసులు అరికట్టలేకపోతున్నారు. ● ఇటీవల డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో వంద మందిని పరీక్షించగా.. వారిలో 38 మందికి పాజిటివ్ వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. జిల్లాలో గంజాయి గుప్పుమంటోందిలా.. సంవత్సరం సీజ్ చేసిన కేసులు అరెస్టులు (కిలోలు) 2024 2,837 68 250 2025 3,026 54 197 2026 334 25 86(జూలై వరకూ) -
తప్పుకో లోకేశ్!
ప్రభుత్వం దిగి వచ్చే వరకూ ఉద్యమిస్తాం డీఎస్సీ నియామకాల్లో జరిగిన అన్యాయంపై యువత, నిరుద్యోగులు నిలదీస్తూంటే వారి ఆత్మాభిమాన్ని దెబ్బ తీసేలా పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. తప్పులను ప్రశ్నించడం నేరమన్నట్టుగా దాడి చేయిస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగించిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను ప్రజలతో కలసి ఎండగడతాం. డీఎస్సీ అక్రమాలపై పాలకులు దిగి వచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తాం. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ముమ్మాటికీ దగా డీఎస్సీనే.. చంద్రబాబు, లోకేశ్ ఎంత డప్పు కొట్టుకున్నా ఇది దగా డీఎస్సీనే. ఎంతో ఆశతో పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం సరికాదు. స్పోర్ట్స్ కోటా పేరిట జీఓలు మార్చేసి, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు అమ్మేసుకున్నారు. ఈ అక్రమాలన్నింటికీ మంత్రి లోకేశ్దే బాధ్యత. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే.. లోకేశ్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ● డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్ సీపీ పోరు ఉధృతం ● నియోజకవర్గాల్లో రెండో రోజూ రిలే దీక్షలుసాక్షి, రాజమహేంద్రవరం: డీఎస్సీ స్కామ్లో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాత్ర కీలకమని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా జీఓలను అనుకూలంగా మార్చేసుకుని కావాల్సిన వారికి ఉద్యోగాలిచ్చేసుకున్నారని.. నియామకాలు పూర్తి కాగానే మళ్లీ జీఓలు మార్చేశారని మండిపడ్డారు. అక్రమాలు జరగడం వల్లే డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అన్నారు. డీఎస్సీ స్కామ్కు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు సాగిస్తున్న పోరులో భాగంగా రెండో రోజైన శుక్రవారం కూడా నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. యువతతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ దురాగతాలపై నినదించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాజానగరం బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్ వద్ద నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మండపేట పట్టణంలో రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పర్యవేక్షించారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో దీక్షలను వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి దీక్షధారులకు కండువాలు వేసి ప్రారంభించారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి కడియం: ఎటువంటి అక్రమాలూ జరగలేదనే ధై ర్యం ఉంటే డీఎస్సీ నిర్వహణలో నిజాయితీని ని రూపించుకునేందుకు సీబీఐ విచారణ జరిపించా లని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కడియంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడు తూ, చంద్రబాబు ప్రభుత్వం పేకాటను సైతం క్రీడల కోటా లో చేర్చి, ఆ క్రీడాకారులకు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలి చ్చిందని విమర్శించారు. ఇదే విషయా న్ని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారని అన్నారు. డీఎస్సీ మోసాలకు విద్యా శాఖ మంత్రి లోకేష్ బాధ్యత వహించాలని వేణు డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై ప్రజలు, ప్రతిపక్షం ఏకమై నిలదీస్తూండటంతో విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు జగన్పై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మెగా డీఎస్సీ దగాపై విజయవాడ, యాడికిలో టెంట్లు వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తువారిపై టీడీపీ మూకలు దారుణమైన దాడులకు దిగాయని మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం హేయమన్నారు. రాళ్లు వేయడం, మూత్రం పోయడం వంటి చర్యలతో చంద్రబాబు అరాచక పాలన పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని యావత్ బ్రాహ్మణ సమాజం, యువతపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. -
తలుపులమ్మ తల్లికి సారె సమర్పణ
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, గాజులతో సారె సమర్పించారు. శుక్రవారం అన్నవరం దేవస్థానం ఈఓ నల్లల సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యుల కుటుంబాలు సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు, మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, ఫల పుష్పాలు, పిండివంటల సారెతో లోవకు చేరుకుని తలుపులమ్మకు సమర్పించారు. అమ్మవారిని దర్శించిన ఈఓ, ట్రస్ట్ బోర్డు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అన్నవరం, లోవ దేవస్థానం ఈఓలు సూర్యచక్రధరరావు, విశ్వనాథరాజు మాట్లాడుతూ ఆనవాయితీగా వచ్చే సంప్రదాయాలను కొనసాగిస్తూ దేవాలయాల మధ్య ఆధ్యాత్మిక అనుబంధం పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. ● లోవ తలుపులమ్మ అమ్మవారికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చీర సారెను సమర్పించారు. దేవస్థానానికి వచ్చిన అనితకు ఈఓ పి.విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
పరుగులు తీసిన బ్యాటరీ కార్లు
అన్నవరం: స్థానిక వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, వికలాంగుల కోసం దాతలు సమకూర్చిన బ్యాటరీ కార్లు తిరిగి రత్నగిరిపై పరుగులు తీస్తున్నాయి. ఈ బ్యాటరీ కార్లు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై కొండ దిగువన గ్యారేజీలో ఉన్న వైనంపై ఈ నెల 5న ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్శన భారము నీదే స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి వెంటనే బ్యాటరీ కార్లకు మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే ఈ కార్లకు మరమ్మతులు చేయించి రత్నగిరికి తీసుకువచ్చారు. శుక్రవారం పశ్చిమ రాజగోపురం నుంచి స్వామివారి నిత్యాన్నదాన పథకం, సత్రాలకు వికలాంగులు, వృద్ధులను తీసుకువచ్చి మరలా రాజగోపురం వద్దకు దింపారు. -
మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో కారు ప్రమాదంలో ప్రియాంక గాయపడిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ప్రియాంక బైక్ను యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటన సంచలనం రేపింది.ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించ డం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగానే..!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపుప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
స్పోర్ట్స్ కోటా పేరిట అమ్మేశారు
టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీగా మారిపోయింది. స్పోర్ట్స్ కోటా జీఓలను ఇష్టారాజ్యంగా మార్చేసి, సొంత వారికి ఉద్యోగాలిచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ జీఓలు మార్చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇంత దారుణంగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందే. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ లోకేశ్ తప్పుకోవాలి డీఎస్సీలో అక్రమాలకు విద్యా శాఖ మంత్రి లోకేశ్దే పూర్తి బాధ్యత. అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆధారాలు చూపించారు. అయినప్పటికీ లోకేశ్ తప్పుకోవడం లేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే అదే ఎన్డీఏలో భాగస్వామి అయిన లోకేశ్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి. అప్పటి వరకూ వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తాం. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ -
రూ.300.42 కోట్ల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.300.42 కోట్ల విలువైన 12.41 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. వేలానికి తీసుకవచ్చిన బేళ్లలో 40 శాతం బేళ్లను ట్రేడర్లు తిరస్కరిస్తున్నారు. పొగాకు బేళ్లు ఎక్కువ రోజులు ఇంటి వద్ద నిల్వ ఉండటంతో నాణ్యత, రంగు దెబ్బ తింటాయనే భయంతో వచ్చిన కాడికి అమ్ముకుని, అప్పులు తీర్చుకునేందుకు చిన్న, సన్నకారు రైతులు వేలం కేంద్రాలకు తెస్తున్నారు. అయితే, గిట్టుబాటు ధర లభించకపోగా, తీసుకు వచ్చిన బేళ్లను తిరస్కరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఐదు వేలం కేంద్రాల్లో గురువారం 4,957 బేళ్లు అమ్మకానికి రాగా, 1,815 తిరస్కరించారు. 3,142 బేళ్లు కొనుగోలు చేశారు. మొత్తం 4.05 లక్షల కిలోల పొగాకు విక్రయించారు. కిలోకు గరిష్టంగా రూ.276, కనిష్టంగా రూ.160, సగటున రూ.242.05 చొప్పున ధర లభించింది. దేవరపల్లి వేలం కేంద్రానికి 648, జంగారెడ్డిగూడెం–1కు 1,344, జంగారెడ్డిగూడెం–2కు 1,170, కొయ్యలగూడేనికి 1,248, గోపాలపురం వేలం కేంద్రానికి 547 చొప్పున బేళ్లు అమ్మకానికి వచ్చాయి. కిలోకు సగటు ధర దేవరపల్లిలో రూ.227.55, జంగారెడ్డిగూడెం–1లో రూ.236.62, జంగారెడ్డిగూడెం–2లో 223.30, కొయ్యలగూడెంలో రూ.234.67, గోపాలపురంలో రూ.245.44 చొప్పున లభించింది. -
పోరాట యోధుడు జక్కంపూడి
● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ● ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి జయంతి వేడుకలు రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం సాగించిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దివంగత రామ్మోహనరావు జయంతిని ఆయన మిత్రమండలి ఆధ్వర్యాన స్థానిక కంబాల చెరువు జంక్షన్లో గురువారం నిర్వహించారు. ఆ జనయోధుడి విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ, రామ్మోహనరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారులు జక్కంపూడి రాజా, గణేష్లు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఇద్దరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తన తండ్రి రామ్మోహనరావు మంత్రిగా ఐదేళ్ల పాటు తన మార్కు గుర్తుండే విధంగా పనులు చేశారని చెప్పారు. కష్టాన్ని, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగుతున్నామని అన్నారు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తాము.. ప్రజా సమస్యలపై తమ తండ్రి చేసిన ఉద్యమాలు చూస్తూ పెరిగామన్నారు. ఏ కార్యకర్తకై నా కష్టం వస్తే ఎదురెళ్లి నిలబడటం, కార్యకర్త కోసం ఎంతవరకై నా ముందుకెళ్లడం నేర్చుకున్నామన్నారు. తండ్రి బాటలోనే ముందుకు సాగుతామని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, రేయింబవళ్లు ఏ అవసరం వచ్చినా తోడుగా నిలబడతామని చెప్పారు. వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహనరావుతో సుమారు 6 నెలల పాటు రాజకీయ ప్రయాణం చేశానని అన్నారు. తన తండ్రి సుబ్బారావుతో రామ్మోహనరావుకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. కార్యకర్తకు ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడే మనస్తత్వం జక్కంపూడిదేనని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రామ్మోహనరావు పోటాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, కష్టనష్టాల విలువ తమకు తెలుసని, తండ్రి స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. తమ వెన్నంటి ఉన్న స్నేహితులకు ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు. ఉండవల్లి, జక్కంపూడిల స్నేహబంధం మరురానిదన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, రామ్మోహనరావు తన జీవితాన్ని పేదల కోసమే అంకితం చేశారన్నారు. ఆయన హయంలో పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశానని, జక్కంపూడి ఆశయ సాధన కోసం నిరంతరం పని చేస్తామని చెప్పారు. రామ్మోహనరావు జయంతి సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు అందజేశారు. తొలుత జక్కంపూడి రాజా, గణేష్ల ఆధ్వర్యాన భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా శ్రీనగేష్, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కుర్రు రవి, నేతలు రాయపురెడ్డి చిన్నా, రామినీడు మురళి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, గొందేసి శ్రీనివాసులురెడ్డి, బైర్రాజు ప్రసాదరాజు పాల్గొన్నారు. బుర్రిలంకలో భారీ రక్తదాన శిబిరం కడియం: జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా కడియం మండలం బుర్రిలంకలో మెగా వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్టీ నాయ కులు కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యాన జరిగిన ఈ శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు సుమారు 200 యూనిట్ల రక్తం దానం చేశారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యాన వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు చేశారు. -
30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. స్థానిక కంటిపూడి రామారావు హైస్కూల్లో గురువారం జరిగిన ఫెడరేషన్ కార్యకర్తల సమావేశంలో అసోసియేట్ అధ్యక్షుడు వైవీ రామారావు, ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ కార్యదర్శి నివేదిక సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ఉదయబ్రహ్మం మాట్లాడుతూ, సంఘాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోగలమని అన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు వి.అప్పయ్యశాస్త్రి మాట్లాడుతూ, వెంటనే పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.డేవిడ్ లివింగ్స్టన్, ముంగండి పద్మజ, నగర శాఖ గౌరవాధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.తాతారావు, ఎన్.గౌరీశంకర్, అదనపు కార్యదర్శి జీఎస్ఎస్ శ్రీనివాసులు, కార్యదర్శి అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు. 15లోగా ఎల్పీజీ ఈ–కేవైసీ పూర్తి చేయాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని వంటగ్యాస్ వినియోగదారులు పెండింగ్ ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) వి.పార్వతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ–కేవైసీ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ–కేవైసీ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలు, ప్రత్యేక నమోదు శిబిరాలు, ఇంటింటి సందర్శనల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి రాజమహేంద్రవరం రూరల్: వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికన్గున్యా, వైరల్ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి.కోమల గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. డెంగీ వ్యాధిని ముందుగానే గుర్తించాలని, అధిక జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా రక్తస్రావ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఆర్ఎంపీలు, పీఎంపీలు తమకు సహకరించాలని, వివిధ జ్వరాలతో ఎవరైనా వస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలని డాక్టర్ కోమల కోరారు. -
సీబీఐ విచారణ జరపాలి
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ. స్పోర్ట్స్ కోటా పేరిట జీఓలు మార్చేసి, టీచర్ పోస్టులు అమ్మేసుకున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ వసూలు చేశారు. సీబీఐ విచారణతోనే ఈ స్కామ్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. అవకతవకలు జరగడం వల్లే విచారణకు వెనుకాడుతున్నారు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ -
బీసీ నేతలపై కక్షగట్టారు
మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శ రాజమహేంద్రవరం సిటీ: బీసీ నాయకులపై కక్షగట్టి టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీ విభాగం నగర అధ్యక్షుడు పీతా రామకృష్ణను పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి, సెంట్రల్ జైలులో పెట్టడం, విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో కలసి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశామని భరత్రామ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పీతా రామకృష్ణ విడుదల కోసం పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన పోరాటాలను వివరించారు. రామకృష్ణను అరెస్టు చేయగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిం,చి ఐక్య కార్యాచరణ ద్వారా ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలిపారు. కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యామని వివరించారు. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ చెల్లదంటూ రామకృష్ణను జైలు నుంచి విడుదల చేశారని ఆయన తెలిపారు. బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు కూడా అధినేతను కలిసినట్టు భరత్రామ్ పేర్కొన్నారు. -
ఫ్యాన్స్ ఫుల్ జోష్
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. అధినేత నింపిన స్ఫూర్తితో నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా గిట్టుబాటు ధర దక్కక, పెట్టుబడీ వెనక్కు రాక ఆర్థికంగా చితికిపోయిన పొగాకు రైతుల్లో భరోసా నింపేందుకు వైఎస్ జగన్ బుధవారం దేవరపల్లిలో పర్యటించిన విషయం తెలిసిందే. మన కోసం జగనన్న వచ్చారంటూ ఆయనకు రైతులు తమ కష్టాలు చెప్పుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలా మోసపోయామని.. మళ్లీ జగన్ వస్తేనే మంచి రోజులొస్తాయని గద్గద స్వరంతో గుండెల్లోని మాట చెప్పారు. వారి వేదన విన్న జగన్ మంచి రోజులొస్తాయని, ధైర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. కుట్రలను చీల్చుకుని కదిలిన అభిమానం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటన రెండు వారాల క్రితమే నిర్ణయమైంది. అప్పటి నుంచే కూటమి పెద్దల గుండెల్లో దడ మొదలైంది. తాము పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పటికీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతుల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. అది గమనించిన ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.10 పెంచుతున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ రైతుల్లో ఆగ్రహం తగ్గలేదని భావించి జగన్ పర్యటన సఫలం కాకుండా చేసేందుకు కుట్రలకు తెర లేపారు. అధినేత పర్యటనకు వైఎస్సార్ సీపీ ముందుగానే నాయకులు పోలీసుల అనుమతి తీసుకున్నప్పటికీ అవసరమైన మేరకు రక్షణ కల్పించలేదు. హెలిప్యాడ్, పొగాకు వేలం కేంద్రం వద్ద పోలీసుల జాడే కనిపించలేదు. మరోవైపు జననేతను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివస్తున్న వేలాది మందిని దేవరపల్లి వైపు వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు సర్వశక్తులూ ఒడ్డారు. వైఎస్ జగన్ పర్యటనను గాలికొదిలేసి, దేవరపల్లి చేరుకునే నాలుగు మార్గాల వద్ద భారీగా మోహరించారు. బైక్లు, కార్లపై వస్తున్న వారిని జగన్ పర్యటనకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ కుట్రలను ఛేదించుకుని మరీ పలువురు తమ అభిమాన నేతను చూసేందుకు తోటలు, పొలాల్లో నుంచి దేవరపల్లికి చేరుకున్నారు. మరికొంత మంది పోలీసులు ఆపేసిన చోటే వాహనాలు వదిలేసి పొగాకు వేలం కేంద్రానికి కాలి నడకన తరలివచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల అభిమానం ముందు అవి నిలవలేదు. శ్రీస్థానికశ్రీ పోరుకు.. ఉరిమే ఉత్సాహంతో.. బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల హామీలు అమలు చేయని సర్కారుపై సంక్షేమ ఫలాలు అందని పేద, బలహీన వర్గాల ప్రజలు రగిలిపోతున్నారు. దీనికితోడు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై యువజనం ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఈ అవకతవకలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించారు. అదే ఉత్సాహంతో టౌన్ హాలు సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ జిల్లాలో పర్యటించడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ పెరిగింది. జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి రావడంతో వారి మద్దతుతో శ్రీస్థానికశ్రీ పోరులో పైచేయి సాధిస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్సాహంతో చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకుని పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్నారు. దేవరపల్లిలో రైతుపోరు విజయవంతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వైఎస్ జగన్ స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు, జెన్జీ వెల్లువెత్తిన ప్రజాభిమానం ముందు ప్రభుత్వ పెద్దల కుట్రలు పటాపంచల్ జగన్తోనే జెన్జీ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాలు అమ్మేసుకోవడం, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా జెన్జీ చంద్రబాబు అండ్ కో తీరుతో విసిగిపోయారు. దేవరపల్లిలో బుధవారం కనిపించిన దృశ్యమే ఇందుకు సాక్ష్యం. జనహృదయ నేత జగన్కు అడుగడుగునా జెన్జీ యువతే ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని ఘన స్వాగతం పలికారు. అభిమాన నేతపై పూలవర్షం కురిపించారు. అదిగో జగనన్న వచ్చాడు.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో జెన్జీ మద్దతు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్న వేళ.. వైఎస్ జగన్కు యువతరం స్వచ్ఛందంగా మద్దతు తెలపడం కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంపై గూడు కట్టుకున్న తీవ్ర వ్యతిరేకత కారణంగానే జగన్కు మద్దతుగా జెన్జీ నడుస్తున్నారని విశ్లేషిస్తున్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె..
