East Godavari
-
రత్నగిరి.. భక్తజన గోదారి
● సత్యదేవుని దర్శించిన లక్ష మంది ● 13 వేల వ్రతాలు ● రూ.కోటి ఆదాయం అన్నవరం: వరదల వేళ పోటెత్తే గోదారిలా.. భీష్మ ఏకాదశి పర్వదినం, రెండో శనివారం సెలవు కలసి రావడంతో.. రత్నగిరిపై భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కింది. సత్యదేవుని దర్శించేందుకు లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకూ భక్తులు స్వామివారి దర్శనానికి వెల్లువలా వస్తూనే ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు. రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలను మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. యంత్రాలయంలో ప్రదక్షిణ దర్శనం కూడా నిలిపివేశారు. వ్రత మండపాలు నిండిపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. దీంతో ఉదయం 11 గంటలకు స్వామివారి నిత్యకల్యాణం ప్రారంభించారు. భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సుమారు 13 వేల వ్రతాలు జరిగాయి. ఆలయం, పది వేల మంది భక్తులకు సర్కులర్ మండపంలో పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. రామాలయం వద్ద విశ్రాంతి మండపంలోను, పలుచోట్ల ఏర్పాటు చేసిన షామియానాల్లోను భక్తులు సేద తీరారు. స్వర్ణ పుష్పాలు, చామంతులతో అర్చన ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవారికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పాలతో, 9 గంటలకు చామంతులతో అర్చన నిర్వహించారు. సాఫీగా దర్శనాలు భీష్మ ఏకాదశి రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులుగా చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయి. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్ల వలన భక్తులను నియంత్రించడం సులువైంది. ఆలయం వద్ద క్యూ లైన్లు ఖాళీ అవగానే కంపార్ట్మెంట్లలోని భక్తులను లోపలకు అనుమతిస్తూండటంతో ఎక్కడా తొక్కిసలాట జరగకుండా భక్తులు సాఫీగా స్వామి దర్శనం చేసుకున్నారు. ఇవీ ఇబ్బందులు సత్యదేవుని సన్నిధిలో రూ.1,500 టికెట్టు వ్రతాల కోసం గతంలో అనివేటి మండపాన్ని రెండుగా విభజించి మధ్యలో కట్టిన చాపలను శనివారం తొలగించారు. దీంతో ధ్వజస్తంభానికి ఎడమవైపు మండపంలో ఉన్నవారు అదంతా మైకులో విని చేయాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రీసర్వేలో నిర్లక్ష ్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): భూముల రీసర్వేలో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ జిల్లాలోని 26 మంది ఉద్యోగులకు కలెక్టర్ పి.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, 12 మంది డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ), 12 మంది మండల సర్వేయర్లు ఉన్నారు. రాజానగరం మండలం యర్రంపాలెం గ్రామ సర్వేయర్ వి.రమేష్ కుమార్ లాగిన్లో 5, కానవరం గ్రామ సర్వేయర్ వై.గంగరాజు లాగిన్లో 4 పౌర సేవలు పెండింగ్లో ఉన్నాయని, ఇది మొత్తం జిల్లా పరిపాలన పురోగతిపై ప్రభావం చూపిందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే, పెరవలి, గోపాలపురం, రాజమహేంద్రవరం రూరల్, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాలకు చెందిన 12 మంది సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన అధికారులుగా విధి నిర్వహణలో వీరు విఫలమయ్యారని పేర్కొన్నారు. రీసర్వే సమస్యల పరిష్కారంపై కలెక్టర్, ఉన్నతాధికారుల సూచనలు పాటించలేదని, విధులు సమర్థవంతంగా నిర్వహించలేదని, ఇది వారి నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని చూపుతోందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో రీసర్వే ప్రక్రియను నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ఇందులో నిర్లక్ష్యం చూపినందున ఈ 26 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. వీరిపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. 26 మందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు వారిలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, 12 మంది డీటీలు, మండల సర్వేయర్లు -
వంగలపూడిలో ఇసుక దోపిడీ
వంగలపూడి ర్యాంపులో ఇసుక ఎగుమతులు ● అధిక ధరలకు అమ్మకాలు ● ప్రతి టన్నుకూ అ‘ధనమే’ ● కలెక్టర్కు బాధితుల ఫిర్యాదుసీతానగరం: కూటమి నేతలకు ఇసుక కల్పతరువుగా మారింది. రూ.కోట్లు కురిపిస్తూండటంతో నిబంధనలు ఇసుకలో తొక్కేస్తున్నారు. తాజాగా లైసెన్స్ తెచ్చుకుని మరీ అడ్డూ అదుపూ లేకుండా దోచేస్తున్నారు. స్టాక్ పాయింట్లను అనువుగా మార్చుకుని దందాకు తెర తీశారు. ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏం జరుగుతోందంటే.. సీతానగరం మండలం వంగలపూడి ఇసుక ర్యాంపులో రీచ్–1, 2లలో ఇసుక అమ్మకాలకు ఇటీవల అనుమతులు ఇచ్చారు. రీచ్–1లోని ఇసుకను స్థానికంగా అమ్మకుండా విశాఖలోని స్టాక్ పాయింట్కు తరలిస్తున్నారు. రీచ్–2లోని ఇసుక అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపించి, ట్రాక్టర్లపై స్టాక్ పాయింట్ వద్ద డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి పొక్లెయిన్తో లారీల పైకి ఇసుక ఎగుమతి చేస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అక్రమార్కులు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకువారి నుంచి తవ్వకం, బాట చార్జీలు కలిపి ఇక్కడ టన్ను ఇసుకకు సుమారు రూ.84 మాత్రమే వసూలు చేయాలి. కానీ రూ.250 గుంజుతున్నారు. పైగా ఫోన్పే వంటి ఆన్లైన్ యాప్ల ద్వారా మరీ వసూలు చేస్తూండటం గమనార్హం. ఈ రీచ్ నుంచి 25 నుంచి 40 టన్నుల లారీలపై ఇసుక తరలిస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు వంగలపూడి రీచ్–2లో అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారంటూ కాకినాడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తు లు ఐదు రోజుల కిందట పక్కా ఆధారాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 24 టన్నుల లారీ ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.2,040 మాత్రమే చెల్లించాల్సి ఉండగా టన్నుకు రూ.250 చొప్పున రూ.6 వేలు వసూలు చేశారంటూ రశీదుతో పాటు ఇతర ఆధారాలు చూపారు. ఈ ర్యాంపులో ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నారంటూ గతంలో కూడా లారీ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ఈ ర్యాంపును మూయించారు. అనంతరం జేసీ, అప్పటి ఇన్చార్జి ఆర్డీవో భాస్కరరెడ్డి ర్యాంపులో విచారణ జరిపి, టన్ను ఇసుకకు రూ.84 మాత్రమే తీసుకోవాలని, అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. లారీ డ్రైవర్లకు కనిపించే విధంగా ధరల పట్టికతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ఇంత జరిగినా.. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో దోపిడీ సాగుతున్న నేపథ్యంలో ఈ దందా వెనుక కూటమి నేతల అండదండలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. -
పీడీఎఫ్ ఎమ్మెల్సీలది ప్రజాగళం
● ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ● ఘనంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవులు పరిచయ కార్యక్రమం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన గొంతెత్తి నినదించేది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు మాత్రమేనని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యాన పీడీఎఫ్ పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డీవీ రాఘవులు పరిచయ కార్యక్రమం స్థానిక ఆనం రోటరీ హాలులో శనివారం జరిగింది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వంత పాడటంతో నిరుద్యోగులు, పేదలు, నిమ్న వర్గాల వారు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిజాయితీ, నిస్వార్థం క్రమశిక్షణ, ప్రజా సమస్యలపై పోరాటం పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఆస్తులని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలకు కూటమి నేతలు ఎన్నికల్లో మాట ఇచ్చారని, గెలిచిన తర్వాత తొలి సంతకం చేసి, ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. సాకులు చెబుతూ డీఎస్సీని వాయిదా వేస్తున్నారన్నారు. విజన్–2047 అంటూ కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తోందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, అంగన్వాడీల సమస్యలపై సక్రమంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, నూతన పీఆర్సీ ఏర్పాటు వంటి వాటిపై ప్రభుత్వం ఉదాశీన వైఖరి అవలంబిస్తోందన్నారు. రాఘవులును గెలిపిస్తే, ప్రజా సమస్యలపై శాసన మండలిలో నినదించే గొంతవుతారని చెప్పారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరుణ్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎన్.అరుణ కుమారి, జ్యోతిబసు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యం, కేవీపీఎస్ జిల్లా నాయకుడు జువ్వల రాంబాబు, జేఏసీ జిల్లా నాయకుడు ప్రవీణ్, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు బేబీరాణి తదితరులు కూడా ప్రసంగించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డీవీ రాఘవులు మాట్లాడుతూ, తాను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ యూటీఎఫ్, ఇతర ఉద్యోగ సంఘాల్లో కీలక బాధ్యతలు నిర్వహించి, అనేక పోరాటాలు చేశానని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నానని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ఏపీ ప్రభుత్వం కల్లు గీత కులాల వారికి కేటాయించిన 13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వచ్చాయని గత నెల 27న ప్రభుత్వం మద్యం షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ, ఆయా ఎకై ్సజ్ స్టేషన్లలో డీడీలతో గడువుకు ముందు వచ్చిన వారిని అనుమతించారు. ఈనెల 6వ తేదీతో గడువు ముగిసినప్పటికీ 13 మద్యం షాపులకు కేవలం 37 దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం రెండురోజులు గడువు పెంచింది. దీంతో శనివారం రాత్రి 7.30 గంటలకి 387 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆదివారం మద్యంషాపులు దరఖాస్తులు పరిశీలిస్తామని, ఈనెల 10వతేదీ రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో మద్యం షాపులు లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసి షాపులను కేటాయిస్తామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిణి చింతాడ లావణ్య తెలిపారు.కోటసత్తెమ్మ సన్నిధిలో రిటైర్డ్ జడ్జినిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారిని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బులుసు శివశంకర్ శనివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్లు శివశంకర్ను, సిద్ధాంతి పి.వీరభద్రను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు అప్పారావు శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులుపెద్దాపురం: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ వాహనాలు, కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.5,45,693 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 15 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. -
పులకించిన ధవళగిరి
●● వైభవంగా లక్ష్మీజనార్దన స్వామి కల్యాణోత్సవం ● కన్నుల పండువగా రథోత్సవం ● మార్మోగిన గోవింద నామస్మరణధవళేశ్వరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలోని ధవళగిరి గోవింద నామస్మరణతో మార్మోగింది. నవజనార్దనుల్లో ప్రథముడైన ధవళగిరి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ జనార్దనస్వామి వారి రథోత్సవం, కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగిన వేళ.. చూసిన కన్నులదే వైభోగం అన్నట్లు పులకించింది. శనివారం తెల్లవారుజామున విశేష అర్చనలతో శ్రీలక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం రథ సంప్రోక్ష ణ, మధ్యాహ్నం 3.30 గంటలకు రథోత్సవం, అనంతరం ధ్వజారోహణ, అంకురార్పణ, వాస్తు పూజ, రాత్రి స్వామివారి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్థానిక రామపాద క్షేత్రం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, జనార్దన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు రథోత్సవంలో పా ల్గొని, స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా దేవదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యాన సీఐలు టి.గణేష్, కె. మంగాదేవి భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈవో కె.నాగ సురేష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నయన మనోహరం
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025లక్ష్మీ నృసింహుని రథాన్ని లాగుతున్న భక్తులుసముద్రంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తకోటిసాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: అర్థరాత్రి కనువిందు చేసిన లక్ష్మీ నృసింహుని కల్యాణం.. తెల్లవారు జాము నుంచే మొదలైన సముద్ర స్నానాలు.. అనంతరం శ్రీ, భూ సమేత నృసింహ స్వామి వార్ల దివ్య దర్శనం.. మధ్యాహ్నం పురవీధులను ఇల వెలసిన వైకుంఠంగా మార్చిన రథోత్సవం.. 24 గంటల పాటు వరుసగా సాగిన పుణ్య ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. భక్త వరదుడు అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన నిర్వహించిన రథయాత్ర అపూర్వంగా నిలచిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తుల గోవింద నామస్మరణలు, నరసింహస్వామికి జయజయధ్వానాల మధ్య ఈ రథయాత్ర మనోహరంగా సాగింది. కల్యాణం అనంతరం స్వామివారు తమ ఇంటి ఆడపడుచు గుర్రాలక్కకు చీర, సారె పెట్టేందుకు రథంపై ఊరేగుతూ మెరకవీధిలోని ఆలయం వద్దకు వెళ్లడం ఆనవాయితీ. రథయాత్రకు ముందు మంగళ వాయిద్యాలతో, అర్చకుల వేదమంత్రాలతో నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకిలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. రథానికి భక్తులు అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మొగల్తూరుకు చెందిన ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్, ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరి కాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. కొత్తపేట డీఎస్పీ మురళీ మోహన్, అమలాపురం ఆర్డీవో కె.