breaking news
East Godavari
-
కోతల షాక్
సాక్షి, రాజమహేంద్రవరం/పెరవలి/నిడదవోలు రూరల్/కపిలేశ్వరపురం: వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబు సర్కార్ జనానికి విద్యుత్ కోతల షాక్ ఇస్తోంది. సమయం సందర్భం లేని కరెంటు కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య రోజూ రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికీ కోతలు విధిస్తున్నారు. గతంలో వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేవారు. దీనిని చంద్రబాబు సర్కారు ప్రస్తుతం 7 గంటలకు తగ్గించేయడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎండల వేడికి తోడు కరెంటు కోతలతో ఆక్వా రంగం పైనా ప్రభావం పడుతోంది. ఈఎల్ఆర్ పేరిట.. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) అమలు చేస్తున్నారు. ఫలితంగా పల్లెలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. పగలంతా వేసవిని తలపించే ఎండతో అవస్థలు పడుతున్న చిన్న పిల్లలు, వృద్ధులు.. రాత్రి వేళ కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోత, దోమల మోతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులకు సైతం చదువుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయవాడలోని విద్యుత్ సౌధ అధికారుల ఆదేశాల మేరకే ఈఎల్ఆర్ అమలు చేస్తున్నామని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ● నిడదవోలు రూరల్ మండలంలోని చాలా పల్లెల్లో రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ● కపిలేశ్వరపురం మండలంలో రోజూ కనీసం ఒక గంటపాటు ఈఎల్ఆర్ అమలు చేస్తున్నారు. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి మధ్య కీలక సమయంలో కరెంట్ పోతూండటంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. ● తాళ్లపూడి మండలంలో మంగళవారం రాత్రి 10 నుంచి 11.30 గంటల వరకూ కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో, చిమ్మచీకట్లో దోమలతో సావాసం చేయాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. ఒక్కో రోజు ఒక్కో సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● తమ గ్రామాల్లో రోజూ రెండు గంటలపాటు ఈఎల్ఆర్ అమలు చేస్తున్నారని రాయవరం మండల ప్రజలు చెబుతున్నారు. ● సీతానగరం మండలంలోని అనే గ్రామాల్లో సైతం రోజూ ఓ గంట పాటు అంధకారం రాజ్యమేలుతోంది. ● పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.పెరవలి మండలం అన్నవరప్పాడులో అలముకున్న అంధకారం ఎడాపెడా విద్యుత్ సరఫరా నిలిపివేత సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్యలో 2 గంటల పవర్ కట్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో అంధకారం కీలక సమయంలో కరెంట్ లేక ఇబ్బందులు దోమల దండుతో జనానికి నరకయాతనఅల్లాడిపోతున్నాం కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో సుమారు గంట నుంచి రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఒకవైపు ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతూంటే ప్రభుత్వం కరెంటు కోతలతో మరింతగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా దళిత వాడల్లో ఎవ్వరికీ ఇన్వర్టర్లు లేక దోమలతో సావాసం చేయాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. – పలివెల మధు, అచ్చుతాపురం, కపిలేశ్వరపురం మండలం నరకయాతన వేళాపాళా లేని విద్యుత్ కోతలతో నరకయాతన అనుభవిస్తున్నాం. కొద్ది రోజులుగా రాత్రి వేళ కనీసం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. పగలు ఎండ వేడి, రాత్రి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. – పల్లాటి రవి, ఖండవల్లి, పెరవలి మండలం రాత్రి వేళ కోతలు ఆపాలి వేసవిని తలపిస్తున్న ఎండలతో పగలంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. రాత్రి వేళ ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం. ఇలాంటి సమయంలో పవర్ కట్లతో నరకం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రాత్రి వేళల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేసి, సరఫరా చేయాలి. – బి.సురేష్, తాళ్లపాలెం, నిడదవోలు మండలం -
మాయమైన పుస్తెలతాడు రికవరీ
అమలాపురం టౌన్: పట్టణంలోని అశ్వని పిల్లల ఆస్పత్రిలో ఓ బాలింత పొగొట్టుకున్న 12 గ్రాముల బంగారు పుస్తెలతాడును పట్టణ పోలీసులు 48 గంటల్లో రికవరీ చేశారు. వివరాలివీ.. అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామానికి చెందిన బాలింత పొలినాటి నందిని తన ఐదు నెలల బిడ్డకు ఒంట్లో బాగోలేకపోతే ఆస్పత్రిలో చేరింది. డిశ్చార్జి అయ్యే ముందు స్నానం చేస్తూ మంగళవారం తన మెడలోని బంగారు పుస్తెలతాడును తీసి, ఆస్పత్రి బాత్ రూములో పెట్టి, మరచిపోయింది. సొంతూరు వెళ్లిన తరువాత పుస్తెలతాడు మరచిపోయిన విషయాన్ని గుర్తించి, వెంటనే అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని, పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి సీసీ ఫుటేజీలను పరిశీలించి, సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రికి వచ్చిన మరో రోగి బాత్ రూముకు వెళ్లిన సమయంలో ఆ పుస్తెలతాడును గుర్తించి, ఎవ్వరికీ చెప్పకుండా దాచేసుకుంది. సీఐ వీరబాబు, క్రైమ్ ఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ విచారణ జరిపి, దాదాపు రూ.లక్ష విలువైన ఆ బంగారు పుస్తెలతాడును ఆ రోగి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్లో బాధిత మహిళ నందినికి సీఐ వీరబాబు గురువారం ఆ పుస్తెలతాడు అందజేశారు. -
125 కేజీల గంజాయి పట్టివేత
● నలుగురి అరెస్టు ● రూ.71 లక్షల సొత్తు స్వాధీనం తుని: నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 125 కేజీల గంజాయి, భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక సీతారామపురంలోని ఓ పాత పెంకుటింట్లో గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్నారంటూ తుని టౌన్ పోలీసులు, ఏపీ ఈగల్ టీముకు సమాచారం అందింది. ఈ మేరకు గురువారం దాడి చేసి, గంజాయి విక్రయం, రవాణా చేస్తున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన బొండాడ కోదండరామ్, పాయకరావుపేటకు చెందిన పులిబంటి వెంకట ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కేడీ పేటకు చెందిన ఇంటి సంతోష్, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పైడిపాలకు చెందిన పేరూరి శ్రీనులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.62 లక్షల విలువైన 125 కేజీల గంజాయి, కారు, ప్యాసింజర్ ఆటో, స్కూటీ, పల్సర్ బైక్, 5 సెల్ఫోన్లు, రూ.3.41 లక్షల నగదు కలిపి మొత్తం రూ.71 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడి పెంకుటింట్లో నిల్వ చేసి, హైవేపై లారీలు, ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో బట్టల బ్యాగులు, పండ్ల బాక్సుల రూపంలో ప్యాక్ చేసి తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరు వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉండి, బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్సై, రావూరి వెంకటరత్నం, ఇతర సిబ్బందిని ఎస్పీ బిందుమాదవ్, డీఎస్పీ తిలక్ అభినందించారు. -
గ్రావెల్ తరలింపుపై లోకాయుక్త విచారణ
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని గిరి ప్రదక్షిణ రోడ్డులో ఉన్న కొండల నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలించారంటూ వచ్చిన ఫిర్యాదులపై లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజులు గురువారం విచారణ జరిపారు. వివరాలివీ.. గిరి ప్రదక్షిణ రోడ్డులోని కొండల నుంచి పెద్ద మొత్తంలో గ్రావెల్ను సత్యగిరి పక్కనే పార్కింగ్ స్థలం అభివృద్ధికి గత ఏడాది మూడు రోజుల పాటు లారీలతో తరలించారు. ఈ గ్రావెల్లో కొంత దేవస్థానానికి చెందిన స్థలంలోనిది కాగా, మిగిలినది ఇరిగేషన్ స్థలంలోనిదని, దానికి ఆ శాఖతో పాటు మైన్స్ అధికారుల అనుమతి లేదని పేర్కొంటూ జి.మహేష్ అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. తరలించిన గ్రావెల్కు ట్రిప్పునకు రూ.10 వేల చొప్పున బిల్లులు పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త డీడీ గోవిందరాజులు గిరి ప్రదక్షిణ రోడ్డులో గ్రావెల్ తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఈఈ రామకృష్ణ, ఇతర అధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ గ్రావెల్ను దేవస్థానం అవసరాలకే ఉపయోగించామని అధికారులు తెలిపారు. ఇందులో కొంత దేవస్థానం స్థలంలోనిదేనని, కొంత ఇరిగేషన్కు చెందిన స్థలం ఉంటే ఉండవచ్చునని చెప్పారు. దేవస్థానం అవసరాలకు తరలిస్తున్నందున ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అనంతరం, ఫిర్యాదీ మహేష్ అభ్యంతరాలపై గోవిందరాజులు ప్రశ్నించారు. గతంలో కూడా తాను పలు అంశాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశానని, ఇది కూడా ప్రజాప్రయోజనాల నేపథ్యంలోనే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని లోకాయుక్త అధికారులు తెలిపారు. ఏఈఓ అనకాపల్లి ప్రసాద్, డీఈలు ఈ విచారణలో పాల్గొన్నారు. -
స్థల వివాదంలో హత్యాయత్నం
కోరుకొండ: స్థల వివాదంలో ఓ వ్యక్తి హత్యాయత్నానికి ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోరుకొండలో జరిగింది. ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం.. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్, అతడి తల్లి సూర్యకాంతానికి, శ్రీరంగపట్నానికి చెందిన దొడ్డి కొండయ్య కుటుంబాల మధ్య కాలనీలోని ఓ స్థలం విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొండయ్య గురువారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. కత్తితో నరకడంతో పొట్టపై తీవ్ర గాయమైంది. అతడి తల్లి సూర్యకాంతంపై కూడా కొండయ్య దాడి చేయడంతో ఆమె తలపై తీవ్ర గాయమైంది. తల్లీకొడుకులిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై శివాజీలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులిద్దరినీ తొలుత పీహెచ్సీకి, అక్కడి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడిన కొండయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు. ● కత్తితో దాడి ● ఇద్దరికి తీవ్ర గాయాలు -
వడివడిగా జెడ్పీ విభజన
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్తుల (జెడ్పీ) పునర్వ్యవస్థీకరణ వేగం అందుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ను నాలుగు జిల్లా పరిషత్లుగా పునర్విభజించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల ఐదో తేదీన ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి కొత్త జెడ్పీల కార్యకలాపాలు ప్రారంభించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా ప్రస్తుత పరిషత్తుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఇక చరిత్రగా మారనున్న ఉమ్మడి జెడ్పీ ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల కలెక్టరేట్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లోను, వాటి సమీప ప్రాంతాల్లోను ఏర్పాటు చేశారు. దీంతో, ప్రజలకు ఏ అవసరం వచ్చినా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. జిల్లాల విభజనలకు కొనసాగింపుగా ప్రభుత్వం ఇప్పుడు జెడ్పీల విభజనకు సిద్ధమైంది. ప్రస్తుత ఉమ్మడి జెడ్పీ పదవీ కాలం ముగుస్తూండటంతో దీనిని విభజించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన ఇచ్చిన 115, 116 జీవోల ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా ప్రజా పరిషత్తులు అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ విభాగం ఈ నెల 16న సర్క్యులర్ మెమో జారీ చేసింది. దీని ప్రకారం కొత్త జెడ్పీల ఏర్పాటులో ఫైళ్లు, రికార్డుల విభజనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత జిల్లా పరిషత్ కార్యాలయాల్లోని ఈ–ఫైళ్లు, మాన్యువల్ ఫైళ్లు, రికార్డు గదుల్లోని మూసివేసిన ఫైళ్లతో పాటు పరిపాలన, ఆస్తులు, సర్వీసు వ్యవహారాలు, ఎన్నికలు, కోర్టు కేసులకు సంబంధించిన రిజిస్టర్లను గుర్తించి, పూర్తి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ పరిధిలో దశాబ్దాలుగా కొనసాగిన పరిపాలనా వ్యవస్థకు ముగింపు పలికి నాలుగు కొత్త వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పోలవరం జిల్లాలకు నాలుగు ప్రత్యేక జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పడనున్నాయి. కాకినాడ జెడ్పీ 20 మండలాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జెడ్పీ 19, తూర్పు గోదావరి జెడ్పీ 22 మండలాలు, పోలవరం జెడ్పీ 11 మండలాలతో ఏర్పాటు కానున్నాయి. 25న కొత్త సీఈవోల బాధ్యతల స్వీకరణ కొత్త జిల్లా పరిషత్తులకు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈవోలు), ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (డిప్యూటీసీఈవోలు) నియామకానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సీఈవోలు ఈ నెల 25న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే పాత పరిషత్ అధికారులతో సమన్వయం చేసుకుని రికార్డులు, ఫైళ్లు, ఇతర పరిపాలనా వ్యవహారాలను స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లా ప్రజా పరిషత్తులకు అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. ప్రస్తుత సిబ్బందిని తాత్కాలికంగా కొత్త పరిషత్తులకు సర్దుబాటు చేయనున్నారు. తుది సిబ్బంది కేటాయింపు రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్తులు, నిధులపైనా త్వరలో స్పష్టత జెడ్పీల విభజనలో ఫైళ్లు, రికార్డులే కాకుండా ఆస్తులు, నిధులు, అప్పులు, మౌలిక సదుపాయాల పంపిణీ కూడా కీలకం కానుంది. వీటిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25లోగా బదిలీకి సంబంధించిన రికార్డులన్నింటినీ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీఆర్కే తేజ మైలవరపు ఆదేశాలు జారీ చేశారు. 25 నుంచి కొత్త జిల్లా పరిషత్తులు ఉమ్మడి జెడ్పీకి ఈ నెల 24 చివరి రోజు ఫైళ్లు, రికార్డుల విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ నాలుగుగా విభజన తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పోలవరం జెడ్పీలుగా ఏర్పాటు కొత్త పరిషత్తులకు సీఈవో, డిప్యూటీ సీఈవోల పోస్టింగ్కు కసరత్తు సిబ్బంది తాత్కాలిక కేటాయింపునకు ప్రతిపాదనలు -
వట్టిగెడ్డ వద్ద పెద్ద పులి
అప్పలరాజుపేట పరిసరాల్లో హై అలర్ట్ రాజవొమ్మంగి: కొన్ని నెలలుగా ఏజెన్సీలో సంచరిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ వద్దకు వచ్చినట్లు అటవీ అధికారులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు మెగా ఫోన్తో స్థానికులను అప్రమత్తం చేశారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు స్పష్టంగా తెలుసుకున్న రాజవొమ్మంగి ఫారెస్టు రేంజి అధికారి (ఎఫ్ఆర్ఓ) ఉషారాణి తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి ట్రాకర్ ద్వారా పులి ఎక్కడ ఉందో మరోసారి పరిశీలించారు. అనంతరం అప్పలరాజుపేట గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పశువులను మేత కోసం అడవి వైపు విడిచి పెట్టవద్దని కోరారు. అలాగే ఒంటరిగా సంచరించవద్దని, పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొండపోడు భూములకు వెళ్లే వారు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ అడవిలోకి వెళ్లరాదని సూచించారు. ఇదిలా ఉండగా గురువారం అడవికి వెళ్లిన గిరిజన మహిళ కేదారి సత్యవతి తనకు చాలా దగ్గరలో పులి గాండ్రింపు వినిపించిందని, దీంతో వడివడిగా ఇంటికి చేరానని ‘సాక్షి’కి తెలిపింది. పులి సంచారంపై ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఎఫ్ఎస్ఓ భవాని, ఎఫ్బీఓ సూర్యప్రసాద్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తుని రూరల్: వి.కొత్తూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ కర్నూలులో జరిగిన సీనియర్ రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్యా పోటీల్లో 13 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వీరిలో డి.దీప్తి, కె.గీత, టి.శివరమ్య, ఎం.ప్రవల్లిక, కె.లోహిత, వై.దుర్గాభవాని, డి.కీర్తి, ఎ.నూతన ప్రియదర్శిని, ఎం.సంజన ఈ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచారు. వీరిలో మంచి ప్రతిభ చూపిన దీప్తి, గీత, శివరమ్యలు జాతీయ స్థాయి ఆట్యాపాట్యా పోటీలకు అర్హత సాధించారు. వీరు వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకూ హైదరాబాద్లో జరిగే జాతీయ స్థాయి ఆట్యాపాట్యా పోటీల్లో పాల్గొంటారు. అలాగే, జాతీయ స్థాయి సైకిల్ పోలోకు కూడా ఐదుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థినులు ఆర్.భవిత శివకుమారి, పి.స్వరూప, జి.సుస్మిత, జె.సుజిత్రి, పి.హర్షిణి తృతీయ స్థానం సాధించారు. వీరిలో మంచి ప్రతిభ చూపిన భవిత శివకుమారి, సుస్మిత జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్లో జమ్మూ కశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, ఫిజికల్ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. జాతీయ స్థాయిలో సైతం వీరు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. -
సైబర్ నేరగాళ్ల బరితెగింపు
పెద్దాపురం: స్థానిక మున్సిపల్ కమిషనర్ పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు 9440 20 6790 నంబర్ నుంచి ఫోన్ చేసి, తన పేరు చెప్పి, ట్రేడ్ లైసెన్స్ బకాయి ఉందని, వెంటనే డబ్బులు ఫోన్పే, గూగూల్ పే చేయాలంటూ ప్రజలను, వ్యాపారులను బెదిరిస్తున్నారని పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం నుంచి ఎవ్వరూ ఫోన్ చేయరని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆన్లైన్లో డబ్బులు చెల్లించి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బకాయిలుంటే నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నగదు చెల్లించి, రశీదు పొందాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 10 మోటారు సైకిళ్లకు రేపు వేలం అమలాపురం టౌన్: పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న గుర్తు తెలియని 10 మోటార్ సైకిళ్లకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద వేలం నిర్వహిస్తున్నట్లు సీఐ పి.వీరబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేలం పాటలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చని సూచించారు. ● పెద్దాపురం కమిషనర్ పేరుతో ఫోన్ కాల్స్ ● అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం -
వ్యసనాలకు బానిసై.. అప్పులపాలై..
● గొల్లపాలెం డీసీసీబీ ఏటీఎంకే కన్నం వేసిన నిందితుడి అరెస్టు ● బైక్ల దొంగగా గుర్తించిన పోలీసులు ● రూ.2.96 లక్షల స్వాధీనం కాకినాడ రూరల్: చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆపై ఇంటి నిర్మాణానికి అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా ఏటీఎంకే కన్నం వేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. కాజులూరు మండలం గొల్లపాలెంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఏటీఎం చోరీ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాకినాడ రూరల్ సర్కిల్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గొల్లపాలెంలోని డీసీసీబీ ఏటీఎంలో ఈ నెల 6న చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను బద్దలుగొట్టి అందులోని రూ.4.35 లక్షల నగదుతో పాటు, బ్యాంకులోకి ప్రవేశించి సెల్ఫోన్ చోరీ చేశారంటూ గొల్లపాలెం పోలీసులకు ఆ బ్యాంకు మేనేజర్ ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులను విచారించారు. చివరకు గొల్లపాలేనికి 8 కిలోమీటర్ల దూరాన కాజులూరు మండలం అండ్రంగి గ్రామానికి పాత నేరస్తుడు సమనాసి గొల్లయ్య ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రూ.2.96 లక్షల నగదు, సెల్ఫోన్, నేరానికి వినియోగించిన గునపాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్ల చోరీలతో మొదలుపెట్టి.. నిందితుడు గొల్లయ్య 2009 నుంచి దొంగతనాలు ప్రారంభించాడు. తొలుత చిన్న చిన్న బైక్లు దొంగిలించేవాడు. ఇప్పటికే 13 కేసుల్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. అయినప్పటికీ అతడి బుద్ధి మారలేదు. ఇటీవల స్వగ్రామం అండ్రంగిలో గొల్లయ్య ఇల్లు నిర్మించుకున్నాడు. దీనికోసం రూ.8 లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు మద్యం, పేకాట వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏటీఎంపై కన్ను వేశాడు. ఆ ఏటీఎంను పొడవాటి గునపంతో బద్దలుగొట్టి నగదుతో పాటు, బ్యాంకులోని మొబైల్ ఫోన్ను దొంగిలించాడు. నిందితుడిని బుధవారం అతడి ఇంటి వద్దనే పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరు పరిచారు. గొల్లయ్యకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. నిందితుడిని అరెస్టు చేసి, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న సీఐ చైతన్యకృష్ణ, క్రైం సీఐ వెంకట త్రినాథ్, ఫింగర్ ప్రింట్ సీఐ పి.శ్రీనివాసరావు, గొల్లపాలెం ఎస్సై ఆర్వీఎన్ మూర్తి, ఏఎస్సైలు బ్రహ్మాజీ, గోవిందు, ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు ఫణీంద్ర, చంద్రశేఖర్, శివప్రసాద్, వెంకటరత్నం తదితరులను ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ అభినందించారు. -
ఫ దేదీప్యమానం
గణేశ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలో మహిళా భక్తులు గురువారం రాత్రి దీపాలంకరణ వైభవంగా నిర్వహించారు. శివలింగం, ఓం, వినాయకుడు, స్వస్తిక్ ఆకృతుల్లో దీపాలు వెలిగించారు. ఈ దీపాలంకరణను అధిక సంఖ్యలో భక్తులు తిలకించి, స్వామివారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. – రాజమహేంద్రవరం రూరల్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
అతిగా వాడితే అనర్థం
● విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగం ● తగదంటున్న వైద్యులు ఆలమూరు: సీజనల్ మార్పులు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ లోపించడం వంటి కారణాలతో పలు ప్రాంతాల్లో సీజనల్, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇదే సమయంలో కొంతమంది రోగులు వ్యాధులు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్ మందులు ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఈ ధోరణి ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 162 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 సామాజిక ఆరోగ్య పోషక కేంద్రాలు, ఏడు ఏరియా ఆస్పత్రులు, 500 వరకూ ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోజుకు 30 నుంచి 50 వరకూ సీజనల్ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, కొంతమంది జ్వరాల బారిన పడుతున్నప్పుడు వైద్యుల్ని సంప్రందించకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి వాడుతున్నారు. ఇవీ దుష్పరిణామాలు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి నశించిపోయి, చిన్న చిన్న రోగాలను సైతం తట్టుకునే శక్తిని శరీరం కోల్పోతుంది. అలాగే, జ్వరాలు, దగ్గు, జలుబుకు సైతం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. దీనివలన ఎప్పుడైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు వాడే మందులు శరీరంపై పని చేయవని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులతో పాటు ప్రతి ఒక్కరూ తమ సలహా లేనిదే యాంటీబయాటిక్స్ వినియోగించరాదని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు చెప్తేనే వాడాలి సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగి కచ్చితంగా సమీప ఆస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. వైద్యుల సలహాకు అనుగుణంగా మందులు వాడాలి. వారి సూచనలు లేకుండా యాంటీబయాటిక్స్ వినియోగించరారు. – ఎం.సుమలత, నోడల్ అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్, అమలాపురం -
ఉసురు తీసిన తేనెటీగలు
● లొల్ల లాకుల వద్ద దాడి ● ఎనిమిది మందికి గాయాలు ● వీరిలో ఒకరి మృతి ఆత్రేయపురం: తేనెటీగలు ఓ వ్యక్తి ఉసురు తీశాయి. వివరాలివీ.. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద పలువురు కూలీలు బుధవారం వీబీజీరాంజీ (ఉపాధి హామీ పథకం) పనులు చేస్తున్నారు. వారిపై ఉదయం 11 గంటల సమయంలో తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఆత్రేయపురం మాదిగపేటకు చెందిన యార్లగడ్డ సత్యానందం (71), కాకిలేటి చంద్రరావు, కె.లక్ష్మి, ఎస్.జ్యోతికుమారి, యు.పరంజ్యోతి, కె.భవాని, కె.చంద్రకళ, కె.బుజ్జి గాయపడ్డారు. వారిని వీబీజీరాంజీ ఏపీఓ విజయారెడ్డి, ఇతర సిబ్బంది వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం, ఇంటికి తరలించారు. వీరిలో సత్యానందం రాత్రి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పూతరేకుల స్టాల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
నెయ్యి శాంపిల్స్ సేకరణ ఆత్రేయపురం: స్థానిక పూతరేకులు, స్వీట్ స్టాల్స్పై ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఆయా స్టాల్స్లో నెయ్యి వాడే పదార్థాల శాంపిల్స్ తీసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు పంపారు. ప్రధానంగా పూతరేకులలో వాడే నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంతవరకూ 21 శాంపిల్స్ సేకరించగా పరీక్షల అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా జియోగ్రాఫికల్ గుర్తింపు పొంది, ప్రజాదరణ పొందాయని, కాబట్టి తయారీదారులు బ్రాండెడ్ నెయ్యి, నాణ్యమైన పదార్థాలు మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు. ఈ దాడులు గురువారం రాత్రి వరకూ కొనసాగాయి. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్.రమేష్బాబు, వై.రాములయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారులకు అందిన ఫిర్యాదులపై ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జాతీయ స్థాయి విలువిద్య పోటీలు దోహదం చేస్తాయని ప్రముఖ ఆడిటర్, పూర్వపు రోటరీ క్లబ్ గవర్నర్ భాస్కర్రామ్ అన్నారు. కవలగొయ్యిలోని ది ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూలు ఆవరణలో సీఐఎస్సీఈ జాతీయ స్థాయి బాలికల విలువిద్య (ఆర్చరీ) పోటీలను ఆంధ్ర – తెలంగాణ రీజియన్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, హైదరాబాద్ సెయింట్ జోసఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ థెరిసాతో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో క్రీడాకారిణులు నేషనల్, రీకర్వ్, ఇండియన్ వంటి రౌండ్లలో మంచి ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని పాఠశాల ప్రిన్సిపాల్, స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ ఎం.శేషగిరిధర్ తెలిపారు. తొలుత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది విలు విద్య క్రీడాకారిణులు ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎం.శేషగిరి, పాఠశాల డైరెక్టర్ రవిబాబు యేలేటి, చైర్పర్సన్ విజయ యేలేటి, సీఈఓ మహాస్వి యేలేటి, డీన్ హర్షిణి తదితరులు పాల్గొన్నారు. -
మోకాళ్లపై నిలబడి నిరసన
నిడదవోలు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) మోకాళ్లపై నిలబడి గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు పదోన్నతులు కల్పించాలని, జీతభత్యాలు పెంచాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని పెద్ద పెట్టున నినదించారు. అనంతరం, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల శాఖ అధ్యక్షుడు తణుకు శంకరం మాట్లాడుతూ, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. వీఆర్ఏల నిరసనకు వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల ప్రధాన కార్యదర్శి తీపర్తి నాగాంజనేయులు, కార్యదర్శి కె.రమేష్, నాయకులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా తుది ప్రచురణకు పక్కా ఏర్పాట్లు రాజమహేంద్రవరం సిటీ: ఓటర్ల జాబితా తుది ప్రచురణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, జిల్లాలో 86,959 మంది ఓటర్లకు నోటీసులు అందించగా.. ఇందులో 86,250 మందికి సంబంధించిన విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా 709 కేసులు మాత్రమే విచారణకు పెండింగ్లో ఉన్నాయన్నారు. 81,735 మంది వివరాలను తుది ప్రచురణకు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,78,753 ఓటర్ల వివరాలు పరిశీలించగా, 13,84,978 వివరాలు తుది ప్రచురణకు సిద్ధం చేశామని తెలిపారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఓటరుకూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ఇన్చార్జి డీఆర్ఓ ఎస్.భాస్కర్రెడ్డి కూడా పాల్గొన్నారు. పింఛన్లకు 52,574 దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా కొత్త పింఛన్ల కోసం జిల్లాలో ఇప్పటి వరకూ 52,574 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లకు అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు తదితరులందరూ తమకు వర్తించే కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి వారి నుంచీ గ్రామ, వార్డు సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు దరఖాస్తు స్వీకరించాలని, అవసరమైన ధ్రువపత్రాలు అందుబాటులో లేవనే కారణంతో తిరస్కరించరాదని ఆదేశించారు. దరఖాస్తుదారులు అందజేసిన వివరాలను సంబంధిత అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలించి, అర్హతను నిర్ధారిస్తారని తెలిపారు. సర్వేల భారాన్ని తొలగించండి అడ్డతీగల: అటు ప్రజలకు ఇటు తమకు ఇబ్బందిగా మారిన సర్వేల్లో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లవరం పీహెచ్సీ ఎదుట వైద్య ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.సత్యవతి మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఎల్ఈపీ సర్వే వల్ల ప్రజలు, మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓటీపీ, వేలిముద్ర విషయంలో సాంకేతిక సమస్యల వల్ల సర్వే ముందుకు సాగడం లేదన్నారు. ఈ రెండు ఆప్షన్లను ప్రభుత్వం తొలగిస్తే సర్వే సులువవుతుందని చెప్పారు. లేదా రోజువారీ ఐదారుగురిని మాత్రమే సర్వే చేసేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సంబంధిత వైద్యాధికారులకు వినతిపత్రం అందజేశారు. -
కాకినాడ జిల్లా: పెళ్ళి బస్సును ఢీకొట్టిన కంటైనర్
సాక్షి, కాకినాడ జిల్లా: పెళ్లి బృందం బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పెళ్ళి బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు.. పల్టీ కొట్టింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగులకొట్టి బయటపడ్డారు.తుని సమీపంలోని తేటగుంట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పాడకు చెందిన పెళ్లి బృందం తునిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో 65 మందికిపైగా ఉన్నారు. 43 మంది గాయపడగా.. తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇదీ చదవండి: AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక -
పేమెంటుపై.. వాయింపు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నగదు రహిత లావాదేవీలకు మార్గం సుగమం చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానంలో కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అమలులోకి రానుండటంపై ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ ఫోన్పే, గూగుల్పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల ద్వారా ప్రజలు సులభంగా చెల్లింపులు చేసుకుంటున్నారు. అయితే, అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు పైబడిన కొన్ని వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. ప్రతి నెలా 39 లక్షల యూపీఐ లావాదేవీలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా సగటున 39 లక్షల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. గత నెలలో యూపీఐ లావాదేవీల ద్వారా జిల్లాలో రూ.150 కోట్లు పైగా నగదు బదిలీ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో నెలకు 1.1 మిలియన్ లావాదేవీలు రూ.12.07 కోట్లమేర జరుగుతున్నాయి. ఇందులో అధికంగా వ్యాపారాలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలే ఉన్నాయని బ్యాంకు వర్గాలు బెబుతున్నాయి. కరోనాకు ముందు ప్రజలు ఏం కావాలన్నా డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. కరోనా తర్వాత యూపీఐ లావాదేవీలు అధికంగా పెరిగాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం వడ్డన మొదలు పెట్టడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. వాయింపు ఇలా.. ● యూపీఐ ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు ఎంత మొత్తమైనా సరే ఎండీఆర్ చెల్లించనవసరం లేదు. ● ప్రతి నెలా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా రూ.లక్ష వరకూ స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులకు కూడా జీరో ఎండీఆర్ కొనసాగనుంది. ● వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపుల్లో కూడా రూ.2 వేల వరకు ఎలాంటి ఎండీఆర్ ఉండదు. ● రూ.2 వేలకు పైబడి పెద్ద వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. ● రూ.75 వేలు, అంతకు పైబడిన వ్యాపార లావాదేవీలపై రూ.300కే చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లిస్తే 0.4 శాతం ప్రకారం ఎండీఆర్ రూ.40 చెల్లించాలి. రూ.50 వేలకు రూ.200 చార్జీ ఉంటుంది. ● రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం సేవలు, బీమా ప్రీమియం, ఇంధనం, వ్యవసాయ పెట్టుబడి వంటి రంగాల్లో రూ.2 వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతానికి బదులు ప్రతి లావాదేవీపై రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ విధించనున్నారు. దీనిపై కూడా సంబంధిత వినియోగదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ● యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీని వ్యాపారే భరించాల్సి ఉంటుందని, వినియోగదారుల నుంచి వసూలు చేయరాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆమేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ● అయితే, ఈ భారాన్ని వ్యాపారులు ఎందుకు భరిస్తారని, ఆ చార్జీలు కూడా తమపైనే మోపుతారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు రూ.2 వేల వరకూ ఉచితం అని అంటున్నా.. రానున్న రోజుల్లో ప్రతి లావాదేవీపై కూడా చార్జీ విధించవచ్చనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులపై అదనపు భారం ఇప్పటి వరకూ యూపీఐ చెల్లింపులు పూర్తి ఉచితం కావడంతో చిన్నా పెద్దా వ్యాపారులందరూ విస్తృతంగా క్యూఆర్ కోడ్లు వినియోగిస్తున్నారు. ఇటువంటి దుకాణాలు, రెస్టారెంట్లు, ఆన్లైన్ వ్యాపార సంస్థలు, ఇతర వ్యాపారులకు కొత్త ఎండీఆర్ అదనపు భారంగా మారనుంది. ముఖ్యంగా అధిక విలువ కలిగిన లావాదేవీలు ఎక్కువగా జరిగే వ్యాపారాల్లో ఈ వ్యయం పెరిగే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా తమ లాభాలపై ప్రభావం పడుతుందేమోనని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధిక మొత్తంలో చెల్లింపులు చేసే వ్యాపారులకు మాత్రం వ్యయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టు ఈ అదనపు వ్యయాన్ని వ్యాపారులే భరిస్తారా లేక వస్తువులు, సేవల ధరల్లో ఏదైనా మార్పు చేసి, ఆ భారాన్ని వినియోగదారులపైనే మోపుతారా అనేది వేచి చూడాలి. కొత్త ఎండీఆర్ విధానంతో యూపీఐ లావాదేవీలు తగ్గవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. డిజిటల్ ఇండియా అన్నారు. నగదు లేని సమాజమని గొప్పలు చెప్పారు. పెద్దపెద్ద కార్పొరేట్ మాల్స్ నుంచి రోడ్డు పక్కన చిరు వ్యాపారాల వరకూ.. ఏది కొనుగోలు చేయాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, నగదు బదిలీ చేయవచ్చన్నారు. సేవలు ఉచితమంటూ ఎర వేశారు. అలా ప్రజలకు అలవాటు చేసి.. చేసి.. ఫోన్ లేనిదే బతుకు నడవని స్థితికి తెచ్చారు. ఇప్పుడు అదే ఫోన్ పేమెంట్లపై చార్జీల కత్తి పెడుతున్నారు. ఈ చార్జీలు వ్యాపారుల పైనే అని ఎన్పీసీఐ చెబుతున్నప్పటికీ.. అంతిమంగా తమ జేబుకే చిల్లు పడుతుందనే ఆందోళన వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది. యూపీఐ సేవలపై ఇకపై వడ్డన రూ.2 వేలకు పైబడిన వ్యాపార లావాదేవీలపై అదనపు చార్జీలు వచ్చే నెల 15 నుంచి అమలు వ్యాపారులు, వినియోగదారుల్లో ఆందోళన -
ధోల్కర్ గణేష్ను సందర్శించిన ‘యాత్రికుడు’
రాజానగరం: ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో దట్టమైన అడవుల మధ్య బైలాడిలా పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రసిద్ధి చెందిన ధోల్కర్ గణేష్ విగ్రహాన్ని దేశ సంచారిగా పేరొందిన దివాన్చెరువుకు చెందిన పెన్నాడ మోహన్ సందర్శించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను తన మోటారు బైక్పై సందర్శించి, అక్కడి విశేషాలను సేకరించడం హాబీగా చేసుకున్న ఈ యువకుడు ఇప్పటి వరకు దేశంలోని 23 రాష్ట్రాలలో సుమారు 43 వేల కిలో మీటర్లు పర్యటించాడు. నగదు, ఐఫోన్ అప్పగింతతుని: ఓ వృద్ధురాలు తాను కోల్పోయిన రూ.10 వేల నగదు, ఐఫోన్ను రైల్వే పోలీసులు తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డీఎల్ పురానికి చెందిన మెరుగు గంగమ్మ తన చెల్లెలి కుమారుడు రాజుతో కలిసి విశాఖపట్నం వెళ్లేందుకు బుధవారం ఉదయం తుని రైల్వేస్టేషన్కు వచ్చింది. రెండో నంబరు ఫ్లాట్ఫారంపై కూర్చున గంగమ్మ, రాజు కాకినాడ నుంచి విశాఖ వెళ్లే మెమూ రైలు ఎక్కే క్రమంలో చేతిలో ఉన్న సంచిని కూర్చున్న ప్రాంతంలో మరిచిపోయారు. తరువాత వారికి ఆ విషయం గుర్తుకు వచ్చి రేగుపాలెం రైల్వేస్టేషన్లో దిగి స్థానిక జీఆర్పీ ఎస్సై వీ సత్తిబాబుకు ఫిర్యాదు చేశారు. రెండో నంబరు ప్లాట్ఫాంపై తనిఖీ చేసి సంచిన గుర్తించిన రైల్వే పోలీసులు బాధితులకు అప్పగించారు. స్విమ్మింగ్లో ఉదయ్కుమార్కు కాంస్యం ఆసియా చాంపియన్షిప్నకు ఎంపిక యానాం: హర్యానాలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) అకాడమీ ఇన్చార్జి ఎన్.ఉదయకుమార్ కాంస్య పతకం సాఽధించారు. 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ఈ ఘనత సాధించారు. 2 వేలకు పైగా స్విమ్మర్లు ఈ పోటీల్లో పాల్గొన్న ఈ పోటీలో ఉదయ్కుమార్ ఈ ఘనత సాధించి 2026లో భారత్ నిర్వహించనున్న ఆసియా మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్లో భారత్ తరఫున ఎంపికయ్యారు. శాయ్ అకాడమీ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆసియా చాంపియన్షిప్నకు ఎంపిక కావడంపై పలువురు అభినందనలు తెలిపారు. -
మరిడమ్మ హుండీల ఆదాయం రూ.6.5 లక్షలు
సామర్లకోట: పెద్దాపురం మరిడమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.6,50,826 ఆదాయం వచ్చినట్లు ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. ఆగస్టు 17 నుంచి బుధవారం వరకు నెల రోజులకు సంబంధించి హుండీలను గురువారం లెక్కించారు. అమ్మవారి హుండీల ద్వారా రూ.6,21,222, అన్నదాన హుండీ ద్వారా రూ.29,604 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కానుకలుగా బంగారం 20.50 గ్రాములు, వెండి కిలో, 510 గ్రాముల హండీలలో లభించినట్లు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, దేవదాయశాఖ జేవీఓ వీవీ పళ్లంరాజు, తనఖీదారు వడ్డీ ఫణీంద్రకుమార్, ఈఓలు కె.లక్ష్మణ్, కె.జగదీశ్వరరావు, ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
పారిశుధ్యంపై కార్యాచరణ రూపొందించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పుష్కరాల నిర్వహణకు అవసరమైన పారిశుధ్య పనులపై సమగ్రంగా చర్చించి కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ఎంసీ, పంచాయతీరాజ్, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులతో ఈ మేరకు సమీక్షించారు. ఈ సందర్భంగా గత పుష్కరాల్లో నిర్వహంచిన పారిశుధ్య పనులపై చర్చించి రానున్న పరిస్థితులకు తగ్గట్టుగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఘాట్ల పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సేకరణ–తరలింపు, పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన యాత్రికుల సౌకర్యాలు వంటి అంశాలను ముందుగానే గుర్తించి, వాటికి అనుగుణంగా మౌలిక వసతులు, మానవ వనరులను అంచనా వేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సహాయ కలెక్టర్ కె.ఆదిత్య శర్మ అధికారులు పాల్గొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలి నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు శాసీ్త్రయ అధ్యయనాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్పై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరంలో గాలి నాణ్యతపై నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల వివరాలను పరిశీలించి, కాలుష్యానికి ప్రధాన కారణాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. శాసీ్త్రయ అధ్యయనాల ప్రకారం నగరంలోని దివాన్చెరువు, కంబాలచెరువు, ఆనం కళాకేంద్రం, ఆంధ్ర పేపర్ మిల్లు తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి అధికంగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఆయా ప్రాంతాల్లో కాలుష్యానికి కారణాలను గుర్తించి, వాటి నియంత్రణకు, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ–ఆటోలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.పుష్కర పనులపై కలెక్టర్ సమీక్ష -
పీడీఎస్ బియ్యం పట్టివేత
● రెండు వాహనాల సీజ్ ● సరకు విలువ రూ.4.6 లక్షలుకిర్లంపూడి: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని కృష్ణవరం టోల్ప్లాజా వద్ద బుధవారం ఉదయం రాజమహేంద్రవరం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై అవినాష్, తమ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. దీనిపై అడ్డతీగల నుంచి జగ్గంపేట వైపు వెళుతున్న అశోక్ లే లాండ్ బడాదోస్త్, బొలెరో వాహనాలు తనిఖీలు చేయగా సుమారు రూ.4.6 లక్షల విలువైన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులకు అప్పగించి, రవాణా చేస్తున్న వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ అడ్డతీగల, ఎర్రవరం గ్రామాల నుంచి జగ్గంపేట పరిసరాల్లోని పౌల్ట్రీ ఫారాలు, ఫిష్ఫారాలు, బ్రిక్స్ వర్కర్లకు ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఓ శ్రీరామ్, ఏఎంవీ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఎంఎస్ఓ నాగబాబు, వీఆర్వో అచ్యుతరావు, వీర్రాజు ఉన్నారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
● ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం ● ఆన్లైన్లో స్వీకరణ ● దరఖాస్తులకు అక్టోబరు 12.. పరీక్ష ఫీజుకు 13వ తేదీ తుది గడువురాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి, వారికి ఉపకార వేతనాలు అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సర్టిఫికెట్ (ఎన్ఎంఎంఎస్) పథకం 2026–27 సంవత్సరానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే ఈ పథకానికి ఏటేటా ఆదరణ పెరుగుతోంది. గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 478 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ పథకం కింద ఏటా నవంబర్లో పరీక్షలు నిర్వహించి ఎంపికై న విద్యార్థులకు నాలుగేళ్ల పాటు రూ.12 వేల చొప్పున ప్రోత్సాహకాలు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో కాకినాడ జిల్లా నుంచి 187, కోనసీమ జిల్లా నుంచి 141, తూర్పుగోదావరి జిల్లా నుంచి 150 మంది ఎంపికయ్యారు.విధి విధానాలివీ.. ఏడో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా ఈ పరీక్షకు అర్హత కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవ తరగతిలో 50 శాతం, మిగిలిన తరగతులకు చెందిన వారు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంది. ప్రవేశ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. జిల్లా ప్రాతిపదికగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి రూ.3.5 లక్షలకు మించి ఉండకూడదు. విద్యార్థికి ఆధార్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరు ఉండాలి. అక్టోబరు 12 ఆన్లైన్లో దరఖాస్తుకు తుది గడువు. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు అక్టోబరు 13 పరీక్ష రుసుం ఆన్లైన్ దరఖాస్తులోని ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించాలి. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్, లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంది. విద్యార్థులతో దరఖాస్తు చేయించాలి ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా డీఈవో, డీవైఈవో, ఎంఈవోలు, హెచ్ఎంలు పర్యవేక్షించాల్సి ఉంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగేందుకు ఈ ప్రవేశ పరీక్ష ఉపకరిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కని అవకాశం. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
జాతీయ స్థాయి ఇన్స్పైర్కు ‘స్మార్ట్ బ్యాంగిల్’
రాయవరం: ఇన్స్పైర్ మనక్ పోటీల్లో సోమేశ్వరం జెడ్పీ ఉన్నత పాఠశాల సత్తా చాటింది. 2023–24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న సాకా నాగ రమ్య రూపొందించిన ‘సేఫ్టీ బ్యాంగిల్ ఆర్ వాచ్ ఫర్ గరల్స్’ రాష్ట్ర స్థాయి ఆన్లైన్ ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై ంది. బాలికలు, మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రూపొందించారు. అనివార్య పరిస్థితి ఎదురైనప్పుడు చేతికి ధరించిన స్మార్ట్ బ్యాంగిల్లో ఒక బటన్ నొక్కగానే ఇంటి వద్ద, మరొక బటన్ ప్రెస్ చేస్తే పోలీసుస్టేషన్, మరొక బటన్ ప్రెస్ చేస్తే 108 వాహనానికి అనుసంధానం చేస్తూ ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు రూపొందించిన నాగ రమ్య ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దీంతో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న బర్నబాబు ప్రాజెక్టును ప్రదర్శించి, వివరించనున్నాడు. ప్రాజెక్టుకు సైన్స్ టీచర్ పి.మాధవి గైడ్గా వ్యవహరించారు. ఈ మేరకు నాగరమ్య, గైడ్ టీచర్ మాధవి, పాఠశాల హెచ్ఎం ఆర్.దయామణిని ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, పోలిశెట్టి రాంబాబు తదితరులు అభినందించారు. -
అదృశ్యమైన వ్యక్తి విగత జీవుడై..
