breaking news
East Godavari
-
రైతుకు ఇచ్చిన భరోసా ఏమిటి?
·˘ ^èl…{§ýl»êº$ ç³Æý‡År¯]l™ø ప్రజాధనం దుర్వినియోగమే.. ·˘ Ð]l*i çßZ… Ð]l$…{† ™é¯ólsìæ Ð]l°™èl ÑÐ]l$Æý‡Ø దేవరపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లజర్ల పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్ప, రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. యర్నగూడెంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. ఫ మోంథా తుపాను బాధిత రైతులను కనీసం పట్టించుకోలేదు. దెబ్బ తిన్న పంటలకు పరిహారం ఎప్పుడిస్తారో చెప్పాలి. తుపాను బాధిత రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఆదుకోవాలి. ఫ వరికి కనీస మద్దతు ధర ఇస్తామనే హామీయే లేదు. కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వరి సాగుతో దేశానికే అన్నపూర్ణగా నిలిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటగా వరికి బదులు ఉద్యాన సాగు చేసుకోవాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఏడెనిమిది నెలల్లో చేతికొచ్చే ఉద్యాన పంటలు ఎక్కడున్నాయో చెప్పాలి. ఆయిల్పామ్, కోకో, కొబ్బరి వంటి పంటలు సాగు చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. ఉద్యాన పంటలు వేసిన పొలాలు వరి సాగుకు పనికొస్తాయా? మెట్ట ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలపై చంద్రబాబుకు కనీస అవగాహన లేదనే విషయం దీనిని బట్టి తెలుస్తోంది. ఫ యూరియా కొరతపై ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తే యూరియా వాడి పండించిన వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరి చిరుధాన్యాల పంటల సాగుకు ప్రభుత్వం కల్పించిన భరోసా ఏముంది? ఫ గోదావరి జలాలను వంశధారకు అనుసంధానం చేయడం వల్ల గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం లేదు. ఫ రైతు సమావేశంలో రైతులకు కనీసం యంత్రాలు, ఇన్పుట్ సబ్సిడీలు అందించకుండా సీఎం మొక్కుబడిగా పర్యటించారు. ఫ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్ర కాలువ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువల అభివృద్ధి, ఏటా వేలాది ఎకరాలను ముంచెత్తుతున్న కొవ్వాడ కాలువల గురించి చంద్రబాబు ఒక్క మాట కూడా చెప్పకపోవడం బాధాకరం. ఫ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధేమీ లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గత సంక్రాంతికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు హామీ అమలు కాలేదు. మళ్లీ వచ్చే సంక్రాంతి నాటికి మరమ్మతులు చేస్తానని నల్లజర్ల సమావేశంలో ప్రకటించి ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు. 16 నెలల్లో జరగని రోడ్ల మ రమ్మతులు 50 రోజుల్లో ఎలా పూర్తవుతాయి? ఫ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టన్ను ఆయిల్పామ్ గెలల ధర రూ.23 వేలు పలకగా, ప్రస్తుతం రూ.19,600 ఉంది. కౌలు రైతులకు ఈ ధర గిట్టుబాటు కావడం లేదు. ఫ ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టి రైతులపై భారం మోపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి విపత్తులు సంభవించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించింది. -
నిలదీస్తారని భయం.. తూతూమంత్రం
సాక్షి, రాజమహేంద్రవరం: చేతికంది వస్తున్న పంట నోటికందుతుందనుకుంటుని ఆశ పడుతున్న తరుణంలో.. అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను బీభత్సం.. తీవ్ర పంట నష్టాలు.. తడిసిన ధాన్యం.. కొనుగోళ్లకు సవాలక్ష నిబంధనలు.. గత్యంతరం లేక దళారులకే అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్న దుస్థితి.. తాజాగా దిత్వా తుపాను.. నయాపైసా కూడా అందని పరిహారం.. ఉచిత పంటల బీమా ఎత్తివేత.. ఇతర పంటలకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్న తరుణంలో.. ‘రైతన్నా మీకోసం’ పేరిట సర్కారు వారు చేపట్టిన కార్యక్రమం జిల్లాలో తూతూమంత్రంగా ముగిసిపోయింది. సమస్యలపై రైతులు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మొక్కుబడిగానే పాల్గొన్నారు. దీంతో, వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సీఎం సందేశ పత్రాలు రైతులకు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైంది. రైతుల సమస్యలు విన్న, పరిష్కరించిన దాఖలాలు లేకుండా పోయింది. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు, రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) పరిధిలో గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని, పరిష్కార మార్గాలు చూపాలి. అయితే ‘అనుకున్నదొకటి.. అయినది ఒక్కటి’ అన్న చందంగా ఈ కార్యక్రమం మారింది. రైతుల ఇళ్ల వద్దకు ప్రజాప్రతినిధులు వెళ్లకుండానే ముగిసిపోయింది. అధికారులు కూడా అక్కడక్కడ రైతుల ఇళ్లకు మొక్కుబడిగా వెళ్లి, సీఎం సందేశ పత్రాలు పంపిణీ చేయడం, కాసేపు అక్కడే కూర్చొని నాలుగు మాటలు చెప్పడం.. వెనుదిరగడంతో సరిపెట్టారు. కేవలం ప్రచారార్భాటం తప్ప.. ఈ కార్యక్రమంతో తమకు ఒరిగిందేమీ లేదని రైతులు విమర్శిస్తున్నారు. అందుకే ముఖం చాటేశారు అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాను విధ్వంసంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిని ఆదుకోవాల్సి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరోవైపు హామీ ఇచ్చిన మేరకు అన్నదాత సుఖీభవ నిధులు ఇవ్వలేదు. నిబంధనల పేరుతో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా చేయకపోవడం.. ఈ–క్రాప్ సక్రమంగా చేయకపోవడం వంటి చర్యలతో చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో తమను రైతులు నిలదీస్తారనే భయంతో అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమానికి ముఖం చాటేశారు. కేవలం తమకు అనుకూలమని భావించిన రైతుల వద్దకు వెళ్లి, వారికి ఏదో చేసేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి దుకాణం సర్దేశారు. చంద్రబాబు సర్కారుపై డబ్బా కొట్టడానికే పరిమితమయ్యారు. కొన్నిచోట్ల తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు రైతులు తమ కష్టాలు చెప్పుకోగా.. వారు చూద్దాం అని దాటవేత ధోరణి అవలంబించారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలతో ఎవ్వరూ ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పరిహారం అందక.. జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ మేరకు అధికారులు నివేదిక పంపించి నెల దాటుతున్నా.. నేటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. దీనిపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారి వద్దకు వెళ్తే ఎక్కడ నిలదీస్తారోననే ఆందోళనతో ప్రజాప్రతినిధులు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెనుకడుగు వేశారు. ‘అన్నదాత సుఖీభవ’లోనూ మోసం అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఏడాదిన్నర కాలంలో కేంద్రంతో కలిపి ఇప్పటి వరకూ ఇచ్చింది. రూ.14 వేలు మాత్రమే. అది కూడా చాలా మంది రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు ఎగ్గొట్టారు. దీనిపై రైతులు నిలదీస్తారనే భయంతో కూడా కూటమి నేతలు ఈ కార్యక్రమానికి ముఖం చాటేశారు. నేతలు పాల్గొన్నారిలా.. ఫ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకటి రెండు రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తరువాత మిన్నకుండిపోయారు. పొలం ఎక్కడుంటే అక్కడే ఎరువులు ఇస్తామంటున్నారని.. పొలం ఎక్కడున్నా.. తాము నివసిస్తున్న ప్రాంతంలోనే ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా రైతులు విన్నవించారు. ఫ అనపర్తి నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తమకు అనుకూలమైన, టీడీపీ, జనసేన సానుభూతిపరులున్న పాలమూరు గ్రామంలో రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో నేతలెవరూ రాకపోవడంతో ఈ కార్యక్రమం తూతూమంత్రంగా సాగింది. ఫ గోపాలపురం, కొవ్వూరు, రాజానగరం నియోజకవర్గాల్లో సైతం నేతలు నామ్ కే వాస్తే అన్న చందంగా పాల్గొని, మిన్నకుండిపోయారు. ·˘ hÌêÏ ÐéÅç³¢…V> పుట్టెడు కష్టాల్లో కర్షకులు ·˘ {ç³Õ²Ýë¢Æý‡¯ól B…§øâýæ¯]l™ø OÆð‡™èl$ÌS ఇళ్లకు వెళ్లని కూటమి నేతలు ·˘ A¯]l$MýS*ÌS…V> E…yól ÐéÇMóS MýSÆý‡ç³{™éË$ ç³…_ Ñ$¯]l²MýS$¯]l² OÐðl¯]l… ·˘ Ððl¬MýS$PºyìlV> "OÆð‡™èl¯é² Ò$MøçÜ…' -