మాధవి, ఎండోమెంట్స్ డీసీ రమేష్బాబు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఎంపీపీ వీరా మల్లిబాబు, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దిరిశాల బాలాజీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెరకవీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధి మీదుగా పదహారు కాళ్ల మండపం వద్దకు చేరుకుంది. మార్గం మధ్యలో గుర్రాలక్కకు ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు స్వామి తరఫున చీరె, సారె ఇచ్చారు. పుణ్య స్నానాలు స్వామివారి కల్యాణం అనంతరం శనివారం వేకువ జామున భీష్మ ఏకాదశి పర్వదినాన పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కల్యాణం అనంతరం ఉన్న భక్తులకు తోడు రథయాత్ర చూసేందుకు వచ్చిన భక్తులతో సాగరతీరం కిటకిటలాడింది. పలువురు తలనీలాలు సమర్పించి పుణ్యస్నానాలు చేయగా, మరికొందరు పితృ దేవతలకు తర్పణాలు వదిలారు. అనంతరం స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అంతర్వేదిలో నేడుఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకూ సుప్రభాత సేవ, స్వామి వారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు, సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై, రాత్రి 8 గంటలకు పొన్న వాహనంపై గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి నాడు విరమణ చేసే అర్చకులు స్వామికి అన్న దర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహా నివేదన చేస్తారు. ఇది రాత్రి 7 గంటలకు జరగనుంది. వైభవంగా సాగిన లక్ష్మీ నృసింహుని రథోత్సవం సోదరి గుర్రాలక్కకు చీర, సారె సమర్పణ పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు విశేష సేవలందించిన ఆలయ అధికారులు -
ముద్రగడపై దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాలి
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణం స్పందించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. అక్కడి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు శనివారం స్థానిక ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా ముద్రగడకు ఉన్న ఖ్యాతి, ఆయన కుటుంబానికి ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని అన్నారు. ఆయనపై జరిగిన దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలన్నారు. కడపలో ఎంపీడీఓను ఎవరో తిట్టారని పవన్కళ్యాణ్ అడుగుతున్నారు కానీ సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం ఇంటిపైనే దాడి చేస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం స్పందిచలేదంటే ఆయనపై మీ వైఖరి ఎంటో అర్థమౌతుందన్నారు. ప్రశ్నించే నైజం గల వ్యక్తినని చెప్పుకునే పవన్కళ్యాణ్ ఒక కులానికి, సమాజానికి మార్గదర్శిగా, రాజకీయంగా నైతిక విలువలు ఉన్న ముద్రగడపై దాడి జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదని, చంద్రబాబు మీ నోరు నొక్కెస్తున్నారా అని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. కూటిమి ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ముద్రగడకు రక్షణ లేదని భావిస్తున్నానన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో దాడికి పాల్పడిన వ్యక్తిని జైల్లో పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకొందన్నారు. సమస్యలపై ప్రశ్నించే పవన్కల్యాణ్ నోరుపై చంద్రబాబు చేయి తీసి ఆయనకు ప్రశ్నించే స్వేచ్ఛను ఇవ్వాలన్నారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు ఆపాలని, ఇదే వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఆయనకు సంఘీభావం తెలిపిన వారిలో గొల్లపల్లి డేవిడ్, ఎంపీపీలు మార్గని గంగాధర్, తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీలు బోనం సాయిబాబు, తోరాటి రాంబాబు, జవ్వాది రవిబాబు, ముసునూరి వెంకటేశ్వరరావు, చికారమిల్లి చిన్న, కర్రి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి -
అంగరంగ వైభవంగా ఆదిత్యునికి..
పెదపూడి: గోవింద నామస్మరణ నడుమ ఉష, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యనారాయణుని కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల సందడితో స్వామి వారి కల్యాణం నయన మనోహరంగా సాగింది. అలాగే మధ్యాహ్నం 1.05 గంటలకు స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే ఏకై క వైష్ణవ సాంప్రదాయంలో పూజాదికాలు అందుకునే ఆలయంగా మండలంలోని జి.మామిడాడ గ్రామంలోని సూర్యదేవాలయం ప్రసిద్ధిగాంచింది. భీష్మ ఏకాదశి శనివారం రాత్రి స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి దేవదాయ శాఖ తరుఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో 15 మంది పండితులు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు సుముహూర్తం, స్వామివారి కల్యాణం వైభవంగా సాగాయి. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము 3.30 నిముషాల నుంచే స్వామివారిని మెల్కొలిపి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులను పల్లకిలో రథంలో ఆసీనులను చేశారు. పూజల అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రథోత్సవాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వామి వారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ఎస్సై కె.రామారావు అధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జి.మామిడాడలో కన్నుల పండుగగా జరగుతున్న రథోత్సవం -
పైడికొండలో ఆటో బోల్తా
తొండంగి: ముగ్గురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలో డ్రైవర్తో కలిపి 19 మంది ప్రయాణించడంతో ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. తొండంగి మండలం పైడికొండలో శనివారం జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణాపురంలో అవంతి రొయ్యల కంపెనీలో పని చేసేందుకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రామభద్రాపురం నుంచి ఆటో వెళ్తుంది. శనివారం ఉదయం రామభద్రాపురం, శ్రీరాంపురం గ్రామాలకు చెందిన కూలీలను ఎక్కించుకుని ఆనూరు, పైడికొండ మీదుగా వెళ్తుండగా అక్కడి మలుపు వద్ద చెట్లు కొట్టేసి రహదారిపై వదిలేసిన ప్రదేశం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ పట్నాల సంతోష్తో పాటు 16 మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అంత మంది ఒకేసారి గాయాలపాలవడంతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనాలు సరిపోకపోవడంతో కొద్ది మంది ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆర్తనాదాలు చేశారు. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం వారందరినీ తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై జగన్మోహన్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారి వివరాలివీ.... ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురానికి చెందిన నక్కిన లక్ష్మి, ఎస్.లక్ష్మి, కనకం దేవి, మంతిన రమణమ్మ, పులి లోవకుమారి, గెడ్డమూరి సీతారత్నం, కోటిన లక్ష్మి, పగడం చిన్నమ్ములు, జీలం పద్మ, తుంపాల అనంతలక్ష్మి, ఉగ్గిన దేవి, ఉగ్గిన సత్యవతి, నంగిన పద్మ, శ్రీలం ధనలక్ష్మి, కర్రి లక్ష్మి, నారిపిరెడ్డి నాగమణి, పట్నాల సంతోష్ (ఆటో డ్రైవర్)లకు తలకు, కుడిభుజం, కాళ్లు, చేతులు, నడుమ విరగం వంటి తీవ్రగాయాలయ్యాయి. వీరికి తుని ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం కొంత మందిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అధిక లోడుతో పాటు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. డ్రైవర్ సహా 16 మంది మహిళలకు తీవ్రగాయాలు క్షతగాత్రులంతా రొయ్యల కంపెనీ కార్మికులు -