● ఈ నెల 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ● 26న సీట్ల కేటాయింపు ● 27 నుంచి తరగతులు రాయవరం: ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఎట్టకేలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతేడాది మాదిరిగానే ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు జరగనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒకేషనల్ కోర్సుల్లో సుమారు 35 వేల వరకు సీట్ల భర్తీకి అవకాశముంది. షెడ్యూల్ ఇలా.. ఈ నెల 11వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 5 నుంచి 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 12 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కోర్సులను ఎంపికకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్ల మార్పునకు 20న తేదీ అవకాశం కల్పించారు. 26న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీలోగా ఎంపికై న కళాశాలలో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రతి జిల్లాలో ఒక నోడల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, కాకినాడ జిల్లాలో పీఆర్ డిగ్రీ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్ కళాశాలలుగా ఉన్నాయి. -
పంట కాలువలో పడి కౌలురైతు మృతి
కాజులూరు: పంట కాలువలో పడి ఓ కౌలురైతు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కోలంకకు చెందిన బండారు శ్రీనివాస్ (37) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలోని పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరకు రాత్రి సమయంలో పొలానికి వెళ్లి క్షుణంగా పరిశీలించగా, శ్రీనివాస్ పొలాల మద్య ఉన్న పంట కాలువలో విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే అతను మృతి చెందినట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గొల్లపాలెం ఇన్చార్జ్ ఎస్సై ఆర్వీఎస్ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహం లభ్యం జగ్గంపేట: భావవరం గ్రామంలోని ఏలేరు నదిలో స్నానానికి దిగి గల్లంతైన వడ్డి ప్రశాంత్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో వెలికి తీయించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఈ ఘటనతో విహార యాత్రకు వచ్చిన విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి కొద్దికాలం కిందట మరణించగా, అతని తల్లి ఉపాధి నిమిత్తం దుబాయిలో ఉన్నారు. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో డిప్లమో చేస్తున్నాడు. మోటారు సైకిళ్ల ఢీ ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కాట్రేనికోన: మండలంలోని ఎస్.సావరం సమీపంలో మహిపాల చెరువు –పల్లంకుర్రు ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొట్టుకోవడంతో గెద్దనాపల్లి పంచాయతీ బక్కివారిపేటకు చెందిన చిల్లా కుమార్ (35) మృతి చెందాడు. అలాగే మరో మోటారు సైకిల్పై ఉన్న పల్లంకుర్రు శివారు లైన్పేటకు చెందిన ఇసుకపట్ల హరి తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన హరిని 108 అంబులెన్స్లో అమలాపురం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నాడు. కాట్రేనికోన ఎస్సై ఐ.అవినాష్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కారు, లారీ ఢీశంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై గురువారం లారీ, కారు ఢీకొట్టుకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. రాజమంద్రవరం నుంచి వస్తున్న కారు, వైజాగ్ నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు డివైడర్ను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలు తప్ప ఎటువంటి ప్రమాదం జరగనట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులను వివరాలు అడగగా, ఎటువంటి సమాచారం లేదన్నారు. -
హిజ్రాల దాడిలో గే మృతి
కాకినాడ క్రైం: హిజ్రాల దాడిలో గే మృతి చెందిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాగంపేటకు చెందిన రాజు శివ (45) ఒక గే. ఇతను కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పలువురు హిజ్రాలతో కలిసి భిక్షాటన చేసేవాడు. ఈ క్రమంలో జ్యోతుల కాలనీలో నివాసం ఉంటున్న కిరణ్మయి, అజయ్ అనే హిజ్రాలతో సోమవారం మధ్యాహ్నం మద్యం మత్తులో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. ఇరువురు బీరు సీసాతో శివ తలపై కొట్టి ఎడమ దవడ చీల్చేశారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై శివ అచేతన స్థితిలో కుప్పకూలిపోయాడు. అతడిని గమనించిన దూరపు బంధువులు జీజీహెచ్లో చేర్చారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. హత్య చేసిన కిరణ్మయి, అజయ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్య అనంతరం వీరిద్దరు, హత్యోదంతం నమోదైన స్థానిక ఇళ్లలో సీసీ టీవీ ఫుటేజీలను బలవంతంగా డిలీట్ చేయించి, ఎవరైనా తమకి వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే, తీవ్ర పర్యావసనాలు ఉంటాయని స్థానికులను బెదించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. -
అడుగు పెట్టాలంటే ఆంక్షలా!
● హాస్టళ్లలోకి మీడియా, ప్రజా సంఘాలకు నో ఎంట్రీ ● సాంఘిక సంక్షేమ శాఖ సర్క్యులర్పై విమర్శలు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించరాదంటూ జారీ చేసిన సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం కోసం పోరాడడం విద్యార్థి సంఘాల రాజ్యాంగబద్ధమైన హక్కు. అలాంటి హక్కులను కాలరాస్తూ విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. హాస్టళ్లలో ఆహారం, తాగునీరు, పరిశుభ్రత, భద్రత, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలపై పర్యవేక్షణ చేసే హక్కు ప్రజాస్వామ్య సంఘాలకు ఉంది. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ హాస్టల్లో మొన్న భోజనంలో బొద్దింకలు కనిపిస్తే ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. –ఎస్.కిరణ్కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పారదర్శకతకు పాతరేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో లోపాలను గుర్తించే అవకాశం లేకుండా, ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్ ఉంది. ఇటీవల ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల లేమి, ఆహార నాణ్యత లోపం, విద్యార్థుల అనారోగ్యం వంటి ఘటనలు ప్రభుత్వ డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి. వాటిని మీడియా, విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు వెలుగులోకి తెస్తుండటంతో, కలవరపడిన ప్రభుత్వం ఏకంగా హాస్టల్లోకి నో ఎంట్రీ అని సర్క్యులర్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలపడుతోంది. హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, గోప్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని, ఆ పేరుతో మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా వాటిలోకి వెళ్లకూడదనే ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్య పర్యవేక్షణను అడ్టుకోవడమేననే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అడ్డుపెట్టుకుని హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కుల వివక్ష, అవినీతి, నాసిరకం ఆహారం, మౌలిక వసతుల లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు బయటపడకుండా చేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వ నిధులతో నడిచే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరును పర్యవేక్షించి ప్రశ్నించే అధికారం మీడియాకు, ప్రజలకు ఉందనే స్పృహను ప్రభుత్వం విస్మరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తర్వుల్లో ఏముందంటే.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోకి అనధికార వ్యక్తులు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ సంఘాల నాయకులతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమ ప్రతినిధులకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ ఆయా వసతి గృహాలను సందర్శించాలంటే జిల్లా కలెక్టర్తో ముందస్తు లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. -
‘నన్నయ’లో బోధనేతర సిబ్బంది నిరసన
రాజానగరం: యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు ఎటువంటి నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేస్తూ ఆదికవి నన్నయ వర్సిటీలోని ఔట్ సోర్సింగ్ బోధనేతర సిబ్బంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గురువారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమకు అన్యాయం జరిగేలా ఈనెల 1న విడుదల చేసిన టెండర్ నోటీసును తక్షణమే రద్దు చేయాలన్నారు. తమ డిమాండ్లు సాధించే వరకు రిలే దీక్షలను విరమించేది లేదని స్పష్టం చేశారు. -
నేస్తానికి ఇంతన్నారు!
● రెండేళ్లు అమలుకాని ‘నేతన్న నేస్తం’ ● చంద్రన్న ప్రభుత్వంలో అమలుకు గ్రహణం ● సహకార సంఘాలకు తీరని బకాయిలు ● నేడు జాతీయ చేనేత దినోత్సవం లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తే అన్యాయమే ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలి రెండేళ్లు రూ.25 వేల సాయం అందిస్తామని చెప్పి నేతన్న సేవా పథకం అమలు లేదు. ఇప్పుడు ఇస్తామంటున్నప్పటికీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారన్న ఆందోళన ఉంది. అదే జరిగితే నేతన్నలకు అన్యాయం చేసినట్టే అవుతుంది. –ముప్పన వీర్రాజు, మాజీ ఆప్కో డైరెక్టర్, పెద్దాపురం కపిలేశ్వరపురం: సంప్రదాయ కళకు ఆదరణ కరవైంది.. చేనేత మగ్గం కష్టాల్లో మగ్గిపోతోంది.. చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ‘నేతన్న నేస్తం’ పథకం రెండేళ్లుగా ఆ కార్మికులకు దూరమైంది.. ఇప్పటికే ఆధునికత నేపథ్యంలో చేనేత వస్త్ర పరిశ్రమ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మగ్గాన్ని నమ్ముకుని సంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్న చేనేతలకు సహకారం లేకపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ. 24 వేల చొప్పున ఐదేళ్లూ సాయమందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.25 వేల అందిస్తామని చెప్పి, తొలి రెండేళ్లూ ఎగ్గొట్టింది. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. గతమెంతో ఘనం అనే నానుడి చేనేత కార్మికులకు సరిగ్గా సరిపోతుంది. 2019 డిసెంబర్ 21న నేతన్న నేస్తం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించారు. పాలనాకాలం ఇంకా పది నెలల కాలం ఉండగానే హామీ తాలూకు ఐదు విడతల సాయాన్ని అందించారు. ఒక్కో కుటుంబానికి ఐదేళ్లూ రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఐదేళ్ల సాయం ఇలా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,256 కుటుంబాలకు రూ.47.13 కోట్లు, కాకినాడ జిల్లాలో 2,778 కుటుంబాలకు రూ. 31.58 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 916 కుటుంబాలకు రూ.10.21 కోట్లు మొత్తం ఉమ్మడి జిలాలో రూ. 88.94 కోట్ల సాయం అందజేశారు. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశారు. చేనేత ప్రత్యేక పథకాలతో పాటు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, తదితర పథకాలు నేతన్న కుటుంబాలకు పలు విధాలా భరోసాగా నిలిచాయి. ఉమ్మడి జిల్లా ఉద్యమాలతో... చేనేత సంఘాల బకాయిలు చెల్లించాలని, 2018 జీఓ ప్రకారం కొనుగోలు చేసే నూలుపై 40 శాతం, వస్త్రాల అమ్మకాలపై 30 శాతం డిస్కౌంట్ చెల్లించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున నేతన్నలు ఉద్యమించారు. 2025 సెప్టెంబర్, అక్టోబర్లలో అంగరలో రిలే దీక్షలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న మంగళగిరిలో చేనేత గర్జన పేరుతో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగస్తులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి జిల్లా వ్యాప్త నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. చేనేత వృత్తిదారుని కుటుంబానికి రూ.200 యూనిట్లు వరకూ ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది. నేతన్నల సేవా పథకం ద్వారా రూ.25 వేలు ఇస్తామన్న హామీ అమలు చేయబోతున్నామంటూ ప్రకటన ఇచ్చింది. హామీ ఇచ్చి.. అమలు మరిచి ప్రభుత్వం, ఆప్కో సంస్థల నుంచి తమ సంఘానికి రావాల్సిన సుమారు రూ.3.85 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్, అక్టోబర్లలో 14 రోజులు పాటు అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానంటూ జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న నిరసన శిబిరానికి స్వయంగా వచ్చి దీక్షను విరమింపజేశారు. పాక్షిక చెల్లింపులు తప్ప నేటికీ బకాయిలు అలానే ఉన్నాయి. రెండేళ్ల పాలనలో దగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా చేనేతల కోసం చేసిందేమీ లేదు. మగ్గం వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కార్మికులను కనీసం పట్టించుకోలేదు. గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఏటా రూ.25 వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తామే దగాకు గురయ్యామని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేనేత పరిశ్రమ ఇలా... అంశం తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ మొత్తం చేనేత సంఘాలు 16 18 16 50 చేనేత మగ్గాలు 1,510 2,809 4,570 8,889 చేనేత కార్మికులు 3,890 4,430 8,010 16,330 -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు: లక్ష్మీ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమపై ఒత్తిడి చేశారని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ అన్నారు. ‘‘మా హోటల్లో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు. తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు. కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు. మాకు భయం వేసింది. వైఎస్ జగన్ హయాంలో మాకు ఇంటి స్థలాలు వచ్చాయి. ఆయన హయాంలో మాకు చాలా మేలు జరిగింది’’ అని ఆమె మీడియాకు వివరించారు.ఇవాళ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవరపల్లి హోటల్ నిర్వాహకులు కలిశారు. వైఎస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటనలో జనం రద్దీ వల్లే తోపులాట జరిగిందని.. అంతేకానీ వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్ జగన్కు హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య వివరించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ హోటల్ ధ్వంసం చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న నిర్వాహకులు.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమ కుటుంబం లబ్ధిపొందినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. -
డాక్టర్ ప్రియాంక బ్రెయిన్డెడ్.. పార్కింగ్ వివాదమే కారణమా?
తూర్పుగోదావరి జిల్లా: జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 28 ఏళ్ల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక, ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్కు సినిమా చూసేందుకు వెళ్లారు. మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం జరిగింది.సినిమా ముగిసిన తర్వాత డాక్టర్ ప్రియాంక తన స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఏవీ అప్పారావు రోడ్డుపై వెళ్తుండగా, పార్కింగ్లో గొడవపడిన యువకులు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి ఆమె రోడ్డుపై పడిపోగా, ఆ కారు ఆమె తలపై నుంచి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తీవ్ర తలగాయాల పాలైన ఆమెను స్థానికులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్డెడ్గా మారినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై ప్రకాశ్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును, అందులో ప్రయాణించిన నామవరం ప్రాంతపు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ వద్ద జరిగిన వివాదం మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. -
తొక్కిసలాట జరగాలి.. జగన్పైకి తోయాలి
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనను విఫలం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది. హెలిప్యాడ్ వద్ద, పొగాకు వేలం కేంద్రంలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టింది. మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉద్దేశ పూర్వకంగానే సెక్యూరిటీని తగ్గించి.. తద్వారా గందరగోళం సృష్టించి.. తొక్కిసలాట జరిగితే జగన్ పైకి అపవాదు నెట్టేయాలన్నది ప్రభుత్వ పెద్దల కుతంత్రం అని స్పష్టమవుతోంది. అయితే వైఎస్సార్సీపీ నేతల పర్యవేక్షణతో ప్రభుత్వ పన్నాగం బెడిసికొట్టింది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10.27 గంటలకు దేవరపల్లి సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు నామమాత్రంగా సిబ్బందిని కేటాయించారు. వారు దూరంగా ఉండటంతో ఒక్కసారిగా జనం బారికేడ్లను తోసుకుని హెలీప్యాడ్ వద్దకు దూసుకుపోయారు. అప్పుడు అక్కడ కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా లేడు. దీంతో అతి కష్టం మీద వైఎస్ జగన్ కారు వద్దకు చేరుకుని.. ఎక్కారు. అప్పటికే చాలా మంది ఆ వాహనం చుట్టూ చేరిపోయారు. ఇటీవల మరణించిన పొగాకు రైతు పాల వెంకటేశ్వరరావు భార్య సీతారత్నం, కుమారుడు శ్రీనివాస్, కుమార్తె వెంకటరత్నం తమ సమస్యలు విన్నవించుకోగా.. నేనున్నానని భరోసా ఇస్తున్న వైఎస్ జగన్ ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు నేతలు, కార్యకర్తలు కింద పడిపోయారు. వెంటనే పలువురు నేతలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా పొగాకు వేలం కేంద్రంలో రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ చేరుకోగానే, అక్కడా భారీగా జనం దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు లోపల పోలీసులు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారులు ఇలా ఇబ్బందికర, ప్రమాదకర పరిస్థితిని సృష్టించారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ కుట్రే ‘వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు హెలిప్యాడ్, ఇతర పరి్మషన్లు, సెక్యూరిటీ గురించి కలెక్టర్కు, ఎస్పీకి లేఖల ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఇస్తామని చెప్పి, అర్ధరాత్రి హుటాహుటిన ఆ సంఖ్యను సగం కంటే ఎక్కువగా తగ్గించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య ప్రజలకు ఇంకేమి రక్షణ కల్పిస్తుంది? జగన్కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక, ప్రభుత్వం పెద్దలే కుట్రపూరితమైన ఆలోచనతో సెక్యూరిటీని తగ్గించారు. ఇది ముమ్మాటికీ కుట్రే. ఈ విషయమై అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది.జన సందోహం వల్లేతోపులాటదీనితో వైఎస్సార్సీపీకి సంబంధం లేదుస్పష్టం చేసిన హోటల్ నిర్వాహకులుఓ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడిదేవరపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం ప్రజలు విశేష సంఖ్యలో రావడం, వారిలో చాలా మంది తమ హోటల్కు రావడం వల్ల రద్దీ ఏర్పడి, స్వల్ప నష్టం జరిగిందని, ఈ ఘటనకు వైఎస్సార్సీపీకి సంబంధం లేదని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య తెలిపారు. తమ కుటుంబం వైఎస్ జగన్ అభిమానులమని, ఆయన వల్ల ఎంతో లబ్ధి పొందామని వరలక్ష్మి చెప్పారు. తమ హోటల్ పొగాకు వేలం కేంద్రం గేటు పక్కన ఉండడం, పలువురు హోటల్లోకి రావడం వల్ల స్పల్ప తోపులాట జరిగి, కొంత నష్టం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోటల్ను ధ్వంసం చేసినట్టు ఓ టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. హోటల్లో వీడియో తీయవద్దని, తమకు నష్ట పరిహారం వద్దని చెప్పామని, అయినా ఆ ఛానల్ ప్రతినిధి వీడియో తీసి తప్పుగా ప్రచారం చేశాడని మండిపడ్డారు. తాము ఎప్పటికీ జగన్ అభిమానులమేనని వరలక్ష్మి స్పష్టం చేశారు. -
డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చే వరకూ పోరాటం
కపిలేశ్వరపురం: రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మండపేట నియోజకవర్గంలో ఉద్యమ కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ ప్రజలతో కలసి పోరాడతామన్నారు. ఈ మేరకు మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం నుంచి మూడు రోజులు పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. గురువారం మండపేట రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, శుక్రవారం రాయవరం, శనివారం కపిలేశ్వరపురం, ఆదివారం మండపేట పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు ఈ రిలే దీక్షలు చేస్తారని వివరించారు. సోమవారం ఉదయం 10 గంటలకు మండపేట పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాలను ప్రజలతో కలసి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వంతో కోర్టు కేసుల పరిష్కారం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు, వారి తరఫు న్యాయవాదులు ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యాన మీడియేషన్ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీ, వన్ కే వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై మళ్లీ పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని, దీంతో వివాదం శాశ్వతంగా పరిష్కారమవుతుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో రాజీ కుదిరిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. గతంలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినప్పుడు కేసులను లోక్ అదాలత్కు మాత్రమే పంపేవారని, ప్రస్తుతం కక్షిదారులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపడం శుభపరిణామమని మౌలానా అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు సివిల్ జడ్జి కె.రత్నప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్వీ ప్రసాద్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. 12న రేషన్ బియ్యం వేలం రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో నిత్యావసర వస్తువుల చట్టం కింద నమోదైన 6ఏ కేసులలో స్వాధీనం చేసుకున్న 776.97 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యానికి ఈ నెల 12న వేలం వేయనున్నారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఈ వేలం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా రూ.లక్ష ధరావత్తును జిల్లా పౌర సరఫరాల అధికారి పేరిట చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.ఎల్ఐసీ ప్రైవేటీకరణకే ప్రభుత్వ వాటాల తగ్గింపు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను మరింత తగ్గించుకోవాలనే నిర్ణయం ప్రజలకు మేలు చేయదని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్ అన్నారు. ఇది అంతిమంగా ప్రైవేటీకరణకే దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా మరింతగా ఉపసంహరించాలనే నిర్ణయా న్ని వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరంలోని ఆ సంస్థ డివిజనల్ కార్యాలయం వద్ద ఐసీఈయూ ఆధ్వర్యాన ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ, పెయిడ్–అప్ ఈక్విటీలో 2.5 శాతం ప్రాథమిక విక్రయం, అదనంగా 4 శాతం గ్రీన్–షూ ఆప్షన్ (అదనపు వాటాల విక్రయ వెసులుబాటు) ఉన్నాయని వివరించారు. దీనివలన మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ 6.5 శాతానికి చేరుతుందని చెప్పారు. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ పరిరక్షణకు ప్రజాస్వామిక శక్తులు, కార్మిక సంఘాలు, పాలసీదారులు, ప్రజలు ఏకం కావాలని కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కేఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కౌలు చెల్లించలేని పరిస్థితి
