East Godavari
-
అనపర్తిలో ఆగని అధికార పార్టీ ఆగడాలు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్ బెయిల్పై పంపించడం ఏంటని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. -
ఆక్వాంక్షలు ఫలించక..
ఉప్పలగుప్తం: ఆక్వా రైతు ఆకాంక్షలు ఫలించడం లేదు.. ఈ సాగు లాభసాటిగా ఉండడం లేదు.. వైరస్ల ముప్పేట దాడితో ఎటూ పాలుపోవడం లేదు.. సాగు వదలలేక, ముందుకు సాగలేక అగమ్యగోచరంలా వారి పరిస్థితి మారింది. దేశానికి రైతే రాజు అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు రొయ్యలు సాగుచేసే రైతు రాజులాగే జీవించేవాడు. కొంత కాలంగా ఈ సాగులో నష్టాలను చూస్తూ ఢీలా పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సాగు కత్తి మీద సాములా మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పలువురు రైతులు కొంతకాలం సాగుకు విరామం ప్రకటించి సంవత్సరానికి రెండు సాగులు చేపట్టే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులకు అనుకూలంగా జనవరి నుంచి జూన్ వరకూ చేసే సాగు కలసి వస్తుందని రైతులు గంపెడు ఆశతో పంట చేపడుతున్నారు. అయినప్పటికీ వాతావరణంలో మార్పు కారణంగా వైరస్ విజృంభించి నష్టాలు చవిచూడడం తప్పడం లేదని ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు, అమలాపురం రూరల్ మండలాల్లో అధికారంగా, అనధికారకంగా సుమారు 30 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిశ్రమ పద్ధతిలో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. రొయ్య సాగు కలిసి వస్తే దానిపై వచ్చే ఆదాయం పెట్టుబడిగా వచ్చి, చేపల సాగుపై వచ్చే ఆదాయం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హేచరీల నిర్వాహకులు నాసిరకమైన తల్లి రొయ్యలను వాడటంతో రొయ్య సీడ్ నుంచి ఈహెచ్పీ అనే వ్యాధి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రొయ్య మేత ఎక్కువగా తీసుకుని ఎదుగుదల లోపించడంతో రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏరియేటర్లు ఎక్కువ సమయం తిప్పుతూ ఆక్సిజన్ అందించాల్సి వస్తుందని, ఇలా అధికంగా ఖర్చు అవుతుందని, రొయ్యలు సమయానికి మేతలు తీసుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సమయానుకూలంగా సాగును పరిశీలించుకుని శానిటైజర్లు, మందులు వాడుతూ అధికంగా ఏరియేటర్లను తిప్పుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న సైజులో ఉండగానే.. ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులకు ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తెల్లటి దుప్పటిలా మంచు తెర కప్పి విపరీతమైన చల్లదనాన్ని ఇస్తుంటే, ఉదయం పది గంటల నుంచి భానుడు భగభగలాడుతూ ఎండలు కాస్తూ వాతావరణంలో వేడిని పుట్టిస్తున్నాడు. దీంతో చెరువుల్లోని రొయ్యలు డీవోలతో ఉక్కిరిబిక్కిరై వైరస్లతో చిన్న సైజులోనే మృత్యువాత పడుతున్నాయి. కొంత మంది రైతులు లాభాల దిశగా చేప, రొయ్య మిశ్రమ సాగు (పాలీకల్చర్) చేస్తున్నా.. రొయ్య సాగు రోజులు గడవక ముందే కొత్త కొత్త తెగుళ్లతో చిన్న కౌంట్లోనే చనిపోవడంతో రొయ్యను పట్టకుండానే వదిలివేసి నష్టాలను చూస్తున్నారు. వాతావరణంలో విభిన్న మార్పులతో ఒకపక్క ఎండ, మరోపక్క మంచు కురుస్తూ చెరువులో నీటి, మట్టి నాణ్యత లోపించడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడం డెడ్ ఆల్గే, విష వాయువులు విజృంభిస్తున్నాయి. వెనామీ రొయ్యల సాగులో వైట్ గట్, సెల్ లూజ్, రెడ్ గిల్, బ్లాక్ గిల్, హిబ్రియో వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గోపవరంలో రొయ్యల పట్టుబడిఫ రైతులకు లాభసాటి లేదు‘రొయ్య’ ఫ వైరస్ల బారిన పంట ఫ వాతావరణ మార్పులే కారణం ఫ రోజురోజుకూ విజృంభిస్తున్న వైనం తీవ్రంగా నష్టపోతున్నాం హేచరీల నిర్వాహకులు పూర్వం మంచి నాణ్యత కలిగిన తల్లి రొయ్యలను తెచ్చి దానితో నాణ్యమైన పిల్లలను అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాసిరకమైన తల్లి రొయ్యలను వాడి నాసి రకమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎంతో ఆశలతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి బ్యాచ్లో దిగే రొయ్యకు కచ్చితంగా వైట్ గట్ సోకి సమయానికి మేత తీసుకోక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. అధికారులు దృష్టి సారించి హేచరీలపై చర్యలు తీసుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. –నల్లా వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, వానపల్లిపాలెం లాభాలు లేక.. వాతావరణంలో మార్పులకు చెరువులో రొయ్య పిల్ల లు డీవోకు గురవుతున్నాయి. దీంతో ఏరియేటర్లు ఎక్కువ సమయం తిపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రొయ్యలు సకాలంలో మేత తినకపోగా ఏరియేటర్లు తిప్పడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంత కష్టపడినా సాగు లాభదాయకంగా చేతికొస్తుందనే భరోసా లేదు. నేను మూడు ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నాను. సీడ్ విషయంలో నెల రోజుల క్రితం సుదూర ప్రాంతం నుంచి తెచ్చుకుని సాగు చేస్తున్నాను. అందులో ఒక చెరువు ఇటీవల హిబ్రియో వైరస్ వ్యాపించి పట్టుబడికి అనుకూలంగా లేకుండా పోయింది. –సురేష్రాజు, ఆక్వా రైతు, కొమ్మరిగిరిపట్నం -
అర్చకుల గృహాల కూల్చివేత
ఫ అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఫ ఆత్రేయపురంలో ఘటన ఆత్రేయపురం: స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వరస్వామి (శివాలయం), రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయాల ఆవరణలో తరతరాల నుంచి ఉంటున్న తమ ఇళ్లను టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేస్తున్నారని శివాలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేశారని అన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడం మంచిదే అయినా? ఎటువంటి అడ్డులేకుండా ఉన్న నివాసాలను కూల్చడం సరికాదన్నారు. ఇంతకు ముందు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి జనార్దనస్వామి ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారన్నారు. దీనిపై ఆయన తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడినట్లు తెలిపారు. అలాగే ఆ పక్కనే ఉంటున్న పూర్వపు ఆలయ అర్చకుడు ఆచార్యులు కుటుంబ సభ్యుల ఇంటిని సైతం అనవసరంగా కూల్చివేశారన్నారు. గ్రామంలో తమకు బలం లేనందున దౌర్జన్యంగా నివాసాలను కూల్చివేస్తున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం తాము ఇంట్లో ఉండగా, తమ తల్లి పుల్లేటికుర్తి పల్లాలమ్మ ఎంతగా అడ్డుకున్నా వినకుండా, ఆలయానికి ఏమాత్రం అడ్డంగా లేని తమ ఇంటి గోడను కూల్చివేశారని ఆలయ అర్చకుడు భాస్కరశర్మ తెలిపారు. మొత్తం భవనం కూల్చివేస్తామని వెంటనే బయటకు వెళ్లిపోవాలని అంటున్నారని ఆయనఅన్నారు. కాగా గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు చిలువూరి రామకృష్ణరాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపిరాజు, ముదునూరి శ్రీహరిరాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆగ్రహంతో దౌర్జన్యానికి దిగినట్లు ఆలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ తెలిపారు. తమకు ఆస్తిపాస్తులు లేవని, కేవలం ఆలయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీ నాయకులు ఆదివారం పెద్దలతో చర్చిస్తామని అన్నారు. అంతవరకూ కూల్చివేతను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పారు. అర్చకుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి నచ్చజెప్పి నష్టపరిహారం అందించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నాయకుడు గొట్టుముక్కల గోపిరాజు తదితరులు కోరారు. దీనిపై రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకుడు రాంబాబు త్వరలో ఆత్రేయపురం వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. -
ఏటీఎం నుంచి మంటలు
గోకవరం: ఓ ఏటీఎం నుంచి మంటలు చెలరేగగా, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాల ప్రకారం.. గోకవరం ఎంపీపీ మెయిన్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఏటీఎం నుంచి దట్టమైన పొగలు రావడంతో లోపల ఎవరైనా ఉన్నారా అని తీవ్రమైన అందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయగా, లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏటీఎం టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని కారణాలను గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. -
నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనే..
పి.గన్నవరం: కుందాలపల్లిలో ఈ నెల 16న దళితుడు కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకు వెళ్లకుండా అడ్డుకున్న పది మందిని సోమవారం లోగా అరెస్టు చేయకపోతే, వేలాది మంది దళితులతో అమలాపురంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సంఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు శుక్రవారం పి.గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. పెళ్లి పందిరి ఉందనే కారణంతో ప్రధాన రహదారిపై నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దళితులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎస్సై బి.శివకృష్ణతో దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ దర్యాప్తు చేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సముద్రంలో యువకుడి గల్లంతు
అల్లవరం: ఓడలరేవు సముద్ర తీరం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొమరగిరిపట్నంలో ఓ ఫంక్షన్కు స్నేహితులతో పాటు అమలాపురం నారాయణపేట ప్రాంతానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) వచ్చాడు. అక్కడి నుంచి లోకేష్తో పాటు బొక్కా సతీష్, గుత్తుల మనోజ్, బొక్కా గణేష్లు శుక్రవారం మధ్యాహ్నం ఓడలరేవు బీచ్కు చేరుకున్నారు. ఓఎన్జీసీ పశ్చిమ గేటు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై లోకేష్ నడుస్తుండగా, నాచు కారణంగా జారి పడిపోయాడు. ఇంతలో సముద్రంలో స్నానం చేస్తున్న మరో యువకుడు గుర్తించి కేకలు వేసి కాపాడే ప్రయత్నం చేశారని మైరెన్ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భారీ కెరటాలకు లోకేష్ సముద్రం లోపలకు కొట్టుకుపోయాడని అన్నారు. అతను దివ్యాంగుడు కావడంతో తనను తాను కాపాడుకోలేకపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే లోకేష్ కాలికి శస్త్రచికిత్స చేయించామని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైలు పుల్లయ్య, రమేష్, సిబ్బంది రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఆగనిది ఈ పయనం..
ఫ పరుగులు పెట్టిస్తున్న పులి ఫ కానెంవారి మెట్టపై తిష్ట ఫ బయటకు వెళ్లవద్దని అధికారుల ప్రచారం అడ్డతీగల: పులి పయనం ఆగకుండా సాగుతోంది.. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చి చిక్కకుండా తిరుగుతోంది.. మూగజీవాలపై దాడులకు దిగుతోంది.. అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పెద్ద పులి శుక్రవారం ఉదయానికి వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి సమీపాన వీరభద్రపురం గ్రామానికి వెనుక ఉన్న కానెంవారి మెట్టపై తిష్ట వేసింది. అటవీ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా దీనిని గుర్తించారు. సాయంత్రానికి సరంపేట సమీపాన స్వామి కొండపై నూతుల్లోద్ది, పాకుల్లొద్దు ప్రాంతానికి చేరుకుని మకాం మార్చింది. ఆ కొండ ప్రాంతాల్లో రాతిపై చిన్న చిన్న బావుల రూపంలో గుంతలు ఉండి అక్కడ నీటి నిల్వలు ఉంటాయని, అందుకే ఆ ప్రాంతాన్ని అనువైన చోటుగా పులి ఎంచుకుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇళ్లను విడిచి ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొండ ప్రాంతాల్లో సంచరించవద్దని, చేను మకాంలో ఉండరాదని అటవీ అధికారులు తమ సిబ్బందితో మైక్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కొట్టంపాలెం, గౌరయ్యపేట, కోనలోవ, వీరభద్రపురం, గొండోలు, రాజంపాలెం, సరంపేట గ్రామాల సమీపాన చేను మకాంలలో ఉన్న గిరిజనులు గ్రామాల్లోకి పరుగులు తీశారు. పులి తన సహజ గుణంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని, మనుషుల ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు బృందాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి చెప్పారు. పులి కదలికలను సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పశువులను గ్రామంలోకి తీసుకువెళ్లి పులి సంచారం తగ్గే వరకూ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. -
స్వర్ణ శఠగోపం సమర్పణ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి భీమవరం వాస్తవ్యులు 108 గ్రాముల సుమారు రూ.17 లక్షల విలువైన స్వర్ణ శఠగోపాన్ని సమర్పించారు. వుద్ధరాజు సత్యవతమ్మ పేరున వారి కుమారులు రాఘవరాజు, సూర్యనారాయణ రాజులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అలాగే ఆలయంలో కొత్తగా నిర్మించిన ఉచిత క్యూలైన్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ధర్మకర్తలి సభ్యుడు తమ్మన సాయిప్రసాద్ పాల్గొన్నారు. కల్యాణోత్సవాలకు శ్రీకారం వాడపల్లి వేంటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
భద్రతకు సుస్తీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాకే తలమానికంగా విరాజిల్లుతూ పేద రోగులకు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రత దయనీయంగా మారింది. దీని వల్ల ఆస్పత్రి సిబ్బందితో పాటూ రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు చెయ్యి నరికేశాడు. రూ.4 లక్షల విలువైన ఏసీ కాపర్ గొట్టాలను పట్ట పగలే దొంగలు దోచుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న స్టాఫ్ నర్సు మెడలో బంగారు గొలుసును ఓ వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. బాత్రూంలో కుళాయిలు, ఇనుప పైపులను విప్పుకుని మరీ ఎత్తుకెళ్లారు. పట్ట పగలే భవన నిర్మాణ సామగ్రిని దర్జాగా ఆటోలో తరలించేశారు. రోగుల సెల్ఫోన్లు మాయమైపోతున్నాయి. అంబులెన్సు బ్యాటరీలు కూడా దొంగిలించారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని తెలుస్తోంది. అనేక ఆరోపణలు ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు నియమిస్తున్నాడని సమాచారం. అర్హత, అనుభవాల ఆధారంగా జరగాల్సిన ఎంపిక ప్రక్రియ కేవలం ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా సాగుతోందని, డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఇస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత, అనుభవం, ఫిట్నెస్ లేనివారు సెక్యూరిటీ గార్డులుగా ఉండడంతో ఆస్పత్రిలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆటోలో వచ్చి సామగ్రిని ఎత్తుకెళుతున్న దొంగలను నూతన భవనాలు కడుతున్న సంస్థ సెక్యూరిటీ గుర్తించింది. కానీ జీజీహెచ్ సెక్యూరిటీ అస్సలు కనిపెట్టలేకపోయింది. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్ఫోన్లు పట్టపగలే మాయమైపోతున్నాయి. విధుల్లో ఉన్న ఓ నర్సు మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. సీఎంవోపై వాటర్ బాటిల్తో దాడి చేయగా సెక్యూరిటీ ఈ ఘటనను నిలువరించలేకపోయింది. ఇష్టారాజ్యం సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీతాలు తీసుకుని విధులకు డుమ్మా కొడుతూ సొంత పనుల్లో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. ఈ గార్డుల్లో ఒకరు మ్యాట్రీమోనీ ప్రతినిధిగా పని చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో ఫేస్ అటెండెన్స్ వేసుకుని ఆటో డ్రైవర్గా కిరాయిలకు వెళుతున్నాడు. ఓ మహిళ హాజరు వేయించుకుని భర్త బట్టల దుకాణానికి వెళ్లి వ్యాపారం చేస్తోంది. ఓ వ్యక్తి హాజరు వేసుకుని వెళ్లిపోయి తన సొంత పాల కేంద్రం నడుపుకొంటున్నాడు. వీరి వ్యవహారంపై ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, అతడు అడిగిన సొమ్ము ఇస్తే సరిపోతోందని సమాచారం. అలాగే 60 మంది సెక్యూరిటీ గార్డుల్లో 11 మందిపై పలు నేరాల్లో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదుల వెల్లువ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రాజానగరం పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు నుంచి బయటకు పడేందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. అలాగే గత ఏడాది సెప్టెంబర్ 25న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు ఉన్నాయని విశాఖపట్టణం నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదులు అందా యి. అదే నెల 9న ఓ మహిళ సెక్యూరిటీ పర్యవేక్షకుడు తన వద్ద లంచం తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ పెండింగ్ దశలోనే ఉన్నాయి. నెలలు గడిచినా ఎటువంటి విచారణ లేదు. మార్చురీలో శవానికి పోస్టుమార్టం జరుగుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు.. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. కలెక్టర్ కీర్తి చేకూరి ఈ విషయంపై విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేలడంతో డబ్బులు వసూలు చేసిన సెక్యూరిటీ గార్డును తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయినా ఆ సెక్యూరిటీ గార్డును కొనసాగుతుండడం విశేషం. -
స్కూల్ బస్సు కింద పడి ఉపాధ్యాయురాలి మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కాతేరు సెంటర్లోని కోయంబత్తూర్ కాఫీ దుకాణం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తున్న బొంగు గాయత్రి (40) మృతి చెందారు. వివరాల్లోకెళితే.. రఘుదేవపురానికి చెందిన గాయత్రి పదేళ్లుగా తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తూ, స్థానికంగా మల్లయ్యపేటలో నివాసముంటున్నారు. శుక్రవారం, గాయత్రిని స్కూల్లో దింపేందుకు ఆమె భర్త బొంగు రాజా రావు మోటారు సైకిల్పై తీసుకువెళుతున్నాడు. ఆ క్రమంలో తిరుమల కళాశాల బస్సు కాతేరు సెంటర్ వద్ద ఆగి విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. అదే సమయంలో వెనుక నుంచి మరో లారీ వస్తోంది. ఈ క్రమంలో ఆగివున్న తిరుమల బస్సును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఆ టీచర్ ఆ స్కూలు బస్సు కిందే పడి మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ రాజారావు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి తిరుపతిలో 29 నుంచి కల్యాణోత్సవాలు పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పందిరి రాట ముహూర్తం చేశారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు, చైర్మన్ మెయిలి సంధ్యా కృష్ణమూర్తి ఆధ్వర్యాన అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం స్వామి వారి విశేషార్చన, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠా పన, ధ్వజారోహణ, సాయంత్రం శ్రీదేవి, భూ దేవి సమేత శృంగార వల్లభస్వామి కల్యాణం జరుగుతాయని ఈఓ వివరించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసా ద వితరణ ఉంటాయన్నారు. 30వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం, 31వ తేదీ సాయంత్రం సదస్యం, ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం చోర సంవాదం, రెండో తేదీన పూర్ణాహుతి, ధ్వజావరోహ ణ చక్రస్నానం, బుక్క పండగ, గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 3న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ చెప్పారు. 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల ధారణ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల దీక్షాధారణ చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తరలివచ్చి నక్షత్ర మాల ధారణ చేయాలని కోరారు. అలాగే, దీక్ష విరమణ ఏప్రిల్ 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
మీ విశ్వసనీయత స్ఫూర్తిదాయకం
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ● వైఎస్సార్ సీపీప్రజాప్రతినిధులకు సన్మానం అనపర్తి: ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీకి విధేయులుగా ఉంటూ, ప్రజల పక్షాల పోరాడుతూ మీరు చూపిన విశ్వసనీయత అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజాప్రతినిధులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అభినందించారు. పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ మాజీ ప్రతిపక్షనేత సత్తి రామారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితర ప్రజాప్రతినిధులను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా విజయం సాధించిన సర్పంచ్లు, పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తి కావస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా వారు పార్టీ, ప్రజలకు చూపిన విధేయత, విశ్వసనీయతకు, అంకిత భావానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిన సత్తి సూరారెడ్డి బ్రదర్స్ను అభినందించారు. అలాగే విశ్వసనీయతే విలువైన ఆస్తిగా భావించి, ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా పార్డీకి విధేయులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా, పార్టీని విడవకుండా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళీ) తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఫిర్యాదు చేశాం
ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అసలు బాగాలేదు. దీనిపై మూడు రోజుల క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. నిత్యం ఆస్పత్రిలో దొంగతనాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సూపర్వైజర్ సైతం సరిగ్గా విధుల్లో ఉండడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వారే రక్షించుకోలేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిని ఎలా కాపాడతారు. సెక్యూరిటీ గార్డుపై, ఆసుపత్రిలో రోగి తాలూకా బంధువులు, ఇతరుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ జి.రాజశేఖర కెనడీ, సూపరింటెండెంట్, ప్రభుత్వాసుపత్రి, రాజమహేంద్రవరం -
కాస్త మారిస్తే బెటర్
వనదుర్గ అమ్మవారి ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దుర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తారు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవీ విమర్శలు సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. సత్యదేవుని వ్రతాలాచరించేటపుడు కూడా స్వామివారి చిత్రపటానికి ఎదురుగా కాకుండా పక్కగా భక్తులను వరుసలో కూర్చోబెడతారు. స్వామివారి నిత్య కల్యాణంలో కేవలం విఘ్నేశ్వర పూజ తప్ప మరే పూజా ఉండదు. అర్చకులు చేసే కల్యాణం తిలకించడమే. అందువలన అక్కడ భక్తులను ఎదురుగా కూర్చోబెడతారు. ఖడ్గమాల పూజలో మాత్రం యంత్రానికి సుమారు 45 నిమిషాల పాటు కుంకుమ పూజ చేయిస్తారు. ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. దీనికి బదులు దంపతులు కూర్చునేందుకు చిన్న తివాచీలు వే యొచ్చు. ఒక తివాచీ ఖరీదు సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఒకసారి కొంటే కనీసం నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. కానీ, ఎందుకనో ఆ చాపలతోనే సరిపెడుతున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో ఒక మూల పరుపులు గు ట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి. పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. అందువలన మరో పది పళ్లాలుసమకూరిస్తే సరిపోతుంది. ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు. పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది. ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి. గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖడ్గమాల పూజ విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని, మరింత ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనిపై దేవస్థానం వైదిక కమిటీతో ఈఓ సమావేశమై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఖడ్గమాల పూజ నిర్వహణ తీరుపై విమర్శలు టికెట్టు వెయ్యి నూట పదహార్లు చింకిచాపలు, చాలీచాలని పూజా సామగ్రితో సరి ఒకరి వెనుక ఇంకొకరిని కూర్చోబెట్టి పూజలు ఇది సంప్రదాయ విరుద్ధమంటున్న భక్తులు ఉదయం 7.30 గంటలకే ప్రారంభం ఆ సమయానికి హాజరు కాలేకపోతున్న స్థానికేతరులు -
పోశియ్య ఇంటి పనులు పూర్తి
తాళ్లపూడి: మలకపల్లి గ్రామంలో చర్మకారుడు సనమండ్ర పోశియ్య ఇంటి పనులు పూర్తయ్యాయి. ఆ ఇంటిని శుక్రవారం జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. హౌసింగ్ పీడీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్, డీఆర్డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులందరూ కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పోశియ్య కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మలకపల్లికి వచ్చిన సమయంలో పీపీపీపీ విధానంలో పోశియ్య ఇంటిని బాగు చేయించడంతో పాటు, చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి స్థలం చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేర్చక పోవడంతో పీపీ.. పీపీ.. ఢాంఢాం అనే శీర్షికతో గత నెల 26న ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. మలకపల్లిలో పోశియ్య ఇంటిని పరిశీలించి, ఉగాది నాటికి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని హమీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఇంటి పనులు పూర్తి చేసి అప్పగించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఈద్ ఉల్ ఫితర్
● చంద్రదర్శనంతో శుక్రవారం ముగిసిన రంజాన్ మాసం ● శనివారం ఈద్ నమాజ్ చేయనున్న ముస్లింలు ● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం శుక్రవారంతో ముగిసింది. చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర రోజాలు, నమాజ్, సహెర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, ధాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు. ఎండ తీవ్రత పెరిగినా దీక్షలు సడలించకుండా పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు (14 గంటలకు పైగా) చుక్క మంచినీరు కూడా తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు చంద్రదర్శనంతో పండగ చేసుకోనున్నారు. ఈద్ నమాజ్కు సిద్ధం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలతో పాటు మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి నమాజ్ చేస్తారు. నెల రోజుల తాము చేసిన ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రాజమహేంద్రవరంలో పాటు జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లోనూ ఈద్ నమాజ్ జరుగుతుంది. దాన ధర్మాలకు ప్రాధాన్యం రంజాన్లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. ధనికులతో పాటూ పేదలు సైతం పండగ చేసుకోవాలన్నదే ముఖ్య నిర్వచనం. మనిషి ఆరోగ్యం, సంపాదించిన ధనంపై అల్లా సూచించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు అని చెప్పవచ్చు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధనం, ఆస్తులు కలిగిన వారు జకాత్కు అర్హులు. వాటిని వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు పంచాలి. ఇది రంజాన్లో ఇస్తే 70 శాతం అధికంగా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పేదలకు దానం రంజాన్ సందర్భంగా 1,750 గ్రాముల గోధుమలు, దానికి సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మతపెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని ఖరారు చేశారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. అప్పడే పుట్టిన బిడ్డ నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీదా ఫిత్రా దానం చేయాలి. ఈద్ శుభాకాంక్షలు రంజాన్ పండగ రోజు ముస్లింలు సామూహిక ఈద్ నమాజ్ జరుపుకొని అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పకుంటారు. ప్రార్థనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గంలో ఇంటికి వచ్చి సేమ్యా సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి సేమ్యాను పంచి, తమ ఆత్మీయతను తెలియజేస్తారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. -
షాడో ఎమ్మెల్యే!