ఏటీఎం కార్డులు మార్చి నగదు చోరీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏటీఎం సెంటర్ల వద్ద వేచి చూసి నగదు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తున్నట్టు నటిస్తూ వారి ఏటీఎం కార్డులు తస్కరించి ఆనక నగదు చోరీ చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను స్థానిక ప్రకాశ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్ బాబు, స్టేషన్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంల వద్ద నేరగాళ్లు తిరుగుతున్నారన్న సమాచారంతో ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మోరంపూడి జంక్షన్లోని ఏటీఎం సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చల్లమూరు వెంకట భాస్కరరావు, పొన్నాడ కిరణ్లను గుర్తించి ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిది విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాంతం పురిటిపెంట గ్రామంగా తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా భాస్కరరావు పాత నేరస్తుడిగా తేలింది. అతడు విజయనగరం, విశాఖపట్నం, పెందుర్తి, విజయవాడ, భీమిలి ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద నేరాలు చేసినట్లు గుర్తించారు. అతనిపై 15 కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లుగా పోలీసు రికార్డులు తెలిపాయి. మరో వ్యక్తి పొన్నాడ కిరణ్ ఇంటి దొంగతనం కేసులో నేరస్తుడిగా తెలిసింది. వారిని మరింత లోతుగా విచారించగా నగర పరిధిలో చేసిన నేరాలు ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో గత ఏడాది నవంబర్ నుంచి ఏటీఎం సెంటర్లో వద్ద దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఎంటీఎం సెంటర్లలో వృద్ధులు, పిల్లలకు సాయం చేస్తున్నట్టు నటించి ఏటీఎం కార్డు పిన్ నంబరు తెలుసుకుని అప్పటికే వారి వద్ద ఉన్న అదే బ్యాంకుకు చెందిన మరో ఏటీఎం కార్డు ఇచ్చి పంపేస్తారు. ఆనక ఆ కార్డును వేరే ఏటీఎంలలో పెట్టి నగదు ఊడ్చేస్తారు. ఇలా వారు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాలు, టూ టౌన్, రాజానగరం, రావులపాలెం, ఏలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏటీఎం సెంటర్ వద్ద దొంగతనాలు చేసినట్లుగా పోలీసులు విచారణలో అంగీకరించారు. వారి నుంచి రూ.2.6 లక్షలు నగదు, 23 ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన, ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్, ఎస్సై శివప్రసాద్, హెచ్సీ ఎన్.రాంబాబు, పీసీలు కె.ప్రదీప్కుమార్, ఎస్.వీరబాబులను జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు రూ.2.6 లక్షల నగదు, 23 ఏటీఎం కార్డుల స్వాధీనం -
కుంభమేళాకు ప్రత్యేక రైలు
కాకినాడ: మహాకుంభమేళాకు వెళ్లే కాకినాడ జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ–ప్రయాగరాజ్ మధ్య ఈ ప్రత్యేక రైలు ప్రయాణిస్తోంది. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వేశాఖ ఈ రైలును ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి సామర్లకోట వరకు ఎంపీ తంగెళ్ల స్లీపర్ రైలు బోగీలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి కుంభమేళా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కౌడా చైర్మన్ తుమ్మల బాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు, నాయకులు నున్న దొరబాబు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య కొత్తపేట: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక వృద్ధుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ హెచ్సీ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వానపల్లి శివారు సంగంపాలెం గ్రామానికి చెందిన ఇళ్ల పళ్లంశెట్టి (79) సుమారు నాలుగేళ్ల క్రితం గుండెపోటుకు గురై స్టంట్ వేయించుకున్నాడు. అప్పటి నుండి ఆరోగ్యం సరిగా లేక, రెండు కాళ్లు విపరీతమైన బాధపడుతున్నాడు. ఆ బాధ తాళలేక ఈ నెల 7న సాయంత్రం గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన అతని బంధువులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాధమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పళ్లంశెట్టి కుమారుడు ఇళ్ల కోప్పేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు హెచ్సీ తెలిపారు. -
కమనీయం భీమనాథుని కల్యాణం
రామచంద్రపురం రూరల్: పంచారామ క్షేత్రం, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వది అయిన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణం శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఎక్కడా లేని విధంగా మూల విరాట్ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారితో పాటు క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామి వారల దివ్య కల్యాణాన్ని ఒకే వేదికపై తిలకించి భక్తులు పరవశులయ్యారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని నేతృత్వంలో విశేష పుష్పాలంకరణలు చేశారు. దేవస్థానం బ్రహ్మ దేవులపల్లి ఫణి రామకృష్ణ, ఆలయ అర్చకులు, దేవస్థానం వైదిక బృందం ఆధ్వర్యంలో ఉదయం కల్యాణమూర్తులుగా అలంకరించి అనంతరం ఎదురు సన్నాహం నిర్వహించారు. భీమేశ్వరస్వామి వారికి దాత సత్తి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణం చేశారు. నంది వాహనంపై స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆరుద్రా నక్షత్రయుక్త తులా లగ్నంలో రాత్రి 11.05 గంటలకు శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ చేయించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు, నీరాజన మంత్రపుష్పాలతో కల్యాణం ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భీమనాథుని కల్యాణాన్ని కనులారా తిలకించారు. కల్యాణ మూర్తులకు మంత్రి వేణు దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అధికారులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారిని అలంకరించే నిమిత్తం ఈ ఓ దుర్గాభవానికి అందజేశారు. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ అధికారులు శోభాయమానంగా ఆలయ ప్రాంగణం వేలాదిగా తరలివచ్చిన భక్తజనం -
వైభవం.. కుంతీమాధవ పరిణయం