రోడ్డు ప్రమాదంలో యువజంట మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక నరేంద్రపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో యువజంట మృతి చెందింది. నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని నందరాడకు చెందిన జుత్తుక లీలాప్రసాద్ (22), సౌమ్య (20) ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడు నెలల పాప కూడా ఉంది. లాలాచెరువు సమీపంలోని బర్మా కాలనీలో నివాసం ఉంటున్న వారు ఆధార్ కార్డు అప్డేషన్ కోసం స్కూటీపై రాజానగరం వెళ్లి, తిరుగు ప్రయాణంలో నందరాడ వెళ్లేందుకు నరేంద్రపురం జంక్షన్ దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న లారీ పై జంక్షన్లో వేరొక స్కూటీని ఢీకొంది. దీంతో కంగారుపడిన లారీ డ్రైవర్ స్టీరింగ్ను ఎడమ వైపు (నరేంద్రపురం వైపు) తిప్పడంతో అప్పుడే జంక్షన్ దాటుతున్న ఈ యువజంట స్కూటీని ఢీకొని, వారి పైనుంచి దూసుకుపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముందుగా ఢీ కొన్న స్కూటీపై ప్రయాణిస్తున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన నానమ్మ బొడ్డు వెంకటలక్ష్మి, మనవరాలు సూర్యకుమారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చంటి పాపను అనాథను చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆనందగా జీవిస్తున్న లీలాప్రసాద్, సౌమ్యలను మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించి వేసింది. వారి అన్యోన్యతకు ప్రతిరూపంగా పుట్టిన మూడు నెలల పాపను అనాథగా మిగిల్చింది అంటూ ఆ యువజంట బంధువులు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కదిలించి వేసింది. పాపను ఇంటి వద్దనే వదిలేసి, ఆధార్ అప్డేషన్ కోసం రాజానగరం వచ్చి, ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి లీలాప్రసాద్, సౌమ్య బంధువులు పరుగున వచ్చి, రక్తంతో మాంసం ముద్దగా మారిపోయిన ఆ మృతదేహాలను చూసి, గుండెలవిసేలా రోదించారు. నానమ్మ, మనవరాలికి తీవ్ర గాయాలు -
కోటసత్తెమ్మ తిరునాళ్లు వైభవంగా ప్రారంభం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో తిరునాళ్లు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు ఉదయం కలశ స్థాపన చేసి, ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, మహాన్యాసం, ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాలింగార్చన, సూర్య నమస్కారాలు, నిర్వహించారు. ఉదయం చండీ పారాయణ, సాయంత్రం హోమం చేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అమ్మవారికి ప్రధానార్చకుడు అప్పారావుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మెగా పీటీఎం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,570 పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 93,399 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,44,355 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, ఎస్ఎంసీ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. -
షో చేసి వెళ్లారు
అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంతో ఎలాంటి మేలూ జరగలేదు. వాళ్ల వద్దకు వస్తే ఎక్కడ నిలదీస్తారోనని ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. తమకు అనుకూలమైన రైతుల వద్దకు వచ్చి షో చేసి వెళ్లిపోయారు. గ్రామ శివారులో ఎవరికీ తెలియకుండా ఇద్దరు రైతులను కలిసి సీఎం సందేశ పత్రాలు ఇచ్చి వెళ్లిపోయారు. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఈ–క్రాప్ సక్రమంగా చేయలేదు. ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. – పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్యం తాగిస్తే రోగాలు రావా? ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో గిట్టుబాటు ధర కోసం 1994లో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఇద్దరు రైతులను పోలీసులు కాల్చి చంపారు. ఆ అప్రతిష్టను చంద్రబాబు మూటగట్టుకున్నారు. వరి పండిస్తే షుగర్, క్యాన్సర్ వస్తాయని ఆయనంటున్నారు. కానీ, ఇంటింటికీ మద్యం అందిస్తున్నారు. అది తాగితే క్యాన్సర్, షుగర్ రావా? రాగులు పండించాలని ఉచిత సలహా ఇస్తున్నారు. పుష్కలంగా నీరున్న ప్రాంతంలో వరి పండించి, ప్రజలకు మేలు చేయాలని చూస్తూంటే.. వద్దని చెప్పడం తగదు. రైతన్నా మీకోసం పేరుతో ఎలాంటి సభలూ పెట్టలేదు. – బూరుగుపల్లి సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