నాణ్యమైన పొగాకును కూడా గేడ్రింగ్ పేరిట దోచుకుంటున్నారు. కనిష్ట ధర రూ.170కే ఎక్కువ సరకు కొంటున్నారు. సగటు ధర రూ.230 మాత్రమే చెల్లిస్తున్నారు. కౌలు రైతులయితే పెట్టుబడి తీసేసి.. కౌలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికై నా గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి. – కూచిపూడి గంగాధరరావు, పల్లంట్ల, దేవరపల్లి మండలం గరిష్ట ధర నిర్ణయించాలి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కిలో పొగాకును గరిష్టంగా రూ.385కు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కిలో రూ.270 దాటడం లేదు. ఆ ధరకు కూడా చాలా తక్కువ సరకే కొనుగోలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే గరిష్ట ధర నిర్ణయించి, ఆ రేటుకు మాత్రమే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. – మద్దిపాటి శ్రీనివాసరావు, పల్లంట్ల, దేవరపల్లి మండలం చంద్రబాబు ప్రభుత్వంలో నష్టమే.. చంద్రబాబు పాలనలో రైతులకు ఎప్పుడూ నష్టమే. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా దక్కని దుస్థితి నెలకొంది. పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. వైఎస్ జగన్ పాలనలోనే మేలు జరిగింది. – సుంకర రాంబాబు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, దేవరపల్లి కిలోకు రూ.50 పెంచాలి ప్రస్తుతం నాణ్యమైన పొగాకును కూడా కిలో రూ.170 నుంచి రూ.260 మధ్య కొనుగోలు చేస్తున్నారు. గ్రేడింగ్ పేరిట అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుత గరిష్ట ధరకు అదనంగా ప్రతి కిలోపై రూ.50 ప్రభుత్వమే చెల్లించాలి. అప్పుడే మాకు కొంతలోకొంత గిట్టుబాటవుతుంది. – ఉండవల్లి రామారావు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం -
జగన్ వెంట జనవాహిని
ఆంక్షల వలయాన్ని దాటిన అభిమానం పొగాకు రైతులకు మద్దతుగా రైతుపోరులో పాల్గొనేందుకు బుధవారం ఉదయం 7 గంటల నుంచే యువత, అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు దేవరపల్లి బయలుదేరారు. వారు ఏలూరు, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు నుంచి దేవరపల్లికి చేరుకునే అన్ని మార్గాల్లోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెలిప్యాడ్, పొగాకు వేలం కేంద్రం వద్దకు వెళ్లకుండా అందరినీ ఊరి పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. పొలాలు, తోటల్లోని మార్గాల ద్వారా దేవరపల్లి జంక్షన్కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులు.. ఆయన పర్యటనకు తరలివచ్చే వారిని అడ్డుకోవడంలో అత్యుత్సాహం చూపించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ బుధవారం ఉదయం 9 గంటలకే దేవరపల్లిలోని హెలిప్యాడ్ ప్రాంతం, బస్టాండ్, వై జంక్షన్, పొగాకు వేలం కేంద్రం జనసంద్రంగా మారాయి. ఫ ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ హెలికాప్టర్లో హెలిప్యాడ్కు చేరుకున్నారు. అభిమాన నేతను చూడగానే అందరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఫ ఉదయం 11 గంటలకు బస్టాండ్ వద్దకు ర్యాలీ చేరుకోగానే వైఎస్సార్ సీపీ నాయకులు భారీ గజమాలతో జగన్ను సత్కరించారు. ఫ 12 గంటలకు వై జంక్షన్కు చేరుకోగా.. ఓ కార్యకర్త ఉప్పొంగిన అభిమానంతో కారుపైకి చేరుకుని చొక్కా విప్పి.. జగన్తో కరచాలనం చేశారు. ఫ ప్రేమతో ఓ అభిమాని అందించిన వాటర్ బాటిల్ తీసుకుని జగన్ మంచినీరు తాగారు. ఫ ఓ యువతి జగన్ 2.0 అంటూ ప్రదర్శించిన ఫొటో ఆకట్టుకుంది. ఫ ఒంటరిగా ఎమ్మెల్యే.. ఒంటరిగా ఎంపీ.. ఒంటరిగా సీఎం.. అంటూ అభిమానులు ప్రదర్శించిన ప్లకార్డు విశేషంగా ఆకట్టుకుంది. ఫ జగన్ను కన్నులారా చూసేందుకు పొగాకు వేలం కేంద్రం చుట్టూ ఉన్న భవనాల పైకి మహిళలు, యువత చేరుకుని మండుటెండలో నిరీక్షించారు. ఫ జగన్ ప్రసంగం సాగినంతసేపూ సీఎం.. సీఎం.. అనే నినాదాలు మిన్నంటాయి. -
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జగనన్నను చూసిన వేళ.. ఆనందహేలనిన్నమొన్నటి వరకూ లక్షల క్యూసెక్కుల వరద నీటితో పావన గోదావరి పరవళ్లు తొక్కింది. ఆ నదీమతల్లి పరవళ్లను తలపించేలా.. రహదారిపై జనగోదారి వెల్లువెత్తింది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు పెట్టిన వేళ.. దేవరపల్లిలో ప్రభం‘జనం’ ఎగసిపడింది. అంతటా అంధకారం అలముకున్న వేళ.. వెలుగులు నింపే సూర్యుడిలా.. చీకట్లు నిండిన పొగాకు రైతుల బతుకుల్లో భరోసా నింపేందుకు.. పుట్టెడు కష్టాల్లో ఉన్న వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు వచ్చిన ఆయనకు.. ఉప్పెనలా కదలి వచ్చిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ.. తమ ప్రియనేతతో కరచాలనం చేసేందుకు ఉత్సాహతరంగమై కదం తొక్కారు. ఆత్మీయతతో కదలివచ్చిన ఆ జనకెరటాలు.. జననేతపై ప్రజల్లో చెరగని ప్రేమాభిమానాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. సాక్షి, రాజమహేంద్రవరం: సిండికేట్ అయిన కంపెనీలు ఏకపక్షంగా ధర తగ్గించేస్తున్నాయి.. ఆర్డర్లు ఖరారు కాలేదనే సాకుతో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరుపుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా బేళ్లను భారీగా తిరస్కరిస్తున్నాయి.. ఈపాటికే కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉండగా.. కంపెనీల మాయాజాలంతో రైతుల వద్దనే వేల కోట్ల రూపాయల విలువైన పొగాకు ఉండిపోయింది.. కొనుగోళ్లలో జాప్యం, వాతావరణ ప్రభావంతో దాని నాణ్యత దెబ్బ తింటున్న దుస్థితి.. ఈ పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం, అటు పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో ఈసారి తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందంటూ రైతులు తల్లడిల్లిపోతున్నారు. వారికి అండగా నిలిచేందుకు, భరోసా నింపేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చిన వేళ దేవరపల్లి బుధవారం జనసాగరాన్ని తలపించింది. ఈ రైతుపోరులో రైతులు, యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉత్సాహతరంగాలై కదం తొక్కడంతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం.. అభిమాన నేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించి అపూర్వంగా స్వాగతించారు. సీఎం.. సీఎం.. నినాదాలతో హోరెత్తించారు. 2 కిలోమీటర్లు.. 2.30 గంటలు దేవరపల్లి శివారు సంతమార్కెట్ సమీపాన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు బుధవారం ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని పొగాకు వేలం కేంద్రానికి చేరుకునేందుకు 2.30 గంటల సమయం పట్టింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు, యువత, అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు దారి పొడువునా ప్లకార్డులు, ఫ్లెక్సీలతో జగన్కు స్వాగతం పలికారు. మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. ఓవైపు ఎండ మండిపోతున్నా.. చెక్కు చెదరని చిరునవ్వుతో వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. హెలిప్యాడ్ నుంచి దేవరపల్లి బస్టాండ్, వై జంక్షన్ మీదుగా మధ్యాహ్నం 12:50 గంటలకు పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న జగన్.. అక్కడి రైతులతో మాట్లాడారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చారు. మండుటెండలోనూ నిండైన అభిమానంతో.. తమ అభిమాన నేత జగన్ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయలేదు. నడినెత్తిన సూర్యుడు చండప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నా.. రెండున్నర గంటలపాటు దిక్కులు పిక్కటిల్లేలా ‘జై జగన్’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. యువకులైతే జగన్ను చూసేందుకు చెట్ల పైకి ఎక్కి నిరీక్షించారు. మహిళలు, యువతులు, ఇతర ప్రజలు దారి పొడవునా మేడల పైకి చేరుకుని అభిమాన నేతకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన నేతలు పొగాకు రైతులకు మద్దతుగా రైతుపోరుకు దేవరపల్లి వచ్చిన వైఎస్ జగన్కు వైఎస్సార్ సీపీ నాయకులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొఠారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, ముదునూరు ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, పార్టీ కోనసీమ, ఏలూరు జిల్లాల అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, దూలం నాగేశ్వరరావు, భీమవరం ఇన్చార్జి చిన్నమిల్లి వెంకటరాయుడు, తాడేపల్లిగూడెం కో ఆర్డినేటర్ వడ్డి రఘురాం, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి విజయరాజు, జెట్టి గురునాథరావు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.దేవరపల్లిలో పోటెత్తిన జనగోదారి పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న జగన్అధినేత జగన్కు స్వాగతం పలుకుతున్న మాజీ హోం మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుచంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయమే ప్లకార్డులతో యువకుల జోష్...ఫ దేవరపల్లిలో జనగోదారి ఫ రైతుపోరుకు వేలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ఫ జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం ఫ వైఎస్ జగన్ పర్యటనతో పొగాకు రైతులకు భరోసా -
సరిహద్దులు దాటిన క్రేజ్
నిడదవోలు రూరల్/చాగల్లు: రాష్ట్రాలకు సరిహద్దులున్నా.. ప్రజాదరణ ముందు అవన్నీ తల వంచాల్సిందేనని ఖమ్మం యువకులు నిరూపించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువకులు దాసరి మధు, రాజేష్, అరుణ్, రఘు సందడి చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ ఫొటోలతో.. ‘జన నాయకులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దేవరపల్లిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి జగన్ ఘనతే కారణమని చెప్పారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే భూసేకరణ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లారని, అందువల్లనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామంటూ ఆ యువకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఫ దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే జగన్ ఘనతే ఫ కృతజ్ఞత చాటుకునేందుకు వచ్చిన ఖమ్మం యువత -
డీఎస్సీనా.. ఔట్ సోర్సింగా..!
సాక్షి, అమలాపురం: మరో డీఎస్సీపై నిరుద్యోగులు పెంచుకున్న ఆశలు క్రమంగా ఆవిరవుతున్నట్టు ఉంది పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చేందుకు ఉపాధ్యాయుల శాశ్వత నియామకాల స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అమలైతే నిరుద్యోగులకు అశనిపాతమేనని చెప్పక తప్పదు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో మొత్తం 136 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశం ఉంది. జిల్లాలో గణితం, భౌతిక, జీవశాస్త్రాలు, ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరత చాలా కాలంగా సాగుతోంది. ప్రభుత్వ తాజా ప్రతిపాదనలపై విద్యాశాఖ వర్గాల్లో నాణ్యమైన విద్యపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎదురుతెన్నులు చేస్తున్నారు. గత ఏడాది డీఎస్సీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 పోస్టులు భర్తీ అయ్యాయి. చాలా మంది ఆశావహులకు అవకాశాలు రాకపోవడంతో ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగినట్టుగానే త్వరలో మరో డీఎస్సీ ప్రకటిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన వారిలో ఆశలు రేకెత్తించింది. కానీ తాజాగా ఔట్సోర్సింగ్పై ఉపాధ్యాయులను నియమించనున్నారన్న కబుర్లు వినిపిస్తుండడంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఉద్యమబాట చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలతో ఇప్పటికే వైఎస్సార్ సీపీ దశలవారీగా ఉద్యమిస్తోంది. జిల్లాలో సైతం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గురువారం నుంచి మండలాల వారీగా రిలే దీక్షలు చేపట్టనున్నారు. తరువాత నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాలీ చేయనున్నారు. సబ్జెక్టు టీచర్ల భర్తీకి ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రతిపాదనలు కోనసీమ జిల్లాలో 136 ఖాళీల భర్తీకి అవకాశం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు -
అరటి బొంద ఉత్పత్తులపై శిక్షణ
చాగల్లు: కొవ్వూరు గ్రామీణ ప్రాంతాల్లో వృథాగా పడేసే అరటి వ్యర్థాలను ఆదాయ వనరుగా మలుచుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని డీఆర్డీఏ పీడీ బి.నగేష్ అన్నారు. కొవ్వూరు మండలం వేములూరు రోడ్డులోని హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్లో బుధవారం డ్వాక్రా మహిళలకు ఈ మేరకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ వల్ల మహిళల జీవనోపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. ఇందులో భాగంగా నందమూరు గ్రామానికి చెందిన 25 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం తయారీకి ఉపయోగించే యంత్రాలకు సబ్సిడీ ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్.మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ పీడీ ఎ.దుర్గేష్, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏడీఆర్ డి.వెంకటస్వామి పాల్గొన్నారు. -
పుష్కరాలు సమన్వయంతో నిర్వహించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రశాంతమైన, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 16 శాఖలకు సంబంధించి 278 పనులను రూ.49.92 కోట్లతో ప్రతిపాదించగా ఇప్పటి వరకు దేవదాయశాఖకు సంబంధించి 15 పనులకు రూ.2.12 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. గోదావరి పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఘాట్ల వద్ద పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరుపై దృష్టిపెట్టాలి పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక నిఘా ఉంచాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత శాతాన్ని సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని ఆదేశించారు. బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండేలా శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్లిప్ టెస్టులు నిర్వహించి వారి పురోగతిని బేరీజు వేయాలని సూచించారు. జిల్లాకు 4 బయోగ్యాస్ ప్రాజెక్టులు గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ, వంటశాల (కిచెన్) వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలో నాలుగు బయోగ్యాస్ ప్రాజెక్టులను ప్రతిపాదించినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. బుధవారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, మున్సిపల్, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో ఈ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టర్ హరేంధిరప్రసాద్ -
బస్సును ఢీకొని వ్యక్తి మృతి
గోకవరం: మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే స్థానిక ఆర్టీసీ డిపోకు చెందిన సింగిల్స్టాప్ బస్సు ఉదయం రాజమమహేంద్రవరం నుంచి గోకవరం వస్తుండగా గుమ్మళ్లదొడ్డిలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న రంపయర్రంపాలేనికి చెందిన కాళ్ల వీరవెంకట సత్యనారాయణ (50) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగమణి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. -
విద్యా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
● ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ● రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయమైంది. స్థానిక వై.జంక్షన్లో కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విభాగ్ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొనాలని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా విద్యారంగంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బకాయి పడిన సుమారు రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఏ కేటగిరి విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసే విధానాన్ని అరికట్టాలని, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన భవనాలకు మార్చి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నగర కార్యదర్శి రామ్, జిల్లా కన్వీనర్ లలిత్, పృథ్వీ, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంపనకు గ్రాస్రూట్
ఇన్నోవేటర్ పురస్కారంరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం అనపర్తి: అటల్ ఇన్నోవేషన్ మిషన్, విజయవాడ కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్ పంపు రైతులకు బహుళ ప్రయోజనకారి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించినట్టు హైడ్రోలిఫ్ట్ సృష్టికర్త పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన పంపన శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రాష్ట్రపతితో పాటు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శ్రీనివాస్ ఉత్తమ గ్రాస్రూట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఆయన అందుకున్న ప్రశంసా పత్రాన్ని, పురస్కారాన్ని చూపారు. -
గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం
కాకినాడ రూరల్: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు ఓసుపల్లి అనిల్కుమార్ (26) మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. మండలంలోని సూర్యారావుపేట గ్రామానికి చెందిన అనిల్కుమార్ మరో ఐదుగురితో ఈ నెల 2న చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకలపూడి ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులకు సూర్యారావుపేట – ఉప్పాడ మధ్య స్పెక్ట్రామ్ ఎదురుగా అనిల్కుమార్ మృతదేహం తేలియాడుతూ కనపడింది. ఈ మేరకు అతడి సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చాక సర్పవరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పదో తేదీన జైల్ భరో
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదో తేదీన దేశ వ్యాప్తంగా జైల్ భరో నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆంగ్లేయులను తరిమికొట్టడంలో స్ఫూర్తిగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, వ్యవసాయం కార్పొరేటీకరణ తదితర అంశాలపై ఐక్య పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం కలిపి చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు బంగారు రాజేష్, సింగంపల్లి రమణ, నరుకుర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. స్కాలర్షిప్ దరఖాస్తులకు 31 వరకు గడువుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 10, 11, 12 తరగతుల విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. 2022, 23, 24 సంవత్సరాల్లో మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు ప్రభుత్వ స్కాలర్షిప్ పోర్టల్ స్కాలర్షిప్స్.జీవోవీ.ఐఎన్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు చే సుకోవాలన్నారు. దరఖాస్తు సమయంలో బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానం చేసి, సీడ్ చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర సమాచారానికి సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ కార్యా లయాన్ని సంప్రదించాలని డీఈఓ సూచించారు. ఏలేరులో స్నానానికి దిగి యువకుడి గల్లంతుజగ్గంపేట: మండలం భావవరం వద్ద అటవీ ప్రాంతంలో వున్న ఏలేరు రిజర్వాయర్ ప్రాంతంలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గండేపల్లి మండలం సూరంపాలేనికి చెందిన ఆదిత్య కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఏలేరు నదిలో స్నానానికి దిగారు. వారిలో తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన వడ్డి ప్రశాంత్ కుమార్ (18) లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో మునిగిపోయి గల్లంతయ్యాడు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో వారు జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా పోలీసులు అతడిని వెదికే ప్రయత్నం చేసినా చీకటి పడడంతో గాలింపు చర్యలు ముందుకు సాగలేదు. నాగంపల్లిలో చోరీ కేసు నమోదుసీతానగరం: మండలంలోని నాగంపల్లిలో ఉద్దగిరి అనంతలక్ష్మి ఇంట్లో చోరీ జరిగిందని, కేసు నమోదు చేశామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ బుధవారం తెలిపారు. కొంతకాలంగా ఆమె కాకినాడలో నివసిస్తోందని, పెన్షన్ కోసం నాగంపల్లి వచ్చి తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండడాన్ని చూసి లోపల గమనించగా ధాన్యం బస్తాలు, రాగి, ఇత్తడి సామాన్లు, తులం బంగారు ఉంగరం, అరకాసు దుద్దులు, రూ.లక్ష చోరీకి గురైనట్టు గుర్తించారు. మంగళవారం ఇచ్చిన ఫిర్యాదుతో ఆధారాలు సేకరించారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
బ్యాడ్మింటన్ స్టేట్ మీట్లో ‘తూర్పు’ క్రీడాకారుల ప్రతిభ
● పురుషుల డబుల్స్.. మహిళల సింగిల్స్.. మిక్స్డ్ డబుల్స్లో పతకాల కై వసంశ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో నాలుగు రోజుల పాటు సాగిన సీనియర్స్ బ్యాడ్మింటన్ స్టేట్మీట్ బుధవారంతో ముగిసింది. శాంతినగర్కాలనీలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన పోటీల్లో విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం షట్లర్లు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు. విజేతల వివరాలు ఇవీ ● పురుషుల డబుల్స్ విభాగంలో వి.హరికృష్ణ (తూర్పుగోదావరి)–టి.చరణ్రామ్ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, సాయిపవన్ కర్రి (తూర్పుగోదావరి)–ఎం.ధర్మాఘ్న (గుంటూరు) జంట రన్నరప్గా నిలిచారు. ● ఇక మహిళల సింగిల్స్ చాంపియన్గా కందేరి నవ్య (చిత్తూరు) నిలవగా, కె.దుర్గా ఇషా (తూర్పుగోదావరి) రన్నరప్గా నిలిచింది. ● మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కర్రి సాయి పవన్ (తూర్పుగోదావరి)–దండు పూజ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, బి.అభిషేక్ (తూర్పుగోదావరి)–గగనశ్రీ చౌదరి కె (కృష్ణ) రన్నరప్తో సరిపెట్టుకున్నారు. జాతీయ పోటీల్లో సత్తా చాటాలి.. ఏపీ సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులంతా సౌత్జోన్ నేషనల్స్, ఆలిండియా నేషనల్స్ పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి విజయదుందుభి మోగించాలని ఏపీ బ్యాడ్మింటన్ సీఈఓ, విశాఖ ఈగల్ టీం ఏఎస్పీ చుక్కా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. -
అందరికీ ఆదర్శం నవోదయ
పెద్దాపురం: ఎందరో విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతున్న స్థానిక పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం పీఎంశ్రీ జవహార్ నవోదయ ఫౌండేషన్ డే వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శరత్చంద్ర కీర్తి అధ్యక్షతన సాగిన కార్యక్రమంలో విజయనగరం నవోదయ విశ్రాంత ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విశ్రాంత ఉపాధ్యాయుడు శివరామకృష్ణ, పూర్వ విద్యార్థులు డాక్టర్ మల్లేశ్వరరావు, గోదావరి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాజా రత్నాకర్, శ్రీసాయి, జగన్నాథం, సతీష్కుమార్, కోటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వరదాయిని!