పిఠాపురం: పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతీమాధవ స్వామి వారి దివ్య కల్యాణం పిఠాపురంలో శనివారం వైభవంగా జరిగింది. ఉదయం పిఠాపురం మహారాజా రాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ పేరున తొలి అర్చన చేసిన అర్చకులు అధిక సంఖ్యలో వచ్చిన భక్తజనం నడుమ కుంతీమాధవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల పరిణయాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో స్వామి అమ్మ వార్లను వధూవరులుగా తీర్చిదిద్ది కల్యాణ మంటపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజ వాహనంపై గ్రామోత్సవం అనంతరం విగ్రహాలను పట్టు వస్త్రాలు, నగలతో అలంకరించారు. అనంతరం వారిని ఊరేగింపుగా తీసుకు వచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై కూర్చుండబెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, చక్రవర్తుల మాధవాచార్యులు ఆధ్వర్యంలో విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. పుణ్యాహవాచనం, కంకణధారణ, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్రధారణ, యజ్ఞోపవీత ధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజలను సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల హరినామ స్మరణతో కల్యాణం కమనీయంగా సాగిపోయింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీరాములు, పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం టీటీడీ వేద పండితులు అల్లంరాజు కల్యాణ కామేశ్వర సూర్యనారాయణ ఘనపాఠి ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. పిఠాపురం మహారాజా పేరున తొలి అర్చన గజ వాహనంపై గ్రామోత్సవం -
కుంభమేళాకు ప్రత్యేక రైలు
కాకినాడ: మహాకుంభమేళాకు వెళ్లే కాకినాడ జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ–ప్రయాగరాజ్ మధ్య ఈ ప్రత్యేక రైలు ప్రయాణిస్తోంది. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వేశాఖ ఈ రైలును ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి సామర్లకోట వరకు ఎంపీ తంగెళ్ల స్లీపర్ రైలు బోగీలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి కుంభమేళా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కౌడా చైర్మన్ తుమ్మల బాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు, నాయకులు నున్న దొరబాబు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో వృద్ధుడి ఆత్మహత్య కొత్తపేట: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక వృద్ధుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ హెచ్సీ రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వానపల్లి శివారు సంగంపాలెం గ్రామానికి చెందిన ఇళ్ల పళ్లంశెట్టి (79) సుమారు నాలుగేళ్ల క్రితం గుండెపోటుకు గురై స్టంట్ వేయించుకున్నాడు. అప్పటి నుండి ఆరోగ్యం సరిగా లేక, రెండు కాళ్లు విపరీతమైన బాధపడుతున్నాడు. ఆ బాధ తాళలేక ఈ నెల 7న సాయంత్రం గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన అతని బంధువులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాధమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పళ్లంశెట్టి కుమారుడు ఇళ్ల కోప్పేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు హెచ్సీ తెలిపారు. -
థీమ్లతో పార్కుల అభివృద్ధి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా నగర ప్రజలను, పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక థీమ్లతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఆ మేరకు పనులు పూర్తి చేయాలని అన్నారు. నగరంలోని 26 పార్కులు, నగరవనం అభివృద్ధికి సెవెన్ హిల్స్ అసోసియేట్స్ ప్రతిపాదించిన ముసాయిదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి కలెక్టర్ తన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి పార్కును ఒక ప్రత్యేకతతో అభివృద్ధి చేయాలని సూచించారు. ఇప్పటికే కంబాల చెరువు, దానవాయిపేట, ప్రకాశ్ నగర్, జేఎన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు వంటి ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మరింత విలువ ఆధారిత విధానంలో పార్కులు అభివృద్ధి చేయాలని అన్నారు. కేవలం విశ్రాంతికో, పిల్లల ఆటలకో పరిమితం కాకుండా.. జిమ్, యోగా, డ్యాన్స్, ఔషధ మొక్కలు, మ్యూజిక్, రాక్ గార్డెన్, వాటర్ షో, ఫ్లవర్, బర్డ్, వ్యర్థాల నుంచి విభిన్న ఆకృతుల తయారీ, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల వంటి వినూత్న డిజైన్లతో అభివృద్ధి చేయాలని సూచించారు. పార్కులకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కడియం నర్సరీల్లో పర్యాటకాభివృద్ధిపై కూడా పర్యాటకం, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శైలజవల్లి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహాల ప్రతిష్ఠకు బ్రేక్
● ఆలయం నిర్మించినప్పుడు ఊరుకున్నారు ● ఇప్పుడు అనుమతి లేదంటున్నారు ● బీజేపీ ఎమ్మెల్యే ఇలాకాలో ఘటన ● అధికారుల తీరుపై సర్వత్రా విస్మయం కాకినాడ: హిందూ ధర్మానికి ప్రతినిధిగా చెప్పుకొనే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న అనపర్తి నియోజకవర్గంలో హిందూ దేవతా విగ్రహాల ప్రతిష్ఠను అధికారులు అడ్డుకోవడం సంచలనం రేపుతోంది. వివరాలివీ.. అనపర్తి శివారు కొత్తూరు గ్రామంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో 1,600 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని స్థలాలు కొన్ని అక్కడక్కడ మిగిలాయి. అటువంటి ఒక స్థలంలో స్థానికులు కొంతమంది కలిసి, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు తదితర దేవుళ్లకు ఆలయ నిర్మాణం చేపట్టారు. దీనికి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు సత్తి గంగిరెడ్డి సొంతంగా సుమారు రూ.20 లక్షల ఆర్థిక సహకారం అందించారు. ఆలయ నిర్మాణం పూర్తవడంతో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమం సత్తి గంగిరెడ్డి, ఆయన కుటుంబం ఆధ్వర్యాన జరగాల్సి ఉంది. స్థానికులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిళ్లో లేక ఇతర కారణాలో తెలీదు కానీ.. ఆలయ నిర్మాణం జరిగినన్నాళ్లూ పట్టించుకోని గ్రామ పంచాయతీ, మండల పరిషత్, రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న సత్తి గంగిరెడ్డి అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో గుడి నిర్మిస్తున్నారని, అది అక్రమ నిర్మాణమని, తక్షణం ఆపాలని పేర్కొంటూ పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. వెనువెంటనే జిల్లా స్థాయి అధికారులు కూడా ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. గుడి వద్ద విగ్రహ ప్రతిష్ఠ పూజలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన యాగశాల చుట్టూ ఆంక్షలతో కూడిన కంచె, పోలీసు పహారా ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ కోసం గ్రామంలోకి దేవతా విగ్రహాలు తీసుకువచ్చి, సంప్రదాయబద్ధంగా గురువారం నిర్వహించాల్సిన గ్రామోత్సవాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎవరైనా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తే వారి పైన, తమను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారి పైన కేసులు పెడతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కూటమి నాయకులు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే అధికారులు విగ్రహ ప్రతిష్ఠను అడ్డుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ మతాలకు చెందిన అనుమతులు లేని నిర్మాణాలు చాలా గ్రామాల్లోనే ఉన్నాయని, వాటన్నింటికీ లేని ఆంక్షలను కేవలం కొత్తూరులోని హిందూ దేవాలయానికే ఎందుకు విధిస్తున్నారని అంటున్నారు. దీనిపై హిందూ మత ప్రతినిధులుగా చెప్పుకొనే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఈ ఘటన యావత్ హిందువులను అవమానించనట్లేనని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హిందూ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. -