గండేపల్లి: అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కన్న కొడుకుల మానసిక పరిస్థితిని, భర్త మృతిని తలుచుకుంటూ భోరున విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వివరాల్లోకి వెళితే.. మండలం తాళ్లూరుకు చెందిన మలిరెడ్డి రామచంద్రరావు (50) తాపిమేస్త్రి. ఈనెల 7న ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెదకినా ప్రయోజనం లేకపోవడంతో 14వ తేదీన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక హైవేను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 15వ తేదీన స్థానిక గొర్రెల కాపరికి అతని మృతదేహం కనపడింది. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని జెడ్ రాగంపేట సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతునికి భార్య సూర్యకుమారి ఉండగా, పెద్ద కొడుకు దుర్గాప్రసాద్ మానసిక దివ్యాంగుడని, పదో తరగతి చెదువుతున్న చిన్న కొడుకు నవీన్ ఫిట్స్తో బాధపడుతుంటాడని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మహిళ మృతికి కారణమైన వ్యక్తికి ఆరు నెలల జైలుహనుమాన్ జంక్షన్ రూరల్: 16వ నంబర్ జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి నూజివీడు కోర్టులో ఆరు నెలల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే 2022లో తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గొడవర్తి శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తూ బాపులపాడు మండలం వీరవల్లి వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అతని తల్లి లక్ష్మి వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, భార్య కీర్తన, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి వీరవల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, నూజివీడులోని జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీ ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శివ పార్వతి తీర్పు వెలువరించారు. ఈ కేసులో ముద్దాయి శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని వీరవల్లి ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కేసు చాగల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వివరాల ప్రకారం.. తణుకు మండలం ముద్దాపురానికి చెందిన బొల్లా శ్రీరామకృష్ణ కె.సావరంలోని కోస్టల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పని ముగించుకుని తన భార్య ఉమాదేవితో కలసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో విజ్జేశ్వరం డౌన్లోని ఆర్ఆర్ భోజన హోటల్ వద్దకు చేరుకునే సరికి, ఎదురుగా అతివేగంగా వచ్చిన వ్యాన్ వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కుడిచేయి చిటికెన వేలు విరగడంతో పాటు, ఒంటిపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అలాగే భార్య ఉమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, క్షతగాత్రులను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొల్లా ఉమాదేవి ఫిర్యాదుతో కొవ్వూరు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● అనుమానాస్పద స్థితిలో మృతి ● ఆదరణ కోల్పోయిన కుటుంబం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఆళ్ల నానికి నివాళి
దేవరపల్లి: ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి ఆళ్ల నాని పార్థివ దేహాన్ని బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు ఉన్నారు. పాలల్లో రసాయనాల కల్తీ వల్లే ఘోరం ఎన్హెచ్ఆర్సీకి ఆహార భద్రతా విభాగం నివేదిక అమలాపురం టౌన్: రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతంలో గత ఫిబ్రవరి నెలలో సంభవించిన కల్తీ పాల విషాదంపై అప్పట్లో అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేష్చంద్రవర్మ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ఎన్హెచ్ఆర్సీకి నివేదిక సమర్పించిందని రమేష్చంద్రవర్మ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలపడం వల్లే బాధితులకు కిడ్నీల వైఫల్యం సంభవించిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ తప్పిదం తేలడంతో అప్పట్లో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపింది. ఈ ఘోర ఘటనతో మృతి చెందిన 16 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1.60 కోట్ల పరిహారం అందజేశారని న్యాయవాది రమేష్చంద్రవర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని డెయిరీలపై నిరంతర నిఘాతో శాంపిల్స్ పరీక్షలు నిర్వహించే వరకూ తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన నిర్వాసితులకు పరిహారం చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామని, పూర్తిస్థాయిలో ఇచ్చిన అనంతరమే వారిని ఖాళీ చేయిస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ పి.ప్రశాంతి అన్నారు. ఆర్అండ్ఆర్ సమస్యలకు సంబంధించి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఆర్అండ్ఆర్ అధికారి శుభం నొఖ్వాల్తో కలిసి బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆమె గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల నుంచి వచ్చిన నిర్వాసితుల వినతులను స్వీకరించారు. అనంతరం కమిషనర్ విలేకర్లతో మాట్లాడుతూ మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మి నిర్వాసితులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే వన్టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకున్న వారికి పరిహారం సొమ్ములు జమవుతున్నాయన్నారు. మిగిలిన నిర్వాసితులకు కూడా ఈ నెలాఖరుకల్లా పరిహారం జమచేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని ఇళ్లను ముంపులో చేర్చి మరికొన్నింటిని ముంపులో చేర్చలేదంటూ వినతులు వస్తున్నాయని, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎల్పీ షెడ్యూల్ ఆధారంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. దీనిపై మరోసారి సర్వే జరిపి తగిన చర్యలు చేపడతామని, కాగా ఆర్అండ్ఆర్ పరిహారం మాత్రం గ్రామం యూనిట్గానే పరిగణించి చెల్లిస్తామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్ 41.15 కాంటూరు లెవల్కు సంబంధించి ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రస్తుతం పరిహారం చెల్లిస్తున్నామని, రెండో ఫేజ్ 45.72 కాంటూరు లెవల్కు సంబంధించి ముంపునకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి వచ్చే ఏడాది సర్వే నిర్వహిస్తామన్నారు. ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) ఆధారంగా ముంపు గ్రామాల గుర్తింపు ఉంటుందని, వరదల అంచనా ఆధారంగా ముంపు గ్రామాలను పరిగణనలోకి తీసుకోవడం జరగదని పేర్కొన్నారు. 41.15 కాంటూరులో ముంపునకు గురవుతున్న 32 గ్రామాలకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో ఆర్అండ్ఆర్ ప్రక్రియ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. -
‘కూటమి’గా రోడ్డెక్కారు!
ఎటపాక: తమ ప్రభుత్వంలో రోడ్లు బాగు చేశామంటూ అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడేమో కూటమి నేతలే రోడ్డెక్కడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని ఎటపాక నుంచి కన్నాయిగూడెం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇసుక లారీలు వెళ్తుడడంతో ఆంధ్రా పరిధిలోని రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారికి కనీసం మరమ్మతులు చేయించకపోవటంతో విసిగిపోయిన అధికార పార్టీ నేతలే రోడ్డెక్కటం గమనార్హం. అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, ఫలితం లేదని బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎటపాక ప్రధాన రహదారిపై బైటాయించి ఇసుక లారీలను అడ్డుకున్నారు. లారీల కారణంగా గోతులు పడడంతో కనీసం ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శించారు. చివరికి టీడీపీ నేతలే టిప్పర్లతో రాళ్లు తెచ్చి గోతుల్లో పోసి కొద్దిపాటి మరమ్మతులు చేసుకున్నారు. కాగా సమస్యపై చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ స్పందించారని, ఈ రహదారి పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పినట్లు కూటమి నేతలు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, కూటమి నేతలు మువ్వా శ్రీనివాసరావు, మారాసు గంగాధర్, మూడే సతీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.రహదారి బాగుచేయాలంటూ ఆందోళన -
కోటయ్య కమిటీతో కోతలు!
● చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ధ్వజం ● మునికూడలిలో మాజీ సర్పంచ్తో పాటు 70 మంది పార్టీలో చేరిక సీతానగరం: ఎన్నికల్లో రైతుల రుణమాఫీ చేస్తానని నమ్మించి 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు... కోటయ్య కమిటీ వేసి కోత కోశారని, ఈ దఫా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం మండలం మునికూడలిలో మాజీ సర్పంచ్ బండి హరిబాబుతో పాటు వివిధ పార్టీల నుంచి వచ్చిన 30 మందికి ఆయనతో పాటు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్సార్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన వ్యక్తులు పార్టీలోకి రావడం శుభ పరిణామని తెలిపారు. ప్రజల కోసం రాజకీయం చేసే జక్కంపూడి రాజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఉచిత విద్యుత్, జలయజ్ఞంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, చంద్రబాబు పాలనలో ధరలు పెరిగి ప్రజా వ్యతిరేకత పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెపుతారని వేణు హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారు : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరించిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. నాలుగు లైన్ల స్టేట్ హైవే తన హయాంలో పూర్తి చేయడం సంతృప్తి ఇచ్చిందన్నారు. బొబ్బిలంకలో రూ.38 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఈ ప్రభుత్వ రెండున్నరేళ్లలో దానిని పూర్తిచేయలేకపోయారని అన్నారు. రఘుదేవపురంలోని 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తమ హయాంలో శంకుస్థాపన చేస్తే, దానిని పూర్తి చేయడానికి నేటికీ కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం లేదన్నారు. 100 కోట్ల వ్యయంతో రివర్స్ పంపింగ్ స్కీం ద్వారా 25 వేల ఎకరాల పంట భూమిని ముంపు బారి నుంచి రక్షించాలని ప్రయత్నించామన్నారు. 230 కోట్లతో గోదావరి జలాలను శుద్ధిచేసే తాగునీటి ప్రాజెక్టును తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలో 20వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వ కాలంలో ఎవరికీ సెంటు భూమి కానీ, పింఛన్లు కానీ ఇవ్వలేదన్నారు. కరోనా విపత్తులో సైతం అన్ని పథకాలను కొనసాగించిన ఘనత మాజీ సీఎం జగన్దేనన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీతో పాటు రేషన్ బియ్యాన్ని అమ్ముకునే స్థాయికి స్థానిక ఎమ్మెల్యే దిగజారారన్నారు. రానున్న రోజుల్లో హరిబాబుకు సముచితస్థానం కల్పిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పురుషోత్తపట్నం నుంచి బొబ్బిలంక వరకు ఏటిగట్టుకు అవసరమైన ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మింస్తామని రాజా ప్రకటించారు. పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో కన్వీనర్ కరుటూరి శ్రీహరిబాబు, పెందుర్తి దేవదాసు, ముత్యాలు, కవల కృష్ణమూర్తి, అంబటి రాజు, కొంచ చంద్రభాస్కర్, పిచ్చుకుల విజయ్ కుమార్లు ప్రసంగించారు. అనంతరం హరిబాబుతో పాటుగా బండి శ్రీను, మల్లి శ్రీను, బండి బ్రహ్మాజీ, బండి బుజ్జి, పాత్రగడ వెంకటలక్ష్మి, గంగరాజుల నాగేశ్వరరావు, పాత్రగడ రామారావు, రేలంగి వెంకన్న, ఇండుగుమిల్లి రాజారావు, కొల్లి అబ్బురావులతోపాటుగా మరో 40 మందికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, పార్టీ నాయకులు వాలంటీర్ల విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరి పెదపాటి డాక్టర్బాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వలవల వెంకట్రాజు, చల్లమళ్ల సుజీరాజు, ఆకుల సత్యనారాయణ, కవల దుర్గం, ఎల్ఐసీ ఏసు తదితరులు పాల్గొన్నారు. -
కట్టుకోలేకున్నాం..!
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వంలో పథకం ఏదైనా అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఇటీవల పంపిణీ చేసిన యూనిఫామ్ చీరలే ఇందుకు నిదర్శనం. ఒకటి రెండు సార్లు ఉతికితే చీకిపోయి, చిరిగిపోయి మరోసారి కట్టుకోవడానికి వీలు లేనంతగా తయారవుతుండడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కూడా విలువ చేయని చీరను సుమారు రూ.500కు ఐసీడీఎస్కు కట్టబెట్టేశారని... కాంట్రాక్టర్ రూ.200 మిగుల్చుకుంటే, మిగిలిన రూ.200 అనుయాయుల జేబుల్లోకి వెళ్లిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉతుక్కే రంగు వెలిసిపోయేలా.. జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,798 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మొత్తం 7,192 చీరలు పంపిణీ చేశారు. వాస్తవానికి ఇవన్నీ మూడు నెలల క్రితమే జిల్లాకు వచ్చాయి. అయితే ఇవి నాసిరకంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో కొద్ది రోజులు గొడౌన్లలోనే మూలిగాయి. ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న చీరలను కొద్ది మంది ధరించినప్పటికీ తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా పలుచగా ఉండడంతో పాటు ఒక్క ఉతుక్కే రంగు మొత్తం వెలిసిపోవడంతో ఇబ్బందికరంగా ఉంటోందని చెబుతున్నారు. ప్రస్తుతం వీటిని పక్కన పెట్టేసి సాధారణ దుస్తుల్లోనే ఆయా కేంద్రాల్లో విధులకు హాజరవుతున్నారు. కాంట్రాక్టర్కు అండదండలు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లతో విజయవాడలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నాణ్యత లేని చీరల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో వాటి పంపిణీని నిలిపివేయాలని, ఇప్పటికే పంపిణీ చేసిన వాటిని వెనక్కు తీసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి పంపిణీ చేసే యూనిఫామ్ను కూడా పరిశీలించే తీరిక పాలకులకు, ఆ శాఖ ఉన్నతాధికారులకు లేదా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు పంపిణీ చేసే చీరల్లోనూ కక్కుర్తిపడిన కాంట్రాక్టర్ను కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఆ చీరలు కట్టుకోవద్దని చెప్పాం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పంపిణీ చేసిన చీరలను కట్టుకోవద్దని సూచించాం. వీటి నాణ్యతను పరిశీలించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇందుకోసం కొన్ని చీరలను అమరావతి పంపించాం. ఇప్పటికే పంపిణీ చేసిన వాటిని వెనక్కు తీసుకోవాలని సీడీపీవోలను ఆదేశించాం. – శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్ జిల్లాలోని అంగన్వాడీల వివరాలు ఇవీ..ప్రాజెక్టు కేంద్రాలు సిబ్బంది గోపాలపురం 234 468 కొవ్వూరు 223 446 కోరుకొండ 228 456 మండపేట 242 484 పెరవలి 211 422 రాజమహేంద్రవరం 165 330 రాజానగరం 311 622 రంగంపేట 184 368 మొత్తం 1,798 3,596 అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి నాసిరకం యూనిఫాం నాణ్యత లేని చీరలతో అవస్థలు రూ.వంద చీరకు రూ.500 వెచ్చింపు ఒక్క ఉతుక్కే చీకిపోతున్న వైనం జిల్లాలో 7,192 మందికి పంపిణీ నాణ్యత పరిశీలించకుండా వాడొద్దని సిబ్బందికి అధికారుల సూచన -
కష్టం చేతికందడం లేదు!
పెరవలి: కంద రైతులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లాభాల బాట పడితే నేటి కూటమి ప్రభుత్వంలో కనీస గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టు కంద ధర రూ.3,800 పలకడంతో దిగుబడి బట్టి ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షలు నష్టపోవలసి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పుట్టు కంద ధర రూ.11 వేలు ఉండగా నేడు అదే రూ.3800కి పడిపోయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గటంతో పాటు ధరలు పతనం కావడంతో పెట్టుబడి కూడ రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుండి 60 పుట్టులు దిగుబడి రావడంతో రైతులు నష్టాలు పాలై ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఎకరం కంద చేను తవ్వితే 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తోందని, దీని వల్ల రైతులకు ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షల వరకు నష్టం రావడంతో రైతులు అల్లాడుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా.. కంద పంట గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగవుతోంది. డివిజన్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, అనపర్తి గోపాలపురం, దేవరపల్లి, కడియం, రాజానగరం మండలాల్లో 1450 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. లాభాల నుంచి నష్టాలకు కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.8 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.3,800 ఉండటం, దానికి తోడు దిగుబడి తగ్గడంతో రైతులకు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత మార్కెట్టులో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్లకు రూ.1.9 లక్షలు, 60 పుట్లకు రూ.2.28 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.4.35 లక్షలు ఒక ఎకరానికి అయ్యిందని దీనితో దిగుబడి బట్టి ఎకరానికి రూ.2.05 లక్షల నుంచి రూ.2.45 లక్షలు నష్టపోవలసి వస్తోంది. పెట్టుబడి ఎకరం కంద పంట వేయాలంటే 30 పుట్టుల విత్తనం వేయాలని అందుకు గత ఏడాది విత్తనం ధర పుట్టు రూ.8 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.2.4 లక్షలు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి కూలీలకు రూ.లక్ష అవుతోందని, పెంట వేయటానికి రూ.30 వేలు, ఎరువులు పురుగుమందులకు రూ.40 వేలు, నీటి తడులు, కలుపు తీతకు రూ.25 వేలు అవుతుందని మొత్తం ఖర్చు రూ.4.35 లక్షలు అవుతోంది.ధరలు ఇలా కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పుట్టు (232 కిలోలు) రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.3,800 వద్ద స్థిరంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో పుట్ట ధర రూ.7 వేలు ఉండగా నేడు రూ.3800 వేలుకు పడిపోవటంతో అయోమయంలో ఉన్నారు. సగానికి సగం పడిపోయిన ధరలు మార్కెట్లో పుట్టు ధర రూ.3,800 గత ప్రభుత్వంలో రూ.11 వేలు ఉండగా గత ఏడాది రూ.7 వేలు ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు అప్పు ఎలా తీర్చాలో.. మూడు ఎకరాలలో కంద పంట వేశాను. గత నష్టాలను పూడ్చుకుందామనుకుంటే ఈ ఏడాది మరింత ధర తగ్గిపోయింది. దీనితో మూడు ఎకరాలకు సుమారుగా రూ.6 లక్షలు నష్టపోయాను. అప్పు ఎలా తీర్చాలో తెలియటం లేదు. – బొలిశెట్టి శ్రీనివాస్, రైతు, మల్లేశ్వరం ధర లేక నష్టపోతున్నాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో నేడు నష్టాలు పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తోందనుకుంటే నేడు ఒక ఎకరానికి రూ.2.45 లక్షలు నష్టపోయాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పుట్టు కంద ధర రూ.11 వేలు పలికితే నేడు రూ.5 వేలు పలుకుతోంది. – రాయుడు లీలా బాబు, రైతు, ఖండవల్లి -
ఎక్కడున్నావ్ జానూ!
తూర్పుగోదావరి: నాన్న కోసం వెంట పడి వెళ్లిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి వంద రోజులైంది. కానీ ఇంత వరకు ఆ పాప ఆచూకీ తెలియలేదు. కన్నబిడ్డ వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు సుంకర గణేష్ భవాని ఎదురు చూపులు చూస్తున్నారు. తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి (జాను), పెంపుడు కుక్క జూన్ ఆరో తేదీన ఆయిల్పామ్ తోటలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అదృశ్యమైన కొద్దిసేపటికే స్థానికులతో కలసి పరిసర ప్రాంతాలు, సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని వెతికినప్పటికీ జాను కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పది రోజులకు పైగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్టు, హనుమాన్ బృందాలు, క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అణువణువూ జల్లెడ ఆయిల్పామ్ తోట, సమీపంలోని అటవీ ప్రాంతం, పరిసర గ్రామాల్లో సైతం ఆయా బృందాలు అణువణువూ గాలించాయి. నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి వెతికాయి. అడవి జంతుల బారిన పడిందేమోన్న కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అటుగా రాకపోకలు సాగించిన అనుమానిత వాహనాలను తనిఖీ చేయడంతో పాటు సమీప సెల్ టవర్ల పరిధిలో ఫోన్ కాల్స్ను విస్తృతంగా పరిశీలించాయి. ఆయా గ్రామాల్లో ఇంటింటా తనిఖీలు నిర్వహించి జాను ఆచూకీ కోసం యతి్నంచాయి. ఆ ఆశతో బతుకుతున్నాం జాను తుని 06 పేరుతో ఇటీవల యూట్యూబ్ చానల్ ప్రారంభించాం. దానిలో జాను చిన్నప్పటి ఫొటోలు, వీడియోలను ఉంచుతున్నాం. వాటిని చూసి, ఎప్పటికైనా ఇంటికి చేరుతుందన్న ఆశతో బతుకుతున్నాం. ఎవరైనా పాపను తీసుకువెళితే మా బాధను అర్థం చేసుకుని అప్పగించండి. – సుంకర భవాని (జ్ఞానేశ్వరి తల్లి)కుక్క మృతితో నిరాశ జానుతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క నాలుగో రోజు ఇంటికి తిరిగి రావడంతో పాప ఆచూకీ లభిస్తుందన్న ఆశలు రేగాయి. కానీ మరుసటి రోజే కుక్క మరణించడంతో దర్యాప్తు బృందాలకు నిరాశే మిగిలింది. చిన్నారి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పాప ఆచూకీ లభించక పోవడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు నిలిపివేశాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు అంతర్గత విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ, హోంమంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాయి. కొందరు గిరిజన ప్రాంతంలో గాలించడంతో పాటు చిన్నారి ఫొటోతో ఉన్న పోస్టర్లు పంపిణీ చేశారు. ఇదీ చదవండి: ‘సిట్తో లాభంలేదు.. సీబీఐ దర్యాప్తునకే ఆదేశించండి’ -
● గణ స్వాగతం
గణపతి నవరాత్ర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకునికి ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 9,999 కొబ్బరి బొండాలతో ఏర్పాటు చేసిన నందీశ్వర నారికేళ గణపతి, రాజేంద్ర నగర్లో రుద్రాక్షల గణపతి, లక్ష్మ్మీవారపుపేటలో రాఖీల గణనాథుడి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. ధవళేశ్వరంలో గాజుల గణేశుడు, రథం వీధిలోని పద్మనాభ గణపతి ప్రత్యేకంగా నిలిచాయి. – సాక్షి, నెట్వర్క్ -
విహారం.. విషాదాంతం
● కొంపముంచుతున్న నిర్లక్ష్యం ● ప్రాణాలు కోల్పోతున్న యువత ● డెత్స్పాట్లుగా వాగులు, వ్యూ పాయింట్లు చింతూరు: రంపచోడవరం Hgñæ-ె-±ÞÌZ Ñà-Æý‡-Ķæ*-{™èlË$ M>Ýë¢ ÑÚë-§ýl-Ķæ*-{™èlË$V> Ñ$W-Í-´ù™èl$-¯é²Æ‡$$. EÌêÏ-çÜ…V> VýSyìl-õ³…-§ýl$MýS$ G…™ø E™éÞçßæ…V> CMýSP-yýlMýS$ Ð]lçÜ$¢¯]l² ç³Æ>År-MýS$Ë$ °Æý‡Ï-„ýSÅ…™ø {ç³Ð]l*-§éË$ Mö° ™ðl^èl$a-MýS$…r* {´ë×êË$ MøÌZµ™èl$-¯é²Æý‡$. {糫§é-¯]l…V> G…™ø ¿ýæÑ-çÙÅ-™èl$¢¯]l$ ^èl*yé-ÍÞ¯]l Ķæ¬Ð]l™èl Ý벯éÌS Ððl*gñæ$ÌZ ºÌSÐ]l#™èl* MýS¯]l²-Ðé-ÇMìS MýSyýl$-ç³#-Mø™èl Ñ$VýS$-Ë$çÜ$¢-¯é²Æý‡$. Hgñæ-ె-±ÞÌZ VýS™èl Æð‡…yól-â¶æ$ÏV> ÑÑ«§ýl fÌS-´ë-™éË$, òÜÌS-Äôæ$-Æý‡ÏÌZ ç³yìl 30 Ð]l$…¨ Ð]lÆý‡MýS$ Ð]l$–† ^ðl…§éÆý‡$. Hgñæ-±ÞÌZ° Ð]l*Æó‡yýl$-Ñ$-ÍÏ Ð]l$…yýl-ÌS…ÌZ fÌS™èl-Æý‡…-W×ìæ, AÐ]l$–-™èl«§éÆý‡, §ýl$ç³µÐ]l-ÌSçÜ, ´ëÐ]l¬ÌôæÆý‡$, Æý‡…ç³^ø-yýlÐ]lÆý‡… Ð]l$…yýlÌS…ÌZ Æý‡…ç³, Ayýlz-¡-VýS-ÌSÌZ í³…fÇ-Mö…yýl, Æ>f-Ðö-Ð]l$Ã…-WÌZ `MýS$«§éÆý‡, _…™èl*Æý‡$ Ð]l$…yýl-ÌS…ÌZ ´÷Ë*ÏÆý‡$, »Ÿ-yýl$z-VýS*yðl… fÌS´ë-™éË$-¯é²Æ‡$$. _…™èl*Æý‡$, Ð]l*Æó‡yýl$-Ñ$ÍÏ çœ*sŒæ-Æø-yŠæÌZ Æð‡…yýl$ Ð]lNÅ ´ëƇ$$…r$Ï Ð]l#¯é²Æ‡$$. VýS$yìlòÜ íßæÌŒæÞ™ø ´ër$ ç³Ë$ ÇÝë-ÆŠ‡tË$ MýS*yé CMýSPyýl Ð]l#¯é²Æ‡$$. ÒsìæÌZ {糫§é-¯]l…V> ´ëÐ]l¬ÌôæÆý‡$, ´÷Ë*ÏÆý‡$ fÌS-´ë-™èl…, ™èl$ÌSíÜ-´ëMýS Ð]lNÅ ´ëƇ$$…sŒæ Ð]l§ýlª fÆý‡$-VýS$-™èl$¯]l² {ç³Ð]l*-§éÌZϯól A«¨MýS-çÜ…-QÅÌZ Ķæ¬Ð]l™èl ºÌSÐ]l#-™èl$-¯é²Æý‡$. కట్టిపడేసే అందాలెన్నో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, గలగలా పారే సెలయేర్లు, కొండల మాటున దాగివున్న మబ్బుతెరలు, శీతాకాలంలో కనువిందు చేసే మంచుదుప్పట్లు వంటి అందాలు ఏజెన్సీ సొంతం. నిత్యం రద్దీగా వుంటూ బిజీలైఫ్ గడిపే ఎంతో మంది ప్రకృతి ప్రసాదించిన అలాంటి అందాలను తిలకించేందుకు విహారయాత్రల పేరుతో పట్టణ ప్రాంతాల నుంచి వేలమంది పర్యాటకులు ఏజెన్సీకి వస్తున్నారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చేవారికి రంపచోడవరం దాటగానే ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. ఇక్కడకు కుటుంబాలతో కలసి వస్తున్న పర్యాటకులు జలపాతాలు, సెలయేర్లలో సందడి చేస్తున్నారు. కొంతమంది అడవుల్లో వున్న రిసార్ట్లలో రాత్రిపూట గడుపుతూ వీకెండ్ను ఎంజాయ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం, ప్రాణాపాయం ఇక్కడకు వస్తున్న పర్యాటకులు జలపాతాలు, సెలయేర్ల లోతును అంచనా వేయక నిర్లక్ష్యంతో వాటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాలు, సెలయేర్లలో కొన్నిచోట్ల కనబడకుండా లోతైన గోతులు ఉండడంతో సరిగా ఈతరాని పర్యాటకులు వాటిలో చిక్కుకుని బలవుతున్నారు. దీంతో పాటు కొంతమంది యువత సెల్ఫీల మోజులో జలపాతాల పైకి వెళ్లి సెల్ఫీలు తీసుకునే క్రమంలో అక్కడి నుంచి కిందనున్న బండరాళ్లపై పడుతున్నారు. ఇదే క్రమంలో వెనుకనున్న నీటితో సెల్ఫీలు తీసుకునేందుకు సెలయేళ్ల అంచుల వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాటిలో పడి మృత్యువాత పడుతున్నారు. మరోవైపు చాలామంది పర్యాటకులు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద మద్యం తాగి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం మత్తులో జలపాతాల వద్దనున్న బండరాళ్లపై ఎక్కుతుండడంతో అక్కడి నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. డెత్ స్పాట్లుగా.. ప్రధానంగా ఘాట్రోడ్లో తులసిపాక సమీపంలోని వ్యూ పాయింట్, పొల్లూరు జలపాతం, దారాలమ్మ పిక్నిక్ స్పాట్, పాములేరు వాగు డెత్స్పాట్లుగా మారాయి. ఈ ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు సంభవించడంతో వాటిపై దృష్టి సారించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతాలు, వాగులు, వ్యూ పాయింట్ల వద్ద ప్రమాదం పొంచి వుందని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెడుతున్నా పర్యాటకులు వాటిని పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. ‘మీ విహారయాత్రలో విషాదం జరగకుండా మీ జీవితం మీ చేతుల్లోనే’ అనే కాప్షన్తో ఏర్పాటు చేసిన ఈ బోర్డుల్లో ఆయా ప్రదేశాల్లో బండరాళ్లు, లోతైన గుంటలు, ఊబి ప్రాంతాలు ఉంటాయని, వాగులో స్నానాలు చేయడం, ఈతకొట్టడం, సెల్ఫీలు దిగడం చేయవద్దని సూచించారు. హటాత్తుగా నీటిప్రవాహం పెరిగే అవకామున్నందున అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్న పోలీసుల మాటలను పర్యాటకులు పెడచెవిన పడుతున్నారు. ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల మధ్యలో వున్న రాళ్లపైకి వెళుతున్న యువత పట్టుజారి నీటి ఉధృతికి గల్లంతై మృత్యువాత పడుతున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి మన్యం అందాలు తిలకించేందుకు వస్తున్న పర్యాటకులు వాగులు, జలపాతాల వద్ద స్నానాలకు దిగేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. లోతు తక్కువగా వున్న ప్రాంతాల్లో మాత్రమే స్నానాలు చేయాలి. మద్యం తాగడం, బండరాళ్లపై ఎక్కడం వంటి చర్యలు మానుకోవాలి. ప్రమాదాల నివారణకు జలపాతాలు, వ్యూ పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం. – గోపాలకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్, చింతూరు మృతి చెందిన వారి వివరాలు ఇలా.. రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని పర్యాటక కేంద్రాల వద్ద జరిగిన వివిధ ప్రమాదాల్లో 30 మంది మృతి చెందారు. చింతూరు సర్కిల్లోని మోతుగూడెం పోలీసుస్టేషన్ పరిధిలో 13 మంది వరకు, డొంకరాయి పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు, చింతూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఐదుగురు మృతి చెందగా ఎటపాక సర్కిల్లోని వీఆర్ పురం పోలీసుస్టేషన్ పరిధిలో ఒకరు మృతి చెందారు. మారేడుమిల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని పాములేరు వాగులో మునిగి ఐదుగురు, జలతరంగిణి వద్ద మునిగి నలుగురు మృతి చెందారు. తాజాగా మంగళవారం చింతూరు మండలం తులసిపాక సమీపాన సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద జరిగిన ఘటనలో విజయవాడకు చెందిన కోసూరు నీలేష్ (26) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వాగులో పడి మృతి చెందాడు. -
ఎన్నాళ్లీ గ్యాస్ కబుర్లు!