తరగతి గదులు ప్రారంభిస్తున్న వెంకటలక్ష్మి. చిత్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరిసాక్షి, రాజమహేంద్రవరం: ఆ నియోజకవర్గంలో కొబ్బరికాయ కొట్టాలన్నా.. రిబ్బన్ కత్తిరించాలన్నా.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు పంపిణీ చేయాలన్నా.. అన్నిటా ఆమె హవానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ ఆయన భార్యే చక్కబెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆమెకే పెద్దపీట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా.. ఎమ్మెల్యే ఇటీవల చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదీ సంగతి రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలను కలవడం, అసెంబ్లీ తదితర వ్యవహారాలను ఎమ్మెల్యే చక్కబెడుతూంటే.. నియోజకవర్గంలో జరుగుతున్న శుభకార్యాలు, పరామర్శల వంటి వాటికి ఆయన భార్య స్వయంగా హాజరవుతున్నారు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు. అయితే, కొద్ది నెలలుగా ఆమె మరో అడుగు ముందుకేసి అధికారిక కార్యక్రమాల్లో సైతం అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నారనే విమర్శలు వస్తున్నాయి. రహదారుల శంకుస్థాపనల నుంచి, భవనాల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ వరకూ అన్నీ ఆమె చేతుల మీదుగానే జరుగుతున్నాయి. ఎమ్మెల్యే భార్య అయినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడమేమిటనే ప్రశ్న కూటమి నేతల నుంచే వస్తోంది. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ఎలాగని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ● రఘుదేవపురం ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. వీటి ప్రారంభోత్సవం ఎమ్మెల్యే బలరామకృష్ణ నిర్వహించారంటే ఫర్వాలేదు. కానీ, ఆయన భార్య వెంకటలక్ష్మి ప్రారంభించారు. ● ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం బాధితులకు ఆమే పంపిణీ చేశారు. నేరుగా గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ చెక్కులు అందజేస్తున్నారు. దీనినిబట్టి అధికారిక కార్యక్రమాల్లో ఆమె ఏ స్థాయిలో పెత్తనం చేస్తున్నారో అర్థమవుతోందని కూటమిలోని టీడీపీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే భార్య కావడంతో అధికార యంత్రంగం సైతం ఎదురు చెప్పలేక జీ హుజూర్ అంటోంది. ఇదిలా ఉండగా పలు అధికారిక కార్యక్రమాలకు కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఇన్చార్జ్ బొడ్డు వెంకట రమణ చౌదరిని ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదని, ఎక్కడా లేని విధంగా ఇక్కడ షాడో ఎమ్మెల్యే పెత్తనమేమిటంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బత్తులపై కారాలు మిరియాలూ నూరుతున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. 2029 ఎన్నికలే లక్ష్యమా? ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బహిరంగ రాజకీయాలకే పరిమితం కావడం.. ఆయన భార్య మాత్రం ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూండటం వెనుక వేరే వ్యూహం దాగుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా టికెట్టు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బలరామకృష్ణ తన భార్య వెంకటలక్ష్మిని పోటీకి దింపేందుకే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చేలా ఆయన ఇటీవల పలు సమావేశాల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలి, రాణించాలని అంటున్నారు. ప్రజా వ్యతిరేకత భయంతో..! చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తోంది. ఇంత తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ తప్పుడు ప్రచారం చేసి బలరామకృష్ణ గద్దెనెక్కారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాకు అడ్డూ అదుపూ ఉండటం లేదనే విమర్శలున్నాయి. అధికారంలోకి వచ్చిన 16 నెలల వ్యవధిలోనే పది కొండలను కొల్లగొట్టేస్తే.. మిగిలిన మూడేళ్లల్లో నియోజకవర్గంలో కొండల పరిస్థితేమిటంటూ సొంత కూటమి నేతలే విమర్శలు గుప్పిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజానగరం మండలం కొత్త తుంగపాడు, కొండగుంటూరు, కానవరం, జి.యర్రంపాలెం; సీతానగరం మండలం నల్లగొండ తదితర గ్రామాల సమీపాన ఇప్పటికీ అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. వీటిల్లో ఒకటి రెండుచోట్ల మాత్రమే అనుమతులున్నాయి. అది కూడా రెండు నుంచి ఐదెకరాల వరకూ అనుమతి తీసుకుని, పదెకరాల విస్తీర్ణంలో మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిత్యం వందలాది లారీలతో గ్రావెల్ ఈ ప్రాంతం నుంచి రాజమహేంద్రవరం, కడియం, కాకినాడ, రావులపాలెం, మండపేట తదితర ప్రాంతాలకు తరలిపోతోంది. వే బిల్లులు, ఇతర రసీదులూ లేకపోయినా అడ్డుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండటం లేదు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొంది. ఈ పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుందేమోనని బలరామకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన భార్య వెంకటలక్ష్మిని జనసేన అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపన చేస్తూ.. రాజానగరంలో ఎమ్మెల్యే భార్య హవా ఆయన చేయాల్సిన పనులన్నీ ఆమె కనుసన్నల్లోనే.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి ఆమె! అందుకే ఈ హడావుడి అంటున్న విశ్లేషకులు -
నాటిక పోటీలు ప్రారంభం
రావులపాలెం: అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని సినీనటులు గౌతంరాజు, గుండు సుదర్శన్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని సీఆర్సీ కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు, సిల్వర్ జూబ్లి వేడుకలు గురువారం వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 26 వసంతాలుగా సీఆర్సీ సేవలు ప్రసంశనీయం అని కొనియాడారు. సీఆర్సీ ఉగాది పురస్కారాన్ని కాకినాడకు చెందిన సప్తగిరి హేచరీస్ అధినేత సత్తి సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. ఏర్పాట్లను సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, సీఆర్సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కె.సూర్య, ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, సీఆర్సీ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కరరెడ్డి(చిన్నబుజ్జి) మల్లిడి విజయభాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్రెడ్డి, పడాల సత్యనారాయణరెడ్డి, పరిషత్ పర్యవేక్షణ డైరెక్టర్ పలివెల త్రిమూర్తులు పర్యవేక్షించారు. ఆలోచింపజేసిన నాటికలు మొదటిరోజు రెండు నాటికలను ప్రదర్శించారు. గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ (నాటిక) జ్యోతిరాజ్ భీశెట్టి రచన, డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో ఆలోచనాత్మకంగా సాగింది. సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ, మానవ చరిత్రలో సీ్త్ర, పురుషుల గురించే మనం మాట్లాడుకుంటాం, పురాణకాలం నుంచి నేటి వరకూ, ఆదిమానవ యుగం నుంచి ఇప్పటివరకూ సీ్త్ర,పురుషులే కాకుండా మానవజాతిలో దాదాపు 20 రకాల శరీరతత్వాలు కలిగిన మనుషులు ఉన్నారని ఎంతమందికి తెలుసు?! సీ్త్రలను, పురుషులను మాత్రమే గౌరవించే ఈ బూటకపు నాగరికతలో వాళ్ళు ఎలా మనగలుగుతున్నారు?! అలాంటి వాళ్ళకు ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉంది? అసలు ఈ ఆలోచన మనకు ఎప్పుడైనా కలిగిందా? విభిన్న శరీరతత్వ స్వభావం కలిగినవారి గురించి మన పురాణాలు, చరిత్రలు పరిచయం చేస్తూనే వచ్చాయి. సాంకేతికత గల నేటి ఆధునిక సమాజంలో అలాంటి వారికి సముచిత స్థానాన్ని కలగ చేయకపోవడం మన నాగరికతలో మనం ఒప్పుకోవడానికి సిద్దపడని డొల్లతనం కాదా?! సీ్త్ర, పురుషుడు కానివారిని అవమానించడం, గౌరవించకపోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు స్థితికి ఓ ప్రతీక. అవునంటారా ? కాదంటారా? అలాంటి వివక్షలను కనీసం తరచి చూసే బాధ్యత మనకి ఉందంటారా? లేదంటారా? అలాంటి ఎన్నో నిజ జీవితాల నుంచి ఆవిష్కరించిన ఒక విభిన్న శరీరతత్వపు మనిషి జీవితంలోకి తొంగి చూద్దాం వాళ్ళు మనసున్న మనుషులేనని గుర్తించి, గౌరవిద్దాం అంటూ ఆలోచనాత్మకంగా సాగిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ఆకట్టుకుంది. కాకినాడ బీవీకే క్రియేషన్స్ కన్నీటికి విలువెంత? నాటిక మూల కథ: డి కామేశ్వరి, నాటకీకరణ: డి ఉమా శంకర్, దర్శకత్వం: డి వినయ్ ఈ నాటికను సందేశాత్మకంగా ప్రదర్శించారు. డాక్టర్ సరోజినీ దేవి మానవసేవయే మాధవసేవ అని భావిస్తూ వైద్య సేవ కొనసాగిస్తున్న రోజుల నుంచి ధర్మం అధర్మంగా మారి డబ్బుకి విలువిస్తున్న డాక్టర్గా మారింది. నర్సు నందిని డాక్టర్ సరోజినీదేవి స్థితిగతులను పరిశీలిస్తుంది. సరోజినీ దేవి కారు డ్రైవర్ భార్య సితాలు తన అత్త పార్వతిని వెంటబెట్టుకుని హాస్పిటల్కి వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన మహాలక్ష్మి, గర్భవతి అయిన తన కూతురు మాధవిని హాస్పిటల్కి తీసుకొస్తుంది. సితాలు, మాధవి ఇద్దరికి పురిటి నొప్పుల ప్రసవ వేదన ఒకేసారి మొదలవుతుంది. సరోజినీ దేవి డబ్బు ఆశ వల్ల నిర్లక్ష్యం వల్ల మాధవి కూతురు చనిపోతుంది. సరోజినీ దేవి సూక్ష్మ ఆలోచనతో సితాలు బిడ్డను మాధవి దగ్గర మాధవి బిడ్డను సితాలు దగ్గర పడుకోబెడుతుంది. ఈ విషయం గమనించిన నర్సు నందిని డాక్టర్న్ని నిలదీస్తుంది సరోజినీ దేవి నర్సు నందిని నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. సితాలు ఏడుస్తూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి మాధవికి పుట్టిన బిడ్డను వద్దు అని చెప్పి డాక్టర్కి ఇచ్చేసి వెళ్లిపోతుంది. నర్సు నందిని ద్వారా సితాలు, మాధవి నిజానిజాలు తెలుసుకుని డాక్టర్ సరోజినీదేవిని న్యాయస్థానానికి అప్పగిస్తారు. ఈ కథాంశం ఆసక్తిగా సాగింది. -
విషాదం మిగిల్చిన ఉగాది
● పంచారామ క్షేత్ర కోనేరులో మునిగి యువకుడి మృతి ● నిశ్చితార్థం అయిన నాలుగు రోజులకే మృత్యువాత సామర్లకోట: నిశ్చితార్థం చేసుకున్న జంట బంధువులతో కలిసి పంచారామ క్షేత్రంలోని స్వామివారి దర్శనానికి వచ్చారు. అయితే ఆలయ కోనేరే యువకుని మృతికి కారణమైంది. పెద్దాపురం, కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27)కు నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. ఆ జంట బంధువులతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆలయ కోనేరులో స్నానానికి దిగిన ప్రశాంత్ కోనేరులో మునిగిపోయాడు. వెంటనే ప్రశాంత్ స్నేహితులు, స్థానికులు, కోనేరులోకి దిగి ప్రశాంత్ను బయటకు తీసి మోటారు సైకిల్పై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ప్రశాంత్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దాంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ఆవరణలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొతపేటలో నివాసం ఉంటున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులకు వాలుతిమ్మాపురం రోడ్డులో టిడ్కో గృహం రావడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. ప్రశాంత్ సామర్లకోట ఏఐఎఫ్ఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నట్లు స్నేహితులు తెలిపారు. కోనేరులో ఈత కొట్టే సమయంలో ఆయాసం రావడం వల్ల మునిగిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఆలయ కోనేరులో గ్రిల్స్ ఏర్పాటు చేసినా వాటిని దాటి కోనేరులోకి దిగడం వల్ల తరుచూ ఇటు వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా వచ్చి కోనేరులో స్నానాలు చేసే అవకాశం ఉన్న కారణంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్థానికులు కొరుతున్నారు. -
రూ.95 లక్షలతో వనదుర్గ అమ్మవారి ఆలయ విస్తరణ
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని విస్తరించేందుకు రూ.95 లక్షలతో పలు నిర్మాణాలు చేపట్టాలని అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు తీర్మానించింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ట్రస్ట్బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈఓ వీ త్రినాథరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వనదుర్గ ఆలయ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. అమ్మవారి ఆలయంలో దిగువన ప్రతీ శుక్రవారం చండీహోమం, పౌర్ణమి, అమావాస్య తిధులలో ప్రత్యంగిర హోమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ హోమాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గత నెల 20వ తేదీ నుంచి ప్రతీ శుక్రవారం ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఖడ్గమాల పూజ కూడా నిర్వహిస్తున్నారు. అయితే మండపం విశాలంగా లేకపోవడంతో ఈ పూజలో ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం లేదు. దిగువన హోమ మండపంలో కూడా అదే పరిస్థితి. దీంతో ఈ మండపాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ● దేవస్థానం అధికారుల విజ్ఞప్తి మేరకు గత నెలలో దేవదాయశాఖ డిఫ్యూటీ స్థపతి శ్రీనివాస ఆచారి వనదుర్గ అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ మండపాన్ని తూర్పు వైపు 30 అడుగుల ముందుకు పెంచుకోవచ్చునని సూచించారు. ఆ నిర్మాణంతో బాటు ఇతర నిర్మాణ పనులు చేపట్టడానికి ట్రస్ట్బోర్డులో తీర్మానించారు. ● వచ్చే నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా విద్యుత్ అలంకరణకు, ఇతర పనులకు రూ.30.55 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలను సమావేశంలో ఆమోదించారు. ● కల్యాణ మహోత్సవాలలో కల్యాణ వేదిక ముందు ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు రూ.రెండు లక్షలు వ్యయం ఖర్చయ్యే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. ● దేవస్థానం కేశఖండనశాలలోని భక్తుల టాయిలెట్స్, స్నానపు గదులలో రూ.40 లక్షల వ్యయంతో అధునాతన శానిటరీ వస్తువులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. సత్యదేవుని కల్యాణ మహోత్సవాలలో రూ.30.55 లక్షలతో విద్యుత్ అలంకరణ కేశఖండన శాలలో రూ.40 లక్షలతో అధునాతన శానిటరీ ఫిట్టింగ్స్ అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు సమావేశ నిర్ణయాలు -
ఉత్సాహంగా మహిళా వాలీబాల్ పోటీలు
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా వాలీబాల్ (డే అండ్ నైట్) పోటీలు మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం వరకూ జరిగిన లీగ్ పోటీలలో పలు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. చైన్నె– కర్నాటక జీఎస్టీ మధ్య జరిగిన పోటీలలో చైన్నె విన్నర్గా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ, సౌత్ ఈస్ట్రన్ రైల్వే మధ్య జరిగిన పోటీలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ జట్టు విజయం సాధించింది. ఇంకా మరొక పది జట్ల మధ్య లీగ్ పోటీలు జరిగాయి. అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను అడబాల వీర బ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్ పర్యవేక్షించారు కోడిపందేలాడుతున్న ముగ్గురి అరెస్ట్ సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున కోడిపందేలాడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్సై డి రామ్కుమార్ గురువారం తెలిపారు. నల్గొండ శివారున కోడిపందేలాడుతుండగా సిబ్బందితో దాడి చేసి కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన ఇద్దరు, రాపాకకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5,160 నగడు, ఐదు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై రామ్కుమార్ తెలిపారు. రూ.కోటి ఇరవై లక్షల ఆస్తి దానం తాళ్లపూడి: వీలునామా ప్రకారం రూ.కోటి ఇరవై లక్షల ఆస్తిని దానం చేసి వారు తమ దాతృత్వం చాటుకున్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యాన సేవా కేంద్రానికి పడాల భాను ప్రసాద్ శ్రీమతి విజయశ్రీల ఆస్తిని గురువారం దానం చేశారు. పట్టణానికి చెందిన పడాల భాను ప్రసాద్ కొవ్వూరులో న్యాయవాదిగా పనిచేస్తూ షిరిడి సాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2018లో వారి మరణానంతరం వారి భార్య విజయశ్రీ కొవ్వూరు స్టేట్ బ్యాంకు వెనుక వీధిలో తన నివాసం ఉంటున్న ఇంటిని తన భర్త అభీష్టం మేరకు తన తదనంతరం శ్రీ షిరిడి సాయి జనసేన కేంద్రం కొవ్వూరుకు 263 గజాల స్థలము, ఇంటిని వీలునామా ద్వారా రాసి ఉన్నారు. 2025లో ఆమె మృతి చెందారు. తరువాత వారి సోదరులైన గంధం జయ, గంధం సాయి కుటుంబ సభ్యులు వారి అక్క బావల కోరిక మేరకు విల్లుకు సంబంధించిన ఆస్తిని గురువారం సేవా కేంద్రం సభ్యులకు అప్పగించారు. సేవా కేంద్ర సభ్యులు గుడివాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ భాను ప్రసాద్ వారి భార్య అభీష్టం మేరకు ఈ ఆస్తిని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫ్లెక్సీలతో బస్టాండ్ను మూసేసిన కూటమి నాయకులు
పి.గన్నవరం: స్థానిక మూడు రోడ్ల సెంటర్లో రావులపాలెం వైపు వెళ్లే ప్రయాఫికుల కోసం గతంలో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని కూటమి నాయకులు ఫ్లెక్సీలతో మూసేశారు. లోపలకు వెళ్లి కూర్చునే అవకాశం లేకుండా ఫ్లెక్సీలు అడ్డుగా కట్టడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే నిల్చుని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విశ్రాంతి భవనంలోని బల్లలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూటమి నేతల తీరుపై ప్రయాణికులతో పాటు స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు. -
ఉగాది వేళ ఉసురు తీసిన లారీ డ్రైవర్
● తాళ్లూరు శివారులో హైవేపై ప్రమాదం ● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు ● మృత్యువును జయించిన మరో యువకుడు గండేపల్లి: ఒక లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఉగాది వేళ ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. ఉగాది పండగను జరుపుకునేందుకు గ్రామస్తులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఊహించని విషయం గ్రామస్తుల చెవిన పడటంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినిమా బెనిఫిట్ షో చూసిన యువకులు వారి ఆనందాన్ని తమ స్నేహితులు, బంధువులు, గ్రామస్తులతో పంచుకునే లోపే ఘోరం జరిగిపోయింది. కన్న కొడుకును కోల్పోయిన బాధ ఒక కన్న పేగుదైతే, తీవ్ర గాయాలతో కొడుకు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న వేదన మరో పేగు బందానిధి. మండలంలోని రామయ్యపాలెంకు చెందిన కాపుశెట్టి షణ్ముఖ శ్రీ చంద్రశేఖర్ (చందు) (17), బద్ది నాగసాయి మణికంఠ, సాలాపు లక్ష్మి వీర వెంకట కిషోర్లు కలిసి మోటార్ సైకిల్పై గురువారం విడుదలైన ఉస్తాద్ భగత్సింగ్ సినిమా బెనిఫిట్షోకు జగ్గంపేట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు శివారు డివైడర్ వద్దకు వచ్చే సరికి ఉప్పలపాడు వెళ్లేందుకు ఆగి ఉన్న ఆటోను తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో వెనకే వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి మోటార్ సైకిల్ను ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయిన వీరిపై నుంచి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చందు, మణికంఠకు తీవ్రగాయాలు కాగా కిషోర్ బయటపడ్డాడు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ వాహన సిబ్బంది, గండేపల్లి పోలీసులు, స్థానికుల సహాయంతో రోడ్డు సేఫ్టీ వాహనంలో జెడ్ రాగంపేట వద్ద గల సీహెచ్సీకి క్షతగాత్రులను తరలించారు. వైద్యులు సూచనలమేరకు అక్కడి నుంచి 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చందు మృతి చెందగా, మణికంఠ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన లారీ తప్పించుకుపోవడంతో హైవేపై సీసీ కెమెరాలను పరిశీలించి పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. మృతుని స్నేహితుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు చందు తల్లితండ్రులు శ్రీను, దేవిలకు రెండవ కొడుకని గ్రామస్తులు తెలిపారు. తండ్రి నిర్వహిస్తున్న చిరు వ్యాపారంలో సాయం చేస్తుండేవాడని, అందరితోనూ కలివిడిగా ఉండే చందు మృతిచెందడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు చందు, మణికంఠ ఇళ్లకు చేరుకుని వారి కుటుంబాల ఓదార్చారు. ఇద్దరు చిననాటి స్నేహితులు మృతుడు చందు, చికిత్స పొందుతున్న మణికంఠ చిననాటి స్నేహితులని, వీరిద్దరూ కలిసి రాజానగరం వద్ద గల ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తిచేసి సెకండ్ ఇయర్కు వచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. స్నేహితుడు మృతిచెందిన విషయాన్ని మణికంఠకు తెలియకుండా గోప్యంగా ఉంచినట్టు తెలిపారు. -
ప్రభుత్వాసుపత్రిలో తాగుబోతు వీరంగం
సెక్యూరిటీ గార్డుపై అర్ధరాత్రి కత్తితో దాడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ తాగుబోతు కత్తితో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే అతడు దాడి చేస్తూంటే బాధితుడు చేయి అడ్డు పెట్టాడు. దీంతో, అతడి చేయి, తలపై కత్తి వేట్లు పడ్డాయి. నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సీటీఆర్ఐకి చెందిన కడగల సూర్యప్రకాశరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. దేశాబత్తుల చిన్నారావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు అక్కడకు వచ్చాడు. అతను పదేపదే రోగి వద్దకు వెళ్లి, వస్తూండటంతో అక్కడ తిరగవద్దని సెక్యురిటీ గార్డు సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆ రోగి బంధువులు ఆసుపత్రిలో ఫుల్గా మద్యం తాగారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డుకు, రోగి బంధువు చిన్నారావుకు మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేటు బయట ఉన్న చిన్నారావును పిలుచుకు రావాలని వారు సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. అతడు వెళ్లి పిలుస్తూండగానే.. ముందుగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో అతడిపై చిన్నారావు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందించారు. నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
చిరు జల్లులు.. చల్లని గాలులు
దేవరపల్లి: ఉదయం నుంచీ ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు సాయంత్రం చల్లని గాలులతో కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. సాయంత్రం 4 గంటలకు ఆకాశంలో ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుని, చిరు జల్లులు కురిశాయి. చల్లని గాలులు వీచాయి. దీంతో, ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు రోడ్ల పైకి వచ్చి కేరింతలు కొట్టారు. అయితే, పొగాకు, మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. కళ్లాలపై ఎండబోసిన మిరప కాయలను రైతులు రాశులు వేసి, బరకాలు కప్పి ఒబ్బిడి చేశారు. పొగాకు రెలుపులు చివరి దశలో ఉండటంతో వర్షం కురిస్తే నాణ్యత దెబ్బ తింటుందని చెప్పారు. మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో పొగాకు, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతటా సుభిక్షం, సౌభాగ్యం నిండాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంతో పా టు దేశమంతటా సుభిక్షం, సౌభాగ్యం నిండాలని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆకాంక్షించారు. కలెక్టరేట్లో శ్రీ పరాభవ నామ సంవత్సర జిల్లా స్థాయి ఉగాది వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం కుటుంబంలా కలిసి ప్రజా సేవ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గేట్లో 84వ ర్యాంక్ సామర్లకోట: పట్టణానికి చెందిన తెలగరెడ్డి సాయి ప్రసన్న కుమార్ గేట్ 2026లో ఆలిండియా 84వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి దుర్గపూర్లో బీటెక్ చదువుతున్నాడు. గతంలో కేఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రసన్న కుమార్ గేట్లో 84వ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రసన్న కుమార్ తండ్రి వీరభద్రరావు రోజు కూలీగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. తల్లి భూచక్రవేణు గృహిణి. తమ కుమారుడు మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
వైభవంగా వాడపల్లి వెంకన్న అధ్యయనోత్సవాలు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో 5వ రోజు గురువారం ఉదయం గౌతమి గోదావరి నది నుంచి తీర్థం బిందె తీసుకురావడంతో కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. వైష్ణవ స్వాములు సేవా కాలం స్వామి వారి ఎదుట దివ్య ప్రబంధ పారాయణం భక్తిశ్రద్ధలతో చేశారు. వాడపల్లి మాడ వీధులలో గురువారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ, గరుడ, సింహ, హంస వాహన సేవలు మేళతాళాలు, బాణసంచా కాల్పులుతో బాండ్ వాయిద్యాల నడుమ, భక్త జన రంజకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేకంగ పండ్లు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తుల వసతుల కల్పనను ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్య చక్రధరరావుల పర్యవేక్షించారు. రాత్రి పల్లకి, గరుడ, సింహ, హంస వాహన సేవలు -
గోదావరి.. కవితా ఝరి
గంగ– రుషుల నది.. యుమున– ప్రేమికుల నది.. కృష్ణ– శిల్పుల నది.. కావేరి– సంగీతకారుల నది అని చెబుతూ.. ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు గోదావరిని ‘కవుల నది’గా అభివర్ణిస్తారు. వేదంలా ఘోషించే గోదావరి తీరాన.. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలన.. శతాబ్దాలుగా కవితా ఝరులు పొంగి పొరలుతూనే ఉన్నాయి. పావన గోదారి నీరు తాగి పెరిగిన ఎంతోమంది అక్షర శిల్పులు.. అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. రేపు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కొంత మంది గోదావరి కవులను చూసొద్దాం రండి..● ఉమ్మడి ‘తూర్పు’న వికసించిన కవితా సుమాలెన్నో.. ● సుప్రసిద్ధ కవులకు ఈ నేల పుట్టినిల్లు ● రేపు ప్రపంచ కవితా దినోత్సవం కపిలేశ్వరపురం: మానవ జీవితంలోని వెలుగునీడల్ని ప్రతిబింబించే కథ, కవిత్వం, నవల, నాటకం.. ఇలా ఏ ప్రక్రియ అయినా సమాజ అభ్యున్నతికి దోహదపడినవే. ప్రకృతి వర్ణనలు, భావావేశపు వెల్లువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, ఎవ్వరూ పట్టించుకోని చీకటి కోణాల గురించి ఎంతో మంది కవులు తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారు. అణువణువునా పావన గోదావరి జలాలతో పునీతమవుతున్న ఈ నేల.. అటువంటి ఎంతో మంది కవులకు జన్మనిచ్చింది. 1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా, ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పదహారేళ్ల చిరుత ప్రాయంలోనే తత్త్వవేత్తగా, కవిగా గుర్తింపు పొందార. ఆయన కవితలు అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందాయి. ఐ.పోలవరంలో పుట్టి.. 1947 నుంచి 1974 వరకూ రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఆయన ఒక్క అక్షరం ఎక్కువ, తక్కువ కాకుండా సమపాళ్లలో అక్షరాల పొందికతో కవిత్వాన్ని సృజియించడం ఆయన ప్రత్యేకత. పిఠాపురం ప్రాంతంలోని చంద్రపాలెంలో జన్మించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ఆయన కలం నుంచి ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు భావ కవిత్వం అద్భుతంగా జాలువారింది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మా లేకుండా’, ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’ వంటి ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రాశారు. మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించిన బోయి భీమన్న ‘కుల, మత, వర్గ విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలన్నదే నా ధ్యేయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. 1865 ఫిబ్రవరి 11న సీతానగరంలో జన్మించిన కవిశేఖరుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‘సాక్షి’ పేరిట రాసిన వ్యాసాల ద్వారా నాటి సామాజిక పరిస్థితులను ఎండగట్టారు. పిఠాపురానికి చెందిన ఆవంత్స సోమసుందర్– నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ‘వజ్రాయుధం’ పేరిట వెలువరించిన కవితా సంకలనం.. ఓ సంచలనం. ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందంటే.. ఆయన ఎంతటి పదునైన పదాలతో ఈ కవిత్వాన్ని వెలువరించారో చెప్పనవసరం లేదు. రామచంద్రపురానికి చెందిన అదృష్ట దీపక్– ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ వంటి సినిమా పాటలతో పాటు, అనేక అభ్యుదయ కవితలను రాశారు. కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు విప్లవ కవుల ప్రభావంతో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వంటి సమీక్షా పుస్తకాలు రాశారు. ఈ కోవలోనే ర్యాలి ప్రసాద్ వంటి అనేక మంది కవులు అనేక సమస్యలను అక్షరీకరిస్తూ తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు. ‘అమ్మకు స్వరనీరాజనం’ మండపేటలోని సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు చల్లా రవికుమార్ తన తల్లి లక్ష్మి మరణించిన వేళ దశదిన కర్మకాండలకు దూరంగా ఉంటూ ‘అమ్మకు స్వర నీరాజనం’ పేరిట కవితలు, పాటల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ‘భూమిని చీల్చుకునే పుట్టే చెట్టుకు విత్తే కదరా అమ్మ, పురిటి చావుతో యుద్ధం చేసి అమ్మ ఇచ్చును మరుజన్మ’ అంటూ రవికుమార్ స్వయంగా అమ్మపై రాసిన పాటను గాయకుడు సురేష్ నిఖిలం స్వరపరిచారు. అలాగే, యుద్ధం ప్రభావాలపై ‘పుడమి గాయం, శోకసంద్రం దీనవదనం దిగులు గగనం! యుద్ధమా! ఇది యుద్ధమా?’ అంటూ నల్లి ధర్మారావు రాసిన గేయానికి రాజమహేంద్రవరానికి చెందిన గాయకుడు సురేష్ స్వరకల్పన చేయగా విశేషంగా ఆదరణ పొందింది. సాహితీ కృషీవలులెందరో.. సాహిత్యాన్ని సృజియించడమే కాదు.. ఆ ప్రవాహం తరువాతి తరానికి కూడా అందించేలా.. ఆ స్ఫూర్తిని కొనసాగించేలా అనేక సంస్థలు నిరంతర కృషి చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు, కవుల జయంతులు, వర్ధంతులు, గ్రంథ సమీక్షల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరం, కాకినాడ కేంద్రంగా సాహితీ స్రవంతి, రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి, మండపేటలో సంగమం సాంస్కృతిక వేదిక, అ.ర.సం వంటి సంస్థలు ఈ కృషిని కొనసాగిస్తున్నాయి. యుద్ధం, కరోనా, మహిళా వేధింపులు, వాణిజ్య, వ్యాపారాల ప్రభావం, మానవ వికాసం, విలాపం వంటి అనేక సామాజిక అంశాలపై కవితా గోష్టులు నిర్వహిస్తున్నాయి. కవులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన అంగర గోపాలకృష్ణాచార్యులు (కృష్ణశ్రీ) అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట సాహిత్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. సామర్లకోటకు చెందిన బసా బలరామకృష్ణ (శ్రమేరా) ‘సాహిత్య సహచరుల వేదిక’, కాకినాడకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు ‘పుస్తకం’ పేరుతోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలోని కవితలు, సాహిత్య పుస్తకాలను పంచుకుంటున్నారు. -
సత్యదేవునికి జయము జయము
● పరాభవ నామ సంవత్సర ఫలితం భేష్ ● ఈ ఏడాది భక్తుల సౌకర్యాలకు భారీగా వెచ్చించే అవకాశంఅన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవునికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సర్వత్రా జయం చేకూరుతుందని ప్రముఖ పంచాంగకర్త, అన్నవరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ తెలిపారు. ఆదాయ, వ్యయాలతో నిమిత్తం లేకుండా స్వామివారి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి, సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో వేంచేయించారు. నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంతన ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పరాభవ నామ పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం, పూర్ణప్రసాద్ సిద్ధాంతి నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. సత్యదేవునిది మఖ నక్షత్రం, సింహరాశి కావడంతో ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయన్నారు. ఈ రెండూ సమానమని అంటే ఈ ఏడాది దేవస్థానంలో అనేక సత్రాలు, నూతన నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు వ్యయం చేస్తారని అర్థమన్నారు. భక్తుల సౌకర్యాలు కల్పనకు కూడా నిధులు వెచ్చిస్తారన్నారు. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 7 చొప్పున సమానంగా ఉన్నాయని, అయితే, ఇవి దేవతలకు వర్తించవని చెప్పారు. వైశాఖ మాసంలో సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని వివరించారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. దైవ ప్రార్థనలు, పూజలు, దానాల వలన ఆయా రాశుల వారికి అవి సానుకూల ఫలితాలుగా మారుతాయని ఆయన వివరించారు. పలువురికి సత్కారం పంచాంగ శ్రవణానంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు వెంపరాల సీతారామ అవధాని (అమలాపురం), సుందరరామ శ్రోతి(విజయవాడ)లను రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించారు. పంచాంగ ఫలితాలను వివరించిన పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కూడా సత్కరించారు. దేవస్థానం సీనియర్ వేద పండితుడు గంగాధరభట్ల గంగబాబు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, సీనియర్ అర్చకుడు బులుసు సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో గంగబాబు, ఇంద్రగంటిలను చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్చకుడు బులుసు తరఫున ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ వీటిని స్వీకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం.. భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్యాల నడుమ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా సత్యదేవుని ఆలయం, అనివేటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. -
అక్రమ కట్టడాలు కూల్చివేయాలి
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోత్సాహంతో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాలు అమలు చేసి కూల్చివేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపి, అనంతరం ర్యాలీ నిర్వహించి మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ దేవీచౌక్ సెంటర్లోని జిల్లా పశువుల ఆస్పత్రి ఎదురుగా గౌతమి సూపర్ బజార్ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చి వేయాలన్నారు. గౌతమి సూపర్ బజార్ విషయంలో తాను రూ.ఐదు కోట్ల ముడుపులు తీసుకున్నానంటూ గత ఎన్నికల సమయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ అబద్ధపు ప్రచారం చేసి, వేల పోస్టర్లను నగరంలో వెదజల్లించి, నీచ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు తెచ్చుకుని నా నిజాయితీ, సచ్చీలత నిరూపించుకున్నాననన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగినా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నోరు విప్పక పోవడంతో ముడుపులు తీసుకున్నది ఎవరో ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, కోర్టు ఆదేశాలు గౌరవించాలని, లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, దాసి వెంకటరావు, మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు, పీతా రామకృష్ణ, బిల్డర్ చిన్నా, వాసంశెట్టి గంగాధర్, గుత్తుల హర్ష, రొక్కం త్రినాథ్, కృష్ణవేణి, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, వార్డు ఇన్చార్జులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి ఫ మాజీ ఎంపీ భరత్రామ్, డాక్టర్ శ్రీనివాస్ ఫ రాజమహేంద్రవరంలో నిరసన, ర్యాలీ -
రత్నగిరిపై నేడు ఉగాది వేడుకలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సన్నిధిన అనివేటి మండపంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు నూతన పంచాంగాలను స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చకులు పూజలు చేస్తారు. తొమ్మిది గంటలకు దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, పంచాంగ రచయిత తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ పంచాంగ పఠనం నిర్వహిస్తారు. అనంతరం ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదం, దేవస్థానం పంచాంగాలను భక్తులకు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. అమలాపురానికి చెందిన వేంపరాల సీతారామ అవధాని, విజయవాడకు చెందిన విశ్రాంత వేద పండితుడు సుందర రామ శ్రౌతిలను సన్మానించనున్నారు. ఉగాది పురస్కారం కింద రూ.ఐదు వేలు నగదు ఇస్తారు. ఆలయ ప్రాకారంలో ఉదయం 11 గంటలకు రథంపై, రాత్రి ఏడు గంటలకు అన్నవరం పుర వీధుల్లో వెండి గజవాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఇక కియోస్క్ సేవలు అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేలా దేవస్థానంలో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను గురువారం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరూర్ వైశ్యా బ్యాంక్ వీటిని విరాళంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. 22న పవర్ లిఫ్టింగ్ పోటీలు అమలాపురం టౌన్: స్థానిక హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో గల జనహిత భవనంలో ఐదవ ఉభయ గోదావరి జిల్లాల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ (మెన్ అండ్ వుమెన్) పోటీలు–2026 జరగనున్నాయని ఆ జిమ్ కోచ్, పోటీల ఆర్గనైజర్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరగనున్న ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ క్రీడాకారుల నుంచి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. ఇష్టారీతిన తవ్వేస్తున్నారు పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్అండ్బీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నూతన పైపులైన్ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్లైన్ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్లైన్ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. -
మతాతీతం.. మరియారాధన..
దేవరపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కొర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1976లో ఏలూరు క్యాథలిక్ పీఠం ఏర్పడింది. అప్పటికే ఏలూరులో బిషప్గా ఉన్న జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం ఆయన కారులో విశాఖపట్నం వెళ్తూ గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురవడంతో అక్కడ దిగి ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ఆయన మనసులో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖకు బయలుదేరారు. గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మాణానికి సంకల్పించి 1979లో ఆలయాన్ని నిర్మించి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు. 1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో అక్కడ ప్రేమసేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న పీఠాధిపతుల రాక ఈ నెల 25న ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయకుమార్ రాయరాల, ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి ఉత్సవాలకు హాజరై సమష్టి దివ్యబలి పూజ నిర్వహిస్తారని జాన్ పీటర్ తెలిపారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు దాతలు, భక్తుల సహకారంతో నిత్యం సుమారు 2 వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు వస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, విశ్రాంతి పందిళ్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు భక్తులు పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. భారీగా రానున్న భక్తులు ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. దీపకాంతుల నడుమ క్రీస్తు శిలువగౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం 2000లో అఖండ దేవాలయ నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో అప్పటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ దిరిసిన ఆరోన్ ఆలయ నిరా్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్థనలు చేసుకునేందురు వీలుగా దేవాలయాన్ని నిర్మించారు. క్షేత్రంలో పలు కట్టడాలను కళాత్మకంగా రూపొందించారు. వంద అడుగుల క్రీస్తు మందిరం నిర్మలగిరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపరిచారు. 22 నుంచి మరియతల్లి పండగ ముస్తాబైన పుణ్యక్షేత్రం అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది వస్తారని అంచనా వివిధ ప్రాంతాల నుంచి {ç³™ólÅMýS BÈtïÜ ºçÜ$ÞË$ ˘ -
జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభం
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. 70 కిలోల గంజాయి స్వాధీనం బాలుడితో సహా ఐదుగురి అరెస్టు రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి సీఆర్సీ ఉగాది నాటిక పోటీలు
రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 26వ సిల్వర్ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తెలిపారు. సీఆర్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ఏడు నాటికలు, సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 26 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తూ నాటికలకు పూర్వ వైభవం తీసుకు రావాలని కృషి చేస్తున్నామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం బాలబాలికల నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అందిస్తారన్నారు. తెలుగు రంగస్థలానికి మణిహారంగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన నటీమణి కె.విజయలక్ష్మిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గురువారం హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ బృందం ‘అమ్మ చెక్కిన బొమ్మ’, కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ బృందం ‘కన్నీటికి విలువెంత’ ప్రదర్శించనున్నారు. శుక్రవారం గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ బృందం ‘సహాన’, విశాఖకు చెందిన తెలుగు కళా సమితి ‘చిటికెన వేలు’, చైతన్య కళా స్రవంతి ‘అసత్యం’, మూడో రోజు 21న కాకినాడకు చెందిన ఎస్వీ రంగారావు కళా స్రవంతి బృందం ‘ఆచమనం’, విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్ బృందం ‘దొందూ దొందే’ నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ‘బంగారు లేడి’ ప్రదర్శించనున్నారు. ప్రతి నాటికకు రూ.25 వేలు పారితోషికం, వివిధ విభాగాల్లో వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సీఆర్సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్న బుజ్జి), కొవ్వూరి నరేష్కుమార్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు, కె.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘సువర్ణ’ బాధితులకు న్యాయం చేయాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అమలాపురం రూరల్: ఏపీ, తెలంగాణలలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఎండీ, డైరెక్టర్లకు కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించినా బాధితులకు న్యాయం జరగలేదని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బుద్ధ విహార్లో జరిగిన ఏజెంట్లు, బాధితుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 2011లో స్థానికంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి 2014 వరకు సుమారు రెండు వేల మంది నుంచి రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారన్నారు. 2015లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.అంకయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు మండలం ఈదరపల్లి పంచాయతీ పరిధిలో రెండు భవనాలు, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో 25 సెంట్ల కొబ్బరి తోట, 8 సెంట్ల ఇంటి స్థలం. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 4 ఏకరాల భూమి, శ్రీకాకుళంలో 10 ఎకరాలు భూమి, తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ ప్రాంతంలో 140 ఎకరాల భూమి. రాజోలు మండలం శివకోడులో వారు నివసిస్తున్న రూ.50 లక్షల విలువైన భవనం, సంస్థ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. కేసు విచారణ సమయంలో సీజ్ చేసిన ఆస్తులను కంపెనీ ఎండీ భూసిం నాగ వెంకట వేణు, డైరెక్టర్లు బినామీ పేర్లతో విక్రయించారు. ఈ కేసులో మార్చి 16వ తేదీన సంస్థ ఎండీ భూసి నాగ వెంకట వేణుకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, డైరెక్టర్లు రాజ్యలక్ష్మికి ఐదేళ్లు, గౌతమికి మూడేళ్ల జైలు శిక్షతో భారీ జరిమానా విధించారు. రూ.వెయ్యి డిపాజిట్ చేసిన బాధితులందరికీ న్యాయం చేయాలని కోర్టు అదేశించిందని, గతంలో కలెక్టర్ సీజ్ చేసిన సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెంట్లు సంఘం ప్రతినిధులు చింతా రత్నం రాజు, జల్లి ప్రసన్నవాణి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం
ఐసీడీఎస్ ఆర్జేడీ సుజాతా రాణి కాకినాడ క్రైం: టీనేజీ గర్భ ధారణలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సుజాత రాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయ ఆవరణలో ఫ్యాబిన్ కన్వెన్షన్లో శాఖ తరఫున పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో టీనేజ్ గర్భ ధారణలు, బాల్య వివాహాల నిర్మూలనపై డివిజినల్ స్థాయి దిశానిర్దేశ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజాత రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి సంభవిస్తోందన్నారు. సరైన లైంగిక విద్య, కుటుంబం వ్యవస్థ, సమాజం పట్ల అవగాహన లేకపోవడం బాలికల భవితను చిదిమేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరకపోతే సిబ్బంది విఫలమైనట్లేనని అన్నారు. సమాజంలో కీలక వర్గాలన్నీ పని చేస్తేనే బాలికలను ఈ దురాగతాల నుంచి రక్షించగలమని సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీడీ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు, అందువల్ల కలుగుతున్న టీనేజీ గర్భధారణలు బాలికల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అవగాహన క్షేత్రస్థాయికి చేరేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులో వివాహం జరిగితే చదువు మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక వెసులుబాటు లోపించడం, జీవితంలో స్వతంత్రత కోల్పోవడం, తల్లీ బిడ్డలకు పోషకాహార లోపం, మాతా శిశు మరణాలు సంభవించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు, వారి ఎదుగుదలలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు వాటిల్లుతాయన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని లక్ష్మి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణమూర్తి, డీసీపీవో వెంకట్, డీఐవో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా అసిస్టెంట్ పీడీ జిలానీ, డీఎస్డీవో గోపికృష్ణ, పారా లీగల్ అడ్వకేట్ హేమ పద్మజ సహా ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, మెప్మా సిబ్బంది, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ, వన్స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుంచి కలెక్టరేట్ వరకూ రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, దివ్యాంగులతో కలిసి ఆమె ప్రయాణించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఉగాది పురస్కారాలకు ఎంపిక రాజమహేంద్రవరం సిటీ/రంగంపేట/రాజమహేంద్రవరం రూరల్: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ… Hsê {ç³MýSsìæ…^ól EV>¨ ç³#Æý‡ÝëP-Æ>-ÌSMýS$ hÌêÏMýS$ ^ðl…¨¯]l ç³Ë$-Ð]l#Æý‡$ G…í³-MýS-Ķæ*ÅÆý‡$. Ñf-Ķæ$-Ðé-yýlÌZ VýS$Æý‡$-ÐéÆý‡… fÇVóS M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ ÒÇMìS AÐéÆý‡$zË$ {ç³§é¯]l… ^ólÝë¢Æý‡$. ÒÇÌZ Æ>f-Ð]l$-õßæ…-{§ýlÐ]l-Æ>-°MìS ^ðl…¨¯]l _{™èl-M>-Æý‡$yýl$ ™éyøk çßæÇ-MýS–çÙ~, ïܰĶæ$ÆŠ‡ M>Æý‡*t-°‹Üt Ð]l…VýSÌS ÔóæQÆŠ‡, Ýëíßæ¡-Ðól™èl¢ MýSÑ™é {ç³Ýë§Šæ, Æý‡…VýS…-õ³-rMýS$ ^ðl…¨¯]l OòÜMýS™èl ÕË$µË$ Ýùíßæ™èl, «§ýl¯]lÅ™èl (§ólѯ]l íÜçÜtÆŠ‡Þ) E¯é²Æý‡$. ˘ డెల్టాలకు నీరు విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిలో గోదావరి తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బుధవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.25 అడుగులు ఉంది. ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓగా ప్రణవ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓగా డాక్టర్ ప్రణవ్ను నియమిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కెనడీ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఆర్వీ సుబ్బారావును విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రిలో పలు అవకతవకల కారణంగా సుబ్బారావును ఆర్ఎంఓ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్ ఉత్తర్వులతో డాక్టర్ ప్రణవ్ ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. చెక్ పోస్టుల ఏర్పాటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకూ 24 గంటలూ రొటేషన్ పద్ధతిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్పోస్ట్లు పనిచేస్తాయన్నారు. రెవెన్యూ, ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్ అధికారులను మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వద్ద నియమించినట్లు చెప్పారు. -
చిన్ని చిన ఆశ!