ఏపీఎస్పీ కమాండెంట్గా
నాగేంద్రరావు కాకినాడ రూరల్: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్గా ఎం.నాగేంద్రరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆక్టోపస్ కమాండెంట్గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఇటీవల కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్గా నియమించింది. బెటాలియన్కు వచ్చిన ఆయనకు తొలుత అదనపు కమాండెంట్ దేవానందరావు మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం హెచ్ఏసీ కమాండెంట్ రామకృష్ణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ, గతంలో మూడో బెటాలియన్ అదనపు కమాండెంట్గా పని చేశానని, ఇప్పుడు ఇదే బెటాలియన్కు కమాండెంట్గా రావడం ఆనందంగా ఉందని అన్నారు. సిబ్బంది పనితీరు మెరుగు పరచడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, బాబ్జీ, ఆర్ఐలు విఠలేశ్వరరావు, రవిశంకర్, అజయ్కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొని, నాగేంద్రరావుకు అభినందనలు తెలిపారు. -
రత్నగిరిపై భీష్మ ఏకాదశి సందడి
అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం రత్నగిరి సత్యదేవుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. రెండో శనివారం కావడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారని అంచనా వేస్తున్నా రు. శుక్రవారం సాయంత్రం నుంచి వేలసంఖ్యలో భక్తులు రత్నగిరికి చేరుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. కొంతమంది రామాలయం పక్కన గల విశ్రాంతి షెడ్డు లో విశ్రమించారు. రాత్రి ఎనిమిది గంటల సమయానికి దేవస్థానానికి సుమారు పది వేల మంది వచ్చారు. తెల్లవారుజాము నుంచి వ్రతాలు, దర్శనాలు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము ఒంటి గంట నుంచే అనుమతిస్తారని, అలాగే వ్రతాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి వ్రతం టిక్కెట్లు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి విక్రయిస్తున్నారు. దేవస్థానంలోని అన్ని చోట్ల షామియానాలు, భక్తుల కోసం మంచినీటి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వామివారిని దర్శించిన 30 వేల మంది కాగా శుక్రవారం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. శుక్రవారం సుమారు రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
365 కేజీల గంజాయి పట్టివేత
ఫ రూ.26.80 లక్షల సొత్తు స్వాధీనం ఫ ఏజెన్సీ నుంచి కేరళకు తరలించేందుకు యత్నం ఫ వ్యాన్ క్యాబిన్లో ప్రత్యేక ఏర్పాటు ఫ డ్రైవర్ అరెస్టు ఫ కీలక సూత్రధారి, మరికొందరి కోసం గాలింపు గండేపల్లి: కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో పోలీసులు 365 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, రూ.26,79,750 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గండేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కొద్ది రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరం పరిసర ప్రాంతాల నుంచి గంజాయి ముఠా సభ్యులు కారులో గంజాయి బస్తాలు తెస్తున్నారు. వీటిని గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం – కె.గోపాలపురం మార్గంలో అప్పటికే సిద్ధంగా ఉంచిన ఐషర్ వ్యాన్లో లోడ్ చేస్తున్నారు. దీని కోసం ఎవ్వరికీ అనుమానం కలగని రీతిలో వ్యాన్ క్యాబిన్లో ప్రత్యేక గదిలా ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటో తేదీ రాత్రి గంజాయి బస్తాలు తీసుకువచ్చి వ్యాన్లో లోడ్ చేశారు. వ్యాన్ బయలుదేరేందుకు అనుకూలమైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు ప్రశ్నిస్తే వ్యాన్ పాడైందని, మెకానిక్ను తీసుకుని రావడానికి యజమాని వెళ్లాడని డ్రైవర్ చెప్పేవాడు. దీనిపై జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై యూవీ శివ నాగబాబు తన సిబ్బందితో కలసి ఒక్కసారిగా దాడి చేసి, 18 బస్తాల్లో ఉంచిన 365 కేజీల గంజాయితో సహా వ్యాన్, ఒక కారు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాకు చెందిన డ్రైవర్ సబు చూత్తం పరంబిల్ దేవాన్సీని అరెస్టు చేసి, పెద్దాపురం కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించారు. గంజాయి తరలింపులో రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి కీలక సూత్రధారి అని గుర్తించారు. అతడు ఏజెన్సీ నుంచి గంజాయి సేకరించి తమిళనాడుకు చెందిన వ్యక్తి ద్వారా కేరళలో ఉన్న మరో వ్యక్తికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి తరలింపును అడ్డుకోవడంలో చురుకుగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం మండలం పేరూరు శివారు కంసాల కాలనీలో వివాహిత సరెళ్ల కవిత (31) తన అద్దె ఇంట్లో చున్నీతో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు సరిగా తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కవిత పుట్టిల్లు అల్లవరం మండలం గూడాల కాగా, మెట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. ఆమె భర్త సునీల్ నర్సాపురంలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సీఐ పి.వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన దూనబోయిన పెద్దిబాబు కవితకు కుటుంబ స్నేహితుడు. ఆమె తండ్రి జట్టు కూలీగా పనిచేసినప్పుడు పెద్దిబాబు సైతం అదే పనిలో ఉండడంతో అతనితో ఆ కుటుంబానికి స్నేహం ఏర్పడింది. కవితకు కుమారుడు, కుమార్తె ఉండి పట్టణంలో ఓ కాన్వెంట్లో చదువుతున్నారు. సునీల్ కుటంబంతో ఆత్మీయంగా ఉండే పెద్దిబాబు కవిత పిల్లలకు కాన్వెంట్కు కేరియర్లు కూడా తీసుకు వెళుతూ ఆమెకు చేదోడు ఉంటాడు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కవిత తలుపులు వేసి ఇంట్లో ఉరివేసుకున్న విషయం తెలుసుకున్న పెద్దిబాబు ఆ ఇంటి తలుపుల పగలగొట్టి కవితను రక్షించే ప్రయత్నం చేశాడు. ఆమెను తొలుత అత్యవసర వైద్యం కోసం పట్టణంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆమె మరణించింది. భార్య ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న భర్త సునీల్ హుటాహుటిన తన అద్దె ఇంటికి చేరుకున్నాడు. కుటుంబీకులు, పెద్దిబాబును విచారిస్తున్నామని, కేసు దర్యాప్తులో కవిత ఏ కారణం వల్ల చనిపోయిందీ తేలుతుందని సీఐ వీరబాబు తెలిపారు. భర్త సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాన్వెంట్ నుంచి వచ్చిన పిల్లలు అమ్మ మరణంతో దిక్కుతోచకుండా రోదిస్తున్నారు. భర్త, ఇరుగుపొరుగు వారు ఈ పిల్లలను ఓదారుస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. ఆ చిన్నారులను గుడాలలోని వారి అమ్మమ్మ ఇంటికి పంపించేశారు. -