సాక్షి, అమలాపురం: గోదావరి వరదలతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిపైనా రీల్స్ తీసి షేర్లు, లైకుల కోసం అర్రులు చాస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. వరద నీటిలో ప్రయాణాలు, ముంపులో చిక్కుకున్న రహదారులు, పడవలపై ప్రయాణాలు, ప్రవాహంలో పులస చేపల వేట వంటి దృశ్యాలను చిత్రీకరించి ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, ఎక్స్లలో రీల్స్గా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం.. తద్వారా గోదావరికి వరద నీరు రాలేదు. కానీ ఎగువన కురిసిన వర్షాలతో గోదావరికి అకస్మాత్తుగా వరద పోటెత్తింది. దీంతో లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. అదే సమయంలో డ్రోన్లు, సెల్ఫోన్లు, కెమెరాలతో గోదావరి ముంపు, పడవ ప్రయాణాలు, స్థానికుల కష్టాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. తమ కష్టాలు వారికి కంటెంట్గా తయారైందని కొందరు వాపోతుంటే.. తమ కష్టం వారికి కాసులు తెచ్చిపెడుతోందిలే అని నిర్వేదం వ్యక్తం చేసేవారు కొందరు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమాదకర పరిస్థితులకు సైతం వెరవక అక్కడి పరిస్థితులను షూట్ చేస్తూ సాహసాలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. సాహసం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ముంపు.. ఇటు లొల్ల అందాలు.. ఆత్రేయపురం మండలం లొల్ల సమీపంలో వర్షాల వల్ల వరి చేలు పెద్ద ఎత్తున మునిగిపోయిన విషయం తెలిసిందే. వీటిని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వదలలేదు. కేరళ రాష్ట్రంలోని అలప్పి తరహాలో అందాలపై పోటీపడి రీల్స్ చేస్తున్నారు. వీటికి తెలుగు, మలయాళంలోని పాపులర్ పాటలను బ్యాక్గ్రౌండ్గా పెట్టడం గమనార్హం. పులసకు సైతం కొత్త బ్రాండ్ గోదావరికి ఎర్ర నీరు తగలగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మాంసాహారులకు పులస చేప గుర్తుకు వస్తుంది. ఇటీవల పులస చేపల రాక తగ్గిపోయినా ఒడిషా, బెంగాల్ నుంచి వచ్చే విలాస హిల్సా చేపలను కూడా ఇన్ఫ్లుయెన్సర్లు వదలడం లేదు. పులస చేప కథలు, వంటకం విధానం, రుచుల వర్ణన, యానాం మార్కెట్లో వేలం పాటలు, రావులపాలెంలో పులస కూర ఆన్లైన్ విక్రయాలు ఇలా గోదావరి వరద కొందరికి వరదాయినిగా మారిందని చెప్పకతప్పదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఉపాధిగా మారిన గోదారి ముంపు రీల్స్ రూపంలో పోస్టుల వెల్లువ ఒకరి దుఃఖం.. మరొకరికి లాభం! కోనసీమలో నయా ట్రెండ్ -
జెన్జీ సైతం వైఎస్ జగన్ వెంటే..
సాక్షి, తూర్పు గోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పర్యటనకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా జెన్జీ (Gen Z) యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్కు స్వాగతం పలికారు. బుధవారం ఉదయం పర్యటన సాగిన మార్గమంతా అభిమానులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది.వైఎస్ జగన్ రాక సందర్భంగా దేవరపల్లిలో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు రోడ్ల వెంట నిలబడి జెండాలు, ప్లకార్డులతో తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ వాహనం కనిపించగానే నినాదాలతో హోరెత్తించారు. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.జగన్ పర్యటనకు గ్రామాలు, పట్టణాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో దేవరపల్లిలో భారీ జనసందోహం కనిపించింది. యువత ఉత్సాహం, కార్యకర్తల నినాదాలతో పర్యటనకు ప్రత్యేక వాతావరణం ఏర్పడింది. సాధారణంగా.. జగన్ పర్యటనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యువత మద్దతు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జెన్జీ యువత భారీగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ.. జగన్ పర్యటనలో యువత భాగస్వామ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తన పర్యటనకు వచ్చిన ప్రజలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. దేవరపల్లి పర్యటన వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, దేవరపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.వైఎస్ జగన్ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి.. కొనుగోలు కేంద్రం వారితో ముఖాముఖి అయ్యారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ’చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. చంద్రబాబు వల్ల ప్రజలకు బాధే మిగిలింది. 27 నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో రైతులు రోడ్డునపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా?. బాధిత రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు ధర రూ.289గా ఉంది. కానీ, ఇప్పుడు కేజీ పొగాకు ధర రూ.236 మాత్రమే పలుకుతోంది. కూటమి ఉత్తరాది ప్రాంతంలో టొబాకో బోర్డు 49.70 మిలియన్ కేజీల పొగాకును కొనుగోలు చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ 10 మిలియన్ కేజీలు (20% కంటే తక్కువ) మాత్రమే కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా. ఇప్పటివరకు కేవలం 47.3 మిలియన్ కేజీలు (సుమారు 21%) మాత్రమే కొనుగోలు జరిగింది. వేలం కేంద్రాలలో 30% నుండి 40% వరకు పొగాకును రిజెక్ట్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించడం వల్ల కంపెనీల మధ్య పోటీ పెరిగి రైతులకు మంచి ధర లభించింది. రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ. 7,800 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు రూ. 1 లక్ష వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. 84.66 లక్షల మంది రైతులకు రూ. 2,050 కోట్లు అందించాం. చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు. రైతు భరోసా సాయంలో కూడా కోతలు పెట్టారు. చంద్రబాబు పాలన రైతులకు హానికరం. కూటమి ప్రభుత్వం దళారీతో రాజీ పడింది. దళారులు సిండికేటుగా మారి రైతుల పొట్టగొడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్తో ఆవేదన చెప్పుకున్న రైతులు..అంతకుముందు.. వైఎస్ జగన్తో దేవరపల్లి పొగాకు రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర లేదని వాపోయిన పొగాకు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీగానీ ఇక్కడికి రాలేదన్న రైతులు. 98 శాతం పొగాకును రూ.170కే కొంటున్నారు. మీరు వస్తున్నారని రూ.10 పెంచారు.వైఎస్సార్సీపీ హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కేజీ పొగాకుకు రూ.70 నష్టపోతున్నాం. పొగాకు కొనే దాని కంటే రిజక్ట్ చేసేదే ఎక్కువ. ఎకరానికి రూ.3 లక్షల పెట్టుబడి.. గిట్టుబాటు రావడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లోగ్రేడ్ పొగాకు కూడా కొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంతో మేము నష్టపోతున్నాం అని అన్నారు. -
కారుతో మహిళ బీభత్సం
తూర్పుగోదావరి: మండలంలోని పెరుమాళ్లపురంలో ఓ కారు రెండు బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజమహేంద్రవరం వద్ద బొమ్మూరుకు చెందిన విప్పర్తి మాధవికి తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ బుచ్చియ్యపేట గ్రామానికి చెందిన అంబుజాలపు బాబ్జీ తన స్నేహితురాలి ద్వారా కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం బాబ్జీ మాధవి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారు కాకినాడలో నాలుగు నెలలుగా ఉంటున్నారు. సోమవారం రాత్రి బాబ్జీ కాకినాడ నుంచి తనకు చెప్పకుండా వచ్చేయడంతో మంగళవారం ఉదయం మాధవి బుచ్చియ్యపేటకు తన కారులో వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసి కారును సైతం ధ్వంసం చేశారు. దీంతో ఆమె ప్రాణభయంతో కారుతో అతివేగంగా రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. కారు అద్దాలు పగిలిపోవడం, దారి స్పష్టంగా లేకపోవడంతో పెరుమాళ్లపురం మెయిన్ సెంటర్లో రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యయి. దీంతో స్థానికులు కారును అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మాధవి తనపై జరిగిన దాడిపై ఇచ్చిన ఫిర్యాదుపైనా, కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదుపైనా పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారు వారి పగాకు
ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికీ ధర నిర్ణయించుకునే హక్కు ఉత్పత్తిదారుకు ఉంటుంది. కానీ, రైతు పరిస్థితి మాత్రం దీనికి భిన్నం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని, భారీగా పెట్టుబడి పెట్టి.. చంటిబిడ్డలా పంటను సాకి.. దండిగా దిగుబడులు సాధించినా.. దానికి ధర నిర్ణయించుకునే హక్కు మాత్రం అతడి చేతిలో లేకుండా పోతోంది. దళారులు, మార్కెట్ శక్తులు పంట ధరలను శాసిస్తూ రైతన్న బతుకుతో చెలగాటమాడుతున్నాయి. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు చిత్తవుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: పొగాకుకు కంపెనీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.. రకరకాల సాకుల తో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తున్నాయి.. వేలం కేంద్రానికి తీసుకెళ్తున్న బేళ్లను తిరస్కరి స్తున్నాయి.. రైతుల వద్ద భారీగా నిల్వలు పేరుకుపో తున్నాయి.. వాతావరణ మార్పులతో ఆకు నాణ్యత దెబ్బ తింటోంది.. ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పొగాకు రైతులు పుట్టెడు కష్టాల్లో చిక్కుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.ఏటా ఆగస్టు నెలాఖరుకే పొగాకు కొనుగోళ్లు పూర్తవుతూండగా.. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వచ్చినా అంతంతమాత్రంగానే ఉన్నాయి. మరోవైపు రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నాయి తప్ప, రైతుకు లాభసాటి ధర దక్కేలా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) 2025–26 పంటకాలంలో 12,938 మంది రైతులు 30,145 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్నారు. రీజియన్లోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిల్లోని వేలం కేంద్రాల్లో మార్చి 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకూ 96 రోజులు వేలం నిర్వహించగా 11 శాతం మాత్రమే పొగాకు విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుతం కిలో సగటు ధర రూ.237 మాత్రమే పలుకుతోంది. ఈ ధర రూ.350 పలికితే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుందని రైతులు ఆశ పడుతున్నారు. కానీ, ఆ సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. రైతుల వద్ద భారీగా నిల్వ ఈ పరిస్థితుల్లో ఒక్కో రైతు వద్ద ఉన్న రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పొగాకు నిల్వ ఉండిపోవడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఎగుమతి ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ తీసి, వివిధ దేశాల్లోని సిగరెట్ల తయారీ సంస్థలకు పంపించినప్పటికీ ఆర్డర్లు ఖరారు కాలేదు. దీంతో, కొనుగోళ్ల ప్రక్రియ వచ్చే జనవరి వరకూ నిర్వహించనున్నట్లు సమాచారం. కొనుగోళ్ల ప్రక్రియ నెలల తరబడి సాగితే పొగాకు నాణ్యత మరింత దెబ్బ తిని, నష్టాల్లో కూరుకుపోతామని గగ్గోలు పెడుతున్నారు. మార్కె ట్లో సంక్షోభం నెలకొని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వెంటనే గిట్టుబాటు ధరకు మొత్తం పొగాకు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఎకరాకు రూ.3 లక్షల పెట్టుబడి ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ రైతులు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో అంతంత మాత్రంగానే ధర లభిస్తూండటంతో ఎకరాకు రూ.1.60 లక్షల వరకూ నష్టం వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. రైతులు వేలానికి తెచ్చిన బేళ్లను కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో, సాగుకు తెచ్చి న అప్పులకు నెలల తరబడి వడ్డీలు చెల్లించలేక రైతు లు సతమతమవుతున్నారు. కౌలు రైతులైతే మరింత కుదేలయ్యారు. ఎకరం కౌలు రూ.70 వేలు కాగా, బ్యారన్ అద్దె రూ.2.50 లక్షలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు కలిపి వారికి రూ.4.70 లక్షలు ఖర్చవుతోంది.అండగా నిలిచిన తండ్రీతనయులు2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కలి్పంచి, ఆదుకుంటానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయించారు. వైఎస్సార్ తనయుడు, 2014లో నాటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరులోని బోర్డు కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని ప్రకటించారు. అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరగడంతో రైతులకు మేలు జరిగింది. పొగాకు రైతులకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గతంలో 2021 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. నాడు పొగాకు రైతుల ఇబ్బందులను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్కు ఏకంగా రూ.500 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయించారు.నేడు దేవరపల్లిలో జగన్ పర్యటన పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం పర్యటించనున్నారు. అక్కడి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తారు. పొగాకు సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, తదితర సమస్యలపై రైతులతో నేరుగా మాట్లాడతారు. జగన్ తాడేపల్లిలో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి, 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. పురుగులు పడుతున్నాయి నెలల తరబడి పొగాకు ఇంటి వద్ద నిల్వ ఉండిపోవడంతో నాణ్యత దెబ్బ తిని, బేలు మధ్య బూజు పట్టి పురుగులు పడుతున్నాయి. 50 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. 10 శాతం అమ్మగా, ఇంకా 90 శాతం ఇంటి వద్దనే ఉంది. 20 శాతం లో గ్రేడ్, 40 శాతం మీడియం, 40 శాతం బ్రైట్ గ్రేడ్ పొగాకు పండుతుంది. లో, మీడియం గ్రేడ్ పొగాకు అమ్ముడు పోవడం లేదు. – పరిమి రాంబాబు, పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయి. 80 ఎకరాల్లో పొగాకు పంట వేశాను. గిట్టుబాటు ధర లేదు. ఎక్కడి పొగాకు అక్కడే ఉంది. కిలో సగటు ధర రూ.350 ఇస్తే కనీసం ఖర్చులు వస్తాయి. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
సత్యగిరి ఆక్రమణపై కలెక్టర్ ఆరా
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి చెందిన సత్యగిరిని పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమించేందుకు జరిగిన ప్రయత్నం, దేవస్థానం తీసుకున్న చర్యలపై కలెక్టర్ హరింధర ప్రసాద్ మంగళవారం ఆరా తీశారు. ఈ వ్యవహారంపై సోమవారం ‘పోడు పొచ్చాలు’, మంగళవారం ‘సత్యగిరిపై ఇదేం కిరికిరి’ శీర్షికలతో ‘సాక్షి’ ప్రచురించిన వార్తలకు ఆయన స్పందించారు. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన విషయాన్ని వివరిస్తూ సత్యగిరిపై 1998లో దేవస్థానం కొనుగోలు చేసిన 303 ఎకరాల భూమి సరిహద్దులు నిర్ణయించడానికి సర్వే చేయించి, రాళ్లు పాతించి, తరువాత ఫెన్సింగ్ చేయించనున్నట్టు కలెక్టర్కు ఈఓ నివేదిక పంపారు. సత్యగిరి పరిశీలన కొండ పోడు పేరుతో సత్యగిరిని ఆక్రమించే ప్రయత్నం జరిగిన గిరి ప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్డీఓ జి.కృష్ణమూర్తి మంగళవారం పరిశీలించారు. కొండను సర్వే చేయించి, వెంటనే సరిహద్దులో సర్వే రాళ్లు పాతించాలని దేవస్థానం అధికారులకు, శంఖవరం, తొండంగి తహసీల్దార్లు ఎం.సూరిబాబు, కె.కాంతారావుకు సూచించారు. సత్యగిరి కొండ ను సర్వే చేసిననంతరం పాతడానికి 200 సర్వే రాళ్లు కోటనందూరు మండలం గన్నవరం మెట్ట నుంచి తెప్పిస్తున్నట్టు ఈఓ తెలిపారు.·˘ ‘సాక్షి’ కథనాలకు స్పందన ·˘ పోడు భూములను పరిశీలించిన ఆర్డీఓ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
దేవరపల్లి: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. పొగాకు రైతుల కష్టాలు తెసుకుని, వారికి బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఏర్పాట్లను వేణుతో పాటు ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, జగన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ హోం మంత్రి, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, ఎంపీపీ కేవీకే దుర్గారావు తదితరులు మంగళవారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ నిర్మాణ పనులు, పొగాకు వేలం కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వేణు మీడియాతో మాట్లాడుతూ, గతంలో రైతులను ఒక్కడిగా హింసించిన చంద్రబాబు.. నేడు కూటమిగా రైతులను హింసిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ, వాణిజ్య పంటలను కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేయించలేని అసమర్థ పాలన జరుగుతోందని అన్నారు. జగన్ వస్తేనే ఈ ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరుస్తారని, అప్పుడే తమకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నది రైతుల నమ్మకమని చెప్పారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్ సందర్శిస్తారనగానే కిలోకు రూ.10 పెంచారని, రూ.250 కోట్ల రుణాలు రైతులకు అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఇంతకు ముందు ఆ స్పందన లేదన్నారు. పొగాకు కొనుగోళ్లు రెండు నెలల్లోనే పూర్తి చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్ అని చెప్పారు. పొగాకు బోర్డు అనుమతించిన మేరకు కూడా గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోలు చేయని దుస్థితి నెలకొందన్నారు. కొనుగోళ్లు ప్రారంభించి సుమారు 130 రోజులు కాగా, ఇప్పటి వరకూ 10 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు. 120 రోజుల్లో మొత్తం పొగాకు కొనుగోలు చేయాల్సి ఉండగా, 105 రోజుల్లో 10 శాతమే కొనుగోలు చేయడం కంటే దారుణం ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రక్షణ కల్పించే నాయకుడిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారని, రైతుకు ఎక్కడ నష్టం కలిగినా ప్రభుత్వం మెడలు వంచి వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందని వేణు స్పష్టం చేశారు. ఫ నాడు ఒక్కడిగా.. నేడు కూటమిగా రైతులను హింసిస్తున్నారు ఫ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత వేణు విమర్శ ఫ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నేతలు ప్రజాదరణ చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం : జక్కంపూడి రాజాదేవరపల్లి: వెఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా వస్తున్న అత్యంత ప్రజాదరణను చూసి ఓర్వలేకే కూటమి ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, చిర్ర బాలరాజు, సొంగా రోషన్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యలపై స్పందించి, వారి కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు జగన్ వస్తున్నారని తెలిసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. చంద్రబాబు పాలనలో గంజాయికి తప్ప ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల వద్ద ఉన్న 85 శాతం పొగాకును ఎప్పటికి కొనుగోలు చేస్తారో కూటమి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారు చేసి రూ.39 వేల వ్యాపారం చేస్తున్నారని, రైతుకు మాత్రం కిలో పొగాకుకు రూ.160 నుంచి రూ.275 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఇది న్యాయమా, ధర్మమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు. పనికిమాలిన మాటలు మాని, ఇబ్బందుల్లో ఉన్న పొగాకు రైతులకు ఏవిధంగా మేలు చేయాలో ఆలోచించాలని ఎమ్మెల్యే వెంకట్రాజుకు హితవు పలికారు. ‘పొగాకు రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడం చేతకాని మీరు, మీ ప్రభుత్వం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ఈ ప్రాంతానికి బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు వస్తున్నాయంటూ మాట్లాడతారా?’ అని రాజా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాదరణ కలిగిన నాయకుడని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పారు. -
కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
చాగల్లు: మండలంలోని బ్రాహ్మణగూడెం శివారులోని చెరువు వద్ద కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ షేక్ గని (44) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై కె.నరేంద్ర మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ గని సోమవారం రాత్రి చాగల్లు నుంచి ప్యాసింజర్ ఆటో వేసుకుని నిడదవోలు వైపు వస్తుండగా బ్రాహ్మణగూడెం వద్ద నిడదవోలు నుంచి చాగల్లు వైపు వెళ్తున్న ఎర్టీగా కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడి గని తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతిచెందాడన్నారు. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ఇక మాకు ఎవరున్నారు.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారని అతడి భార్య సభాన రోదించిన తీరు కంటతడి పెట్టించింది. గనికి ఇద్దరు అమ్మాయిలు ఉండగా పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతోంది. మృతుడి భార్య సభాన ఇచ్చిన ఫిర్యాదుపై కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.బ్రాహ్మణగూడెం శివారులో ఘటన -
ఫ అధినేతతో భేటీ