కపిలేశ్వరపురం: రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగు సంవత్సరాది ఉగాది కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటూ నిరుద్యోగ యువత కూడా ఈ పండగపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. విద్యాశాఖమంత్రి చినబాబు (లోకేష్) ఉగాదికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని చెప్పడమే దీనికి కారణం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 99 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసి తమ చిన్ని ఆశను చినబాబు తీర్చాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా, లేదా, ఒకవేళ ప్రకటించినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారు అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలంటూ ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. అరకొరగా ప్రజలకు అందించి సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటోంది. వాటి లో యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి ఊసే మరిచిపోయింది. కూటమి గొప్పలు చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా యువతను దగా చేస్తూ వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి రాగానే యువతకు చక్కటి భవిష్యత్తు ఇస్తామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పారు. సూపర్ సిక్స్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న లోకేష్.. విద్యాశాఖామంత్రి అయినా కూడా 20 నెలలుగా ఆ విషయం మర్చిపోయారు. ఉద్యోగాలు వచ్చేలోపు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దానికీ అతీగతీ లేకపోగా, ఇప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. అనేక సార్లు ఇలాంటి ప్రకటనలు చేసి వెనుతిరిగిన కూటమి నేతలపై యువతకు ఆశలు సన్నగిల్లాయి. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారోనని యువత ఎదురు చూస్తున్నారు. ఎదురు చూపులు జిల్లాలో విస్తారంగా విద్యా సంస్థలున్నాయి. ఏటా జూనియర్ కళాశాలల నుంచి సుమారుగా 3 వేల మంది, డిగ్రీ కళాశాలల నుంచి 8 వేల మంది, బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సుల్లో 2 వేల మంది ఉత్తీర్ణులవుతున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇస్తామన్న ఉద్యోగాల కోసం సుమారు జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నట్టు విద్యార్థి సంఘాల అంచనా. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని విడుదల చేయాలంటూ ఈ నెల 12న రాజానగరంలోని గోదావరి గ్లోబర్ యూనివర్సిటీ (జీజీయూ) మెయిన్ గేటు వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఫిబ్రవరి 2న అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ఆర్ఎస్యూ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసిన విషయం తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకపోగా, మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 154 మద్యం షాపులు, 19 బార్లు ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వాటిలో అత్యధిక షాపులు జనావాసాల్లోనూ, ఆలయాలు, విద్యాల యాలు, ప్రభుత్వ కార్యాలయాలు సమీపంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2025లో మాదక ద్రవ్యాల కేసులు 52 నమోదయ్యాయి. 2024 ఏడాది డిసెంబర్ 31న ధవళేశ్వరం హైవే సమీపంలో 21 కిలోల గంజాయిని పట్టుకోగా అందులో ధవళేశ్వరం టిడ్కో గృహాలు, మండపేట, నిడదవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన యవత ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో మోసపోతున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగాల ఆశ చూపి ఏడాది కాలంలో రూ.75 లక్షలు కాజేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వంలో మెరుగు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల నియామకం ఉద్యమంలా సాగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వపరం చేసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులను చేసింది. అలాగే జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లుకు గౌరవ వేతనం పేరుతో ఉపాధి కల్పించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జారీ చేసినవే. ఫ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా! ఫ ఎదురు చూస్తున్న యువత ఫ ఉగాదికి ఇస్తామని చినబాబు ప్రకటన ఫ ఏమవుతుందోనని నిరుద్యోగ ఆందోళన ఫ ఇప్పటి వరకూ ఆ హామీ నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంయువతను దగా చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై యువత ఆశలు పెట్టుకుంది. కానీ అధికారం చేపట్టిన 20 నెలలుగా యువతను ప్రభుత్వం దగా చేస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతాం. – సింహాద్రి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్యూ, రాజమహేంద్రవరం -
బైక్లు చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
గోకవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని గోకవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి మీడియా సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం పెద్ద రేలంగిపాడుకు చెందిన కాకూరి స్వామిరెడ్డి దురలవాట్లకు బానిసయ్యాడు. దీంతో బైక్ల చోరీలకు పాల్పడ్డాడు. బైక్లను చోరీ చేసి ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్లి అమ్మకాలు సాగించాడు. వివిధ బైక్ చోరీ కేసులపై నమోదైన కేసు విషయంలో విచారణ నిర్వహించగా గోకవరం ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఏడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు. -
ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సామర్లకోట: వేట్లపాలెం కెనాల్ రోడ్డులో పెట్రోల్ బంకు సమీపాన ఉన్న ప్లాస్టిక్ రీ సైక్లింగ్ చిన్న పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. సమీపాన పెట్రోలు బంకు ఉండటంతో ఏం జరుగుతుందోనని వేట్లపాలెం దుర్గానగర్ కాలనీకి చెందిన ప్రజలు కంటిపై నిద్రలేకుండా గడిపారు. ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదాన్ని గమనించిన కార్మికులు, స్థానికులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో ఉన్న సరకు అగ్నికి ఆహుతైంది. పెట్రోలు బంకు సమీపాన ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమ ఉండటం ఎప్పటికై నా ప్రమాదమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ సంఘటనా ప్రదేశానికి చేరుకొని ప్రమాదానికి కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రాందీ షాపులో బ్రాండ్ మిక్సింగ్ గుర్తింపు సామర్లకోట: పెద్దాపురం సినిమా సెంటర్లోని ఎంఎస్ సాయి వైన్స్లో బ్రాండ్ మిక్సింగ్ జరిగిన్నట్లు గుర్తించామని ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈనెల 15వ తేదీ రాత్రి మద్యం షాపులో తనిఖీలు చేసిన విషయం విదితమే. ఈ మేరకు విస్తృతంగా తనిఖీలు చేసిన అనంతరం వివరాలను ప్రకటించారు. దీనికి సంబంధించి షాపు యజమాని, షాపులో పని చేస్తున్న వ్యక్తులపై కాకినాడ, పెద్దాపురం ఎకై ్సజ్ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. షాపులో అనుమానంగా ఉన్న వివిధ మద్యం బ్రాండ్ సీసాలను స్వాధీనం చేసుకొని రసాయన విశ్లేషణ పరీక్షకు పంపామన్నారు. 108లో మహిళ ప్రసవం చింతూరు: పురుడు నిమిత్తం ఆసుపత్రికి తీసుకువస్తున్న క్రమంలో 108 వాహనంలో ప్రసవమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మదుగూరుకు చెందిన గర్భిణి మడకం సుబ్బమ్మకు పురుటినొప్పులు రావడంతో 108లో చింతూరు ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆశావర్కర్ లక్ష్మి సాయంతో ఈఎంటీ అరుణ ఆ మహిళకు కాన్పు చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డ క్షేమంగా వున్నారని, వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు పైలట్ సురేష్ తెలిపారు. -
ఎక్స్ట్రీమ్గా వంటకాలు
● 75 శాతం స్టీమ్ సిస్టంపైనే వంటకాలు ● 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగం ● భక్తులకు రుచికరమైన భోజనం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి గ్యాస్ సెగ ఆమడ దూరంలో ఉంది. ఈ పథకం 2009లో మొదలై నేటికీ నిరాఘాటంగానే భక్తులకు భోజన వసతి కల్పిస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడిని పాటిస్తూ స్వామి దర్శనానికి తరలివస్తున్న భక్తులందరికీ కడుపునిండా రుచికరమైన వంటకాలతో సిబ్బంది వండి పెడుతున్నారు. కేవలం 25 నిమిషాల్లోనే.. కేవలం 25 నిమిషాల్లోనే 110 కేజీల బియ్యం ఉడికేటట్టుగా ఒకేసారి స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లతో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఆర్వో ప్లాంటు ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. ఈ క్షేత్రంలో అన్నదాన పథకానికి పుష్కర కాలం పైబడి జీడిపిక్కల పొయ్యితో ఏర్పాటు చేసిన స్టీమ్ సిస్టం, ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత నేపథ్యంలో పూర్తిగా కలసి వచ్చింది. కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే వంటలు వండుతున్నారు. తక్కువ సమయంలో అన్నం తయారీ ఇక్కడ స్టీమ్ సిస్టంలో జీడిపిక్కల పొయ్యికి చేరి అంతర్గతంగా ఉన్న నీటి తొట్టెలోని నీళ్లు మరగకాగి తద్వారా వచ్చే స్టీమ్ను గొట్టాలతో స్టీల్ కుక్కర్లలోకి పంపుతున్నారు. జీడిపిక్కల పొయ్యి నుంచి వచ్చే పొగను ప్రత్యేక గొట్టం ద్వారా బయటకు పంపే ఏర్పాటు చేశారు. పిక్కల పొయ్యిపై పప్పును ఉడికించి సాంబారు సిద్ధం చేస్తున్నారు. అలాగే పిక్కల పొయ్యిలపై సలసలా కాగే నీటిలో బంగాళాదుంపలు, ఇతర కాయగూరలు ఉడికిస్తున్నారు. స్టీమ్ ద్వారా ఒక్కో కుక్కర్లో 25 నిమిషాల్లోనే వేడి వేడి అన్నం సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు గ్యాస్ పొయ్యి మీద కంటే త్వరితగతిన స్టీమ్ ద్వారా స్టీల్ కుక్కర్లలో అన్నం క్షణంలో వండి వారుస్తున్నారు. 26 కేజీల బియ్యం కట్ట 150 మందికి చొప్పున సాధారణ రోజుల్లో రెండు వేల మంది భక్తులు, వారాంతపు సెలవుల్లో నాలుగు వేలకు పైబడి భక్తులు భోజనం చేస్తున్నారు. అదే పర్వదినాల్లో పది వేల మందికి భోజనం చేస్తున్నారు. 26 కేజీలు ఉన్న ఒక బియ్యం కట్ట 150 మందికి సరిపోతుంది. ఈ క్రమంలో సాధారణ రోజుల్లో 10 నుంచి 15 కట్టలు, వారంతపు రోజుల్లో 25 కట్టలు, పర్వదినాల్లో 40 కట్టల బియ్యాన్ని వారుస్తున్నారు. కాగా స్టీమ్ సిస్టమ్ ఉండడంతో ఇతర అవసరాలకై రోజుకు రెండు సిలిండర్లు వినియోగిస్తున్నారు. నిత్యాన్నదాన పథకానికి, అర్చకులు స్వామికి నివేదన చేసే ప్రసాదాల తయారీకి ఈ రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలోచన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు మదిలో నాడు మెదిలిన ఈ ఆలోచనను స్థానిక దాతలు, భక్తులు, నాయకులు ప్రోత్సహించారు. లక్ష్మీనృసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ను 2009 అక్టోబరు 28న ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభించిన మొదటి నెల రోజులు జంపన రామరాజు కుమారులు జంపన సత్యనారాయణ రాజు, వెంకట రంగరాజు కలిపి భక్తులకు సొంత విరాళాలతో అన్నదానం అమలు చేశారు. పప్పు, సాంబారు, పెరుగుతో ప్రారంభమైన అన్నదాన పథకం తదనంతరం కూరలు, పచ్చళ్లు, బూరెలు, పులిహోర, పసందైన వంటకాలకు చిరునామాగా మారింది. అంతర్వేది క్షేత్రంలో స్టీమ్పై పనిచేసే స్టీల్ కుక్కర్లు పథకం వద్ద గ్యాస్ పొయ్యిలపై వంటకాల తయారీ ఇరాన్తో అమెరికా– ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా మన దేశానికి రావలసిన చమురు, ఎల్పీజీ దిగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో వాటితో పాటు దేవాలయాల్లో నిత్యాన్నదానాలపైనే ఈ ప్రభావం పడింది. కానీ అంతర్వేది దేవస్థానంలో అధికారులు, నాయకులు పదిహేనేళ్ల ముందు చూపు కారణంగా అన్నదానం ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఆలయానికి గ్యాస్ కొరత లేదు క్షేత్రంలో ప్రస్తుత తరుణంలో గ్యాస్ కొరత లేదు. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరమవుతున్నాయి. నిత్య అన్నదాన పథకానికి, స్వామివారికి నివేదించే ప్రసాదాల తయారీకి రెండు సిలిండర్లు ఉపయోగిస్తున్నాం. నిత్యాన్నదాన పథకానికి గ్యాస్తో సమానంగా స్టీమ్ సిస్టం క్షేత్రంలో కొనసాగుతోంది. భక్తులకు రుచికరమైన భోజనాన్ని వండి పెడుతున్నాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, ఆలయ ఏసీ, అంతర్వేది దేవస్థానం -
ఫ కరుణించమ్మా..
ఫ బోనమెత్తి.. అమ్మకు జైకొట్టి రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ తల్లికి మండలం నలుమూలల నుంచి ఊరేగింపుగా వచ్చిన మహిళలు మంగళవారం బోనాలు ఎత్తుకుని అమ్మకు జైకొట్టి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో వందలాది భక్తులు పాల్గొన్నారు. డప్పువాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకొన్న ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించాన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. – రాజవొమ్మంగి కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో కొలువై ఉన్న ధారాలమ్మ అమ్మవారి బోనాల జాతర మంగళవారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తలపై బోనాలు ధరించి, తుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ధర్మకర్త దొంగల సత్తిబాబు ఆధ్వర్యాన జరిగిన ఈ జాతర సందర్భంగా వేలాది మందికి అన్న సంతర్పణ చేశారు. – తుని రూరల్ -
ఎన్హెచ్ కార్యాలయ భవనం అటాచ్మెంట్
రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొవ్వూరు నుంచి గుండుగొలనుకు ఉన్న మార్గంలో ఈ సంస్థకు ఉన్న మూడు ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ట్రస్టు ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ సమస్య పై చివరకు కోర్టు ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనీ డిక్రీ అమలుకు ఆదేశాలిచ్చింది. దీంతో దివాన్చెరువులో ఆర్ఎస్ నం.560/3లో 2.110 ఎకరాలలో ఉన్న ఎన్హెచ్ కార్యాలయ భవనాన్ని, ప్రాంగణాన్ని అటాచ్మెంట్ (జప్తు వరకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికిగాను ప్రాథమికంగా తీసుకునే చర్య) చేస్తూ, ఎటువంటి క్రయ, విక్రయాలు సాగించడానికి వీలులేదంటూ నోటీసు బోర్డులను కూడా ఏర్పాటుచేశారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
నిడదవోలు: ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న డీవీవీఎస్ శర్మ (50) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామంలో భోజనానికి పాలంగిలో ఇంటికి స్కూటర్పై బయలుదేరారు. ఉండ్రాజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఎదురుగా వస్తున్న యువకుల బైక్, శర్మ స్కూటర్ ఎదురెదురుగా ఢీకొనడంతో శర్మ కిందపడిపోయారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో స్థానికులు, తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. శర్మకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెంటపాడు మండలం నుంచి ఉండ్రాజవరం మండల పరిషత్కు బదిలీపై వచ్చారు. అనతికాలంలోనే మంచి వ్యక్తిగా పేరుపొందిన శర్మ అకాల మరణం జీర్ణించుకోలేనిదని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఎంపీడీవో ఎం.శ్రీనివాసరావు, మానవత ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కటారి సిద్ధార్థరాజు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పలు పంచాయతీల కార్యదర్శులు, ఉద్యోగులు ఆయనను కడసారి చూసేందుకు ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన భార్య, పిల్లల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. బ్రెయిన్స్ట్రోక్తో సీఆర్ఎంటీ.. గంగవరం: మండల విద్యాశాఖ కార్యాలయంలో సీఆర్ఎంటీగా పనిచేస్తున్న దుమ్ముల వరప్రసాద్ (55) బ్రెయిన్స్ట్రోక్తో మృతి చెందాడు. రెండురోజుల క్రితం వరప్రసాద్కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరప్రసాద్ స్వగ్రామం గంగవరం మండలం నెల్లిపూడి. మంగళవారం ఆయన స్వగ్రామం నెల్లిపూడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వరప్రసాద్ మృతికి జిల్లా విద్యాశాఖాధికారి వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి–2 టి.మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.కృష్ణ, మండల అధ్యక్షులు బొజ్జిదొర తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. గుర్తు తెలియని వృద్ధుడు.. రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో అస్వస్థతతో ఉన్న గుర్తుతెలియని వృద్ధుడు స్థానిక ప్రభుత్వాసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని రాజమహేంద్రవరం రైల్వే జీఆర్పీ హెచ్సీ నాగేశ్వరరావు విలేకరులకు తెలిపా రు. సోమవారం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. మృతుడికి సు మారు 70 ఏళ్లు ఉంటాయని, 5.2 అడుగుల ఎత్తు ఉన్నాడని మరే విధమైన ఆధారాలు లభ్యం కాలేదన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91545 78496 నంబర్కు సంప్రదించాలన్నారు. -
నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగ శక్తి పథకంపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో బస్సులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 నుంచి 80 మంది దివ్యాంగులను గుర్తించి రెండు విడతలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక బృందంలోని దివ్యాంగులతో స్థానిక శాసనసభ్యులు సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో కూడా దివ్యాంగులతో సహపంక్తి భోజనం నిర్వహించనున్నట్లు జేసీ వై మేఘా స్వరూప్ వెల్లడించారు. సైకత శిల్పి శ్రీనివాస్కి జీవన సాఫల్య పురస్కారం రంగంపేట: స్థానిక సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ను ఉగాది జీవ న సాఫల్య పురస్కారం వరించింది. హైదరాబాద్ కు చెందిన విపంచి ఫౌండేషన్ ఉగాదిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది. సైకత శిల్ప కళ ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నందుకు శ్రీనివాస్కు అందజేయనుంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ పురస్కారం శ్రీనివాస్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ జ్యూరీ కమిటీ వెల్లడించింది. నవోదయ ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంక్ కరప: నవోదయ ప్రవేశ పరీక్షలో యండమూరు విద్యార్థిని గుబ్బల అవంతిక జిల్లా స్థాయిలో 33వ ర్యాంక్ సాధించింది. యండమూరులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆమె ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష రాసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఈ ర్యాంక్ సాధించిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎ.కామేశ్వరరావు, ఎంఏ అలీమ్ తెలిపారు. అవంతికను సర్పంచ్ మారెళ్ల శివ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
ఏసీబీ ఉచ్చులో రాజవొమ్మంగి ఎస్సై
రాజవొమ్మంగి: స్థానిక ఎస్సై టి.శివకుమార్ మంగళవారం ఏసీబీ ఉచ్చులో చిక్కారు. ఆయన రాజమహేంద్రవరానికి చెందిన అంబటి అఖిల్బాబు అనే వ్యక్తి దగ్గర రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ తెలిపారు. ఎస్సైను అదుపులోకి తీసుకొన్నామని వెల్లడించారు. ఇటీవల రాజవొమ్మంగి శివారు కిండ్ర జంక్షన్ వద్ద రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు వ్యక్తులు రాజవొమ్మంగికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు దాట్ల వెంకటేష్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా ఒకరు పరారీలో వున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా రిమాండ్ అనంతరం ముగ్గురు నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో ఏ–1 ముద్దాయి అయిన అఖిల్బాబు తనపై రౌడీషీట్ ఓపెన్ చేయవద్దంటూ ఎస్సై శివకుమార్తో ఒప్పందం కుదుర్చుకొన్నాడు. అలాగే పరారీలో వున్న ఏ–4 ముద్దాయి ఎ.ప్రసాద్ అనే వ్యక్తి తనపై కేసు లేకుండా చూడాలని కూడా ఒప్పందం జరిగిందని డీఎస్పీ కిశోర్కుమార్ విలేకరులతో అన్నారు. ఈ ఒప్పందం మేరకు నలుగురు నిందితులు కలసి ఇప్పటికే ఎస్సైకు రూ.25 వేల నగదు ఇవ్వగా, మరో 15 వేలు ఇస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో దాదాపు పది గంటల పాటు కాపు కాసిన ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ, సతీష్, భాస్కర్, సిబ్బంది రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ నగదు తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నారు. -
భ్రాంతిభద్రతలపై బెంబేలు
● చారిత్రక రాజమహేంద్రవరంలో శాంతిభద్రతలపై తీవ్ర చర్చ ● వరుస ఘటనలతో ప్రజల ఆందోళన ● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి ● చిరు వ్యాపారులకు ప్రజా ప్రతినిధుల పేర్లతో బెదిరింపులు ● ఓ మ్యారేజ్ కార్యాలయంలోకి ప్రవేశించి దుండుగుల దాడులు సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టు తప్పుతున్నాయా? రౌడీషీటర్ల ఆగడాలు శృతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు.. యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏడాదిన్నర కాలంలో చోటు చేసుకున్న ఘటనలే దర్శనం. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటున్నామని పోలీసులు చెబుతున్నా.. చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇవీ తార్కాణాలు చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ● అద్దె అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ● చిరు వ్యాపారాలు చేసుకునే వారికీ రాజకీయ నేతల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.30ల బన్ను అమ్ముకోవాలన్నా.. రాజకీయ నాయకుల అనుమతులు తీసుకోవాలా..? అని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. కమీషన్లు ఇవ్వని వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులపై బాగా వినిపిస్తున్నాయి. ● తాను ఓ ప్రదేశంలో నిల్చుంటే మా ఆయనను పక్కకు తోసేసి నా మెడపై బ్లేడ్తో దాడి చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ● నగరంలో కూటమికి చెందిన ఓ నేత ఆరు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల పేకాట శిబిరాలపై పోలీసులు చేసిన దాడుల్లో రూ.కోట్లు పట్టుబడినా.. కూటమి నేత కావడంతో బయటకు రాకుండా తొక్కిపెట్టి కేస్ను క్లోజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక గంజాయి, మత్తు మందుల చలామణీ పెరిగిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● ఇటీవల రాత్రి సమయంలో ఓ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలోకి చొరబడి కొందరు దుండగులు వీరంగం సృష్టించినట్టు స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ... ● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దివాన్చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ● ఇటీవల తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసు అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు. ● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కొని పరాయయ్యాడు. ● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్కు సంబంధించిన రీసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది. శాంతి భద్రతలకు ప్రాధాన్యం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. బహిరంగంగా మద్యం తాగేవారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల సరఫరాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. సారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. – డి.నరసింహ కిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి పోలీసులపైనే దాడులు రాజమహేంద్రవరంలో కొన్ని మాసాల క్రితం ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్, హోమ్ గార్డ్ రోడ్డుపై హల్చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కు ని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో... పోలీసు శాఖ ఘటనను సీరియస్గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. బహిరంగంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. రాజమహేంద్రవరంలో బరితెగింపు రాజమహేంద్రవరం నగరంలో రాత్రివేళల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవ పడుతున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరితెగిస్తున్న రౌడీ షీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెరపోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీ షీటర్ల చేతిలో తన్నులు తిన్న సంఘటనలు రాజమహేంద్రవరం వాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. -
30వ తేదీలోగా కమిటీలను పూర్తిచేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి సూచించారు. మంగళవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాలను రోల్మోడల్గా తీసుకుని సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలన్నారు. కమిటీల నిర్మాణానికి కార్యాచరణ, రానున్న రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు కేంద్రంగా పనిచేసేలా రూపొందించిన విధి విధానాలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సంస్థాగత కార్యాచరణను వజ్ర భాస్కరరెడ్డి వివరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలని ఇన్చార్జిలకు తెలిపారు. మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడిరాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాలబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, తోటరామకృష్ణ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
● టీటీడీ ప్రతిష్టను మంటగలిపిన చైర్మన్ నాయుడు ● చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ● శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేయడం అమానుషం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ● రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన రాజమహేంద్రవరం రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, స్వామివారిని కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా భావిస్తారని, అటువంటి ఆలయానికి బీఆర్నాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బీఆర్నాయుడు టీటీడీ ప్రతిష్టను మంటగలిపారన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక మోరంపూడి జంక్షన్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. ముందుగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు టీటీడీకి మచ్చ తీసుకొచ్చారన్నారు. బీఆర్నాయుడు రుణం తీర్చుకోవడానికి ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు కట్టబెట్టారన్నారు. మహిళల పట్ల అతని ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బీఆర్నాయుడును చైర్మన్ పదవి నుంచి తప్పించాలని భక్తులు ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారన్నారు. బీఆర్నాయుడు చంద్రబాబు సొంత మనిషి కావడం వ్లనే విలేకరులు ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. నా దైవం వెంకటేశ్వరస్వామి అని చెప్పే చంద్రబాబు టీటీడీలో సమస్యలు వస్తే బీఆర్ నాయుడును ఎందుకు తప్పించటం లేదన్నారు. టీటీడీనీ ప్రక్షాళన చేసి నాయుడుపై చర్యలు తీసుకోవాలని, శాంతియుతంగా మహిళలు ధర్నా చేస్తే వారిపై దాడి చేయించి, తిరిగి వారిపై కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. బీఆర్ నాయుడుని వెంటనే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ కేసులు పరిపాటి మాజీమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. కానీ అక్కడ పప్పులు ఉడకకపోవడంతో డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివాహేతర సంబంధం విషయంపై విచారణ జరపకుండా, చర్యలు తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో న్యాయం లేదు, శాంతిభద్రతలు క్షీణించాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటం వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో చంద్రబాబు చెలగాటమాడుతున్నారన్నారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలతో టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వివాహేతర సంబంధం బయటపడినప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై చర్యలు తీసుకోవాలని తిరుపతిలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే వారిపై దాడిచేసి, కొట్టి తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం అమానుషమన్నారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్నాయుడుపై ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం ప్రపంచవ్తాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. బీఆర్నాయుడును బర్త్రఫ్ చేయాలి మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ డ్రగ్స్కేసులో పట్టబడ్డ పుట్టామహేష్కుమార్యాదవ్కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజకీయంగా ఉపయోగించుకున్న తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడుపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీల కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు పెరిగిపోయాయన్నారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లితే మాత్రం భక్తులు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసులనాయుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాల బాబు, తోట రామకృష్ణ,, రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకూ పోరాడతాం
ప్రకాశం నగర్: మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదని, పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు ఎరజ్రెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆరవ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ స్టేడియం నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తాడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటలు పని సమయాన్ని పెంచడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంటగ్యాసుపై రూ.60, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ప్రజలు మరిచిపోరన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్రం నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాల్ కార్మిక నాయకులు తమ ఐక్యతను చాటారు. ఈ బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షుడు అసుల రంగనాయకులు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసు రత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణరావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. -
వరిలో నకిలీలలు
కోరుకొండ: వ్యవసాయ రంగంలో రైతన్నకు నానాటికీ కష్టాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో రైతు దగాకు గురవుతూనే ఉన్నాడు. విత్తన కంపెనీల కారణంగా నష్టాలపాలు కావాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతమైన గోకవరం, సీతానగరం మండలాల్లో విత్తన కంపెనీల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో 330 మంది రైతులు, 1,150 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు అగ్గితెగులు సోకింది. ఖరీఫ్ సాగులో దిగుబడి తగ్గడంతో రబీసాగుపై నమ్మకం పెట్టుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. కార్పొరేట్ విత్తన కంపెనీల రూపంలో రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వ్యవసాయశాఖ కోరుకొండ సబ్–డివిజన్లో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలున్నాయి. ఈసబ్ డివిజన్లో 10,150 మంది రైతులు రబీ సీజన్లో 21,526 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. కాగా కోరుకొండ మండలంలో 5,621 ఎకరాలు, సీతానగరం మండలంలో 11,022 ఎకరాలు, గోకవరం మండలంలో 4,883 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే అగ్గితెగులు కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెదుతున్నారు. గింజ పెరిగే దశలోని చేలల్లో, పుష్పగుచ్ఛానికి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు. దీంతో తాలు, తప్ప గింజలు మాత్రమే రైతులకు దక్కుతాయని గగ్గోలు పెడుతున్నారు. ఈకారణంగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఇటీవల వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫిర్యదు చేశారు. విత్తన దుకాణాల కారణంగానే నష్టపోయినట్టు రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. శాస్త్రవేత్తలకు పంపాం గోకవరం, సీతానగరం మండలాల్లోని రైతుల ఫిర్యాదు మేరకు విత్తనాల విషయమై శాస్త్రవేత్తలకు ఫిర్యాదులను పంపాము. వారు వచ్చి పంటపొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ధారణ చేస్తారు. అలాగే సమస్యను వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్య నిర్దిష్టంగా తంటికొండ, గాదెలపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అగ్గితెగులు కారణంగా ఆశించినంత దిగుబడి రాదు. తాలు, తప్పలు మాత్రమే వస్తాయి. – డి.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ ఏడీ, కోరుకొండ నకిలీ విత్తనాలే కారణమంటున్న రైతులు గోకవరం, సీతానగరం మండలాల్లో 1,150 ఎకరాల్లో పంట నష్టం పొలాలను పరిశీలించిన అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఫిర్యాదు -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం (విశాఖ): విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ.కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జేఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తూ మరణించిన ఆరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని, సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఎ.శ్రీనివాస్, ఎల్.అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్కు సీఐ రాంబాబు నల్లజర్ల: స్థానిక సీఐ వై.రాంబాబు వీఆర్కు వెళ్లారు. ప్రసుత్తం ఆ బాధ్యతలను దేవరపల్లి సీఐ నాగేశ్వరావునాయక్కు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలు రావడం, పోవడం పరిపాటిగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారనే విషయం స్థానికులకు సైతం తెలియకుండా పోయింది. అపుడే దాదాపు ఐదారుగురు సీఐలు, పది మందికి పైగా ఎస్ఐలు మారుతూనే ఉన్నారు. కారణం ఏమిటో తెలియడం లేదని స్ధానికులు అంటున్నారు. కోడిపందాలు, పేకాటలు, జూదాలు, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియా అన్నీ ఈ మండలంలోనే ఉన్నాయి. వీటన్నింటిని చూసీచూడనట్టు ఉంటేనే ఇక్కడ ఏ అధికారి అయినా ఉద్యోగం చేయగలుగుతారు. లేకుంటే మర్నాడే వేరే చోటికి బదిలీ కావాల్సిందేనన్న విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. ప్రస్తుత సీఐకు కూడా ఈవిధంగానే వీఆర్ జరిగిందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. సీఐ వీఆర్కు వెళ్లిన సంగతి ఇంతవరకు గోప్యంగానే ఉంది. పాఠశాలలో శిలాఫలకం ధ్వంసం ముమ్మిడివరం: కొమానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో సుమారు రూ.50 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటణకు కారకులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాయలం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న టి.గణేష్బాబును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్రిజిస్ట్రార్గా నియమించారు. కాకినాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసమూర్తిని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సబ్రిజిస్ట్రార్గా నియమించారు. -
దర్జాగా నీటి చౌర్యం
తాళ్లరేవు: నీటి అవసరాలు పెరిగిపోవడంతో అక్రమార్కులు భూగర్భ జలాలను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో నీటిని నిత్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థల అవసరాల కోసం భూగర్భ జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహదారుల చెంతన బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పలుచోట్ల అనధికారికంగా బోర్లను వేసి నీటిని యథేచ్ఛగా తోడుతున్నారు. నిత్యం లక్షలాది లీటర్ల నీటిని తోడి తరలిస్తుండడంతో భూగర్భజలాల స్థాయి పడిపోతుందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, పోలేకుర్రు తదితర పంచాయతీల్లో రహదారుల చెంతన బోర్లను వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో పట్టి కంపెనీలకు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా మండల అధికారులుగాని, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతుల్లేకుండా ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో తరలింపు పట్టించుకోని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న మంచినీటి బోర్లు అడుగంటుతున్న భూగర్భజలాలు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధవళేశ్వరం: స్థానిక ప్రధాన రహదారి శాంతారామ్ హాస్పిటల్ సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరు మండలానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బేబీ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకకు చెందిన భార్యాభర్తలు యర్రంశెట్టి శ్రీనివాస్, బేబి గ్రామంలో త్వరలో జరగనున్న ఉత్సవాలకు కొత్తబట్టలు కొనుక్కునేందుకు సోమవారం షాపింగ్కు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ధవళేశ్వరం శాంతారామ్ హాస్పిటల్ సమీపానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మృతుని భార్య బేబిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బేబి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఆటోపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు మందు జల్లి ఆభరణాలు చోరీ!