5,003 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
జగ్గంపేట: మండలంలోని ఇర్రిపాక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోరింట గ్రామానికి చెందిన కోరుకొండ అచ్యుతరావు ఏపీ 39 యూవై 5549 అనే వాహనంలో రేషన్ బియ్యాన్ని ఇర్రిపాక మీదుగా జగ్గంపేట పరిసరాల్లోని చేపల చెరువులకు తీసుకువెళుతున్నాడు. ఇర్రిపాక గ్రామంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అధికారులు ఆ వ్యాన్లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ బియ్యాన్ని జగ్గంపేట ఎంఎస్ఓ పాయింట్ వద్ద కాటా వేయగా వంద బస్తాల్లో 5,003 కేజీల ఉన్నట్టు నిర్ధారించారు. అవి మన్యం తేజ అనే వ్యక్తికి చెందిన బియ్యమని వ్యాన్ డ్రైవర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అచ్యుతరావు, మన్యం తేజ, వ్యాన్ యజమాని గనిశెట్టి రాజులపై కేసులు నమోదు చేశారు. వ్యాన్, బియ్యం విలువ రూ.9 లక్షల వరకూ ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ టి.గోపాలకృష్ణ, జగ్గంపేట ఎంఎస్ఓ జీఎం కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు పుల్లా సాయి అమృత, పుల్లా సాయి దీపక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు వివరాలను కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శివపురానికి చెందిన విద్యారంభ గురుకుల్ నిర్వాహకులు శ్రీమంజునాథ పూజార్ వెల్లడించారు. తాము నిర్వహించిన ఆన్లైన్ శిక్షణలో కళ్లకు గంతలతో వివిధ పనులు చేయడంలో వీరు శిక్షణ పొందారన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని పుల్లా సాయిదీపక్ జంగా బ్లాక్స్తో టాలెస్ట్ టవర్ రూపొందించాడన్నారు. సాయి అమృత స్మాల్ కళ్లకు గంతలతోనే 5.10 అడుగుల పేపర్ కప్పుల పిరమిడ్ రూపొందించిందన్నారు. ఈ కేటగిరీలో వీరిదే అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఇంటర్నేషనల్ బుక్ఆఫ్ రికార్డ్స్లో వీరి పేర్లు నమోదు చేశారన్నారు. ఈ మేరకు సంబంధిత సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్లను, పతకాలను సాయి దీపక్, సాయిఅమృతలకు శ్రీమంజునాథ పూజార్ అందజేశారు. స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దురాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన చికిత్స అందుబాటులో ఉందని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ వ్యాధి సుత్సుగాముషి అనే కీటకం కుడితే సోకుతుందని, కుట్టిన ప్రదేశంలో ఎర్రటి మచ్చ కనిపిస్తుందన్నారు. పొలాలు, తోటలు, గుబురు చెట్లు ఉన్న ప్రదేశాలకు వెళ్లే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. పొడవు చేతులు గల షర్టులు, ప్యాంట్లు వేసుకోవడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా కీటకం కుడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించారు. జ్వరం, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలన్నారు. వెండి పుష్పమాల సమర్పణరాజోలు: కడలి గ్రామంలో కొలువైన చెన్నకేశవస్వామికి ఆ గ్రామానికి చెందిన కాశీభట్ల లక్ష్మీకన్యాకుమారి రూ.38 వేలు విలువ చేసే 200 గ్రాముల వెండి పుష్పమాలను బుధవారం సమర్పించారు. దీన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.నాగవిష్ణుకు అందజేశారు. కడలి గ్రామానికి చెందిన కాశీభట్ల రామశాస్త్రి సతీమణి లక్ష్మీ కన్యాకుమారి ఆ గ్రామ బ్రాహ్మణ ఆడపడుచుల తరఫున వెండి పుష్పమాల సమర్పించారని ఈఓ తెలిపారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్ శంఖవరం: ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నెల్లిపూడికి చెందిన సైపిరెడ్డి సత్తిబాబుకు చెందిన ట్రాక్టర్ జి.కొత్తపల్లి నుంచి నెల్లిపూడి కర్రల లోడు తీసుకువస్తోంది. ఆ సమయంలో శంఖవరం నుంచి జి.కొత్తపల్లి వస్తున్న ఆటోను అర్జున్ బొమ్మ సమీపంలో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అచ్చంపేటకు చెందిన బొట్టా నాగయమ్మ, బొట్టా భవానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రశ్నలు వేసి.. సామర్థ్యం పరీక్షించి..