సివిల్ సర్వీసెస్ హాకీకి ఏర్పాట్లు చేయాలి
కాకినాడ సిటీ: నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ జరిగే ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఈ టోర్నమెంట్ నిర్వాహక ఉప కమిటీలతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారులకు చక్కటి బస, ఆతిథ్యం, సదుపాయాలు కల్పించాలని అన్నారు. వారి బసకు, అక్కడి నుంచి క్రీడా మైదానానికి వెళ్లేందుకు కాకినాడ, సామర్లకోట రైల్వే, బస్ స్టేషన్ల నుంచి బస్సులు, కార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారుల నమోదు, పోటీల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆహారం, వైద్య సేవలకు ఉపకమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రారంభ, ముగింపు వేడుకల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశుధ్యం, ట్రాఫిక్, క్రౌడ్ నియంత్రణ, పార్కింగ్, లైటింగ్ తదితర అంశాలపై ఆయా కమిటీల అధికారులతో జేసీ మీనా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, డీఎస్డీవో బి.శ్రీనివాసకుమార్, సీపీవో పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి జ్ఞాన చైతన్య మహాసభలు పిఠాపురం: స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠంలో ఆది, సోమ, మంగళవారాల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నారు. పిఠాపురంలోని పీఠం ప్రధానాశ్రమం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు ఈ విషయం తెఇపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశ విదేశాల నుంచి సుమారు 36 వేల మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సభల్లో పాల్గొనే వారికి పీఠం వద్ద భోజన ఏర్పాట్లు చేశామన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ 1472లో స్థాపించిన ఈ పీఠం 553 సంవత్సరాలుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని చెప్పారు. 1928లో పంచమ పీఠాధిపతి నిర్వాణానంతరం, ఏటా మాఘ మాసం శుక్ల పక్షంలో తాత్విక విజ్ఞానాన్ని బోధిస్తూ మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్గ తారతమ్యాలు లేని, సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని తమ పీఠం బోధిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై జాన్ బాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, పింగళి ఆనంద్, ఏవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణనల్లజర్ల: సీపెట్ – విజయవాడ, ఎంఎస్ఎంఈ, ఎన్ఎస్ఐసీ సంయుక్త సౌజన్యంతో 30 మంది ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్టు సీపెట్ డైరెక్టర్ సీహెచ్ శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్, ఎన్ఎస్ఎస్హెచ్ స్కీం ద్వారా మెషీన్ ఆపరేటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్లో 5 నెలల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరు, హోసూర్, చైన్నె ప్రాంతాల్లోని ప్రముఖ ప్లాస్టిక్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నామని వివరించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలను సీపెట్ సంస్థ అందిస్తుందన్నారు. పదో తరగతి పాసై కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత సీపెట్ ప్రతినిధి సుందరరావును 93980 50255 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు భారీగా నామినేషన్లుఏలూరు (మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు శుక్రవారం 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదివరకే నామినేషన్ వేసిన పేపకాయల రాజేంద్ర, ములగల శ్రీనివాసరావు మరో రెండు సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఏలూరు కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వికి శుక్రవారం పేరాబత్తుల రాజశేఖర్, వానపల్లి శివగంగ వీరగణేష్, బండారు రామ్మోహన్రావు, నేతిపూడి సత్యనారాయణ, పచ్చిగొల్ల దుర్గారావు, బొమ్మిడి సన్నిరాజ్, జీవీ సుందర్, కుక్కల గోవిందరాజు, కాండ్రేగుల నరసింహులు, గద్దే విజయలక్ష్మి, కట్టా వేణుగోపాలకృష్ణ, మాకే ప్రసాద్, చిక్కాల దుర్గారావు, తాళ్లూరి రమేష్, చిక్కా భీమేశ్వరరావు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన అభ్యర్థులతో ఆర్వో ప్రమాణం చేయించారు. ఇంతవరకూ మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి
తుని: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంబయి నుంచి విశాఖపట్నం వెళ్తున్న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ రైలులో సుమారు 40 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ట్రైన్ను తునిలో ఆపి రైల్వే మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరిశీలించిన వైద్యాధికారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 29020 నంబరుకు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు విడిగా అన్నదానం అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో దివ్యాంగులకు, వృద్ధులకు శుక్రవారం నుంచి ప్రత్యేకంగా భోజనం పెడుతున్నారు. దీని కోసం అన్నదాన పథకం హాలు పై అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో ఇదేవిధంగా వీరికి విడిగా భోజనం పెట్టేవారు. అయితే వీరి కన్నా ఇతరులు ఎక్కువగా వచ్చి భోజనం చేస్తున్నారనే కారణంతో దానిని రద్దు చేశారు. అయితే, అందరితో పాటు క్యూలో నిలబడలేక వీరు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు రావడంతో మళ్లీ విడిగా భోజనం పెడుతున్నారు. అయితే, అన్నదాన భవనం పై అంతస్తులోకి మెట్లు దిగి, ఎక్కలేక దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అందువలన వారిని వీల్ చైర్స్పై అన్నదానం హాలు వరకూ తీసుకుని వెళ్లేలా ర్యాంపు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే, అన్నదాన పథకంలో అందరికీ వడ్డించే ఆహార పదార్థాలు వేడిగా ఉంటాయి. ఇక్కడకు ముందుగానే వీటిని తీసుకురావడం వలన చల్లారి పోతున్నాయి. ఇక్కడ కూడా వేడిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
దుర్గమ్మకు రూ.10 లక్షలతో వెండి చీర సమర్పణ
మండపేట: పట్టణంలోని సైథిల్పేటలో సత్తివారి ఇంట వెలసిన కనకదుర్గమ్మ తల్లికి రూ.10 లక్షలతో వెండి చీరను చేయించారు. ఆలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సత్తి వెంకన్న దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి వెండి చీరను అలంకరించారు. అమ్మవారు దేదీప్యమానంగా ఆకర్షణీయంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మందిరం వద్ద కుంకుమార్చన, అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు. నిర్వాహకులు సత్తి వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ భక్తులు, దాతల సహకారంతో రూ.11 లక్షలు సమకూరగా అ కానుకలతో వెండి చీరను చేయించినట్టు తెలిపారు. అమ్మవారికి వెండిచీరను అలంకరించి మహిళలచే ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చూచిన కన్నుల భాగ్యమిదే..