నల్లజర్ల: హైదరాబాద్ నుంచి నల్లజర్ల మండలం పోతవరానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ప్రయాణికురాలిపై అర్ధరాత్రి మత్తుమందు జల్లి ఆమె బ్యాగులో ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరగ్గా బాధితురాలు గద్దె భారతిలక్ష్మి మార్చి 2న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతవరంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పోతవరానికి చెందిన గద్దె భారతీలక్ష్మి ఫిబ్రవరి 20న హైదరాబాద్లో బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు గద్దె భారతీలక్ష్మి, బంధువు కరుటూరి నాగశిరోమణి కలసి 28న రాత్రి ఏయస్బీఆర్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. డ్రైవర్ వెనుక ఉన్న స్లీపర్లో వీరద్దరూ పడుకున్నారు. రాత్రి పడుకునే ముందు భారతీలక్ష్మి ఫోన్ బ్యాగ్లో పెట్టేటప్పుడు అందులో ఉన్న బంగారు ఆభరణాలు సరిచూసుకున్నారు. బస్సు ఎక్కడా ఆగలేదు. పోతవరం వచ్చాక బంధువులకు ఫోన్ చేసేందుకు బ్యాగులో చేయిపెడితే నగల ఆచూకీ లేదు. తలదగ్గర పెట్టుకున్న బ్యాగు పెట్టుకున్నట్టే ఉంది. కానీ అందులో నగలు లేవు. దీంతో కంగారు పడి బంధువులకు ఫోన్చేసి చెప్పారు. బస్సు ప్రయాణంలో తన నగలు బంగారు నెక్లెస్, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు మొత్తం 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్టు భారతీలక్ష్మి ఫిర్యాదు చేశారు. బస్సు సిబ్బందే తమపై మత్తుమందు చల్లి ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు పోలీసులు విచారణ చేపట్టక పోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. దీనిపై నల్లజర్ల ఎస్ఐ ఆంజనేయబాబును వివరణ కోరగా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అందుకే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో పాటు భారతీలక్ష్మితో పాటు ప్రయాణించిన 15 మంది ప్రయాణికులను విచారించామని ఈరోజు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. -
పొట్టి శ్రీరాములుకు నివాళి
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): భాషా రాష్ట్రం సాధన కోసం ఆత్మత్యాగం చేసిన మహోన్నతుడు పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ కీర్తి కొనియాడారుయ. కలెక్టరేట్లో సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ పాల్గొన్నారు. నేడు వైఎస్సార్ సీపీ నిరసన రాజమహేంద్రవరం రూరల్: మోరంపూడి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన దాడికి నిరసనగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసనాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పార్టీ నాయకులు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వేణుగోపాలకృష్ణ కోరారు. ‘నన్నయ’లో విద్యార్థులకు షార్ట్ టర్మ్ శిక్షణ రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 45 గంటల వ్యవధితో కూడిన షార్ట్ టర్మ్ కోర్సును వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సోమవారం ప్రారంభించారు. హార్ట్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ లో ఈ నెల 25 వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 10 రోజులపాటు ఈసీఈ, ట్రిబుల్ ఈ విద్యార్థులకు యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్లేస్మెంట్ అధికారి ఆచార్య బి.జగన్మోహన్రెడ్డి, ఏపీఎస్ఎస్డిసీ అధికారి డాక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి, హార్డ్వేర్ అండ్ నెట్ వర్కింగ్ ట్రైనింగ్ ఇన్చార్జి మహేష్ పాల్గొన్నారు. 33 పోస్టులకు 452 దరఖాస్తులుకాకినాడ క్రైం: గత ఏడాది డిసెంబర్ 15న రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్, అల్లైడ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం పది కేటగిరీల్లోని 33 పోస్టులకు 452 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పొందుపరిచామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు apego@nic. in, rmckakinada.com వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన మెరిట్ లిస్టులో తమ పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీ వరకూ కళాశాల పని దినాల్లో స్వీకరిస్తామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. -
పదినిసలు మొదలు
● ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం ● 24,166 మంది విద్యార్థుల హాజరు ● 258 మంది గైర్హాజరు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే సందడి వాతావారణం, విద్యార్థులు, వారిని తీసుకువచ్చిన తల్లిదండ్రుల హడావుడి కనిపించింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల హాల్ టిక్కెట్ల నంబర్ ఆధారంగా బోర్డుపై రూమ్ నంబర్లు వెతుక్కోవడం, పరుగు పరుగున కేంద్రాల వద్దకు రావడం వంటి దృశ్యాలు కనిపించాయి. తొలి రోజు తెలుగు పరీక్షను 24,424 మంది రాయాల్సి ఉండగా 24,166 మందే హాజరయ్యారు. 258 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 138 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. కలెక్టర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లా స్థాయి పరిశీలనాధికారులు 7 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి 4 కేంద్రాలు, పరీక్షల విభాగానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, మంగళగిరి ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంయుక్తంగా జిల్లాలోని 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 69 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. మొత్తం 88 పాఠశాలలను అధికారులు తనిఖీ చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరిసరప్రాంతాల్లో జిరాక్స్ దుకాణాలను మూయించివేశారు. 26 పరీక్షా కేంద్రాల్లో ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సీ, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 2,392 మంది విద్యార్థులు హాజరుకావాల్సివుండగా 1,833 మంది రాశారు. 559 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉర్దూ పరీక్ష ఇద్దరు విద్యార్థులు రాయాల్సివుండగా ఇద్దరూ హాజరయ్యారు. ఒరియా పరీక్ష ఒకరు రాయాల్సి వుండగా ఆ విద్యార్థి రాలేదు. -
నవదిన జపాలు ప్రారంభం
దేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో పండగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్రంలోని కొండపైన గల ఏసు క్రీస్తు ఆలయం వద్ద సోమవారం మేరీమాత పతాకాన్ని ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ప్రకాష్ సంగిలి ఆవిష్కరించి పండుగ కార్యక్రమాన్ని ప్రకటించారు. అనంతరం జపమాల ధ్యానం, గురువులతో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 25 వరకు పుణ్యక్షేత్రంలో నవదిన జపాలు, దివ్యబలిపూజ, జపమాల ధ్యానం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఏలూరు బిషప్ జయరావు పొలిమెర మాట్లాడుతూ ఆధ్యాత్మికతకు ప్రేరణ జెండా ఆవిష్కరణ అని అన్నారు. ఏటా నిర్మలగిరి మేరీ మాత్ర ఉత్సవాలకు ముందుగా మేరీమాత పతాకావిష్కరణ జరుగుతుందని చెప్పారు. పతాకావిష్కరణ పండుగకు సూచిక కాదని చెప్పారు. ఇది ఓ ఆధ్యాత్మిక ప్రకటన అని అన్నారు. మరియతల్లి ఈ ప్రాంతంలో ఉందని ఆయన అన్నారు. ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి మాట్లాడుతూ మరియతల్లి పూజా ఆరాధనల ద్వారా ప్రజావళిని, మేత్రాసులను అత్యధికంగా దీవించాలని ప్రార్థించారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల, పలువురు గురువులు, మేత్రాసన కౌన్సిల్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, నిర్మలగిరి వికారియేట్ గురువులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించిన బిషప్ జయరావు పొలిమెర సమష్టి దివ్యపూజల బలి నిర్వహించిన పీఠాధిపతులు -
మళ్లీ ధరద్రం!
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026దేవరపల్లి: కోకో గింజల ధర పతనమైంది. మొన్నటి వరకు కిలో గింజలు రూ.350 నుంచి రూ.400 ధర పలుకగా, ప్రస్తుతం రూ.170 నుంచి రూ.270 పలుకుతోంది. దీంతో రైతులు కోలుకోలేక విలవిలలాడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. కంపెనీలు సిండికేట్ కావడం, గిట్టుబాధ ధర ఇవ్వకపోవడం, అన్నింటి కంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోకో రైతులు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 2023–24 పంట కాలంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కోకో పంట రైతుల ఇంట కాసులు కురిపించింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడం, కిలో గింజల ధర రూ.1,050 పలకడంతో కోకో పండించిన రైతుల పంట పండింది. ఆ ఏడాది ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు దిగుబడి రావడంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల ఆదాయం వచ్చింది. కొంతమంది రైతులు రూ.కోటికి పైగా ఆదాయం పొందారు. దీంతో కౌలు దారులు తోటల కోసం ఎగబడ్డారు. ఉన్న కొద్దిపాటి తోటలతో పాటు మరికొన్ని ఎకరాలను కౌలుకు తీసుకుని 2024–25 సంవత్సరంలో రైతులు సాగు చేశారు. అయితే దిగుబడులు తగ్గడంతో పాటు, మార్కెట్లో ధర తగ్గింది. ఓ దశలో గింజలు కొనే నాథుడు లేకుండా పోయాడు. కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడ గింజలు అక్కడే ఉండిపోయాయి. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించి, చంద్రబాబు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయడంతో కొనుగోళ్లు నిర్వహించారు. కంపెనీలు కిలో గింజలు రూ.450కు కొనుగోలు చేయగా, ప్రభుత్వం మరో రూ.50 ఇచ్చి రైతులకు కిలో రూ.500 చొప్పున చెల్లించింది. దిగుబడులు తగ్గడం, ధర పతనం కావడంతో ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు రైతులు నష్టపోయారు. ఎకరం కౌలు రూ.1.25 లక్షలు కాగా, పెట్టుబడి మరో రూ. 60 వేలు అయింది. దీంతో గత ఏడాది రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. సాగు వివరాలు జిల్లాలో సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు ఉత్పత్తి లక్ష్యం 531 మెట్రిక్ టన్నులు సాగు రైతులు 1,565 మంది రైతు సంఘాల డిమాండ్లు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధర ఇవ్వాలి పండించిన పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేయాలి రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలి వెంకట్రామన్నగూడెంలో కోకో పరిశోధనా కేంద్రం నెలకొల్పాలి కంపెనీల సిండికేట్ విధానాన్ని అరికట్టాలి MóS…{§ýl, Æ>çÙ‰ {糿¶æ$™éÓË$ OÆð‡™èl$-ÌS¯]l$ ˘ ఆదుకోవాలి పతనమైన కోకో గింజల రేటు కోలుకోలేని స్థితిలో రైతు కిలో రూ.270 ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి సాగు వ్యయం రూ.2 లక్షలు ఆదాయం రూ.54 వేలే నష్టం రూ.1.46 లక్షలు 13,500 ఎకరాల్లో సాగు గొల్లుమంటున్న రైతులురైతుల్లో చైతన్యం రావాలి కోకో రైతుల్లో చైతన్యం రావాలి. మంచుకు పూతలు మాడిపోయాయి. కొత్త పూతలు లేవు. ఎకరాకు రెండు క్వింటాళ్లు దిగుబడి రావడం కష్టం. కౌలు రైతులు గొల్లుమంటున్నారు. నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరాకు కౌలు రూ.1.25 లక్షలు, పెట్టుబడి రూ.80 వేలు అయింది. ఆదాయం రూ.54 నుంచి రూ.60 వేలు వస్తోంది. ఎకరాకు సుమారు 1.50 లక్షలు నష్టం వస్తుంది. కోకో రైతుల మొరను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రైతుల్లో చైతన్యం వస్తేనే గాని సమస్యకు పరిష్కారం దొరకదు. – ఉప్పల కాశీ, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కోకో రైతు సంఘం, కోరుమామిడి, నిడదవోలు మండలం కొనే నాథుడు లేడు కోకో గింజలు కొనే నాథుడు లేడు. ఎక్కడ గింజలు అక్కడే ఉన్నాయి. కంపెనీలు రావడంలేదు. ఒకే కంపెనీ ప్రతినిధులు వచ్చి నచ్చిన గింజలు అక్కడక్కడా కొంటున్నారు. చిన్న రైతులను పట్టించుకోవడం లేదు. గింజలు బాగుంటే కిలో రూ.300కు కొంటున్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదు. కిలో రూ.600 ధర ఇస్తే రైతుకు పెట్టుబడులు వస్తాయి. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలి. – కొయ్యలమూడి వేణు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం కోలుకోవడం కష్టం ఈ ఏడాది కోకో రైతులు కోలుకోవడం కష్టం. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మార్కెట్ ఉంటుంది. వేసవిలో పండిన గింజలకు డిమాండ్ ఉంటుంది. రెండేళ్లుగా కోకో గింజలు అమ్ముకోవడానికి రైతులు నానావస్థలు పడుతున్నారు. రైతుల మొర చంద్రబాబు ప్రభుత్వానికి వినిపించడం లేదు. – గడా రాంబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం పూతలకు దోమపోటు కోకో పూతలకు దోమపోటు తగిలింది. తోటలకు తెల్లదోమ వ్యాపించడం, మంచు ఎక్కువగా కురవడంతో పూతలు దెబ్బతిన్నాయి. పూతలు మాడిపోవడంతో కాపులు తగ్గాయి. జిల్లాలోని రైతులు కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది కౌలు దారులున్నారు. మార్కెట్ బాగుంటే ప్రధాన పంట కంటే కోకోకు ఎక్కువ ఆదాయం వస్తుంది. 2023–24లో మార్కెట్ బాగుండి నాలుగు డబ్బులు మిగిలాయి. 2022–23 పంట కాలంలో కిలో గింజలు రూ.250 నుంచి రూ.275 ధర ఉండగా, 2023–24 సీజన్లో ఊహించని విధంగా మార్కెట్లో ధర పలికింది. 2024–25 పంట కాలంలో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ప్రస్తుత పంట కాలంలో ధరతో పాటు దిగుబడులు లేక విలవిలలాడుతున్నారు. ఎకరాకు 2 క్వింటాళ్లు రావడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు దెబ్బకు పూతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు పండించిన కోకో గింజలను క్యాడ్బరీ సంస్థ ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. -
పీజీఆర్ఎస్లో 241 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 241 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఆర్ఓ సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ను ఎస్పీ డి.నరసింహాకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. -
చక్కటీ సంరక్షకా..
● వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ తప్పనిసరి ● క్రమం తప్పకుండా వేయిస్తే మేలు ● నేడు జాతీయ టీకా దినోత్సవంకపిలేశ్వరపురం/ నల్లజర్ల: వ్యాధుల నుంచి జీవితాంతం రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి.. గర్భిణుల నుంచి అప్పుడే పుట్టిన చిన్నారులకూ ఆయా టీకాలు, వ్యాక్సిన్లు వేస్తే వ్యాధులు దరిచేరవు. 11 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి టీకాలు చిన్నారులను కాపాడతాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం మాతా, శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వివిధ రకాల టీకాలను అందిస్తోంది. గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు నిర్ధేశించిన టీకాలు తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే లక్ష్యంతో 90 రోజుల పాటు హెచ్పీవీ వ్యాక్సినేషన్ను చేపట్టింది. సోమవారం జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. వ్యాక్సిన్ ఇలా.. ● గర్భిణిగా నిర్ధారణ అయిన 3 నెలల తర్వాత టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి. నెల రోజుల వ్యవధిలో మరోసారి టీటీ ఇంజెక్షన్ చేయాలి. వీటితో పాటు ఐరన్, పోలిక్, కాల్షియం ట్యాబ్లెట్లు అందించాలి. ● చిన్నారులకు 9 నెలల నుంచి 12 నెలల వ్యవధిలో తట్టువ్యాధి రాకుండా మీజిల్స్, కంటి, చర్మ వ్యాధులు రాకుండా విటమిన్–ఏ చుక్కలు వేయించాలి. ● 16 నెలల నుంచి 24 నెలల వయసులో బూస్టర్ డోస్ టీపీటీ, మీజిల్స్, విటమిన్–ఏ ఓపీ వేయించాల్సి ఉంటుంది. ● ఐదేళ్లు పూర్తయిన తర్వాత డీపీటీ డోసు వేయించాలి. ● 10– 16 ఏళ్లు పూర్తయితే టెటనస్ టెక్సాయిడ్ (టీటీ) చేయించాలి. గర్భిణులకు ఎఫ్సీఎం ఇంజెక్షన్ ఏటా ఒక్కో జిల్లాలో సుమారు 20 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత నివారణ కోసం ఇంతకు ముందు ఐరన్, సుక్రోజ్ టీకాలు వేసేవారు. వాటి స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్రిక్ కార్బాక్సీ మల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్ ఉచితంగా ఇస్తున్నారు. దీనిని రెండు సార్లు వేస్తే గర్భిణులు రక్తహీనత నుంచి బయట పడతారు.మచ్చుకు కొన్ని టీకాలు బీసీజీ: క్షయ వ్యాధి నివారణకు పుట్టిన 24 గంటల్లోపు 0.05 ఎంఎల్, నెల దాటిన పిల్లలకు 0.1 ఎంఎల్ మోతాదులో బీసీజీ టీకా వేస్తారు. హెపటైటిస్–బి: పచ్చ కామెర్ల వ్యాధి నివారణ కోసం పుట్టిన 24 గంటల్లోపు 0.5 ఎంఎల్ మోతాదులో వ్యాక్సిన్ ఇస్తారు. ఓపీవీ: పోలియో వ్యాధి నివారణకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ను పుట్టిన సమయంలోనూ, 6, 10, 14 వారాలు, ఏడాదిన్నరకు చుక్కల రూపంలో నోటి ద్వారా వేస్తారు. రోటా వైరస్: పిల్లల్లో నీళ్ల విరేచనాల నివారణకు రోటా వైరస్ వ్యాక్సిన్ను 6, 10, 14 వారాల్లో ఐదేసి చుక్కల చొప్పున నోటి ద్వారా వేస్తారు. బాలికలకు హెచ్పీవీ టీకా క్యాన్సర్ బాధితుల్లో 60 శాతం మంది మహిళలు ఉంటున్నారు. గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 14–15 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకాను ఉచితంగా వేస్తుంది. 2011 మార్చి 1 నుంచి 2012 ఫిబ్రవరి 28 లోపు పుట్టిన బాలికలు అర్హులు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాష్ట్రంలో, మార్చి 10న ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం మూడు నెలల పాటు కొనసాగనుంది. సీహెచ్సీ, పీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, అదనపు జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో బుధ, శనివారాల్లో వ్యాక్సిన్ల కార్యక్రమాల్లో కూడా హెచ్పీవీ వ్యాక్సిన్ వేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 13,964 బాలికలకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 10,989, కాకినాడ జిల్లాలో 15,413, మంది బాలికలకు టీకాలను వేయాలన్నది లక్ష్యం. కాకినాడ జిల్లాకు 7,922, కోనసీమకు 4,912, తూర్పుగోదావరి జిల్లాకు 7,688 డోసులు అందుబాటులో ఉన్నాయి. బాలికలు ఏదైనా తిన్న తర్వాతే టీకా వేయించుకోవాలి. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి, ఫోన్కు వచ్చిన ఓటీపీ ద్వారా నిర్ధారణ చేసుకుని టీకా వేసి ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న సర్టిఫికెట్ ఇస్తారు. టీకా వేశాక కొద్దిపాటి జ్వరం రావొచ్చు. -
ఐక్యత చాటేందుకు క్రీడలు దోహదం
కాకినాడ క్రైం: ఐక్యత చాటేందుకు క్రీడలు దోహదపడతాయని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విశ్రాంత వీసీ, రాష్ట్ర విశ్రాంత డీఎంఈ డాక్టర్ కోరుకొండ బాబ్జీ అన్నారు. ఆదివారం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల మైదానంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ క్రికెట్ మెన్స్ పీజీల టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ పర్యవేక్షణలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకకు డాక్టర్ బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోరాహోరీగా తలపడిన తుది పోరులో తిరుపతికి చెందిన శ్రీవెంకటేశ్వర మెడికల్ కాలేజ్ బృందం విజేతగా నిలువగా, కాకినాడ రంగరాయ టీమ్ రన్నర్ స్థానం దక్కించుకుంది. కర్నూలు వైద్య కళాశాల, అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలు మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం ముగింపు వేడుకల్లో డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, విద్యార్థుల మధ్య దూరాల్ని చెరపి, ఐక్యత పెంచేందుకే యూనివర్సిటీ క్రీడలు నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 20కి పైగా కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు రంగరాయ ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన టోర్నమెంట్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎంసీ పీడీ గొల్లపల్లి లక్ష్మణరావు సహా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ త్రిమూర్తి, ఆర్ఎంసీ మెడికో వలంటీర్లు ఎం.మోహన్ అప్పారావు, ఎస్కే మౌలాలి, యశ్వంత్, వినయ్, వసుధ, సాయి శ్వేత, శ్వేత, హర్షిణి తదితరులను డాక్టర్ విష్ణువర్థన్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీఎస్ ముఖర్జీ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శశి తదితరులు పాల్గొన్నారు. -
అభ్యుదయ కవిత్వం అవసరం
అంబాజీపేట: కవులు సామాజిక చైతన్యం, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. ఆదివారం అంబాజీపేట పెద్ద వీధిలోని ఏవీఆర్, యర్రాప్రగడ సూర్య ప్రకాశరావు కల్యాణ మండపంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 165వ శతాధిక కవి సమ్మేళనం జరిగింది. చైతన్య సారస్వత పరిషత్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ నేటి సమాజంలోని కవులు అక్షర శిల్ప నైపుణ్యంతో కవితాత్మకంగా వాస్తవ రూప వైవిధ్యం చూపించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సామాజిక అభివృద్ధికి సహాయపడే సాహిత్యమంతా అభ్యుదయ సాహిత్యం అవుతుందన్నారు. అంబాజీపేట గురజాడ సేవా సమితి అధ్యక్షుడు అరిగెల బలరామమూర్తి మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక జాతీయ స్థాయిలో 165వ కవి సమ్మేళనం నిర్వహించి, తెలుగు సాహిత్య చరిత్రలో కొత్త చైతన్యంతో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ తెలుగు సాహిత్యానికి వెలుగు నింపుతున్నారన్నారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్థసారథి మాట్లాడుతూ సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితల సాధన చేయాలన్నారు. ఏపీ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ రత్నకొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి దంపతులు మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక సీఈఓ ప్రతాప్ చేస్తున్న సేవలను కొనియాడారు. జిల్లా కన్వీనర్ బీవీవీ సత్యనారాయణ, వెంకట్ పొలమూరితో పాటు సుమారు 150 మంది కవులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. అనంతరం కిమ్స్ వైద్య కళాశాల వైస్ చైర్మన్ మోహన్రాజు, వీఆర్వో రాధామనోహర్లను ప్రతాప్, కొండ నరసింహారావు, కావూరి శ్రీనివాసశర్మ ఘనంగా సన్మానించారు. జాతీయ శతాధిక ఉగాది కవి సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొన్న సుమారు 150 మంది కవులు ఉగాది కవి సమ్మేళనంలో తమ కవితల ద్వారా అక్షర విందును అందించారు. కళావేదిక అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, పేరి కామేశ్వరరావు, నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. -
క్రమం తప్పకుండా వేయించాలి
పుట్టినప్పటి నుంచి నిర్దేశించిన సమయాల్లో చిన్నారులకు టీకాలను వేయడం ద్వారా వారిని ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోగలం. ఎప్పుడెప్పుడు ఏ ఏ టీకాలు వేయాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలు ముందుగానే చెబుతారు. వాటిపై పిల్లల సంరక్షకులు అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా టీకాలను వేయిస్తుండాలి. – డాక్టర్ బీవీవీ సత్యనారాయణ, కోనసీమ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అవగాహన కల్పిస్తున్నాం చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. వీటివల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు టీకాలపై వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – టి.గంగాధరరావు, పీహెచ్సీ వైద్యుడు, నల్లజర్ల● -
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్
● అన్నయ్య మృతి, చెల్లెలితో పాటు పిల్లలకు తీవ్ర గాయాలు ● మొండెపులంక వద్ద ఘటనపి.గన్నవరం: మోటారు సైకిల్ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో అన్నయ్య మృతి చెందగా, చెల్లెలితో పాటు ఆమె ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలు కాగా, కుమార్తె సురక్షితంగా బయటబడింది. ఆ ఐదుగురూ మోటారు సైకిల్పై పి.గన్నవరం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. పి.గన్నవరం శివారు చింతపల్లి వారిపేటకు చెందిన చింతపల్లి శ్రీలక్ష్మి ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె సోదరుడు నగరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బళ్ల సురేంద్ర కుమార్ (45) ఈ నెల 13న చెల్లెలు ఇంటికి వచ్చాడు. శ్రీలక్ష్మిని, ఆమె కుమారులు అభినయ్ (10), అవినాష్ (6), కుమార్తె లహరిలను నగరం గ్రామంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. సోమవారం పిల్లలను పాఠశాలకు పంపాలన్న ఉద్దేశంతో చెల్లెలు శ్రీలక్ష్మి తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో సురేంద్ర కుమార్ ఆదివారం సాయంత్రం చెల్లెలిని, పిల్లలను నగరం నుంచి మోటారు సైకిల్పై పి.గన్నవరం తీసుకు వస్తున్నాడు. మొండెపులంక శివారు జొన్నల్లంక ప్రాథమిక పాఠశాల సమీపంలో చాకలిపాలెం వైపు వెళ్తున్న ట్రాక్టర్ వీరి మోటారు సైకిల్ను ఎదురుగా వచ్చి ఢీకొంది. సురేంద్ర కుమార్కు ట్రాక్టర్ తగిలి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీలక్ష్మి, అభినయ్, అవినాష్ల కుడికాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లహరి స్వల్ప గాయాలతో బయటపడింది. వీరి వెనుక మోటారు సైకిల్పై వస్తున్న మరో నలుగురు వ్యక్తులు కూడా ప్రమాదానికి గురయ్యారు. అయితే వారిలో నాలుగేళ్ల పాప తుప్పల్లో పడిపోవడంతో ఆమెకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని క్షత గాత్రులను అంబులెన్స్లో స్థానిక సీహెచ్సీ తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం తల్లీ, ఇద్దరు కుమారులను వేర్వేరు అంబులెన్స్ల్లో అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద బంధువుల రోదన రోడ్డు ప్రమాదంలో నగరం గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ మృతితో పి.గన్నవరం సీహెచ్సీ వద్ద అతని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి భార్య వరలక్ష్మి ఐదు నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. అతనికి కుమారుడు భానుప్రకాష్, కుమార్తె శిరీష ఉన్నారు. ఆస్పత్రి వద్ద కుమారుడు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతుడి భార్య వరలక్ష్మి భర్తను కడసారి చూసేందుకు అవకాశం ఉంటుందో లేదోనని బంధువులు వాపోతున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన చెల్లెలు శ్రీలక్ష్మికి అన్న మరణించాడన్న విషయం తెలియదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న శ్రీలక్ష్మి అన్నయ్యకు ఎలా ఉందని అడిగిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. -
కవర్ ఫుల్గా..!
కట్టెల పొయ్యిలు మళ్లొచ్చాయి. గ్యాస్ కొరత పుణ్యమాని ఆ పొయ్యిలతో వంటలు చేసే పరిస్థితి ఎదురైంది. ఇంటా బయటా అదే దుస్థితి. గతంలో అన్నదానాలకు గ్యాస్ పొయ్యిలే వాడేవారు. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలో ఇలా కట్టెల పొయ్యిలు వాడుతూ అవస్థలు పడ్డారు. హోటళ్లలో గ్యాస్ కొరత కారణంగా మూసి వేస్తున్నట్లు బోర్డులు పెట్టారు. మరోపక్క కర్రీ పాయింట్లలో రూ.10 ఉండే కూర అమాంతంగా పెంచేసి రూ.25కు విక్రయిస్తున్నారు. – పిఠాపురం ఏకే మల్లవరంలో అన్నదానానికి కట్టెల పొయ్యిలపై వంటలుమామిడి పండ్లను ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటేనే చీడపీడల నుంచి రక్షణ పొందవచ్చు. అచ్చం అలానే కొత్తపల్లిలో ఓ ప్రకృతి వ్యవసాయ రైతు ఉల్లి సురేష్ తన పొలంలో ఉన్న కొబ్బరి మామిడి చెట్టు కాయలకు ఇలా కవర్లు కట్టి ఓ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. చీడపీడలు ఆశించకుండా, మచ్చలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. – పిఠాపురం -
నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
కొత్తపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని రాజమహేంద్రవరం (బొమ్మూరు) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సోమవారం ఆవిష్కరించనున్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం నెలకొల్పేందుకు ఆ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఆధ్వర్యంలో నిర్ణయించారు. 8 అడుగుల కాంస్య విగ్రహం తయారు చేయాలని కొత్తపేటకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డి.రాజ్కుమార్ వుడయార్ను కోరారు. ఆ మేరకు ఆయన తన శిల్పశాలలో విగ్రహాన్ని రూపొందించారు. ఇప్పటికే విగ్రహాన్ని బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణానికి తరలించి, ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై నెలకొల్పి ఆవిష్కరణకు సిద్ధం చేసినట్టు శిల్పి రాజ్కుమార్ ఆదివారం కొత్తపేటలో విలేకరులకు తెలిపారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరుతో పాటు ఒంగోలు తదితర జిల్లాల్లో నెలకొల్పిన సుమారు 25 పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాలను తాను రూపొందించానని తెలిపారు. తాజాగా ఈ కాంస్య విగ్రహం తయారు చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని వుడయార్ చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
అమ్మవారికి రజత హస్తం సమర్పణ
ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న శ్రీనూకాంబిక అమ్మవారికి ఆదివారం మూడు కిలోల వెండితో తయారు చేసిన రూ.9.5 లక్షల విలువైన త్రిశూలం హస్తాన్ని ఆదివారం భక్తులు సమర్పించారు. ఎన్నారైల సహకారంతో చింతలూరు మహిళా భక్త బృందం ఈ కానుకను ఈఓ ఉండవల్లి వీర్రాజు, చైర్మన్ వీరి అప్పారావుకు అందజేశారు. గన్ని నారాయణరావు, సూర్యలక్ష్మి, గన్ని చిన్నబ్బు, సూర్యభాను, ద్విభాష్యం పద్మావతి, విజయశాంతి, పార్వతి, గుత్తుల విశ్వేశ్వరరావు, నామాల రాంపండు తదితరులు పాల్గొన్నారు. అట్టహాసంగా అధ్యయనోత్సవాలు ప్రారంభంఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వైష్ణవ స్వాములు, వేద పండితుల బృంద సభ్యులు ఈ క్రతువులను వైభవంగా నిర్వహించారు. ఉదయం గౌతమీ గోదావరి నుంచి ఆలయ అర్చకులు తీర్థ బిందెను మేళ తాళాలతో ఆలయానికి తీసుకువచ్చారు. స్వామివారికి ఆగమ శాస్త్రానుసారం తొలి హారతి, సుప్రభాత సేవ, మహాలక్ష్మి హోమం జరిపారు. అనంతరం నిత్య సేవాకాలం దివ్య ప్రబంధ పారాయణ చేశారు. నాలుగు వేదాలను, ద్రవిడ వేదాన్ని పారాయణ చేశారు. రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఎంపీ మహేష్కుమార్పై చర్యలు తీసుకోవాలిఅల్లవరం: హైదరా బాద్ శివారులో రేవ్ పార్టీలో పాల్గొని ఈగల్ టీమ్కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్తో పాటు పది మంది దొరికిపోయారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తాగుతూ దొరకడం కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటని అన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన మహేష్కుమార్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి, కల్తీ మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుందనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ ఉద్యోగిపై లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేస్తే కనీసం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదన్నారు. డ్రగ్స్, నకిలీ మద్యంతో రోజుకో అత్యాచారం, హత్యలు జరుగుతూ రాష్ట్రం విలవిల్లాడుతుందని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. -
ఆల్ ది బెస్ట్...
విద్యార్థులకు సూచనలివీ.. ● విద్యార్థులు విధిగా తమ వెంట హాల్ టికెట్ తీసుకు వెళ్లాలి. ● పరీక్షకు సంబంధించి పుస్తకాలు, పేపర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లరాదు. ● 24 పేజీల సమాధానాల బుక్లెట్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ● ప్రశ్న పద పరిమితిని పాటించాలి. జవాబుల నాణ్యతను బట్టి మార్కులిస్తారు. ● సైన్స్ పరీక్షలో ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి విడివిడిగా ఓఎంఆర్ షీట్లున్న రెండు 12 పేజీల బుక్లెట్లు ఒకేసారి అందిస్తారు. ఫిజికల్ సైన్స్ బుక్లెట్లో ఫిజికల్ సైన్స్ సమాధానాలు, నేచురల్ సైన్స్ బుక్లెట్లో ఆ సబ్జెక్టు సమాధానాలు మాత్రమే రాయాలి. ● ఎటువంటి అవకతవకలకు పాల్పడినా తదుపరి పరీక్షలకు అనుమతించరు. ముందు రాసిన పరీక్షల ఫలితాలు వెల్లడించరు. ● అభ్యర్థి పేరు, రోల్ నంబరు లేదా అభ్యర్థి ఇతర వివరాలను 24 పేజీల బుక్లెట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లో ఏ పేజీలోను రాయకూడదు. రాయవరం: పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 391 కేంద్రాల్లో 72,797 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 36,661 మంది బాలురు, 36,136 మంది బాలికలు ఉన్నారు. కాకినాడ జిల్లాలో 28,921, తూర్పు గోదావరి జిల్లాలో 24,566, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 19,310 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అన్ని చర్యలూ చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి, సూచనలు, సలహాలు అందజేశారు. సీఎస్, డీఓలు ఏం చేయాలంటే.. ఫ చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ) ముందుగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఫామ్లూ సిద్ధం చేసుకోవాలి. ట్రంక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటింజెన్స్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి. ఫ సిబ్బంది నుంచి వారి కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్స్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులివ్వాలి. ఫ బాలికలను తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఫ పరీక్ష జరుగుతున్న రోజుల్లో రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలి. నిర్దేశిత సమయం కంటే ముందు సీఎస్, డీఓలిద్దరి సంతకాలతో పరీక్ష పత్రాల కట్టల సీల్ తెరవాలి. ఫ లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి. ఇన్విజిలేటర్ల విధులివీ.. ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. పరీక్ష పేపర్ల కోడ్లు, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. 8.45 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలోకి అనుమతించాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు. ప్రతి విద్యార్థినీ సోదా చేసి, ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి. విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్టికెట్ అందిస్తారు. విద్యార్థి హాల్ టికెట్ను అటెండెన్స్ షీట్లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి. అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి. అన్ని పరీక్షలూ బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలను విద్యార్థులకు వివరించాలి. ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్ పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు. ఓఎంఆర్ షీట్ ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ఓఎంఆర్ షీట్పై ఉన్న బార్ కోడ్పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. 9.25 గంటల్లోగా ఇన్విజిలేటర్ అన్ని పనులూ ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్న పత్రాలివ్వాలి. ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్కోడ్/మీడియం సరి చూసుకోవాలి. పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఫ గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్ను ఎర్ర సిరా పెన్తో క్యాన్సిల్ చేయాలి. ఫ సమాధాన పత్రాలు, ఆన్సర్ బుక్లెట్ అన్నీ సరి చూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపించాలి. ఒత్తిడి తేవద్దు రాత్రి పూట ఎక్కువ సమయం చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు/సంరక్షకులు ఒత్తిడి చేయరాదు. ఆందోళనను నివారించడానికి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకు లేదా ముందుగానే చేరుకుంటే మంచిది. అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కే లు తదితర స్టేషనరీని విద్యార్థులు పరీక్షా కేంద్రానికి తప్పకుండా తీసుకు వెళ్లేలా చూసుకోవాలి. పరీక్ష కేంద్రంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడరాదని, దుష్ప్రవర్తనలకు పాల్పడరాదని పిల్లలను హెచ్చరిస్తే మంచిది. ఫ నేటి నుంచి టెన్త్ పరీక్షలు ఫ ఉమ్మడి జిల్లాలో హాజరు కానున్న 72,797 మంది ఫ ఏర్పాట్లు పూర్తి -
ప్రాణం తీసిన ఈత సరదా
దేవరపల్లి: అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారిద్దరూ అట్నుంచి అటే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈత సరదాయే వారి ప్రాణాలను బలి తీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలోని గుబ్బల మంగమ్మ తల్లి జలాశయంలో జరిగిన ఈ సంఘటన దేవరపల్లి మండలం యాదవోలులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన 11 మంది యువకులు ఓ వ్యాన్లో ఆదివారం ఉదయం గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం కొండ ప్రాంతంలో సరదాగా గడిపారు. అక్కడ వంటలు వండుకుని, విందు భోజనాల అనంతరం, మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గుబ్బల మంగమ్మ తల్లి జలాశయం వద్ద ఆగారు. వీరిలో వరుసకు అన్నదమ్ములైన తుమ్మల నాగరాజు (32), తుమ్మల రమణ (34) సరదాగా ఈత కొట్టడానికి జలాశయంలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఒక్కసారిగా గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న తోటి గ్రామస్తులు ప్రమాదాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని రాత్రి వేళ నాలుగు గంటలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలిసిన రెండు కుటుంబాల సభ్యులు, బంధువులు, పలువురు గ్రామస్తులు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరారు. అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడు నాగరాజుకు వివాహం కావాల్సి ఉంది. మరో మృతుడు రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు వ్యవసాయ పనులు చేస్తూండగా, రమణ తాపీ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఫ గుబ్బల మంగమ్మ జలాశయంలో ఇద్దరి మృతి ఫ యాదవోలులో విషాదం -
గ్యాస్ట్రబుల్!