రాయవరం: దేశ భవిష్యత్తు తరగతి నాలుగు గోడల మధ్య తీర్చిదిద్దబడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును పాఠశాల విద్య నిర్ణయిస్తుంది. పాఠశాలలో తరగతి వారీగా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ సర్వే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో చురుగ్గా సాగుతోంది. పాఠశాల విద్యలో పునాది అభ్యసనం మెరుగు పర్చేందుకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్)ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు గత నెల 24 నుంచి సర్వే చేపట్టారు. దీని ఫలితాల ఆధారంగా వంద రోజుల ప్రణాళికను అమలు చేయనున్నారు. 3,224 పాఠశాలల్లో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లోని 61 మండలాల పరిధిలో 263 స్కూల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటి పరిధిలో 3,224 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో 1,03,641 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతి వరకూ చదువుతున్నారు. విద్యార్థుల్లో అభ్యసనా ఫలితాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్) ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ సర్వే లక్ష్యం. చేస్తున్నారిలా.. ప్రధానంగా తెలుగు, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థతో పాటుగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రైౖవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సంబంధిత కాంప్లెక్స్ సీఆర్ఎంటీలు ఛాత్రోపాధ్యాయులకు సర్వేలో మార్గదర్శకత్వం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు ఈ సర్వేను మానిటరింగ్ చేస్తున్నారు. వేర్వేరు ప్రశ్నలు సర్వేలో భాగంగా విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అసెస్మెంట్ చేసే సమయంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ కాకుండా సర్వే చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి వేర్వేరు ప్రశ్నలు ఉంటున్నాయి. తెలుగులో చిత్రాలు, అక్షరాలు, పదాల గుర్తింపు, పేరాగ్రాఫ్ చదవడం వంటి ప్రశ్నల ఆధారంగా పరీక్షిస్తున్నారు. అలాగే గణితంలో చతుర్విద ప్రక్రియల మీద ప్రశ్నలు ఉంటున్నాయి. ఒకటి, రెండు తరగతులకు 35, అలాగే 3,4,5 తరగతులకు 42 ప్రశ్నల వంతున వేసి సమాధానాలను లీప్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సర్వే అనంతరం విద్యార్థుల అభ్యసనా ఫలితాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేసే అవకాశముంది. రాష్ట్రస్థాయిలో ఎస్సీఈఆర్టీ సర్వేను పర్యవేక్షిస్తోంది.సామర్థ్యాలు తెలుసుకునేందుకు.. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల లెర్నింగ్ అవుట్ కమ్స్ (అభ్యసనా సామర్థ్యాలు) తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నాం. దీని ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి యాక్షన్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది. – జి.నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టరు, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ సర్వే ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు అభ్యసనా సామర్థ్యం పరిశీలన వెనుకబడిన వారి గుర్తింపునకు చర్యలుజిల్లాల వారీగా వివరాలు జిల్లా స్కూల్ కాంప్లెక్స్లు పాఠశాలలు విద్యార్థులు కోనసీమ 87 1,377 30,881 తూర్పుగోదావరి 75 813 30,490 కాకినాడ 101 1,034 42,270 -
ఆటపాట్లు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా.. నిధుల విడుదల విషయంలో వెనుకాడుతోంది. ముఖ్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. అండర్ 14, 17, 19 తదితర అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. క్రీడాకారుల ఇబ్బందులు ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయించినా, దాని నుంచి నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ, అలాగే వివిధ రాష్ట్ర, జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపేందుకు నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ – 19 విభాగంలో క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపించడానికి రవాణా ఖర్చులుగా రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారు. వీటితోనే