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. – సాక్షి, అమరావతి కడలిలోకి 4.86 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 4,86,566 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది. ఎగువన కాళేశ్వరంలో 7.30 మీటర్లు, పేరూరు 11.92, దుమ్ముగూడెం, 8.42 మీటర్లు, భద్రాచలంలో 29.10 అడుగులు, కూనవరంలో 13.98 మీటర్లు, కుంట 5.33, పోలవరం 9.74, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.88 మీటర్ల మేర గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సమర్థవంతంగా వినియోగించుకుని, ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైధ్ అహ్మద్ మౌలానా సూచించారు. లోక్ అదాలత్ను పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు అనువైన పెండింగ్ ఎకై ్సజ్ కేసులు, రాజీ పడదగిన కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజీకి అనువైన కేసుల వివరాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ)కు అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి యార్లగడ్డ, కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు ఎం.కృష్ణకుమారి, ఆర్ఎస్ కుమరేశ్వరన్, జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత, పోలవరం జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏవీబీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సురక్షితమైన నీరే తాగాలి రాజమహేంద్రవరం రూరల్: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీరే తాగాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పి.కోమల సూచించారు. వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ అనే అంశంపై బొమ్మూరులోని వైటీసీ ప్రాంగణంలో అప్మాస్ సంస్థ, వాటర్.ఓఆర్జీ సహకారంతో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాపులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యంగా వర్షాకాలంలో డయేరియా, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన తాగునీటినే వినియోగించాలని అన్నారు. తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసుకోవాలని, మరుగుదొడ్లను తప్పనిసరిగా వినియోగించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ వర్క్షాప్లో పలువురు అధికారులు పాల్గొని, జిల్లాలో సురక్షిత తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాల విస్తరణపై చర్చించారు. -
హాస్టల్ తక్షణం స్వాధీనం చేసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్ను స్వాధీనం చేసుకోవాలంటూ విద్యా శాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ మేరకు విద్యా శాఖ కమిషనర్ భరత్గుప్తాకు విజయవాడలోని ఆయన కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ, ఈ హాస్టల్ను స్వాధీనం చేసుకోవాలని ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చినా నేటికీ స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. కందుకూరి ఆశయాలను నెరవేర్చాలని, విద్యార్థినులకు రక్షణ కల్పించాలని, కందుకూరి విద్యాసంస్థలను కాపాడుకోవాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, హాస్టల్ను వారం రోజుల్లో స్వాధీనం చేసుకోకుంటే కమిషనర్ కార్యాలయానికి విద్యార్థినులందరూ తరలి వస్తారని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై.భాస్కర్ మాట్లాడుతూ జీఓ–28 ప్రకారం కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల క్యాంపస్ మొత్తం ప్రభుత్వ పరమైందని, అయినప్పటికీ హితకారిణి సమాజం దౌర్జన్యంగా లాగేసుకుందని ఆరోపించారు. అయినప్పటికీ విద్యా శాఖ పట్టించుకోలేదని అన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు., కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా కమిటీ సభ్యులు సౌమ్య, కార్తిక్, నాగచెతన్య తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీపై సీబీఐ వేయాల్సిందే
సాక్షి ప్రతినిధి కాకినాడ/సాక్షి, అమలాపురం/ రాజమహేంద్రవరం/రంపచోడవరం: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలు వద్దని ప్రభుత్వాన్ని ఆ పార్టీ హెచ్చరించింది. క్రీడా కోటాలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన వారికి కాకుండా జిల్లాస్థాయిలో పాల్గొన్న వారికి పోస్టులు కట్టబెట్టి అర్హులకు అన్యాయం చేశారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పోలవరం జిల్లాల్లో మంగళవారం స్థానిక నేతలు, ప్రజా సంఘాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయా జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పాల్గొని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. అలాగే నాలుగు జిల్లాల్లోని నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనర్హులకు పోస్టింగులు దుర్మార్గం : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డీఎస్సీ పేరిట తప్పుడు పత్రాలు, జీవోలు సృష్టించి టీడీపీ కార్యకర్తలకే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చుకుని అర్హులైన నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెలుబోయిన వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని తప్పుడు హామీలు ఇచ్చి మోసగించారని పేర్కొన్నారు. యువశక్తికి తలవంచక తప్పదు: డాక్టర్ గూడూరి జెన్జీ యువశక్తికి ఎవరైనా తలవంచక తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డా.గూడూరి శ్రీనివాస్ అన్నారు. మన విద్యావిధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. డీఎస్సీ అక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారు? : మార్గాని భరత్రామ్ రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన ఆధ్వర్యంలో ‘ఏపీ జెన్ జీ వార్’ పేరుతో స్థానిక వై–జంక్షన్లో ఉన్న ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థను పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎలా న్యాయం చేస్తాయని ధ్వజమెత్తారు. లోకేష్ బాధ్యత వహించాలి : చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలోని సీఆర్సీ మినీ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని ఆయన అన్నారు. జెన్ జీతో పోరాటాలు: విశ్వరూప్.. శ్రీకాంత్.. ఢిల్లీ జంతర్మంతర్లో విద్యార్థుల ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లే, రాష్ట్రంలోనూ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఏపీ జెన్జీ ద్వారా పోరాటాలు చేయాలని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని ఏబీసీ ఫుడ్ కోర్టులోని యెండూరి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ డీఎస్సీ అవకతవకలపై నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దాం : పాముల రాజేశ్వరీదేవి సఖినేటిపల్లిలోని ఉయ్యూరివారిమెరకలోని కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి మాట్లాడుతూ డీఎస్సీలో దగా పడ్డ పిల్లలకు న్యాయం చేసేందుకే ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. యువతకు అండగా : మాజీ ఎమ్మెల్యే పొన్నాడ అక్రమాల డీఎస్సీపై ఉద్యమించి నిరుద్యోగ యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్కుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పేరిట దగా చేశారు : కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కాకినాడ రూరల్: కాకినాడలో నాగమల్లితోట జంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మంగళవారం రూరల్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు గ్యారంటీ అని ఎన్నికల ముందు ప్రచారం ఊదరగొట్టిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అధికారంలోకి వచ్చి మెగా డీఎస్సీ పేరిట అర్హులకు అన్యాయం చేసి దొడ్డిదారి జీవోతో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. సింగిల్గా పోరాడే తమ నాయకుడు జగన్కు, తండ్రి చాటున బిడ్డగా ఉన్న లోకేష్కు పోలికేంటని ప్రశ్నించారు. రూ.15 లక్షలకు అమ్ముకున్నారు: తోట నరసింహం జగ్గంపేటలోని స్థానిక బాలాజీనగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోకవర్గ కోఆర్డినేటర్ తోట నరసింహం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని, మెగా డీఎస్సీ అంటూ హడావిడి చేసి చివరకు దగా డీఎస్సీగా మార్చిందని ధ్వజమెత్తారు. ఈ పోస్టుల్లో ఒక ఉద్యోగాన్ని రూ.15 లక్షలకు పైగా అమ్మకున్నారని ఆరోపించారు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణం : వంగా గీత పిఠాపురంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీత మాట్లాడుతూ డీఎస్సీ–2025 దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, భృతి అని అన్నింటా మాట తప్పారని అన్నారు. వీటన్నింటికీ బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతతో చెలగాటమా? : డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిరుద్యోగ యువత జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ– 2025 అవకతవకలపై ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. డీఎస్సీ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ వ్యవస్థలకు కాకుండా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడం వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీకి, అనేక నిర్వహణ లోపాలకు తావిచ్చారని ఆయన విమర్శించారు. అలాగే మండపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వంటెద్దు వెంకన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా సాగిస్తున్న చంద్రబాబు పాలనకు ప్రజలే చరమగీతం పాడతారన్నారు. లోకేష్ బాధ్యత వహించాలి : మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని రంపచోడవరం నియోజకవర్గం వెఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై రంప రోడ్డులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఆధారాలు చూపినా మంత్రి లోకేష్ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నైతిక బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలి అనర్హులకు పోస్టులు పంపకాలు చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, క్యాడర్ ధ్వజం మేధావులు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు -
ఉమ్మడి తూర్పు క్రికెట్కు అరుదైన గౌరవం
● దులీప్ ట్రోఫీకి సాయితేజ, మేనేజర్గా నాగ గంగాధర్ ఎంపిక ● హర్షం వ్యక్తంచేసిన క్రీడాభిమానులు నాగమల్లితోట జంక్షన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన ఆంధ్ర రంజీ క్రికెటర్ కావూరి సాయి తేజ ప్రతిష్టాత్మక ‘దులీప్ ట్రోఫీ’కి ఎంపికయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఒక ఆటగాడు దిలీప్ ట్రోఫీకి ఎంపిక కావడం ఉభయ గోదావరి జిల్లాల క్రికెట్కు గర్వకారణమని క్రీడాభిమానులు అంటున్నారు. పిఠాపురానికి చెందిన కె.నాగ గంగాధర్ దిలీప్ ట్రోఫీ మేనేజర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ మాట్లాడుతూ సాయి తేజ దిలీప్ ట్రోఫీకి ఎంపిక కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు. హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలుఅనపర్తి: మండల కేంద్రమైన బిక్కవోలు సత్తెమ్మపేటలో జమ్ము పార్యతి అనే వివాహిత పై 2025లో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్టు ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. తన వలలో పడలేదన్న అక్కసుతో పార్వతిని చంపాలనే ఉద్దేశంతో నిందితుడు మంత్రి అప్పలనాయుడు కత్తితో దారుణంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై ఎస్సై రవిచంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అతడిని 2025 జనవరి 24న అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కేసు విచారణానంతరం రామచంద్రపురం 13వ జిల్లా కోర్టు జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి ముద్దాయికి పై శిక్ష విధించారు. కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.సునీల్కుమార్ తన వాదనలు వినిపించారు. సాక్షులను కోర్టులో హాజరు పరిచి కేసును పర్యవేక్షించిన బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ను, కోర్టు ప్రక్రియను పర్యవేక్షించిన హెడ్ కానిస్టేబుల్ కేవీ రాఘవులును ఉన్నతాధికారులు అభినందించారు. మత్స్యకారుడి గల్లంతు కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేటకు చెందిన మత్స్యకారుడు ఓసుపల్లి అనిల్కుమార్ (26) సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనిల్కుమార్ మరో ఐదుగురు చేపల వేట నిమిత్తం ఈ నెల 2న సముద్రంలోకి వెళ్లి తిరిగి వాకలపూడి ఫిషింగ్ హార్బర్కు వస్తుండగా సోమవారం మధ్యాహ్నం అనిల్కుమార్ సముద్రంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బోటు వెనక భాగంలో ఇంజిన్ నడిపేందుకు బల్లపై కూర్చున్న అతడి కోసం తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారికి దొరక్కపోవడంతో గ్రామానికి చేరుకుని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మత్స్యకారుడు కొవ్విరి నాగబాబు ఫిర్యాదు మేరకు ఏఎస్సై పట్నాయక్ కేసు నమోదు చేశారు. అనిల్కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో సూర్యారావు పేటలో విషాదం అలముకుంది. -
పొగాకు రైతులకు బాసటగా జగన్
దేవరపల్లి: కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దేవరపల్లి వస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. స్థానికంగా వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను సోమవారం ఆయనతో పాటు ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ హోం మంత్రి తానేటి వనిత, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, విశాఖ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), ఎంపీపీ కేవీకే దుర్గారావు పరిశీలించారు. హెలీప్యాడ్ పనులు, పొగాకు వేలం కేంద్రాన్ని నేతలు పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లపై నియోజకవర్గ నాయకులతో చర్చించారు. వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ జగన్ పర్యటన నేపథ్యంలో పొగాకు రైతులకు భరోసా వచ్చిందన్నారు. ప్రత్యేకించి టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో కిలోకు రూ.10 అదనంగా, రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వచ్చిందన్నారు. ప్రభుత్వం బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు కష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నారన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సువర్ణాధ్యాయం నడిచిందన్నారు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు, గిట్టుబాటు ధర కల్పించాలని జగన్ వస్తున్నారని అన్నారు. బుధవారం దేవరపల్లి వేలం కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. ఫ రేపటి దేవరపల్లి పర్యటనను విజయవంతం చేద్దాం ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ -
5న కళాశాలల బంద్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. సోమవారం స్థానిక ఆర్జేడీ కార్యాలయం వద్ద ఆ విభాగ్ కన్వీనర్ సత్యసాయి ఆధ్వర్యంలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సుమారు రూ.6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, జీఓ నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ ఉన్నత విద్యా కళాశాలల బంద్కు పిలుపునిచ్చామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ జరిగింది. మొత్తం 219 అర్జీలను ఆమె స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడపాలి రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతి పత్రాలను ముఖ్యమంత్రికి సమర్పించాలనే లక్ష్యంతో కలెక్టర్కు అందజేసినట్లు జిల్లా జేఏసీ కన్వీనర్లు సీతానగరం రాజు, ఆకుల శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ కేఎస్పీ రావు, జోనల్ కన్వీనర్ గిడ్ల చిరంజీవి మాట్లాడూతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలన్నారు. ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీ్త్ర శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే సుమారు 4 వేల పైబడి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ఆర్టీసి ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ స్పందనను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శరాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో సోమవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ డిమాండ్ అన్నారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండగా.. తామే నిర్మిస్తామంటూ చంద్రబాబు తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో, ఆయన పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నారా, ఏటీఎంలా వాడుకుంటున్నారా అనే అనుమానం వస్తోందని అన్నారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రారంభమవుతుందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు డ్యామ్లో నీళ్లు నిలబడాలంటే పూర్తి స్థాయి భూసేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఒడిశాలో 8, ఛత్తీస్గఢ్లో 4 కలిపి మొత్తం 12 గ్రామాల్లో భూములు సేకరిస్తేనే డ్యామ్లో నీళ్లు నిలుస్తాయని ఆయన చెప్పారు. ఇది జరగాలంటే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చంద్రబాబు చర్చలు జరపాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ చేయాలన్నారు. పోలవరం డ్యామ్ నిర్మాణంలో నాణ్యత లేనందువల్లనే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చాలామంది నిర్వాసితులకు, రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతులకు భూమికి భూమి ఇస్తామన్నారని, అది ఇప్పటి వరకూ జరగలేదని చెప్పారు. ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంటేనే విశాఖపట్నం వరకూ నీళ్లు వెళ్లడంతో పాటు, 25 లక్షల ఎకరాల భూమి సాగవుతుందని తెలిపారు. ఏమీ చేయకుండా డ్యామ్ కడితే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని హర్షకుమార్ స్పష్టం చేశారు. -
యువత భవిష్యత్తుతో చెలగాటం
చాగల్లు: యువత భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. సోమవారం చాగల్లు శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో దగా డీఎస్సీపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి తలారి వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకుడు జి.శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 9,500 కోట్లతో పాటు విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాచరణలో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో కొవ్వూరులో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. 10న కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. దీనికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్బాబు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలు, బాధిత అభ్యర్థులు వెల్లడించిన అంశాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రతిభ లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గ పరిశీలకుడు డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులను ప్రభుత్వం దగా చేసిందన్నారు. సమావేశంలో రాజానగరం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ మెగా డీఎస్సీపై విచారణ చేయాలి ఫ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు డిమాండ్ -
రక్షణ జారుతోంది..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ పనుల్లో నాణ్యత లోపం బయటపడింది. రాజమహేంద్రవరం ఉమామార్కండేయ స్వామివారి ఆలయం ఎదురుగా రివర్ ఫ్రంట్ పనుల కారణంగా అక్కడ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసం అయ్యింది. పనుల నాణ్యతపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై గత ఏప్రిల్లోనే ‘సాక్షి’ దినపత్రికలో రాజమహేంద్రవరం రక్షణ గోదారిలోకే అనే శీర్షిన కథనం వచ్చింది. అయినా అధికారులు పట్టించుకోక ఇప్పుడు ఈ పరిస్థితి ఇచ్చింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా స్థానిక పద్మావతి ఘాట్ వద్ద రూ. 24 కోట్లతో రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఘాట్లను తొలగించారు. పక్కనే ఉన్న పార్కును సైతం కలుపుతూ ఒకే రివర్ ఫ్రంట్గా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఘాట్ను పూర్తిగా తవ్వేశారు. అవసరమైన మేరకు కాకుండా పక్కనే ఉన్న రోడ్డు వైపు సైతం లోతుగా తవ్వేయడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అనుభవం లేని కాంట్రాక్టర్కు ఈ పనులు అప్పగించడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పద్మావతి ఘాట్ వద్ద రూ.8 కోట్లతో అప్పర్ రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయి. ప్రవాహ ఒత్తిడి తట్టుకోగలదా..? స్థానిక పుష్కర ఘాట్ నుంచి ప్రస్తుత రివర్ ఫ్రంట్ పనులు చేపడుతున్న ఘాట్ వరకూ వరద ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరి నీరు మలుపు తిరిగే ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి వడి అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకూ గట్టుకు రక్షణగా నిలిచిన రివెట్మెంట్ను ఆధునీకరణ పేరుతో తవ్వేశారు. లోతుగా తవ్వేయడంతో అక్కడ నీరు చేరితే మట్టి జారిపోతుంది. ఫలితంగా గట్టు బలహీనపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ చేస్తున్న పనులు శాశ్వతంగా ఉంటాయని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికీ, శాశ్వతం మాట దేవుడెరుగు ఆదిలోనే కూలిపోతున్నాయి. నత్తనడకన పనులు గోదావరి రివర్ ఫ్రంట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలుత రూపుదిద్దుకున్న డిజైన్ను మార్చడంతో కాంట్రాక్టర్కు మున్సిపల్ అధికారులు బిల్లుల మంజూరును నిలిపివేశారు. దీంతో పనులకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు. డిజైన్ మార్చి తిరిగి పనులు ప్రారంభించినా, నత్తనడకన సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత కొరవడుతుంది. వరదల్లో ఘాటే రక్షణ గోదావరి రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల వల్ల గోదావరి ఘాట్లు ధ్వంసమవుతున్నాయని పురోహిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాజమహేంద్రవరం నగరానికి రక్షణగా ఈ గట్లు కీలకంగా నిలుస్తాయి. గతంలో 1953, 1986 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో గోదావరి గట్టుకు గండ్లు పడి నగరాన్ని వరద ముంచెత్తింది. ప్రజలు నానా అవస్ధలు పడ్డారు. అప్పట్లో గట్టు పటిష్టతకు పైభాగంలో రక్షణ గోడ నిర్మించారు. ఈ గోడని సైతం ప్రస్తుతం రివర్ ఫ్రంట్ పనుల్లో తొలగించారు. ఫ పుష్కర పనుల్లో డొల్లతనం ఫ రివర్ ఫ్రంట్ పనులతో గట్లకు తూట్లు ఫ వరదలతో పొంచి ఉన్న ముప్పు ఇసుక మూటలతో సరి గోదావరికి వరద ఉధృత పెరగడంతో రెండు రోజుల క్రితం ఘాట్ లోపలి భాగం నుంచి మట్టి జారిపోవడంతో ఇసుక బస్తాలను రక్షణగా పెట్టారు. ప్రారంభ దశలోనే నాణ్యత లోపం బయటపడితే వచ్చే పుష్కరాలకు కోట్లలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇటువంటి సంఘటన జరిగితే భక్తుల ప్రాణాలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. రివర్ ఫ్రంట్ పనులతో రాజమహేంద్రవరాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు తెచ్చారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంీపీ మార్గాని భరత్రామ్ దుయ్యబట్టారు. పార్టీ నాయకులతో కలసి పద్మావతి ఘాట్ వద్ద జరుగుతున్న రివర్ ఫ్రంట్ పనులను ఆయన పరిశీలించి, అనంతరం విలేకర్లతో మాట్లాడారు. -
క్రమంగా తగ్గుతూ..