సాక్షి, అమలాపురం/సఖినేటిపల్లి/మలికిపురం: భువిపై ఆది దేవుడై వెలసిన అంతర్వేది పుణ్యక్షేత్రం కోలాహలంగా మారింది. వేదికపై శ్రీ, భూ సమేత లక్ష్మీ నృసింహుని పరిణయాన్ని చూసేందుకు వచ్చిన భక్తజనంతో కిటకిటలాడింది. చూసే కన్నులదే భాగ్యం అన్నట్టుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచి సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగిన వేడుకను వేలాది భక్తులు ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించి పులకించిపోయారు. స్వామివారి కళ్యాణంతో పరమ పవిత్ర వశిష్ఠ గోదావరి తీరం ఆధ్యాత్మిక వాహిని వరవళ్లు తొక్కింది. తీరంలోని సముద్ర ఘోషను భక్తజన గోవింద ఘోష మించిపోయింది. నామస్మరణలు.. వేద పండితుల పన్నాలు.. రంగురంగుల పూవులతో శోభాయమానంగా అలంకరించిన కల్యాణ వేదిక.. పట్టు వస్త్రాలు, బంగారం, వజ్రాభరణాలతో స్వామి, అమ్మవార్లు మెరిసిపోయారు. కల్యాణ మండపం చుట్టూ భారీ పందిళ్లు.. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మారిన అంతర్వేదిలో లక్ష్మీనృసింహుని కల్యాణం నయనానందకరంగా సాగింది. అంగరంగ వైభవంగా రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. ఆచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన దేవస్థానం చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహద్దూర్ శ్రీవారి తరఫున, అర్చక స్వాములు అమ్మవారి తరఫున కల్యాణ కర్తలుగా నిలిచారు. స్వామివారి కల్యాణం శుక్రవారం అర్ధ రాత్రి 12–55 (తెల్లవారితే శనివారం) గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నం పుష్కరాంశలో జరిగింది. వైష్ణవ సంప్రదాయ వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకట శాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం కల్యాణాన్ని నిర్వహించింది. సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. ఎప్పటిలాగానే శఠారి, వైరుముడి, సూర్య పతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటె, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, హంస పతకం, నవ రత్నాలు పొదిగిన హారం, పగడాల మాల, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నానుతాడులు, చిన్ని లక్ష్మీ కాసుల పేర్లతో వారిని అలంకరించారు. వీటితో పాటు అంతర్వేదికరకు చెందిన దివంగత డాక్టర్ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ సమర్పించిన అభరణాలను సైతం అలంకరించారు. ఆనవాయితీగా అన్నవరం, టీటీడీ దేవస్థానాల తరఫున అధికారులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా తీరప్రాంత వాసులు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వేలాది భక్తులు కల్యాణాన్ని తుది వరకు చూసి ఆనందపడిపోయారు. వేలాది మంది భక్తులకు దేవస్థానం నోటిఫైడ్, ప్రైవేట్ సత్రాలు ఆకలి దప్పికలు తీర్చాయి. కల్యాణాన్ని స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జేసీ నిశాంతి, ఎస్పీ కృష్ణారావు, దేవదాయశాఖ డీసీ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. కల్యాణానికి అంచనాలు మించి భక్తులు వస్తారని అధికారులు భావించినప్పటికీ తక్కువ సంఖ్యలో రావడం విశేషం. వైకుంఠాన్ని తలపించిన అంతర్వేది క్షేత్రం అంగరంగ వైభవంగా లక్ష్మీనృసింహుని కల్యాణం సాగర ఘోషను మించిన గోవింద ఘోష వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ఏర్పాట్లు చేసిన అధికారులు, సేవకులు ఆ కనులు ఆత్రంగా.. ఆర్థ్రతతో.. ఆర్తిగా.. ఆరాధనగా.. అనిర్వచనీయమైన భక్తిభావంతో అంతలంతలై చూస్తున్నాయి. ఎక్కడ ఎక్కడ ఎక్కడా అని. ఏ వైపు నుంచి వస్తున్నాడా అని. వేదమూర్తుల మంత్రాలు.. డోలు సన్నాయి.. బాజా భజంత్రీలు.. మేళ తాళాలు.. అమ్మలక్కల హడావుడి.. ఆహూతులకు ఆహ్వానాలు.. కల్యాణ క్రతువుకు కావాల్సిన సామగ్రి అన్నీ వచ్చాయో లేదో.. ఏదైనా మరచిపోయామా అని పదేపదే లెక్కవేసుకుంటున్న పెళ్లిపెద్దలు.. ఇవన్నీ కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.. అసలైనవారేరీ.. ఇంకా రారే.. ఆ కళ్లు వెదుకుతున్నవి వారి కోసమే. అదే.. వారేనండీ.. దేవదేవుడు.. దేవేరీ.. యుగయుగాలుగా ఎన్నో కల్యాణ వైభోగాలు చూస్తున్నా ఎప్పటికప్పుడే కొత్త. చాలదా ఈ జన్మకి ఆ భాగ్యమని ఎదురు చూపు. ఆ భక్తకోటి కనులు భౌతికంగా ఇక్కడే ఉన్నా.. ఆ.. లోచనాలు వైకుంఠంలో వెతుకుతున్నాయి.. అమ్మతో కూడిన స్వామిని చూడాలని.. వారి కల్యాణాన్ని కనులారా చూడాలని.. అదిగదిగో రానే వచ్చారు. అమ్మవారిని వారు.. అయ్యవారిని వీరు వేదికపైకి తీసుకువచ్చారు. చాలు చాలు.. వివశులైపోయి చూస్తున్నారదిగో కల్యాణాన్ని.. నేడు రథోత్సవం అంతర్వేదిలో కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నూతన దంపతులుగా స్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శన మివ్వనున్నారు. రథయాత్రలో ఆనవాయితీగా అర్చకులు సోదరి గుర్రాలక్క అమ్మవారికి చీర, సారెలను స్వామి తరఫున సమర్పించారు.