వారికి క్రీడా దుస్తులు, రవాణా ఖర్చులు అందించాలి. అండర్ – 19లో దాదాపు 100 జట్లను బాలురు, బాలికల విభాగంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం అండర్–19 కార్యదర్శి మారడంతో పాత అకౌంట్లోనే ప్రభుత్వం కేటాయించిన డబ్బులు జమ అయ్యింది. ప్రస్తుతం క్రీడాకారులు తమ సొంత ఖర్చుతోనే పోటీలకు హాజరవుతున్నారు. సొంత ఖర్చులతో.. ఈ ఏడాది జిల్లాలో అండర్ – 19 విభాగంలో జిమ్నాస్టిక్స్, రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. వీటితో పాటు దాదాపు 48 క్రీడాంశాల్లో బాలురు, బాలికల జట్లను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న క్రీడాకారులు ఎక్కువ మంది ఈ విభాగంలో ఎంపికయ్యారు. వారందరూ సొంత ఖర్చులతో పోటీలకు హాజరయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ కళాశాలల నుంచి ఎంపికై న క్రీడాకారులకు కళాశాల స్పెషల్ ఫీజు నుంచి రవాణా ఖర్చులు అందించాలని ఆదేశాలు ఉన్నా.. చాలా కళాశాలల్లో నిధులు అందించడం లేదనే వాదన వినిపిస్తోంది. అండర్ 14, 17 విభాగాల్లో... ఈ ఏడాది అండర్ 14, 17 విభాగాల్లో జిల్లాలో స్వ్కాష్, జుడో, జిమ్నాస్టిక్స్, ఖోఖో, రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ జిల్లాకు రూ.8 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా చెల్లించారు. వీటిని సుమారు 200 (అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలు) మంది క్రీడాకారులను (జిల్లా జట్లు) రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు, క్రీడా దుస్తులు, బూట్లు, ట్రాక్ షూట్ అందించేందుకు వినియోగించారు. ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు అరకొర నిధులు నిర్వాహకుల అవస్థలు సొంత ఖర్చులతో క్రీడాకారుల పయనం దాతల సాయంతో భోజనాలు చంద్రబాబు పాలనలో క్రీడలకు దుస్థితిటికెట్లు చూపిస్తే డబ్బులు ఇస్తాం ఈ ఏడాది అండర్ 19 క్రీడాకారుల ఎంపికలను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఎంపికై న క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల కోసం రూ.8 లక్షలు కేటాయించారు. కానీ అవి పాత అకౌంట్లో ఉండిపోవడంతో క్రీడాకారులు సొంత ఖర్చులతో పోటీలకు హాజరవుతున్నారు. వారు తమ ప్రయాణ టిక్కెట్లను తీసుకువచ్చి చూపిస్తే, వారికి డబ్బులు చెల్లిస్తాం. – వెంకటరెడ్డి, అండర్–19 కార్యదర్శి నిధులు కేటాయిస్తే మంచిది వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర శాఖ నిధులు కేటాయించాలి. దాని వల్ల నిర్వాహకులకు భారం లేకుండా ఉంటుంది. కనీసం టోర్నమెంట్కు అయ్యే ఖర్చులో 50 శాతం నిధులు అయినా ముందుగా చెల్లిస్తే మంచిది. – శ్రీనివాస్, ఎస్జీఎఫ్ఐ అండర్ 14, 17 కార్యదర్శి, కాకినాడ జిల్లా -
దాతలే ఆధారం
రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు నిధులు కేటాయించక పోవడంతో పోటీల నిర్వహణకు దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు దాదాపు రూ1.50 లక్షల నుంచి రూ.4 లక్షలు వరకూ ఖర్చవుతుంది. క్రీడాకారులకు అందించే పతకాలు, ట్రోఫీలను కూడా నిర్వాహకులే తమ సొంత ఖర్చులతో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక భోజనాలను దాతల సహకారంతో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్టెట్ ఉన్నా జిల్లాల వారీగా అరకొర నిధుల కేటాయింపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.9.96 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 45 రోజులకు గాను ఆలయంలో ప్రధాన హుండీ ద్వారా రూ.9,87,354, అన్నదాన హుండీ ద్వారా రూ.8,849 వెరసి రూ.9,96,203 సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటు 5 విదేశీ రియాన్స్ వచ్చాయన్నారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ హుండీలకు హారతి ఇచ్చి లెక్కింపును ప్రారంభించారు. -
ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే
● విద్యార్థులకు మంచి అవకాశం ● ఈ నెల 7న ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష ● సిద్ధమవుతున్న విద్యార్థులు ● ఉమ్మడి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు రాయవరం: ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు అందిస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరుతో ఏటా ప్రతిభ చూపిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు (తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ పూర్తయ్యే వరకు) ఆర్థిక సాయం చేస్తోంది. దీని ద్వారా నెలకు రూ.1,000 వంతున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ఇస్తోంది. ఈ ఏడాది కూడా ఉపకార వేతనాలకు అర్హత పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సమీపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 10,557 మంది ఏటా నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 10,557 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ఇలా.. ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలో 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7వ తరగతి, ఎనిమిదో తరగతి గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం ఇస్తారు. మొదటి పేపరు మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ నాన్ వెర్బల్) పేపరు 90 మార్కులకు ఉంటుంది. నంబర్ సిరీస్ 10, సింపుల్ అర్థమెటిక్ 10, మిస్సింగ్ క్యారెక్టర్లు 10, వర్డ్ ఎనాలజీ 10, లెటర్ సిరీస్ 10 మార్కులు ఉంటాయి. నాన్ వెర్బల్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపరు రెండో పేపరు కూడా 90 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 20 మార్కులు, సైన్స్లో పీఎస్కు 10, కెమిస్ట్రీ 10, బయాలజీ 10, సోషల్ సబ్జెక్టులో భూగోళం 10, చరిత్ర 10, పౌరశాస్త్రం 10, అర్థశాస్త్రం నుంచి 10 మార్కులుంటాయి. ఏడవ తరగతి పూర్తిగా, 8వ తరగతిలో నవంబర్ వరకూ పూర్తయిన సిలబస్ వరకు చదవాలి. కొన్ని జనరలైజ్డ్ బిట్లు, సబ్జెక్టు మీద, అదనపు సమాచారం, కరెంట్ ఎఫైర్స్పై కూడా తగిన జ్ఞానం కలిగి ఉండాలి. బబ్లింగ్ విధానంలో.. విద్యార్థులు 180 నిమిషాల్లో 180 బిట్లకు సమాధానం రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేగంగా సమాధానాలు రాసి, అక్కడ మిగిలిన సమయాన్ని పేపర్–2లో గణితానికి వినియోగించుకుంటే విజయం సాధించడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్న పత్రంలో 60 మార్కులకు సులభంగా, 60 మార్కులకు మధ్యస్థంగా, 60 మార్కులకు కఠినంగా ఇచ్చే అవకాశముంది. కనీసం 130 మార్కులు దాటిన వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీటుపై బబ్లింగ్ విధానంలో సమాధానాలు రాయాలి. పరీక్షా కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు విద్యార్థులు కోనసీమ 15 3,106 కాకినాడ 20 4,578 తూర్పుగోదావరి 13 2,873 మొత్తం 48 10,557 ఆదేశాలు జారీ చేశాం ఎన్ఎంఎంఎస్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
వ్యాస భారతం ధర్మాల పుట్ట
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వేదవ్యాస భారతం ధర్మాల పుట్ట, ఏ శ్లోకాన్ని తాకినా అనేక ధర్మ రహస్యాలు వెల్లడి అవుతాయని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస మహాభారతం ప్రవచనంలో ఏడో రోజైన బుధవారం ఆయన శాకుంతలం ఇతివృత్తాన్ని వివరించారు. వేట తమకంతో కణ్వుని ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడు శకుంతల పట్ల ఆకర్షితుడు అవుతాడు. విప్ర సీ్త్రల పట్ల నా మనస్సు చలించదు, నీవు ఎవరివి అని శకుంతలను అడుగుతాడు. ఆమె తాను విశ్వామిత్రుని కుమార్తెనని, కణ్వుడు తనను పెంచిన తండ్రి అని వివరిస్తుంది. వారు గాంధర్వ వివాహం చేసుకుంటారని సామవేదం అన్నారు. తనకు పుట్టిన కుమారుని తీసుకుని దుష్యంతుని వద్దకు వెళ్ళిన శకుంతల ఆయన తిరస్కారానికి గురి అవుతుంది. నీవు ఎవరో నాకు తెలియదని అన్న దుష్యంతునితో శకుంతల అన్న మాటలను విద్యార్థి లోకానికి తెలియపరచాలని సామవేదం అన్నారు. ‘నీ హృదయంలో ఉన్న అంతరాత్మకు నిజం తెలుసు. ఏకాంతంలో జరిగినది ఎవరికీ తెలియదని అనుకోవద్దు, సూర్య చంద్రులు, అగ్ని, వాయువు, అంతరిక్షం, భూమి, ఉభయ సంధ్యలు, అంతరాత్మ సాక్షులు, వారి కన్ను కప్పలేవు‘ అని శకుంతల దుష్యంతునితో చెబుతుంది. దుర్వాస మహర్షి శాపంతో దుష్యంతుడు శకుంతలను మరచిపోయాడని వ్యాస భారతంలో లేదు, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఇటువంటి కథనం కనపడుతుంది. ఈ కథనానికి పద్మ పురాణం ఆధారమని సామవేదం అన్నారు. భారతంలో స్త్రీ పాత్రలు ఉదాత్తమైనవని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): 