సాక్షి, రాజమహేంద్రవరం: కొత్త కనెక్షన్ల మంజూరు విషయంలో ఏజెన్సీలు గ్యాస్ కబుర్లు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా కొన్నాళ్ల క్రితం గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో కొత్త కనెక్షన్ల మంజూరు, రెండో సిలిండర్ కేటాయింపును ప్రభుత్వం నిలిపేసింది. ప్రస్తుతం యుద్ధ ప్రభావం కొంత వరకూ తగ్గి పరిస్థితులు చక్కబడినా ఏజెన్సీల తీరు మారడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వమూ స్పందించడం లేదు. ఫలితంగా కొత్తగా వివాహమైన వారు, ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడిన వారు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, 5 కిలోల సిలిండర్లు కొనుగోలు చేసుకుంటున్నారు. రెండో సిలిండర్ లేక.. జిల్లాలోని 52 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 5,12,135 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లబ్ధిదారుల్లో కొందరికి రెండో సిలిండర్ లేదు. దీంతో ఇంట్లో ఉన్న ఒక్క సిలిండర్ అయిపోయిందంటే ఆ పూట వంట చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు పక్కల వారిని అడిగి తీసుకోవాల్సి వస్తోంది. ఆ అవకాశం లేకుంటే బుక్ చేసుకున్న సిలిండర్ వచ్చేంత వరకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కటే సిలిండర్ ఉన్న వారిలో చాలా మంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు కొనుక్కుని వంట చేసుకుంటున్నారు. జిల్లాలో 52 ఏజెన్సీలు ప్రస్తుతం జిల్లాలోని 52 ఏజెన్సీల పరిధిలో సగటున 80 మంది చొప్పున సుమారు 4 వేల మంది దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త కనెక్షన్ కోసం కొందరు, రెండో సిలిండర్ కోసం మరికొందరు నిరీక్షిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రూ.1700 వెచ్చించి 5 కిలోల సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. అందులోని గ్యాస్ అయిపోయిన వెంటనే ఏజెన్సీల వద్దకు పరుగులు తీసి దాన్ని నింపుకొంటున్నారు. మరోవైపు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కోసం 10 కిలోల సిలిండర్లు తీసుకొస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం మాట నేటికీ నెరవేరలేదు. కొద్ది రోజుల కిందట ఒకటీ రెండు ఏజెన్సీలు మాత్రం ఈ పది కిలోల సిలిండర్లను తీసుకొచ్చాయి. అయితే కొత్త కనెక్షన్లు అందించడంతో పాటు రెండో సిలిండరు మంజూరు చేస్తేనే తమకు ఉపశమనం లభిస్తుందని వినియోగదారులు వేడుకుంటున్నారు. యుద్ధ ప్రభావం తగ్గినా మంజూరు కాని కొత్త కనెక్షన్లు రెండో సిలిండర్ కేటాయింపునూ నిలిపేసిన ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ వినియోగదారుల చక్కర్లు -
రాజమహేంద్రవరానికి తెలుగు సినిమాతో అనుబంధం
రంగంపేట: తెలుగు సినిమా టాకీ ప్రస్థానం ప్రారంభమై 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రంగంపేటలో మంగళవారం 95వ సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు అడబాల మరిడయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా ప్రస్థానం, రాజమహేంద్రవరం ప్రాంతంతో సినీ రంగానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా టాకీ యుగానికి భక్త ప్రహ్లాద చిత్రంతో 1931 సెప్టెంబర్ 15న శ్రీకారం చుట్టిందన్నారు. రాజమహేంద్రవరంలో నిడమర్తి కుటుంబం దుర్గా సినీ స్టూడియోను 1935లో నిర్మించిందని, దీనిలో రామ విజయం చిత్రానికి ఇండోర్ షూటింగ్ నిర్వహించి, 1936 జూలై 20న విడుదల చేశారన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన మూగమనసులు చిత్రంలోని సుమారు 75 శాతం అవుట్డోర్ చిత్రీకరణను 1963లో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు, గోదావరి నది, కోటిపల్లి, కోనసీమ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,100 సినిమాల చిత్రీకరణలు జరిగాయన్నారు. కార్యక్రమంలో పిచ్చుకల అచ్యుత రామారావు, గారపాటి వెంకట్రావు, ఉండవిల్లి పెద్దరాజు, ఉండవిల్లి బుల్లి సత్తిరాజు, గోపిన వెంకట్రావుతదితరులు పాల్గొన్నారు. -
సూపర్ మోసం
● 50 ఏళ్లకే పింఛన్ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ● అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా అమలు చేయని ప్రభుత్వం ● బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వెన్నుపోటు ● స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ● ఇప్పుడూ 50 ఏళ్లు దాటిన వారికి దక్కని భరోసా సాక్షి, రాజమహేంద్రవరం/సీతానగరం/నిడదవోలు రూరల్: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్ కో అన్ని వర్గాలకూ తమదైన స్టైల్లో వెన్నుపోటు పొడిచారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వాటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ప్రజలందరినీ కూటమి నాయకులు నమ్మించి వంచించారు. ముఖ్యంగా సమాజంలో అత్యధిక శాతం కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ హామీపై స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవడంతో 50 ఏళ్లు దాటిన అర్హులు నిరాశకు గురవుతున్నారు. తమకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఊరూరా ఊదరగొట్టి.. ఎన్నికల సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్ అందిస్తామని గొప్పగా ప్రకటించడంతో ఆయా వర్గాల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని పలువురు భావించారు. అయితే రెండేళ్లు పూర్తయినా కొత్తగా ఈ పథకం కింద పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదని వాపోతున్నారు. 2.3 లక్షల మందికి నిరాశ తూర్పుగోదావరి జిల్లాలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీలు సుమారు 2.3 లక్షల మందికి పైగా ఉన్నారు. 60 ఏళ్లు దాటకపోవడంతో వీరికి సాధారణ పింఛన్కు అర్హత లేదు. అదే సమయంలో చంద్రబాబు హామీ అమలుకు నోచుకోకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచారని ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు, కుల వృత్తులపై ఆధారపడేవారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని వారు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పనిచేసే సామర్థ్యం తగ్గుతున్నా ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదని వాపోతున్నారు. ఇప్పుడూ పింఛన్లపై అనుమానాలే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రకటన చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసిన వారికి ఎన్నికల ముందు దరఖాస్తుల ప్రక్రియ తెరపైకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ఇప్పుడు పింఛన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రతిపక్షాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోనీ ఇప్పుడైనా ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా హామీ ఇచ్చిన 50 ఏళ్లకే పింఛన్ అంశంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి పింఛన్ అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయాం 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామంటే ఎంతో సంతోషించాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడో ఏడాది వచ్చేసింది. నేటికీ ఆ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తులు స్వీకరించడం కూడా ఎన్నికల స్టంట్లో భాగమే. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భవిష్యత్తులో బాబును నమ్మే పరిస్థితి లేదు. ప్రజలంతా తిరగబడకముందే హామీలు అమలు చేయాలి. – బట్టు వెంకటరత్నం (54 ఏళ్లు), ఎస్సీ సామాజిక వర్గం, సమిశ్రగూడెం హామీ అమలు చేయాల్సిందే 50 ఏళ్లు దాటినప్పటికీ పింఛన్ మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్, లోకేశ్ ఇచ్చిన హామీలు నమ్మాం. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా వాటి అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చంద్రబాబు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – కొరుపుల కృష్ణ (58 ఏళ్లు), మిర్తిపాడు, వెలమ సామాజికవర్గం ఆశలపై నీళ్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా కొత్త దరఖాస్తుల ప్రకటనతో సరిపెట్టడం వల్ల మా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మా ఓట్లతో అధికారంలోకి వచ్చాక హామీని మరిచిపోవడం దారుణం. వయసు పెరుగుతున్న సమయంలో మాకు ప్రభుత్వం అండగా నిలుస్తుందనుకుంటే ఆ భరోసానే లేకుండా పోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మార్గదర్శకాలు రూపొందించి, పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. – చిటికెల రాంబాబు (59 ఏళ్లు), మిర్తిపాడు, వెలమ సామాజికవర్గం -
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: బీసీలను సీఎం చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, వారికి వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను డైరెక్టర్లను నియమించారని గుర్తు చేశారు. అప్పటి వరకూ సామాన్యులకు అవకాశం దక్కని టీటీడీ బోర్డులో సైతం బీసీలను సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా మెజార్టీ సీట్లు బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కిందని పేర్కొన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా బీసీలకు ప్రాధాన్యమివ్వడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ముగ్గురు బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిస్తే, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క బీసీ కూడా చంద్రబాబుకు దొరకలేదా అని నిలదీశారు. బీసీని డిప్యూటీ సీఎం చేసి పక్కన కూర్చోబెట్టుకునేందుకు చంద్రబాబు ఇష్టపడకపోవడం దారుణమన్నారు. రిజర్వేషన్ పేరిట కొత్త డ్రామా మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పేరిట డ్రామాకు తెరలేపారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు గతంలో ప్రయతి్నస్తే, కోర్టుకెళ్లి టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ 45 శాతం పైగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశమిచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట భారీ సదస్సును రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోనే నిర్వహించనున్నామని, ఈ సదస్సులో బీసీలకు ఏం కావాలో చర్చించి, వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, కవురు శ్రీనివాస్, రమేష్యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవుడు వెంకటరమణ, రాజమహేంద్రవరం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, కొండపల్లి దుర్గారావు, మట్టపర్తి నాగేంద్ర, నెరుసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు పార్టీతో బీసీలకు అన్యాయమే
రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజలకు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగింది. భవిష్యత్లోనూ ఆయన పాలనలోనే సంక్షేమ ఫలాలు, రాజ్యాధికారం ద క్కుతాయి. మార్కెట్, దేవాలయ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాన్యులను అందలం ఎక్కించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తే కోర్టుల ద్వారా చంద్రబాబు అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గక 40 శాతం మేర సీట్లు కేటాయించి పెద్ద మనసు చాటుకున్నారు. మహిళలకై తే 50 శాతం పదవులు కేటాయించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎందరికో అవకాశమిచ్చారు. బీసీలు, శెట్టి బలిజలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని ఉత్తరం రాసి న దుర్మార్గుడు చంద్రబాబు. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తానని బాబు మరోసారి మోసం చేస్తున్నాడు. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బీసీలకు రాజ్యాధికారం కావాలి సంపద సృష్టించే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నదే జగన్ ఏకై క లక్ష్యం. 2029 ఎన్నికల్లో మనందరికీ అంతిమ పోరాటం. వైఎస్ జగన్ నాయకత్వంలో అధిక పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు సాధించాలి. అప్పడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు రాజ్యాధికారం సాధించవచ్చు. – కుడిపూడి సూర్యనారాయణ, ఎమ్మెల్సీ ● -
ప్రజలకు కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వినాయక చవితి సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించి, జ్ఞానం, శుభం, సంతోషాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు. పీఓపీ, రసాయన పదార్ధాలతో కాకుండా మట్టి వినాయకుని ప్రతిమతో పూజలు చేసుకోవాలని, పందిళ్ల వద్ద డీజే శబ్దాలతో ప్రశాంతతను పాడు చేయవద్దని ఆమె సూచించారు. అలాగే బాణసంచాపై నిషేధం ఉన్నందు వల్ల దానిని వినియోగించవద్దని ఆమె పేర్కొన్నారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ రద్దు చేసినట్టు కలెక్టర్ కీర్తి తెలిపారు. అత్యవసర ప్రజా ఫిర్యాదులు, వినతులను 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎస్పీ శుభాకాంక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ డి.నరసింహకిశోర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణానికి అనుకూలమైన మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లాలో వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలన్నారు. పుష్పలతకు ఉత్తమ పురస్కారం హిందీ భాషాభివృద్ధికి విశేష సేవలు రంగంపేట: హిందీ భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మల్లేడ పుష్పలతకు హిందీ బెస్ట్ టీచర్ పురస్కారం లభించినట్టు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి.పార్ధసారథి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కాకినాడకు చెందిన సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల ప్రోత్సాహక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పుష్పలతకు ఈ పురస్కారం అందజేసారని తెలిపారు. వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు దాడి చంద్రశేఖరరావు, కేడీవీబీ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు గదుల సాయిబాబు తదితరుల చేతుల మీదుగా ఆమెకు పురస్కారాన్ని అందజేసి అభినందించినట్టు చెప్పారు. అలాగే హిందీ భాషపై నిర్వహించిన క్విజ్లోనూ ఆమె ద్వితీయ స్థానం సాధించినట్టు తెలిపారు. హిందీ స్కూల్ అసిస్టెంట్గా ఆరేళ్లుగా వివిధ పాఠశాలల్లో ఆమె సేవలందించారని ఆయన అన్నారు. ఆయనతో పాటు, సహోపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించారు. భూరి విరాళం.. దాతకు సత్కారం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): రెడ్క్రాస్ వాత్సల్య వృద్ధాశ్రమం నిర్మాణంలో ఉన్న రెడ్క్రాస్ క్యాన్సర్ బ్లాక్, రంగరాయ వైద్య కళాశాల డిజిటల్ మూల్యాంకన భవన నిర్మాణాలకు, వివిధ సంస్థల ద్వారా జిల్లాలోని విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.1.50 కోట్ల నిధులు విరాళంగా అందించిన కరుటూరి చక్రవర్తిని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదివారం అభినందించారు. దాత చక్రవర్తి కాకినాడ వాసి కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. భవన నిర్మాణాలకు నిధులు సమకూర్చిన తరువాత మొదటిసారి కాకినాడకు విచ్చేసిన ఆయన రెడ్క్రాస్ జిల్లా, రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావుతో కలసి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన్ని సత్కరించి, భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. -
సోమవారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
వెన్నుపోటు పార్టీ మోసాలు ఎండగట్టాలి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి బీసీలను మోసం చేశారు. చంద్రబాబు మోసాలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాలి. బీసీల సమస్యలను తమకు తెలియజేస్తే పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్తాం. – నవుడు వెంకటరమణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, జోన్ 2 రీజినల్ అధ్యక్షుడు 34 శాతం రిజర్వేషన్ పేరిట మోసం చంద్రబాబు ప్రభుత్వం బీసీలను విస్మరించిదన్న విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. జగనన్న చేయూత పథకం ద్వారా 26 లక్షల మందికి రూ.18వేలు చొప్పున అందజేశారు. చంద్రబాబు అబద్దపు హామీతో ఏడాదికి రూ.48 వేలు వస్తాయని ఆశించి 26 లక్షల కుటుంబాలు మోసపోయాయి. 27న బీసీ గర్జనను విజయవంతం చేసుకుంటే స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం కనిపిస్తుంది. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి తూర్పు కాపులకు వైఎస్సార్తో మేలు తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర మినహా ఇతర ప్రాంతాల్లో బీసీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైఎస్సార్ వద్దకు వెళ్తే వెంటనే ఒక జీవో జారీ చేయించారు. ఎక్కడున్నా తూర్పు కాపులేనని, వారికి బీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. 27వ తేదీన జరిగే సభలో తూర్పు కాపులను ఓబీసీలో చేరుస్తామన్న భరోసా కల్పించాలి. – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం బీసీలను ఏకం చేయాలి బీసీలను ఏకం చేయాల్సిన అవసరం ఉంది. కులాల వారీగా కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2029లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలన్న కృతనిశ్చయంతో పనిచేయాలి.–పొన్నాడ సతీష్కుమార్, మాజీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం -
జగన్ నిజం.. ఆయనవైపే ప్రజానీకం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ● వేగేశ్వరపురంలో పార్టీలో భారీ చేరికలు తాళ్లపూడి: రాష్ట్రంలో అబద్దం, మోసపూరిత పాలన సాగుతుందని జగన్ నిజం చంద్రబాబు అబద్ధం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. జగన్కు పట్టం కట్టడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మండలంలోని వేగేశ్వరపురంలో మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మిరెడ్డి పరశు రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సమక్షంలో పార్టీలో భారీ చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన యువ నాయకుడు కురసాల సతీస్ (వెంకట సత్యనారాయణ) సహా భారీగా మహిళలు, యువతకు వారిద్దరితో పాటు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నిడదవోలు కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజక వర్గ పరిశీలకుడు గొందేసి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిందన్నారు. ఎల్లో మీడియా, చానళ్ల మోసపూరిత సమాచారంతో మంచి పాలనను కోల్పోయామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. సతీష్ రాకతో పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. చంద్రబాబు, కరువు అన్నదమ్ములని ఆయన ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో ఏదో ఒక కరువు వస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన దమ్మున్న నాయకుడు జగన్ అని, చంద్రబాబు నాటి స్థానిక ఎన్నికల్లో పోటీలో లేకుండా నాడు తొక ముడిచారని అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సవాల్ విసిరి ముందుకు రావడం లేదని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా శాంతి భద్రతల సమస్యలతో సతమతమవుతున్నారని, రాష్ట్ర భవిష్యత్ కోసం, జగనన్నకి మళ్లీ పట్టం కట్టాలని ప్రజల ఎదురు చూస్తున్నారన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు పాలన మోసపూరితంగా సాగుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ సతీష్ లాంటి యువత పార్టీలో చేరడంతో రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మాజీ ఎంపీపీ కొమ్మిరెడ్డి పరశురామారావు మాట్లాడుతూ తన రాజకీయ గురువు జీఎస్ రావు ఆధ్వర్యంలో రాజకీయాల్లో 40 ఏళ్లుగా ఆరు ఎన్నికల్లో ఐదు సార్లు ఎంపీపీ, సర్పంచ్ పదవులు పొందామన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి బండి అబ్బులు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, జెడ్పీ వైస్ చైర్ పర్శన్ పోసిన శ్రీలేఖ, రాజానగరం పరిశీలకుడు, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు గొండేసి శ్రీనివాసరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్, మాజీ ఎంపీపీ వీర రాఘవమ్మ, రాష్ట్ర కార్యదర్శులు వల్లభశెట్టి శ్రీనివాస్, గూడా విజయరాజు, బండి అబ్బులు, ఇంటి వీర్రాజు, పప్పోపుల నాని, నియోజక వర్గంలోని మూడు మండలాల నాయకులు చిట్టూరి అన్నవరం, తిరుమలశెట్టి అన్నవరం, కుంటముక్కల కేశవనారాయణ, పెండెం పోసిబాబు, ఒంబోలు పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యభూమిలో జననం పూర్వజన్మ సుకృతం
● టీటీడీ వేద పండితులు శ్రీపాద, గుళ్లపల్లి ● ఘనంగా వీరభద్ర వేదశాస్త్ర విద్వత్సభ కొత్తపేట: పూర్వజన్మ సుకృతం వల్లే ఈ పుణ్యభూమిలో జన్మించామని టీటీడీ మాజీ పరీక్ష అధికారి బ్రహ్మశ్రీ శ్రీపాద మాణిక్య అవధానులు, గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి అన్నారు. వీరభద్ర వేదశాస్త్ర విద్వత్సభ 59వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక హరిహర దేవాలయ ప్రాంగణంలో వేదసభ నిర్వహించారు. సభకు గుళ్లపల్లి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేద పఠనంలో భాగంగా సంహిత క్రమ అధ్యాయాలు, వేదాల ప్రాముఖ్యతను, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరించారు. అన్ని ధర్మాలకు సనాతన ధర్మమే మూలమని, వేదం చెప్పినట్టు నడుచుకోవాలని, ముఖ్యంగా పిల్లలను సనాతన ధర్మం వైపు నడిపించాలని తల్లిదండ్రులకు సూచించారు. మాణిక్యావధాని పర్యవేక్షణలో సభ నిర్విరామంగా జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 70 మంది ఘనపాఠిలు పాల్గొని వేదాలు వల్లించారు. అనేక గ్రామాల నుంచి వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం మాణిక్య అవధానులు, దత్తాత్రేయ ఘనాపాఠి తదితరులను వేదసభ నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శులు కాకరపర్తి బంగారుబాబు, పట్టమట్ట రామకృష్ణ రవిప్రసాద్, చిలుకూరి రామశేషగిరిరావు, తనికెళ్ల వెంకట రామారావు, అజ్జరపు వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మబంధువు జగనే
●సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలోని బలహీన వర్గాల అసలైన ఆత్మబంధువు వైఎస్ జగన్మోహన్రెడ్డేనని వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు ముక్త కంఠంతో నినదించారు. 139 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయకే దక్కుతుందని కొనియాడారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన పేరిట రౌండ్టేబుల్ సమావేశాన్ని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచపల్లి రమేష్యాదవ్ అధ్యక్షతన, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. బీసీలకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూ జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును వారంతా గుర్తు చేసుకున్నారు. పార్టీ నాయకులతో పాటు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, బీసీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు, ప్రధాన కార్యదర్శి మరడ అనిల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి గంధం రవి, చందన నాగేశ్వర్ తదితరులు మాట్లాడారు.సమన్వయం సాధించాలి బీసీల మధ్య సమన్వయం సాధించినప్పుడే ఐక్యత సాధించగలం. ఏ బీసీకి కష్టమొచ్చినా అందరూ అండగా నిలవాలి. ఆ దిశగా అవసరమైన కార్యాచరణ చేపట్టాలి. – గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ ఇన్చార్జి, రాజమహేంద్రవరం జగన్తోనే గౌరవం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 45 శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కార్పొరేషన్ పదవులు ఇచ్చి గౌరవం కల్పించింది వైఎస్ జగన్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేద్దాం. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా బీసీలను మోసగించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత బీసీలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలను ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి. – కొండపల్లి దుర్గారావు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా చంద్రబాబు మోసాలు ఎండగట్టాలి చంద్రబాబు బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచించారు. బీసీ సోదరులందరూ చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి. – మట్టా నాగేంద్ర, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలిజలకు సముచిత స్థానం శెట్టిబలిజలకు జగన్ సముచిత స్థానం కల్పించారు. పిల్లి సుభాష్చంద్రబోస్కు ఉప ముఖ్యమంత్రితో పాటు, రాజ్యసభకు పంపించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రిని చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుంది. – చెల్లుబోయిన శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అమలాపురం జగన్ సీఎం అయితేనే బీసీలకు రాజ్యాధికారం ఆయన పాలనలోనే బలహీన వర్గాలకు లబ్ధి 45 శాతం పైగా సీట్లు కేటాయించిన ఘనత అయనదే మహిళలకు 50 శాతం పదవులు ఇప్పించారు రెండేళ్లుగా బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు ఒక్కరికీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదు రాజ్యసభ, ఎమ్మెల్సీల నియామకంలోనూ అన్యాయం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బీసీ గర్జనలో వైఎస్సార్ సీపీ నేతలు -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి
ఊబర్ బైక్ డ్రైవర్కు గాయాలు పంజగుట్ట: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పాత్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు శనివారం ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేశారు. 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలు పాటించని 12 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.40,800 అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు సురేష్ కుమార్, వరప్రసాద్ పాల్గొన్నారు. -
సమన్వయంతో పుష్కర పనులు
డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పుష్కరాల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు వసతులు కల్పించాలని డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. శనివారం రాజమహేంద్రవరం మంజీరాహోటల్లో రానున్న పుష్కరాల ఏర్పాట్లపై పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ జిల్లాలో పుష్కర పనులను డీజీపీకి వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ హౌసింగ్ బోర్డ్ అధికారులతో సమన్వయం చేసుకుని 2027 ఫిబ్రవరిలోపు పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్టిపుల్ పుష్కర్ జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి, అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఫీల్డ్ సిబ్బంది ద్వారా రియల్ టైమ్ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేలా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాలు సమయంలో స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. పుష్కర పనులన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యేలా జాయింట్ క్యాలెండర్ రూపొందించుకోవాలన్నారు. వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పుష్కరాలు జరిగే మిగిలిన జిల్లాల్లోనూ ఇవే సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ అశోక్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల మరణాలపై స్పందించని ప్రభుత్వం
ఫ అధికారుల దాటవేత ధోరణి ఫ అరకు ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కూనవరం: ఏజెన్సీలోని పాఠశాలల్లో విద్యార్థులు అంతుచిక్కని రీతిలో మృత్యువాతకు గురవుతుంటే కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని అరకు ఎంపీ గుమ్మా తనూజా రాణి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. కూనవరం మండల పరిధి గొమ్ముగూడెం గ్రామాన్ని శనివారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి పది మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. ఏజెన్సీ మండలాల్లో విద్యార్థుల మరణ మృదంగం మోగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కూనవరం మండలంలో ఏడో తరగతి విద్యార్థిని జాహ్నవి వైద్యం అందక మృతి చెందిందని, ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ గొల్లగుప్పలో ఇద్దరు మృతి చెందగా, మరో 50 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందేనని చెప్పారు. గొల్లగుప్పలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు స్పందించిన తీరు అమోఘమన్నారు. అనంతరం ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
జాతీయ లోక్ అదాలత్లో 9,421 కేసులకు పరిష్కారం
రూ.36.05 కోట్లకు పైగా అవార్డులు జారీ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా ఆధ్వర్యంలో 44 బెంచ్ల్లో లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రధాన కార్యాలయంలో 9 బెంచ్లు, ఉమ్మడి జిల్లాలో మరో 35 బెంచీలు ఏర్పాటు చేసి 9,421 కేసుల పరిష్కారించారు. ఈ కేసులపై మొత్తం రూ.36,05,90,000 మేర అవార్డు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో 489 సివిల్ కేసులు, 8,844 క్రిమినల్ కేసులు, 88 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామని జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జీజీహెచ్లో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ భవన నిర్మాణానికి రూ.23.75 కోట్ల అంచనా వ్యయం వేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ల ఏర్పాటులో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఆధునిక వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రితో దీనివల్ల రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సోఫియా, ఏపీ ఎంఐడీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండిగో సర్వీసు అత్యవసర ల్యాండింగ్ కోరుకొండ: చైన్నె నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమాన సర్వీ సు శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి సిగ్నల్ రాకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టి వెనుదిరిగింది. ఇదిలా ఉండగా 65 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. బాణసంచా తయారీ కేంద్రంపై దాడి సామగ్రి స్వాధీనం అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి మందుగుండు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వి రవిచంద్రకుమార్ తెలిపారు. శనివారం అందిన సమాచారం మేరకు గ్రామంలోని చేపల చెరువుల వద్ద ఉన్న షెడ్డులో సోదాలు నిర్వహించగా సుమారు 2.660 కిలోల బరువున్న దీపావళి మందులు, సుమారు 19.5 కిలోల తార జువ్వలు, 200 ఖాళీ తారాజువ్వ గుల్లలు, 3 ఇనుప అవ్వాయి ప్రెస్సింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ కేసులో కొమరిపాలెం గ్రామానికి చెందిన గుబ్బల వీరన్నను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు మార్కాపురం టౌన్: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు రెండోరోజైన శనివారం నిర్వహించారు. బాలుర జెడ్పీ హైస్కూలులో నిర్వహించిన ఈ పోటీలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బాలుర జట్టు లీగ్ దశలో అనంతపురం, కృష్ణా జిల్లాలపై గెలుపొందగా, చిత్తూరు జిల్లాపై ఓటమి చవిచూసింది. బాలికల జట్టు కర్నూలుపై గెలుపొందగా, గుంటూరుపై ఓడిపోయింది. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.దామోదర్రెడ్డి తెలిపారు. -
కల్వర్టును ఢీకొన్న వ్యాన్
● తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి ● మరొకరికి స్వల్ప గాయాలు దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం గండి చెరువు వద్ద శనివారం వ్యాన్ కల్వర్టును ఢీ కొంది. ఈ ప్రమదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నిడదవోలు మండలం కోరుమామిడి నుంచి విజయవాడ సౌండ్ సిస్టం పరికరాలను తీసుకు వెళుతున్న వ్యాన్ గండి చెరవు వద్ద పాలేటి వాగుపై గల కల్వర్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్లో ఉన్న ముగ్గరు వ్యక్తులో కోరుమామిడికి చెందిన వడలి సురేష్(29) తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందినట్టు ఎస్సై పి. మనోహార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పులి జాడలతో పల్లెల్లో అలజడి
ప్రత్తిపాడు రూరల్: పెద్దపులి సంచారంతో ప్రత్తిపాడు, శంఖవరం మండలాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత, శుక్రవారం తెల్లవారుజామున రాజవొమ్మంగి రేంజి పరిధిలోకి వెళ్లినట్లు రేడియో కాలర్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే పులి పూర్తిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిందనే నిర్ధారణ లేకపోవడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఆవులపై దాడి.. ఒకటి మృతి శుక్రవారం సాయంత్రం అవేల్తి గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి రెండు ఆవులపై దాడి చేసినట్లు అటవీశాఖకు సమాచారం అందింది. ఈ ఘటనలో ఒక ఆవు మృతి చెందగా.. మరో ఆవు తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడికి వెళ్లిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రేడియో కాలర్ ద్వారా జిల్లా అటవీ అధికారి ఎ.రామచంద్రరావు సిబ్బందికి సూచనలిస్తున్నారు. కాగా అత్యవసరమైతే తప్ప ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. దారపల్లి వాటర్ఫాల్స్కు వెళ్లొద్దు పులి సంచారం నేపథ్యంలో దారపల్లి వాటర్ఫాల్స్ ప్రాంతానికి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఎవరూ వెళ్లవద్దని పర్యాటకులు, స్థానికులకు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. గతంలోనూ పలుమార్లు.. నియోజకవర్గానికి పెద్దపులి సంచారం కొత్తేమీ కాదు. 2022లో ప్రత్తిపాడు మండలంలో సుమారు 37 రోజులపాటు పులి సంచరించింది. పోతులూరు కొండలు, పాండవులపాలెం–పొదురుపాక ప్రాంతాల్లో పులి కదలికలు, పశువులపై దాడులు నమోదయ్యాయి. 2024 డిసెంబరులోనూ ప్రత్తిపాడు మండలంలోని బాపన్నధార పరిసరాల్లో లేగ దూడపై దాడి చేసింది. 2026 మార్చిలోనూ పులి సంచారం కలకలం రేపింది. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో మూడు రోజులుగా సంచారం రేడియో కాలర్ ద్వారా రాజవొమ్మంగి రేంజి వైపు వెళ్లినట్లు గుర్తింపు అప్రమత్తమైన అటవీశాఖ అడవుల్లోకి వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరిక -
హైకోర్టు న్యాయవాదులుగా ఇద్దరి ప్రమాణం
కొత్తపేట: హైకోర్టు న్యాయవాదులుగా కొత్తపేటకు చెందిన ఇద్దరు అర్హత సాధించారు. వారిలో స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రమాదేవి ఒకరు కాగా, స్థానిక న్యాయవాది గూడపాటి విజయకుమార్ మరొకరు. శనివారం అమరావతి హైకోర్టు భవనం ఏపీ బార్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ చలసాని అజయ్కుమార్ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం కౌన్సిల్ నుంచి హైకోర్టు లాయర్ సర్టిఫికెట్ను వారు అందుకున్నారు. రమాదేవి 2021లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీచేసి విజయం సాధించారు. గత ఐదేళ్లుగా స్థానిక సమస్యలపై జెడ్పీ, మండల పరిషత్ సమావేశాల్లో తన వాణి వినిపించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. రమాదేవి, విజయ్కుమార్లను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, ఎంపీపీ ఎం.గంగాధరరావు, నేతలు ఎం.వెంకటేశ్వరరావు ఎం.వీరభద్రరావు, జి.ప్రవీణ్కుమార్ అభినందించారు. -
చేపల చెరువు యజమాని హత్య
● 2 కాసుల బంగారం ● రూ.2 లక్షల నగదు చోరీప్రత్తిపాడు: దుండగులు చేపల చెరువు యజమాని గొంతు కోసి హత్య చేసి, బంగారు వస్తువులు, నగదు దోచుకుపోయిన ఘటన శనివారం మండలంలోని టి.రాయవరంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన తటవర్తి మెహర్ ప్రసాద్కు చెందిన చెరువును ఏలూరు జిల్లా పైడి చింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) లీజుకు తీసుకుని నాలుగేళ్లుగా చేపలు పెంచుతున్నాడు. చెరువు వద్ద మకాంలో కొవ్వాడలంక గ్రామానికి చెందిన వితంతువైన తన కూమార్తె బలే నాగలక్ష్మితో కలిసి అతను జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెన్షన్ నిమిత్తం తన కుమార్తె కొవ్వాడలంక వెళ్ళింది. శుక్రవారం సాయంత్రం చేపల చెరువు మకానికి సమీపంలో ఉన్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన స్నేహితులు గొర్ల రాంబాబు, చిరికే అప్పారావుతో కలిసి టీ తాగారు. ఆ రాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు వచ్చారని, వారితో జరిగిన ఘర్షణలో పదునైన ఆయుధంతో నరసింహారావు మెడ కోసి, హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగలక్ష్మి గదిలోని బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు దోచుకుపోయారు. స్నేహితులు రాంబాబు, అప్పారావు ఉదయం వచ్చి పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా అతడు విగతజీవుడై పడి ఉన్నాడు. వారి సమాచారం మేరకు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతంతో కలిసి సీఐ బి.సూర్య అప్పారావు, డీఎస్పీ ఏబీజీ తిలక్ హత్యా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని శవపరీక్షకై ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఎన్నాళ్లకెన్నాళ్లకో!