కపిలేశ్వరపురం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ కొరత వార్తలు జనానికి గుబులు పుట్టిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. వీటి పంపిణీని 40 శాతం వరకూ తగ్గించేసింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు కొరత రానున్నదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వంట గ్యాస్కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సమృద్ధిగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలు ఎవరికి వారే ముందు జాగ్రత్తగా ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్ల కోసం బారులు తీరుతున్నారు. బుకింగ్లు రెట్టింపు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గోకవరం, విశాఖపట్నం, విజయవాడలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు ప్రతి రోజూ గ్యాస్ సిలిండర్లు సాధారణ స్థాయిలోనే సరఫరా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం సాధారణ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు 11 వేల నుంచి 11,500 వరకూ గ్యాస్ రీఫిల్ బుకింగ్లు నమోదవుతూంటాయి. అటువంటిది ప్రస్తుతం రోజుకు 19,896 నుంచి 22,250 వరకూ నమోదవుతున్నాయి. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే గ్యాస్ బుకింగ్లు దాదాపు రెట్టింపయ్యాయన్నమాట. దీనినిబట్టి జనంలో ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో గ్యాస్ బుకింగ్ క్షణాల్లో జరిగేది. అటువంటి ఇప్పుడు సర్వర్లు బిజీబిజీగా మారిపోవడంతో గంటలు గంటలు పడుతోంది. దీనికితోడు గతంలో బుక్ చేసుకున్న ఒక్క రోజులోనే సిలిండర్లను వినియోగదారులకు అందించేవారు. ప్రస్తుతం ముందు బుక్ చేసుకున్న వారికి ముందు అనే విధానంలో గ్యాస్ పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల బుకింగ్ చేసిన 2 నుంచి 4 రోజులకు కానీ సిలిండర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు అంటున్నారు. వివిధ రంగాలపై ప్రభావం వంట గ్యాస్ ప్రభావం వివిధ రంగాలపై పడుతుంది. ప్రధానంగా ఇది ఆహార వ్యాపారంపై ఇప్పటికే పడుతోంది. పలు హోటళ్లలో అత్యధికంగా గ్యాస్ వినియోగమయ్యే కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీని ఇప్పటికే నిలిపివేశారు. భారీ పెట్టుబడులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన వారి నుంచి వీధి వ్యాపారుల వరకూ ఎవరికి వారు తమ వ్యాపారం ఏవిధంగా ఉంటుందోనని కలవరపడుతున్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కుటుంబాలు రోజువారీ ఆదాయం పైనే ఆధారపడి జీవిస్తూంటాయి. వీరు రోజువారీ ఆదాయంలో కొంత చిట్టీలు కడతారు. వంట గ్యాస్ కొరతతో వ్యాపారం మూత పడితే ఆర్థికంగా తలకిందులవుతామనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో, ఎవరికి వారే సిలిండర్లను ముందు జాగ్రత్తగా నిల్వ ఉంచుకుంటున్నారు. గ్యాస్ కొరతతో హోటల్ పరిశ్రమ దెబ్బ తింటే.. దానికి అనుబంధంగా పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాలపై ప్రభావం పడుతుంది. అలాగే, కేటరింగ్, అన్నదానాలు చేసేవారు, ఆశ్రమాలు, హాస్టళ్లు నిర్వహించే వారు ఇక్కట్లు ఎదుర్కొంటారు. జిల్లాలో పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్దా హోటళ్లు, కేఫ్లు కలిపి 1.20 లక్షలు ఉన్నాయి. వీటిపై సుమారు 3 లక్షల మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారు. భరోసా కల్పించాలి గ్యాస్ వినియోగం ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. సిలిండర్ల కోసం పడిగాపులు పడే పరిస్థితులు తలెత్తితే ప్రజలు వారి వృత్తి, ఉద్యోగాలను కాదని తిరిగే అవకాశం ఉండదు. దానిని సాకుగా తీసుకుని బ్లాక్లో విక్రయాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని సామాన్యులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సేవా సంస్థల వారు తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం భరోసా కల్పించాలి. – పి.తులసి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం ఫ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఫ గ్యాస్ కొరత వార్తలతో జనంలో అలజడి ఫ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో గుబులు ఫ నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్న అధికారులు ఫ బ్లాక్లో మొదలైన విక్రయాలు! ఫ వివిధ రంగాలపై ప్రభావం హెల్ప్లైన్ నంబర్లు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సమస్యలు తలెత్తితే 80746 61259 నంబరులో సంప్రదించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ప్రత్యామ్నాయ నంబర్లివీ.. కంపెనీ హాయ్ మెస్సేజ్ మిస్డ్ కాల్ నంబరు (వాట్సాప్ నంబరు) ఇండేన్ గ్యాస్ 758 888 8824 845 495 5555 భారత్ గ్యాస్ 180 022 4344 771 095 5555 హెచ్పీ గ్యాస్ 9222 201 122 949 360 2222 సోషల్ మీడియా ప్రచారంతో.. యుద్ధ పరిస్థితులు, చమురు, గ్యాస్ నిల్వలపై మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. కొంత మంది గ్యాస్, చమురుకు కొరత వచ్చే పరిస్థితులు వచ్చేశాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన వారు ఆందోళనకు గురై, వంట గ్యాస్ ముందస్తు నిల్వకు ప్రయత్నిస్తున్నారు. అవసరం లేకుండా గ్యాస్ బుక్ చేయడం వలన కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. పైగా దీనివలన బ్లాక్లో విక్రయాలకు కూడా అవకాశాలు ఏర్పడతాయని అంటున్నారు. ఇప్పటికే మండపేట రూరల్లో సిలిండర్లను గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా వేరొకరికి బ్లాక్లో రూ.2 వేల నుంచి రూ.3,500కు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కట్టెల ధరలకు రెక్కలు గ్యాస్ కొరత భయంతో కట్టెలకు డిమాండ్ పెరుగుతోంది. 25 కిలోల కట్టెల ధర గతంలో రూ.120 ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.200కు పెరిగింది. గతంలో టన్ను కట్టెల ధర రూ.4,800 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.8 వేలు పలుకుతోందని వినియోగదారులు చెబుతున్నారు. వంటకు పుల్లలు సిద్ధం uజిల్లాలో మండలాలు 22 జనాభా 18.32 లక్షలు వంటగ్యాస్ సరఫరా ఏజెన్సీలు 52వంటగ్యాస్ కనెక్షన్లు 8.67 లక్షలు సంక్షామం తప్పదా! వంట గ్యాస్ కొరత తీవ్రమైతే సంక్షేమంపై కూడా ప్రభావం పడే అవకాశాలుంటాయి. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు వంటివి ప్రభావితమవుతాయి. జిల్లాలో 33 సాంఘిక సంక్షేమ, 21 బీసీ సంక్షేమ, 10 గిరిజన సంక్షేమ హాస్టళ్లున్నాయి. ఈ 64 సంక్షేమ హాస్టళ్లలో సుమారు 5,790 మంది విద్యార్థులుంటున్నారు. గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తితే హాస్టళ్లలో ఉంటు న్న విద్యార్థులతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి సైతం ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏజెన్సీల వారీగా శనివారం సిలిండర్ల బుకింగ్లు, డెలివరీల వివరాలు ఏజెన్సీ బుకింగ్ డెలివరీ అందుబాటులో 72 గంటలుగా ఉన్న సిలిండర్లు పెండింగ్ ఇండేన్ 3,355 2,100 7,232 1,544 హెచ్పీ 15,278 10,134 8,077 18,306 బీపీసీ 1,236 727 1,138 2,394 మొత్తం 19,869 12,961 16,447 22,244 పాలకుల పుణ్యమా అని ఇప్పటికే నిత్యావసరాల ధరలు ధనాధన్మంటూండటంతో సామాన్యులు ఇప్పటికే పెనం మీద పేలాల్లా వేగిపోతున్నారు. పొయ్యి మీదకే కాదు.. ఇప్పుడు పొయ్యి కింద మంటకు కూడా తంటా వచ్చింది. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధం పుణ్యమా అని నానాటికీ పెరుగుతున్న వంట గ్యాస్ సమస్య ప్రజల్లో సెగలు పుట్టిస్తోంది. గ్యాస్కు ఎటువంటి కొరతా లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. సిలిండర్ ఖాళీ అయితే మళ్లీ దొరుకుతుందో దొరకదోనని జనం ఆందోళన చెందుతున్నారు. -
చంద్రబాబు, రేవంత్కు హాట్లైన్ సంబంధాలు: మార్గాని భరత్
తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్లైన్ సంబంధాలు ఉన్నాయి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. ఇదీ చదవండి: పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. -
అక్కడ ఆయన. ఇక్కడ ఈయన..
● జనసేనలో వర్గవిభేదాలు ● రాజమహేంద్రవరంలో బయటపడిన వైనం ● వేర్వేరుగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో జనసేన నాయకుల మధ్య వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఒక వైపు కార్యక్రమం నిర్వహించగా, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ మరోవైపు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. దీనికి తోడు పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలు సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరుకావడం దీనికి అగ్గి రాజేసినట్లయింది. అత్తి సత్యనారాయణ నగరంలో హడావుడి చేశారు. అన్ని వార్డుల్లో తిరిగి భారీ ర్యాలీ చేపట్టారు. సిటీ అధ్యక్షుడు మాత్రం తన పరిధిలో కార్యక్రమం నిర్వహించారు. సఖ్యత లేదా! రాజమహేంద్రవరం సిటీ జనసేనలో ఇద్దరు నేతల మధ్య ఇప్పటికే సఖ్యత ఉండటం లేదు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ, సిటీ ఇన్చార్జి వై.శ్రీనివాస్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. స్వపక్ష పార్టీ అయినా ఏ ఒక్క సందర్భంలోనూ ఇద్దరు నేతలూ కలిసిన సందర్భాలు లేవు. ఇటీవల అత్తి సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అత్తికి శుభాకాంక్షలు తెలిపేందుకు పక్క నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు హాజరైనా సిటీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ మాత్రం గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజమహేంద్రవరంలోని తన నివాసంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ కార్యాలయంలో అత్తి సత్యనారాయణ ఒకేరోజు వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో బత్తుల ఏర్పాటు చేసిన సమావేశానికి వై.శ్రీనివాస్ హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. మేయర్ పదవి కోసమేనా? సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని కూటమి సర్దుబాటులో భాగంగా అత్తి సత్యనారాయణ వదుకోవాల్సి వచ్చింది. అందుకు ప్రతిఫలంగా రాజమహేంద్రవరం మేయర్ పీఠం అత్తినే వరిస్తుందన్న ప్రచారం విస్తృతంగా నడిచింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సైతం సత్యనారాయణకే మద్దతు ఇచ్చారు. అయితే అత్తి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే రాజకీయం మారిపోయింది. ఆదిరెడ్డి వాసు వై.శ్రీనును ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. అందులో భాగంగానే అత్తికి దూరమయ్యారన్న చర్చ నగరంలో జోరుగా సాగుతోంది. -
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● రేపటి నుంచి ప్రారంభం ● జిల్లాలో 138 కేంద్రాలు ● డీఈవో వాసుదేవరావుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈవో కె.వాసుదేవరావు అన్నారు. ఎస్కేవీటీ హైస్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 138 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు మొత్తం 24.566 మంది రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. తనిఖీల కోసం ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 18 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. ప్రశ్నపత్రాలను జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని, ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ల నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ల ద్వారా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపే ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
లోక్ అదాలత్లో కేసుల సత్వర పరిష్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్ఆర్ రంపచోడవరం జిల్లాలోని 47 బెంచ్ల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కోర్టులో న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసులను సామరస్య పూర్వకంగా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసుల్లో లబ్ధిదారులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మోటార్ ప్రమాద పరిహార కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, లేబర్ కోర్టు కేసులు, వినియోగ దారుల కోర్టు కేసులను రాజీ ద్వారా పరిష్కారం చేసి బాఽధితులకు అవార్డులు జారీ చేశామన్నారు. 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, న్యాయమూర్తులు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభనాద్రి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందాల ఊయల్లో..
● కల్యాణంలో కొత్త ట్రెండ్ ● హల్దీ ఫంక్షన్లకు పెరిగిన క్రే జ్ ● ఉత్తరాది నుంచి ఇక్కడకు వచ్చిన ఆచారం ● ఖర్చుకు వెనకాడని కుటుంబాలు రాయవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను నేటి తరం ఆనందాల ఊ‘యలో’్ల విహరిస్తూ గుర్తుండిపోయేలా జరుపుకోంటోంది. వివాహ తంతులో పద్ధతులు అందరికీ తెలిసినవే అయినప్పటికీ కొత్తగా హల్దీ ఫంక్షన్ వచ్చి చేరింది. దీన్నే పసుపు వేడుక, మంగళస్నానం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మాన్యుల నుంచి సామాన్యుల వరకూ ఈ ట్రెండ్ను అనుకరిస్తున్నారు. ఉత్తరాదిన జరిగే ఈ వేడుక ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఇంట వివాహానికి ముందుగా తప్పనిసరిగా మారింది. కొత్త పుంతలు పెళ్లికి ఒక్కరోజు ముందు వధూవరులకు మంగళ స్నానాలు చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2018 చివరి నుంచి ఇది కొత్త పుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్గా మారి పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం హల్దీ వేడుకలు ఎప్పుడూ గుర్తుండి పోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీ ఈవెంట్లో వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనితో పాటూ సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లను ఒక వీడియోలా చేసి, వివాహం రోజున ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక సెట్టింగ్లు హల్దీ వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్లు అందుబాటులోకి వచ్చాయి. ఓ మాదిరిగా వివాహం చేసుకునే వారు సైతం హల్దీ సెట్టింగ్కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో పెళ్లి కుమార్తె కూర్చోవడానికి తామరపువ్వు, పెళ్లి కుమారుడికి బాహుబలి, తోఫా సెట్టింగ్లు వేస్తున్నారు. గులాబీ, మల్లె, చామంతి వంటి రకరకాల పూలతో వాటిని అలంకరిస్తున్నారు. మంగళ స్నానాలకు ప్రత్యేకంగా గంగాళాలు, జల్లెడ, రాగి లేదా ఇత్తడి చెంబు వాడుతున్నారు. వధూవరులకు పసుపు రాసిన అనంతరం గంగాళంలో పూలతో ఉన్న పసుపు నీటిని జల్లెడ ద్వారా పోసి చిరుజల్లులతో మంగళస్నానం చేయించడం, దాన్ని వీడియో, ఫొటోల్లో బంధించడం ఫ్యాషన్గా మారింది. డ్రెస్ కోడ్ హల్దీ ఫంక్షన్లలో అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్తో పాల్గొంటున్నారు. పురుషులు ఎక్కువగా పసుపు రంగు లాల్చీ, తెల్ల ప్యాంట్, మహిళలు పసుపు రంగు చీరలు ధరిస్తారు. ఇంకొందరు మెరూన్, బ్లూ, ఆరెంజ్ తదితర రంగుల దుస్తులు వినియోగిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి ఎవరి ఇళ్లలో వేర్వేరుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పసుపు నీటితో మంగళస్నానం చేయిస్తున్నారు. హల్దీ ఫంక్షన్లో ఫొటో, వీడియో షూట్ క్రేజీగా మారింది. ఈ ఈవెంట్ను జీవితాంతం గుర్తుండేలా ఫొటో, వీడియో గ్రాఫర్లు షూట్ చేస్తున్నారు. వీటికి పెద్ద మొత్తంలో చార్జి చేస్తున్నారు. చెప్పలేని ఆనందం ఇటీవలే నా వివాహం జరిగింది. హల్దీ ఫంక్షన్లో బంధువులు, స్నేహితులందరూ ఒకే రంగు దుస్తులు ధరించి పాల్గొనడం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆ వేడుక నా జీవితంలో మరచిపోలేని మధురానుభూతినిచ్చింది. – కె.సాయికుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కాకినాడ ఉత్సాహాన్నిస్తాయి కొన్ని సంవత్సరాలుగా వివాహ వేడుకల్లో హల్దీ ఫంక్షన్ ప్రత్యేకంగా మారింది. దీంతో వేడుకల్లో ఫొటో, వీడియోగ్రఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు 50 వరకు హల్దీ ఈవెంట్లకు ఫొటో, వీడియో గ్రఫీ చేశా. ఈ వేడుకల షూట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. – కారంపూడి సత్తిబాబు, ఫొటోగ్రాఫర్, రాయవరం ప్రత్యేక ఆకర్షణ పెళ్లి వేడుకల్లో హల్దీ ఫంక్షన్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామాల్లో ఈ సెట్టింగ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు, పట్టణాల్లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వసూలు చేస్తున్నారు. – కె.సతీష్, ఎన్కేఎస్ ఈవెంట్ మేనేజర్,రాజమహేంద్రవరం -
టీడీపీ వర్గీయుల తీరుపై సర్పంచ్ నిరసన
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను పంచాయతీలో తాను లేకుండా పంచాయతీ సాధారణ సమావేశాన్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ సర్పంచ్ గురజర్ల వీర వెంకట సత్యనారాయణ శనివారం నిరసన దీక్ష చేపట్టారు. తనకు సమాచారం ఇవ్వకుండా, టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం పాలకవర్గం సమావేశం నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. కార్యదర్శి ఎలగన రమేష్, మండల అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో దీక్షకు కూర్చున్నట్లు చెప్పారు. అయితే రెండు గంటల పాటు టెంట్లో కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆయన.. సహచరుల సూచనల మేరకు దీక్షను విరమించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రథమ చికిత్సపై పీఎంపీలకు శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శనివారం గ్రామీణ వైద్యులకు (పీఎంపీ) ప్రథమ చికిత్సపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కామిరెడ్డి వెంకట రమణ, జిల్లా కోశాధికారి డాక్టర్ జి.మహాలక్ష్మి మాట్లాడుతూ ఎవరికై నా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందేవరకూ తాత్కాలికంగా చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ అవసరమవుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, ఎస్కే రహమాన్ షరీఫ్, ఆర్.సూర్యనారాయణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ సత్యనారాయణ (చంటి), డీఎఫ్ఒ గోపీకృష్ణ, పద్మ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.75 లక్షల భారీ పరిహారంగొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు. -
నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం..!
రాజమహేంద్రవరం సిటీ: మీ స్కామ్లు, దందాల వ్యవహారాన్ని ప్రెస్మీట్ పెట్టి చెబుతానన్న ఒక వ్యక్తితో ‘నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫోన్చేసి మరీ బెదిరించిన ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఆడియోలో అప్పారావు అటువైపు వ్యక్తిని దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో ప్రకారం.. ఎమ్మెల్యేగా గెలిపించిన తమకు శ్రీనివాస్ ఏమీ చేయలేదని, ఆయన చేయలేని పనులు తాము చేస్తున్నామని అవతలి వ్యక్తి చెబుతుండగా అప్పారావు ఎదురుదాడికి దిగి తిట్టడానికి యత్నించారు. దీంతో ‘తాను లీగల్గా చర్యలు చేపడతా’ అని ఆ వ్యక్తి అప్పారావుకు సమాధానమిచ్చారు. కొద్దిసేపు వాగ్వాదం సాగిన అనంతరం.. ఆ వ్యక్తి ‘మీ అబ్బాయిని ఎంచుకుని తప్పు చేశాం. ప్రెస్మీట్ పెట్టి మీ స్కామ్లు, దందాలు బయటపెడతా’ అని చెప్పాడు. దీనికి అప్పారావు బదులిస్తూ ‘నీకు నచ్చిన పని చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, వివాదం ఏమిటి? బెదిరింపులకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉంది. -
వారాహి మాతకు బంగారు హారం
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాతకు అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ డైరెక్టర్ శేష సతీష్, ఆశాకిరణ్ దంపతులు సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు హారాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, వారాహి మాత దయతో తమ కుటుంబానికి మేలు జరిందని, కృతజ్ఞతగా ఈ హారం సమర్పించామని చెప్పారు. తన బంధువు, ఆలయ కమిటీ ప్రతినిధి సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (చంటిబాబు) దంపతుల ద్వారా అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. దాత దంపతులకు ప్రధానార్చకులు నారాయణ నంబూద్రి, శుక్లా, రాంబాబు తదితరులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్తి భగవాన్రెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), మండ రాజారెడ్డి, ప్రత్యూష మురళి, యువరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్షకుడిపై కక్ష!
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026ఈ రైతు పేరు నీతిపూడి శేఖర్ బాబు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామస్తుడు. రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.30 వేల చొప్పున రెండెకరాలకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయారు. ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. రబీలోనైనా గట్టెక్కుదామంటే.. పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఆశించినా.. పెట్టుబడికి అవకాశం లేక తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కౌలు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆయన వాపోతున్నారు.సాక్షి, రాజమహేంద్రవరం: పథకం ఏదైనా కోతలు, ఆంక్షలు, నిబంధనలే అజెండాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ కొంత మందికే ఇచ్చి మమ అనిపించింది. తల్లికి వందనంలో నిబంధనలు పెట్టి నిధులు అందకుండా తల్లులకు ద్రోహం చేసింది. తాజాగా కర్షకులకు సైతం అందే పంథా అవలంబిస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదలలో తీరని అన్యాయం చేసింది. పథకంలో భారీ స్థాయిలో కోతలు విధించింది. ఇప్పటికే ఈ ఏడాది సొమ్ము ఎగరగొట్టిన కూటమి సర్కారు.. వైఎస్సార్ సీపీ ఆందోళనలతో ఎట్టకేలకు పథకం అమలు చేస్తోంది. అందులోనూ కోతలు విధించి చేతులు దులుపుకొనేందుకు కుట్ర చేస్తోంది. ఇదీ సంగతి సూపర్ సిక్స్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వైఎస్సార్ సీపీ, ప్రజల పోరాటాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల చొప్పున ఏడాదికి మొత్తం రూ.20 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ (మూడవ విడత), పీఎం కిసాన్ (2025–26) కార్యక్రమం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6 వేలు జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటించారు. ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అర్హులైన ప్రతి రైతు కుటుంబం బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేంద్ర నిధులతో కలిపి ఇస్తోంది. పైకి మాత్రం తానే పూర్తి నిధులు ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 1,14,991 రైతుల ఖాతాల్లో రూ.65.08 కోట్లు జమ చేశారు. కౌలు రైతులపై కనికరమేదీ? చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. కౌలు రైతులకు సీసీఆర్సీల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. భూ యజమాని సమ్మతితోనే వారికి ఆ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాన్ని చేరుకోలేకపోయారు. కార్డులు అందిన రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధులు అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రూ.6 వేల సాయం ప్రకారం కౌలు రైతులకు సుమారు రూ.66 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో క్రమం తప్పకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. 18,511 మంది రైతులకు మొండిచేయి వైఎస్సార్ సీపీ ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఏడాది తర్వాత పథకం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18,511 మందిని ఈ పథకానికి దూరం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి ‘రైతు భరోసా’ నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,14,991కి కుదించేశారు. వీరు తమకు అందాల్సిన రూ.14.35 కోట్లు నష్టపోయారు. తొలి ఏడాది రూ.160 కోట్లు హుష్కాకి కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన అధికారం చేపట్టింది. ఆ వెంటనే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పలికింది. తొలి ఏడాది ఇవ్వాల్సిన సొమ్ములు ఎగొట్టింది. జిల్లాలోని రైతులకు కేవలం కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.6 వేలు మాత్రమే అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలను వేయలేదు. ఫలితంగా ఆ ఏడాదికి రైతులు సుమారు రూ.160.98 కోట్లు నష్టపోయారు. ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారుల్లో భారీగా కోత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా 1.33 లక్షల మందికి లబ్ధి ప్రస్తుతం 1.14 లక్షలకు కుదింపు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న సర్కారు ప్రస్తుతం ‘పీఎం కిసాన్’తో కలిపి రూ.6 వేలు ఇస్తున్న వైనం తొలి ఏడాది సొమ్ముల ఎగవేత దగాయే రివాజుగా కూటమి ప్రభుత్వం పాలన -
జీజీహెచ్ దుస్థితిపై గవర్నర్కు ఫిర్యాదు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో వైద్య సేవల దుస్థితిపై ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరుకుంది. కాకినాడ రేచర్లపేటకు చెందిన పొలుమూరి మధుబాబు (52) లిఖితపూర్వకంగా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. ఆయన గుండె సమస్యతో బాధ పడుతున్నారు. గతంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు నాలుగు స్టెంట్లు వేశారు. ఈ స్థితిలో మధుబాబు ఆయాసం, దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులకు గురై, గడచిన ఐదు నెలల్లో ఆరుసార్లు కాకినాడ జీజీహెచ్కు వచ్చారు. అక్కడ వార్డులో ఒక్కో మంచానికి ఇద్దరు ముగ్గురు రోగుల్ని ఉంచడం గమనించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అత్యవసర విభాగం నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు రూ.200 డిమాండ్ చేశారని, తన వద్ద డబ్బులు లేవని చెప్తే వార్డు షిఫ్టు పెట్టినప్పటికీ అత్యవసర విభాగంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత్యంతరం లేక ఆయాసంతో నడచి వస్తుంటే అలా వెళ్లకూడదంటూ నర్సులు గదమాయించారని ఆరోపించారు. చివరకు ఎంఎన్ఓకు రూ.200 ఇవ్వక తప్పలేదని, ఆ తర్వాతే తనను స్ట్రెచర్లో వార్డుకు తరలించాడని వివరించాడు. అప్పటికే ఇద్దరు రోగులున్న పడకపై మూడో వ్యక్తిగా తనను వేశారని, ఒకే మంచంపై ముగ్గురేమిటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, నచ్చకపోతే వెళ్లిపోమంటూ దురుసుగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలానే ఎందరో రోగులు జీజీహెచ్లో మగ్గిపోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత ఫొటోలను మధుబాబు జత చేశారు. ఆయన గత నెల 7న గవర్నర్కు ఈ ఫిర్యాదు పంపగా, సంబంధిత విభాగాల పరిశీలన అనంతరం శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరింది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. -
ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు
● వంట గ్యాస్పై నిరంతర పర్యవేక్షణ ● కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● జిల్లా పౌర సరఫరాల అధికారి పార్వతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గృహ అవసరాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో పాటు ఎల్పీజీ పంపిణీదారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లాలోని 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా అవుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లు సాధారణంగా పనిచేస్తుండగా, ఎల్పీజీ సిలిండర్ల నిల్వ కూడా తగినంతగా ఉందన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల రీఫిల్ బుకింగ్లు తాత్కాలికంగా పెరిగాయనీ, అయినప్పటికీ డెలివరీలు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో సాగుతున్నాయన్నారు. దీని వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక జాప్యం ఏర్పడినా , సరఫరాలో ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు. పారిశ్రామిక, బల్క్ ఎల్పీజీ సరఫరాను మాత్రమే పరిమితం చేయగా, గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తూ పంపిణీదారులకు సూచనలిస్తున్నారు. కాబట్టి వినియోగదారులకు ఆందోళన అవసరం లేదన్నారు. హెల్ప్లైన్ ఏర్పాటు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎల్పీజీ సంబంధిత ఫిర్యాదుల కోసం 8074661259 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 225.46 మెట్రిక్ టన్నులు గ్యాస్ (15,742 సిలిండర్లు) అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుకింగ్ ప్రత్యామ్నాయ పద్ధతులు వినియోగదారులు ఒకేసారి ఎక్కువగా బుకింగ్లు చేయడం వల్ల కొన్ని చోట్ల కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నందున కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ కోసం వాట్సప్ 1800 22 4344కు హయ్ అని పంపాలి మిస్డ్కాల్: 7710955555 ఐవీఆర్ఎస్: 7715012345 / 7718012345 ఇండేన్ గ్యాస్ కోసం వాట్సప్ 7588888824కు హాయ్ అని పంపాలి మిస్డ్కాల్ : 8454955555 ఐవీఆర్ఎస్ 7718955555 హెచ్పీ గ్యాస్ కోసం వాట్సప్ 9222201122కు ‘ఏజీ’ అని పంపాలి మిస్డ్కాల్: 9493602222 ఐవీఆర్ఎస్ 8888823456 / 9666023456 అలాగే సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. -
కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరి మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి (55) పరిస్థితి విషమించి మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు అత్యవసర చికిత్స పొందుతున్నారు. -
అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.ఇదిలా ఉండగా, తన సోషల్ మీడియా అకౌంట్ను మూడేళ్లుగా హైదరాబాద్కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
బాలుడి అపహరణకు యత్నం
ఓ మహిళ కేకలకు పారిపోయిన దుండగులుపి.గన్నవరం: స్థానిక శివాలయం రోడ్డులో గురువారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఓ మహిళ కేకలు వేయడంతో ఆ బాలుడిని వదిలి కిడ్నాపర్లు పారిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక పితానివారిపాలేనికి చెందిన దొమ్మేటి రిత్విక్ మణికంఠ శివాలయం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తన తండ్రి నాగరాజు రిత్విక్ను పాఠశాల వద్ద దించాడు. సాయంత్రం 3.30 గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం రిత్విక్ ఒంటరిగా నడుచుకుంటూ పితానివారిపాలెంలోని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ బాలుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు ఏడవడంతో.. సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడిని వదిలి ఆ ఇద్దరు బైక్పై పరారయ్యారు. అనంతరం ఆ మహిళ ఇతర విద్యార్థుల సాయంతో రిత్విక్ను మరొక మార్గంలో ఇంటికి పంపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
చిందేసి.. చికాకు పుట్టించి
కాట్రేనికోన: ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో కొందరి చిందులు హద్దులు దాటాయి.. భక్తులకు రోత పుట్టించాయి. కాట్రేనికోన మండలం కొత్తపాలెం, మొల్లేటిమొగ గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో పోలీసుల సాక్షిగా బుధవారం రాత్రి మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలతో యువతను రెచ్చగొట్టారు. ఈ రెండు గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మాంసాహారాన్ని వదిలి ప్రజలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. అయితే ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో టెంట్లు వేసి మద్యం విక్రయాలు చేపట్టారు. గ్రామంలో జాతర సందర్భంగా స్టేజ్ మీద అమ్మాయిలు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. అయితే రికార్డింగ్ డ్యాన్స్లను అడ్డుకోవాల్సిన పోలీసులు మాత్రం స్టేజ్కు ఎదురుగా ప్రేక్షకుల్లా కూర్చుని వీక్షించడం శోచనీయం. మద్యం అమ్మకాలు లైసెన్సు షాపుల మాదిరిగా చేసినా పోలీసులు, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పట్టించుకోలేదు. ఇటీవల శివరాత్రి సందర్భంగా మగసానితిప్ప, చొల్లంగి తీర్థంలో, తీర ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు, చెయ్యేరు ప్రభల తీర్థంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనివెనుక కొందరు నాయకులు ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం. జాతరలో అశ్లీల నృత్యాలు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోరుకొండ: స్థానిక బూరుగుపూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఇన్సీసుపేటకు చెందిన బొర్రా ప్రభాకరరావు (59) గోకవరం నుంచి మోటారు సైకిల్పై బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్ ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకరరావు రోజూ గోకవరం, కోరుకొండ మండలాల్లో దుస్తులు అమ్ముతుంటాడు. ఇతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రోజూలానే గురువారం దుస్తులు విక్రయించి తిరిగి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై వివరించారు. -
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి– 16పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గాంధీనగరానికి చెందిన వ్యవసాయ శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆచంట జగన్నాథరావు (81) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగరం నుంచి స్కూటీపై జగన్నాథరావు దేవరపల్లి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా కృష్ణంపాలెం వద్ద హైవేలో తాడిపూడి కాలువ వంతెనపై వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్నాథరావు తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందారు. జగన్నాథరావు సోదరుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు అమెరికాలో డాక్టర్గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు ఒంగోలులో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యవసాయ అధికారి, వ్యవసాయ రంగంలో ఆదర్శ రైతుగా జగన్నాథరావు అవార్డులు అందుకున్నారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. జగన్నాథరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
చీడపీడలు ముంచెట్టు
పెరవలి: అంతా బాగుంటే ఆయిల్పామ్ సాగు సిరులు కురిపిస్తోంది.. సస్యరక్షణ చర్యలే ఈ పంటకు శ్రీరామరక్ష అవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో పామాయిల్ సాగే జరుగుతోంది. జిల్లాలో మొత్తం 19,266 హెక్టార్లలో సాగవుతుండగా, 15 వేల హెక్టార్ల నుంచి పంట ఉత్పత్తి అవుతూ ఏడాదికి 76 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుబడి వస్తోంది. ఏటా ఈ పంటలపై వివిధ తెగుళ్లు, పురుగుల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్కుమార్ వివరించారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా.. కొమ్ము పురుగు కొమ్ము పురుగు ఆయిల్పామ్ మొక్కలను ఆశిస్తే, మొక్కల ఆకులు వీ ఆకారంలో కత్తిరించబడినట్లు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో ఉంటాయి. అంతేకాకుండా చెట్టు మొదలు ఉండే పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి. దీని నివారణకు మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వీటిపై కార్బరిల్ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్ మందును పది గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి. సంచి పురుగు ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినేస్తాయి. దీని నివారణకు ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీద కార్బరిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఆయిల్పామ్ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్, జూలై నెలల్లో, రెండో మోతాదు డిసెంబర్, జనవరి నెలల్లోనే మొక్కలకు వేయాలి. మూడేళ్ల వయసు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్ పాస్ఫేట్ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి. ఫ ఆయిల్పామ్ సాగులో సస్యరక్షణ అవసరం ఫ యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు మొవ్వుకుళ్లు తెగులు ఈ తెగులు ఉధృతి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. మొక్క పసుపు రంగులోకి మారి మొవ్వు ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మందు కలిపి తెగులు సోకిన ప్రాంతమంతా పూయాలి. గానోడెర్మా కుళ్లు.. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వలోకి చేరి కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే ఆ చెట్టు వేరును తీసి ట్రై డీమార్ఫ్ మందును వంద మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టుమొదలులో వేయాలి. కాండం తడి తెగులు ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ అకస్మాత్తుగా ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలిపోతాయి. మొవ్వ ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుంటాయి. ఈ తెగు లు సోకిన చెట్టు మొవ్వను లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్, మోనోక్రోటోపాస్లను కుళ్లిన చోట పై పూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి. గెలకుళ్లు.. ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఆ గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్ మందుతో శుద్ధిచేయాలి. ఇలా చేయడం వల్ల మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది. -
తారుక్కుపోయేలా..