ధవళేశ్వరం: స్థానిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. సోమవారం తెల్లవారుజామున 13.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రానికి 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం వెనక్కి తీసుకున్నారు. నీటి ఉధృతి మరింత తగ్గుతూ రాత్రి 8 గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,36,808 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన ఎస్పీ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని జిల్లా జడ్జి చాంబర్లో ఇటీవల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా నియమితులైన జునైద్ అహ్మద్ మౌలానాను జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. -
ముంధర కాళ్లకు బంధం
దేవరపల్లి: ముందర కాళ్లకు బంధం పడింది.. పొగాకుకు గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మార్కెట్లో తగిన ధర లభించని పరిస్థితి ఎదురైంది. పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరే మార్గం లేక ఆందోళన నెలకొంది. రూ.లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పొగాకు ఇళ్లల్లోనే మగ్గిపోతోంది. గత రెండేళ్లు మార్కెట్లో పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడడంతో 2025–26 పంట కాలంలో అధిక విస్తీర్ణంలో పొగాకు సాగు చేశారు. బోర్డు అనుమతించిన పరిమాణం కంటే అదనంగా దాదాపు 35 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగినట్టు బోర్డు అధికారుల అంచనా. బ్యారన్కు 40 క్వింటాళ్లు పండించాల్సి ఉండగా, 10 నుంచి 15 క్వింటాళ్లు అదనంగా పండించారు. ఎకరా పొగాకు సాగుకు రూ.3 లక్షల ఖర్చు అవుతుంది. కౌలు రైతులకు ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. గత ఏడాది పొగాకుకు మంచి ధర పలకడంతో ఈ ఏడాది అధిక ధరలకు భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు తీసుకుని కౌలుదారులు పొగాకు పండించారు. బ్యారన్కు సుమారు రూ. 12 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర రూ.160 నుంచి రూ.275 పలకడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ ధరకు పొగాకు అమ్మకాలు జరిపితే, ఎకరాకు సుమారు రూ. 1.60 లక్షల నష్టం వస్తోందని అంటున్నారు. ఆదుకోని ప్రభుత్వాలు పొగాకు ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది విదేశాల్లో కిలో 8 నుంచి 9 డాలర్లు పలకగా, మన పొగాకుకు 4.5 డాలర్లు వచ్చింది. ఈ ఏడాది కిలో 3 డాలర్లు పలుకుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పొగాకు పంట ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు పన్నుల రూపంలో వస్తోంది. ఇంత ఆదాయం సమకూరుతున్నా పొగాకును ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎగుమతికి అవసరమయ్యే నాణ్యమైన పొగాకును అక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ పండిన పొగాకులో నికోటిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సిగరెట్ల తయారీకి ఎక్కువ వినియోగిస్తారు. మనం పండించిన పొగాకులో 70 శాతం ఎగుమతులు కాగా, 30 శాతం దేశీయంగా వినియోగిస్తున్నారు. కంటితుడుపు స్పందన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పొగాకు రైతులకు భరోసా ఇచ్చేందుకు దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శిస్తారని తెలియడంతో అధికారులు, ట్రేడర్లలో కదలిక వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాయి. కిలోకు రూ. 10 ధర పెంచడంతో పాటు, రైతులకు వడ్డీ లేని రుణం రూ. 50 వేలు ఇవ్వడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ రుణం రెండేళ్లలో రైతులు తీర్చాల్సి ఉంటుంది. ఇది కంటితుడుపు చర్యేనని రైతులు అంటున్నారు. జగనన్న కోసం ఎదురుచూపులు పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. జగనన్న వస్తే పొగాకు ధరలు పెరుగుతాయని రైతులు గట్టి నమ్మకంతో ఉన్నారు. 2022 పంట కాలంలో పొగాకుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్లు కేటాయించి, మార్క్ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్నారు. 2014–15 పంట సీజన్లో మార్కెట్ సంక్షోభంలో ఉండగా, ప్రతిపక్ష నేతగా దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించి, ఉద్యమానికి పిలుపునివ్వడంతో స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రోజులో కిలోకు రూ. 17 ధర పెంచాయి. ఇప్పుడు మళ్లీ జగనన్న రావడం వల్ల పొగాకు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఫ గిట్టుబాటు కాని పొగాకు ధర ఫ మెరుగుపడని కొనుగోళ్లు ఫ అయోమయంలో చిన్న రైతులు దోపిడీకి గురవుతున్న రైతులు పొగాకు రైతులు దళారుల దోపిడీకి గురవుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. రైతులను గాలికి వదిలేసి, మూడు నెలల తర్వాత రూ. 10 పెంచి రైతులను దగా చేస్తున్నారు. కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయి. సగటు ధర కిలో రూ. 350 ఉంటే గిట్టుబాటు అవుతుంది. –జ్యేష్ఠ తారకరామారావు, పొగాకు రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం ప్రభుత్వాలు పట్టించుకోక.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్నాం. కిలోకు రూ. 350 పెట్టుబడి పెట్టి పొగాకు పండిస్తే మార్కెట్లో రూ.160 లభిస్తోంది. దాదాపు కిలోకు 190 నష్టం వస్తోంది. ఈ ఏడాది 130 ఎకరాల్లో పొగాకు వేశాను. 1,200 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. కిలో రూ. 160 నుంచి 170 చొప్పున 400 క్వింటాళ్లు అమ్మాను. ఇంకా 800 క్వింటాళ్లు పొగాకు అమ్మాల్సి ఉంది. ఈ ఏడాది పొగాకు రైతు దోపిడీకి గురవుతున్నాడు. – సయ్యద్ బాజీ, పొగాకు రైతు, అచ్చియ్యపాలెం, బుట్టాయిగూడెం మండలం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 16,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఎయ్టీన్.. అందుకో వజ్రాయుధం!
పిఠాపురం: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. ఆ హక్కు రావాలంటే 18 ఏళ్లు నిండాలి. అందుకోసం ఇప్పటి వరకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి కోసం యువత వేచి చూడాల్సి వచ్చేది. తాజా నిబంధనల ప్రకారం 17 ఏళ్లు నిండగానే వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది ఈసీ. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18 ఏళ్లు పూర్తిగా నిండిన తరువాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదవుతుంది. ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఈసీ ఏడాదికి నాలుగు తేదీల్లో మాత్రమే వీలు కల్పించింది. ఆ మేరకు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో ఫారం 6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త నిబంధనలు ఇలా 17 ఏళ్లు నిండిన యువత తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని బీఎల్ఓలు పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే 18 ఏళ్ల తరువాత ఓటు హక్కు కల్పిస్తారు. ఈ మేరకు జిల్లాలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. యువ ఓటర్లు పెరిగే అవకాశం ఈసీ తాజా నిర్ణయంతో జిల్లాలో సుమారు 29 వేల మందికి పైగా యువతకు ఓటు హక్కు లభించనుంది. జిల్లాలో 2023–24 పదో తరగతి విద్యార్థులు 27,600 మంది, ఇందులో బాలురు 13,100 మంది, బాలికలు 14,500 మంది, మధ్యలో చదువు మానేసిన వారు (8, 9 తరగతులు), ఇతరులు 3,500 మంది మొత్తం 30 వేలకు పైగా విద్యార్థులున్నట్లు ఉన్నట్లు అంచనా. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది విద్యార్థులు నేడు 17–18 ఏళ్ల గ్రూపులోకి వస్తున్నారు. వారితో పాటు ఇతర వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు సుమారు 10 వేల మంది ఉంటారని అంచనా. స్థూలంగా జిల్లాలో సుమారు 40 వేల మందికి ఓటు హక్కు లభించే అవకాశం ఉంది. 17 ఏళ్లకే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏడాదికి నాలుగు తేదీలు ప్రకటించిన ఎన్నికల సంఘం జిల్లాలో 40 వేల వరకూ పెరగనున్న యువ ఓటర్లు -
మరో ఘాట్ రోడ్డు ప్రతిపాదన అమలై ఉంటే..
2023లో దేవస్థానం ఈఓగా పనిచేసిన ప్రస్తుత అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో ఆయన సత్యగిరి నుంచి గిరిప్రదక్షిణ రోడ్డులోకి మరో ఘాట్రోడ్ ప్రతిపాదించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరం, విజయవాడ వైపు వాహనాలను ఆ రోడ్డు మీదుగా గిరిప్రదక్షణ రోడ్డుకు అక్కడ నుంచి జాతీయ రహదారికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఆయన అన్నవరం నుంచి బదిలీ అవ్వగానే అది అమలుకు నోచుకోలేదు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తయి ఉంటే నిత్యం భక్తుల వాహనాలు అటువైపు కూడా ప్రయాణించేవి. అందువలన ఆక్రమణలకు అవకాశం ఉండేది కాదు.సత్యగిరి కొండ పూర్తి స్థాయిలో సర్వే చేసి ఫెన్సింగ్ వేయిస్తాం గిరిప్రదక్షణ రోడ్డులో సత్యగిరి కొండను ఆనుకుని పోడు వ్యవసాయం చేసిన భూమి దేవస్థానానిదేనని సర్వేలో తేలింది. దీంతో అక్కడ పరికరాలు స్వాధీనం చేసుకున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఆక్రమణలు జరుగకుండా మొత్తం సత్యగిరి కొండపై దేవస్థానం భూమి అంతా సర్వే చేయాలని ఆదేశించాం. మంగళ, బుధవారాల్లోనే సర్వే ప్రారంభమవుతుంది. సర్వే అయిన తరువాత పది అడుగులకొక స్తంభం పాతి ఫెన్సింగ్ చేయిస్తాం. దేవస్థానానికి చెందిన అంగుళం భూమి కూడా వదిలే ప్రసక్తే లేదు. – నల్లం సూర్య చక్రధరరావు, ఈవో , అన్నవరం -
ఆశీలు కథాసంపుటి ఆవిష్కరణ
బోట్క్లబ్: మానవ జీవితం ప్రతిబింబించే ఆలోచనలు, వాటి నియంత్రణలో జీవన విధానంలో ఏర్పడే సంఘర్షణల నేపథ్యంలో వెలుగు చూసిన కథాసంపుటి అశీలు అని ప్రముఖ సాహితీవేత్త అవధానుల మణిబాబు అన్నారు. రచయితీ, వైద్యురాలు కాళ్ళుకూరి శైలజ రచంచిన ఆశీలు కథాసంపుటి ఆవిష్కరణ స్థానిక రామారావుపేట వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో సోమవారం జరిగింది. మణిబాబు పుస్తకాన్ని ఆయన విశ్లేషణ చేశారు. ప్రముఖ రచయిత దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ రచయిత శైలజ తన ఆలోచనలకు, భావజావానికి ఇష్టమైన అంశాన్ని ఎంచుకొని సామాజిక పరిస్థితుల ప్రాతిపదికగా పరిష్కారం ఉండాలని, దేశంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలే కథారచన నడిచిందన్నారు. వారి వృత్తిలో తారసపడే యవ్వన వయస్సు, విద్యార్థి దశలో ఎదురుచూస్తున్న ప్రేమవంటి సమస్యల ఆధారంగా రచన సాగిందని వివరించారు. ప్రచార సభ ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ శైలజ వృత్తిలో నిబద్ధత మనసును చూడగలిగిన గొప్ప రచయిత అన్నారు. రాబోయే తరాల యువతకు ఎలా చదవాలో మార్గదర్శకత్వం చేశారన్నారు. గట్టి కృష్ణ దేవరాయలు, మేకా మన్మథరావు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, గొట్టుముక్కుల వెంకట సత్యనరసింహశాస్త్రి పాల్గొన్నారు. పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని వ్యక్తి ఆత్మహత్యఆత్రేయపురం: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో అలిగిన ఒక భర్త తన పీక తనే కోసుకుని మృతి చెందిన సంఘటన ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో చోటుచేసుకుంది. సుజాత కోళ్ల ఫారంలో బోయిన భోజప్ప (24) పనిచేస్తున్నాడు. ఒక నెల నుంచి అనారోగ్యం కారణంగా అతడి భార్య అక్షయ పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో అలిగిన భర్త తీవ్ర మనస్థాపంతో ఆదివారం రాత్రి కత్తితో తన పీకను తనే కోసుకుని మృతి చెందాడు. దీనిపై అతని తండ్రి బోయిన దాసు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.రాము తెలిపారు. విద్యుత్ షాక్తో కార్మికుడి మృతిదేవరపల్లి: పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా విద్యుత్ షాక్కు గురై కార్మికుడు మృతి చెందిన సంఘటన నల్లజర్ల మండలం జగన్నాథపురంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తేంకల ధర్మయ్య (30) కౌలు రైతు పాములరాజు ఆయిల్పామ్ తోటలో గెలలు కోయడానికి పనికి వెళ్లాడు. గెలలు కోస్తుండగా ఇసుప రాడ్డు కత్తి ప్రమాదవశాత్తూ చెట్లపై ఉన్న విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధర్మయ్య అక్కడకక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదంకంబాలచెరువు: స్థానిక జాంపేట చేపలమార్కెట్ వద్ద ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ భవనం పైకప్పు గోడ కుప్పకూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మున్సిపల్ కాంప్లెక్స్ భవనం శిథిలమైంది. అందులోని రెండు అంతస్తుల్లో వ్యాపార సముదాయాలు నడుస్తున్నాయి. నిత్యం ఆ ప్రాంతంలో రద్దీగా ఉంటుంది. వర్షాల కారణంగా పూర్తిగా నానిపోయి పై అంతస్తు గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భవనం మొత్తం పాడై, వర్షాలు వస్తే పైకప్పు నుంచి నీరు లీకవుతోందని దుకాణదారులు చెబుతున్నారు. ప్రియురాలి ఫిర్యాదు.. ప్రియుడి అరెస్ట్కాకినాడ క్రైం: ఎంబీఏ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ప్రేమ చివరికి కేసు పెట్టి అరెస్టు చేయించేంత వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే, కాకినాడ డ్రైవర్స్ కాలనీకి చెందిన పట్టా తేజ నరసింహస్వామి (22) సూరంపాలెంలోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే తరగతిలో కాకినాడకు చెందిన ఓ విద్యార్థిని చదువుతోంది. కొన్నాళ్లుగా వీరిరువురు ప్రేమించుకుంటున్నారు. తనతో చనువుగా ఉండి కొద్ది రోజుల క్రితం స్థానిక వెంకట్నగర్లో ఓ లాడ్జికి తీసుకువెళ్లి స్వామి అత్యాచారం చేశాడ ని ఆ విద్యారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇష్టపూర్వకంగానే ఉంటూ యువతి తప్పుడు కేసు పెట్టిందని యువకుడి తల్లిదండ్రులు, సహ విద్యార్థులు అంటుంటే, తనను వంచించాడని యువతి, ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. -
సత్యగిరిపై ఇదేం కిరికిరి?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి సత్యగిరి కొండ భూమి అంతా దేవస్థానం ఆధీనంలోనే ఉందా లేక అక్కడక్కడ ఆక్రమించారా అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గిరి ప్రదక్షిణ మార్గంలో పంపా ఘాట్ సమీపాన కొందరు దర్జాగా కొండపోడు చేసి మామిడి మొక్కలు నాటిన విషయం తెలిసిందే. అయితే ఆ కొండపోడు స్థలం దేవస్థానానిదేనని సోమవారం రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఇది రోడ్డు పక్కనే కనుక కొద్ది రోజుల తరువాత అయినా అధికారులు తెలుసుకోగలిగారు. కానీ కొండ మీద జరిగుంటే తెలిసేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 303 ఎకరాలు దేవస్థానంలోనే ఉన్నాయా.. 1998లో రెవెన్యూ విభాగం నుంచి కొనుగోలు చేసిన 303.88 ఎకరాల సత్యగిరికొండ అంతా దేవస్థానం అధీనంలోనే ఉందా? లేక ఆక్రమణలోనే ఉందా? రైతుల పేరుతో ఎవరైనా ఆక్రమించారా? 1998లో నిర్ణయించిన సరిహద్దులు అలాగే ఉన్నాయా లేక మధ్యలో ఎవరైనా మార్పు చేశారా? దేవస్థానం అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులకు అవకాశంగా మారిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. సత్యదేవుడు వెలసిన రత్నగిరి కొండపై దేవస్థానం వివిధ నిర్మాణాలు చేపట్టడంతో సత్రాలు కట్టడానికి ఎక్కడా స్థలం లేని పరిస్థితి. దీంతో 1998లో అన్నవరం దేవస్థానం వివిధ నిర్మాణాల కోసం రత్నగిరి కొండను ఆనుకుని ఉన్న తొండంగి మండలం బెండపూడి పరిధిలోని సత్యగిరి కొండపై 303.70 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ కొండపై 139 గదుల హరిహరసదన్, 138 గదుల శివసదన్ సత్రాలు, పది ఎకరాల్లో స్మార్త, ఆగమ పాఠశాల, మరో రెండెకరాల్లో 36 మ్యారేజీ హాల్స్ కలిగిన విష్ణుసదన్ నిర్మించారు. అదే విధంగా రెండు ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మిగిలిన కొండ ఖాళీగా ఉండగా దాని చుట్టూ సరిహద్దుగా స్తంభాలు పాతి రాళ్లతో గోడ కట్టారు. అయితే ఆ గోడను పడగొట్టి కొండను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ రోడ్డును ఆనుకుని తవ్వకాలు ఇటీవల గిరిప్రదక్షిణ రోడ్డును ఆనుకుని ఉన్న కొండను పోలవరం అధికారులు తవ్వుతుండగా సత్యగిరి తవ్వేస్తున్నారని కొంతమంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అది దేవస్థానం సరిహద్దుకు దిగువన ఉన్న స్థలమని అధికారులు తెలిపారు. కాగా, తాజాగా పోడు వ్యవసాయం పేరుతో చదును చేసిన స్థలం దేవస్థానానిదేనని సర్వేలో నిర్ధారణ అయింది. అయితే ఒక చోట ఉన్న స్థలం దేవస్థానానిది కాకపోవడం, వేరోచోట అదే సరిహద్దుగా ఉన్న స్థలం దేవస్థానానిది అని సర్వేలో తేలడంతో అంతా గందరగోళం నెలకొంది. పూర్తి సర్వేతోనే ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. భూమికి హద్దూ.. ఆక్రమణకు అదుపు లేదు అన్నవరం దేవస్థానం భూమిపై విచిత్ర పరిస్థితి డీ పట్టా కాదు...ఆ ‘పోడు’ భూమి దేవస్థానానిదేనని సర్వేలో వెల్లడి భూమిలో ఆక్రమణదారుడు ఏర్పాటు చేసిన డ్రమ్ముల స్వాధీనం -
పుల్లలు వద్దు.. ప్రాణాలే ముద్దు
● గోదావరిలో దిగితే మృత్యువును కోరుకున్నట్లే ● అధికారుల నిఘా ఉన్నా తప్పని ప్రమాదాలుఆలమూరు: గౌతమి గోదావరికి వరద వచ్చిందంటే చాలు గౌతమీ నది పరీవాహక ప్రాంతాల వెంబడి ప్రాంతాల్లో అధికంగా పుల్లల వేట జరుగుతూంటుంది. ఈ క్రమంలో ఎందరో యువకులు గోదావరిలో పుల్లలు సేకరించి అమ్ముకోవాలనే మోజులో ప్రాణాల్ని సైతం లెక్కచేయక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినా ఏటా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో వరద ఉధృతి సమయంలో ‘పుల్లల వేట వద్దు–ప్రాణాలే ముద్దు’ అంటూ ప్రచారం చేస్తున్నా పూర్తి స్థాయిలో పుల్లలవేట మాత్రం అదుపు కావడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని మూడు జిల్లాలోని వివిధ మండలాల్లోని అనేక గ్రామాల్లో గోదావరి ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గౌతమి, వశిష్ట పాయలు విడిపోయి ఉధృతంగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ పరిస్థితుల్లో గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చే కలప దుంగలు, పుల్లల కోసం వరదల సమయంలో వేట జరుగుతూ ఉంటుంది. కొందరికి జీవనోపాధి గోదావరిలో ఏటా లభ్యమయ్యే కలప సేకరణ ఇప్పటికీ కొందరికి జీవనోపాధిగా ఉంది. నదీ పరీవాహక ప్రాంత వాసులు గోదావరికి వరద వస్తుందంటే పుల్లలు, కలపపైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే పుల్లలవేట ప్రమాదకరమని తెలిసినా కొన్నిచోట్ల పడవలు వేసుకువెళ్లడం గాని, ఈత కొట్టుకుని వెళ్లి కలపను సేకరించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఒక్కోసారి అదుపుతప్పి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా అధికారుల ప్రత్యేక నిఘా ఎక్కువగా ఏర్పాటు చేయడంతో పుల్లల వేట పూర్తిగా తగ్గినా ఇంకా అనేక చోట్ల కొనసాగుతుంది. అవగాహనతోనే నియంత్రణ జిల్లాలో నదీ పరీవాహక మండలాల్లోని అనేక గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా అనేక మంది మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈప్రమాదాలపై కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అనేక మంది ఆచూకీ లేకుండా పోతుంది. మరికొన్ని సందర్భాల్లో పోలీసుల దృష్టికి రావడం లేదు. అయినా ఇంత ప్రాణనష్టం జరిగినా పుల్లల వేటను వదిలేసేందుకు తీర ప్రాంతవాసులు అంగీకరించకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు స్పందించే కన్నా ఏటా వరదల సమయంలో పుల్లల వేట అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేస్తే మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. -