● కోనసీమ జిల్లాలో కరువు తీరా వర్షం ● రైతుల ఆశలు తీర్చిన అల్పపీడనం ● శనివారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం ● సేద తీరిన ఉద్యాన పంటలు ● వరి రైతులకు సైతం మేలు సాక్షి, అమలాపురం: నిప్పులు కక్కుతున్న సూర్యుడు.. భగభగ మండుతున్న ఎండలు.. బయట అడుగు పెడితేనే ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. చినుకు జాడ లేక నెర్రలు బారిన చేలు.. ఎండ వేడికి వాడి వాలిపోయిన కొబ్బరి, అరటి తోటలు.. చుక్క నీటికి నోచుకోక ఎండిపోతున్న కూరగాయ పంటలు. ఎల్ నినో ప్రభావంతో గడచిన మూడు నెలలుగా ఇదే పరిస్థితి. అటు సామాన్యులు, ఇటు అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తూ వాన చినుకు కోసం ముఖం వాచేలా ఎదురు చూస్తున్నారు. అడపాదడపా ఒకటి రెండు చినుకులు పడినా, అవి వాతావరణాన్ని చల్లబరచలేదు. పొలాల దాహాన్ని తీర్చలేదు. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షం కోనసీమకు కొత్త ఊపిరి పోసింది. చిరు జల్లులతో మొదలై జోరువానగా మారడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. చల్లని ఈదురుగాలులు గిలిగింతలు పెట్టాయి. బీటలు బారిన నేల తన దాహం తీర్చుకుంది. వాన నీటికి తడిసిన చెట్ల ఆకులు స్నానమాడి, మలినాన్ని వదిలి సరికొత్త కాంతితో మెరిశాయి. వాడిన కూరగాయ పంటలకు మళ్లీ జీవం వచ్చింది. రైతుల ముఖాల్లో ఆనందపు వెలుగులు విరిశాయి. పల్లపు ప్రాంతాలు జలమయం... ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచే వరుణుడు ముఖం చాటేయడంతో తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న జిల్లాలో ఎట్టకేలకు కరువు తీరా వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజాము నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురియడంతో లోతట్టు కాలనీల్లో, రోడ్లపై ముంపునీరు చేరింది. సామాన్యులు, చిరు వ్యాపారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు జాము నుంచి పది గంటల వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లాలో శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు సగటున 37.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. పి.గన్నవరంలో అత్యధికంగా 60 మి.మీ., అత్యల్పంగా రామచంద్రపురంలో 10.6 మి.మీ. నమోదైంది. తరువాత కూడా మధ్యమధ్యలో కాస్త తెరపి ఇచ్చినా వర్షం పడుతూనే ఉంది. వరికి ఊరట.. సేదతీరిన తోటలు జిల్లాలో సుమారు 1.40 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరి పంటకు వర్షం ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా నీరందక ఇబ్బంది పడుతున్న శివారు, మెరక ప్రాంతాల రైతులకు వర్షం వరంగా మారింది. పంటలకు అవసరమైన తేమ లభించడంతో రైతులు ఊరట చెందుతున్నారు. కొబ్బరి, అరటి, కోకో తోటలు వాడిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. మోటార్లు, పంట కాల్వల ద్వారా నీరు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో తేమ లేక ఉద్యాన రైతులు ఇబ్బందులు పడ్డారు. వీటితో పాటు లంక గ్రామాల్లోని మెరక ప్రాంతాల ఉద్యాన పంటలకు ఈ వర్షం మరింత ప్రయోజనం చేకూర్చింది. మూడు నెలల్లో 57 శాతం లోటు కోనసీమలో జూన్ నుంచి ఆగస్టు వరకు వరుసగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. మూడు నెలలకు కలిపి జిల్లాలో సాధారణ వర్షపాతం 585.6 మి.మీ. కాగా.. వాస్తవంగా 251 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో సగటున 57 శాతం లోటు ఏర్పడింది. జూన్లో 60 శాతం, జూలైలో 48.8 శాతం, ఆగస్టులో ఏకంగా 64.9 శాతం లోటు నమోదైంది. తాజా వర్షం రైతులకు ఊరటనిచ్చినా ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ముంపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్రమత్తంగా ఉన్నారు. మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగితే చేలల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నేత మృతి
కుటుంబ సభ్యులకు జక్కంపూడి పరామర్శ రాజానగరం: దివాన్ చెరువు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వైఎస్సార్ సీపీ పాలచర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు పిల్లా చంద్రరావు (49) మృతి చెందాడు. ఆటోలో వెళ్తున్న అతనిని కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బొమ్మూరు పోలీసులు మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి, చంద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ చురుకై న కార్యకర్తను కోల్పోయిందని ఆయన అన్నారు. అనంతరం పాలచర్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొని పాడె మోసారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యసామర్లకోట: స్థానిక పెన్షన్లైన్కు చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు పట్టా సవర్నాయుడు (పీఎస్ నాయడు) (40) స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఐస్ పార్లర్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ఆటో నిర్వహిస్తూ వ్యాపారం చేయడానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఖాళీగా ఉన్న ఐస్ పార్లర్ తీసుకున్నట్టు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాయుడు మధ్యాహ్నం భోజనానికి రాక పోవడం, ఐస్ పార్లర్లో లేక పోవడంతో పట్టణంలోని బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో ఆయన బంధువులు విషయాన్ని ఆటో యూనియన్ నాయకులకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించారు. నాయుడు వద్ద ఉన్న సెల్ఫోన్ను సిగ్నల్ ద్వారా గుర్తించి పెద్దాపురం రోడ్డులోని స్టేట్ బ్యాంకు సమీపంలోని అన్నపూర్ణ కల్యాణ మండపం వద్ద ఉన్నట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి అక్కడకు చేరుకుని అక్కడి వాచ్మన్ను నాయుడు గురించి అడిగారు. దీంతో అతడు రెండో అంతస్తులో ఉన్నాడని, విశ్రాంతి తీసుకుంటానని ఉదయం వెళ్లాడని చెప్పాడు. పోలీసులు ఆ గది వద్దకు వెళ్లి కిటికీ నుంచి చూడగా నాయుడు ఉరి వేసుకోవడాన్ని చూసి, తలుపు గడియ తొలగించి మృతదేహాన్ని దించి దర్యాప్తు ప్రారంభించారు. అతడు కొంత కాలంగా మానసిక ఇబ్బంది, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై ఎస్వీఎస్ఎన్ మూర్తి వివరించారు. ఆన్లైన్ మోసంపై కేసు నమోదు అనపర్తి: బిక్కవోలు, నల్లమిల్లి రోడ్డులో ఉన్న కేపీఆర్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన ఆన్లైన్ మోసంపై శనివారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంస్థ ముడి పదార్థాల కొనుగోలు కోసం న్యూఢిల్లీకి చెందిన యునైటెడ్ కెమికల్స్ నుంచి కొటేషన్ కోరింది. ఢిల్లీకి చెందిన సంస్థ కంప్యూటర్ను హ్యాక్ చేసి బ్యాంకు వివరాలను మార్చి పంపారు. దాని ప్రకారం, కేపీఆర్ సంస్థ ప్రతినిధులు రూ.5,29,112 యునైటెడ్ కెమికల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్వాలియర్ ఖాతాకు బదిలీ చేశారు. అయితే యునైటెడ్ కెమికల్స్ కంపెనీ న్యూఢిల్లీ వారు తమకు ఆ డబ్బు అందలేదని తెలియజేశారు. వెంటనే కేపీఆర్ సంస్థ ఉద్యోగులు కోటక్ మహీంద్రా బ్యాంకుకు మెయిల్ పంపి, ఆ మొత్తాన్ని స్తంభింపజేయమని కోరారు. బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని స్తంభింపజేశారు. వెంటనే కేపీఆర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లైసెన్సుల పునరుద్ధరణకు నూతన పాలసీ
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీలత రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో 2026–27 సంవత్సరానికి 159 మద్యం దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ, లైసెన్సుల మంజూరుకు ప్రభుత్వం నూతన ఎకై ్సజ్ పాలసీ ప్రకటించినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 144 ఓపెన్ కేటగిరీ దుకాణాలు, రిజర్వ్ కేటగిరీలో 15 ఉన్నాయన్నారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి 2027 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. 2025–26 అబ్కారీ సంవత్సరానికి వర్తించిన వార్షిక రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ (ఆర్ఈటీ) రేట్లలో ఎటువంటి మార్పు లేకుండా 2026–27 సంవత్సరానికీ కొనసాగుతుందన్నారు. కాగా అదనంగా 38 శాతం మేర రెన్యువల్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే పర్మిట్ రూమ్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ను ఒకేసారి లేదా మూడు వాయిదాలలో చెల్లించుకునే అవకాశం ఉందన్నారు. 50 వేల జనాభా లోపు ఓపెన్కేటగిరీ రూ.60.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.30.3 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభా లోపు ఓపెన్ కేటగిరీ రూ.71.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.35.8 లక్షలు, 5 లక్షల పైన జనాభా కలిగిన ఓపెన్కేటగిరీ రూ.93.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.46.8 లక్షలు చెల్లించాలన్నారు. రెన్యూవల్ రిటైల్ ఎకై ్సజ్ టాక్స్ 50 వేలు జనాభాలోపు ఓపెన్ కేటగిరీ రూ.23 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.11.5 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభాలోపు ఓపెన్ కేటగిరీ రూ.27.2 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.13.6 లక్షలు, 5లక్షల పైన జనాభా కల్గిన ఓపెన్ కేటగిరీ రూ.35.5 లక్షలు, రిజర్వ్ కేటగిరీ రూ.17.8 లక్షలు చెల్లించాలన్నారు. మద్యం దుకాణాల పునరుద్ధరణ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువని ఆమె తెలిపారు. 22వ తేదీ ఫారమ్ ఏ–4 (ఆర్)లో లైసెన్సులు మంజూరవుతాయన్నారు. -
పాతవారికే కొత్త కిక్కు!
● మద్యం దుకాణాలకు రెన్యువల్ ● ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం ● అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తింపజేస్తూ ఎకై ్సజ్ పాలసీ విడుదల ● జిల్లాలో 138 మద్యం దుకాణాలు ● రెండేళ్లుగా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ● స్థానిక ఎన్నికల వేళ ఆసరా కోసమేనని సర్వత్రా ఆరోపణలు సాక్షి, రాజమహేంద్రవరం: రెండేళ్లుగా అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్న అనుకూల సిండికేట్కే చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పాటు లైసెన్సులు పొడిగించింది. ఈ మేరకు కొత్త ఎకై ్సజ్ పాలసీ 2026–27ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అవసరమైతే ఇదే పాలసీని తర్వాతి ఏడాది కూడా కొనసాగించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పాత దుకాణాల కాల పరిమితి ఈ నెల 30తో ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ పాత దుకాణదారులే మద్యం విక్రయించవచ్చని లైసెన్స్లను రెన్యువల్ చేసేసింది. ఎవరైనా రెన్యువల్ వద్దనుకుంటే ఆయా దుకాణాలకు మళ్లీ డ్రా తీయనున్నారు. మినీబార్లుగా పర్మిట్రూమ్లు! జిల్లాలో మొత్తం 138 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 300 వరకు పర్మిట్ రూమ్లు, వెయ్యి వరకూ బెల్టు షాపులున్నాయి. ఈ క్రమంలో మద్యం దుకాణాలను కూటమి నాయకులు తమ అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. వైన్ షాపుల యజమానులను గుప్పిట్లో పెట్టుకుని పర్మిట్ రూమ్లను మినీబార్లుగా మార్చేసి దందా సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు షాడోలుగా వ్యవహరించే వారు తమ వారికి పర్మిట్ రూమ్లు ఇప్పించుకుని వాటిలో ఆహార పదార్థాల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాగా ప్రతి బ్రాండు మద్యం పైనా రూ.10 అదనంగా వసూలు చేయడం మామూలైపోయింది. ఇక బెల్టు దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే రూ.20 అదనంగా వసూలు చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 గుంజుతున్నారు. ఈ వసూళ్ల మొత్తాన్ని వ్యాపారులు, కూటమి నేతలు చెరిసగం పంచుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇలా సుమారు రూ.50 కోట్ల మేర చేతులు మారుతోందని తెలుస్తోంది. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో నాసిరకం బ్రాండ్లు సైతం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక పోరులో మద్యపుటేరులు! స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ అనుకూల వర్గాల చేతుల్లో మద్యం దుకాణాలు ఉంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగపడతారనే ఈ రెన్యువల్ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు వారు చేస్తున్న ప్రచారం గత రెండేళ్లలో మద్యం వ్యాపారులు బాగా నష్టపోయారని. మద్యం విక్రయాలపై దుకాణదారులకు 20 శాతం కమీషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ప్రారంభంలో 9 శాతం ఇచ్చి ప్రస్తుతం 14 శాతానికి పెంచిందని, అయితే ప్రారంభంలో ఇస్తామన్న 20 శాతం నేటికీ ఇవ్వకపోవడంతో వారు నష్టపోయారని సిండికేట్, కూటమి నాయకులు కథలు అల్లుతున్నారు. వాస్తవానికి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడం ద్వారా ప్రభుత్వం ఇస్తామన్న కమీషన్ కంటే ఎక్కువగానే సంపాదించారన్నది బహిరంగ రహస్యం. స్థానిక ఎన్నికలకు మద్యం సిండికేట్ నుంచి నిధుల సమీకరణతో పాటు కూటమి పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు పంచుకునేందుకు కావాల్సినంత మద్యం కూడా కుమ్మరించడానికే రెన్యువల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి నుంచీ సిండికేట్ గుప్పిట్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సెప్టెంబర్లో మెజార్టీ మద్యం దుకాణాలను టీడీపీ అనుకూల వ్యాపారులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా వేరే వారు దక్కించుకున్నప్పటికీ వాటినీ టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలకు వేలం నిర్వహిస్తే పోటీ తప్పదని సిండికేట్ భయం. స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ దందాకు గండి పడకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ఈ పాలసీని విడుదల చేయించారు. తాజా రెన్యువల్కు వార్షిక రిటైల్ ఎకై ్సజ్ పన్నుల్లో 38 శాతానికి సమానంగా చెల్లించాలి. దీంతోపాటు వార్షిక రిటైల్ ఎకై ్సజ్ పన్ను, పర్మిట్రూమ్ రిటైల్ ఎకై ్సజ్ పన్ను కూడా చెల్లించాలి. రెన్యువల్ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
గణేశాయ.. విభిన్న రూపాయ
ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదకిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు అంటాడు ప్రహ్లాదుడు. భక్తాధీనుడైన భగవంతుడు భక్తుని భావమును అనుసరించి అతడు ఏ విధంగా తలస్తే ఆ రూపముగా వచ్చి అభీష్టాలు నెరవేరుస్తుంటాడు. వినాయక చవితి పండగ సందర్భంగా స్వామి వారిని విభిన్న ఆకృతులలో రూపొందించారు తయారీదారులు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా వివిధ దేవతా మూర్తుల అలంకారాల్లో ఏకదంతుడిని తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సవ కమిటీలు ఎవరికి నచ్చిన విగ్రహాలను వారు వారి పందిళ్లలో నెలకొల్పి ప్రతిష్టిస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ -
ఫోరెన్సిక్ సేవల బలోపేతానికే ఆర్ఎఫ్ఎస్ఎల్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ఫోరెన్సిక్ సేవలను బలోపేతం చేసేందుకు రాజమహేంద్రవరంలో రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్మించినట్టు డీజీపీ హరీష్కుమార్ గుప్తా అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్మించిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన వివిధ విభాగాలను సందర్శించి పనులను ఆరా తీశారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 2025 సంవత్సరంలో రాష్ట్రంలో 1,87,721 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, వీటిలో ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే నేరాలకు సంబంధించిన 16,847 కేసులు ఉన్నాయని తెలిపారు. సాక్ష్యాల సేకరణ కోసం ఎఫ్ఎస్ఎల్/క్రైమ్ స్పాట్ టీమ్స్ సుమారు 4,200 నేర స్థలాలను సందర్శించాయని, మొత్తం 25,602 కేసులను ఏపీఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్లకు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారని తెలిపారు. ప్రస్తుతం గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో 6 ల్యాబ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. 2025లో ల్యాబొరేటరీ 25,602 కేసుల్లో 23,682 పరిశీలించి, 1,920 పెండింగ్లో ఉంచిందన్నారు. దీంతో 92.5 శాతం డిస్పోజల్ రేటు సాధించి దేశ వ్యాప్తంగా రెండో స్థానాన్ని సాధించిందన్నారు. హత్య, పోక్సో/మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల టర్న్ అరౌండ్ సమయాన్ని దాదాపు 50 శాతం తగ్గించి, 15 రోజుల నుంచి 7 రోజులకు తీసుకువచ్చామన్నారు. ఎన్డీపీఎస్ కేసులను గతంలో 30 రోజులు పట్టే సమయంలోగా కాకుండా 14 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికతలు, విశ్లేషణాత్మక పరికరాల వినియోగంతో డీఎన్ఏ డిటెక్షన్ రేటు 85 శాతం నుంచి 97 శాతానికి, రక్త గ్రూప్ డిటెక్షన్ రేటు 52 శాతం నుంచి 85.77 శాతానికి పెరిగిందన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలు, 2023 అమలులో భాగంగా ఏపీఎఫ్ఎస్ఎల్ 24+7, మూడంచెల ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా శాసీ్త్రయ దర్యాప్తు అవసరాలను ఈ ల్యాబ్ తీర్చనుందన్నారు. ఈ ఏడాదికి సుమారు 2,300 కేసులను స్వీకరించే అవకాశం ఉందన్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్, ఎస్పీ డి.నరసింహకిశోర్, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లా ఎస్పీలు అద్నాన్ నయీమ్ అస్మి, శివ కిశోర్, విద్యాసాగర్ నాయుడు, నగరపాలకసంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఆర్ఎఫ్ఎస్ఎల్ జేడీ ఈశ్వరమ్మ, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా -
‘పండుగప్ప’ కోసం పోటీ.. వేలంలో దక్కించుకున్న మహిళ
యానాం వద్ద గౌతమీ గోదావరిలో మత్స్యకారుల వలకు సుమారు 23 కేజీల పండుగప్ప చిక్కింది. స్థానిక పుష్కరఘాట్ వద్ద నిర్వహించిన వేలంలో దీనిని మత్స్యకార మహిళ కొల్లాటి దేవి రూ.10 వేలకు దక్కించుకుంది. పండుగప్ప చేప బరువు సాధారణంగా 12 కేజీల వరకూ ఉంటుంది. ఇంత భారీ చేప వలలో పడటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – తూర్పు గోదావరి జిల్లాఇదీ చదవండి : ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి -
పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె తండ్రి వెంకటేశ్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ నేతృత్వంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దర్యాప్తు కోసం స్పెషలాఫీసర్ను నియమించామని ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయనేమో వారం పది రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఇలా అయితే దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది’’ అని వెంకటేశ్ మండిపడ్డారు. తాము మూడు రోజులుగా వివరాలు సేకరిస్తుంటే, ఎవరూ సహకరించడం లేదన్నారు. స్వతంత్ర హాస్పిటల్, ప్రసాద్ ఐమ్యాక్స్ యాజమాన్యాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ‘పోలీసుల వద్ద ప్రత్యక్ష సాక్షుల వివరాలు లేవు. ఇలాగైతే నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుంది. నిందితులను మూడు రోజులపాటు రక్షించిన రాజకీయ నాయకులు, పోలీసులను కూడా శిక్షించాలి. రాష్ట్రంలో యువత గంజాయి మత్తులో అకృత్యాలకు పాల్పడుతున్నారు. రేయింబవళ్లూ కష్టపడి చదివి పీజీ సీటు సంపాదించుకున్న నా కుమార్తెను దారుణంగా హతమార్చారు. నా బిడ్డ డాక్టర్గా కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందనుకుంటే శవాన్ని పంపించారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డకి జరిగినట్లు ఎవరికీ జరగకూడదని, ఏ తండ్రికీ కడుపుకోత రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ప్రాణం తీసేవాళ్లు కావాలా? ప్రాణం పోసే వాళ్లు కావాలా? తమకు న్యాయం జరగకపోతే ఇలాంటి రాక్షసులు మరింతగా రెచ్చిపోతారని అన్నారు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిందితులకు కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. -
శాంతిభద్రతలు పూజ్యం
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ/సీటీఆర్ఐ: రెడ్బుక్ రాజ్యంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఉన్నతాధికారులు, మేధావులు ధ్వజమెత్తారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో క్షీణించిన శాంతిభద్రతలపై వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎంపీ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, మేధావులు తరలివచ్చి తమ అభిప్రాయాలు తెలియజేశారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి, దహనం చేసిన సంఘటన.. కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానంటూ మాదిగ యువకుడు పురుపోగు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పిన ఉదంతం.. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొని చంపడం.. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం వంటి దారుణ ఘటనలు రాష్ట్రంలో నిత్యం జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూటమి నాయకుల చేతిలోకి చేరడంతో పోలీసులు వారికి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, దేశిరెడ్డి బలరామనాయుడు, వీఎస్ఎస్ కృష్ణకుమార్, రిటైర్డ్ సీఐ సాల్మన్రాజు, కల్తీ పాల ఘటన బాధిత కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, వాసంశెట్టి గంగాధరరావు, తోట రామకృష్ణ, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తగరం సోము, సంయుక్త కార్యదర్శి ఆరే చిన్ని, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకటరావు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు, దూర్వాసుల సత్యనారాయణ, నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, పెంకే సురేష్, యువజన విభాగం నగర కన్వీనర్ బిల్డర్ చిన్నా, మాజీ కార్పొరేటర్ నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఫ చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు ఫ పాలకులే గంజాయి, మద్యం, మతం మత్తు వ్యాప్తి చేస్తున్నారు ఫ బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్నారు ఫ ఒక్క ఘటనలోనూ బాధితులకు న్యాయం జరగడం లేదు ఫ పాలకుల అసమర్థతతో నేరస్తులు చెలరేగిపోతున్నారు ఫ ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న వారే ప్రస్తుత సీఎంలు ఫ కూటమి సర్కారుపై అఖిల పక్ష నాయకులు, మేధావుల మండిపాటు దిగజారిపోయిన ప్రభుత్వమిది ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలయ్యారు. చట్టం సమానంగా వర్తిస్తే వారికి ఆ పదవులెలా వస్తాయి? ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడతామని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులే దానిని ఉల్లంఘించి, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ పాలన సాగించడం దారుణం. ప్రియాంక ఘటన, అంజలి మర్డర్, ప్రభుత్వాసుపత్రిలో వైద్యురాలి నిర్లక్ష్యంతో జయంతి మృతి, కల్తీపాల ఘటన బాధితులకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు, ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు ఇవ్వాలని ప్రియాంక తండ్రి వెంకటేష్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. దీనిపై హైకోర్టులో కేసు వేశాం, అక్కడ కచ్చితంగా ఫుటేజీలు ఇవ్వడానికి పోలీసులు రెడీగా ఉండాలి. మద్యం, గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఆ మత్తులో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. చివరికి దేశద్రోహం, ఉపా చట్టం కింద కేసులు కూడా పెడుతున్నారంటే ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ప్రజలు ఆలోచించాలి. సీసీ టీవీలు లేనప్పుడు పోలీసు వ్యవస్థ పని చేయలేదా? నేరస్తులను అరెస్టు చేయలేదా? ఏ ఒక్క బాధిత కుటుంబానికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. కనీసం ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మహిళలకు రక్షణ కరువు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లు తీసుకొచ్చారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారంలోకి రాగానే దిశ బిల్లును, మహిళా పోలీసు స్టేషన్లను తొలగించేశారు. అప్పటి నుంచీ రక్షణ కరువై, మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, పోలీసులు త్వరలోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. – మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రజల మానప్రాణాలకు రక్షణ లేదు వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుల వల్ల ప్రజలకు న్యాయం జరగదు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జరిగిన సంఘటనలను వ్యవస్థల సాయంతో వక్రీకరించి ప్రజలను ఏమార్చుతున్నారు. అధికారంలో ఉండి ఇష్టానుసారం చేయొచ్చన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ లేదని చెప్పడం సరికాదు. శాంతిభద్రతల విషయంలో పోలీసులతో పాటు సీఎం చంద్రబాబు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆయన మాటలన్నీ అబద్ధాలే. వ్యక్తి గొప్ప కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాధ్యత మరచిపోవడం వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
సమస్యలు పరిష్కరించపోతే మరో మూడు రోజులు సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల ఆలిండియా సమ్మెతో పాటు, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని బ్యాంక్ ఉద్యోగులకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్స్ నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పిలుపు మేరకు వివిధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐదు రోజుల బ్యాంకింగ్ను వెంటనే అమలు చేయాలని, అందరికీ సమానమైన పీఎల్ఐ వర్తింపజేయాలని, బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. సుమారు 1,200 మంది అధికారులు, ఉద్యోగులతో మానవహారం నిర్వహించారు. కార్యక్రమానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు టి.శేషుకుమార్, శ్రీనివాసరావు, పాపారావు, ఎంఎస్ఎన్ రాజు, మురళీధర్, డీఎస్ పేరిశాస్త్రి తదితరులు నాయకత్వం వహించారు. సీపీఐ నేత మధు, ఏఐటీయూసీ నాయకుడు అరుణ్, ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్స్ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్, ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోదండరామ్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు ఆదివిష్ణుమూర్తి సంఘీభావం తెలిపారు. -
ఓట్లు తొలగించేందుకు కుట్ర
ఫ ఫారం–7 ద్వారా కుయుక్తులు ఫ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి: వైఎస్సార్ సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుట్రలకు తెర లేపారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ద్వారా ఓట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఫారం–7ను ఆయుధంగా వాడుకుంటూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి మేరకు గ్రామాలు వదిలి వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులే అందించారని తెలిపారు. అయితే, ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక, వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడానికి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని, వారి ఓట్లను కూటమి నాయకులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అనపర్తి, రామవరం, కుతుకులూరు, మహేంద్రవాడ, పొలమూరు, కొప్పవరం వంటి గ్రామాల్లో అత్యధికంగా ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవారు ఉంటారని, వీరు బతుకుతెరువు కోసం వారానికి ఐదారు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్తూంటారని చెప్పారు. వారి కుటుంబాలు ఆ గ్రామాల్లోనే నివాసముంటున్నప్పటికీ, గ్రామంలో ఉండటం లేదనే నెపంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలంటూ ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. ఈ ఐదారు గ్రామాల్లోనే సుమారు 1,250 ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు చేశారని, అందులో 40 నుంచి 50 మాత్రమే చనిపోయిన వారివి ఉన్నాయని, మిగిలిన 90 శాతం పైగా ఓట్లు ఫైనాన్స్ వ్యాపారులవేనని వివరించారు. ఇచ్చిన ఫిర్యాదుల్లో కూడా చాలామంది సంతకాలను ఫోర్జరీ చేశారని సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. విషయం తెలుసుకున్న కొందరు తాము సంతకాలు పెట్టలేదని చెప్పడంతో, నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన తర్వాత కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి బల్క్గా దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఐదు ఓట్లపై మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ 10వ తేదీతో గడువు ముగిసిన తర్వాత 11వ తేదీన కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ దరఖాస్తులు స్వీకరించేలా చేశారని అన్నారు. రామకృష్ణారెడ్డి ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ అక్రమాలపై జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వైఎస్సార్ సీపీ తరఫున న్యాయపోరాటం చేస్తామని సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు తొలగించినా సహించేది లేదన్నారు. గతంలో ఈవీఎంల సహకారంతో గెలిచారనే విషయం బయట పడటంతో, ఇప్పుడు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని, ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని సూర్యనారాయణరెడ్డి అన్నారు. -
అక్రమ సంపాదనపైనే వారి దృష్టి
డబ్బులిచ్చి పోస్టులు కొనుక్కున్న వాళ్లు ప్రజాసేవ చేయరు. అక్రమ సంపాదన పైనే దృష్టి సారిస్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో అదే జరుగుతోంది. పోస్టుకింత అని కొనుకున్న వస్తున్న వారందరూ ప్రజలకు సేవ చేయడం మానేసి, దొడ్డిదారిన సంపాదించే పనిలో పడ్డారు. దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. అందువల్లనే రాజమహేంద్రవరంలో శాంతిభద్రతలు క్షీణించాయి. – బోడా వెంకట్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయకుడు కరెక్ట్గా ఉంటేనే.. నాయకుడు కరెక్ట్గా ఉంటేనే వ్యవస్థ కూడా సవ్యంగా ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత పాలకులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే వ్యవస్థలన్నీ నిర్వీర్యం చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. దీంతో, అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోను, దేశంలోను మద్యం, గంజాయి, మతం మత్తులో ప్రజలను ముంచేసి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ పరిస్థితి మారకపోతే యువతకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు వారి భవిష్యత్ అంధకారమయమవుతుంది. – మార్గాని నాగేశ్వరరావు, బీసీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఈ పాలన అంతం కావాలి గొంతెత్తితే అరెస్టులు.. ప్రశ్నిస్తే అరెస్టులు.. నిరనన తెలిపితే అరెస్టులు. ఇదేం పాలన? ఇంత దుర్మార్గపు పాలన వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. తమకు మంచి చేస్తారని ఎన్నుకుంటే మంచి చేయకపోగా ఇన్ని దారుణాలకు ఒడిగట్టటం ఎక్కడా చూడలేదు. ఇటువంటి పాలన అంతమవ్వాలి. చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలు ఇక క్షమించరు. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
శ్రీవారి సన్నిధిలో.. వరలక్ష్మీ వైభవం
ద్వారకా తిరుమల: సకల సౌభాగ్యాలూ ప్రసాదించాలని వేడుకుంటూ.. ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో మహిళలు వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయ అనివేటి మండపంలో దేవస్థానం ఆధ్వర్యాన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. మూడు వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తొలుత వరలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాలు, వేదమంత్ర ఘోష నడుమ ఆలయం నుంచి తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపం వద్దకు వెండి తొళక్క వాహనంపై తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని వేంచేయించి అర్చకులు, పండితులు విశేష పుష్పాలంకరణ చేశారు. ఆలయ ఈఓ వి.త్రినాథరావు దంపతులు అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. పండితులు సుస్వరంగా వేద మంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా మహిళలతో సామూహికంగా వరలక్ష్మీ వ్రతం జరిపించారు. దేవస్థానం పూజా సామగ్రి సమకూర్చింది. శ్రీవారి దర్శనార్ధం క్షేత్రానికి వచ్చిన మహిళా భక్తులు సైతం ఈ వ్రతాల్లో పాల్గొనడంతో అనివేటి మండపాలు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం మండపాల మధ్య మధ్యన 13 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం మహిళా భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పించారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆ అమ్మవారిని కొలిచారు. వ్రతాలు ఆచరించిన మహిళలకు లక్మీదేవి రూపులను దేవస్థానం అందజేసింది. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, కమిటీ సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఫ ద్వారకా తిరుమలలో ఘనంగా సామూహిక వ్రతాలు ఫ పాల్గొన్న 3 వేల మందికి పైగా మహిళలు -
డ్రగ్స్ అధికారుల విస్తృత తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఔషధ నియంత్రణ శాఖ అధికారులు రాజమహేంద్రవరం, కాకినాడల్లో శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ట్రమడాల్, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు హోల్సేల్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. డ్రగ్స్ ఏడీ నాగమణి, రాజమహేంద్రవరం, కాకినాడ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కల్యాణి, మురళి ఆయా ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. పలు హోల్సేల్ దుకాణాల్లో ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించిన బిల్లులు లభించలేదు. వాటిని అమ్మిన రిటైల్ మందుల దుకాణానికి సంబంధించిన బిల్లులు తనిఖీ చేయనున్నారు. బాలిక ఆత్మహత్య రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలమూరు అరుంధతిపేటకు చెందిన బాలిక చిర్రా బ్లెస్సీ (17) శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. ఇంటర్ వరకూ చదువుకుని, ఇంట్లోనే ఉంటున్న బ్లెస్సీ ఏడాది క్రితం నాయనమ్మతో గొడవ పడి ఆవులకు పెట్టే మందు తాగేసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. నెల రోజుల క్రితం కిడ్నీ నొప్పితో బాధ పడుతూంటే కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ నొప్పి తగ్గలేదు. గురువారం మరోసారి నొప్పి వస్తోందనడంతో మెడికల్ షాపు నుంచి టాబ్లెట్ తీసుకువచ్చి వేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటిలానే ఉదయమే రోజువారీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వస్తున్న ఆమె తండ్రి చిర్రా దానియేలుకు తెలిసిన వ్యక్తి ఎదురొచ్చి బ్లెస్సీ ఉరి వేసుకుందని చెప్పాడు. పరుగున వెళ్లిన తండ్రి.. కుమార్తెను వెంటనే కిందకు దింపి, సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే, ఆ బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దానియేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
చింతూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చింతూరు మండలం గొర్లగూడెం సమీపాన జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్లగూడెం – కన్నాపురం నడుమ రోడ్డుపై ఆమె మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆచూకీ తెలియరాలేదని, ఆమెను ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గణేశ ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గణేశ నవరాత్ర ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) ఎస్.భాస్కర్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొవ్వూరు ఆర్డీఓ కె.ఆనందరావుతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 6 వేల నుంచి 7 వేల వరకూ వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని సూచించారు. వినాయక మండపాలకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ముందుగానే పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు మండపాలను ముందస్తుగా తనిఖీ చేసి భద్రతపై నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండపాల అలంకరణలో సులభంగా మంటలు వ్యాపించే పదార్థాలను వినియోగించరాదని, విద్యుత్ వైరింగ్లో నాణ్యమైన కేబుల్స్ మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిబంధనల మేరకు నియంత్రించాలని, రాత్రి 10 గంటల తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పెద్ద శబ్దాలతో కార్యక్రమాలు నిర్వహించరాదని డీఆర్ఓ స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న ఏపీ గణేశ నిమజ్జన కమిటీ జిల్లా యూనిట్ ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలు నిమజ్జన ఏర్పాట్ల వివరాలను అధికారులకు అందజేశారు.సమావేశంలో రెవెన్యూ, పోలీస్, దేవదాయ, విద్యుత్, ఇరిగేషన్, అగ్నిమాపక, ఫిషరీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ పాఠశాలలు, వనతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందన్నారు. ఈ పరీక్ష నవంబర్ 15న జరుగుతుందని తెలిపారు. పరీక్ష రుసుముగా ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున వచ్చే నెల 13లోగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో అందుబాటులో ఉందని తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 12లోగా సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు బీఎస్ఈ.ఏపీ.జీఓవీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలను వెబ్సైట్లో పరిశీలించవచ్చని వాసుదేవరావు తెలిపారు. రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నేడు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై స్థానిక ఏవీ అప్పారావు రోడ్డు సెంటర్లోని శ్రీరాంపురం రోడ్డులో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబలేటరీ తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల పరిధిలో సేవలు అందించనుంది. జీజీహెచ్లో నేడు క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ పథకంలో భాగంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ను శనివారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పిసోఫియా ఆధ్వర్యాన ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇంటికి చేరే వేళ.. దూసుకొచ్చిన మృత్యువు
అమలాపురం రూరల్: రోజూ మాదిరిగానే కూలి పని ముగించుకుని అతడు ఇంటికి తిరుగుపయనమయ్యాడు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకునేవాడే.. అంతలోనే మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చి, అతడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన ఆ కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచింది. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.ఏసుపాదం శుక్రవారం తెలిపిన వివరాలివీ.. అమలాపురం మండలం నడిపూడి శ్రీరామ్ నగర్కు చెందిన కొల్లాటి సూరిబాబు (39) అమలాపురం మార్కెట్లో హోల్సేల్ ఉల్లిపాయల వ్యాపారి వద్ద రోజువారీ వేతనానికి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పని ముగించుకుని రోజూలానే మోటార్ సైకిల్పై ఇంటికి బయల్దేరాడు. ముక్కామల బైపాస్ రోడ్డులో వెళ్తూండగా ఈదరపల్లి అయ్యప్ప స్వామి ఆలయ సమీపాన ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు అతడి బైక్ను బలంగా ఢీకొంది. తలకు తీవ్ర గాయమైన సూరిబాబును హుటాహుటిన 108లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సత్యవతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సూరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సూరిబాబు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నడిపూడి గ్రామస్తులు, అమలాపురం మార్కెట్లోని వ్యాపారులు అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకుని డిమాండ్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. గంజాయి వల్లేనా! నడిపూడి – ఈదరపల్లిలో కాలువ గట్టున కొంత మంది గంజాయి అమ్ముతున్నారని గ్రామస్తులు చె బుతున్నారు. దీంతో, కొంత మంది యువకులు గంజాయి, మద్యం తాగి, ఆ మత్తులోనే సూరిబాబు బైక్ను కారుతో ఢీకొట్టారని ఆరోపించారు. గంజా యిని అరికట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఫ కారు ఢీకొని రోజు కూలీ మృతి ఫ ఈదరపల్లి వద్ద ప్రమాదం -
నేతల మైండ్సెట్ మారకపోతే తిరుగుబాటే..