ఆత్రేయపురం: కోనసీమ జిల్లాలో బొబ్బర్లంక – రావులపాలెం ఆర్అండ్బీ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా దర్శనమిస్తుంది. సింగిల్ రోడ్డు కావడం, గోతులు పడడం, వాహనాల రద్దీ పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెలిచేరు నుంచి బొబ్బర్లంక వరకూ సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రయాణం ఉయ్యాల జంపాలను తలపిస్తోంది. తారు లేక, కంకర రాళ్లు తేలి ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోడ్డు నిర్మించి దశాబ్దాలు కావొస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు ఇటు రావులపాలెం జాతీయ రహదారిని, అటువైపు కాటన్ బ్యారేజీ అవతల నూతన జాతీయ రహదారులను కలుపుతోంది. అంతేకాకుండా ఆర్అండ్బీ శాఖలో రాష్ట్ర రహదారిగా గుర్తింపు పొందినా, అభివృద్ధికి దూరంగా ఉంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి లక్షల మంది భక్తులు వేలాది వాహనాల్లో ఇటుగా వస్తుంటారు. అలాగే కాలినడకన చాలామంది వాడపల్లి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆ భక్తులకు రోడ్డుపై గోతులు, గొప్పులు, రాళ్లు గుచ్చుకుని రక్తపు గాయాల పాలవుతున్నారు. అయినా రహదారిని గతంలో బిట్లు బిట్లుగా వేయటంతో అతుకులుగా కనిపిస్తోంది. కాగా ఇటీవల చేసిన ప్యాచ్ వర్క్స్తో మరీ అధ్వానంగా ఉంది. గత సంవత్సరం జనవరిలో అతుకులు పూడ్చారు. తిరిగి ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఈ మరమ్మతులకు రూ.లక్షలు వృథా అవుతున్నాయి. కానీ రోడ్డు మాత్రం బాగుపడడం లేదు. పూర్తిస్థాయిలో రోడ్డును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దారిలోనే రైతుల పయనం ఈ ప్రాంతంలో అరటి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు అరటి గెలలను సైకిళ్లపై పెట్టుకుని ఇటు రాజమహేంద్రవరం, అటు రావులపాలెంకు వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో సైకిళ్లు మరమ్మతులకు గురవడంతోపాటు లోడు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నామని రైతులు అంటున్నారు. మండలంలోని మరో జాతీయ రహదారి రాజవరం– పొదలాడ రోడ్డు 13 కిలోమీటర్ల మేర గుంతలతో దర్శనమిస్తుంది. చాలా గ్రామాల ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోడ్డుకు పక్కనే మధ్య డెల్టా కాలువ ఉన్నా, మలుపులు, ప్రమాదభరిత ప్రాంతాల్లో ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.ఎక్కడికక్కడే అతుకులు, గతుకులు.. తారు లేచి రాళ్లు తేలిన దారిలో ప్రయాణానికి అవస్థలు.. ఏళ్లకాలంగా చోద్యం చూస్తున్న పాలకులు.. వెలసి ఎంతో ప్రాధాన్యం ఉన్న బొబ్బర్లంక – రావులపాలెం రహదారిలో ప్రజలకు తప్పని పాట్లు.. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి అయినా ఎవరూ పట్టించుకోక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఫ అధ్వానంగా బొబ్బర్లంక– రావులపాలెం రోడ్డు ఫ అతుకుల బొంతలా మారిన వైనం ఫ పట్టించుకోని కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చుతాం వెలిచేరు నుంచి బొబ్బర్లలంక వరకూ రోడ్డు అధ్వానంగా ఉన్నమాట వాస్తవమే. ఈ రోడ్డును చివరిసారిగా 2011–12లో నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు రూ. 70 లక్షల నిధులు మంజూరయ్యాయి. – జి.రాజేంద్రప్రసాద్, రోడ్లు భవనాల శాఖ డీఈ, కొత్తపేట తరచూ ప్రమాదాలు బొబ్బర్లంక రోడ్డుపై ప్రయాణించాలంటే జనం భయపడిపోతున్నారు. తరచూ వాహన ప్రమాదాలు జరుగుతుండడమే అందుకు కారణం. ఎంతో ప్రాధాన్యం ఉన్న రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. ఈ రాష్ట్ర రహదారిని వెంటనే నాలుగు లైన్ల రహదారిగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. – కనుమూరి శ్రీనురాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు ఏళ్ల తరబడి ఇలానే.. బొబ్బర్లంక రోడ్డు ఏళ్ల తరబడి అధ్వానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అధికారులు కనీసం మరమ్మతులు కూడా సక్రమంగా చేయించడం లేదు. సుమారు 13 ఏళ్ల నుంచి ఈ రోడ్డు నిర్వహణను మరిచిపోయారు. కూటమి సర్కార్ మాటలు తప్ప చేతలు కానరావడం లేదు. వెంటనే ఈ రహదారి నిర్మించాలి. – సఖినేటివాకుల రాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు, రావులపాలెం -
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుపమ, నాగేంద్రలు తమ పాప వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించిందని ఆరోపిస్తున్నారు. చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఈ నెల 5న మండలానికి దగ్గరలోని ఏలేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించామన్నారు. అక్కడి నుంచి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత కాకినాడ జీజీహెచ్కు తీసుకు వెళ్లామన్నారు. చిన్నారికి తల్లీ బిడ్డ వార్డులో వెంటిలేటర్పై చికిత్స అందించారని, ఆ తరువాత పాప బాగానే ఉన్నప్పటికీ రక్తం ఎక్కించారని వాపోయారు. మూడు నెలల చంటి బిడ్డకు రక్తం ఎక్కించడం వల్లనే చనిపోయిందని తల్లి అనుపమ కన్నీరు పెట్టుకొంది. మరోవైపు పాపకు శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులు చికిత్స చేశారని, దీనితో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ మొదటి కాన్పు బిడ్డ తమకు కాకుండా తనువు చాలించిందని తల్లిదండ్రులు దుఃఖించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంటి ఆదివాసీలకు సకాలంలో, సరైన వైద్యం లభించడం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి కష్టం మరో తల్లికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర వాలీబాల్ టీం కెప్టెన్గా లక్ష్మి రంగంపేట: ఢిల్లీ రాష్ట్రంలోని పీఠంపూర్లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి కెప్టెన్గా రంగంపేట మండలం జి.దొంతమూరు హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇ.లక్ష్మి ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం కేవీ రమణారావు చెప్పారు. గురువారం ఆయన ఆ హైస్కూల్లో మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక టోర్నమెంట్లలో పాల్గొన్న లక్ష్మి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ అధికారులకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను గ్రామ సర్పంచ్ గోలి రమణ, ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎస్వీఎస్ నారాయణ, మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భర్త వేధింపులపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు కాకినాడ రూరల్: భర్త వేధింపులపై ఓ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత, ఎకై ్సజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలవరపు దేవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన శ్రీపతి మణికంఠపై సర్పవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసకుమార్ కథనం ప్రకారం.. గతంలో వివాహమైన దేవి తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత 2021లో మణికంఠను ద్రాక్షారామ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భర్త తన మేనకోడలిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయగా, అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2024 మార్చి 5న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. కోర్టులో వాదోపవాదాల అనంతరం ఈ ఏడాది జనవరిలో కేసు కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మేనకోడలిని మణికంఠ రెండో వివాహం చేసుకున్నాడని, అతని కుటుంబ సభ్యులు తనను దూషించి, కొట్టి బెదిరింపులకు గురిచేసినట్టు దేవి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింపు పిఠాపురం: స్థానిక కత్తులగూడెంలో నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలికకు (14) గుంటూరుకు చెందిన వ్యక్తితో అన్నవరంలో ఈ నెల 14న వివాహం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఐసీడీఎస్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను స్థానిక పోలీసుల సహాయంతో కాకినాడలోని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. -
చంద్రబాబు నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే కల్తీ ప్రచారం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబునాయుడు తన సొంత నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసి భక్తులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి దయ వల్ల ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. గతంలో కిలో నెయ్యి రూ.308కి సరఫరా చేస్తే ఇప్పుడు అదే క్వాలిటీ నెయ్యికి రూ.716 చెల్లిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలకల్తీ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదన్నారు. ప్రస్తుతం పాలతో పాటు అన్ని వస్తువులలోను చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ జరుగుతోందన్నారు. తప్పుచేసిన వారిని తప్పించేవారు ఉండడంతో కల్తీని అరికట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీలను త్వరితగతిన పూర్తిచేయండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ ఉదయం జిల్లా స్థాయి, మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులందరూ హాజరుకావాలని తెలిపారు. గ్రామాలలోను, డివిజన్లలోను పార్టీ కేడర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్, కడియం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పులూరి వీరవెంకటసత్యనారాయణ, యాదల సతీష్చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. ఎల్పీజీ గ్యాస్కు కొరత లేదు – జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్ టన్నుల గ్యాస్ స్టాక్, 14,829 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11 వేల సిలిండర్లుగా ఉండగా, రీ ఫిల్లింగ్ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను నమ్మవద్దని, జిల్లా అధికారిక మార్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలను కోరారు. గ్యాస్ బుకింగ్ లేదా సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తిన పక్షంలో 8074661259 హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వి. పార్వతి పాల్గొన్నారు. రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అమలాపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణం పొందిన వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న వడ్డీని మాఫీ చేస్తామని కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 66 మంది వినియోగించుకుని రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు. -
పోరుబాట.. విలువలకు పీట
సాక్షి, రాజమహేంద్రవరం: విలువలతో కూడిన రాజకీయాలు అంతమైన తరుణంలో విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెప్పింది వైఎస్సార్ సీపీ. ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ, పార్లమెంటరీ ఇన్చార్జిలు పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు, పార్లమెంటరీ ఇన్చార్జిలు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలను గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొందేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదేశాల మేరకు మార్గాని ఎస్టేట్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పార్టీ సీఈసీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు పాల్గొన్నారు. కొవ్వూరు వైఎస్సార్ సీపీ కొవ్వూరు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తలారి, పార్టీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్ కేట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలను వివరించారు. అంతేగాక తాళ్లపూడి మండలం పెద్దేవం, అన్నదేవరపేట గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటాయి. నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి జి శ్రీనివాస్నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గోపాలపురం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనపర్తి: వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అనపర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవీచౌక్ సెంటర్లోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజానగరం ప్రజల భావోద్వేగాలు, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన వేడుకల్లో రాజా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని, కొన్ని కాలగర్భం లో కలిసిపోయాయన్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు. మండపేట వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం, మండపేట రూరల్ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని సామాన్యుల అవసరాలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించారన్నారు. 16 ఏళ్లుగా ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతర పోరాటం జిల్లాలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు -
ల్యాబోదిబో..
● ల్యాబ్ టెక్నీషియన్ల దురవస్థ ● ఆదుకోని ప్రభుత్వం ● ఉద్యోగాలు అంతంత మాత్రం ● యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు ● నేడు ల్యాబ్ టెక్నీషియన్స్ డే కాకినాడ క్రైం: ప్రభుత్వ సాయం లేదు.. యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు.. స్వయం ఉపాధి పొందుదామన్నా దక్కని ప్రోత్సాహం.. కార్పొరేట్ ల్యాబ్లలో అంతంత మాత్రం జీతాలకే ఊడిగం చేయాల్సి రావడం.. పర్యవేక్షణ లోపం.. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్టీ) రోడ్డున పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిర్ధారించి, వైద్య సేవల్ని నిర్దేశించడంలో వారీ పాత్ర కీలకం. కానీ, ఎల్టీలుగా పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక.. అప్పోసొప్పో చేసి సొంతంగా ల్యాబ్లు పెట్టుకున్న వారు తగినంత సంపాదన లేక తమ భవిత అగమ్యగోచరమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రత్యే కథనం.. ఉద్యోగాలు లేక విలవిల జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 400 మంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీరు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నా వ్యాపారాలు లేవంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎండమావిగానే మిగులుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేవే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టులు. అవి కూడా ఏనాటికో ఒక నోటిఫికేషన్. ఓవైపు చదివిన చదువుకు విలువ లేక, పట్టాలు పొందినా ఉద్యోగాలు రాక, సొంత వ్యాపారాలకు అవకాశం లేక, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేక ఎల్టీల పరిస్థితి కడు దయనీయంగా ఉంటోంది. కుటుంబాలతో సహా రోడ్డున పడే దుస్థితిని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలా మంది బతుకు తెరువు కోసం జొమేటో, బ్లింకిట్, స్విగ్గీ, ర్యాపిడో వంటి వాటిల్లో డెలివరీ బాయ్స్గా, కెప్టెన్లు పని చేస్తూ బతుకు నెట్టుకొస్తున్నారు. సవాల్గా స్వయం ఉపాధి పోనీ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసినా తీవ్ర నష్టాలు తప్పడం లేదు. గతంలో ఓ ల్యాబ్ ద్వారా కనీసం నలుగురు జీవనోపాధి పొంతే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం అద్దె డబ్బులైనా రాని పరిస్థితి. మిషనరీ, రియేజంట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండటం వ్యాపారానికి సవాల్గా మారింది. తాజా జీఎస్టీ సవరణలో తగ్గుదల కనిపించినా అది కంటితుడుపు చర్యగానే మిగిలింది. గతంలో ఏదో ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ను నెలకొల్పి బతికేవాడు. ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో వైద్యులే సొంతంగా ల్యాబ్లు పెట్టుకోవడం వీరి ఉపాధిని దెబ్బ తీస్తోంది. ఆన్లైన్ సేవల పేరుతో.. వివిధ ఆన్లైన్ యాప్లు కూడా ఎల్టీల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. వీటికి స్థానికంగా ల్యాబ్లేవీ ఉండవు. పార్టనర్ ల్యాబ్స్ పేరిట అనుసంధానమవుతున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎంతవరకూ నిజమో పర్యవేక్షించేవారెవ్వరూ ఉండరు. వీరు పరీక్షలు చేసే యంత్రాలు, రియేజంట్ల నాణ్యత ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చి నమూనాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకుంటారు. తరువాతి రోజు వాట్సాప్కు రిపోర్టు పంపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందో, ఎక్కడ పరీక్షించారో ఎవ్వరికీ తెలియవు. అనుమతి లేని ల్యాబ్లు 150 జిల్లాలో అనుమతి లేని ల్యాబ్లు 150 ఉన్నాయి. వీటిని అధికారులు కనీసంగా కూడా పరిశీలిస్తున్న దాఖలాల్లేవు. సాధారణంగా అనుమతులున్న ల్యాబ్ల నుంచి ప్రమాదకర వ్యర్థాలను వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన సేకరిస్తారు. కానీ, అనుమతి పొందకుండా చాటుగా నడుపుతున్న ల్యాబ్లలో మిగిలిన రక్తం, వినియోగించిన సూదులు, ఇతర వస్తువులను ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. వీటిని కాలువలు, చెత్తకుప్పల్లో పడేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.సమస్యలు పరిష్కరించాలి ఎల్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేటి తరుణంలో మా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాలి. అనుమతులు లేని ల్యాబ్లను వదిలేస్తున్నారు. వీటివలన అనుమతులున్న ల్యాబ్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉపాధి వృద్ధికి మార్గనిర్దేశాలూ లేవు. కులమతాలకు అతీతంగా ఎల్టీలకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేసి, వ్యాపార వృద్ధికి తోడ్పడాలి. కనీసం కాంట్రాక్టు పోస్టులైనా ఆటంకం లేకుండా తీయాలి. ఆన్లైన్ ల్యాబ్ల కార్యకలాపాలను కూలంకషంగా పర్యవేక్షించాలి. – వెంకట్ ఎన్నపు, ల్యాబ్ టెక్నీషియన్, కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
భేటీ భేష్... పార్టీకి జోష్
కాకినాడ వేదికగా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశంసాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ వేదికగా బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అవ్వడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు ప్రభుత్వం నుంచి, పాలకుల నుంచి అనేక అక్రమ పోలీసు కేసులు, వేధింపులు ఎదుర్కొంటున్నా లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అగ్ర నేతలు మొదలుకుని ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ఉత్తుంగ తరంగాలై కాకినాడ తరలివచ్చారు. సమావేశానికి హాజరయ్యే వారి కోసం కాకినాడ సినిమా రోడ్డులోని సూర్యకళామందిర్లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ నేతలు క్యూ కట్టారు. కార్యవర్గ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన అరగంటలోనే సమావేశ మందిరం సూర్యకళామందిర్ పార్టీ నేతలు, శ్రేణులతో నిండిపోయింది. కూర్చునేందుకు వీలులేక వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ దళిత నేతలు హాలు బయటే ఉండిపోయారు. సమావేశం ప్రారంభమైన ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటలకు ముగిసే వరకు పార్టీ శ్రేణులు శ్రద్ధగా ముఖ్యనేతల ప్రసంగాలను ఆలకించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను తూర్పార బట్టిన నేతలు కాకినాడ వేదికగా జరిగిన సమావేశంలో వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై చంద్రబాబు ప్రభుత్వంలో సాగిస్తున్న వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ పోలీసు కేసులు, హత్యలు, అత్యాచారాలపై నేతలు ఉదాహరణలతో సహా కడిగి పారేశారు. మాల, మాదిగలను విడదీసి రాజ్యాధికారానికి దూరం చేసిన చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని జూపూడి, సుధాకర్బాబు వంటి నేతలు పిలుపు ఇచ్చినప్పుడు పార్టీ ఎస్సీ సెల్ నేతల నుంచి మంచి స్పందన లభించింది. రాజధాని అమరావతిలో భూములు లాగేసుకుని దళితులను వెళ్లగొట్టే కుట్రల దగ్గర నుంచి వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతోన్న అధికార పార్టీ నేతల తీరును నేతలు తూర్పార బట్టారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు గ్రామ, గ్రామాన దళిత వర్గాలకు అవగాహన కల్పించాల్సి అవసరాన్ని పార్టీ నేతలు నూరిపోశారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా దళితులకు కల్పించిన ప్రయోజనాలు గణాంకాలతో సహా వివరించిన నేతలు ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన సందర్భంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు జై జగన్, 2029లో జగనే సీఎం అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఇందుకోసం అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఎన్ని కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మీ వెంట ఉంటామంటూ నేతలు కొండంత ధైర్యాన్నిచ్చారు. ఇందుకోసం దళితులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అవమానాలపై ఆగ్రహం దళితుల జోలికొస్తే ఏం జరుగుతుందో సర్కార్కు తెలిసొచ్చేలా చేస్తామంటూ కార్యవర్గ సమావేశం డిక్లరేషన్లో చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. అమరావతి రాజధానిని కుల రాజధానిగా చేసిన వైనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అవగాహన కల్పించే విషయంలో పార్టీ శ్రేణులంతా చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా నేతలు తమ ప్రసంగాల్లో సూటిగా తెలియచేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో విజయవాడ స్వరాజ్ మైదానంలో జగన్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వంలో జరుగుతోన్న అవమానాలపై పార్టీ నేతలు ఒకే గొంతుకై నిరసించారు. సంపన్నులకు కాకుండా సామాన్యులైన దళితులకు జగన్మోహన్రెడ్డి కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని జూపూడి, మేరుగు నాగార్జున్, తాటిపర్తి చంద్రశేఖర్, మొండితోక అరుణ్కుమార్ వంటి నాయకులు వివరించే సందర్భంలో సూర్యకళామందిర్లో పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాలు మిన్నంటాయి. సరికొత్త ఉత్తేజం దశాబ్దన్నర కాలం క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్రెడ్డి పార్టీని ప్రకటించారు. ఈ అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమై 15 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక రోజు ముందు కాకినాడలో పార్టీ ఎస్సీ సెల్ సమావేశం జరగడం పార్టీ భవిష్యత్కు శుభసంకేతమంటూ నేతలు చర్చించుకోవడం కనిపించింది. నాడు పార్టీ జెండా, అజెండా ఇదే జిల్లా నుంచి ఆవిష్కృతం కావడాన్ని పార్టీ నేతలు ప్రస్తావించి పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యవర్గ సమావేశం చివర్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పేరుతో కొత్తగా ‘జగనన్నకు తోడుగా–రాజన్న రాజ్యం మళ్లీ సాధిద్దాం’, ‘జగనన్న దళిత ఫోర్స్–దళిత జాతి మేలుకో’ అంటూ రూపొందించిన గీతం ఆహూతులైన పార్టీ శ్రేణులను అలరించింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు ఈ గీతాన్ని ఆవిష్కరించినదే తడవుగా పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఊగిపోయారు. శ్రేణులు ఉత్సాహంతో పార్టీ కండువాలతో గీతానికి లయబద్ధంగా నృత్యాలు చేశారు. మొత్తంగా పార్టీ ఎస్సీ సెల్ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన నేతల ప్రసంగాలు కదలి వచ్చిన దళిత లోకం అక్రమాలు, దౌర్జన్యాలపై పోరుబాటే.. 2029లో జగన్ను సీఎం చేయడమే అజెండా వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా దళితులు దళితులు వైఎస్సార్ సీపీకి వెన్నెముకగా నిలిచారనే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. దళిత ఉన్నతాధికారులకూ వేధింపులు తప్పడం లేదు. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దళిత క్రిస్టియన్లను అన్ని విధాలా మోసం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దళితులంతా కలిసి కట్టుగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, గోపాలపురం జగన్ను సీఎం చేసేందుకు దళితులు శ్రమించాలి గ్రామ గ్రామాన పర్యటించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతో పాటు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు దళితులంతా శ్రమించాలి. మనందరి గోల్ జగన్ను సీఎంను చేయడమే. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీలంటే గౌరవంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డి అంతకు మించి చేసి మెడికల్ కాలేజీలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. జగన్ పార్టీ రహితంగా అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేశారు. గ్రామాలలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్తో దళితులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించారు. – పాముల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేశారు తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అన్నివిధాలా ఆదుకున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పెట్టి దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. అదే పేదలకు ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేసింది చంద్రబాబు. వైఎస్సార్ సీపీ హయాంలో హోంమినిస్టర్ తానేటి వనిత చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుత హోంమినిష్టర్ అనిత తాను సొంతంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కూటమి మంత్రుల మాటలు ఆకాశాన్నంటుతున్నాయి. దళితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా అణగదొక్కుతోంది. – జక్కంపూడి విజయలక్ష్మి, పీఏసీఎస్ సభ్యురాలు ప్రజలను మోసం చేశారు ఒక అబద్ధం అనేకసార్లు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నాయకులు పార్టీలు మారారు తప్ప, ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి వైఎస్సార్ సీపీ విజయానికి ఎస్సీలందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఎస్సీల తలరాతలు మారతాయి. – అంగులూరి లక్ష్మీకుమారి, మాజీ ఎమ్మెల్సీ -
అవయవ దానంపై అవగాహన ర్యాలీ
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ ఎస్.భవ్య కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ మీదుగా దేవీచౌక్ వరకూ ప్రదర్శన కొనసాగింది. డీఎస్పీ మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది పీఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 31 రూర్బన్ పంచాయతీలు రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పదివేల మందికి పైగా జనాభా, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జిల్లాలోని 31 పంచాయతీలకు గుర్తింపు లభించింది. అలాగే గ్రేడ్ – 1 పంచాయతీలుగా 167, గ్రేడ్ – 2గా 75, గ్రేడ్–3గా 69 పంచాయతీలు ఆమోదం పొందాయి. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్సిటి, కోలమూరు, కాతేరు, కడియం, వేమగిరి, కడియపులంక, రాజానగరం, దివాన్చెరువు, పాలచర్ల, చెల్లూరు, కేశవరం, ఏడిద, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, బలభద్రపురం, చాగల్లు, దేవరపల్లి, గోకవరం, గోపాలపురం, నల్లజర్ల, పోతవరం, ఖండవల్లి, పాలంగి, ఉండ్రాజవరం, వేలివెన్ను రూర్బన్ పంచాయతీలుగా మారాయి. ఏప్రిల్ 25న పాలిసెట్ రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ను ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్లైన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల మురళి అన్నారు. ఆ కళాశాల ఆవరణలో బుధవారం పాలిసెట్ పోస్టర్లను లెక్చరర్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లోని 14 కేంద్రాల్లో సుమారు 8 వేల మంది విద్యార్థుల వరకూ పరీక్ష రాయనున్నారన్నారు. ఈ ఏడాది నుంచి నిడదవోలు, తుని ప్రాంతాల్లో కూడా కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు తమ కళాశాలలో ఏప్రిల్ 2 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు రాజమహేంద్రవరం సిటీ: అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ కిశోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్, మరో 20 మంది సిబ్బందితో ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని అన్ని శాఖలను తమ అధీనంలోకి తీసుకున్నారు. సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు, సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న 20 డాక్యుమెంట్లను గుర్తించినట్టు సమాచారం. -
నేడు వైఎస్సార్ సీపీఆవిర్భావ దినోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధికి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను వంచించిందన్నారు. -
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబుబోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కాకినాడ రూరల్: పార్టీ జిల్లా ఎస్సీ సెల్ను గ్రామగ్రామాన బలోపేతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళామందిర్లో బుధవారం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షనత జరిగిన పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సమావేశంలో సుధాకర్బాబు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమావేశం విజయవంతానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిలను వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా సత్కరించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ గోదావరి జిల్లాల యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాంజీ, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ నేతలు పెదపాటి అమ్మాజీ, కాశి మునికుమారి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు పలివెల సుధాకర్, గుల్లా ఏడుకొండలు, క్రీస్టియన్ మైనార్టీ సెల్ నేత జానీ వెస్లీ పాల్గొన్నారు. -
నేలపై కూర్చుంటున్నాం
తరగతి గదులు లేకపోవడంతో నేలపైనే కూర్చుని చదువుకుంటున్నాం. ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 104 మంది విద్యార్థులకు రెండు వాష్ రూమ్లే ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి. ఒకటో తరగతి నుంచీ ఇక్కడే చదువుతున్నాను. – సీహెచ్ సత్యశ్రీ, 8వ తరగతి వసతులు లేవు పాఠశాలలో కనీస వసతులు లేవు. వాష్ రూమ్లకు రావడం లేదు. తాగునీటి సమస్య కూడా ఉంది. ప్రధానంగా గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. 104 మంది విద్యార్థులను మూడు గదుల్లో ఉంచి ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నారు. – జి.దీప్తి శ్రీవేణి, 8వ తరగతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం భవనాలు శిథిలావస్థకు చేరడంతో అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించాం. కొత్త భవనాల నిర్మాణానికి ఏసీఆర్లో ప్రతిపాదనలు పంపించాం. సమస్య జిల్లా స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. తాత్కాలికంగా గ్రామ సచివాలయ భవనంలోకి మార్చడానికి ఏర్పాట్లు చేయగా కొందరుగ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. వచ్చే విద్యాసంవత్సరానికి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి, గోపాలపురం -
మొండి గోడు వినేదెవ్వరు!