ఎల్లుండి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి బుధవారం (ఆగస్టు5) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు పొగాకు రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకుంటారు. రైతుల సమస్యలు, ఇబ్బందులపై వారితో నేరుగా చర్చిస్తారు. -
జంగిల్ రాజ్.. తలుపులు పగులగొట్టి అర్ధరాత్రి అరెస్టులా?: భరత్ ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో జంగిల్ రాజ్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. పోలీసులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకు?. కంప్యూటర్ హార్డ్ డిస్క్లను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు?. ఎల్లప్పుడూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండరు.. మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే సోదరుడి చేయి విరగొట్టారు. చంద్రబాబు డైరెక్షన్లో కేవలం బీసీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయికారుమూరి సునీల్, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు.. ఇలా బీసీ నేతలందరినీ అరెస్టు చేస్తున్నారు. బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్టులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు... కచ్చితంగా పోలీసులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులను న్యాయస్థానం ముందు నిలబెడతాం. పొగాకు రైతులకు అండగా ఉండేందుకు ఈనెల ఐదో తేదీన వైఎస్ జగన్ దేవరపల్లి టొబాకో బోర్డుకి వస్తారు.డబల్ ఇంజిన్ సర్కార్ అని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది?. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో శిలాఫలకం టీడీపీ ప్రభుత్వం వేసేసింది. 2900 ఎకరాలు వైఎస్సార్సీపీ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టుకు ఇచ్చారు. -
నష్టమే వస్తోంది
మార్కెట్లో పొగాకు ధరలు ఇలానే ఉంటే కోలుకోవడం కష్టం. మూడెకరాల దేవస్థానం భూమి కౌలుకు తీసుకుని పొగాకు పంట వేశాం. ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం కిలో రూ. 275 పలుకుతుంది. ఈ ధరకు పొగాకు అమ్మితే రూ. 5 లక్షల నష్టం వస్తోంది. గత ఏడాది గిట్టుబాటు ధర రావడంతో ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి మరీ పంట వేశాను. – దొడ్డిగర్ల ప్రభాకరరావు, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం కౌలు సొమ్ము రాని పరిస్థితి మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి పంట వేశాను. ఎకరాకు రూ. 3.20 లక్షల ఖర్చు అయ్యింది. రెండు బ్యారన్లు రూ. 5 లక్షలు, 8 ఎకరాల భూమి రూ. 5 లక్షలకు అద్దెకు తీసుకుని పంట వేశాను. మార్కెట్లో ధర ఇలాగే ఉంటే సుమారు రూ. 15 లక్షల నష్టం వస్తుంది. ప్రభుత్వం కౌలు కార్డు కూడా ఇవ్వలేదు,. జగనన్న ప్రభుత్వంలో కౌలు కార్డులు ఇచ్చారు. కౌలు సొమ్ము కూడా రాని పరిస్థితి. – గుమ్మడి శివాజీ, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం -
కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ విద్య
● ఎమ్మెల్సీ గోపి మూర్తి ● యూటీఎఫ్ జిల్లా కార్యాలయం ప్రారంభంరాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన విధానాలతో ప్రభుత్వ విద్యా రంగాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని ఎమ్మెల్సీ గోపిమూర్తి అన్నారు. యూటీఎఫ్ జిల్లా నూతన కార్యాలయం అప్పారి వెంకటస్వామి యూటీఎఫ్ భవన్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈవీవీఎస్ఆర్ ప్రసాద్, ఎంఏ షరీఫ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన యూటీఎఫ్ సభ్యులందరికీ ఉద్యమాభినందనలు తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు ఉద్యమ సైనికులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సమాజాన్ని మేలు కొలపడంతో ఉపాధ్యాయులది కీలక బాధ్యతన్నారు. ఐఆర్, పీఆర్సీలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థుల పెరుగుదలకు కృషి చేసిన ఉపాధ్యాయులను సెప్టెంబర్ ఐదున విజయవాడలో సత్కరించనున్నట్టు తెలిపారు. సీపీఎస్ రద్దుపై సాధించిన విజయానికి ఈ నెల 16న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ 1983 నుంచి తనకు యూటీఎఫ్తో అనుబంధం ఉందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు మందగించిన సమయంలో విద్యార్థి ఉద్యమాలే కొత్త ఊపు తీసుకువచ్చాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా కార్యాలయం ప్రభుత్వ విద్య, ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలను యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపక నాయకుడు స్వర్గీయ అప్పారి వెంకటస్వామి కుమారుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అప్పారి సత్య ప్రకాష్, ఎస్టీఎఫ్ఐ జాతీయ మాజీ కార్యదర్శి అరుణ కుమారి రాష్ట్ర, జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ వాసుదేవరావు, యూటీఎఫ్ జిల్లా కమిటీ ప్రతినిధి పి.జయకర్, రూపస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి కిటకిట
● స్వామివారిని దర్శించిన 30 వేల మంది భక్తులు ● రూ.35 లక్షల ఆదాయం ● రూ.రెండు వేల వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించి రెండు వేల వ్రతాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ. 35 లక్షలు ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన పథకంలో ఆరు వేల మంది భోజనం చేశారని అధికారులు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల రథసేవను మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,101 విరాళం సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన దాసరి మోహన్రెడ్డి ఆదివారం రూ.1,00,101 విరాళాన్ని సమర్పించారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్ 29న దాసరి లోక్ ఆర్యనాథ్ పేరున అన్నదానం చేయాలని కోరారు. దాతకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి ప్రసాదం, చిత్రం, అన్నదానం బాండ్ అందజేశారు. -
అడ్మిషన్లపై ఇంకా అయోమయమే!
● డిగ్రీలో ప్రవేశాలకు విద్యార్థుల ఎదురుచూపు ● నోటిఫికేషన్ విడుదల కాక అవస్థలు ● ప్రత్యామ్నాయాల వైపు పయనం ● డిగ్రీ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లు రాయవరం: ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలై మూడున్నర నెలలు అవుతున్నాయి. నేటికీ డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. జూలై లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. ఈ ఆలస్యం వల్ల వేలాది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కోనసీమ జిల్లా పరిధిలోని 171 డిగ్రీ కళాశాలలు రాజానగరంలోని ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటుగా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో 32 వేల మంది అడ్మిషన్లు పొందారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుండగా, సుమారు వంద వరకూ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో అందిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో కొన్ని సీట్లు మిగిలిపోతున్నట్లు సమాచారం. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయినా డిగ్రీ ప్రవేశాలకు మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయక పోవడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిగ్రీ కళాశాలల వివరాలు ఇవీ.. జిల్లా ప్రభుత్వ ప్రైవేటు అటానమస్ కోనసీమ 07 45 01 తూర్పు 06 40 01 కాకినాడ 05 46 03తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇంటర్ ఫలితాలు విడుదలై మూడున్నర నెలలు గడుస్తున్నా నేటికీ ప్రవేశాలు చేపట్టకపోవటం దారుణం. జూలై మొదటి వారంలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభించాలి. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్ జారీ చేయాలి. – ఎస్.కిరణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూ, రాజమహేంద్రవరం నేడో, రేపో విడుదలయ్యే అవకాశం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం. – డాక్టర్ కె.పెద్దిరాజు, ప్రిన్సిపాల్, వీకేవీ ప్రభుత్వ డిగ్రీ ఐడీ కళాశాల, కొత్తపేట -
జనసంద్రమైన లోవ
● భక్తులతో కిక్కిరిసిన తలుపులమ్మ ఆలయం ● అమ్మను దర్శించిన 65 వేల మంది భక్తులు ● కై లాస గణపతికి ఘనంగా లక్ష గరిక పూజ తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ తల్లి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని పండితులు శాకంబరిగా అలంకరించారు. అలాగే అర్చకులు కై లాస గణపతికి లక్ష గరిక పూజ చేశారు. క్యూలైన్ల ద్వారా 65 వేల మంది అమ్మవారిని దర్శించినట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు జగన్నాథగిరి జంక్షన్ మీదగా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ఇతర జిల్లాల భక్తులు చేపూరు మీదగా ఆలయానికి చేరుకోవడంతో రహదారులు రద్దీగా మారాయి. ఇక్కడి వసతి గదులు నిండుకోవడంతో భక్తులు వంటలు, భోజనాలకు చెట్ల కింద, ఉచిత షెడ్లు, కొండ దిగువన ప్రైవేట్ కాటేజీలు, మామిడి తోటలను ఆశ్రయించారు. రూ.17.4 లక్షల ఆదాయం అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాల కొనుగోళ్లతో రూ.4,79,760, పూజా టికెట్లకు రూ.9,77,900, కేశఖండనశాలకు రూ.35,120, వాహన పూజలు, ఇతర సేవా టికెట్లకు రూ.24,260, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.1,10,730, విరాళాలు రూ.84,382, వేదాశీర్వచనం రూ.28,458, వెరసి మొత్తం రూ.17,40,610 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఎవరైతేనేం..!
● అన్నదాతలపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు ● పంటల బీమా చెల్లించాల్సిందేనని హుకుం ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అమలుపంట సాగు చేస్తున్న రైతులురాయవరం: రైతు ప్రభుత్వమని చెబుతూనే, నడ్డివిరిస్తోంది.. పచ్చని సిరులు పండించే రైతులను నట్టేట ముంచుతోంది.. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు కుంగదీస్తుంటే, మరోపక్క పంటల బీమా భారాన్ని మోపుతోంది. అన్నదాతలకు ఆపద కాలంలో అండగా నిలిచే, పంటల బీమా పథకం ప్రస్తుతం భారంగా మార్చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలైన ఉచిత పంటల బీమా విధానానికి చంద్రబాబు సర్కారు స్వస్తి పలికింది. ప్రస్తుతం రైతులే బీమా ప్రీమియం చెల్లించాలని ఆదేశించడంతో జిల్లాలోని రైతుల్లో కలవరం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో 41,740,885 ఎకరాలకు పంటల బీమా చేయించాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. అయితే ఈ నెల 1వ తేదీ నాటికి 13.64 శాతం మాత్రమే పంటల బీమా పూర్తయ్యింది. అలాగే 4,786 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే అరటిని పంటల బీమా పథకం కిందకు తీసుకు రావాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 54.977919 ఎకరాలను (1.2 శాతం) పంటల బీమా కింద నమోదు చేయించుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. బ్యాంకు నుంచి పంటపై రుణం తీసుకోని రైతులు ఎకరాకు రూ.570 ప్రీమియం చెల్లించాలి. సర్వర్ సమస్యతో సతమతం పంటల బీమా పథకంలో ప్రీమియం చెల్లించాలనుకునే రైతులకు ఒకపక్క ఆర్థిక భారం ఉంటే, మరోపక్క సర్వర్ సమస్య తోడైంది. పంటల బీమా పథకాన్ని వినియోగించుకోవాలనే రైతులకు ఆన్లైన్లో సర్వర్ సమస్య వెంటాడుతోంది. ప్రతి రైతు మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లో బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో ముందుగా రైతు వివరాల నమోదు వేగంగా తీసుకున్నా.. క్రాప్ వివరాలు, సర్వే నంబరు ఎంటర్ చేసిన తర్వాత సర్వర్ సమస్య వస్తోంది. అక్కడి నుంచి దరఖాస్తు ముందుకు సాగడం లేదు. దీంతో రైతులు అధిక సమయం వెచ్చించలేక కూడా వెనకంజ వేస్తున్నారు. గతమెంతో ఘనం రైతు శ్రేయస్సే ధ్యేయంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాగింది. జిల్లాలో సాగు చేసే రైతుల తరఫున బీమా ప్రీమియం మొత్తం చెల్లించింది. దీంతో రైతులు మీసేవా కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని తప్పింది. బీమాను రైతుల తరఫున జగనన్న ప్రభుత్వమే చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పరిహారం సకాలంలో అందేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లలో రైతులు ఒక్క రూపాయి బీమా పొందిన దాఖలాలు లేవు. గతేడాది ఖరీఫ్ ముగిసే సమయంలో అక్టోబర్ నెలలో వచ్చిన మోంథా తుపాన్ కారణంగా పంట నష్టం జరిగినా, పంటల బీమా సక్రమంగా అమలు కాక రైతులు ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం ఏ ఒక్క రైతుకూ చెల్లించలేదు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇబ్బందిగా మారింది ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. ఇప్పుడు పంటల బీమా ప్రీమియం కూడా రైతులే కట్టాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవా కేంద్రాలకు వెళ్లి చెల్లించాలంటే ఎంత మంది వెళ్లి చెల్లిస్తారు. పంట నష్టపోతే ఆదుకునే బీమా కోసం కూడా రైతులే డబ్బులు చెల్లించాల్సి రావడం భారంగా మారింది. – చేవా సత్యనారాయణ, రైతు, లొల్ల, రాయవరం మండలం చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిందొకటి, ఇప్పు డు చేస్తుందొకటి. రైతులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగలే క పంటల బీమా ప్రీమియం చెల్లించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి కష్టం లేకుండా పూర్తి ప్రీమియం ఉచితంగా చెల్లించింది. ఆ ప్రయోజనాలు రైతులు పొందారు. – సబ్బెళ్ల కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి -
సరైన సన్నద్ధత లేక..
● ఆన్సర్ బుక్లెట్స్ సరఫరాలో జాప్యం ● ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా ● తిరిగి 17 నిర్వహిస్తామని ప్రకటన రాయవరం: పరీక్షలు అన్నారు.. ఆన్సర్ బుక్లెట్స్ (జవాబు పత్రాల పుస్తకాలు) సరఫరాలో జాప్యం చేశారు.. దీనివల్ల చివరికి పరీక్షలను వాయిదా వేశారు.. సెల్ఫ్ అసెస్మెంట్–1 పరీక్షల నిర్వహణకు సరైన సన్నద్ధత లేకపోవడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి సెల్ఫ్ అసెస్మెంట్–1 పరీక్షలు జరగాల్సి ఉంది. వివిధ కారణాలతో ఈ పరీక్షలను 17వ తేదీకి వాయిదా వేశారు. విద్యార్థి అభ్యసనాన్ని మదింపు చేసేందుకు విద్యాశాఖ ప్రతి ఏటా నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. 2026–27 విద్యా సంవత్సరంలో ఈ పరీక్షలను ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించాలి. గత విద్యా సంవత్సరం నుంచి పరీక్షలను విద్యార్థులు విధిగా అసెస్మెంట్ పుస్తకాల్లోనే రాస్తున్నారు. విద్యార్థులకు ఆన్సర్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ పరీక్షలను ఈ నెల 17కు వాయిదా వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1 పరీక్షలు 17 నుంచి నిర్వహిస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా ఆగస్టు 3వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు సవరించిన షెడ్యూల్ మేరకు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో సెల్ఫ్ అసెస్మెంట్–1 పరీక్షలను వాయిదా వేసి ఈ నెల 16వ తేదీ తర్వాత నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాల కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మారిన షెడ్యూల్ ఇలా.. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు తాజాగా షెడ్యూల్ ప్రకటించారు. తాజా షెడ్యూల్ ప్రకారం 1–5 తరగతుల విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తారు. 17న తెలుగు, గణితం, 18న ఇంగ్లిషు, పరిసరాల విజ్ఞానం, 19న ఓఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, మధ్యాహ్నం 2.45 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వీరికి 17న తెలుగు, గణితం, 18న హిందీ, జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, 19న ఇంగ్లిషు, సోషల్, 20న 8 నుంచి 10 తరగతులకు బయలాజికల్ సైన్స్, ఓఎస్ఎస్సీ, 6, 7 తరగతులకు ఓఎస్ఎస్సీ, 8, 9, 10 తరగతులకు ఓఎస్ఎస్సీ–2 పరీక్ష నిర్వహిస్తారు. -
ఉరకలు..పరుగులు
● నిండుకుండలా గోదావరి ● కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు ● ఎగువన క్రమంగా తగ్గుతున్న వరద సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉరకలు.. పరుగులు పెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి నిండుకుండలా మారింది. ఆదివా రం ఉదయానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 15 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో 14,40,621 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి క్రమంగా వరద నీటి ప్రవాహం తగ్గుతున్నా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి కాటన్ వద్ద 14.6 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. మరోవైపు మూడు డెల్టా కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అం‘తోటా’ మునకే.. ● వరద ఉధృతి పెరగడంతో కిందకు భారీగా నీరు విడిచిపెట్టడంతో పెరవలి మండలంలోని లంకలు నీట మునిగాయి. ఫలితంగా లంకల్లో సాగు చేస్తున్న అరటి, కంద, ఆయిల్పామ్, జామ, పూల తోటలు, కూరగాయల పంటలు ముంపుబారిన పడ్డాయి. సుమారు 2300 ఎకరాల్లో పంటలు వరద నీట ఉన్నాయి. ● గోదావరి పరీవాహక గ్రామాలైన సీతానగరం మండలం పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, సీతానగరం, రఘుదేవపురం తదితర గ్రామాల్లో లంక భూములు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న దోస, ఆనబ పాదులు, 12 ఎకరాల్లో బొప్పాయి, 40 ఎకరాల్లో దొండపాదులు, 20 ఎకరాల్లో అరటి తోటలు నీట మునిగాయి. ● మద్దూరులంక, పల్లిపాలెంలోని 17 కుటుంబాలకు చెందిన 39 మందిని మద్దూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ● రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లోకి భక్తులు, పర్యాటకుల ప్రవేశాన్ని రెండో రోజు కూడా నిలిపేశారు. పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి వరద నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద వరద ఉధృతి ముక్కామలలో నీటమునిగిన ఆయిల్పామ్ తోటతీపర్రు పుష్కరాల రేవులో శివుడు విగ్రహం చెంతకు చేరిన వరద -
బెధరగొట్టేలా..