వ్యాపారుల ప్రవేశంతో రాజకీయాలు కలుషితమవుతున్నాయి. నేతల మైండ్సెట్ మారకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. కీలకమైన వ్యవస్థలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. మంచి పరిపాలన అందించాలనే మైండ్సెట్ను రాజకీయ నాయకులు అలవరచుకోవాలి. పోస్టింగ్ల కోసం రాజకీయ నాయకుల చుట్టూ పోలీసులు తిరిగితే ఇక ప్రజలకు ఏవిధంగా జవాబుదారీగా ఉంటారు? ఐఏఎస్, ఐపీఎస్ వంటి చదువులు చదువుకుని కూడా రాజకీయ నాయకులు చెప్పిందే చేయడం అవివేకం. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్ -
ప్రయాణం పట్టాలు తప్పుతోంది
ప్రయాణికుల భద్రతపై ఆందోళన? కొవ్వూరు – చాగల్లు మధ్య రైల్వే ట్రాక్లు, పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు వంటి వాటిపై రైల్వే ఉన్నతాధికారుల ప్రత్యేక తనిఖీలు తూతూమాత్రంగానే ఉంటున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ స్టేషన్ల మధ్య తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన సమయంలో పక్క ట్రాక్లో ప్రయాణికుల రైలు ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్నపాటి ఘటనలను కూడా రైల్వే అధికారులు తేలికగా తీసుకోరాదు. చిన్న సాంకేతిక లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత కారణాలు వెతకడం కంటే.. ప్రతి డీరైల్మెంట్పై సాంకేతికంగా సమగ్ర విచారణ జరిపి, ముందుగానే లోపాలను గుర్తించి, శాశ్వత ప్రాతిపదికన సరి చేయడం అత్యవసరంగా కనిపిస్తోంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడవచ్చని ప్రయాణికులు సూచిస్తున్నారు. చాగల్లు: విజయవాడ – విశాఖపట్నం రైల్వే మార్గంలో వేలాది మంది ప్రయాణికులు నిత్యం అనేక రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. తూర్పు తీరంలో అత్యంత కీలకమైన రైల్వే లైను ఇది. ఈ మార్గంలోని కొవ్వూరు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల తరచుగా గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పుతూండటంతో (డీరైల్) ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. గత ఫిబ్రవరి 12న విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు చాగల్లు రైల్వే స్టేషన్ సమీపాన పట్టాలు తప్పింది. గత నెల 31న విశాఖపట్నం సమీపంలోని సింహాచలం నుంచి విజయవాడ వద్ద ఉన్న కొండపల్లికి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఓ వ్యాగన్.. కొవ్వూరు రైల్వే స్టేషన్లోని మూడో నంబర్ ప్లాట్ఫారం చివరన ఉన్న నాలుగో లైన్లో (లూప్లైన్) పట్టాలు తప్పింది. తాజాగా శుక్రవారం ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి మహారాష్ట్రలోని బారామతికి ఎరువులను రవాణా చేస్తున్న గూడ్స్ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్ ఔటర్లో పట్టాలు తప్పింది. మొత్తం 47 వ్యాగన్లకు గాను ఎనిమిది పట్టాలు తప్పాయి. మూడు సందర్భాల్లోనూ గూడ్స్ రైళ్లే పట్టాలు తప్పినప్పటికీ... కొవ్వూరు – చాగల్లు మధ్య జరుగుతున్న వరుస ప్రమాదాలు ఇక్కడి ట్రాక్ల నిర్వహణ, రైల్వే పాయింట్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, వేగ నియంత్రణ తదితర సాంకేతిక అంశాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండే విజయవాడ – విశాఖపట్నం మార్గంలో రైల్వే ట్రాక్లపై నిరంతరం సమగ్ర పరిశీలన అవసరమనే విషయాన్ని ఈ ప్రమాదాలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రయాణికులకు అవస్థలుఫ తరచుగా డీరైల్ అవుతున్న గూడ్స్ రైళ్లు ఫ కొవ్వూరు – చాగల్లు స్టేషన్ల మధ్య వరుస ప్రమాదాలు ఫ ఆరు నెలల్లోనే మూడు ఘటనలు ఫ భద్రతపై ప్రయాణికుల ఆందోళన హెల్ప్ డెస్క్ ఏర్పాటు రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్లో అధికారులు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలు సజావుగా సాగేంత వరకూ ఈ హెల్ప్ డెస్క్ కొనసాగుతుందని రైల్వే సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు. పెరవలి/రాజమహేంద్రవరం సిటీ: కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పటంతో విజయవాడ – విశాఖపట్నం మధ్య ఇరువైపులా పలు రైళ్లు 2 నుంచి 6 గంటల మేర ఆలస్యంగా నడిచాయి. రాజమండ్రి, సామర్లకోట, నిడదవోలు జంక్షన్ తదితర స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు పడ్డారు. విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్, ప్రశాంతి, బొకారో, తిరుమల, సింహాద్రి, వందేభారత్, కోణార్క్, జన్మభూమి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బొకారో, శేషాద్రి, తిరుమల, వందేభారత్ రైళ్లు సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచాయి. కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ 5 గంటలు, తిరుపతి ఎక్స్ప్రెస్ 4 నాలుగు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాయి. రైళ్లు ఆలస్యంగా నడవడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలు రద్దీగా మారాయి. కూర్చునేందుకు బెంచీలు సైతం చాలక వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్ల రాకపోకలపై అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రైళ్ల రద్దు: విశాఖపట్నం – విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్, విజయవాడ – రాజమండ్రి – విజయవాడ (67202/67201) రైళ్లను అధికారులు శుక్రవారం రద్దు చేశారు. విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్(12718)ను శనివారం రద్దు చేశారు. హుటాహుటిన ట్రాక్ పునరుద్ధరణ పనులు ౖరైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టాలు తప్పిన వ్యాగన్ల నుంచి ఎరువులు కిందకు దింపి, మరమ్మతులు చేపట్టారు. సుమారు నాలుగు గంటల తరువాత ట్రాక్ సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా, ప్రమాద స్థలానికి మీడియాను వెళ్లనివ్వకుండా రైల్వే అధికారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. -
బ్లాక్లో వెంకన్న ఆలయ టికెట్ల విక్రయం
ముగ్గురి అరెస్టు ఆత్రేయపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వివిధ సేవల టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఎర్ర సత్యనారాయణ, లోకం వెంకట సురేష్, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన కోరాడ త్రినాథ్ సాయిలు వాడపల్లి క్షేత్రంలో వేదాశీర్వచనం, దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఆ టికెట్లను దర్శనానికి వస్తున్న ఇతర భక్తులకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము తెలిపారు. -
ప్రజలే బుద్ధి చెబుతారు
రాష్ట్రంలో అనేక దారుణాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు తిరిగి బాధితుల మీదనే కేసులు బనాయిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ సాకులు చెబుతున్నారు. గత పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తొక్కిసలాట జరిగి 29 మంది భక్తుల ప్రాణాలు పోయాయి. అప్పుడు కూడా సీసీ కెమెరాలు పని చేయలేదనే చెప్పారు. బాధితులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ, 2029లో కొత్త ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా న్యాయం జరుగుతుంది. – అశోక్ కుమార్ జైన్, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం -
మంచిది కాదేమో మచ్చ
● కుష్ఠు నియంత్రణకు కేంద్రం కృషి ● వచ్చే మార్చి నాటికి నిర్మూలనే ధ్యేయం ● నేటి నుంచి 24 వరకూ అవగాహన కార్యక్రమాలు కపిలేశ్వరపురం: శరీరంపై ఏవైనా మచ్చలు వస్తే అలా వదిలేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఒక్కోసారి అది కుష్ఠుకు సంబంధించినది కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు, కుష్ఠు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకూ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పారా మెడికల్ ఆఫీసర్, పీహెచ్సీలోని ఎంపీహెచ్ఎస్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయిలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం చేపడతారు. వైద్య, ఆరోగ్య కార్యకర్తలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాధి లక్షణాలను వివరిస్తున్నారు. వాటి ఆధారంగా అనుమానితులు స్థానిక పీహెచ్సీ వైద్యులను లేదా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించవచ్చు. వారిని డీపీఎంఓ స్థాయి అధికారి షెడ్యూల్ ప్రకారం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. లక్షణాలున్న వారికి వ్యాధి సోకిందో లేదో ప్రత్యేక బృందం నిర్ధారిస్తుంది. నిర్ధారణ అయితే వ్యాధిగ్రస్తునికి కౌన్సెలింగ్ ఇచ్చి, చికిత్స చేస్తారు. గత నెలలో జరిగిన క్షేత్ర స్థాయి పరిశీలనలో తొమ్మిది మందికి వ్యాధి లక్షణాలున్నట్లు గుర్తించి, బహుళ ఔషధ చికిత్స అందించారు. వారిలో ఎనిమిది మందికి వ్యాధి నయమైంది. జిల్లాలో ఐదు మచ్చల్లోపు ఉన్న కేసులు 11, అంతకంటే ఎక్కువ మచ్చలున్న కేసులు 69 కొత్తగా నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా అంగవైకల్యం పొందిన వారు జిల్లాలో 916 మంది ఉన్నారు. వారిలో గ్రేడ్–1 వైకల్యంతో 92 మంది, గ్రేడ్–2 వైకల్యంతో 824 మంది బాధ పడుతున్నారు. జిల్లాలోని 11 లెప్రసీ కాలనీల్లో 119 మంది నివాసం ఉంటున్నారు. లక్షణాలను బట్టి బహుళ ఔషధ చికిత్స మానసికంగా ధైర్యంగా ఉండటం కుష్ఠు వ్యాధి నయం కావడానికి దోహదపడుతుంది. ఈ వ్యాధిని నయం చేయడానికి ఆధునిక చికిత్సా పద్ధతులున్నాయి. శరీరంపై రాగి రంగు మచ్చలొస్తాయి. ఆ మచ్చలపై వెంట్రుకలు రాలిపోతాయి. దురద, స్పర్శ, నొప్పి ఉండవు. ఈ ప్రారంభ లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ఆశా, ఏఎన్ఎంలకు చెప్పాలి. వ్యాధి నిర్ధారణ అయితే బహుళ ఔషధ చికిత్స అందిస్తారు. పుండ్లు పడిన వారికి అవసరమైతే రిఫరల్ లెప్రసీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేస్తారు. – డాక్టర్ వసుంధర, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ ట్యుబర్క్యులోసిస్ అధికారి, రాజమహేంద్రవరం -
టీడీపీ నాయకుల సెటిల్మెంట్ దందా
● వారితో కలసి ఎస్సై వేధిస్తున్నారని యువకుడి ఆరోపణ ● పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం ● సెల్ఫీ వీడియో విడుదల అనపర్తి: ఒక కేసు సెటిల్మెంట్లో అదనపు డబ్బులు ఇవ్వాలంటూ టీడీపీ నాయకులతో కలసి స్థానిక ఎస్సై వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. అనపర్తి మండలం పులగుర్త గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువకుడు మిత్తన వెంకటేష్ గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు అతడు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటేష్ అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి సోదరుడు రాజేష్ కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన బియ్యం వ్యాపారి విజయ్ అగర్వాల్ వద్ద వెంకటేష్ గుమస్తాగా పని చేస్తున్నాడు. అనపర్తి, మండపేట పరిసర ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు బియ్యం లోడ్లు సరఫరా చేస్తూంటాడు. కొద్ది రోజుల క్రితం ఒక లారీ లోడుకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల నగదును వెంకటేష్, అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అధికారి వీరబాబు కలసి వాడుకున్నారు. ఈ విషయం యజమానికి తెలియడంతో భయపడిన వెంకటేష్ హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనపర్తి ఎస్సై బి.వినయ్ ప్రతాప్ సమక్షంలో వెంకటేష్ అన్న రాజేష్ రూ.6 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆ డబ్బులు అగర్వాల్కు చెల్లించి సమస్య పరిష్కరించుకున్నట్టు రాజేష్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామానికి వచ్చిన వెంకటేష్ను మిగిలిన రూ.4 లక్షలు చెల్లించాలంటూ అధికారి వీరబాబుతో పాటు మరో టీడీపీ నేత అధికారి దొరబాబు కలిసి ఎస్సై ద్వారా ఒత్తిడి తెచ్చారు. నాలుగు రోజులుగా తన తమ్ముడిని ఎస్సై వినయ్ ప్రతాప్ విపరీతంగా వేధించారని వెంకటేష్ అన్న రాజేష్ ఆరోపిస్తున్నాడు. బుధవారం రాత్రి కూడా తీవ్రంగా కొట్టారని, ఆ టార్చర్ తట్టుకోలేక వెంకటేష్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆత్మహత్యా యత్నానికి ముందు వెంకటేష్ సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. తన మరణానికి పులగుర్త గ్రామానికి చెందిన నా యకులు దొరబాబు, వీరబాబు, అనపర్తి ఎస్సై వేధింపులే కారణమని ఆ వీడియోలో పేర్కొన్నాడు. వారి బారి నుంచి తన తమ్ముడికి, కుటుంబానికి రక్షణ కల్పించాలని వెంకటేష్ సోదరుడు రాజేష్ ఉన్నతాధికారులను కోరుతున్నాడు. విచారణ నుంచి తప్పించుకునేందుకే.. వెంకటేష్ ఆరోపణలపై స్థానిక ఎస్సై బి.వినయ్ ప్రతాప్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అతడిపై అనపర్తి స్టేషన్లో కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసులో విచారణకు పిలవగా తప్పించుకునేందుకే ఇలా చేశాడని అన్నారు. -
వంచనపై ఆగ్రహం
● కూటమి పాలనతో ప్రజలు సతమతం ● పోరుబాటలో వివిధ వర్గాలు కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి కట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు అలవిగాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చారు. రెండేళ్లకు పైబడిన పాలనలో చాలా హామీలు అమలు చేయలేకపోయారు. కొన్నింటిని ఉద్దేశపూర్వకంగానే బుట్టదాఖలు చేశారు. పైగా, రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతూ కూటమి నేతలు అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇసుక, గ్రావెల్, మద్యం మాఫియాగా అవతారమెత్తి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. గంజాయి మత్తు పల్లెపల్లెలకూ విస్తరిస్తోంది. మహిళలు, బాలికలపై అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా మోసాలు, అక్రమాలు, అరాచకత్వం ప్రబలుతూండటంతో జనం తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం తమను వంచించిందనే విషయం గ్రహించిన వివిధ వర్గాల ప్రజలు ఆగ్రహంతో పిడికిళ్లు బిగించి, పోరుబాట పడుతున్నారు. కొద్ది నెలలుగా జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ● రెండేళ్లుగా ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకుండా అన్నదాతలను దళారులకు వదిలేసింది. అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సైతం సకాలంలో డబ్బులు చెల్లించకుండా రైతులకు చుక్కలు చూపించింది. దీనిపై వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన చంద్రబాబు సర్కారు.. ప్రీమియం భారాన్ని రైతుల పైనే మోపింది. జిల్లావ్యాప్తంగా 12,500 ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. ఎకరాకు రూ.5 వేల ప్రీమియం భారాన్ని ఉద్యాన రైతులపై ప్రభుత్వం మోపింది. అంత భారాన్ని మోయలేక కేవలం 500 ఎకరాలకే పంటల బీమా ప్రీమియం చెల్లించారంటే రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ● తెలంగాణ ప్రభుత్వం తరహాలో బీఓసీ బోర్డు ద్వారా సంక్షేమ ఫలితాలు అందించాలని, ప్రమాద మరణాలకు రూ.25 లక్షలు, సహజ మరణాలకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించేలా పథకాలు తీసుకురావాలని అసంఘటిత రంగ కార్మికులు చాన్నాళ్లుగా ఉద్యమిస్తున్నారు. వారి విన్నపాలను చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ● గత మార్చి నెలలో విజయవాడలో అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన నిరశన దీక్షను చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా భగ్నం చేసింది. ఆ ఘటనలో జిల్లాకు చెందిన అంగన్వాడీ సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ● తమ గౌరవ వేతనాలను రూ.26 వేలకు పెంచాలని కోరుతూ అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లు జూలై 31న రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద గత నెల 5న ఏబీవీపీ ఆధ్వర్యాన విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ● డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ గత నెలలో వైఎస్సార్ సీపీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యాన దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. ● తమ ఉపాధిని దెబ్బ తీసేలా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓలను రద్దు చేయాలనే డిమాండుతో గత నెల 20 నుంచి 31వ తేదీ వరకూ దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు పెన్డౌన్ పేరుతో నిరసన తెలిపారు. ● తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 1న రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ● తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 3న ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్స్ డే పేరుతో రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సామాన్యులకు ఏ మేలూ లేదు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 2024 ఎన్నికల ప్రచారంలో ఆకర్షణీయమైన మాటలతో ప్రజలకు అనేక హామీలిచ్చారు. రెండేళ్ల పాలనలో వాటిని ఏమాత్రం అమలు చేయలేదు. సామాన్య ప్రజల జీవితాలకు కూటమి ప్రభుత్వం ఏమాత్రం మేలు చేయడం లేదు. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం -
ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీ
● రావులపాలెం పంచాయతీ కార్యాలయంలో కలకలం ● అనధికారిక లే అవుట్లు, అక్రమ భవనాలపై విచారణ రావులపాలెం: రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆకస్మిక తనిఖీలు చేయడం కలకలం రేపింది. రాజమహేంద్రవరం రేంజ్ ఏబీసీ అడిషనల్ ఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యాన సీఐలు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్, సిబ్బంది ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ తనిఖీలు చేపట్టారు. పలు అంశాలపై పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ను ప్రశ్నించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ భవ్య కిషోర్ మాట్లాడుతూ, ప్రస్తుతం తనిఖీలు, డాక్యుమెంట్ల పరిశీలన కొనసాగుతున్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీ పరిధిలో సరైన అనుమతులు తీసుకోకుండా లే అవుట్లు వేశారని, అనధికారిక భవనాలు నిర్మించారని వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేస్తున్నామని వివరించారు. ప్రాథమికంగా సుమారు 60 అనధికారిక లే అవుట్లు, 85 అక్రమ భవనాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో కొన్నింటికి నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదని, మరికొన్నింటికి నోటీసులు ఇచ్చినప్పటికీ తదుపరి చర్యలు తీసుకోకుండా వదలేశారని గుర్తించామన్నారు. తనిఖీలు రెండు మూడు రోజుల పాటు కొనసాగుతాయని, పూర్తయిన వెంటనే ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్ లేదా తనను 9440 44 6102 నంబరులో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
కాజులూరు: కోరంగి కెనాల్లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం వేళంగి శివారు కొత్తపేటకు చెందిన పలువురు యువకులు బుధవారం రాత్రి యానాం వెళ్లి మోటార్ సైకిళ్లపై తిరిగి వస్తున్నారు. వీరిలో మచగిరి రాజు (20) అనే యువకుడు కాజులూరు మండలం జగన్నాథగిరిలో తోట త్రిమూర్తులు వారధి వద్ద కోరంగి కెనాల్లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గురువారం కాలువలో గాలింపు చేపట్టారు. శీల గ్రామం వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. జగన్నాథగిరి వీఆర్ఓ ఈశ్వరరావు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గొల్లపాలెం ఎస్సై ఆర్వీఎన్ మూర్తి తెలిపారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
● శాంతిభద్రతలు నిర్వీర్యం ● ప్రజాస్వామ్యం అపహాస్యం ● బాధితుల పైనే కేసులు పెట్టిస్తున్న ఘనత చంద్రబాబుది ● వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రజల ప్రాణ, మాన, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుడారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేసి, దహనం చేశారన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు టార్చర్ భరించలేక చనిపోతున్నానని మాదిగ యువకుడు పురుపోగు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్ధినిని కారుతో ఢీకొట్టి చంపేశారన్నారు. ఓ కుటుంబం మొత్తం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడటం చూస్తూంటే రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసినా చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పోలీసు వ్యవస్థ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా తయారైందన్నారు. చంద్రబాబు అండతో ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాగా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారని, దీనిపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజశేఖర్ విమర్శించారు. ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమా వాలి యాదవ్ మాట్లాడుతూ మహిళలను వివస్త్రల్ని చేయడం, దాడులు చేయడం రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేసినా చెల్లిపోతుందనే అధికార అహంకారంతో ప్రజాప్రతినిధులు, పోలీసులు వ్యవరిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. ఇంత అరాచకాలు జరుగుతూంటే మహిళ అయి ఉండి కూడా హోం మంత్రి అనిత ఖండించకపోగా వ్యంగంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. కళ్ల ముందు ఇన్ని అరాచాకాలు జరుగుతూంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరిగే వరకూ నిద్రపోనని చెప్పి, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మందికి పైగా అమ్మాయిలు అదృశ్యమయ్యారని ఆరోపించారని, అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్ కల్యాణ్కే తెలియాలని అన్నారు. విలేకర్ల సమావేశంలో ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరమల్లు లక్ష్మీనారాయణ, బేతపూడి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శులు పావని కుమారి, ప్రేమ్బాబు, కృష్ణవేణి, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను పాల్గొన్నారు. నేడు రౌండ్ టేబుల్ సమావేశం ‘చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అనే అంశంపై రాజమహేంద్రవరం రెడ్డీస్ కన్వెషన్ సెంటర్లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని రాజశేఖర్ తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు దీనికి హాజరు కానున్నారని చెప్పారు. -
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
రామచంద్రపురం రూరల్: ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతి చెందాడు. ద్రాక్షారామ హెడ్ కానిస్టేబుల్ పి.మల్లికార్జునరావు కథనం ప్రకారం.. అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన తేతల వెంకటరెడ్డి (50) రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలోని ఉప్పు దయా నందం ఇంటి పునాదిలో ఇసుక నింపుతున్నాడు. ఆ సమయంలో మోటారుకు కలిపిన విద్యుత్ వైరు ప్రమాదవశాత్తూ తగిలి షాక్కు గురయ్యాడు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.51.47 లక్షలు అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. మొత్తం వంద రోజులకు ఆలయ హుండీల ద్వారా రూ.49,93,177, అన్నప్రసాదం హుండీ ద్వారా రూ.1,54,347 కలిపి రూ.51,47,524 ఆదాయం సమకూరిందని ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. దీంతో పాటు 2.4 గ్రాముల బంగారం, 86 గ్రాముల వెండి, 40 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. -
కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు ఆలస్యం
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రైలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన కొన్ని వ్యాగన్లు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో పాటు సమీపంలోని సిగ్నలింగ్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది.కాగా, ప్రధాన రైలు మార్గం దెబ్బతినడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు ప్రయాణికుల రైళ్లు, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి.తుని రైల్వే స్టేషన్లో యాలంక , అన్నవరంలో ఉదయ్ ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. గంటల తరబడి రైళ్లలోనే వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నట్లు సమాచారం.గూడ్స్ రైలు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దెబ్బతిన్న ట్రాక్ను పునరుద్ధరించేందుకు భారీ క్రేన్లు, ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలపై ప్రభావం కొనసాగే అవకాశం ఉంది.ఈ రైళ్లు ఆలస్యం..భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి,విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్తో పాటు పలు ప్రత్యేక రైళ్లపై ప్రభావంతాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు స్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు ఇదీ చదవండి: గోదావరిలో 23 కేజీల పండుగప్ప.. 16వేలకు వేలం! -
ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం బలపడుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.ఇవాళ(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రేపు (శుక్రవారం) అనకాపల్లి, అల్లూరు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు(శుక్రవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు(శుక్రవారం) ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు.. రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆదేశించారు.విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ప్రకాశం 4 సెం.మీ, అనకాపల్లి 4, భీమిలి 2, పల్నాడు 2, గుంటూరు 2, ఎన్టీఆర్ 1.5, విజయనగరం 1.5, తుని 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
సారా కేసుల్లో ఇద్దరిపై పీడీ చట్టం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సారాయి కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరిపై పీడీ చట్టం అమలు చేసి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జోన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వై.చైతన్య మురళి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నార్త్, సౌత్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన వల్లూరి దుర్గారావు (అలియాస్ పెద్ద దుర్గ), రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిటికిన నాగేశ్వరరావులపై కలెక్టర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంతో వారిని అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. సారా తయారీ, విక్రయాల సమాచారం తెలిస్తే 14405 టోల్ ఫ్రీ నెంబరుకు చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దిండి వంతెన పైనుంచి దూకి యువకుడి గల్లంతుమలికిపురం: దిండి వంతెనపై ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా బుధవారం ఆ గ్రామానికే చెందిన దేవ వికాస్ (25) అనే యువకుడు వంతెన పైనుంచి నదిలో దూకి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. యువకునికి మూడు రోజుల క్రితం వివాహమైందని, వివాహం ఇష్టం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని స్థానికులు అంటున్నారు. కాగా అంతకు ముందే వంతెనపై ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు వచ్చి పరిస్థితిని సమీక్షించి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్ది సేపటికే యువడు తన సెల్ ఫోన్ను వంతెనపై వదిలి నదిలో దూకుతుండగా ఆ మార్గంలో కారులో వెళ్తున్న వారు గమనించి అతడిని ఆపే ప్రయత్నం చేశాడు. అంతలోనే దూకేయడంతో వంతెనపై ఉన్న సెల్ ఫోన్ ద్వారా అతడి ఆచూకీని గుర్తించారు. వ్యక్తి అదృశ్యం దేవరపల్లి: వ్యక్తి అదృశ్యంపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైయింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సంగరాజుపాలేనికి చెందిన ఆలం మహేష్ ఆవపాడులోని మిల్క్డైరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. రోజువారీ విధుల్లో భాగంగా ఈ నెల 2న ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లి తిరిగి రాలేదు. అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు, సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీనిపై మహేష్ భార్య ఆలం నాగదుర్గ ఈ నెల 3వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, బుధవారం కేసు నమోదు చేసి, అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు. గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్సై మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గుండెపోటుతో రాజమహేంద్రవరం ట్రాఫిక్ ఏఎస్సై చంద్రశేఖర్ బుధవారం మృతిచెందారు. ఆయన యథావిధిగా విధులు ముగించుకుని అంబికానగర్లోకి ఆయన ఇంటికి వెళ్లారు. తర్వాత ఒంట్లో కొంత ఇబ్బందిగా ఉందని భార్యకు చెప్పగా ఆమె మజ్జిగ ఇచ్చారు. అది తాగిన కొంతసేపటికి వెంకటేశ్వరరావు సృహ కోల్పోయారు. వెంటనే ఇంటిలోని వారు 108 ఫోన్ చేయగా వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ 30 ఏళ్లుగా జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో ట్రాఫిక్ డీఎస్పీతో పాటు సీఐ అబ్దుల్ నబీ, ఇతర పోలీసు అధికారులు సంతాపం ప్రకటించారు. -
ముగిసిన బాస్కెట్బాల్ శిక్షణ
రామచంద్రపురం రూరల్: జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు ఉచిత శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి ఈ విషయం తెలిపారు. బాలుర జట్టుకు ఈ నెల 11 వరకూ శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆఽఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ రాజు, ఎంపిక కమిటీ కార్యదర్శి అప్పలరాజు, శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సలాది నాయుడు మాస్టారు, చెలికాని రామారావు, కోట సతీష్ కుమార్, కట్టా నాగేశ్వరరావు, కంచుమర్తి బాబూరావు, గొల్లపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
కంబాలచెరువు(రాజమహంద్రవరం): జిల్లాలో జరిగిన నేరాలపై ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్ధ వార్షిక నేర సమీక్ష బుధవారం నిర్వహించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదులపై పోలీస్ స్టేషన్ వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధం, రహదారి నిబంధనలు, డ్రంక్ అండ్ డ్రైవ్, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులను అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
బీసీల పాలిట తెగులు టీడీపీ
● వారిని ఎదగకుండా చేశారు ● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు రాజమహేంద్రవరం రూరల్: తెలుగుదేశం పార్టీ బీసీలను ఎదగకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈనాడు పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారు కానీ నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, బీసీలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వేణు విమర్శించారు. ఈ తెగులు వల్ల 1997లో ఐటి రంగంలో భూమ్ వచ్చినా బీసీలు ఆ రంగంలోకి రాలేక పోయారని ఆయన ధ్వజమెత్తారు. బీసీలను కులవృత్తులుగా పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో వారిని విద్యకు దూరం చేశారని ఆరోపించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటి రంగంలో ఎదిగారని ఆయన అన్నారు. అలాగే జగన్మోహన్రెడ్డి 34 శాతం రిజర్వేషన్ను మించి 40 శాతం వరకు వారికి పదవులు కల్పించేలా చర్యలు చేపట్టి స్థానిక ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్ ఇస్తామని 105 జీవో ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పు అధిగమించి హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ఆయన అన్నారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి రూ.వెయ్యి కోట్లు మొదటి బడ్జెట్లో పెట్టి, కనీసం రూ.వెయ్యి ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లు ఉన్న బీసీలకు పెన్షన్లు ఏమయ్యాయని వేణు ప్రశ్నించారు. ప్రలోభాలు ఎర వేసి తమ పార్టీలోని బీసీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. వీటన్నింటినీ ఎండగట్టడానికి టీడీపీ వెన్నుపోటు గురించి రీజనల్ మీటింగ్స్ పెట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు వేణు స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు. -
ఆ క్షణం ఆగితే పరీక్ష పాస్!
● ఒత్తిడిని అధిగమిస్తే విజయం తథ్యం ● సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు ● నేడు ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా కొండంతలా భయపెడుతుంది. సమస్య అనే బరిలో ఉండి దాని పరిష్కారానికి దారులు వెతికితే అంతా అయోమయంగా దారీ తెన్నూ లేకుండా అదే చట్రంలో తిరుగుతుంది మనసు. ఆ చట్రం నుంచి బయటకు వచ్చి సమస్య తనది కాదన్నట్టు పరిశీలిస్తే ఇట్టే దారి దొరుకుతుంది. సమస్య తనది కాదు కాబట్టి ఆ మూడో వ్యక్తి సులభంగా సలహా ఇవ్వగలడు. అలా కాకుండే సమస్యలోనే కొట్టుమిట్టాడుతూ తట్టుకోలేక ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారు కొందరు. ఈ నెల 10న ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం. రాయవరం: సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారిలో ఆత్మహత్య భావనలు ఎక్కువగా ఉంటాయి. యువతలో ఇవి మరీ ఎక్కువ. అందుకు గల కారణాలు పైకి కనిపించేవి కొన్ని, కనపడనివి కొన్ని. ప్రేమ వివాహాలు, ఆర్థిక పరిస్థితులు, మానవ సంబంధాలు తదితరాలతో కొంతమంది, చెప్పలేని కారణాలతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మెదడులో సెరొటోనిన్ అనే రసాయనిక చర్యలు ఆత్మహత్య చేసుకోవడానికై నా, నిగ్రహించుకోవడానికై నా తోడ్పడుతుంది. మనిషి ఆలోచనల తీవ్రతను బట్టి అంతిమ చర్య ఆధారపడి ఉంటుంది. సమస్యకు కారణమైన వ్యక్తి లేదా పరిస్థితులకు ఆ వ్యక్తి తన చర్య ద్వారా తన పరిస్థితిని తెలియజేయాలనుకుంటాడని మానసిక వైద్యులు చెప్తున్నారు. కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా చికిత్స జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో మానసిక రుగ్మతలతో బాధపడేవారి కోసం కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు కౌన్సెలింగ్ పొందుతున్నట్లు ఏరియా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చేందుకు ఇష్టపడని వారు టెలిమానస్ 14416 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి బేసిక్ కౌన్సెలింగ్ను పొందే వీలుంది. పురుషులే అధికం ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 52.8 శాతం మంది పురుషులైతే, 47.1 శాతం మహిళలు. కొన్ని సర్వేల ప్రకారం ఆత్మహత్యకు గల కారణాలు, ఏ వయసు వారు ఎంత శాతం ఉన్నారన్న వివరాలు ఇలా.. కారణం శాతం దిగులు 33.3 పరీక్షలు, ఒత్తిడి, ప్రేమ విఫలం 10.6 నిద్రలేమి 11.4 భయం, కంగారు 10.6 12 ఏళ్ల లోపు వారు 3.6 13–17 ఏళ్ల లోపు వారు 6.3 18–45 ఏళ్ల లోపు వారు 67.6 46–64 ఏళ్ల లోపు వారు 17.4 65 ఏళ్లు పైబడిన వారు 5.1 ‘పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు తన కుటుంబంతో గత నెల 18న రాజమహేంద్రవరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నూకరాజు, అయన భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతి చెందగా, మనవడు కార్తికేయరెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. షేక్ సాధిక్ ఖాన్ నుంచి వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య వైపే నూకరాజు కుటుంబం మొగ్గు చూపింది.’ ఈ నెల 5న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురికి చెందిన నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు వీరవెంకట ఈశ్వర్, కుమార్తె నిత్యశ్రీ చించినాడ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పద్మిని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వ్యాపారంలో నష్టాలు రావడానికి తోడు అప్పులు తీర్చాలని వ్యాపారుల నుంచి ఒత్తిడి రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని శ్రీనివాస్ భావించారు. ఇలా నిత్యం వివిధ సమస్యలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక వైద్యుడిని సంప్రదించాలి సంపాదన కోసం పిల్లలకు దూరం కావడం మంచిది కాదు. పిల్లలు ఏది అడిగితే అతి కొనివ్వడమూ సమర్ధనీయం కాదు. తీవ్రంగా ఆలోచిస్తూ, వేదనకు గురవుతున్న వారిని గుర్తించి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకువెళ్లాలి. తద్వారా సమస్య గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. – డాక్టర్ అఖిలేంద్రశ్రీనివాస్ ఒగ్గు, సైకియాట్రిస్ట్, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, తూర్పుగోదావరి జిల్లా ప్రతి సమస్యకూ పరిష్కారం ఎంత సమస్యకై నా పరిష్కారం అన్వేషించాలి. ఆత్మహత్యలకు పాల్పడడం పిరికితనమే. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి ఆలోచనలు భిన్నంగా కన్పిస్తాయి. – బి.విద్య, డీఎస్పీ, ఈస్ట్ జోన్, రాజమహేంద్రవరం మార్పు గమనించాలి ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వ్యక్తి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. అటువంటి వారిపై కన్నేసి ఉంచాలి. వారి సమస్య తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు మేమున్నామంటూ భరోసా కల్పించాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, అమలాపురం. -
డిపాజిట్లు గల్లంతేనా?