ఫ మొండి గోడల మధ్య విద్యాబోధన ఫ మూడు గదులు, ఎనిమిది తరగతులు ఫ గోపవరం పాఠశాల దుస్థితి ఫ ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి దేవరపల్లి: పైకప్పు లేని పాఠశాల భవనం.. కేవలం మూడు తరగతి గదులు.. సుమారు 104 మంది విద్యార్థులకు బోధన.. నమ్మలేని ఈ నిజాన్ని చూడాలంటే గోపాలపురం మండలం గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలకు రావాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాలల దుస్థితికి ఇది నిదర్శనంగా నిలిచింది. మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ విద్యాబోధన జరుగుతోంది. ఏడాదిన్నరగా.. ఈ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు ఏడాదిన్నర క్రితం అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించారు. తొలగించిన శిథిలాలు ఎక్కడక్కడ ఉండిపోవడంతో ఇటీవల పాఠశాల నిర్వహణ నిధుల నుంచి ఉపాధ్యాయులు తొలగించారు. భవనాల పైకప్పులు తొలగించిన, వాటి నిర్మాణం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పాఠశాలలో రెండు భవనాలను దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇవి బీటలు తీసి, శ్లాబ్లు పెచ్చలూడి ప్రమాదకరంగా మారటంతో, వాటిని తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భవనాలను పూర్తిగా తొలగించకుండా పైకప్పులను మాత్రమే తీసివేశారు. ఆ మొండి గోడల మధ్య దాదాపు 16 నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎండలు పెరిగిపోవడంతో మొండి గోడలపై ప్లాస్టిక్ బరకాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. రెండే మరుగుదొడ్లు ఈ పాఠశాలలో 104 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వీటినే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ వినియోగిస్తున్నారు. కనీసం నీటి వసతి లేకపోవడంతో అవి అధ్వానంగా మారాయి. బాలుర మరుగుదొడ్డి తలుపు శిథిలమై వేలాడుతోంది. గదులు లేక ఆరు బయట వరండాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. బల్లలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులూ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట గది దుస్థితి మధ్యాహ్న భోజనం పథకంలో వంటలు చేయడానికి నిర్మించిన వంటశాల శిథిలావస్థకు చేరుకుంది. వంటశాలకు ఉన్న తలుపు పాడైపోవడంతో ఎలుకలు సంచరిస్తున్నాయని, కూరగాయలు, నిత్యావసరాలను పాడుచేస్తున్నాయని వంట ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చేపట్టిన వంట షెడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. -
పల్లెసేవకు ప్రోత్సాహకం
ఫ ఫెలోషిప్ అందించనున్న ఎస్బీఐ ఫ యువతకు మంచి అవకాశం బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమనేది జగమెరిగిన సత్యం. యువత భాగస్వామ్యంతో దీన్ని ఆచరణలోకి తేచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ ఫర్ ఇండియా పేరిట ఫెలోషిప్ అందిస్తోందని ఆ బ్యాంక్ గైగోలుపాడు శాఖ చీఫ్ మేనేజర్ అద్దంకి శివప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పల్లెసేవకు ముందుకు వచ్చే యువతను ఈ పథకం ద్వారా అన్ని విధాలా ప్రోత్సహించనుంది. దీనికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. 2026 అక్టోబర్ లోగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 13 నెలలు కొనసాగే ఈ కార్యక్రమానికి ఎంపిక పక్రియ వివిధ దశల్లో ఉంటుంది. దరఖాస్తులో ప్రాథమిక వివరాలు అందిస్తే రెండో దశలో ఆన్లైన్ అసైన్మెంట్లో సామాజిక సమస్యలపై వ్యాసాలు రాయడంతో పాటు వాటికి పరిష్కారం చూపే సూచనలు ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూయూత్ఫర్ఇండియా.ఓఆర్జీ అనే ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. గౌరవ వేతనం ఎంపికై న వారికి నెలకు రూ.16 వేల గౌరవ వేతనం అందిస్తారు. ప్రయాణ ఖర్చులకు రూ.2 వేలు, ప్రాజెక్టు సమర్పణకు రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తారు. ఫెలోషిప్ను విజయవంతంంగా పూర్తి చేసిన వారికి రీఅడ్డస్ట్మెంట్ అలవెన్స్ రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఫెలోషిప్ కాలంలో ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ప్రయోజనాలు జాతీయ స్థాయిలో పేరుపొందిన ఎస్బీఐ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, గ్రామీణుల జీవనోపాధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు సేవారంగంలో ముందుకు వెళ్లాలనుకునే యువతకు ఇదో మంచి వేదికగా చెప్పవచ్చు. ఫెలోషిప్ పూర్తిచేసిన వారికి లభించే ధ్రువీకరణ పత్రాల ద్వారా భవిష్యత్తులో ఉత్తమ అవకాశాలు పొందవచ్చు. -
సచివాలయ సిబ్బందికి గాయాలు
వై.రామవరం: మండలంలోని చవిటిదిబ్బలు గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ సిబ్బంది గాయపడ్డారు. వై.రామవరం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పొత్తూరి సత్యనారాయణరెడ్డి, పి.యర్రగొండ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పల్లాల విజయకుమారి ద్విచక్ర వాహనంపై విధుల నిర్వహణకు వై.రామవరం వైపు వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో రోడ్దు మీద పడిపోయి గాయపడ్డారు. అయినా వీరిని పట్టించుకోకుండా కారు వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు చవిటిదిబ్బలు పీహెచ్సీకి తరలించగా, ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వై.రామవరం సీహెచ్సీకు తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై ఎస్.పృథ్వీ యాదర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారకుడైన తహసీల్దార్ కారు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులతో పాటూ సచివాలయాల సిబ్బంది యూనియన్ నేతలు కోరారు. -
కల్తీ పాల దుర్ఘటనపై సీబీఐ విచారణ
● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ ● బాధితులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి రాజమహేంద్రవరం సిటీ: కల్తీ పాల దుర్ఘటనపై నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని, ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో కల్తీపాల ఘటనతో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే సమయం లేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనను ప్రభుత్వం యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీకి ఎందుకు పంపలేదో తెలియడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలన్నారు. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదన్నారు. బాధితుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైందని, ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారని, ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతోందో తెలియడం లేదన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచిందన్నారు. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటా కల్తీ రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు హయాంలో తిరుమల లడ్డూకు సంబంధించి ఘీ ఫ్లేవర్ ఎన్ హ్యాన్సర్స్ కొన్నారు అదీ కల్తీయేనన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం అందించడం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తనిఖీల గురించి ప్రశ్నిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాకు స్టాఫ్ లేరని చెప్పడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నేతలు సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, వాసంశెట్టి గంగాధర్, తిరగాటి దుర్గారావు, రొక్కం త్రినాఽథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏసీబీ దాడుల్లో కీలక పత్రాల స్వాధీనం
● అక్రమ కట్టడాల నేపథ్యంలో నగర పాలక సంస్థలో విస్తృత తనిఖీలు ● సుమారు 12 గంటల పాటు నిర్వహణ రాజమహేంద్రవరం సిటీ: నగర పరిధిలో అడ్డగోలు నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు అనుమతులు, పట్టణ ప్రణాళికా విభాగం అవినీతి భాగోతాలపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి ఆదేశాల మేరకు డీఎస్సీ కిశోర్కుమార్ ఇన్స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్ మరో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 8.30 నిముషాల వరకూ విస్తృతంగా తనిఖీ చేపట్టారు. నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. నగరంలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, దరఖాస్తులు పెండింగ్కు గల కారణాలను అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు ఎన్ని మంజూరు చేశారు. ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే విషయాలను పరిశీలించారు. సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి కార్యాలయంలో కంప్యూటర్, వివిధ స్థాయి అధికారుల ఫైల్స్ పరిశీలించి కీలకమైన డాక్యమెంట్స్ను స్వాధీన పరుచుకున్నట్లు సమాచారం. నగరంలో అత్యధిక అక్రమ కట్టడాల నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్లోని వివిధ విభాగాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వివిధ వేదికల ద్వారా ఏసీబీ దృష్టికి వెళ్లడం, ప్రజల నుంచి, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు, పలు కథనాలు రావడంతో ఏసీబీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగి అవినీతిపై అకస్మిక తనిఖీలు చేపట్టింది. భవన నిర్మాణాల అనుమతుల్లో నిబంధనల అతిక్రమణలు ఉన్నాయా అనే విషయాన్ని సైతం అధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ను వివరణ కోరగా తనిఖీలు నిర్వహించి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
ఖేలో ఇండియా ఫుట్బాల్ ఉత్తమ క్రీడాకారుడిగా సమంత్కుమార్
దేవరపల్లి: రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన దేవరపల్లి అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి కె.సమంత్కుమార్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. సమంత్కుమార్కు నిర్వాహకులు రూ.35 వేల విలువ గల ఎలక్ట్రికల్ సైకిల్ను బహుమతిగా అందజేసి సత్కరించారు. పోటీల్లో జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా సమంత్కుమార్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికై నట్టు పీడీ ఓరుగుంటి రామకృష్ణంరాజు తెలిపారు. జాతీయ విద్యా విధానం అమలుకు కృషి చేయాలి ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ రాజానగరం: జాతీయ విద్యా విధానం 2020తోపాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల నిర్మాణాత్మక అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్ హాలులో గోదావరి జిల్లాల్లోని అనుబంధ డిగ్రీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్, మెంబర్స్తో మంగళవారం సమావేశమయ్యారు. కోర్సుల నిర్మాణం, సిలబస్ పునర్నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని యూజీ ప్రొగ్రామ్లకు సాధారణ ఫ్రేమ్ వర్కు నియమాలు, ఉత్తీర్ణతా ప్రమాణాలను నియంత్రించే ‘యూనివర్సిటీ కామన్ కోర్ ఫ్రేమ్ వర్కు’ను సృష్టించడం, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఫ్రేమ్ వర్కు ప్రకారం క్రెడిట్ల నిల్వ, బదిలీ, విముక్తికి సంబంధించి ప్రత్యేక నియమాలను రూపొందించాలని సూచించారు. పరీక్ష నిబంధనల పునర్నిర్మాణం, గ్రేడింగ్, భాషలు, స్కిల్ డెవలప్మెంట్, భారతీయ జ్ఞాన వ్యవస్థలు వంటి సాధారణ పత్రాల పునర్నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. డిగ్రీ కోర్సులకు సంబంధించి సిలబస్ తయారీ, మోడల్ పరీక్షా పత్రాలు వంటి అంశాలపై చర్చించారు. తెలుగు వర్సిటీకి వేటూరి సాహిత్య సంపుటాలు రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రముఖ సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్య సంపుటాలను బహూకరించారని ఉపాధ్యక్షుడు ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు, సినీగేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు–ఎనిమిది గ్రంథాలుగా అమెరికాలోని వేటూరి సాహిత్యభిమాన సమితి వారు 2026 జనవరిలో తొలిసారిగా ప్రచురించారన్నారు. దొరకునా ఇటువంటి సేవ(వాల్యూమ్–1), మానసవీణా మధుగీతం(వాల్యూమ్–2), నవమి నాటి వెన్నెల(వాల్యూమ్–3),ఎడారికోయిల(వాల్యూమ్–4), ఝమ్మంది నాదం(వాల్యూమ్–5), ఎరక్కపోయి వచ్చాను (వాల్యూమ్–6) గ్రంథాలతో పాటు గతంలో ప్రచురించిన వేటూరి సుందర రామమూర్తి పుస్తకాలు‘కొమ్మకొమ్మకోసన్నాయి’, ‘రాబిన్హుడ్’,‘జీవనరాగం’‘సిరికాకొలనుచిన్నది’ సంపుటాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉండేవిధంగా సుందరరామమూర్తి కుమారుడు వేటూరి రవిప్రకాష్ ఆచార్య మునిరత్నంనాయుడుకు మంగళవారం అందజేశారు. రాజమహేంద్రవరం సాహిత్యపీఠంలో డాక్టర్ పొన్నాలీలావతి పర్యవేక్షణలో జయంతి చక్రవర్తి అనే విద్యార్థి వేటూరి సుందరరామమూర్తి పాటలు – సాహిత్యపు విలువలు అనే అంశంపై పీహెచ్డీ కోసం పరిశోధన చేసి పట్టా అందుకోవడం విశేషమని ఆచార్య మునిరత్నంనాయుడు తెలిపారు. -
అరాచకంపై దళిత గళం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ, అరాచకానికి వ్యతిరేకంగా దళితులు గళమెత్తనున్నారు. ఈ దిశగా చేపట్టే ఉద్యమ కార్యాచరణకు కాకినాడ వేదిక కానుంది. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిర్లో బుధవారం వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం కార్యవర్గ వర్క్షాప్ (చర్చ) నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు, దళితులపై అన్యాయంగా ఎడాపెడా పెడుతున్న అక్రమ పోలీసు కేసులు, అత్యాచారాలు, గాడి తప్పిన పాలన, సంక్షేమాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సందర్భంగా నేతలు చర్చించనున్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షతన బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ ఎస్సీ సెల్ 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. విస్తృత ఏర్పాట్లు సాధారణంగా ఇటువంటి చర్చ, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతూంటాయి. దీనికి భిన్నంగా బయట ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అది కూడా కాకినాడలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తూండటంతో విస్తత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుధాకర్బాబు పర్యవేక్షణలో శెట్టిబత్తుల కుమార్రాజా ఆధ్వర్యాన ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ అంగన్వాడీ వర్కర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత తదితరులు వర్క్షాప్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చే పార్టీ ఎస్సీ నేతలకు చర్చకు అనువైన రీతిలో సూర్య కళామందిర్లో వేదిక ఏర్పాటు, సౌకర్యాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ తదితరులు పర్యవేక్షించారు. పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లకు ఆహ్వానం పంపించారు. ·˘ నేడు కాకినాడలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం వర్క్షాప్ ·˘ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం ·˘ తరలి రానున్న ముఖ్య నేతలు, శ్రేణులు విజయవంతం చేయండి రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఎస్సీ సెల్ వర్క్షాపును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కదలి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆయా జిల్లాల్లో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వర్క్షాప్లో నివేదికలు అందించి, చర్చకు పెట్టనున్నారు. జిల్లాలో తొలిసారి జరుగుతున్న ఈ వర్క్షాపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీ సెల్ ముఖ్య నేతలు, మండల, గ్రామ విభాగాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు తరలి రావాలి. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్తో మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకూ వర్క్షాప్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు పార్టీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. – శెట్టిబత్తుల కుమార్రాజా, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు -
నిబంధనలకు విరుద్ధంగా బార్ నిర్మాణం
ఫఆపకుంటే ఆందోళన చేపడతాం ఫకాకినాడ నాగమల్లితోట వాసుల ఆందోళన కాకినాడ రూరల్: గుడి, బడి, ఆస్పత్రులకు దగ్గరగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా బార్ నిర్మాణ పనులు చేపడుతున్నారని నాగమల్లితోట కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగమల్లితోట పారిశ్రామిక వాడలో మూతపడిన ఒక యూనిట్ వద్ద పాత భవనాలను కూల్చివేసి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. బయట బార్ లైసెన్స్తో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో బార్ నిర్వహిస్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని, ఆకతాయిలు, మద్యం బాబులతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ మార్గంలోనే రెండు కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. పాఠశాలల సమీపంలో ఉండడంతో ఈ మార్గంలోనే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుడి పక్కనే బార్కు అనుమలు ఇవ్వడంపై అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బార్ నిర్మాణ పనులు ఆపకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
లారీ ఢీకొని ఇద్దరు బస్సు డ్రైవర్ల మృతి
ఫ మరో బస్సు క్లీనర్కి తీవ్ర గాయాలు ఫ నార్కట్పల్లిలో రోడ్డు ప్రమాదం నార్కట్పల్లి: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. మరో బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోజో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడకు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున నార్కట్పల్లి మండల పరిధిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే.. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ, బస్సు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ పక్కన వాహనాలను ఆపి వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వెళుతున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకోగా, ఆ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్ (30), చిట్టకెన బంగారయ్య(45) బస్సును పక్కకు ఆపి అప్పటికే వాదించుకుంటున్న బస్సు, లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ.. ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు డ్రైవర్లు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్, చిట్టికెన బంగారయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మొదట ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్ సురేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్పల్లి సీఐ, నార్కట్పల్లి, చిట్యాల ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలు, బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్, బంగారయ్య మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి, గాయపడిన క్లీనర్ సురేష్ను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్లోని మెహిదీపట్నం సమీపంలోని గుడిమల్కాపురం వాంబే కాలనీలో నివాసముంటుండగా.. బంగారయ్య స్వస్థలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ అని ఎస్ఐ తెలిపారు. -
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
తుని: స్థానిక సీతారాంపురంలోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఉన్న మురుగు కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సీఐ ఎం.గీతా రామకృష్ణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాలువలో వ్యక్తి మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉంటుందని, ఒంటిపై మెరూన్ కలర్ పువ్వుల షర్టు, లైట్ కలర్ జీన్ ప్యాంటు ఉన్నాయని, అతడి దగ్గర లభించిన బ్యాగు లో తమలపాకులు కట్ చేసే వేతివేళ్ల పనిముట్లు ఉన్నాయన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు తుని పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గొండోలు వంతెనను ఢీకొన్న కారు అడ్డతీగల: గొండోలులోని మడేరు వాగుపై ఉన్న వంతెనను మంగళవారం మితిమీరిన వేగంతో వచ్చిన నంబర్ లేని కారు బలంగా ఢీకొట్టింది. రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల వైపు వస్తున్న ఈ కారు అదుపు తప్పి, వంతెన గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. దానిలోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ కారు కొద్దిగా ముందుకు వెళితే సుమారు 150 అడుగుల లోతులో కాలువలో పడిపోయి ఉండేది. దీనిపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు గేదెల సజీవ దహనం
సామర్లకోట: పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పాడి గేదెలు సజీవ దహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఏలేరు కాలువ గట్టుపై పశువుల కోసం ఉండవిల్లి వెంకన్నబాబు పాక వేసుకున్నాడు. దానిలో రెండు పాలిచ్చే గేదెలు, మూడు చివిడి గేదెలను ఉంచాడు. అయితే మంగళవారం పాక మీదుగా వెళుతున్న విద్యుత్ తీగ తెగి పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో ఐదు గేదెలూ కాలిపోయాయి. సమీపంలో వెంకన్నబాబుకు చెందిన గడ్డి మేటుతో పాటు మరో రెండు పాకలు కాలిబూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు ప్రమాద వివరాలను తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మికి సమాచారం ఇచ్చారు. బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు పాదాలమ్మ ఆలయం సమీపంలో మంగళవారం ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. చిట్ర లోవరాజు, జోష్ సత్య అప్పలరాజు బైక్పై ఏలేశ్వరం మండలం సిరిపురం వెళుతున్నారు. అలాగే ఏలేశ్వరం మండలం యర్రవరం నుంచి బైక్పై గుమ్ములూరి లచ్చబాబు ప్రత్తిపాడు వస్తున్నాడు. సరిగ్గా పాదాలమ్మ ఆలయం సమీపానికి వచ్చే సరికి ఎదురెదురుగా వీరు ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురికీ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు హెల్త్ సెంటర్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. చాగల్లులోమృతదేహం కలకలం! చాగల్లు: చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ యార్డులోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పూడ్చివేశారనే వార్త మంగళవారం ఉదయం గ్రామంలో హల్చల్ చేసింది. గ్రామంలోని ఉపాధి కూలీలు పని కోసం యార్డు వైపు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోతులో మట్టి వేసి పూడ్చుతున్నట్లు కనిపించింది. దీంతో అక్కడ మృతదేహాన్ని పూడ్చారంటూ వార్త హల్చల్ చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కె.నరేంద్ర తన సిబ్బందితో కలిసి యార్డు వద్దకు చేరుకుని గొయ్యి తవ్వించారు. అందులో చనిపోయిన కుక్క కళేబరం కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంగారు ఆభరణాల చోరీ అయినవిల్లి: తొత్తరమూడి పెదపాలెంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. అయినవిల్లి ఎస్సై వై.జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాలేనికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి ఈ నెల 10న తన ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి వెనుక భాగంలో తలుపులు బద్ధులుకొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలకు వెళ్లిచూడగా గదిలోని బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో బంగారం చెవి దిద్దులు, ఒక అంజి ఉంగరం, నల్లపూసల లాకెట్, మూడు చిన్న రూపులు కలిపి సుమారు 16 గ్రాముల బంగారం, కొంత నగదు మాయమైనట్టు గుర్తించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది’
రాజమహేంద్రవరం : కల్తీ పాల ఘటన బాధితుల గురించి కూటమి నేతలు పట్టించుకునే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయడానికి టైం ఉంది.. కానీ కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే టైం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవాం, మార్చి 10వ తేదీ) రాజమహేంద్రవరం ఆసుపత్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్.రాజమండ్రిలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది. నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదా?, దీన్నో యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల శాంపిళ్ళు నేషనల్ ఫోరెన్సిక్ లేబరేటరీకి ఎందుకు పంపలేదు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి. అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయి. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలి. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి. పాలలో యూరియా కలిసిందా... ఫార్మాలిన్ కలిసిందా... గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా... అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు. బాధితు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. మీ కుటుంబంలోనే ఇటువంటి ఘటనలు జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా?, పురుగుల మందు తీసుకుని ఎలా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొంటారో అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతుంది.ప్రభుత్వం హైడ్రామా ఆడుతోంది.ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచింది. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కల్తీయే. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు. -
వివాహిత ఆత్మాహత్యాయత్నం
యానాం: యానాం – ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, స్థానికులు రక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ద్రాక్షారామకు చెందిన పెట్టా సత్యలక్ష్మి స్థానిక బాలయోగి వారధి వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అందరూ చూస్తుండగానే గోదావరిలో దూకింది. వెంటనే స్థానికులు గమనించి గోదావరిలో వేటాడుతున్న మత్స్యకారులకు తెలపగా, వారు నావలపై వెళ్లి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం యానాం జీజీహెచ్కు తరలించగా, అక్కడి నుంచి ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై పునీత్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అమలాపురం టౌన్: ముందు రెక్కీ నిర్వహిస్తారు.. తాళం వేసిన ఇళ్లను గమనిస్తారు.. రాత్రి పూట ఆ ఇళ్లకు వెళ్లి తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడతారు. ఇలా ఆలమూరు మండలం పేనికేరు గ్రామంలో గత నెల 14న రాత్రి ఓ ఇంట్లో జరిగిన చోరీపై తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ దొంగల ముఠా బండారం బయట పడింది. చోరీలు చేస్తున్న ఆ ముగ్గురూ 22 ఏళ్ల లోపు యువకులే. ఇందులో ఆలమూరు మండలం పెద్ద పళ్ల గ్రామానికి చెందిన కంచెర్ల జార్జ్ బెన్నీ, సన్నపు శ్రీచరణ్, కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఉందుర్తి ఆనంద్కుమార్లను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 32.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐలు, ఎస్సైలతో కలసి అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఆలమూరు పోలీస్ స్టేషన్లో తాజాగా జరిగిన రెండు చోరీ కేసుల్లో పైముగ్గురు నిందితులు. కంచెర్ల జార్జిబెన్నీపై గతంలో ఆలమూరు, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం, గంజాయి కేసులు ఉన్నాయి. ఉందుర్తి ఆనంద్కుమార్పై గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు ఉంది. ఈ చోరీ కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్తో పాటు రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం సీసీఎస్ సీఐ ఎం.గజేంద్రకుమార్, క్లూస్ టీమ్ సీఐ కె.ప్రవీణ్కుమార్, ఆలమూరు ఎస్సై జి.నరేష్, సీసీఎస్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, సీసీఐ ఏఎస్సై రాజు తదితరులను ఎస్పీ ప్రశంసించారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊళ్లకు వెళితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మీనా విజ్ఞప్తి చేశారు. ఫ చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్ ఫ రూ.32.40 లక్షల సొత్తు స్వాధీనం -
ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య
నిడదవోలు: ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు కథనం ప్రకారం.. తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఆకుల ప్రసాద్బాబు, శాంత దంపతులకు గొడవల కారణంగా విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ తల్లితో కలసి నిడదవోలు రాయిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తణుకులో పెద కుమార్తె ఆకుల నిర్మల పదో తరగతి, రెండో కుమార్తె ఆకుల ఐశ్వర్య (13) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తణుకులో ఎస్సీ హాస్టల్లో ఉంటూ స్కూల్కి వెళ్తున్నారు. అయితే ఈ నెల 7న ఐశ్వర్య జన్మదినం సందర్భంగా నిడదవోలులో ఇంటికి వచ్చింది. తండ్రి ప్రసాద్బాబు చిన కుమార్తె ఐశ్వర్య బర్త్ డే సెలబ్రేషన్కు రూ. 8 వేలు పంపించారు. దీంతో ఐశ్వర్య కుటుంబ సభ్యులతో కలసి ఎంతో ఆనందంగా పుట్టిన రోజును జరుపుకొంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ సమయంలో ఐశ్వర్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. తల్లి శాంత, కుటుంబ సభ్యులు కలసి ఐశ్వర్య మృతదేహాన్ని తమ సొంతూరు వీరభద్రపురానికి తీసుకువెళ్లారు. చిన కుమార్తె మృతి చెందిన సమాచారం తెలుసుకున్న తండ్రి ప్రసాద్బాబు నిడదవోలు వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి తణుకు వెళ్లి విచారణ చేపట్టారు. -
కువైట్లో చిక్కుకున్నా.. కాపాడండి
పిఠాపురం: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి క్షణం భయం భయంగా ఉందని, తన తోటివారు ఇళ్లకు వెళ్లిపోయారని, తనను కాపాడండంటూ పిఠాపురం పట్టణానికి చెందిన దాకే కుమారి సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. పిఠాపురం రథాలపేటకు చెందిన కుమారి కొన్నేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అయితే ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదని తనను రక్షించాలని ఆమె వేడుకుంటోంది. తన భార్యను ఎలాగైనా స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె భర్త దాసు వేడుకుంటున్నాడు. -
పాలాకులు పట్టించుకోక..
అధికారుల పర్యవేక్షణ కరవు లొల్ల లాకులను 20 ఏళ్ల నుంచి పట్టించుకోవడం లేదు. ప్రధానంగా బ్యాంకు కాలువపై ఉన్న లాకులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటుగా అధిక బరువు ఉన్న లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ కరవైంది. ఈ సమస్యను కొత్తపేట ఎమ్మెల్యే బండారు అనేక సార్లు సీఎం దృష్టిలో పెట్టారు. – కరుటూరి నరసింహారావు, అంకంపాలెం, జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వెంటనే నిర్మించాలి కూటమి ప్రభుత్వం వెంటనే లొల్ల లాకులను నిర్మించాలి. లొల్ల లాకులపై అమలాపురం– బొబ్బర్లంక ఆర్అండ్బీ రహదారి ఉండటం వల్ల భారీ వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లాకులను పునర్నిర్మించడం వల్ల కోనసీమ ప్రాంత రైతులకు సాగునీరు సజావుగా అందుతుంది. – ముదునూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు ఆత్రేయపురం: కాటన్ మహాశయుని ఆశల సౌథం ధవళేశ్వరం బ్యారేజీ. ఇక్కడి నుంచే మూడు డెల్టా కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరుతోంది. ఇందులో మధ్య డెల్టా కాలువ ప్రధానమైంది. బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజీ నుంచి వచ్చే నీరు ఈ డెల్టా కాలువ ద్వారా ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకుల మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పంట పొలాలకు చేరుతోంది. ఇంతటి ప్రధానమైన లొల్ల లాకులు శిథిలస్థితికి చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మధ్య డెల్టా ప్రధాన కాలువ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఆయా గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందుతోంది. లొల్ల లాకులు శిథిలస్థితికి చేరడంతో నీటి పారుదలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. లొల్ల లాకుల వద్ద మధ్య డెల్టా ప్రధాన కాలువ మూడు కెనాల్స్గా కోనసీమ జిల్లా అంతటికి ప్రధానంగా రాజోలు దీవికి సైతం సాగు, తాగునీరు అందిస్తోంది. లొల్ల లాకుల వద్ద అమలాపురం, గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్స్గా విడిపోతాయి. ఈ లాకుల వద్ద ఎటువంటి ప్రమాదం జరిగినా భవిష్యత్తు ఊహించరానిది. రాకపోకలకూ ఆధారమే.. బొబ్బర్లంక ఆర్అండ్బీ రోడ్డుపై ప్రయాణించే అన్ని వాహనాలు లొల్ల లాకుల పైనుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేక లాకుల పైనుంచి కాలువలోకి వాహనాలు దూసుకుపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇరుకుగా ఉండడంతో లారీలు వంటి భారీ వాహనాలు మలుపు తిరిగే సమయంలో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ రోడ్డు కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి వచ్చే పోయే వాహనాల రద్దీతో నిత్యం రద్దీగా ఉంటోంది. శనివారం అయితే ఇక చెప్పనవసరం లేదు. పైగా ఆత్రేయపురం మండలంలో ఇసుక ర్యాంపులు ఉండడంతో భారీ వాహనాలపై నిరంతరం ఇసుక తరలింపు జరుగుతోంది. ఈ లాకుల మీదుగానే వాహనాలు వెళ్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పట్లో సంకల్పించి.. ఇప్పుడు వదిలేసి.. లొల్ల లాకులు శిథిలం కావడంతో రాజోలు దీవికి సాగునీరు సక్రమంగా అందడం లేదు. కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ విప్గా చిర్ల జగ్గిరెడ్డి లొల్ల లాకుల రక్షణకు, ప్రత్యేకంగా అమలాపురం– బొబ్బర్లంక రోడ్డు ప్రయాణానికి అనువుగా ఒక వంతెన నిర్మించాలని భావించారు. అందుకు ప్రతిపాదనలు సైతం పంపి ఆమోదం చేయించారు. కానీ నిర్మాణ పనులు చేపట్టే లోపు ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కనీసం ఈ సమస్యను పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా లొల్ల లాకులను పునర్నినిర్మించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. లొల్ల లాకులపై ప్రధాన ఆర్అండ్బీ రోడ్డుశిథిలస్థితిలో ఉన్న లొల్ల లాకులుఅనుమతులు రాగానే పనులు కాటన్ మహాశయుని నిర్మాణ ప్రతిభకు లొల్ల లాకులు అద్దం పడతాయి. 1883లో నిర్మించిన ఈ లాకుల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ లాకులను పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానంగా మూడు లాకుల్లో ఒకటైన లొల్ల లాకులు, ముక్తేశ్వరం బ్యాంకు కాలువపై ఉన్న లాకులు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతాం. – ఈవు సూర్యచంద్ర వరప్రసాదరావు, ఏఈ, గోపాలపురం హెడ్వర్క్స్ జల వనరులకు నడక నేర్పిన కట్టడం అది.. పచ్చని సిరులు పండించేందుకు కీలక భూమిక అది.. ఇక్కడి అందాలు ఎన్నో చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.. అలాంటి కట్టడం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది.. కూటమి పాలకుల నిర్లక్ష్యానికి చిక్కిశల్యమవుతోంది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పరిస్థితి ఇది. ఎన్నోఏళ్ల చరిత్ర ఉన్న ఈ అపురూప కట్టడం పరిస్థితిని చూసొద్దాం రండి.. ఫ శిథిలస్థితిలో లొల్ల లాకులు ఫ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి కానరాని చర్యలు ఫ ప్రమాదం జరిగితే బాధ్యులెవరు! -
282 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 282 అర్జీలు స్వీకరించినట్టు డీఆర్ఓ సీతారామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీలు స్వీకరించడం, ఆన్లైన్ విధానాన్ని ఎక్కువగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. కుటుంబ సమస్యలు, సివిల్, ఛీటింగ్, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. సెంట్రల్ జైలును సందర్శించిన డీఎల్ఎస్ఏ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ సోమవారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఖైదీలకు అందుతున్న ఆహార ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా ఉచితంగా సేవలు పొందవచ్చని వారికి తెలిపారు. దీనికోసం పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలను అందించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. సస్పెన్షన్.. సరెండర్.. ‘నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం’పై చర్యలు కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లపై వేటు పడింది. సీనియర్ అసిస్టెంట్ ఏకే అమర్కాంత్ నకిలీ పత్రాలతో పూల హేమలత అనే మహిళకు జూనియర్ అసిస్టెంట్గా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం వేయించిన ఉదంతం వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై అధికారులు స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అమర్కాంత్ను సరెండర్ చేస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హేమలతపై సస్పెన్షన్ వేటు వేసి, చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. అమర్కాంత్ నిర్వాకాన్ని ఆర్డీ పద్మా శశిధర్కు లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రిన్సిపాల్, ఆయనను సరెండర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. మోసపూరిత కార్యకలాపాల నేపథ్యంలో తీవ్రత ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీనిపై ఆర్డీ ఏవిధంగా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. 28 నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అష్టోత్తర పూజలలో పెద్ద సంఖ్యలో దంపతులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి హుండీలు, కానుకల రూపంలో రూ.4,10,091 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
ధాన్యం రైతు దైన్యం
● గత ఖరీఫ్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ● నేటికీ అందని రవాణా, హమాలీ చార్జీలు ● సుమారు రూ.13 కోట్లకు పైగా బకాయిలు ● మూడు మాసాలైనా అందని నగదు ● కీలక దశలో రబీ పంటల సాగు ● పెట్టుబడులకు తప్పని ఆర్థిక కష్టాలు సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులకు అతలాకుతలం అయిన కర్షకులు నేటికీ కోలుకోలేక పోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురవడం, వరదల్లో పంట నీట మునగడంతో ధాన్యం పాడైపోయి తీవ్రంగా నష్టపోయారు. నీట మునగగా.. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం బిల్లులు సైతం ఆలస్యంగానే విడుదల చేసింది. తాజాగా మరో అవస్థ తప్పడం లేదు. ఖరీఫ్లో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం రవాణా, హమాలీ చార్జీలు, సంచుల బిల్లులు నేటికీ పెండింగ్లోనే ఉన్నాయి. సేకరణ ముగిసి మూడు మాసాలు దాటుతున్నా.. నేటికీ డబ్బు విడుదల చేయకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రబీ సాగు కీలక దశలో ఉంది. మంచి దిగుబడులు సాధించాలంటే పురుగుమందులు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కానీ చేతిలో సొమ్ము లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాము ఖర్చు చేసిన రవాణా, హమాలీ చార్జీలైనా అందితే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్లో వరుస తుపాన్లు, వరదల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులను అధిగమించి మార్కెట్కు తరలించిన పంటకు రావాణా, హమాలీ చార్జీలు చెల్లించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా... ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవైంది. కోతలు ప్రారంభించిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను 212 ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. ధాన్యం కేంద్రాల వారీగా టార్గెట్ పూర్తయిందంటూ చేతులెత్తేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించేశారు. వెరసి జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ధరకు బహిరంగ విపణిలో విక్రయించుకోవాల్సి వచ్చింది. రూ.13 కోట్లకు పైగా పెండింగ్ జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో వరి రైతులకు చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలకు ఇప్పటికీ దిక్కు లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మూడు నెలల కావస్తున్నా నగదు కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.13 కోట్లకు పైగా అందాల్సి ఉంది. హమాలీ చార్జీలు రూ.6.50 కోట్లు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.6 కోట్లు, సంచులకు రూ.1.35 కోట్లు విడుదల కావాల్సి ఉంది. క్వింటా ధాన్యానికి హమాలీ చార్జీగా రూ.24, రవాణా చార్జీల నిమిత్తం టన్నుకు రూ.324 చెల్లించాల్సి ఉంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లించే చార్జీల కన్నా రెట్టింపు స్థాయిలో రైతులకు ఖర్చవుతుంది. వాస్తవ ఖర్చులను పరిగణలోకి తీసుకుని రావాణా, హమాలీ చార్జీలను పెంచాలని రైతులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక క్వింటా ధాన్యాన్ని కూలీలతో పట్టుబట్టించి మిల్లుకు పంపేందుకు రూ.100 వరకు ఖర్చవుతుంటే.. రైతుకు అందుతున్నది రూ.56 మాత్రమే. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వీటిని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ వరి పంట కీలక దశలో ఉండటంతో ఈ సమయంలో ఆ బకాయిలు అందితే పెట్టుబడికి కొంతమేర ఉపయోగంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యంతో రబీ కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి రైతులకు అందాల్సిన రవాణా, హమాలీ చార్జీలు చెల్లిస్తే రబీసాగుకు పెట్టుబడి సాయంగా ఉంటుంది. మూడు నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాస్తవ ఖర్చులు పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచాలి. – పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి -
కొండల్లో చెలమల పరిశీలన
గంగవరం: కొండలు, అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన చెలమల (స్ప్రింగ్ షెడ్ల)ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సౌత్ ఇండియాలో పలు ప్రాంతాలకు మహారాష్ట్ర, పుణే బేస్లో ఆక్వాడాం ఎన్జీలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కునాల్ సారథ్ ఉపాసనీ సారథ్యంలో శాస్త్రవేత్తలు కుమారి రాజేశ్వరి, సుహాస్ బోస్లే బృందం గంగవరం మండలంలో సోమవారం పర్యటించింది. ఇక్కడి కొండ చెలమలను వారికి ఉపాధి పథకం ఏపీఓ ప్రకాష్ చూపించారు. ఎండపల్లి పంచాయతీ చిన్న అడ్డపల్లి గ్రామంలో బట్టకొండ వాదనలోద్ది ప్రాంతంలోని చెలమలను ఆ బృంద సభ్యులు పరిశీలించారు. అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడకు చేరుకుంటాయనేది అధ్యాయనం చేశారు. అనంతరం వెదుళ్లకొండ వాగు ప్రాంతంలో మరో చెలమను వారు పరిశీలించారు. వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన అన్నారు. వీరి వెంట ఉపాధి హామీ అదనపు ప్రోగ్రాం అధికారి ఎంకేఎస్ ప్రకాష్, జూనియర్ ఇంజినీర్ టి.పద్మనాభం, టీఏలు సీహెచ్ రాధాకృష్ణ , కోసూరి సీతాదేవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆగకుండా.. దొరక్కుండా..