● ఒడిదొడుకుల్లో వర్జీనియా పొగాకు మార్కెట్ ● రైతులకు గిట్టుబాటు కాని ధర ● లో గ్రేడ్కు ఆసక్తి చూపని ట్రేడర్లు ● రూ.10 పెంచి రూ.30 కోత దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ఒడిదొడుకుల్లోనే సాగుతోంది.. నాలుగు నెలలుగా ధరలో ఎటువంటి పురోగతి లేకపోయింది. ఈ ధరకు అమ్మాలా.. వద్దా అనే సందిగ్ధం రైతుల్లోనెలకొంది. జూలై నెలాఖరులో ధరలు పెరుగుతాయని అంతా ఆశించారు. ఆ ఆశలకు ట్రేడర్లు పొగ పెట్టారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది కిలో రూ. 265 ధరతో కొనుగోళ్లు ప్రారంభం కాగా, మొన్నటి వరకు ఇదే ధర కొనసాగింది. ఈ ధర బ్రైట్ పొగాకుకు మాత్రమే పలకగా, లో గ్రేడు (ఎక్స్) పొగాకుకు రూ. 160 వచ్చింది. ఎక్కువ శాతం పొగాకు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో గిట్టుబాటు కాక రైతులు దిగాలు పడ్డారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దాదాపు 110 రోజులు కొనుగోళ్లు జరగ్గా, ఇప్పటి వరకు కేవలం 10.73 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. పండించిన పంటలో కనీసం 10 శాతం కూడా కొనకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ పొగాకు అక్కడే ఉంది. ఏటా ఈ సమయానికి సుమారు 80 శాతం కొనుగోళ్లు జరిగేవి. గత ఏడాది 210 రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి కాగా, ఈ ఏడాది జనవరి వరకు కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. కొనుగోళ్లు ఆలస్యమైతే పొగాకు రంగు, నాణ్యత దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పొగాకు నాణ్యత దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. ఈ నెల 15 నుంచి 2026–27 పంట సీజన్ ప్రారంభం కానుంది. దీంతో గత పంట సీజన్లో పండించిన పొగాకు అమ్మకాలు పూర్తి కాకుండానే, కొత్త పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కోలుకోవడం కష్టం పొగాకు ధర లేక రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ. 453 పలకగా, ఈ ఏడాది రూ. 275 పలకడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. సగటు ధర రూ. 170 పలుకుతుంది. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఉత్పత్తి వ్యయంతో పాటు భూముల కౌలు, బ్యారన్ల అద్దె, పెట్టుబడి పెరగడంతో కిలోకు సగటు ధర రూ. 350 ఇవ్వకపోతే కోలుకోవడం కష్టమని చెబుతున్నారు. 10.73 మిలియన్ల కిలోల విక్రయాలు రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 257.74 కోట్ల విలువైన 10.73 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 1.56 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 2.33 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 2.48 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 2.20 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 2.15 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ. 275, కనిష్ఠ ధర రూ. 161, సగటు ధర రూ. 243.43 లభించింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకు వచ్చిన పొగాకు బేళ్లు -
రివర్ ఫ్రంట్ పనుల తనిఖీ
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపడుతున్న రివర్ ఫ్రంట్ పనులను వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆదివారం తనిఖీ చేశారు. స్థానిక మార్కండేయ స్వామి గుడి సమీపంలో గోదావరి వద్ద రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు ఎందుకు వేశారని కార్పొరేషన్ ఈఈ అలీని ప్రశ్నించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేసి ఎందుకు అడ్డుకట్ట వేశారని అడిగి తెలుసుకున్నారు. గోదావరి గట్టు లోపలకు తవ్వి పనులు చేస్తున్నప్పుడు ఇసుక బస్తాలు వేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ గోదావరికి వరద అధికంగా వస్తున్న నేపథ్యంలో పనుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఇసుక బస్తాలు వేశామని వివరించారు. అనంతరం అక్కడి నుంచి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి గోదావరి వరద ప్రవాహం, ప్రమాద హెచ్చరికల జారీ, తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే సూచనలు ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మార్గాని సురేష్, మదీనా బాషా తదితరులు ఉన్నారు. నాణ్యమైన బియ్యం విక్రయాలకు చర్యలు సీటీఆర్ఐ: జిల్లాలోని ఎనిమిది రైతు బజార్లు, 33 రైస్మిల్లుల అవుట్లెట్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సూపర్ ఫైన్/స్టీమ్ బియ్యం కిలో రూ.52కు, రా రైస్ కిలో రూ.50కు విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని గణేష్చౌక్, ఆర్ట్స్ కాలేజీ, క్వారీ మార్కెట్, వీఎల్ పురం, నటరాజ్ థియేటర్, లాలాచెరువు, శంభూనగర్ రైతు బజార్లలో బియ్యం విక్రయాలు జరుగుతాయన్నారు. అదే విధంగా జిల్లాలోని 33 రైస్మిల్లుల వద్ద అవుట్లెట్లు ఏర్పాటు చేసి బియ్యాన్ని అమ్మేందుకు చర్యలు చేపట్టామన్నారు. కిక్కిరిసిన విఘ్నేశ్వర ఆలయం అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత, లఘున్యాస అభిషేకాల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు గరిక పూజ, నలుగురు ఉండ్రాళ్ల పూజ, 61 మంది లక్ష్మీగణపతి హోమం నిర్వహించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణం, ఒకరికి అన్నప్రాశన, తులాభారం నిర్వహించారు. నూతన వాహనాలకు పూజలు జరిపారు. అన్నప్రసాదం 2,885 మంది భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద విరాళాలు, ప్రసాదాలు, పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.3,74,580 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, సహాయ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
సహకారం అందక గగ్గోలు
● మూడు నెలలుగా అందని జీతాలు ● తామెలా బతకాలంటూ ఉద్యోగుల ఆవేదన ● ఇప్పటికే మూడు పీఆర్సీలు పెండింగ్ ● నమ్మించి నట్టేట ముంచిన మంత్రి అచ్చెన్న రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు తమకు ప్రభుత్వ సహకారం అందట్లేదని గగ్గోలు పెడుతున్నారు. రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2052 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రమారమి 6,800 మంది రెగ్యులర్ సిబ్బంది, 3,800 మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇప్పటికీ మూడు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో అనేక ధర్నాలు, సమ్మెలు, ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు మొర పెట్టుకోగా హెచ్ఆర్ పాలసీల అమలు కోసం ప్రభుత్వం జీఓ నెం.36 విడుదల చేసిందని, అయితే ఆ జీఓ ఇప్పటికీ అమలు కాక ఉద్యోగుల ప్రయోజనాలు నెరవేరని పరిస్థితులు నెలకొన్నాయని యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. జీఓ విడుదలతో తమ జీవితాలు మారిపోతాయని ఆశతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రనక, పగలనక కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇప్పటికీ జీఓ అమలు చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం తమను మోసగిస్తూనే ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కంప్యూటర్ పరిజ్ఞానం లేకున్నా, కనీసం ఏ విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేసి సంఘాల కంప్యూటరీకరణ పనులు చేయిస్తే మానసిక ఒత్తిడి అనుభవిస్తూ అనారోగ్యం పాలైనా కూడా పూర్తి స్థాయిలో పనిచేసి కంప్యూటరీకరణ పనులు పూర్తి చేయడం జరిగిందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఉపయోగించుకుని మహాజన సభకు ఉన్న విశేష అధికారాలతో నియమించుకున్న సిబ్బందితోనే తాత్కాలిక ఉద్యోగులుగా కొత్తగా తీర్మానాలు ఇవ్వమని అడగటం దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారు. ముందుగా రెండు నెలల జీతాలు వెంటనే ఇవ్వకపోతే మూకుమ్మడిగా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు.మొండి చేయి చూపించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ఆశలు చూపించి పనులు చేయించుకోవడం ఆ తర్వాత మొండి చేయి చూపడం పరిపాటిగా మారింది. కంప్యూటరీకరణ, ఆడిట్ పూర్తయితే మంచి రోజులు వస్తాయని ఆశ చూపి పని పూర్తయిన తరువాత మొంటి చేయి చూపించారు. – తోట వెంకటరామయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీతాలైనా సమయానికి ఇవ్వరా! ఇప్పటికే మూడు పీఆర్సీలు బకాయి ఉన్నాయి. హెచ్ఆర్ పాలసీ అమలు కోసం జీఓ నెం.36 విడుదల చేశారు. అమలుకు నోచుకోలేదు. 2019 తరువాత ఉద్యోగాల్లో చేరిన వారిని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తూ తీర్మానాలు చేయాలని ఆదేశాలిస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. – పెంకే సత్యనారాయణ, యూనియన్ రాష్ట్ర కోశాధికారి మంత్రి హామీ కూడా నీటి బుడగేనా? సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో ఉండగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్చి 23న స్వయంగా జేఏసీ ఆధ్వర్యంలో మీ న్యాయమైన డిమాండ్లను రెండు రోజుల్లో జీఓ ఇచ్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏరు దాటాక తెప్ప తగలేశారు. – యర్రంశెట్టి రామచంద్రరావు, యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
వరద ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి
మామిడికుదురు: జిల్లాలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి అధికారులను ఆదేశించారు. అప్పనపల్లి కాజ్వే వద్ద వరద పరిస్థితిని ఆదివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు పరిస్థితులు, నీటి ప్రవాహం, రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు విషమిస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. నీటి మట్టం పెరుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. తాగునీరు, విద్యుత్, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ప్రత్యేక సహాయం అందించాలని చెప్పారు. అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రాంతాల్లో అనవసర రాకపోకలు నివారించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సీఎస్ రాజు, ఎంపీడీవో జి.భవాని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హైరిస్క్ ప్రెగ్నెన్సీతో అప్రమత్తం
కాకినాడ క్రైం: హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులలో అప్రమత్తంగా వ్యవహరించి మాతృ మరణాల నివారణకు కృషి చేయాలని రాష్ట్ర డీఎంఈ డాక్టర్ అత్తలూరి విష్ణువర్థన్ ప్రసూతి వైద్య నిపుణులకు సూచించారు. కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షతన స్థానిక రామారావు పేటలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం సీఎంఈ వర్క్షాప్ నిర్వహించారు. డాక్టర్ విష్ణువర్థన్తో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి, డీఎంహెచ్వో అనిత అతిథులుగా హాజరు కాగా, విష్ణువర్ధన్, సత్యవతి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లావణ్యకుమారి, అనిత మాట్లాడుతూ, హై రిస్క్ కేసుల్లో ప్రసూతి సమయం అత్యంత కీలకమైనదని, ఇలాంటి స్థితిలోనే మాతా శిశు మరణాలు సంభవిస్తాయని అన్నారు. డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, ప్రఖ్యాత ఫెర్నాండెజ్ ఆసుపత్రి యాజమాన్యంలో నిష్ణాతులైన ప్రసూతి వైద్య నిపుణులు తారకేశ్వరి, కామేశ్వరి, మాలినీ సీఎంఈకి గెస్ట్ ఫ్యాకల్టీగా వ్యవహరించడం హర్షణీయం అన్నారు. అనంతరం ఫ్రెండ్షిప్డే వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో గైనకాలజీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మాధవి సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి గైనకాలజిస్టులు హాజరయ్యారు. రామకృష్ణారెడ్డి సేవలు అభినందనీయంఅమలాపురం టౌన్: అమలాపురం పంచాయతీరాజ్ ఈఈగా పులి రామకృష్ణారెడ్డి అందించిన సేవలు అభినందనీయమని జిల్లా పీఆర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కొనియాడారు. అమలాపురం ఈఈగా పనిచేస్తూ పదోన్నతిపై కాకినాడ జిల్లా ఎస్ఈగా వెళ్తున్న రామకృష్ణారెడ్డికి స్థానిక పీఆర్ అతిథిగృహంలో ఆదివారం వీడ్కోలు చెప్పారు. అమలాపురం పీఆర్ ఈఈ సీతంనాయుడు అధ్యక్షతన జరిగిన సభకు డీఆర్వో సుబ్బారావు, డీఎంహెచ్వో డాక్టర్ దుర్గారావు దొర, ఆర్డీవో సరళావతి, డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా పీఆర్ కార్యాలయ ప్రాంగణంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి దంపతులను అమలాపురం పీఆర్ ఈఈ సీతంనాయుడు, డీఈఈలు అన్యం రాంబాబు, పి.రాజ్కుమార్లతో పాటు జిల్లాలోని ఏఈలు, ఉద్యోగులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కాకినాడ పీఆర్ ఈఈ రఘురామరెడ్డి పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన మళ్ల కృష్ణబాబు (36) శనివారం రాత్రి వ్యవసాయ పనులు చేయించేందుకు కూలీల కోసం బైక్పై ఏలేశ్వరం మండలం సిరిపురం వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి స్వగ్రామానికి వస్తుండగా పోలవరం వంతెన వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని జరిగిన ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహానికి ఆదివారం స్థానిక సీహెచ్సీలో శవ పరీక్ష చేసి బంధువులకు అప్పగించారు. కృష్ణబాబు తండ్రి మళ్ల శివబాబు ఫిర్యాదు మేరకు ఎస్హెచ్ఓ ఎం.గోవిందుబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని.. పిఠాపురం రూరల్: స్థానిక బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కరివేపాకుపేటకు చెందిన ఇండుగపల్లి నూకరాజు (72) శనివారం ఉదయం సుమారు 5.30 నుంచి 6 గంటల మధ్య కాలినడకన కాకినాడ వైపు జగ్గయ్య చెరువు ప్రాంతంలోని తన కుమారుడి ఇంటికి వెళ్తున్నాడు. నాగార్జున రెసిడెన్సీ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూకరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అనపర్తి: బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనికి భయపడేది లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రామవరంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఇంటికి పరామర్శకు వెళ్లిన తమపై స్వయంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హైడ్రామాను సృష్టించారన్నారు. అనంతరం తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులకు పాల్పడి, తిరిగి తమపై అక్రమంగా కేసులు పెట్టారన్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, తాము వెనకడుగు వేసేది లేదని.. రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు మనోజ్రెడ్డి అక్రమాలు, అవినీతిని బయటపెడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నాయకులు, కార్యకర్తలు వెళ్తున్న సమయంలోనే ఎమ్మెల్యే కూడా వచ్చి ఉద్దేశపూర్వకంగా రగడ చేశారని, ఆ దృశ్యాలన్నీ ప్రజలు వీడియోల ద్వారా చూశారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి, తనతో సహా 15 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆ గ్రామంలోని మిగతా బాధితుల ఇళ్లకు కానీ, గతంలో రంగాపురం, దొడ్డిగుంట గ్రామాల్లో హత్యకు గురైన వారి కుటుంబాలను పరామర్శించడానికి గాని ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అక్కడకు వెళ్తే ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుందనే భయంతోనే ఎమ్మెల్యే వెళ్లలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూర్యనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ సమర్పించిన సీసీటీవీ ఫుటేజ్, ఆధారాలపై ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర విచారణ చేపట్టకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు అనపర్తి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన రామవరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి ఇంటిపై జూలై 12న కూటమి నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 14న కృష్ణారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ శ్రేణులు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నేత కృష్ణారెడ్డి ఇంటి వైపునకు దూసుకొచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సూర్యనారాయణరెడ్డి సహా నాయకులపై స్థానిక వీఆర్వో దుర్గారెడ్డి ఫిర్యాదు మేరకు అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చారు. -
మరిడమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
సామర్లకోట: పెద్దాపురంలోని మరిడమ్మ దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. గత నెల 14 నుంచి ప్రారంభమైన జాతర ఉత్సవాలకు వస్తున్న ఉమ్మడి రాష్ట్రాల భక్తులు, వారి వాహనాలతో స్థానిక రహదారులు కిటకిటలాడాయి. సుమారు 80 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, రాజమహేంద్రవరం నుంచి సామర్లకోట వచ్చే వాహనాలను పాండవుల మెట్ట వద్ద నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా మళ్లించారు. ఆదివారం తెల్లవారు జాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయం వద్దకు చేరుకోవడంతో దేవదాయశాఖ ఈఓ కె.విజయలక్ష్మి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, ట్రస్టు బోర్డు సభ్యులు, పోలీసులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున ఆలయ నిర్మాణకర్తలైన చింతపల్లి వారి గోత్రనామాలతో ఆలయంలో పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. భక్తుల క్యూ రహదారి మీదకు రావడంతో ఆలయ అధికారులు టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు వివిధ సేవా సంస్థల సభ్యులు తాగు నీరు, పిల్లలకు పాలు, మజ్జిగ, ద్రాక్ష జ్యూస్, పండ్లు పంపిణీ చేశారు. వీఐపీల తాకిడితో సిబ్బంది అవస్థ పడ్డారు. డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద సామర్లకోట లయన్స్ క్లబ్ ప్రతినిధులు, విష్ణు భక్తమండలి సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు.పెద్దాపురంలో కొనసాగుతున్న జాతర -
ఉగ్ర గోదావరి
ఫ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ఫ ఉధృతంగా నీటి ప్రవాహం ఫ పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు ఫ నీట మునిగిన పంట పొలాలు ఫ రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లోకి పర్యాటకులకు ప్రవేశం నిలిపివేత సాక్షి, రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో గోదావరి ఉరకలేస్తోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రాణహిత, ఇంద్రావతి పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం శనివారం ఉదయం నుంచి గంటగంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్లోని వరద నీటిని ఎప్పటికప్పుడు ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్ముల్లోని 175 గేట్ల ద్వారా కిందకు విడిచిపెడుతున్నారు. పుష్కరఘాట్లోకి అనుమతి నిలిపివేత ● రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్లను తాకుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లోకి భక్తులు, పర్యాటకులకు అనుమతిని నిలిపేశారు. కోటిలింగాల ఘాట్, కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ● వరదల నేపథ్యంలో రాజమహేంద్రవరం అర్బన్ మండలంలోని ఏసీ గార్డెన్స్ మున్సిపల్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి 90 కుటుంబాలకు చెందిన 210 మంది బాధితులను తరలించారు. ఆ కేంద్రాన్ని ఆర్డీవో ఆర్.శివరాముడు పరిశీలించారు. ● సీతానగరం మండలం బొబ్బిలిలంక–ములకల్లంక గ్రామాల మధ్య ప్రజల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన పడవ సేవలను మళ్లీ ప్రారంభించారు. ● అత్యవసరమైతే సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు 26 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ దీపక్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి చేరుకుంది. ● కపిలేశ్వరపురం మండలంలోని కేదారలంక (తొగరపుపాయ), ఏవీ లంక గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని ఆర్డీవో శివరాయుడు పరిశీలించారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జిల్లా యంత్రాంగం వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, లోతట్టు, నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి సూచించారు. అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని, నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