● బియ్యం కమీషన్ నిధులు ఇవ్వడమేంటి? ● డీసీవో, డీఆర్లు వివరణ ఇవ్వాల్సిందే ● సూర్యారావుపాలెం పీఏసీఎస్లో చెల్లింపులను అడ్డుకున్న ఖాతాదారులు నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో డిపాజిట్దారులకు రూ.93.08 లక్షలు చెల్లించేందుకు అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. తమ డిపాజిట్లపై జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, డివిజనల్ అధికారి సంఘం సభ్యులతో సమావేశమై భరోసా ఇవ్వాలని, అప్పటి వరకు చెల్లింపులు వద్దని సభ్యులు డిమాండ్ చేస్తూ ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ ఆచంట సాయిరాం చెల్లింపు ప్రక్రియపై అధికారులకు ఇచ్చిన లేఖపై కొవ్వూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి ఎం.జగన్నాథరెడ్డి స్పందిస్తూ డీసీసీబీ తణుకు బ్రాంచ్లో సొసైటీకి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ ఖాతాల్లోని మొత్తం రూ.93.08 లక్షలు ఉపసంహరించేందుకు అనుమతి ఇస్తూ ఈ మొత్తాన్ని 180 మంది డిపాజిట్దారులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్లాబ్ల వారీగా చెల్లింపులు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు రూ.45 వేల లోపు డిపాజిట్ ఉన్న 48 మందికి పూర్తి మొత్తాన్ని, రూ.లక్షలోపు డిపాజిట్ ఉన్న 61 మందికి రూ.40 వేలు, రూ.2 లక్షల లోపు డిపాజిట్ ఉన్న 38 మందికి రూ.60 వేలు, రూ.3 లక్షల లోపు డిపాజిట్ ఉన్న 8 మందికి రూ.80 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. రూ.3 లక్షలకు పైగా డిపాజిట్ ఉన్న వారికి రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ఈ పీఏసీఎస్ కార్యాలయంలో మంచం వేసుకుని పడుకుని నిరసన చేపట్టిన 75 ఏళ్ల చిట్టూరి నరసింహమూర్తి పేరుతో రూ.5.76 లక్షలు, ఆయన భార్య పేరున రూ.9 లక్షలు ఉన్నాయి. రూ.3 లక్షల పైగా డిపాజిట్ చేసిన వారిలో వీరి పేర్లు ఉండడంతో చెరొక రూ.లక్షతో పాటు రూ.55 వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్లాబ్ ఎందుకు.. 2019లో సొసైటీలో జరిగిన అవకతవకల సందర్భంగా చెల్లించిన సొమ్ములు పోగా ఇంకా 180 మంది డిపాజిటర్లకు మొత్తం రూ.3,12,59,794 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బియ్యం విక్రయించగా వచ్చిన కమీషన్ నిధులు రూ.93.08 లక్షలు మొత్తం బకాయిలో 29.77 శాతం అవుతుంది. అంటే డిపాజిట్ చేసిన ప్రతి రూ.లక్షకు సుమారు రూ.29,770 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే శాతానికి అనుగుణంగా కాకుండా వివిధ శ్లాబ్ల ప్రకారం చెల్లింపులు చేయాలని ఆదేశించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అధిక మొత్తంలో డిపాజిట్ చేసినవారికి న్యాయం జరగదని వారంటున్నారు. డీసీఓ, డీఆర్ సమాధానం చెప్పాలి డిపాజిట్దారులకు చెల్లింపుల విధానం, సొసైటీ నిబంధనలు, డిపాజిట్ సొమ్ముల దుర్వినియోగానికి బాధ్యులపై తీసుకున్న చర్యలపై జిల్లా కోఆపరేటివ్ అధికారి, డివిజనల్ కోఆపరేటివ్ అధికారి సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి స్పష్టత ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై తీసుకున్న చర్యలు వెల్లడించే వరకు పంపిణీ నిలిపివేయాలని సొసైటీకి వచ్చిన అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎం.చంద్రశేఖర్, బెజవాడ శ్రీనివాసరావులకు సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.93 లక్షలు చెల్లింపులు సంగతి అంటుంచితే మిగిలిన రూ.2,19,51,780కు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కమీషన్తో డిపాజిట్ల చెల్లింపులా.. సొసైటీకి ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్ మొత్తాన్ని డిపాజిట్దారులకు చెల్లించడంపై సభ్యులకు అభ్యంతరం లేకపోయినా, సొసైటీ బైలా ప్రకారం ఇటువంటి చెల్లింపులు చట్టబద్ధమేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలా చెల్లించిన మాజీ చైర్పర్సన్ కోటిపల్లి గణపతిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయన నేటికీ లీగల్ సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. -
దేవస్థానం విద్యార్థులకు ‘అన్న’వరం
● మధ్యాహ్న భోజనం పునఃప్రారంభం ● కమిషనర్ ఆదేశాలతో విద్యార్థుల హర్షం అన్నవరం: అన్నవరం దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులకు బుధవారం నుంచి మధ్యాహ్న భోజనాన్ని పునఃప్రారంభించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత జూలై రెండో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించగా అన్నదానం నిధులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడంపై కొందరు దాతల ఫిర్యాదు మేరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థులు ఆందోళన చేయడం, ట్రస్ట్ బోర్డు మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తీర్మానించి ఈఓ నల్లం సూర్యచక్రధరరావు కమిషనర్కు నివేదిక పంపారు. దీంతో కమిషనర్ స్పందిస్తూ దేవస్థానం నిధుల నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో రెండు కళాశాలల్లోని 600 మంది విద్యార్థులకు అన్నదానం నుంచి భోజనాలు పంపారు. అయితే ఈ భోజనాల ఖర్చును దేవస్థానం నిధుల నుంచి అన్నదానం అకౌంట్కు రీయింబర్స్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
వివాహితను రక్షించిన ‘రక్షక్’
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాలతో ఇల్లు వదిలి వచ్చి తీవ్ర ఆందోళనతో తిరుగుతున్న వివాహితను మహిళా రక్షక్ పోలీసులు బుధవారం కాపాడారు. ఈ నెల 8న అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్న్లో ఒంటరిగా, తీవ్ర ఆందోళనతో ఉన్న ఒక మహిళను రైల్వే పోలీసులు గుర్తించి స్థానిక మహిళా రక్షక్ టీమ్కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను విచారించగా కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై విజయవాడ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. వారు ఆమెకు మనోధైర్యాన్ని కల్పించి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం ఆమె భర్తకు సమాచారం ఇచ్చి స్టేషన్కు పిలిపించి ఇరువర్గాలతో మాట్లాడి సురక్షితంగా ఇంటికి పంపారు. మహిళకు రక్షణ కల్పించిన మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు, ఇన్న్స్పెక్టర్ మంగాదేవి, మహిళా రక్షక్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. చిట్టీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష తుని: ప్రజల నుంచి చిట్టీలు కట్టించిన కేసులో ఇద్దరికి స్థానిక న్యాయమూర్తి జైలు శిక్ష విధించారని పట్టణ సీఐ ఎం.గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల మేరకు 2018లో చిట్టీ వ్యాపారం చేసిన స్థానిక గవరపేటకు చెందిన తోకల రాజు చిట్ పాటకు సంబంధించి రూ.10 లక్షలను నిర్వాహకులు కొంకిపూడి ప్రభాకర్, కొంకిపూడి అరుణ సకాలంలో చెల్లించ లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎస్సై స్వామి నాయుడు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఐపీసీ సెక్షన్ 420 కింద వారిని దోషులుగా నిర్ధారించి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.గోపాలకృష్ణ తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కెఎస్ఎస్ లక్ష్మీదేవి వాదనలు వినిపించారు. -
మాజీ ఎమ్మెల్యే బాబాజీరావుకు అస్వస్థత
రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స దేవరపల్లి: మాజీ హోం మంత్రి తానేటి వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు అస్వస్థతకు గురయ్యారు. దేవరపల్లి మండలం యర్నగూడెంలోని ఆయన స్వగృహంలో సోమవారం రాత్రి అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బాబాజీరావుకు చికిత్స అందజేస్తున్నారు. బుధవారం ఆసుపత్రిలో తానేటి వనిత, పార్టీ నాయకులు ముచ్చికర్ల రవి, కుసులూరి వెంకట సతీష్ తదితరులు ఆయనను కలసి వివరాలు తెలుసుకున్నారు. కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మలేషియా చెస్ టోర్నీలో కోనసీమ కుర్రోడు
అమలాపురం టౌన్: మలేషియా దేశంలోని సెలంగూర్లో ఈనెల 6న జరిగిన సీఎంజే స్టాండర్డ్ చెస్ రేటింగ్ టోర్నీలో పట్టణానికి చెందిన ముషిణి అజయ్ ప్రధమ స్థానం సాధించి చాంపియన్షిప్ను కై వసం చేసుకున్నాడు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐఎమ్ ర్యాంక్ సాధించిన ఏకై క చెస్ క్రీడాకారుడిగా అజయ్ నిలిచాడని జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధి తాడి వెంకట సురేష్ తెలిపారు. అజయ్ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి అభినందించారు.జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఈ నెల 23 నుంచి 27 వరకూ జమ్మూ–కాశ్మీర్లో నిర్వహించే జాతీయ స్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీల రిజిస్ట్రేషన్కు ఆహ్వానిస్తున్నట్లు ఆదిత్య అకాడమీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 14వ మినీ అండర్–12, 8వ చైల్డ్ అండర్–10 విభాగాలకు పోటీలు నిర్వహిస్తారని, రాష్ట్ర స్థాయి విజేతలతో పాటు ఒపెన్ చాంపియన్షిప్ ప్రతిభ కలిగిన వారు పాల్గొనవచ్చని, ఆసక్తి గలవారు 13వ తేదీలోగా 95535 28888 లేదా 88857 06660 నెంబరుకు సంప్రదింవచ్చని సూచించారు. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య కంబాలచెరువు: స్థానిక ధోబీఘాట్ వద్ద బుధవారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అతడిని మంగళవారపుపేటకు చెందిన అలికి రాజేష్ (27)గా గుర్తించారు. విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలపగా కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికోనేరుసెంటర్ (మచిలీపట్నం): మచిలీపట్నం–ఒంగోలు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రాజమహేంద్రవరానికి చెందిన యారపాటి రాంబాబు (40) బుధవారం అవనిగడ్డ వైపు బైక్పై వెళ్తున్నాడు. అవనిగడ్డ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు బందరు మండలం కృష్ణారావుపేటకు సమీపంలో అతడిని ఢీకొట్టింది. రాంబాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని బందరు రూరల్ దక్షిణ మండలం ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. -
పంచదారుణం
● కార్డుదారుల చక్కెర పక్కదారి ● జిల్లాలో 6.58 లక్షల రేషన్ కార్డులు ● వీటిపై 3.26 లక్షల కిలోల పంచదార సరఫరా ● ఈ నెల కేటాయింపు తక్కువని చెబుతూ టోకరా ● ఈ–పోస్ యంత్రంలో గుట్టుగా వేలిముద్రలు ● అనంతరం దళారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న డీలర్లు ● పర్యవేక్షించని పౌర సరఫరాల అధికారులుసాక్షి, రాజమహేంద్రవరం: చౌక దుకాణాల్లో చక్కెర దందా తియ్యగా సాగిపోతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో పంచదార ధర రూ.75కు చేరింది. దీంతో, ఇదే అవకాశంగా పలువురు రేషన్ డీలర్లు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు అందించాల్సిన పంచదారను దారి మళ్లించి, బయట అధిక ధరలకు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు చౌక దుకాణాల్లోనూ అధిక ధరలకు అమ్మేసి కార్డుదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడంతో డీలర్లు చక్కెరను చక్కగా చక్కబెట్టేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,018 రేషన్ షాపుల వాటి పరిధిలో 6.58 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రతి నెలా సుమారు 3.26 లక్షల కిలోల పంచదార సరఫరా చేస్తున్నారు. యంత్రం నోరు నొక్కి.. కుతంత్రం రేషన్ డిపోలో కార్డుదారులు బియ్యం, పంచదార, గోధుమ పిండి.. ఇలా ఏది తీసుకున్నా ఈ–పోస్ యంత్రంలో వేలిముద్ర వేయించుకుంటారు. ఆ తర్వాత కార్డుదారులు ఏం తీసుకుంటున్నారనే వాయిస్ మెసేజ్ ఆ యంత్రం ద్వారా వినిపిస్తుంది. కానీ, ఇలా వాయిస్ మెసేజ్ వినిపించనీయకుండా డీలర్లు సెట్టింగ్లు మార్చేస్తున్నారు. లబ్ధిదారులు బియ్యం తీసుకున్న సమయంలోనే పంచదార, గోధుమ పిండి తీసుకున్నట్లు వేలిముద్రలు వేయించేసుకుంటున్నారు. దీనివలన ఆ లబ్ధిదారులు సరకులు తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తుంది. కానీ, వాస్తవానికి కార్డుదారులకు మాత్రం ఆ సరకులు అందడం లేదు. కార్డుదారులకు అమ్మినా దోపిడీయే.. నిబంధనల ప్రకారం కార్డుదారులకు అర కిలో పంచదారను రూ.17కే విక్రయించాలి. అయితే, అవగాహన లేని వారి నుంచి చాలా మంది డీలర్లు రూ.20, అంతకు మించే వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చిల్లర లేదని చెప్పేస్తున్నారు. ఒక్కో కిలోకు రూ.3 చొప్పున టన్నుకు రూ.3 వేల వరకూ దోచేస్తున్నారు. రాజానగరం, అనపర్తి, నిడదవోలు నియోజకవర్గాల్లోని కొన్ని డిపోల్లోనైతే ఈ నెల ఆరంభంలో వెళ్లిన వారికి కూడా.. ‘పంచదార తక్కువగా వచ్చింది. వచ్చిన సరకు అయిపోయింది’ అని చెప్పి, వేలిముద్రలు తీసుకుని పంపించేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మొత్తం అన్ని రకాల కార్డుదారులకు మస్కా కొట్టి సుమారు 2 లక్షల కిలోల పంచదార పక్కదారి పట్టించి, దాదాపు రూ.కోటి పైగానే దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి వారంలోనే స్టాక్ నిల్ కొన్ని రేషన్ షాపుల పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంటోంది. మొదటి వారంలోనే స్టాక్ అయిపోయిందంటూ బోర్డు పెట్టేసి, షాపులు మూసేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలు సహా అన్ని రోజుల్లోనూ రేషన్ షాపుల ద్వారా సరకులు ఇవ్వాలి. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకూ దుకాణాలు తెరచి ఉంచాలి. కానీ, జిల్లాలోని అనేక రేషన్ షాపులను ప్రతి నెలా 5 లేదా 7వ తేదీ నాటికే మూసివేస్తున్నారు. రాజమహేంద్రవరం స్వరూప్ నగర్, లాలాచెరువు తదితర ప్రాంతాల్లో రెండు నెలలుగా స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టేసి, డీలర్లు పత్తా లేకుండా పోతున్నారు. దీంతో, ఆయా షాపులకు వెళ్తున్న కార్డుదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరో దుకాణానికి వెళ్తున్నా.. అక్కడ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. అంత్యోదయ చూపడం లేదు మరోవైపు జిల్లాలో 22,259 అంత్యోదయ అన్న యోజన కార్డులున్నాయి. ఎక్కువగా ఇవి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు కిలో చొప్పున పంచదార రూ.13.50కే ఇవ్వాలి. కానీ, వీరిలో 70 శాతం మందికి పంచదార ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా డీలర్లు నమోదు చేస్తున్నారు. ఈ లెక్కన 15 వేల కిలోలు పక్కదారి పట్టిస్తూ, దీనిని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని, సుమారు రూ.10 లక్షల మేర సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కార్డుదారులకు కేవలం 35 కిలోల బియ్యమే ఇస్తున్నారు. అయినప్పటికీ ప్రతి నెలా కిలో చొప్పున పంచదార కూడా ఇస్తున్నట్లు ఈ–పోస్ యంత్రాల్లో వేలిముద్రలు వేయించుకుంటున్నారు. కనీసం అర కిలో కూడా ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాలపై పౌర సరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే డీలర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా సక్రమంగా పర్యవేక్షించి డీలర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి, న్యాయం చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. -
నల్ల మాస్కులతో ఆందోళన
అనపర్తి: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలో భాగంగా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నల్ల మాస్కులు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రెండు నెలలుగా వివిధ రూపాల్లో వారు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకూ 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేడియోగ్రాఫర్ విజయ కుమార్, కౌన్సిలర్ చైతన్యరాజు, బయో మెడికల్ ఇంజినీర్ వినోద్, ల్యాబ్ టెక్నీషియన్ క్రాంతి, ఫార్మసిస్ట్ మీనా, నర్సింగ్ ఆఫీసర్లు అమ్మాజీ, రామలక్ష్మి, స్వాతి, నాగమణి, కీర్తి తదితరులు పాల్గొన్నారు. బాలికను కాపాడిన శక్తి టీమ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సోషల్ మీడియా మోజులో పడి ఓ యువకుడిని కలిసేందుకు వచ్చిన బాలికను శక్తి టీమ్ సభ్యులు గుర్తించి కాపాడారు. వివరాలివీ.. రాజమహేంద్రవరం కంబాల చెరువు పార్కు వద్ద మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీమ్ సభ్యులు మంగళవారం గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడితో ఉన్న బాలికను గుర్తించి, విచారించారు. ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమైన ఆ యువకుడిని కలిసేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా విజయవాడ నుంచి వచ్చానని ఆ బాలిక చెప్పింది. వెంటనే శక్తి టీమ్ సభ్యులు అప్రమత్తమయ్యారు. ఆ బాలికతో పాటు యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించి, స్థానిక మహిళా పోలీస్ స్టేషన్కు రప్పించారు. అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల విషయంలో బాలికలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి ఆన్లైన్ కార్యకలాపాలు, సోషల్ మీడియా పరిచయాలను పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు. బాలికను సకాలంలో గుర్తించి, కాపాడిన రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు, ఇన్స్పెక్టర్ మంగాదేవి, ఎస్సై షేక్ అమీనా బేగం, శక్తి టీమ్ సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించారు. కూచిపూడి నృత్యంపై వచ్చే నెలలో వర్క్షాప్ రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న కూచిపూడి నృత్యానికి యునెస్కో అపురూప సాంస్కృతిక వారసత్వ గుర్తింపు కోసం వచ్చే నెల 6, 7 తేదీల్లో డాక్యుమెంటేషన్, కూచిపూడి వారసత్వ ప్రోత్సాహంపై జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఇన్చార్జి రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తెలుగు విశ్వ విద్యాలయం, కృష్ణా జిల్లా కలెక్టరేట్, రాష్ట్ర యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖల సౌజన్యంతో కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో పాల్గొనడానికి కూచిపూడి నృత్యంలో స్నాతకోత్తర డిగ్రీ చేస్తున్న వారు, పూర్తి చేసిన వారు, పరిశోధక విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుయూనివర్సిటీఏపీ.ఇన్లో ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు పూర్తి చేసి పంపించాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై వినతిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను కలిసి విన్నవించారు. కలెక్టర్తో పాటు జేసీ అపూర్వ భరత్ను కూడా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.చంద్రశేఖర్రెడ్డి, సాధనాల రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. -
డిపాజిట్లు చెల్లించాల్సిందే..
● అప్పటి వరకూ పోరాటం ఆపేది లేదు ● వృద్ధుడి దీక్షకు డిపాజిట్దారుల మద్దతు ● రూ.4.40 కోట్ల దుర్వినియోగంపై చర్యలు శూన్యమని ఆవేదన నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం సొసైటీలో తాము చేసిన డిపాజిట్ల సొమ్ము తిరిగి చెల్లించేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని పలువురు డిపాజిట్దారులు స్పష్టం చేశారు. ఇదే డిమాండుతో 75 ఏళ్ల వృద్ధుడు చిట్టూరి నరసింహమూర్తి చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. ఆయనకు మద్దతుగా మిగిలిన డిపాజిట్దారులు కూడా దీక్షలో పాల్గొన్నారు. తమ సొమ్ము తిరిగి చెల్లించేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. నరసింహమూర్తి సోమవారం రాత్రి సొసైటీలోనే బస చేయడంతో.. కొవ్వూరులోని సొసైటీ డివిజన్ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు రాత్రి 11 గంటల సమయంలో సూర్యారావుపాలెం చేరుకుని, ఆయనతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, రాత్రి వేళ చర్చలు అవసరం లేదని, ఉదయం డిపాజిట్దారులందరూ వస్తారని, వారి సమక్షంలోనే చర్చించి, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని నరసింహమూర్తి సూచించినట్లు సమాచారం. అదే సమయంలో స్థానిక మంత్రి కందుల దుర్గేష్ ఫోనులో నరసింహమూర్తితో మాట్లాడారని డిపాజిట్దారులు తెలిపారు. సొసైటీలో ప్రస్తుతం ఉన్న సుమారు రూ.92 లక్షల నగదు నిల్వలను రెండు మూడు రోజుల్లోగా డిపాజిట్దారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. సొసైటీలో రూ.4.40 కోట్ల దుర్వినియోగమైనట్లు నిర్ధారణ జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని డిపాజిట్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిపాజిట్ సొమ్ముల కోసం ఏడేళ్లుగా పలుమార్లు ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిసారీ అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలివ్వడం, ఆ తర్వాత చెల్లింపులు జరగకపోవడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఈసారి మాత్రం డిపాజిట్ సొమ్ము పూర్తిగా చెల్లించడంతో పాటు, నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. -
కూటమి నేతలకే ఉపాధి
పెరవలి: వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ) పథకం తెలుగు తమ్ముళ్లలకు కాసులు కురిపిస్తోంది. పెరవలి మండలం ఖండవల్లి పోలేరమ్మ చెరువులో జరుగుతున్న అక్రమాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఖండవల్లిలో ఉపాధి హామీ పనులేవీ జరగకపోవడంతో.. ఈ ఏడాది పనులు చేయకపోతే వచ్చే సంవత్సరం పనులకు అనుమతులు ఉండవని కూటమి నాయకులకు అధికారులు చెప్పారు. దీంతో, స్థానిక పోలేరమ్మ చెరువు తవ్వడానికి అధికారులను కూటమి నేతలు ఒప్పించారు. ఈ మేరకు అధికారులు అంచనా వేసి, రూ.8 లక్షలు మంజూరు చేశారు. వీబీ జీ రామ్ జీ నిబంధనల ప్రకారం కూలీలతో పనులు ప్రారంభించారు. చెరువు చుట్టూ తుప్పలను నరికించి, వేతనాలుగా వారికి రూ.10 వేలు చెల్లించారు. ఇక్కడే కూటమి నేతలు కొత్త పన్నాగానికి తెర లేపారు. చెరువు చుట్టూ ఉన్న తుప్పల్లో పాములుంటాయని, అందువలన కూలీలతో కాకుండా యంత్రాలతో వాటిని తొలగించాలని, ఆ తరువాత తవ్వకాలు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అనంతరం, తుప్పలు తొలగించే పేరుతో పొక్లెయిన్తో చెరువుకు తూట్లు పొడిచారు. ఆ మట్టిని ట్రాక్టర్లతో రేయింబవళ్లు యథేచ్ఛగా తరలించారు. లే అవుట్లకు, ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి సుమారు 800 ట్రాక్టర్ల మట్టిని అమ్ముకున్నారు. ట్రాక్టర్కు రూ.800 చొప్పున మొత్తం రూ.6.40 లక్షల మేర దండుకున్నారు. అనంతరం, చెరువు తవ్వేశామని, బిల్లు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పనికి బిల్లు చేస్తే తమ పీకల మీదకు వస్తుందని భయపడుతున్న అధికారులు అటు కూటమి నాయకులకు చెప్పలేక, ఇటు కూలీలకు పనులు కల్పించలేక సతమతమవుతున్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన నేతలే ఇలా అక్రమాలకు పాల్పడటమేమిటని ఖండవల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వీబీ జీ రామ్ జీ టెక్నికల్ అసిస్టెంట్ పి.వెంకన్నబాబును వివరణ కోరగా.. కూలీలతో తుప్పలు తొలగించటానికి రూ.10 వేలు మంజూరు చేశామని, యంత్రాలతో చెరువు తవ్వకాలు చేసినట్లు తమ దృష్టికి రావడంతో బిల్లు నిలుపు చేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రంతో చెరువు తవ్వకాలు రూ.6.50 లక్షల విలువైన మట్టి కొల్లగొట్టిన అక్రమార్కులు బిల్లు చేయాలంటూ ఒత్తిళ్లు ససేమిరా అంటున్న అధికారులు -
రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యంపై నిరసన
అమలాపురం టౌన్: కోనసీమలో 25 ఏళ్ల కిందట చేపట్టిన రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని నిరసిస్తూ కోనసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో మంగళవారం ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రెండేళ్ల కిందట ఎన్నికల ప్రచారానికి కోనసీమకు వచ్చి రైల్వే ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వస్తున్న క్రమంలో కోనసీమ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి ఓ విధాన ప్రకటన చేయాలని కోనసీమ జేఏసీ కన్వీనర్ బండారు రామమోహనరావు విజ్ఙప్తి చేశారు. అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల వద్ద, అయినవిల్లిలో, ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై జేఏసీ ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు చేశారు. జేఏసీ ప్రతినిధులు కరాటం నరసింహారావు, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, గంధం శ్రీరామచంద్రమూర్తి, నూకల శ్రీనివాస్, సఖిలే వెంకటేశ్వరరావు, కరాటం ప్రవీణ్, జంగా రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సర్వర్ సమస్యలమయం
● కొత్త పింఛన్లకు సర్వర్ కష్టాలు ● అప్లోడ్లో సాంకేతిక సమస్యలు ● పలుచోట్ల జనరేట్ కాని ఓటీపీ ● విద్యుత్ మీటర్లు ఎక్కువగా ఉన్నాయంటూ షాక్ ఇస్తున్న పోర్టల్ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెర తీసింది. రెండేళ్లకు పైగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు ఇవ్వకుండా ముఖం చాటేసి సర్కారు.. ఇప్పుడు ఉన్నట్టుండి కొత్త పింఛన్లు ఇస్తామంటూ హడావుడి మొదలు పెట్టింది. దీని కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే, దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకూ మాత్రమే గడువు ఇచ్చింది. అందు లోనూ 12వ తేదీ రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండగ సందర్భంగా సెలవులు వచ్చాయి. దీంతో, ఇక ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులు ఆదరాబాదరాగా గ్రామ, వార్డు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. తీరా అక్కడకు వెళ్తే సర్వర్ సరిగ్గా పని చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలు, నిబంధనలు వారికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. స్పష్టత కరువు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప.. వీటిని ఎప్పటి నుంచి, ఎంత మందికి ఇస్తారనే అంశంపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఈవిధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవేళ స్థానిక ఎన్నికల్లోగా ఇవ్వకపోతే.. ఆ తరువాత నిజంగా కొత్త పింఛన్లు ఇస్తారా.. లేక ఈ దరఖాస్తులను బుట్టదాఖలు చేస్తారా అనే సందేహాలను కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక అనేక కారణాలను వారు చూపిస్తున్నారు. గతంలో కొత్త పింఛన్లు మంజూరు చేసే అధికారం ఎంపీడీఓలకే ఉండేది. ప్రస్తుతం వారి చేతిలో నుంచి ఆ అధికారాన్ని కూటమి ప్రభుత్వం తొలగించింది. కేవలం సిఫారసు చేయడానికి మాత్రమే ఎంపీడీఓలను పరిమితం చేసింది. అలాగే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజంగా కొత్త పింఛన్లు ఇస్తుందా అనే అనుమానాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. గుర్తింపు కార్డుల సమస్య మత్స్యకారులు, డప్పు కళాకారులు, కల్లుగీత కార్మికులు ఇలా విభిన్న వర్గాలకు చెందిన వారు కొత్త పింఛనుకు దరఖాస్తు చేయడానికి సచివాలయాలకు వస్తున్నారు. వారిని అక్కడి సిబ్బంది ఆయా శాఖల నుంచి ఇచ్చిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. గుర్తింపు కార్డు అప్లోడ్ చేయకపోతే పోర్టల్లో అభ్యంతరం వస్తోంది. సాధారణంగా ఇంటి యజమానులుగా ఉండే పురుషుల్లో కొంత మందికే గుర్తింపు కార్డులుంటాయి. మిగిలిన వారు గడువులోగా సంబంధిత శాఖల నుంచి గుర్తింపు కార్డులు తెచ్చుకోవడం కష్టమే.సర్వర్ సమస్య లేదు జిల్లాలోని సచివాలయాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎటువంటి సర్వర్ సమస్యా లేదు. అక్కడక్కడ సాంకేతిక ఇబ్బందులు వలన సర్వర్ స్లోగా పని చేసి ఉండవచ్చు. ఏ సచివాలయంలోనైనా సర్వర్ సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే సమస్యను పరిష్కరిస్తాం. – బి.నగేష్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ దరఖాస్తుదారులకు విద్యుత్ షాక్ దరఖాస్తుదారుల వివరాలు పోర్టల్లో నమోదు చేస్తున్నప్పుడు కొంత మందికి వారి పేరున రెండు మూడు విద్యుత్ మీటర్లు ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో పాటు నెలకు 300 యూనిట్లు లేదా అంతకు మించి విద్యుత్ వినియోగం దాటితే పింఛనుకు అనర్హులుగా చూపుతోంది. అప్లోడ్ చేసే సమయంలో తిరస్కరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులన్నీ సరి చేసుకుని మళ్లీ దరఖాస్తు అప్లోడ్ చేద్దామంటే సమయం లేని పరిస్థితి. కేవలం ఐదు పని దినాలే మిగిలి ఉన్నాయి. ఇంత తక్కువ రోజుల్లో విద్యుత్ మీటర్ల సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యం కాదు. అటువంటప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సచివాలయాలకు వచ్చాక మీటర్ల విషయం తెలిసి, చాలా మంది దరఖాస్తుదారులు ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.ఓటీపీ రాదు.. సర్వర్ పని చేయదు కొత్త పింఛనుకు దరఖాస్తు చేసేటప్పుడు సర్వర్లో అనేక కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. దరఖాస్తుదారుల వివరాలను తొలి దశలో అప్లోడ్ చేశాక ఓటీపీ రావాలి. కానీ, జిల్లాలోని అనేక సచివాలయాల్లో రెండు రోజులుగా పూర్తి స్థాయిలో సర్వర్లు పని చేయడం లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వారికి ఓటీపీలు రావడం లేదు. దీంతో, తదుపరి దశకు వెళ్లలేక, ఏం చేయాలో తెలీక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. సర్వర్ ఎప్పుడు పని చేస్తుందో తెలియక దరఖాస్తుదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. సర్వర్లో వస్తున్న ఇటువంటి లోపాలను సరి చేసుకుని, దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు సరిపోని పరిస్థితి. ఆలోగా పోర్టల్ బంద్ అయితే ఇక చేసేదేమీ లేనట్టే. -
మళ్లీ చివరాఖరుకే..
అన్నవరం: భక్తులకు సేవలు అందించే విషయంలో అన్నవరం దేవస్థానం ర్యాంకు మళ్లీ చివరాఖరుకు దిగజారిపోయింది. రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత ఆగస్టు 5 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ భక్తుల నుంచి ఐవీఆర్ఎస్, వాట్సాప్ యాప్ సర్వే నిర్వహించింది. ఇందులో 66.6 శాతంతో అన్నవరం దేవస్థానం చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఏకంగా 33.4 శాతం మంది భక్తులు.. అంటే దేవస్థానానికి వచ్చిన ప్రతి ముగ్గురు భక్తుల్లో ఒకరు ఇక్కడి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్లో కూడా చివరి స్థానంలోనే నిలిచింది. ఆ సందర్భంగా అప్పటి కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది అందరూ మెరుగైన సేవలందించడం ద్వారా దేవస్థానాన్ని మొదటి స్థానంలో నిలపాలని ఆదేశించారు. ఆ తరువాత కొంత మెరుగుదల సాధించి, ఒక దశలో మొదటి స్థానానికి చేరింది. ఆ తరువాత 4, 5 స్థానాలకే పరిమితమవుతూ వస్తోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత అన్నవరం దేవస్థానం మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని దేవస్థానాలపై అసంతృప్తి సర్వే నిర్వహించిన ఏడు దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై భక్తులు కాస్త అధికంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం సంతృప్తిగా జరిగిందా అనే ప్రశ్నకు గత సర్వేలో 70.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 69.8 శాతానికి తగ్గింది. తాగునీటి వసతుల్లో గత సర్వేలో సంతృప్తి శాతం 65.6 శాతం కాగా, తాజాగా 62.7 శాతానికి పడిపోయింది. ప్రసాదాలపై గతంలో సంతృప్తి శాతం 76.9 కాగా ఈసారి 75.1 శాతానికే పరిమితమైంది. పారిశుధ్యంపై గత సర్వేలో సంతృప్తి శాతం 64.4 కాగా, ఈసారి అది 61.4 శాతానికి తగ్గింది. ఫ ప్రభుత్వ సర్వేలో దిగజారిన ర్యాంకు ఫ అన్నవరం దేవస్థానం.. 66.6 శాతంతో ఆఖరి స్థానం -
వ్యాన్ దొంగ అరెస్టు
తాళ్లరేవు: కోరంగిలోని డివైన్ ఎంటర్ప్రైజెస్కు చెందిన వ్యాన్ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న మెండా వెంకటేశ్వరరావుకు చెందిన బొలేరో వాహనం అపహరణకు గురైంది. ఈ నెల 8న కోరంగి వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పెద బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్ ఆ వాహనాన్ని అపహరించినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించారు. -
ఫ నేల దున్నితే.. మాకు పండగే..
రైతన్నలు కాడి కట్టి, మేడి పట్టి, నేల దున్నే సమయంలో.. పుడమి తల్లి గర్భంలో ఉన్న రకరకాల పురుగులన్నీ బయట పడుతూంటాయి. సరిగ్గా అదే సమయంలో ఎవరో కబురు చెప్పినట్లు.. ఆ పురుగులను కడుపారా ఆరగించేందుకు ఎక్కడెక్కడో ఉన్న కొంగలు.. రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాయి. కోటనందూరు మండలం ఎల్డీ పేట వద్ద వరి నాట్లు వేసేందుకు రైతు ట్రాక్టర్తో దమ్ము చేస్తూండగా.. వందలాదిగా కొంగలు అలానే తరలి వచ్చాయి. దమ్ము చేస్తున్నంతసేపూ అక్కడే తిష్ట వేసి.. పురుగులను పట్టుకుని కడుపు నింపుకొన్నాయి. ‘ఒక జీవికి ఆకలి వేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి చంద్రబోస్ తన పాటలో చెప్పిన భావన ఇక్కడ అక్షరాలా ఆవిష్కృతమైంది. – కోటనందూరు -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నిడదవోలు రూరల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలేనికి చెందిన మరపట్ల రాజ్కుమార్, రాజమహేంద్రవరం చర్చిపేట ప్రాంతానికి చెందిన చిప్పాడ ప్రవీణ్ కుమార్లు గతంలో వేర్వేరు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలైన వీరిద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం లోహియా నగర్ వద్ద కవర్లో పెట్టి గంజాయి విక్రయిస్తూండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.080 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాజ్కుమార్పై ఇప్పటికే తాడేపల్లిగూడెం, నిడదవోలుతో పాటు పలు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదయ్యాయి. ప్రవీణ్ కుమార్పై గంజాయి విక్రయాలకు సంబంధించిన కేసులున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రూఫ్ దాటితే.. సేఫ్ కాదు
రాయవరం: ఆధునిక, లగ్జరీ కార్లకు సన్రూఫ్ ఉండాలని పిల్లల నుంచి పెద్దల వరకూ కోరుకుంటున్నారు. కారులో వెళ్తున్నప్పుడు సరదాగా సన్రూఫ్ తెరచి.. గాల్లో తేలినట్టు ఆనందంగా ప్రయాణించడాన్ని పలువురు ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందువలన సన్రూఫ్ తెరచి ప్రయాణించే వారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు, రవాణా అధికారులు సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండే ప్రమాదమే.. u సన్రూఫ్లలో ప్రయాణం కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది. u ఇరుకు, రద్దీ రోడ్లలో ఓవర్ లోడుతో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లు ఏర్పాటు చేస్తూంటారు. ఇలాంటి రహదారుల్లో సన్రూఫ్లో నిలబడి ప్రయాణించకూడదు. అలాగే, విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, ఇతరత్రా సన్నని తీగలు, చెట్ల కొమ్మలు రోడ్లపై వేలాడుతూంటాయి. ఇటువంటి వాటిని డ్రైవర్లు సాధారణంగా ఒక్కోసారి గమనించలేరు. దీంతో, సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. u అలాగే, నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులు ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు దొరకదు. దీంతో, సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. u వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే, ఏకంగా కారులో నుంచి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. u ఇతర వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి నేరుగా శ్వాస వ్యవస్థలోకి చేరి రోగాలకు కారణమవుతాయి. స్కూటర్ డిక్కీలో డబ్బులు మాయం ఫ కారు సన్రూఫ్లతో జాగ్రత్త ఫ అప్రమత్తత లోపిస్తే ప్రాణాలకే ప్రమాదం ఫ వేలాడే వైర్లు, ఓవర్హెడ్ బారికేడ్లతో ముప్పు జాగ్రత్తలు తీసుకోవాలి వేగంగా ప్రయాణించే సందర్భంలో సడన్ బ్రేక్ వేస్తే సన్రూఫ్ నుంచి కిందకు పడే అవకాశం ఉంటుంది. సన్రూఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. –బి.విద్య, ఈస్ట్జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం ప్రమాదకరం సన్రూఫ్ తెరచుకుని చిన్నారులతో ప్రయాణించడం శ్రేయస్క రం కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. సెల్ఫీ లు, ఫొటోలు కారు పూర్తిగా ఆగిన తర్వాత తీసుకుంటేనే మంచిది. –ఆర్.సురేష్, తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారిసన్రూఫ్ ఎందుకంటే.. ఫ సహజమైన గాలి ప్రసరణ (వెంటిలేషన్) కోసం సన్రూఫ్ ఏర్పాటు చేస్తారు. ఫ అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. ఫ వేసవిలో ఎండలో నిలిపి ఉంచినప్పుడు కారు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. అటువంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ తెరిస్తే కారులోని వేడి గాలి బయటకు వెళ్లి, కారు క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. -
అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ విజేతకు సత్కారం
కొత్తపేట: అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ చాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఉండ్రాజపు విలియం కేరీని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కేరీ గత నెల 24 నుంచి 27వ తేదీ వరకూ భూటాన్లో జరిగిన అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో భారత్ జట్టు భూటాన్పై విజయం సాధించింది. భారత్ జట్టులో ప్రతిభ చూపి, విజేతగా నిలిచిన విలియం కేరీని రావులపాలెం సీఆర్సీలో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జగ్గిరెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు ఘనంగా సత్కరించారు. అతడి తల్లిదండ్రులు రాజామణి, సుందర విజయంలను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
జీవితాలకు దర్పణాలు.. కన్నీటి సంతకం కథలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ కవి, రచయిత, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ రచించిన కన్నీటి సంతకం కథల పుస్తకాన్ని వేదిక అంతర్జాతీయ ప్రతినిధి, పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ జేమ్స్వాట్ కొమ్ము ఆవిష్కరించారు. నగరంలోని సోన్స్ సాఫ్ట్వేర్ కార్యాలయంలో కళావేదిక జాతీయ కో ఆర్డినేటర్ కేతా శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు భద్రం మాట్లాడు తూ, ప్రతాప్ కుమార్ రాసిన కథలు ఎందరివో జీవితాలకు దర్పణాలని అన్నారు. ఈ కథలు చ దువుతూంటే మనసు ద్రవిస్తుందని, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలను, బాధలను, మానవీయ సంబంధాలను ఈ కథలు కళ్ల ముందు నిలబెడతాయని అన్నారు. జేమ్స్ వాట్ మాట్లాడుతూ, కన్నీటి సంతకం కథలు నేటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయన్నారు. కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు, మనిషిలోని ఆర్ధ్రత, సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ కథల్లో సజీవంగా కనిపిస్తాయని అన్నారు. -
అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించండి
సీటీఆర్ఐ: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. మొత్తం 171 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 83 అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో ఇప్పటివరకు స్వీకరించిన అర్జీల పరిష్కార పురోగతి, పెండింగ్ అర్జీలు, అసంతృప్తి ఫిర్యాదులు తదితర అంశాలను క్షణ్ణంగా పరీశీలించాలన్నారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, సహాయ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, డీఆర్ఓ ఎస్.భాస్కర్రెడ్డి, ఆర్డీఓలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 18 అర్జీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను విని ఆయా స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ అర్జీల్లో సివిల్, చీటింగ్, కొట్లాట కేసులు, కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. -
అక్షరాలా తడబాటు!
● అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో నిర్లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో ఇంకా వెనుకబాటే ● నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం రాజమహేంద్రవరం: అభివృద్ధితో పాటు అక్షరాస్యతలోనూ జిల్లా వెనకబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాల అమలులో లోపాలు.. పల్లెల్లో అవగాహనా రాహిత్యంతో అక్షర సుమాలను వెదజల్లలేకపోతోంది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు కానీ మహిళలే వెనుకబడిపోతున్నారు. నేటికీ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రజల్లో పలువురు వేలిముద్రలు వేసే స్థాయిలోనే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జిల్లా వంద శాతం అక్షరాస్యత సాధించడంలో పూర్తిగా తడబడుతోంది. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనాభా 51.54 లక్షలు ఉండగా, వారిలో 25.69 లక్షల మంది పురుషులు, 25.84 లక్షల మంది మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పురుషుల అక్షరాస్యత 74.51 శాతం, మహిళల అక్షరాస్యతా 67.52 శాతంగా ఉంది. ప్రస్తుత జనాభా 54.50 లక్షలు ఉండవచ్చనేది అంచనా. గతంతో పోలిస్తే అక్షరాస్యతలో కొంత పెరుగుదల కనిపిస్తున్నా, జిల్లాలో వంద శాతం సాధించడంలో వెనుకబడిపోతున్నాం. ప్రధానంగా పేదరికం, వలసలే కారణం. ప్రజల వెనుకబాటు తనానికి చాలా సందర్భాల్లో నిరక్షరాస్యతే కారణమవుతోంది. సంపూర్ణ అక్షరాస్యత కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా, చర్యలు నేటికీ తడబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం.. అత్యంత అవశ్యం తరం.. మనిషి ఆలోచనా విధానం మారింది. సమాజం సాంకేతికంగా దూసుకుపోతోంది. మనిషి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్నారి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. గతంలో దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు తమ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసుకుని మరీ పంపిస్తున్నారు. అయితే కొంతమందికి చదువు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి, చిన్నారులను బడికి పంపించిన తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. వయోజనులు సైతం కొద్దిపాటి అక్షర జ్ఞానంతో కొన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనే ధోరణిని వదిలి సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఉపాధి క్షేత్ర సహాయకులు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, యువత, సేవా సంస్థలు దీనిపై దృష్టి సారించి, సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి. ఉల్లాస్ పేరుతో ముందుకు.. గతంలో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు సాక్షరతా మిషన్ ద్వారా చర్యలు చేపట్టారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పేరుతో నవ భారత సాక్షరత కార్యక్రమాన్ని 2024లో ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి 2029లోగా వీరిని అక్షరాస్యులుగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, డ్వామా, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సంస్థల ద్వారా నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా చేసే కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ రెండేళ్లలో జిల్లాల వారీగా నిరక్షరాస్యులు, వారిలో అక్షరాస్యులుగా మారిన వారు, ఇంకా మిగిలిన వారు.. జిల్లా నిరక్షరాస్యులు అక్షరాస్యులు మిగిలిన వారు కాకినాడ 3,52,025 1,09,081 2,42,944 కోనసీమ 1,34,176 59,625 74,551 తూర్పుగోదావరి 2,56,000 88647 1,67,353 పోలవరం 86,811 38,392 48419 -
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
పిఠాపురం రూరల్: రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పిఠాపురానికి చెందిన 10 మంది క్రీడాకారులు పథకాలు సాధించారని కోచ్లు పి.కృష్ణ, లక్ష్మణరావు తెలిపారు. జె.ఐశ్వర్య, బి.జైదీప్ స్వర్ణ పథకాలు సాధించగా, జె.అరుణ్. పి.లోకేష్ రజిత పథకాలు, కె.హరిణి, లాస్య, యశస్విన్, తరుణ్, అమీదా, అలీ కాంస్య పథకాలు సాధించారన్నారు. వీరంతా జూనియర్ విభాగంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పాల్గొంటారన్నారు. సీనియర్ విభాగంలో ఎంపికై న వారు వచ్చే నెల 4 వతేదీ నుండి 7 తేదీ వరకు భీమవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ సీనియర్స్ విభాగంలో పాల్గొంటారని వారు తెలిపారు. -
ఫిజియోథెరపీ.. ఆరోగ్యానికి హ్యాపీ
● దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం ● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం రాయవరం: వైద్య రంగంలో నేడు ఫిజియోథెరపీ కీలకంగా మారింది. దీనిద్వారా అనేక నొప్పులు, వ్యాధులకు ఉపశమనం కలిగిస్తున్నారు. గుండె సర్జరీ, కీళ్ల మార్పిడి సర్జరీ, సిజేరియన్ వంటివి చేసిన తర్వాత మజిల్స్ సాధారణ స్థితికి రావడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఉంటున్నారంటే వారి ప్రాధాన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఫిజియోథెరపీ ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ప్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని ఉద్యోగం చేసే సందర్భంలో వారి శరీరాకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వారికి మందుల వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ బాధ లేకుండా ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరం. గర్భిణులు తెలిసీ తెలియకుండా వాడే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే చిన్నారులు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలనే దానిపై ఫిజియోథెరపిస్ట్లను సంప్రదించడం ఉత్తమం. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ప్రతి మండలంలో భవిత కేంద్రం ఉంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రం ద్వారా అవసరమైన ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. ప్రతి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున జిల్లాలో 21 మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు 10 వేల మంది ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరగడంతో ఈ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ కూడా పెరుగుతున్నాయి. -
మోటార్ సైకిళ్ల చోరీ నిందితుడి అరెస్ట్
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలోని పార్కింగ్ ఏరియాలో మోటార్ సైకిళ్లు దొంగిలిస్తున్న నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై ఎస్.రాము తన సిబ్బందితో లొల్ల కొత్త వంతెన వద్ద సోమవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామ అడ్డపుంతకు చెందిన అంబటి సత్యనారాయణ (49) రావులపాలెం వైపు నుంచి వేగంగా వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని ఎస్సై రాము తమ సిబ్బందితో పట్టుకుని విచారించి, అతని నుంచి 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి, కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
వెన్నుపోటు పాలన త్వరలోనే అంతం
సాక్షి, రాజమహేంద్రవరం/ అనపర్తి/ పెదపూడి/ రంగంపేట: చంద్రబాబు వెన్నుపోటు పాలన త్వరలోనే అంతమవుతుందని, రానున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని సంక్షేమ రాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా రీజినల్ ఇన్చార్జి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఎవరూ వెనకడుగు వేయొద్దని, చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలే మన అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయని చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. ఇంట్లో పింఛను అందుకుంటున్న వృద్ధుడు చనిపోతేనే అతని భార్యకు వితంతు పింఛన్ ఇస్తున్నారే తప్ప మిగిలిన వితంతువులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలతో చంద్రబాబు కుమ్మక్కవడం వల్లే ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారని బొత్స విమర్శించారు. మరోవైపు రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదన్నారు. చంద్రబాబు అరాచక పాలన వల్ల చాలా మంది బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇది చాలా సిగ్గుచేటని విచారం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి ప్రజల తరఫున పోరాడుదామని పిలుపునిచ్చారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని లెక్క చేయకుండా నిలబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అనపర్తిలో అరాచక రాజ్యం నడుస్తోందని, అయినప్పటికీ ఎవరూ భయపడొద్దన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూల ఓటుగా మార్చుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్పిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన గెలుపుతో నల్లమిల్లి వెన్నులో వణుకుపుట్టాలి రాజమహేంద్రవరం సిటీ ఇన్చార్జి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం, విజయంతో స్థానిక ఎమ్మెల్యే వెన్నులో వణుకుపుట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి సీఎం అవుతారని, ప్రతీ కార్యకర్త ఆర్థికంగా ఎదిగేలా తామంతా బాధ్యత తీసుకుంటామని భరోసానిచ్చారు. ఓట్ల చోరీ కోసమే పింఛన్ల నాటకం మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా యువకులు, మహిళలు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత నుంచి బయటకు వచ్చేందుకు పింఛన్ల నాటకానికి తెరలేపారన్నారు. నేనున్నా... అధైర్యపడొద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకు దూసుకుపోవాలన్నారు. అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా తానుంటానని భరోసానిచ్చారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి, ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకుడు గుబ్బల తులసీరామ్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లభశెట్టి రామసతీష్, అనపర్తి టౌన్ పార్టీ అధ్యక్షుడు నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ సాంబత్తుల చంటి, మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, విధ్వంసాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ పోస్టర్ ఆవిష్కరించారు. ఫ స్థానిక ఎన్నికల్లో నిలిచి గెలుద్దాం ఫ రానున్నది జగనన్న పాలనే ఫ కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అండ ఫ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ -
ఎంతో కీలకంగా..
కొన్ని రకాల సర్జరీల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకుంటే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువ రోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్తో పాటు రోగి సాధారణ స్థితికి త్వరగా రావడానికి ఫిజియోథెరపీ చాలా అవసరం. –కె.వెంకటరామన్, ఫిజియోథెరపిస్ట్, రాజమహేంద్రవరం మొండి నొప్పులకు ఉపశమనం మా వద్దకు తీవ్రమైన నొప్పులతో వస్తుంటారు. అలాంటి వారికి సమస్యను గుర్తించి అవసరమైన థెరపీల ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాం. సమస్యను బట్టీ ఒక్కొక్కరికి నెల నుంచి రెండు నెలల కూడా సమయం పడుతుంది. నడుము, మోకాలు, మెడ, భుజం నొప్పులతో ఎక్కువ మంది వస్తున్నారు. వారిని సాధారణ స్థితికి తీసుకు వచ్చిన తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తాం. –కె.వెంకటేష్, ఫిజియోథెరపిస్టు, కాకినాడ ● -
తాడోపేడో తేల్చుకుంటా..!
నిడదవోలు: తాడోపేడో తేల్చుకుంటాం.. తన డబ్బులు ఇచ్చే వరకూ కదిలేది లేదంటూ ఓ వృద్ధుడు సొసైటీ కార్యాలయంలో మంచం వేసుకుని పడుకుని వినూత్న నిరసనకు దిగాడు. సూర్యారావుపాలెం సొసైటీలో డిపాజిట్ చేసిన తన డబ్బులు తిరిగి చెల్లించే వరకూ కార్యాలయం నుంచి కదిలేది లేదంటూ 75 ఏళ్ల వృద్ధుడు చిట్టూరి నరసింహమూర్తి అన్నారు. సోమవారం సొసైటీ కార్యాలయానికి మంచం తీసుకొచ్చి, నిద్రించి అధికారుల తీరును ఎండగట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం సొసైటీలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయి. దీనివల్ల సుమారు 180 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2005– 2019 మధ్య కాలంలో అధిక వడ్డీ ఇస్తామంటూ రైతుల నుంచి రూ.కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు బాధితులు చెబుతున్నారు. సొసైటీలో జరిగిన అవకతవకలపై 2019లో అధికారులు విచారణ చేపట్టగా, సుమారు రూ.4.40 కోట్ల సొసైటీ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. డిపాజిట్దారులకు డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితులు సోమవారం సొసైటీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. పీజీఆర్ఎస్లో నలుగురి ఫిర్యాదు తమ డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతూ లంకా ఈశ్వరి, లంకా రాధాకృష్ణ, చిట్టూరి నరసింహామూర్తి, చిట్టూరి లక్ష్మీదేవి అనే నలుగురు డిపాజిట్దారులు 2026 జూన్లో కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సహకార శాఖ కొవ్వూరు డివిజన్ అధికారులు బాధితులకు డబ్బులు చెల్లించాలని సొసైటీ చైర్పర్సన్కు లేఖ రాసినట్లు తెలిసింది. అధికారుల మల్లగుల్లాలు సూర్యారావుపాలెం సొసైటీలో 180 మంది రైతులకు చెందిన 408 డిపాజిట్ ఖాతాలకు సంబంధించి రూ.3,12,59,794 బకాయిలు ఉన్నట్లు సొసైటీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సొసైటీలో సుమారు రూ.76 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన నలుగురికి కలిపి సుమారు రూ.24 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే అందుబాటులో ఉన్న మొత్తం నగదును నలుగురికి చెల్లిస్తే మిగిలిన 176 మంది డిపాజిట్దారులకు ఏ విధంగా చెల్లింపులు చేయాలనే అంశంపై సొసైటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.19 లక్షలు డిపాజిట్ చేశా.. చిట్టూరి నరసింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి వృద్ధాప్యంతో వ్యవసాయం చేసుకోలేక తమకున్న కొంత భూమిని విక్రయించి 2018లో సుమారు రూ.19 లక్షలను సొసైటీలో డిపాజిట్ చేశారు. ప్రతి నెలా వచ్చే వడ్డీతో కాలం గడపవచ్చని భావించారు. అయితే సొసైటీలో జరిగిన కుంభకోణంతో వడ్డీ సంగతి అటుంచి.. అసలుకే మోసం రావడంతో ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నా సమస్య పరిష్కారం కాలేదని నరసింహమూర్తి తెలిపారు. తన డబ్బులు తిరిగి ఇచ్చే వరకు సొసైటీ కార్యాలయం నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఇంటి నుంచి మంచం తెచ్చుకొని కార్యాలయం లోపల వేసుకుని నిద్రించారు. ఫ నా డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదు ఫ సొసైటీ కార్యాలయంలో మంచం వేసుకొని వృద్ధుడి నిరసన ఫ మద్దతు ప్రకటించిన బాధితులు -
దివ్యాంగులను ఏడిపింఛెన్!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): శారీరక స్థైర్యం ఉండి చిన్న కష్టాలకే కుంగిపోయే సమాజంలో.. ప్రతి క్షణం నరకయాతన అనుభవిస్తూ, జీవన పోరాటం సాగిస్తున్న దివ్యాంగుల బాధలు వర్ణనాతీతం. అలాంటి వారికీ ప్రభుత్వం సాయం దూరం అవుతోంది. దివ్యాంగులకు రూ.15 వేల పింఛను సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు అమలులో మాత్రం అనేక కొర్రెలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రూ.6 వేలు మాత్రమే అందించి చేతులెత్తేశారు. దివ్యాంగుల నుంచి ఒత్తిడి రావడంతో జీఓ 43 ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని, పరిశీలన తరువాత రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో నిజమని నమ్మి ఆన్లైన్ ద్వారా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆన్లైన్ చేసుకున్న వారు తిరిగి సదరమ్ సర్టిఫికెట్ చేయించుకోవాలని, రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని లింకు పెట్టారు. దాంతో దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. గతంలో 80 శాతం నుంచి 90 శాతం ఉన్నవారికి 50 శాతానికి 60 శాతానికి తగ్గించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనితో రూ.15 వేల పింఛన్కు అర్హులు కావడం లేదు. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకుంటున్నా.. అధికారులు సానుకూలంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 36,425 మంది దివ్యాంగులు ఉండగా, వారికి రూ.6 వేల చొప్పున పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఇందులో 1,096 మందికి రూ.15 వేల పింఛను ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. లేచి నిలబడలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు తమ సహాయకుల మద్దతుతో వీల్ చైర్లపై సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. రూ.15 వేల పింఛను కోసం నెలల తరబడి అర్జీలు ఇస్తున్నా.. పరిశీలనలో ఉందని, త్వరలో పరిష్కరిస్తామని అధికారులు దాటవేసే సమాధానాలు చెబుతున్నారని వారు ఆరోపించారు. వారి మనోగతం ఇలా.. ఫ సొమ్ము పెంపునకు సవాలక్ష కొర్రీలు ఫ రూ.15 వేల పింఛను కోసం పాట్లు ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఆన్లైన్లో సైట్ లేదు రూ.15 వేలు పింఛన్ ఇవ్వడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోమన్నారు. రెండేళ్ల నుంచి మూడు సార్లు నమోదు చేసుకున్నాను. సదరమ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. 90 శాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్లో సైట్ కనిపించడం లేదు. – పిడుగు పద్మ, రాజమహేంద్రవరం ఇబ్బందులు పెట్టడం సరికాదు వికలాంగత్వం 90 శాతం ఉన్నా, 100 శాతం ఉన్నా పెద్ద తేడా ఉండదు. కాని 100 శాతం ఉన్నవారికి మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంత వరకు సబబు. మాకు ఇస్తామని చెప్పి ఆన్లైన్లో కూడా నమోదు చేయించి, సదరం రీ వెరిఫికేషన్ కూడా చేయించి ఇప్పడు ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. – జుత్తుక దేవి, కపిలేశ్వరపురం సదరం కోసం కష్టాలు నాకు 90 శాతం అంగవైకల్యం ఉంది. రూ.15 వేల పింఛన్ కోసం తిరిగి సదరం సర్టిఫికెట్ చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మూడు తిప్పించుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్లాలంటే రెండు అంతస్తులు మెట్టు ఎక్కాలి. నడవలేని పరిస్థితిలో ఉన్న నేను రెండు మూడు సార్లు మెట్లపై నుంచి పాక్కుంటూ వెళ్లాను. తీరా చేయించుకున్నాక పింఛను ఇవ్వడం లేదు. – మజ్జి. సతీష్, కడియంన్యాయం చేయాలి దివ్యాంగులకు 35 కిలోల బియ్యం ఇస్తారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో కొంత మందికి మాత్రమే ఆ బియ్యం ఇస్తున్నారు. చాలా మందికి ఇవ్వడం లేదు. అందరికీ వర్తింపజేసి న్యాయం చేయాలి. – మంజేటీ సుధ, రాజమహేంద్రవరం: -
లేఖ రాసి.. బైక్పై ఉంచి
దిండి వంతెనపై యువకుడి గల్లంతు మలికిపురం: అమ్మా, నాన్న క్షమించండి.. సారీ హరి.. నాకు ఈ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించడం లేదంటూ ఓ యువకుడు తన బైక్పై లేఖ రాసి పెట్టి గల్లంతైన ఘటన దిండి వంతెనపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్కుమార్ (22) దిండి – చించినాడ వంతెనపై తన మోటార్సైకిల్ ఉంచి కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం మలికిపురంలోని షాపులో పని చేసేందుకు వెళ్లిన అతను, ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిండిలో వంతెన వద్ద తన బైక్, దానిపై ఓ లేఖను పోలీసులు, బంధువులు గుర్తించారు. అసలు కారణం తెలియలేదు. ఆ యువకుడు నదిలో దూకాడా, ఎక్కడికై నా వెళ్లిపోయాడా అనేది తేలాల్సి ఉంది. తరుణ్కుమార్ సొంత ఊరు నర్సాపురం. సఖినేటిపల్లిలంకలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. -
డ్రైన్లో పడి వ్యక్తి గల్లంతు
మలికిపురం: మేజర్ డ్రైన్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గొల్లపాలేనికి చెందిన ఉండ్రాసి దుర్గాప్రసాద్ (38) కొబ్బరి దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలో వినాయక చవితి పందిరి పనులు చూసి, అనంతరం దింపు పనులకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గొల్లపాలెం వంతెన నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఒడ్డున బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఈ మేరకు అతని తండ్రి ఉండ్రాసి సత్యనారాయణ తెలిపారు. దుర్గాప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
రాజానగరం: దివాన్చెరువు నుంచి శ్రీరామపురం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో ఉన్న ఓ లేఅవుట్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతుని వివరాల కోసం అన్వేషించారు. 50 ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఉన్న అతను చేతికి స్టీల్ కడియం, చేతిపై ‘లవ్’ సింబల్, మరో చేతిపై ‘హాయ్’ అనే హిందీ అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయి. ఎవరైనా గుర్తిస్తే వెంటనే 94407 96587, 93477 41118 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. అట్రాసిటీ కేసు నమోదు కంబాలచెరువు: ఓ మహిళపై సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన కడా శ్రీదేవి, ప్రసన్నకుమారిల మధ్య డబ్బులకు సంబంధించి లావాదేవీల్లో తగాదా వచ్చింది. దీంతో శ్రీదేవి, ఆమె బంధువులు కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో కేసు వాయిదాకి వెళ్లి వస్తుండగా, కోర్టు బయట శ్రీదేవిని ప్రసన్నకుమారి కులం పేరుతో దూషించింది. ఈ మేరకు ఆమె మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సకాలంలో ఆదుకోవాలి
అదనంగా పంట పొగాకు అమ్మకోవడానికి కోటా విడుదల చేయాలి. రీజియన్ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఇచ్చిన కోటాలు పూర్తి కావడంతో అదనపు పంట అమ్ముకోవడానికి దారిలేదు. ఎక్కడ పొగాకు అక్కడే ఉంది. రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. సకాలంలో అమ్ముకోకపోతే నష్టపోతాం. కిలో రూ. 350 ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది. –వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, గోపాలపురం ఉత్తర్వులు రావాలి అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాలి. అదనపు పొగాకు విక్రయాలకు విధివిధానాలు ఖరారు కావాలి. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 4 మిలియన్ల పొగాకు అదనంగా ఉత్పత్తి జరిగింది. కిలో గరిష్ఠ ధర రూ.325 పలుకుతుంది. వచ్చే ఏడాదికి పరిమితికి లోబడి పంట సాగు చేయాలి. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. –పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి ● -
అత్తపై కత్తితో అల్లుడు దాడి
కోరుకొండ: భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో ఓ అల్లుడు అత్తపై కత్తితో దాడి చేశాడు. కోరుకొండ ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం.. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామానికి చెందిన పోటి కృష్ణకు కాపవరానికి చెందిన హేమశ్రీతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి అత్తారింటికి రావడం లేదు. దీనికి అత్త ఐతిరెడ్డి వరలక్ష్మి కారణమని భావించిన కృష్ణ, ముందుగా తెచ్చుకున్న కత్తితో కాపవరంలోని అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అత్త వరలక్ష్మిపై కత్తితో ఎడమ చెంపపై దాడి చేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలానికి కోరుకొండ సీఐ ఎస్వీవీ మూర్తి, ఎస్సై ఆర్.శివాజీ చేరుకుని పరిశీలించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
అదనపు కోటా కోసం ఎదురుచూపులు
● 35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి ● అనుమతికి మించి సాగుదేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలంలో అనుమతించిన ఉత్పత్తి కంటే అదనంగా పండించిన పొగాకు అమ్మకాల కోటా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బోర్డు ఇచ్చిన కోటా మేరకు విక్రయాలు పూర్తి కావడంతో అదనంగా పండిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బ్యారన్కు 35 క్వింటాళ్ల చొప్పున పంట పండించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు బ్యారన్ల రిజిస్ట్రేషన్ చేశారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 50.87 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ఇచ్చిన కోటా ప్రకారం రైతులు బ్యారన్కు 35 క్వింటాళ్ల చొప్పున అమ్మకాలు పూర్తి చేశారు. బ్యారన్కు 15 నుంచి 20 క్వింటాళ్ల అదనపు పంట రైతుల వద్ద ఉండిపోయింది. ఈ పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు. రీజియన్ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోలు అదనపు పొగాకు ఉంది. ఒడిదొడుకుల్లో మార్కెట్ పొగాకు పండించి దాదాపు ఎనిమిది నెలలు కావడంతో రంగుమారి, నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ఒడుదొడుకుల్లో కొనసాగుతుండడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటను అమ్ముకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అమ్మకాలు నత్తనడకన జరుతుండడంతో ఎక్కువ రోజులు పొగాకు రైతుల ఇళ్ల వద్ద నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో బ్రైట్ గ్రేడు ధర ఆశాజనకంగా ఉండడంతో అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తే, కొంత వరకు కోలుకొనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. 23.44 మిలియన్ల కిలోల విక్రయం రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 581.45 కోట్ల విలువ గల 23.44 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ. 325, కనిష్ఠ ధర రూ.150, సగటు ధర రూ. 248.71 లభించింది. బ్రైట్ గ్రేడు పొగాకు ధర కొంత వరకు ఆశాజనకంగా ఉన్నప్పటికి ఎక్స్ గ్రేడు, మీడియం గ్రేడు పొగాకు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎక్స్ గ్రేడు గత ఏడాది కిలో రూ. 260 ధర పలకగా, ప్రస్తుతం రూ. 150 నుంచి 160 ఉంది. లోగ్రేడు పొగాకు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. 10 నుంచి 15 శాతం లోగ్రేడ్, 30 శాతం ఎక్స్ గ్రేడు, 20 శాతం మీడియం. 35 శాతం బ్రైట్ గ్రేడు పొగాకు పండినట్టు రైతులు అంచనా వేస్తున్నారు. -
‘వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే’
అనపర్తి(తూ.గో.జిల్లా): వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఏపీలో ఏ రంగం చూసినా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఏపీలో ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు సిగ్గుపడాలని అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేష్ తానే ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారని, అధికారం పోయిన తర్వాత లోకేష్కు తన పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలబద్రపురంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ సంకేతాలు ఇస్తోంది. ఎన్నికలు జరిగినా జరగకపోయినా, పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. ఏ ఒక్క స్థాయిలోను అధికార పార్టీ ఏకగ్రీవం కాకూడదని విషయాన్నిస్పష్టం చెశారు. రానున్నది వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రభుత్వం. అధికారం పోయిన తర్వాత లోకేష్ తన పరిస్థితి ఏమిటో గుర్తిస్తాడు. తానే ముఖ్యమంత్రినన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధమా అన్న వైఎస్ జగన్ సవాలుకు మీ వద్ద నుంచి స్పందన లేదు. డిఎస్సీ పై సిబిఐ ఎంక్వయిరీ జరిగే వరకు ఊరుకునేది లేదు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నాయకులంతా భరోసా కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలి’ అని పేర్కొన్నారు.మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టాం. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీలో అన్ని స్థాయిలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ అందించాలి. అందరికీ పార్టీ సముచితమైన గౌరవం ఇస్తుంది పార్టీ అధినేత మాటగా చెబుతున్నాను. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అందించలేకపోయింది. రెండున్నరేళ్ళ తర్వాత కొత్త పెన్షన్లు గుర్తుకొచ్చాయా. వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేకపోయారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రభుత్వం కుమ్మక్కై ఆక్వారైతుల పొట్టకొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి... గెలవాలి.. ఇదే మన లక్ష్యం.’ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘‘కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం అంతా లోకేశే.. రాజీనామా చేయాల్సిందే’’ -
సమస్యలను గాలికొదిలేసిన కూటమి సర్కారు
దేవరపల్లి: ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలోని పార్టీ మండల కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ జరిగిందోనని వెతుక్కోవాల్సి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కరవైందన్నారు. ఒంటరిగా మహిళలు, యువతులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత, డీఎస్సీలో ఇబ్బంది పడిన వారంతా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్, వసంత్ నగర్ కాలనీ వాసులు తమ సొంత సొమ్ముతో సుమారు ఏడేళ్ల క్రితం నిర్మించిన ముఖద్వారానికి ఉన్న పార్టీ రంగులు మార్చి తెలుపు రంగులు వేయించి అధికారులను ఉపయోగించి అలజడి సృష్టించింది మీరు కాదా? అని ఎమ్మెల్యే వెంకట్రాజును ఆమె ప్రశ్నించారు. రంగులు మార్చగలిగారు కాని, ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ అభిమానాన్ని మార్చలేరనేది అర్ధం చేసుకోవాలన్నారు. పొగాకు రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని సందర్శించినట్టు ఆమె తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్కు సంఘీభావం తెలిపారన్నారు. ఈ నెల 5న నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమలకు ఎమ్మెల్యే వెంకట్రాజు నిర్వహించిన సంకల్ప పాదయాత్రలో డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఉపాధి కూలీలను కూడా బలవంతంగా తీసుకువచ్చారని ఆమె విమర్శించారు. అలాంటి మీరు తమ నేతను విమర్శించేందుకు సరిపోరని అన్నారు. వైఎస్ జగన్ ప్రజల అభిమాన నాయకుడని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కొనలేక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దేనికని ఆమె అన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని నెగ్గనీయమని ఎమ్మెల్యే వెంకట్రాజు చెబుతున్నారని, దీనిని బట్టి ఈవీఎం టాంపరింగ్ ద్వారా గెలుపొందారని పరోక్షంగా అంగీకరించినట్టేనని ఆమె అన్నారు. ధైర్యం ఉంటే కూటమిగా కాకుండా సింగిల్గా వచ్చి పోటీ చేయాలని ఆమె సవాల్ చేశారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.మాజీ హోం మంత్రి వనిత విమర్శ -
కార్తిక మాసంలోగా ఆధునీకరిస్తాం
దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ప్రసాదం తయారీ విభాగాన్ని మరింత విస్తరించనున్నాం. భక్తులకు మరింత రుచిగా ప్రసాదాన్ని అందించేందుకు, రద్దీ రోజుల్లో డిమాండ్కు తగ్గట్టు ప్రసాదం తయారు చేయాలని నిర్ణయించాం. ఈ మేరకు దేవదాయ శాఖ జీఫ్ ఇంజినీర్తో కలిసి చర్చించాం. అందుకు అవసరమైన వ్యయాన్ని భరించేందుకు ప్రసాద భవన నిర్మాణ దాత మట్టే సత్యప్రసాద్ అంగీకారం తెలిపారు. – నల్లం సూర్యచక్రధరరావు, దేవస్థానం ఈఓ విస్తరించేందుకు సిద్ధం ప్రసాదం తయారీ విభాగాన్ని దేవదాయ శాఖ సీఈ శేఖర్, ఈఓ చక్రధరరావులతో కలిసి పరిశీలించాం. ప్రసాదం తయారీలో ఎదురవుతున్న ఇబ్బందులపై, ప్యాకర్లు సమస్యలపై చర్చించాం. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రసాదం భవనాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. – మట్టే సత్యప్రసాద్, ప్రసాద భవన నిర్మాణ దాత, ట్రస్ట్బోర్డు సలహాదారు -
ఆలమూరులో రెండు చోట్ల చోరీలు
ఆలమూరు: గ్రామంలో ఒకే రోజు రెండు చోట్ల జరిగిన చోరీల్లో సుమారు రూ.14 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. ఆలమూరులోని మెరక వీధికి చెందిన చిలకమర్తి వెంకట శంకర్ సాయిసుధాకర్ కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్కు వెళ్లారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండుగులు ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలు తెరిచి అందులోని కిలో వెండి, పది కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అలాగే అదేరోజు స్థానిక వాటర్ ట్యాంక్ పక్క వీధిలో నివసిస్తున్న తటవర్తి గోపాలకృష్ణ నివాసంలో కూడా చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.30 వేల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలను తస్కరించారు. అమలాపురం నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్ వచ్చి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు, సంఘటన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలు ఆధారంగా కొన్ని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిరంగంపేట: పెదదొడ్డిగుంట గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై రంగంపేట ఎస్సై శివప్రసాద్ కథనం ప్రకారం.. పెదదొడ్డిగుంట గ్రామానికి చెందిన కర్రి సుబ్బారావు పప్పులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న ఉదయం సుమారు 4.30 గంటలకు పప్పులు విక్రయించేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 6 గంటల సమయంలో అతని తోడల్లుడు తోట సూర్యబాబు ఫోన్ చేసి, సుబ్బారావు భార్య కర్రి సీత (56) ఇంట్లో నేలపై పడి ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో సుబ్బారావు వెంటనే ఇంటికి చేరుకుని భార్యను పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించాడు. అనంతరం ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించి పరీక్షించగా అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సీత మెడలో ఉండాల్సిన బంగారు మంగళసూత్రం తాడు, నల్లపూసల తాడు కనిపించకపోవడంతో పాటు ఆమె శరీరంపై అక్కడక్కడా గాయాలు ఉన్నట్లు సుబ్బారావు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జ్యోతికి జాతీయ ఉత్తమ పురస్కారం
మామిడికుదురు: మామిడికుదురు గ్రామానికి చెందిన బళ్ల జ్యోతి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందుకున్నారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గోదావరి ఉత్సవ్–2026’ జాతీయ ప్రతిభా పురస్కారోత్సవంలో భాగంగా జ్యోతికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం ఆమె గోడితిప్ప ఎంపీయూపీ స్కూల్లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. అమరావతి స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ ఎస్.అబ్రహం చేతుల మీదుగా జ్యోతి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. డాక్టర్ అద్దంకి రాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వసాయి శ్రీశ్రీ కళాపీఠం చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తదితరులు పాల్గొని జ్యోతిని సత్కరించారు. ఆమెను ఎంఈఓలు కె.కిరణ్కుమార్, ఎస్.ఏడుకొండలు, హెచ్ఎం సూర్యచంద్రరావు, ఉపాధ్యాయులు అభినందించారు. పిడుగుపాటుకు ధ్వజస్తంభం ధ్వంసం రంగంపేట: చండ్రేడు గ్రామంలో కాత్యాయిని సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో ఆలయ ధ్వజస్తంభం ధ్వంసమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభంపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ధ్వజస్తంభం ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. గేదె మృతి.. గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): పిడుగు పడి ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తిలో చోటుచేసుకుంది. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు, పలుచోట్ల పిడుగులు పడ్డాయి. చెందుర్తికి చెందిన దేవర ఆదినారాయణ పాడి గేదైపె ఆదివారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ గేదె విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని, అధికారులు ఆదుకోవాలని బాధిత రైతు ఆదినారాయణ కోరారు. చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం చేబ్రోలు రైస్మిల్లు సమీపంలో వర్షం, ఈదురు గాలులకు భారీ చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు చెట్టును ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు కొత్తపల్లి: పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన పెంకే నూకరాజు (45), ఆయన కుమారుడు మణికంఠస్వామి పొలంలోకి వెళ్లారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్న వారి సమీపంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. నాగులాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మణికంఠ 10వ తరగతి చదువుతున్నాడు. అతన్ని కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వివాహిత అదృశ్యంకరప: పాతర్లగడ్డకు చెందిన వివాహిత అదృశ్యమైంది. 5న దుకాణానికి వెళ్లి సామాన్లు తీసుకుని వచ్చేసరికి తన కుమార్తె లేదని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు!
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిజంగా తాము యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు పాల్పడి ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ఆదివారం స్థానిక ప్రకాశ్నగర్లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అంటూ తప్పుడు కూతలు కూస్తున్న వారు ఆరోపణలకే పరిమితమవుతున్నారన్నారు. నిజంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచులు మా పార్టీలో ఉన్నారంటూ మాట్లాడుతున్న చెంచా బ్యాచ్లకు చేతనైతే ఒకటైన రుజువు చేయండని సవాల్ విసిరారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాం. మాకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ కదా అని నా తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. జక్కంపూడి సోదరులపై, కుటుంబంపైన తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులకు వడ్డీలు, చక్రవడ్డీలు కలిపి సమాధానం చెబుతామని గుర్తుంచుకోవాలన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారంతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేసులకు జక్కంపూడి కుటుంబం భయపడేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసే అరాచకాలను, తప్పులను వేలెత్తి చూపితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని నిరాహార దీక్షలు చేస్తే ఆత్మహత్య కేసు నమోదైతే దాన్ని కూడా వక్రీకరించి ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బర్ల బాబూరావు గురించి అందరికీ తెలుసునని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు గొందేసి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా -
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ విజేతకు సత్కారం
అమలాపురం టౌన్: స్థానిక కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే జిమ్లో శిక్షణ పొందిన తాడి ఆర్య రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఎమ్మెల్సీ, కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కుడుపూడి సూర్యనారాయణరావు ఆ జిమ్ వద్ద విజేత ఆర్యను సత్కరించారు. ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్య అండర్–17 విభాగం 60 కిలోల వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో రెండో స్థానంతో పాటు వెండి పతకాన్ని సాధించాడు. జిల్లా నుంచి ఏకై క వెయిట్ లిఫ్టర్గా విజయం సాధించిన ఆర్యను ఎమ్మెల్సీ అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ చీకురుమిల్లి కిరణ్కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ముంగర ప్రసాద్, న్యాయవాది మట్టపర్తి అచ్యుత్, జిమ్ ప్రతినిధులు దొంగ చంద్రశేఖర్, కె.చలిత్ కృష్ణ గుప్తా, అక్షయ్, లోకేష్ పాల్గొన్నారు. -
మహా ప్రసాదం స్వామీ..