ఫ అధికారులను పరుగులు పెట్టిస్తున్న పెద్ద పులి ఫ హడలెత్తిస్తున్న గిరిజన ప్రజలు రాజవొమ్మంగి/ అడ్డతీగల: అధికారులను పెద్ద పులి ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. చివరికి ఎవరికీ చిక్కకుండా తిరుగుతోంది. దేవీపట్నం మండలం దేవారంలో 15 రోజుల కిందట ప్రవేశించిన పెద్ద పులి అక్కడి నుంచి అన్ని మండలాల్లో సంచరిస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి వరుసగా రంపచోడవరం మండలం పెద్దకొండ, కొమరవరం, గంగవరం మండలం పిడతమామిడి, గోకవరం మండలం ముల్లేరుమల్లారం, ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామ సమీపాల్లో సంచరించింది. అక్కడి నుంచి పులి నెమ్మదిగా సోమవారం రాజవొమ్మంగి అటవీక్షేత్ర పరిధిలోని కొత్తూరు, వీరభద్రపురం, బోర్నగూడెం, మర్రిపాలెం గ్రామాల్లోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి తమ సిబ్బందితో బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. ఈ నేపథ్యంలో బోర్నగూడెం, సంజీవనగరం, చెరకుంపాలెం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అడవుల్లోకి మేతకు పంపించవద్దని, ప్రజలెవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని దండోరా వేయించారు. ఇదిలా ఉండగా శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు చెందిన శిక్షణ పొందిన 50 మందికి పైగా అధికారులు ఈ ప్రాంతంలో పులి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పులిని బంధించేందుకు అవసరమైన బోన్లను సిద్ధంగా ఉంచారు. పులి ఆచూకీ కోసం ఆధునిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అధికారుల వద్ద ఉన్న వీఎఫ్ఎక్స్ అనే పరికరం ద్వారా పులి మెడలో గల హైఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ను (ధర్మల్ డ్రోన్ సిస్టం) ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. కాగా బోర్నగూడెం వద్ద కాసేపు వీహెచ్ఎఫ్లో సిగ్నల్ కనిపించినప్పటికీ తిరిగి సిగ్నల్స్ కట్ అయ్యిందని ఫారెస్టు అధికారులు తెలిపారు. ఆ తరువాత దాదాపు ఐదు కిలోమీటర్ల రేడియస్లో పులి ఆనవాళ్లు కనిపించ లేదు. కాగా చీకటి పడే వేళకు మండలంలోని మర్రిపాలెం వైపు పులి వెళ్లిందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ గ్రామాల వైపు యంత్రాంగం కదిలింది. మండలంలోని గడుఓకుర్తి పంచాయతీ, గొబ్బిలమడుగు అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉషారాణి ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో రాజవొమ్మంగి మండలం సంజీవనగరం వద్ద రోడ్డును దాటి వెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు. -
కొత్త కోవెలకు.. నవ వసంతం
● సత్యదేవుని నూతన ఆలయానికి 14 ఏళ్లు పూర్తి ● 2011లో నిర్మాణం ప్రారంభం ● 2012 మార్చి 14న కలశ స్థాపన అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని నూతనాలయం నేడు నవవసంతంలోకి అడుగు పెడుతోంది. రత్నగిరిపై ఆలయ పునర్నిర్మాణం జరిగి ఫాల్గుణ బహుళ సప్తమి అనగా మంగళవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నూతన ఆలయం 15వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గత 15 సంవత్సరాల్లో దేవస్థానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏటా భక్తుల సంఖ్యతో పాటు, స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 135 సంవత్సరాల చరిత్ర రత్నగిరిపై సత్యదేవుడు 1891లో ఖర నామ సంవత్సరం, శ్రావణ శుద్ధ విదియ నాడు ఆవిర్భవించారు. నాడు అన్నవరం ఓ కుగ్రామం. ఆలయ చరిత్ర ప్రకారం అప్పట్లో రత్నగిరిపై దట్టమైన అడవి ఉండేది. రకరకాల వన్యప్రాణులు ఇక్కడ సంచరించేవి. 1891లో శ్రావణ శుద్ధ విదియ ముందు రోజు రాత్రి అప్పటి గోర్స ఎస్టేట్ జమీందార్ రాజా ఇనుగంటి వేంకట రామారాయణం కలలో సత్యదేవుడు ప్రత్యక్షమై, తాను అన్నవరంలో రత్నగిరిపై వెలిశానని, తనకు ఆలయం కట్టించాలని చెప్పారట. దీంతో, ఆయన అన్నవరం చేరుకుని ఈ విషయం చెప్పారు. ఆ సందర్భంగా అన్నవరానికి చెందిన ప్రముఖుడు ఈరంకి ప్రకాశరావు తనకు కూడా ఇదే రకమైన కల వచ్చిందని చెప్పారట. దీంతో, మరి కొంత మంది గ్రామస్తులతో కలసి వారిద్దరూ వెతకగా.. గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న కొండ మీద అంకుడు చెట్టు కింద సత్యదేవుని విగ్రహం కనిపించిందని చెబుతారు. తొలుత చిన్న పందిరి నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత చిన్న ఆలయం, మరి కొన్నాళ్లకు రెండంతస్తుల్లో పెద్ద ఆలయాన్ని నిర్మించి, దిగువ అంతస్తులో శ్రీమత్త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతనంతో ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలో మధ్యన వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఎడమవైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. నూతన ఆలయ నిర్మాణం ఇలా.. సత్యదేవుని పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో కొత్త కోవెల నిర్మించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు 2011లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ప్రణాళిక రూపొందించారు. పాత ఆలయం తొలగించే క్రమంలో మూలవిరాట్లను తొలగించకుండా, ఆ మూర్తులపై టేకు చెక్కతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి, దానిపై ఇనుప గడ్డర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. అయితే, పాత ఆలయాన్ని తొలగించడానికి వీలు లేదని కొంత మంది హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. సుమారు నెల రోజుల వ్యవధిలో పాత ఆలయాన్ని తొలగించారు. నూతన ఆలయ నిర్మాణం సుమారు ఏడాది పాటు కొనసాగింది. తమిళనాడులోని నమ్మక్కల్ గ్రానైట్ క్వారీల నుంచి సేకరించిన శిలలతో పాత ఆలయం మాదిరిగానే రెండంతస్తుల్లో నూతనాలయం నిర్మించారు. ఈ నిర్మాణం జరిగినన్ని రోజులూ సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. కంచి పీఠాధిపతి చేతుల మీదుగా.. నాటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా 2012 మార్చి 14న ఆలయ శిఖరంపై కలశ స్థాపన శాస్త్రోక్తంగా నిర్వహించి, కొత్త కోవెలను ప్రారంభించారు. అప్పటి నుంచీ తిథుల ప్రకారం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. నూతన ఆలయం నవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు స్వామివారికి లక్ష పత్రి పూజ, ప్రత్యేక నివేదనలు నిర్వహిస్తారు. నూతనాలయ నిర్మాణానికి పని చేసిన వైదిక సిబ్బందిని ఈఓ వి.త్రినాథరావు సత్కరిస్తారు. పునర్నిర్మాణ సమాచారం తెలిసేదెలా? సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా యంత్రాలయ గోడలపై శిలాశాసనం చెక్కించారు. అందులో నూతనాలయ నిర్మాణ విశేషాలను వివరించారు. అయితే, ఇది భక్తులకు కనిపించే అవకాశం ఉండటం లేదు. ఈ సమాచారంతో తూర్పు రాజగోపురం వద్ద ఫ్లెక్సీ లేదా పెయింటింగ్ ఏర్పాటు చేస్తే అందరూ తిలకించే అవకాశం ఉంటుంది. స్వర్ణ ధ్వజస్తంభం ఇదిలా ఉండగా ఓ దాత సహకారంతో 2024 మే నెలలో సత్యదేవుని ఆలయంలో నూతన ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు. దీనికి అదే సంవత్సరం ఆగస్టులో బంగారు కవచం ఏర్పాటు చేశారు. ఈ బంగారు ధ్వజస్తంభం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది. -
బండబాదుడు
● సామాన్యులపై సిలిండర్ ధరాభారం ● రూ.60 పెంచుతూ కేంద్రం నిర్ణయం ● వాణిజ్య కనెక్షన్పై రూ.114 పెంపు ● 11 నెలల్లో రెండోసారి.. ● ఇప్పటికే నిత్యావసర ధరల సెగ ● తాజా పెంపుతో సర్వత్రా అసహనం ● ప్రజలపై నెలకు రూ.2.34 కోట్ల భారం సాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.879.50 ఉన్న ధర రూ.939కి చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. రూ.1,949గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.114 పెరిగి రూ.2,063కు చేరింది. ఇప్పటికే నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల బాదుడు సాగుతుండగా తాజాగా గ్యాస్ ధర పెంపును సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజుకు రూ.7.80 లక్షల భారం జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు సుమారు 6,24,265. ఇందులో సాధారణ కనెక్షన్లు 2,25,394, దీపం 1,65,012, సీఎస్ఆర్ 7,229, ఉజ్వల 6,553, 5 కేజీల సిలిండర్ 2,141, కమర్షియల్ 3,405, డబుల్ కనెక్షన్లు 2,14,531 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. గృహ వినియోగదారులకు నిత్యం సుమారు 13 వేల వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తాజా పెంపుతో రోజుకు రూ.7.8 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.2.34 కోట్ల వరకు భారం పడుతోంది. కమర్షియల్ సిలిండర్లపై నెలకు మరో రూ.3,88,170 అదనపు భారం పడుతోంది. ఉజ్వలకూ వర్తింపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్టౌ మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపు వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆందోళన ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కందిపప్పు, మినప్పప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్ రూ.60కి పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్ రెండు నెలలు వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి ఆరు సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.360 చెల్లించాల్సి వస్తోంది. 11 నెలల్లో రూ.110 భారం 11 నెలల వ్యవధిలో గ్యాస్ ధర రెండుసార్లు పెరిగింది. గతేడాది ఏప్రిల్లో గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెరిగింది. ప్రస్తుతం మరో రూ.60 పెరిగింది. వాణిజ్య సిలిండర్లపై భారీగా పెంచడంతో హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. కనికరించని కూటమి ప్రభుత్వం కేంద్రం గ్యాస్ ధర ఏకంగా రూ.60 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా కూటమి ప్రభుత్వం కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తమ పరిస్థితి ఏమవ్వాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. -
నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం
● కాకినాడలో ఓ మహిళ నిర్వాకం ● కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే భార్యకు రెగ్యులర్ ఉద్యోగం ● కీలకంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ ● కాకినాడ, ‘తూర్పు’ కలెక్టర్లు సీరియస్ ● మహిళ సస్పెన్షన్ ● అమర్కాంత్ సరెండర్కు ఆదేశాలు కాకినాడ క్రైం: నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ మహిళ పైన, ఆమెకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిపైన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. వివరాలివీ.. కాకినాడకు చెందిన చెరుకూరి (పోల) హేమలత భర్త వినయ్ సంపత్ ఐదేళ్ల క్రితం కోవిడ్తో మృతి చెందాడు. ఆయన కాకినాడలో ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసేవాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకు హేమలత డీఎంహెచ్ను ఆశ్రయించింది. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అప్పట్లో ఆ కార్యాలయం పీఓడీటీటీ విభాగంలో పని చేస్తూ, డెప్యూటేషన్పై రాజమహేంద్రవరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్కు వెళ్లిన సీనియర్ అసిస్టెంట్ కేశవ అమర్కాంత్ అగస్త్యకు ఈ విషయం తెలిపింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అమర్కాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ద్విచక్ర వాహనాలపై కలిసి తిరిగేంత వరకూ వెళ్లింది. అర్జీదారుతో ఎందుకంత ఉన్నతాధికారులు చనువని ప్రశ్నిస్తే తన మేనకోడలని అమర్కాంత్ చెప్పేవాడు. ఈ క్రమంలో అతడు కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యాడు. ఆ కళాశాలలో అప్పటికి 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా అతడు కారుణ్య నియామక కోటాలో హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని భావించాడు. నిబంధనల ప్రకారం ఆ నియామకం కేవలం ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామికే తప్ప కాంట్రాక్టు ఉద్యోగి భాగస్వామికి వర్తించదు. కలెక్టర్కే బురిడీ... ఈ నేపథ్యంలో అమర్కాంత్ నకిలీ పత్రాలతో హేమలత భర్త సంపత్ది రెగ్యులర్ ఉద్యోగని నమ్మించి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుకున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎస్ఆర్ ఎంట్రీ తయారు చేశాడు. వీటితో అప్పటి కలెక్టర్నే బురిడీ కొట్టించి ఆయన సంతకంతోనే రెండేళ్ల క్రితం హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం వేయించాడు. చర్యలకు ఆదేశం ఈ నివేదికను పరిశీలించిన కలెక్టర్ షణ్మోహన్ బాధ్యులిద్దరి పైనా తక్షణ చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు పంపారు. ఈ నేపథ్యంలో అమర్కాంత్ను ‘తూర్పు’ కలెక్టర్ కీర్తి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన హేమలతను సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చర్యలు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదుతో వెలుగులోకి.. ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో కొందరు నిరుద్యోగులు ఓ సంఘ నాయకుల సాయంతో గత ఏడాది అక్టోబర్లో కలెక్టర్ షణ్మోహన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న హేమలతను కాకినాడ పిలిపించి విచారించి అసలు విషయాన్ని గుర్తించింది. ఆమె అందించిన ప్రతి పత్రం నకిలీదేనని, ఇదంతా అమర్కాంత్ ఆడించిన నాటకమని కమిటీ గుర్తించింది. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ ఆధ్వర్యాన కలెక్టర్కు నివేదించింది. -
బార్కాస్ అరేబియన్ రెస్టారెంట్పై ఐటీ దాడులు
రాజమహేంద్రవరం సిటీ: హోటల్ వ్యాపార లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్స్ రికార్డుల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణల నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్లోని బార్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్లపై చేపట్టిన ఆకస్మిక దాడుల్లో భాగంగా ఈ తనిఖీలు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.70 వేల కోట్ల డిజిటల్ పేమెంట్లను ఆదాయంగా చూపకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెస్టారెంట్లో జరిగిన వ్యాపారానికి పన్ను ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో డిజిటల్ రికార్డులను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు, రెవిన్యూ కినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. అర్జీదారులు అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వాట్సప్ నెంబర్ 95523 00009 ద్వారా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని వెల్లడించారు. -
రాత్రిళ్లు గాండ్రిస్తూ..
ఫ ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ఫ డి.కృష్ణవరం సమీపానే మకాం ఫ పాదముద్రల ఆధారంగా నిర్ధారణ అడ్డతీగల: పులి తన ఉనికిని చాటుతోంది.. రాత్రిళ్లు మూగజీవాలపై విరుచుకుపడుతోంది.. అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. దాని సంచారంతో ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అటవీ ప్రాంతానికి చేరువలోనే ఏలేరు వాగు, జలాశయం ఉండడం పులి సంచారానికి అనువుగా ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరంలో ఆవు, దూడను పులి హతమార్చింది. శనివారం అర్ధరాత్రి వచ్చిన పులి దూడ మాంసాన్ని కొద్ది దూరం తీసుకువెళ్లి ఒక కాలిని తిని, మిగతా భాగాన్ని అలాగే వదిలేసింది. అటవీ అధికారులు ఆదివారం ఉదయాన్నే దూడను తీసుకుపోయిన ప్రాంతంలో గాలించి పులి పాదముద్రలను గుర్తించారు. రాజమహేంద్రవరం గత సీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, ప్రస్తుత సీఎఫ్ శ్రీకంఠనాథరెడ్డి, కాకినాడ డీఎఫ్ఓ రామచంద్రరావు, రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి నాగార్జునాసాగర్, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలసి ఆయా రేంజ్ల అధికారులు తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో మకాం వేసిన పులి పట్టివేతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా డి.కృష్ణవరం సమీపాన తిష్టవేసిన పెద్ద పులిని బంధించడానికి అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేశారు. ఆయా బోన్లలో రెస్క్యూ టీంకు చెందిన షూటర్లు ఆదివారం ఒక్కో బోనులో ఒక్కొక్కరు చొప్పున కాపు కాసి ఉన్నారు. అయితే పులి అధికారులు భావించినట్లు కాకుండా మరో దారి నుంచి వచ్చి తిమ్మాపురం – బొంగరాలపాడు మధ్య ఏలేరు వాగును దాటుకుని వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు. -
ఈపీడీసీఎల్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం
● కాలిపోయిన స్క్రాప్ మీటర్లు ● సిబ్బంది, స్థానికుల సహాయంతో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా స్టోర్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మీటర్ల స్క్రాప్ అగ్నికి ఆహుతైంది. సిబ్బంది, స్థానికులు స్పందించడంతో పాటు, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ సబ్స్టేషన్లకు అవసరమైన సామగ్రి ఈ కేంద్రంలో నిల్వచేస్తారు. జిల్లా వ్యాప్తంగా స్టోర్ పరిధిలో తొలగించిన విద్యుత్ మీటర్ల స్క్రాప్ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. సిబ్బందితో పాటు స్థానిక సమాచారం అందుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు కృషి చేసినా ఫలించకపోవడంతో స్థానికంగా ఉన్న రెండు శకటాలతో పాటు అనపర్తి, కొవ్వూరు, జేగురుపాడు జీవీకే, ఓఎన్జీసీ రెండు అగ్నిమాపక వాహనాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో కుప్పగా పోసిన స్క్రాప్ మీటర్లలో సగానికి పైగా కాలిపోగా మిగిలిన వాటిని పొక్లెయిన్తో పక్కకు తొలగించారు. వీటికీ మంటలు వ్యాపించి ఉంటే పక్కనే ఉన్న మంచి మీటర్ల గొడౌన్కు నిప్పు అంటుకుని రూ.కోట్లలో నష్టం జరిగేదని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే ఎస్ఈ తిలక్కుమార్, ఈఈ నక్కపల్లి శామ్యూల్, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ మత్సేటిప్రసాద్, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎస్ఈ తిలక్కుమార్ మాట్లాడుతూ సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను అదుపుచేయగలిగామన్నారు. ఓవర్ లోడ్ వలనే... ట్రాన్స్ ఫార్మర్ ఓవర్లోడ్ వల్ల మంటలు వ్యాపించి కింద ఉన్న తుక్కు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించాయని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంలో సహకరించి అధికారుల మన్ననలు అందుకున్నారు. -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు. దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
బొమ్మూరు ట్రాన్స్కో స్టోర్స్లో అగ్ని ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్, సామాగ్రీ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ట్రాన్స్కో ఎస్ఈ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొమ్మూరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది. -
15 నుంచి రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు
నల్లజర్ల: మాస్టర్స్ చెస్ అకాడమీ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి రాష్ట్ర స్థాయి ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లజర్లలోని కింగ్స్ ఉడ్ స్కూల్లో పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 300 మంది చెస్ క్రీడాకారులు హాజరవుతారన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఏపీచెస్.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94408 67370, 89787 82501 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కింగ్స్ ఉడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ దాపర్తి శివ, సెక్రటరీ, కరస్పాండెంట్ నిఖిలదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ సాయికుమార్, సొసైటీ అధ్యక్షులు రావూరి వెంకటరమణ, మార్ని దుర్గారావు, సవలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి.. భక్తులతో శోభిల్లి
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆ క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం తదితర పూజలను చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలకరించారు. స్వామివారి అలంకారంగా నూతన బంగారు మకర తోరణం ఆకట్టుకుంది. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. భక్తలు తులాభారాలు నిర్వహించి కానుకలు సమర్పించారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తజన సంద్రంలా వెంకన్న ఆలయం -
9న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
అమలాపురం రూరల్: భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల కోసం ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల 9న ఏపీ, తెలంగాణ మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణ పురుష అభ్యర్థులకు జరుగుతాయన్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2005 ఫిబ్రవరి 5 నుంచి 2009 జనవరి మధ్యలో జన్మించి ఉండాలని, ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు, ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత తేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేక, రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీకి ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, సర్టిఫికెట్ కాపీలతో నేరుగా హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో చూడాలని, లేకుంటే జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖను సంప్రదించాలని తెలిపారు. కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టు నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న ఎడవ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం క్వారీ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా సిరాయవరం వచ్చేసరికి బైక్ అదుపుతప్పి ఏలేరు ఎడమ కాలువలో పడిపోయారు. స్థానికులు కాలువలో దిగి వెతకగా విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లోవరాజు గల్లంతు కాగా, శనివారం ప్రమాద సమీపంలోనే మృతదేహం లభ్యమైంది. లోవరాజుకు భార్య నాగమణితోపాటు కుమారైలు నవ్య, లోవకుమారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక లారీల సీజ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను అధికారులు శనివారం సీజ్ చేశారు. రూ.1.70 లక్షల జరిమానా విధించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కథనం ప్రకారం.. రాజానగరం హైవే పరిధి, లాలాచెరువు సమీపంలో పరిమితికి మించి ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు లారీలను రవాణా అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను అపరాధ రుసుము చెల్లించిన తర్వాత విడుదల చేశామన్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులపై ఇసుక పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయన్నారు. ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. -
సుదీర్ఘ పరిశోధనకు పట్టం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. ఆ నొప్పిని నివారించేందుకు ఆ సమయంలో బీపీ తగ్గిపోవాలి. అది వెంటనే జరగాలి. అలా జరగాలంటే దానికి సంబంధించిన మందు వెంటనే నోటిలో బుగ్గకు పెడితే సెకన్లలో ఆ మందు లోపలకు వెళ్లి బీపీ అదుపులోకి వస్తుంది. అటువంటి మందుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డి.నాగమణి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా వర్తనాపల్లి గ్రామానికి చెందిన నాగమణి సాధారణ ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆమె ప్రతిభకు ఔషధ నియంత్రణ శాఖలో ఉద్యోగం వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్గా పలు జిల్లాల్లో పని చేసి, అంచెలంచెలుగా ఏడీగా ఎదిగారు. నిరంతరం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే పరిశోధనలపై వైపు దృష్టి సారించారు. 2016లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా చేరారు. ‘డిజైన్, ఫ్యాబ్రికేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై యూనివర్సిటీ ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ వై.ఇందిరా ముజిజ్ నేతృత్వంలో పరిశోధనలు చేశారు. పరిశోధనల అనంతరం తాను తయారు చేసిన మందును ముందుగా కుందేళ్లపై ప్రయోగించి, పరీక్షించారు. ఆ పరీక్షలు విజయవంతమయ్యార ుు. జనవరి 24న యూనివర్సిటీ కమిటీ సమావేశం నిర్వహించి, ఆమె పరిశోధనలను పరిశీలించి, ఫార్మసీ పీహెచ్డీ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నాగమణికి యూనివర్సిటీలో శనివారం పీహెచ్డీ ప్రదానం చేశారు. నాగమణి తూర్పు గోదావరితో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో చేసిన సేవలకు గాను బెస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, బెస్ట్ డ్రగ్స్ ఏడీగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. ఫ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు దానిని నివారించే చూయింగ్ టాబ్లెట్ తయారీ ఫ కుందేళ్లపై పరీక్షలు విజయవంతం ఫ డాక్టరేట్ అందుకున్న రాజమహేంద్రవరం డ్రగ్స్ ఏడీ నాగమణి కుటుంబ సహకారంతోనే.. ఫార్మసీలో పీహెచ్డీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో రాష్ట్రంలోనే ఔషధ నియంత్రణ శాఖ నుంచి ఏకై క మహిళను అయినందుకు సంతోషంగా ఉంది. గుండె నొప్పి సమయంలో వెంటనే ఉపయోగించే విధంగా, తక్షణమే ఉపశమనం కలిగే విధంగా తయారు చేసిన మందు విజయం సాధించింది. ఇది నాకెంతో గర్వకారణం. ఇది నా ఒక్కరి విజయం కాదు. నా వెనుక ఉండి, నన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరిదీ. – డి.నాగమణి, డ్రగ్స్ ఏడీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా -
పలువురికి స్ఫూర్తిగా..
నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్ కుంచాల విజయకి చిన్నతనంలోనే బాగా చదువు కోవాలి... నలుగురికి సేవ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు. ప్రస్తుతం సమిశ్రగూడెం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించారు. ఆయన ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త జీతంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు, ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సోసైటీ, ఏపీ బెస్ట్ సిటిజన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
ఈ విజయం.. అంత తేలిగ్గా దక్కలేదు!
నల్లజర్ల: ఐదు సార్లు సివిల్స్ పరీక్షలలో విఫలమైనా కుంగిపోకుండా ..పట్టుదలతో ప్రయత్నించి ఆరో ప్రయత్నంలో యూపీ ఎస్సీలో ర్యాంకు సాధించారు అనంతపల్లికి చెందిన చెజెర్ల అశ్వినికుమార్. ఆయన 256వ ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన చెజెర్ల కాళేశ్వరరావు, సరోజనిదేవి కుమారుడు అశ్విని కుమార్. చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనంతపల్లిలో మేనమామ మాయకోటి రాజశేఖర్(అస్సాంరాజు)వద్ద పెరిగారు. గుంటూరులో విద్యాభ్యాసం జరిగింది. విజ్ఙాన్లో బీటెక్లో గోల్డ్మెడల్ సాధించారు. 2021లో ఐఈఎస్లో తొలుత 29వ ర్యాంకు సాధించారు. తర్వాత 2023లో మళ్లీ రాసి 13వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం అశ్వినికుమార్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ డైరెక్టర్ (సీఈఏ)గా న్యూఢిల్లీలో పనిచేస్తున్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత శనివారం ఉదయం ఇక్కడి వారితో ఆయన ఫోన్లో మాట్లాడారు. 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరైతే తనకు 256వ ర్యాంకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. నాలుగు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైనట్టు చెప్పారు. ఆరోసారి సివిల్స్కు ఎంపికై న వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదివి సఫలీకృతుడైనట్టు చెప్పారు. అనంతపల్లిలోని మేనమామ, బాబాయ్ వలిగడ్ల నాగమల్లికార్జునరావు, విజయలక్ష్మి ఇళ్ల వద్ద టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ‘నన్నయ’లో వాకథాన్ రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర మహిళా కమిషనర్ ఫ్లాగ్ షిప్ సహకారంతో ‘హానరింగ్ ది వారియర్ విటిమ్’ అనే థీమ్తో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శనివారం వాకథాన్ జరిగింది. ఈ ర్యాలీని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీలో ఎన్ బ్లాక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రధాన గేటు వరకు వెళ్లి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి మహిళా హక్కులు, వాటి పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలిగిస్తూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.పోలీసుల విస్తృత తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం శనివారం తెలిపింది. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్లు కలిసి గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నాయని అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, నివాసాలు, లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మొత్తం 155 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం 255 మందిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 70 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ● ఆరవ ప్రయత్నంలో కల సాకారం ● సివిల్స్ ఫలితాలలో 256వ ర్యాంకు సాధించిన అశ్వినికుమార్ -
విద్యావ్యాప్తికి ప్రాధాన్యం
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా రాజమహేంద్రవరం రూరల్: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక, సంక్షేమ రంగాల్లో సమర్థమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులను ఆదేశించారు. విద్యావ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని అన్నారు. శనివారం స్థానిక ఓఎన్జీసీ గోదావరి భవన్ సమావేశ మందిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. డ్రాప్ అవుట్లు లేకుండా ఆయా వర్గాలకు చెందినవారు చదువుకునేలా చైతన్య పరచడం ముఖ్యం అన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్, సంక్షేమ పథకాల అమలు, అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్.డి.గయాజుద్దీన్, ఇంచార్జి ఆర్డీవోలు కె.భాస్కర్రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే సత్యవతి పాల్గొన్నారు. మక్వానాకు స్వల్ప అస్వస్థత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు స్వల్ప అస్వస్థత కలగడంతో శనివారం డెల్టా ఆసుపత్రిలో చికిత్స అందించామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. -
మానసిక దివ్యాంగులకు పరిచర్యలు
నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరుగని అభాగ్యులకు దగ్గర ఉండి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన బలగం విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్లోని బోజ్ యూనివర్శిటీలో బీఈ డీ(ఎంఆర్) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఆమె సొంతం చేసుకున్నారు. -
లింగ సమానత్వంతో మహిళా సాధికారిత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి యం.మాధురి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మహిళా సాధికారత, హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం, సమాజంలో మహిళలు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమని, నేడు అన్ని రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారన్నారు. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఆ వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పురుషులు ముందుకు రావాలన్నారు. మహిళలు, చిన్నారులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు ప్రాంగణంలో అందుబాటులో ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నప్పటికీ ఇంకా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయన్నారు. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఆడపిల్లలలో ధైర్యం నింపడంతో పాటు మగపిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఎస్కేఆర్ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఆర్ఎంసీ ఎంహెచ్వో వి.వినూత్న, న్యాయాధికారులు, న్యాయవాదులు, మహిళలు పాల్గొన్నారు. -
ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం
నిడదవోలు పట్టణంలో లయన్స్ కంటి ఆసుపత్రిలో పదమూడేళ్లుగా నేత్ర వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్ తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 38,596 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేశారు. వృత్తి పట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. గుర్తింపుగా విశ్వగురు వరల్డ్ రికార్డు నుంచి రోనా వారియర్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. కంటి వైద్యురాలు గొల్లపల్లి భరణి ఎల్లార్ -
వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల కూల్చివేత
నిడదవోలు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లు, ఆస్తులను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేస్తున్నారు. తాజాగా శనివారం తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులు కూల్చివేతతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన ఆర్అండ్బీ రోడ్డును నెల రోజులుగా విస్తరిస్తున్నారు. అయితే ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా.. నిబంధనల ప్రకారం యజమానులకు తగినంత సమయం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఆస్తుల విధ్వంసానికి అధికారులు పూనుకున్నారు. నిబంధనలు పక్కన పెట్టి మరీ టీడీపీ నాయకుల ఆదేశాలతో కేవలం వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు, షాపులను లక్ష్యంగా చేసుకుని ఇళ్ల ముందు భాగాలను కూల్చివేశారు. టీడీపీ, జనసేన నాయకుల ఇళ్లు, షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. టీడీపీ ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మరో నాయకుడు గన్నమనేని వెంకట సుబ్రహ్మణ్యం తమ అనుచరులతో కలసి దగ్గర ఉండి మరీ వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయించారు. సింహాద్రి రామకృష్ణ ఆదేశాలతో పోలీసుల అండతో రోడ్డు విస్తరణ పేరిట అధికారులు పలు ప్రైవేటు ఆస్తులను పొక్లెయిన్తో ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు అక్కడకు చేరుకుని, ఆస్తుల ధ్వంసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు సంబంధించిన రికార్డులు చూపించాలని తహసీల్దార్ ప్రసాద్, ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాసాచార్యులును నిలదీశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అభివృద్ధికి తాము ఏనాడూ అడ్డు చెప్పలేదని, అయితే రోడ్డు విస్తరణకు సంబంధించిన రికార్డులు చూపించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డు కొలతలు చూపించాలని, నిజంగా ప్రైవేటు భవనాల్లో ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం తొలగించవచ్చని తేల్చి చెప్పారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
కల్తీ పాల ఘటనను ‘కూల్’ చేశారు!
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్తీ పాల మరణాలకు కారణం ఏమిటనే విషయమై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అధికారులు తెరదించారు. మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్), విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎఫ్ఎస్ఎల్) నుంచి శనివారం ఐదుగురి మరణాలకు సంబంధించిన ఫోరెన్సిక్ తుది అభిప్రాయం వెల్లడైనట్టు ఓ ప్రకటన ద్వారా అధికారులు వెల్లడించారు. కూలెంట్ నుంచి లీకైన విషపూరిత ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్లే పలువురు కిడ్నీలు ఫెయిలై మృతి చెందినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. ఈ నివేదిక ప్రతులను మాత్రం బహిర్గతం చేయలేదు. కేవలం ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనినిబట్టి చూస్తే.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నివేదిక కాపీలను బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇథలీన్ గ్లైకాల్ కాకుండా మరేదైనా కలిసినట్టు ఆ రిపోర్టుల్లో నిర్ధారించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నివేదికలను ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి తుది అభిప్రాయం తెలిపారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 9 కేసులకుగాను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఈ నివేదికలు వచ్చాయన్నారు. ల్యాబ్ల నుంచి వచ్చిన రిపోర్టులు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరిశీలించి ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ ఆధారంగా విషపూరితమైన ఈజీ–ఇథలీన్ గ్లైకాల్ కలిసిన పాలు తాగడం వల్ల కిడ్నీ, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఈ ఐదుగురూ మృతి చెందినట్టు నిర్ధారించారు. మిగిలిన వారి రిపోర్టులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే ప్రశ్నలకు జవాబు లేదు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంటలకు కాలిపోయిన బైక్ రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం శానిటోరియం ప్రాంతానికి చెందిన అందె అఖిల్ కుమార్ (30) వై–నాట్ షోరూమ్లో పనిచేస్తున్నాడు. అతను తన బైక్పై రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చి, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక గైట్ ఇంజినీరింగ్ కళాశాల దాటిన తరువాత అతను ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ఢీకొన్న వాహనం బైక్ను కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. దీంతో రోడ్డు రాపిడికి ట్యాంకులో పెట్రోలు లీకై , మంటలు వ్యాపించి, బైకు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బొమ్మూరు పోలీసులు తెలిపారు. -
బంగారు మకర తోరణం సమర్పణ
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి తణుకుకు చెందిన పుణ్యమూర్తుల రామచంద్రస్వామి, సావిత్రి దంపతులు రూ.60 లక్షల విలువైన బంగారు మకర తోరణాన్ని సమ ర్పించారు. దీనిని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి అలంకరించారు. దాతలకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటో అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు, సర్పంచ్ సూర్యకుమారి దంపతులు, అయ్యగారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న వ్యాన్
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు నల్లజర్ల: అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం నగరానికి క్యాటరింగ్కు సంబంధించిన మెటీరియల్ను వ్యాన్లో శుక్రవారం గుడివాడకు చెందిన కొండ్రు శ్రీనివాస్ (51), విజయవాడకు చెందిన శేషాద్రి, డ్రైవర్ కర్రి శివ తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అనంతపల్లి ఎస్వీఆర్ కల్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కొండ్రు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన శేషాద్రి, శివలను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కొండ్రు శ్రీనివాస్ భార్య శైలజ ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. కుమారుడు కరుణకుమార్, కుమార్తె శ్వేతల బాగోగులు చూసుకుంటూ క్యాటరింగ్ పనులకు వెళ్లి తిరిగి వస్తుంటాడు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం వెళ్తూ మార్గం మధ్యలో చనిపోయాడు. ఎస్సై ఆంజనేయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రగతిలో చెట్టాపట్టాల్
ఫ నిడదవోలు రైల్వే స్టేషన్కు కొత్త హంగులు ఫ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏర్పాటు ఫ నూతనంగా 4, 5 ప్లాట్ఫామ్ల నిర్మాణం ఫ రెండు లిఫ్ట్లు, ఎస్క్లేటర్ల ఏర్పాటు నిడదవోలు: రైల్వే స్టేషన్లో అభివృద్ధి కూత పెట్టింది.. చకచకా కొత్తరూపు దిద్దుకుంది.. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో సర్వ హంగులతో రెడీ అయ్యింది.. విజయవాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య కీలకమైన జంక్షన్గా పేరొందిన నిడదవోలు రైల్వే స్టేషన్ కొత్తరూపును సంతరించుకుంది. అమృత్ భారత్ పథకానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో తొలి విడతగా 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో నిడదవోలు ఒకటి. ఈ పథకం కింద రూ.28 కోట్లతో ఈ రైల్వే స్టేషన్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. ఇన్నేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు రైల్వే అధికారులు పూర్తి చేయడంతో ప్రయాణికుల అవసరాలు తీరుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్లకు చేరుకోవడానికి రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ను నిర్మించారు. చేపట్టిన పనులివీ.. నిడదవోలు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇందులో 200 మీటర్ల మేర ఫ్లోర్ను గ్రానైట్తో ఆధునీకరించారు. ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ను రూ.3.91 కోట్లతో తాడేపల్లిగూడెం వైపు విస్తరించారు. దీనిని 600 మీటర్ల పొడవున కాంక్రీట్, గ్రానైట్తో నిర్మించారు. ప్లాట్ఫామ్ రక్షణ గోడ, ఇతర పనులు చేపట్టారు. ఇదే ప్లాట్ఫామ్లో రూ.3.28 కోట్లతో 600 మీటర్ల పొడవున అధునాతన షెడ్డు నిర్మించారు. రూ.6 కోట్లతో కొత్తగా 4, 5 ప్లాట్ఫామ్లు పూర్తి చేశారు. దీనివల్ల మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలు కలుగుతుంది. ప్లాట్ఫామ్ల మధ్య ప్రయాణికుల రాకపోకలకు రెండు లిఫ్ట్లు నిర్మించారు. ఒక ఎస్క్లేటర్ కూడా నిర్మించడంతో ప్రయాణికులు ఎంతో సులువుగా ఇతర ఫ్లాట్ఫామ్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం స్టేషన్లో 1, 2, 3 ప్లాట్ఫామ్ల మధ్య ఒకే కాలిబాట వంతెన ఉంది. దీనికి అదనంగా రాజమహేంద్రవరం వైపు ఆక్సిజన్ పార్కు వద్ద రూ. 12 కోట్లతో 45 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎండ్ టూ ఎండ్ ఫుట్పాత్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో అన్ని ప్లాట్ఫామ్లకు ప్రయాణికులు సులువుగా చేరుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్టేషన్లో విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించారు. స్టేషన్ మొత్తం రూ.1.90 కోట్లతో అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ఇక్కడ మహిళలకు 8, పురుషులకు 8, దివ్యాంగులకు 2 చొప్పున మరుగుదొడ్లు నిర్మించారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన ఏసీ వెయిటింగ్ హాలు, సాధారణ ప్రయాణికులకు విశ్రాంతి వెయిటింగ్ హాలును నిర్మించారు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా రాకపోకల సంకేతాలు, పార్కింగ్ ప్రదేశాల మార్గాలు, వ్యర్థాల నిర్వహణ, భవన నిర్వహణ పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలు తెలుసుకోవడానికి ప్రత్యేక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో మందికి ఆసరా.. నిడదవోలు రైల్వే జంక్షన్ స్టేషన్ను 1935లో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వంటి ప్రాంతాలతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి ప్రయాణికులు నిడదవోలు రైల్వే స్టేషన్పైనే ఆధారపడతారు. ఇక్కడి నుంచి నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో ఉన్న ఈ రైల్వే జంక్షన్ నుంచి పలు రైళ్లు భీమవరం, నర్సాపురం, గుడివాడ పట్టణాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 3,800 మంది సుమారు 68 రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రతి రోజూ సుమారు 30 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులు రవాణా చేసుకుంటారు. ప్రధానంగా ఎఫ్సీఐ గోడౌన్లకు ధాన్యం నిల్వలను ఇక్కడి నుంచి తరలిస్తుంటారు. ప్రస్తుతం సి–గ్రేడ్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ద్వారా నెలకు సుమారు రూ. కోటి ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. ముఖద్వారం.. ఆకర్షణీయం రైల్వే స్టేషన్ భవనం ముఖద్వారంలో 50 మీటర్ల పొడవున నిర్మించిన ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. దీని నిర్మాణంతో స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో ఆకర్షణీయంగాల ఇది ఉంది. రైల్వే స్టేషన్ ముందు భాగంలో కర్షక కష్టం అద్దం పట్టేలా స్వాగత ద్వారం దాటిన తర్వాత స్టేషన్లోకి అడుగుపెట్టే సమయంలో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగే విధంగా ఈ ప్రాంత వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా రెండు ఎద్దులతో రైతు నాగలి పట్టి పొలం దున్నుతున్నట్టుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు. అప్పటి నుంచి రామలింగేశ్వరరావు ఇంటి వద్ద ఆ వ్యక్తి ఉంటున్నాడు. మృతునికి వివరాలు అవసరమని రామలింగేశ్వరరావు ఇంటి వద్ద పని చేస్తున్న గుండు కామరాజు ఇంటి పేరుపై గుండు శివుడు (30)గా ఆధార్కార్డు తయారు చేయించారు. శివుడికి అప్పుడప్పుడు పిట్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత నెల 19న శివుడు దుస్తులు ఉతికి మేడపై ఆరబెట్టడానికి వెళుతున్నప్పుడు పిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ విషయం రామలింగేశ్వరరావు, కామరాజు తదితరులు కొంత సమయం వరకూ చూడలేదు. అనంతరం చూసిన వారు శివుడ్ని కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
కాలువలో వ్యక్తి మృతదేహం
రాయవరం: పసలపూడి బస్టాండ్ వద్ద మండపేట ప్రధాన కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలువ పైభాగం నుంచి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుని వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఒంటిపై లేత ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు చారల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లూ జీన్ ఫ్యాంట్ ఉంది. మృతుడు 5.8 అడుగుల ఎత్తు ఉన్నాడు. ప్యాంట్ జేబులో సెల్ఫోన్ ఉంది. పొరపాటున కాలువలో పడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపి కాలువలో పడేశారా? అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రాయవరం ఎస్సై డి.సురేష్బాబు సిబ్బందితో వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మండపేట సీహెచ్సీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే 94409 04843 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్సై తెలిపారు. -
అత్యంత విషమంగా కల్తీపాల బాధితుల పరిస్థితి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. రోజురోజుకూ వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ ఘటనలో 21 మందికి 10 మంది మృత్యువాత పడగా, 11 మందికి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్కు సంబంధించిన వివరాల ప్రకారం కిమ్స్ బొల్లినేనిలో నలుగురికి వైద్య చికిత్సలు అందిస్తుండగా వారిలో ఇద్దరికి వెంటిలేటర్, ఇద్దరికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురూ వెంటిలేటర్, డయాలసిస్పై ఉన్నారు. డెల్టా ఆసుపత్రిలో ముగ్గురికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రవి చైతన్య కిడ్నీ కేర్లో ఒకరికి డయాలసిస్ జరుగుతోంది.టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి శుక్రవారం తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. ఈ మేరకు సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. టెన్త్ పరీక్షలు సమర్థంగా నిర్వహించాలి రాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆల్కాట్తోటలోని సత్య సాయి గురుకులంలో శుక్రవారం జిల్లాలోని ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలు తదితర అధికారులతో సమీక్షించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆయా కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏడీ వెంకటరాజు, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బి.దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