● మరింత రుచిగా సత్యదేవుని ప్రసాదం ● తయారీ భవనాన్ని విస్తరించేందుకు ప్రణాళిక ● వ్యయాన్ని భరించేందుకు ముందుకు వచ్చిన దాత అన్నవరం: అన్నవరం ప్రసాదం.. ఈ పేరు వినగానే ఇష్టపడని వారుండరు. స్వామివారి చెంతకు రాలేకపోయిన వారు సైతం ఈ గోధుమ నూక ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తారు. దీని నుంచి ఏటా రూ.25 కోట్ల ఆదాయం దేవస్థానానికి సమకూరుతోంది. అటువంటి ప్రసాదాన్ని మరింత రుచిగా, ఎక్కువ మొత్తంలో తయారు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, ప్రసాద తయారీ భవనం నిర్మించిన దాత, దేవస్థానం ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారు మట్టే సత్యప్రసాద్, మరో సలహాదారు ఎంఎస్ రెడ్డి, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు ఆదివారం ప్రసాద తయారీ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని 2022లో రూ.ఐదు కోట్లతో దాత మట్టే సత్యప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. దాంతో పాటు గోధుమ నూక తయారీ యంత్రం, ప్రసాదం తయారీకి అవసరమైన అన్ని పరికరాలను ఆయన అందజేశారు. పెద్ద మొత్తంలో ప్రసాద తయారీ, ప్యాకింగ్లకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు దాత దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైనంత మేరకు ప్రసాదం విభాగాన్ని విస్తరించేందుకు ఆయన సంసిద్ధత తెలిపారు. ఇవీ ఇబ్బందులు ప్రసాద తయారీ భవనం రెండు అంతస్తుల్లో ఉంటుంది. దిగువన యంత్రాలు, మొదటి అంతస్తులో ప్రసాదం తయారీ, ప్యాకింగ్ ఉంటుంది. ప్రసాదం తయారీ పొయ్యిలు 15 ఒకవైపు, దాని తరువాత సుమారు 50 మంది ప్రసాదం ప్యాకర్లు ప్రసాదం పొట్లాలు కడతారు. ఇక్కడ సరైన వెంటిలేషన్ లేక పొయ్యి వేడి ప్రసాదం ప్యాకర్లకు తగులుతోంది. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోజూ లక్ష ప్రసాదం ప్యాకెట్లు వరకు తయారు చేసే వెసులుబాటు ఉంది. ఇంతకు మించి ప్రసాదం తయారు చేయాలన్నా, ప్యాకింగ్ చేయాలన్నా ఇబ్బంది ఎదురవుతోంది. పొయ్యిలు ఎక్కువ ఏర్పాటు చేయాలంటే స్థలం సరిపోవడం లేదు. ఏడాదిలో సగం రోజులు లక్ష కన్నా ఎక్కువ ప్రసాదం ప్యాకెట్లు తయారు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలనే ఉద్దేశంతో రద్దీ రోజుల్లో ప్రసాదం బాగా ఉడకకుండా దింపేయడం వల్ల రుచిపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. భవనం విస్తరణ ఇలా... కాగా, ప్రస్తుతం ఉన్న ప్రసాద తయారీ భవనాన్ని మరింత విస్తరించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పైఅంతస్తులో అఽధునాతన రేకుల షెడ్డు వేసి అందులోకి ప్రసాదం ప్యాకింగ్ మార్చాలని నిర్ణయించారు. ఆ షెడ్డుకు సీలింగ్ చేసి అవసరమైతే ప్రసాదం ప్యాకర్లు ఇబ్బంది పడకుండా ఏసీలు కూడా అమర్చనున్నారు. ప్రస్తుతం ప్రసాదం తయారు చేస్తున్న హాలులో అదనంగా మరికొన్ని ప్రసాదం తయారీ పొయ్యిలు ఏర్పాటు చేయనున్నారు. తయారైన ప్రసాదాన్ని ట్రాలీల్లోకి మార్చి రెండో అంతస్తులో ఏర్పాటు చేయనున్న ప్రసాదం ప్యాకింగ్ షెడ్డులోకి తరలించేందుకు ఒకటి లేదా రెండు పెద్ద లిఫ్ట్లను పెడతారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడి మృతి
రామచంద్రపురం రూరల్: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, కాజులూరు మండలం గొల్లపాలెం శివారు మొగలిపాలేనికి చెందిన కర్రి బసివి రెడ్డి (52) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బసివి రెడ్డి ఆదివారం ఉదయం 5 గంటలకు తన కుమారుడితో కలసి వ్యాపారం నిమిత్తం తుని బయలుదేరారు. హైవేపై వెళుతుండగా పిఠాపురంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం మొగలిపాలెం తీసుకు వచ్చారు. బసివి రెడ్డి పార్ధివదేహానికి మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా, జిల్లా యువజన కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారన్నారు. ఆయన మృతితో మొగలిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని జెడ్పీటీసీ వనుం వెంకట సుబ్బారావు, నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ పితాని సుబ్రహ్మణ్యం, పోతురాజు బాబూరావు, తాడి వీర వెంకటరెడ్డి తదితరులు సందర్శించారు. -
దందానతాన
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● గ్రావెల్కు పచ్చరెక్కలు ● తుపాకులగూడెం నుంచి తరలిస్తున్న ముఠా ● రూ.కోట్లు వెనకేసుకుంటున్న వైనం ● ఫిర్యాదు చేసినా అధికారుల చర్యలు శూన్యంసాక్షి, రాజమహేంద్రవరం: కొండలను తవ్వేసి కొల్లగొట్టేస్తున్నారు. జిల్లాలోని తాళ్లపూడి మండలం తుపాకులగూడెం రెవెన్యూ పరిధి గోపవరం రోడ్డులోని కొండను అధికార అండతో ముఠాగా ఏర్పడి తవ్వేస్తున్నారు. యంత్రాలు, ట్రాక్టర్లు, లారీలతో కొండ వద్దకు చేరుకుని గ్రావెల్ తవ్వేసి దర్జాగా తరలించుకుపోతున్నారు. ఇక్కడ లభించేది నాణ్యమైన గ్రావెల్ కావడంతో మార్కెట్లో ఒక్కో లారీకి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ లభిస్తోంది. రోజుకు 200 లారీల గ్రావెల్ తరలించుకుపోతున్నారని.. ఈ లెక్కన ఒక్క రోజులోనే ఖర్చులు పోనూ రూ.20 లక్షలకు పైనే వెనకేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాళ్లపూడి మండలం పోచవరం, రాగోలపల్లి, తూపాకులగూడెం గ్రామాల రెవెన్యూ పరిధిలో గోపాలపురం వైపు గోపవరం వెళ్లే దారిలోని కొండలనూ తవ్వేస్తున్నారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లోని అధికార పార్టీ నాయకులు సిండికేట్గా ఏర్పడి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందలాది టిప్పర్లలో గ్రావెల్ తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పర్యావరణానికి తప్పని హాని గజ్జరం శివారులోని తుపాకులగూడెం కొండపై ఇప్పటికే ఉన్న జామాయిల్ మొక్కలను తొలగిస్తున్నారు. సహజంగా పెరిగిన భారీ వృక్షాలను సైతం తొలగించి పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. ముందుగా కొంతమంది మనుషులను పెట్టుకుని వారి సాయంతో మొక్కలు తొలగించి గ్రావెల్ తవ్వకానికి, తరలింపునకు అనుకూలంగా ఆ ప్రదేశాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తర్వాత అక్కడి గ్రావెల్ తవ్వి తరలిస్తున్నారు. తర్వాత మరికొంత స్థలాన్ని తవ్వకానికి వీలుగా మొక్కలు తొలగించి సిద్ధం చేస్తున్నారు. రోడ్డు పక్కనే కొండ ఉండడంతో జనం కంట పడకుండా ఉండేందుకు సంబంధిత మనుషులు జామాయిల్ తోటలో ఉంటున్నారు. తవ్వకాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ బృందం వెళ్లేసరికి తమకేమీ సంబంధం లేదన్నట్లు వారు ఆ తోటలోకి జారుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా... తాళ్లపూడి మండలంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై స్థానికులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పీజేఆర్ఎస్లోనూ వినతిపత్రాలు ఇచ్చారు. తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలిసి ఈ ఏడాది జూన్ 12న కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మైనింగ్ ఏడీ ఫణిభూషణ్రెడ్డి, ఇతర అధికారులు గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న కొండలను పరిశీలించి వెళ్లిపోయారు. అంతేతప్ప ఎవరు తవ్వకాలు జరుపుతున్నారో నిర్ధారించి చర్యలు తీసుకోలేదు. తాళ్లపూడి తహసీల్దార్కు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగిపోతోంది. అధికార పార్టీ అండతో మాఫియా చెలరేగిపోతోంది. రాత్రీ పగలు అనే తేడా లేకుండా కొండలను తవ్వేస్తున్నా, అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. బహిరంగంగా తవ్వకాలు జరుగుతున్నా, పట్టించుకునే వారే కరవవడం జనానికి విసుగు పుట్టిస్తోంది. జిల్లాలోని తాళ్లపూడి మండలంలో ఈ తంతు జరుగుతోంది.లేఅవుట్లకు తరలిస్తూ.. కొవ్వూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్న విషయం తెలిసిందే. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూముల్లో రాళ్లు వేసి ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. అలాంటి లేఅవుట్లను ఎత్తు చేసుకునేందుకు ఈ గ్రావెల్నే ఉపయోగిస్తున్నారు. కొవ్వూరుతో పాటు గోపాలపురంలోని కొన్ని ప్రాంతాలకు ఈ గ్రావెల్ తరలిపోతోంది. అక్కడి లేఅవుట్లతో పాటు ఖాళీ స్థలాలు, ఇళ్ల స్థలాలను ఎత్తు చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. సంబంధిత వ్యక్తుల నుంచి తవ్వకందారులు భారీగా నగదు వసూలు చేస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. -
అడిగిన వారికి బెదిరింపులు
తాళ్లపూడి మండల పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడెం గ్రామాల రెవెన్యూ పరిధిలోని కొండలను అనుమతులు లేకుండా కొంతమంది మాఫియాగా ఏర్పడి తవ్వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించేలా వృక్షాలను తొలగించి మరీ గ్రావెల్ తరలిస్తున్నారు. చింతలపూడి కాలువ మట్టిని కూడా అక్రమంగా తీసుకుపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. – ఇండుగుల రామకృష్ణ, తాళ్లపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ● -
పోరాటం.. తెచ్చింది పరిహారం
● కోర్టు ధిక్కారణ కేసుతో దిగివచ్చిన ప్రభుత్వం ● ‘పురుషోత్తపట్నం’ రైతులకు న్యాయం ● క్రెడిట్ తమదంటున్న ‘కూటమి’ నేతలుసీతానగరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయి, పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు న్యాయం జరుగుతోంది. దీని వెనుక రైతుల సుదీర్ఘ పోరాటం ఉంది. భూములు కోల్పోయిన బాధితులు స్వయంగా హైకోర్టును ఆశ్రయించి, న్యాయ పోరాటం చేసి తీర్పు సాధిస్తే.. ప్రస్తుతం దానిని తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించడం విచారకరం. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తూ పురుషోత్తపట్నం, చినకొండేపూడి రైతులకు ఎకరాకు రూ.28 లక్షలు, నాగంపల్లి రైతులకు ఎకరాకు రూ.24 లక్షల చొప్పున ఇస్తామంటూ జీఓ 88 జారీ చేశారు. పరిహారం అందుకోవడానికి కొంతమంది రైతులు తిరస్కరించడంతో ప్రభుత్వ అవార్డును పాస్ చేసి పురుషోత్తపట్నం రైతులకు ఎకరాకు రూ.17.76 లక్షలు, చినకొండపూడి రైతులకు ఎకరానికి రూ17.70 లక్షలు, నాగంపల్లి రైతులకు ఎకరాకు రూ.15.23 లక్షల పరిహారం అందిస్తామంటూ ప్రకటించారు. దీనితో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలంటూ 28 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అదే విధంగా సుమారు 75 మంది రైతులు కోర్టును ఆశ్రయించకుండా జిల్లా కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. మరోపక్క ఈ విధంగా రైతులు పోరాటం కొనసాగించారు. చంద్రబాబు 2023 ఎన్నికల ప్రచారంలో పురుషోత్తపట్నం వచ్చినప్పుడు వడ్డీతో పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చి, దానిని ఇప్పటికీ అమలు చేయలేకపోయారు. 2025 అక్టోబర్ 31న 2013 భూసేకరణ చట్టప్రకారం పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుమారు మూడు నెలల పాటు వేచి ఉన్న రైతులు ఎంతకీ పరిహారం రాకపోవడంతో కంటెంట్ ఆఫ్ కోర్ట్ నంబర్ 106/2026 తీర్పును అమలు చేయాలని హైకోర్టులో కేసు వేయగా విచారణకు వచ్చింది. రూ.32.10 కోట్లు ఇస్తూ అనుమతులు హైకోర్టులో అధికారులు ఎదుర్కొంటున్న కేసు విచారణతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిమిత్తం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, చట్టబద్ధమైన వడ్డీ చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 32,10,20,150 మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీఓ నంబర్ 496 విడుదల చేశారు. రైతుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలితంగా సెప్టెంబర్ 1న కోర్టు వాయిదా నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా జీఓ జారీ చేిసింది. కోర్టు ధిక్కార చర్యలకు భయపడి ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ప్రజాప్రతినిధుల ఉత్తుత్తి ప్రకటనలు రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, పరిహారం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఇప్పుడు పరిహారం మంజూరు కాగానే ‘మా కృషి ఫలితమే‘, ‘మేమే నిధులు రప్పించాం‘ అంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమే. ఇది ముమ్మాటికీ రైతుల ఐక్యతకు, వారు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటానికి, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు దక్కిన విజయం. పలు అనుమానాలు అధికారులు అందించిన నోటీసులతో రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ నోటీసు ఇస్తున్నామని పేర్కొన్నారు. అయితే నోటీసుల్లో ఎటువంటి పరిహారం ఇస్తున్నట్లు పేర్కొనలేదు. ఏడు నెలల వడ్డీ తరువాత అందిస్తామని అధికారులు నోటిమాటగా చెబుతున్నారని, లిఖిత పూర్వకంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ బాధిత రైతులు వేసిన కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనితో అధికారుల్లో కదలిక వచ్చింది. -
విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్షిప్లు
మద్దిలపాలెం (విశాఖ): విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షిప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదువుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్వీ బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్యను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు. -
వార్డుల పునర్విభజన అశాసీ్త్రయం
మాజీ ఎంపీ బోస్ రామచంద్రపురం రూరల్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీని 28 వార్డుల నుంచి 32 వార్డులుగా పెంచిన విషయం విదితమే. ఈ మేరకు రామచంద్రపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ల ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో వార్డుల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందని బోస్ పేర్కొన్నారు. వార్డుల స్వరూప స్వభావాలు చూపించలేదని, సరిహద్దుల్లో స్పష్టత లేదని తెలిపారు. ప్రతి వార్డులోనూ సర్వే నంబర్ల ఆధారంగా వార్డులను గుర్తించడం వల్ల ఏ వార్డు ఏ ప్రాంతానికి వెళ్లిందనేది ఆయోమయంగా ఉందన్నారు. వార్డుల విభజన జరిగే సమయంలో అటు పార్టీల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డుల్లోని ప్రజలకు కనీస సమాచారం లేకుండా విభజన చేయడం సరైన పద్ధితి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ వైస్ చైర్మన్ చింతపల్లి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్, బొక్కా సత్యనారాయణ, బాసిన నాగమణి, గాదె సీతా రామలక్ష్మి, పార్టీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయిలక్ష్మి పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
రాజమహేంద్రవరం రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా సోమవారం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వేణు పిలుపునిచ్చారు.ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్ధరణ నిడదవోలు: స్థానిక రైల్వే జంక్షన్లో విశాఖ పట్నం– ముంబయి లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ) ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను ఆదివారం అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు రైల్వే స్టేషన్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జెండా ఊపి రైలు రాకపోకలను ప్రారంభించారు. స్టేషన్ మేనేజర్ పి.శ్రీరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణరాజమహేంద్రవరం రూరల్: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని కోసం దరఖాస్తు స్వీకరణకు సోమవారం నుంచి 16 వరకు అవకాశం ఉందని, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి.నగేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీడీఓలు స్వయంగా పింఛన్ మంజూరు చేయరని, అర్హులను మాత్రమే సిఫారసు చేస్తారని అన్నారు. సాధారణ అర్హత పరిశీలన ఈనెల 17 నుంచి 21 వరకు కొనసాగుతుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ అనుమతి ప్రక్రియ ఈ నెల 25 నుంచి 26 వరకు చేపట్టనున్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతిచాగల్లు: కొవ్వూరు మండలం ఐ.పంగిడి శివారులో క్వారీ లారీ మోటార్ సైకిల్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. చాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఇడుపుగంటి సుబ్బారావు (54) కొవ్వూరు మండలం దేచర్లలో శ్రీసాయి ట్రేడర్స్లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇంటికి భోజనానికి వచ్చి తిరిగి వెళుతుండగా, పంగిడి శివారులో క్వారీ లారీ అతివేగంగా వచ్చి సుబ్బారావు మోటార్ సైకిల్ను ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య శ్వేత ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై జె.ధర్మరాజు తెలిపారు. భక్తులతో కిటకిటలాడిన గణపతి ఆలయం అయినవిల్లి: అయినవిల్లిలోని విఘ్నేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లఘున్యాస, ఏకాదశ పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమాలు, అన్నప్రాశనలు, తులాభారాలు, నూతన వాహన పూజలను భక్తులు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 2680 మంది స్వీకరించారు. స్వామికి ఆదివారం ఒక్కరోజు రూ.3,29,751 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ఆర్టీసీ బస్సుపై రాళ్లతో వ్యక్తి దాడి
కొత్తపేట: అమలాపురం – విజయవాడ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. ప్రయాణికుల వివరాల ప్రకారం.. అమలాపురం ఆర్టీసీ డిపోనకు చెందిన అమలాపురం – విజయవాడ బైపాస్ సర్వీస్ సెమీ లగ్జరీ బస్సు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తపేట బోడిపాలెం వంతెన సమీపంలో బాబా గుడి దాటాక ఓ వ్యక్తి బస్సు ముందు నుంచి రాళ్లతో దాడి చేశాడు. దీంతో షాక్కు గురైన డ్రైవర్ షడన్ బ్రేక్ వేసి స్టీరింగ్పై సొమ్మసిల్లి పడిపోయాడు. అద్దం పగిలి చేతికి స్వల్ప గాయమైంది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే 108కు ఫోన్ చేసి డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పి.గన్నవరానికి చెందిన డ్రైవర్ కూనపరెడ్డి ఆదినారాయణమూర్తి కోలుకోగా, ప్రయాణికుల నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి కొత్తపేట మండలం ఖండ్రిగ పరిసర ప్రాంతం నుంచి నుంచి బైక్పై పాలో అయ్యి వచ్చి బస్సుపై దాడికి పాల్పడినట్టు పలువురు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అమలాపురం డిపో అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమాకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ బస్సులో ప్రయాణికులను విజయవాడ వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
కొత్త జెడ్పీకి పచ్చ జెండా
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరంలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇటీవలే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన పోలవరానికీ ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం అదనంగా 15 మంది జెడ్పీ సీఈవోలు, మరో 15 మంది డిప్యూటీ సీఈవోల పోస్టుల ఏర్పాటుకూ ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్కు 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరగడంతో కాకినాడ కేంద్రంగానే ఇప్పటి వరకూ ఉమ్మడి జెడ్పీ కార్యకలాపాలు సాగాయి. అయితే ఈ నెల 24తో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాతే కొత్త జిల్లా పరిషత్లు అమలులోకి రానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే ఉమ్మడి జిల్లా పరిషత్ను నాలుగు జిల్లా పరిషత్లుగా విభజించే ప్రక్రియ ముగించాల్సి ఉండడంతో తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మూడు మండలాలనూ ఏం చేస్తారో...? రాష్ట్రంలోని 660 మండలాలను ఆయా జిల్లా పరిషత్లలో మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలోని కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో వాటిని అలానే కొనసాగిస్తారా లేక నియోజకవర్గాల ప్రాతిపదికగా తూర్పు గోదావరి జిల్లాతో మ్యాపింగ్ చేసి కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారా అనేది తేలాల్సి వుంది. ● ద్వారకా తిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. ● పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది. ● గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే కొనసాగుతోంది. మొత్తంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో 22 మండలాలున్నాయి. అయితే ద్వారకా తిరుమల, పెదపూడిని మన జిల్లాలోనే కలుపుకొని గోకవరం మండలాన్ని కాకినాడలో కలపనున్నారా అనే ది తేలాల్సి వుంది. ఆస్తుల విభజన.. ఉద్యోగుల సర్దుబాటు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్ కార్యాలయం కోసం అనుకూలమైన భవనం కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో పరిశీలించారు. మరోవైపు ప్రస్తుతం కలెక్టరేట్ నిర్వహిస్తున్న భవనం సమీపంలోని స్థలంలో సొంత భవన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జెడ్పీ ఏర్పాటులో కీలకమైన ఉద్యోగుల సర్దుబాటుకు కూడా అవసరమైన చర్యలు ప్రారంభించారు. జెడ్పీ సీఈవో, ఉప సీఈవోతో పాటు కార్యాలయంలోని విభాగాలకు సిబ్బందిని కేటాయించనున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ నుంచి ఏవోలు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, అటెండర్లను రాజమహేంద్రవరానికి కేటాయించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగుల నుంచి జిల్లాల వారీగా ఆప్షన్లు తీసుకుని సర్వీస్ వివరాలను అమరావతిలోని కమిషనరేట్కు పంపించారు. జెడ్పీకి సంబంధించిన ఆర్థిక వనరులు, ఆస్తుల విభజన కూడా జరగాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా పరిషత్కు నాలుగు జిల్లాల్లోనూ కొన్ని స్థిరాస్థులు ఉన్నాయి. వాటిని జనాభా ప్రాతిపదికన కేటాయించే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరానికీ సొంత జిల్లా పరిషత్ 2021లో ఉమ్మడి జెడ్పీ పోరు తరువాత నాలుగు జిల్లాల విభజన స్థానిక ఎన్నికల దిశగా మరో కీలక అడుగు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు చంద్రబాబు, లోకేష్, పవన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వర్షాభావం, ఎరువుల ధరల మంటతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. సూపర్ సిక్స్ పేరిట దగా చేశారు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని నమ్మించి వారికీ దగా చేశారు. ప్రస్తుతం ప్రజలంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పునాది పడుతుంది. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థులదే గెలుపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులదే గెలుపు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల వారినీ మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా... కూటమి అభ్యర్థులకు ఎప్పుడు ఓటుతో బుద్ధి చెబుదామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ను దూరం చేసుకున్నామని ప్రజలంతా బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయం. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాజానగరం ఇన్చార్జి జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తమ బతుకులు మారుతాయని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ సొంతం చేసుకోవడం ఖాయం. – సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి -
ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుంటారా?
● ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ బాబుపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం ● నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం ● ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు ● ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ ● వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగుతున్న ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి కోళ్ల అచ్యుత రామారావు (బాబు)ను వెంటనే తప్పించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా చిట్స్, వడ్డీ వ్యాపారాలు చేసే వారు ఆర్యాపురం, ఇన్నీసుపేట, జాంపేట బ్యాంకుల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, ఆయా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శ్యామలా సెంటర్లో ఉన్న ఇన్నీసుపేట కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద భరత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ధర్నా చేశారు. 2025లో పార్లమెంట్ చట్టం ప్రకారం కో ఆపరేటివ్ రంగంలో పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న చైర్మన్, డైరెక్టర్లు పదవులకు అనర్హులని, రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి 13 నెలలు కావస్తున్నా ఇంతవరకు వారిని పదవుల నుంచి తప్పించకపోవడం దారుణమన్నారు. దీనిపై సహకార శాఖ అధికారులను బాధ్యులుగా చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చైర్మన్ కోళ్ల బాబుతో పాటు జామి వెంకట రమణమూర్తి, ఆదిరెడ్డి శ్రీనివాసరావు, కటారి శ్రీనివాస కన్నా, పంచకట్ల శివను వెంటనే తొలగించకపోతే తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బాబు గత 27 ఏళ్లుగా అక్కడ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఇన్నీసుపేట, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్లు స్వయంగా ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బంధువులని, వారంతా చిట్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్పై ‘51 ఎంకై ్వరీ’ నడుస్తోందని, తాజాగా ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ బాబు అక్రమాలు, అరాచకాలపై కూడా సమగ్ర విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కుటుంబ ఆస్తులను పంచుకున్నట్టు బ్యాంకుల ఆస్తులను పంచుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ అక్రమాలను తాము సహించబోమని, వీటిపై ఉద్యమించి అవినీతికి అడ్డుకట్ట వేస్తామన్నారు. అనంతరం బ్యాంక్ సీఈఓకు వినతి పత్రం అందచేసి రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల కాపీలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్నీసుపేట బ్యాంక్ డైరెక్టర్లు గుత్తుల భాస్కర్, అందనాపల్లి సత్యనారాయణ, డిపాజిటర్ యజ్జరపు మరిడయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్నా, నల్లా రామాంజనేయులు, తిరగటి దుర్గ, కృష్ణవేణి, సేపేని మునీశ్వరరావు, యజ్జవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని చెప్పారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని వివరించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని ఆరు వేల మంది భక్తులు స్వీకరించారని చెప్పారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. వాడపల్లి వాసా.. శ్రీ వేంకటేశా! స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణలతో మాడవీధులు మార్మోగాయి. భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భావించారు. స్వామివారిని 80 వేల మందికి పైగా భక్తులు శనివారం దర్శించారని ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భక్తులు వేద ఆశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి వాడపల్లికి విచ్చేసి గౌతమీ గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. క్యూలైన్లో నిలబడి స్వామిని దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. -
ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలోని 99 మందికి ఉపాధ్యాయులకు స్థానిక వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఉత్తమ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించిన రాజమహేంద్రవరం గడ్డపై ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తమ జీవితాలకు మార్గనిర్దేశం చేసిన గురువులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభాధ్యక్షుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జేసీ వై.మేఘా స్వరూప్, సహాయ కలెక్టర్ ఆదిత్య శర్మ, క్రైమ్ డీఎస్పీ సుభాష్, డీఈఓ కె.వాసుదేవరావు, పేరెంట్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు చౌదరి, సమగ్ర శిక్ష పీడీ ఎస్.సుభాషిణి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణకుమారికి రాష్ట్రస్థాయి పురస్కారం నిడదవోలు రూరల్: విజయవాడలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో మండలం డి.ముప్పవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయిని నిచ్చెనకోళ్ల కృష్ణకుమారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో విశేష సేవలు అందించి, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కృష్ణకుమారికి ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు. -
జీవనదిపై అంతులేని దాష్టీకం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సామాన్యుడు కుళా యి పన్ను కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని.. ఇంటి పన్ను కట్టకపోతే ముక్కు పిండి మరీ వసూలు చేస్తా రు. పైగా ఆలస్యంగా కట్టినందుకు జరిమానా విధిస్తా రు. అటువంటిది ఏకంగా పదేళ్ల పాటు రూ.21 కోట్లు పన్ను ఎగవేస్తున్నా ఎవరూ కిమ్మనట్లేదంటే అక్కడ ఆమ్యామ్యాల వ్యవహారం ఏదో ఉందని అర్ధం చేసుకోవచ్చు. అధికారులను, ప్రజాప్రతినిధులను శాసిస్తూ ఏడాదికి రూ.200 కోట్లు టర్నోవర్ సాధిస్తున్న పేపర్మిల్లు యాజమాన్యం చేస్తున్న అరాచకమిది. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం జీవనాడి, కోట్లాది మందికి తాగునీరందించే పవిత్ర గోదావరి నది ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో కాసారంగా మారుతోంది. ఇందుకు ప్రధాన కారణం నగర నడిబొడ్డున ఉన్న ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ (పేపర్ మిల్లు). దాని నుంచి వెలువడుతున్న ద్రవ, వాయు వ్యర్థాలు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తంలో రోజుకు దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఒక్క పేపర్ మిల్లు నుంచే రావడం గమనార్హం. వీటి వల్ల కాతేరు, సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా విషపూరితంగా మారుతున్నాయి. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం... ● పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యార్థాలను శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలోకి వదలడంతో అటు పర్యావరణం, ఇటు పరీవాహక ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ● వ్యర్థాల్లోని లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం వంటి భార లోహాలు నీటిలో కలవడం వల్ల క్యాన్సర్, కాలేయం, మూత్ర పిండాల (కిడ్నీ) వ్యాధులు వస్తాయి. ● మిల్లు వెదజల్లే వ్యర్థాలు, పొగ వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వ్యాపిస్తాయి. ● నదిలో కలిసే రసాయనాలు నేలలోకి ఇంకి, చుట్టు పక్కల బావులు, బోరు బావుల నీరు తీవ్ర కాలుష్యానికి కారణమవుతాయి. ● గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని సాగు భూమిలో సారం దెబ్బ తింటుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ● నదిలోని జీవచరాలకు ముప్పు వాటిల్లి వాటిపై ఆధారపడిన మత్స్యకారులు ఉపాధి కోల్పోవలసి వస్తుంది. కాలుష్య నియంత్రణ మండలి చెప్తున్నది ఇదీ.. ● గోదావరి నీటిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ల్యాబ్లలో పరీక్షించి కాలుష్య కారకాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తేల్చింది. ● సల్ఫైడ్లు నిబంధనల కంటే 70 శాతం అధికం (3.4 ఎంజీ/లీ). ● బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనుమతించిన దానికంటే 20 శాతం అధికం (ఎంజీ/లీ). ● ఫాస్పేట్ 6 శాతం అధికం (5.3 ఎంజీ/లీ) రూ. 21.34 కోట్ల పన్నుల ఎగవేత... ఒకవైపు పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను మిల్లు యాజమాన్యం ఎగవేస్తోంది. 2016 నుంచి కాతేరు పంచాయతీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు దాదాపు రూ.21.34 కోట్ల మేర పన్నులు చెల్లించకుండా నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టు స్టేలతో కాలయాపన చేస్తోంది. హెచ్చరికలు బేఖాతరు గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మిల్లు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లుకు సమన్లు జారీ చేయాలని, పన్నుల ఎగవేతపై న్యాయ పోరాటాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే ‘క్లోజర్ నోటీసులు’ ఇచ్చి మిల్లును మూసివేయిస్తామని హెచ్చరించినప్పటికీ, మిల్లు యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం పేపరు మిల్లుసీఎస్ఆర్ నిధులు... ఏర... ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల ఆదాయాన్ని యాజమాన్యం ఆర్జిస్తోంది. దీనిలో 5 శాతం అంటే రూ.10 కోట్లు సీఎస్సార్ నిధులకు ఖర్చు పెట్టాల్సి ఉంది. కానీ ఎవరైనా ఆ నిధుల కోసం వెళితే కేవలం రూ.లక్షల్లో ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్నారు. నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. ఈ కారణంతో వారెవరూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. – టీకే విశ్వేశ్వరరెడ్డి, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరిశ్రమలు ఉండాలి.. కానీ.. పరిశ్రమలు ఉండాలి కాని అవి కాలుష్య రహితంగా ఉండాలి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పేపర్మిల్లు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పేపర్మిల్లు కాలుష్యంపై చేతులెత్తేసింది. తక్షణం పేపర్మిల్లుపై చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా గాలిని, నీటిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని ఆరికట్టాలి. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పేపర్ మిల్లు కోరల్లో గోదారమ్మ హానికారక వ్యర్థాల విడుదలతో కలుషితం సీఎస్సార్ నిధుల చెల్లింపులోనూ నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులకు, అధికారులకు కేవలం రూ.లక్షల్లో ‘పంపకాలు’ దీంతో కాలుష్యంపై నోరు మెదలపలేని పరిస్థితి పదేళ్లుగా రూ.21.34 కోట్ల పన్ను ఎగవేత చేతులెత్తేసిన కాలుష్య నియంత్రణ మండలి వెంకటనగరం.. తూర్పులంక.. ఇది రాజమహేంద్రవరం నగరానికి సమీపాన ఉన్న ప్రాంతం. ఇక్కడే పేపర్మిల్లు నుంచి వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరిలోకి పంపించే ప్లాంట్ ఉంది. కానీ అతి తక్కువ మోతాదులో వ్యర్థాలను శుద్ధి చేసి మిగిలినది నేరుగా గోదావరిలోకి కలిపేస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ వంద ఎకరాల భూమిని చెరువులుగా చేసి మిల్లు వ్యర్థాలను వాటిలోకి తరలించి ఆనక గోదావరిలోకి కలిపేస్తున్నారు. అటువైపు వెళ్లడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు సాహసం చేయకపోవడం గమనార్హం. -
వాటర్ మ్యాన్ కాదు.. క్రెడిట్ చోరీ మ్యాన్
మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్: శిలాఫలకాలు వేయడం, ఇతరులు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడం, రిబ్బన్లు కత్తిరించడం, ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియాలో గొప్పగా కథనాలు రాయించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సీఈవో సీఎం టు వాటర్ మేన్’ అంటూ ఎంత ప్రచారం చేసుకున్నా వాస్తవాలు మారవన్నారు. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో వైఎస్సార్ది సంకల్పం, జగన్ది సమగ్ర నిర్మాణం, చంద్రబాబుది శిలాఫలకాలు, ప్రచారం, క్రెడిట్ చోరీ అని ఎద్దేవా చేశారు. వెలిగొండకు ప్రాణం పోసింది వైఎస్సార్ 2004 అక్టోబర్ 27న రూ.3581.58 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది వైఎస్సార్ ప్రభుత్వమని వేణు చెప్పారు. 2005లో పనులు ప్రారంభించారని, రెండు సొరంగాలు 37.587 కిలోమీటర్లు కాగా, వైఎస్సార్ హయాంలోనే 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు, 2004 వరకు ఖర్చు చేసింది రూ.10 లక్షలేనన్నారు. తొమ్మిదేళ్లు శిలాఫలకానికే పరిమితమయ్యారన్నారు. 2014 – 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ రెండు సొరంగాల్లో కలిపి పూర్తి చేసింది కేవలం 6.686 కిలోమీటర్లు మాత్రమేనన్నారు. ఈ గణాంకాన్ని దాచిపెట్టి ప్రాజెక్టు తానే నిర్మించినట్టు ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. సొరంగాలు పూర్తి చేసింది జగన్ ప్రభుత్వమే వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన 10.568 కిలోమీటర్ల సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసిందని వేణు చెప్పారు. మొదటి సొరంగాన్ని 2021 జనవరిలో, రెండో సొరంగాన్ని 2024 జనవరిలో పూర్తి చేసి దశాబ్దాల వెలిగొండ కలను సాకారం చేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులకు రూ.1046.46 కోట్లు ఖర్చు చేసి కీలక దశకు చేర్చారన్నారు. వెలిగొండ నిర్వాసితుల పునరావాసం కోసం జగన్ ప్రభుత్వం రూ.1301.56 కోట్లతో ప్రణాళిక రూపొందించిందన్నారు. పోలవరం ఎడమ కాలువలోనూ అదే క్రెడిట్ చోరీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను 2005లోనే వైఎస్సార్ ప్రభుత్వం ప్యాకేజీలుగా విభజించి ప్రారంభించి ఆయన హయాంలోనే దాదాపు 79 శాతం పూర్తి చేశారన్నారు. ఇప్పుడు ఆ నిర్మాణం తానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గోదావరి నీటిని పురుషోత్తపట్నం పంపుల ద్వారా ఇప్పటికే నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, ఉత్తరాంధ్రకు పోలవరం నీళ్లు తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీళ్లు పురుషోత్తపట్నం పంపులవి, కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన నాయకుడు వైఎస్సార్ అని వేణు చెప్పారు. ఐదేళ్ల మూడు నెలల్లో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి జలయజ్ఞాన్ని దేశ సాగునీటి చరిత్రలోనే అపూర్వ అధ్యాయంగా నిలిపారన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ అని వేణు గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రాజెక్టులకు రూపమిచ్చారని, వైఎస్ జగన్ అసంపూర్తి పనులను పూర్తి చేశారని అన్నారు. పోలవరం ఎత్తుపై సమాధానం చెప్పాలి నిజంగా చంద్రబాబు ‘వాటర్ మ్యాన్’ అయితే పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తారా? లేక 41.15 మీటర్లకే పరిమితం చేస్తారా? పోలవరం ఎత్తు, నిర్వాసితుల పునరావాసం, పూర్తి స్థాయి నీటి నిల్వపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు నిజంగా మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు. -
102 జీవోను వెంటనే రద్దు చేయాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 102 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ అన్నారు. కొంతమూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెరిట్లో మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఓపెన్ కేటగిరిలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీలోనే అడ్మిషన్ కోసం ఆప్షన్ పెట్టుకోవాలన్న జీవో అమలైతే ఆయా వర్గాలకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఆప్షన్ తప్పనిసరిగా పెట్టుకునే అవకాశం కోల్పోతారని అవేదన వ్యక్తం చేశారు. మెడికల్ రిజర్వేషన్లలోని లోపాల సవరణకు 2019లో రాష్ట్ర హైకోర్టు నియమించిన అరుగురు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా వచ్చిన జీవో 151 అమలుచేస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 102 జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడుగా గుడాల ప్రసాద్ను, నూతన కమిటీని నియమించారు. ఈ కార్యక్రమలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి గుండె నగేష్ బాబు, రాష్ట్ర లీగల్ కన్వీనర్ తోర్లపాటి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, మర్రి శామ్యూల్, కాకినాడ జిల్లా అధ్యక్షులు కాకిలేటి రవీంద్ర, కాకినాడ జిల్లా కార్యదర్శి బక్కి విజయకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పాలపర్తి కృపానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
22 కిలోల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర వ్యక్తులతో పాటు ఒక స్థానికుడిని ప్రకాశం నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణలో సీఐ ఆర్ఎస్.బాజీలాల్, ఎస్సైలు జి.సతీష్, ఎస్ఐ కె.నవీన్ కుమార్ గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ సమీపంలో ఐదుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకుని 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాఫర్ చీకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన రహత్ అలీ, హర్యానా రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్, సుమిత్ కుమార్ మిశ్రా, బీహార్కు చెందిన సందీప్ కుమార్, రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన షేక్ సాధక్ అలీ ఉన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ మూడో దఫా సమావేశం కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదించిన దరఖాస్తులపై కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులతో పరిశీలించి సూచనలు ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులపై సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. -
వయోవృద్ధులకు వారింటనే ఆశ్రయం
● కొడుకు, కోడలు వెళ్లగొట్టడంపై ఆర్డీఓకు ఫిర్యాదు ● చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న అధికారులు ● ఇంటిలోని సామగ్రి సైతం వేరు చేసి అప్పగింత పిఠాపురం రూరల్: తమ కొడుకు కోడలు తమను ఇంటి నుంచి వెళ్లగొట్టారని గత జూన్లో ఆర్డీఓకు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించి చట్ట ప్రకారం తమ ఇంటిలోనే ఒక పోర్షన్ను వారికి కేటాయించి న్యాయం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కుమారపురానికి చెందిన పెంకే యేసులక్ష్మి, ఆమె భర్త రాంబాబు తమ కుమారుడు పెంకే లోవప్రసాద్, కోడలు పద్మ తమ ఇంటిని ఆక్రమించుకుని బయటికి పంపేశారని జూన్ 15వ తేదీన ఆర్డీవో మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆర్డీఓ, సబ్ డివిజనల్ మేజిస్టేట్ (తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమం ట్రిబ్యునల్) ఉత్తర్వులను అనుసరించి శనివారం పిఠాపురం తహసీల్దార్ పి.గోపాలకృష్ణ, రూరల్ ఎస్సై జాన్ బాషా ఆధ్వర్యంలో యేసులక్ష్మికి చెందిన ఇంటిలోని రెండు పోర్షన్ల (పోర్షన్ కి 4గదులు) డాబా ఇంటిని, అందులోని సామగ్రిని ఆ దంపతులకు, కొడుకు దంపతులకు వేరు చేసి అప్పగించారు. ఆ సమయంలో కొడుకు, కోడలు అక్కడ లేకపోవడంతో వారి సామగ్రి జాబితాను తయారు చేసి అదే పోర్షన్లో ఒక గదిలో వేసి సదరు సామగ్రిని అప్పగించే సమయంలో ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ ద్వారా వీడియో చిత్రీకరించినట్టు తహసీల్దార్ తెలిపారు. వయోవృద్ధులైన తల్లితండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దారు గోపాలకృష్ణ తెలిపారు.