2025 – 26 విద్యా సంవత్సరంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను జిల్లాలోని 11 మండలాల్లో నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో 25 పోస్టులను భర్తీ చేస్తామని, డిసెంబర్ 8 నుంచి మే 7వ తేదీ వరకు వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనపర్తి, బిక్కవోలు, పెరవలి, రాజమహేంద్రవరం (అర్బన్), రాజమహేంద్రవరం (రూరల్), ఉండ్రాజవరం, కొవ్వూరు, నిడదవోలు, సీతానగరం, రాజానగరం, కడియం మండలాల్లో ఈ పోస్టుల నియామకాలుంటాయన్నారు. అర్హత గల అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తులను ఈ నెల 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలన్నారు. పనిచేసిన సర్వర్లు పెరవలి: మండలంలో వరికోతలు 85 శాతం పూర్తయ్యాయని, 11,061 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని వ్యవసాయాధికారి మేరీ కిరణ్ తెలిపారు. బుధవారం సాక్షి దినపత్రిలో ‘మోరాయించిన సర్వర్లు –వర్షార్పణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అఽధికారులు స్పందించారు. ఈ నెల రెండో తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్లు సాంకేతిక కారణాల వలన పని చేయలేదని, తరువాత సాంకేతిక సమస్య తొలగిందన్నారు. పెరవలిలో రైతు భరోసా కేంద్రానికి రైతులందరూ ఒక్కసారే రావడంతో కొద్ది సేపు ఆలస్యమైందని, తర్వాత ఆన్లైన్ చేసి ధాన్యాన్ని తరలించామని తెలిపారు. వర్షాల వలన ఽబరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఈరోజు ఆరబెట్టించి రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు పంపించమని తెలిపారు. అలాగే రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల వద్ద ఆన్లైన్ చేసి మిల్లులకు తరలిస్తామని వివరణ ఇచ్చారు. 6న జాబ్ మేళా అమలాపురం రూరల్: అమలాపురంలోని ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని కోరారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే
పెరవలి: అన్నదాతకు ఖరీఫ్ సాగు కలసి రాలేదు సరికదా ప్రకృతి పగబట్టినట్లు వర్షాలు, తుపానులు దండెత్తడంతో పంట దక్కేలా కనిపించటం లేదు. ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష ధోరణి కనబరచడంతో వారి పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. అన్నింటిని తట్టుకుని ధాన్యం అమ్మే సమయంలో సర్వర్లు పనిచేయక ధాన్యం రాశుల్లో, బస్తాల్లో, చేలగట్ల మీద, అరుగులపై నిల్వ చేసుకుంటున్నారు. శనివారం నుంచి సర్వర్లు పనిచేయకపోవటంతో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. రైతులు మాత్రం ఒకవైపు వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదుకోవలసిన ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయటంతో రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం మొలక వస్తుండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 17 శాతం తేమ శాతం ఉంటేనే ధాన్యం కొంటామని చెప్పటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆరుదల ధాన్యం పట్టుకెళ్లినా సర్వర్లు పనిచేయకపోవటం వల్ల ధాన్యాన్ని రైతుల వద్దే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడింది. 39,966 హెక్టార్లలో పూర్తికాని కోతలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా చేపట్టడంతో ఈ నెల 30 వరకు 40 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తి కాగా మిగిలిన 39,966 హెక్టార్లలో కోతలు జరగవలసి ఉంది. జిల్లాలోని 18 మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పనిచేయని సర్వర్లు జిల్లాలో ధాన్యం కొనుగోలు ఈ నెల 29 వరకు బాగానే జరిగినా ఆ తరువాత నుంచి సర్వర్లు పనిచేయక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 205 ఏర్పాటు చేసినా సర్వర్లు పనిచేయక ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్నా రైతులు మాత్రం ధాన్యం మాసూళ్లు ఆపలేదు. ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు వరికోత యంత్రాలతో కోతలు కోయించి ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకువచ్చి ధాన్యం తడిసిపోకుండా బరకాలతో కప్పి రాశులుగా చేశారు. నాలుగురోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సర్వర్ల గురించి అధికారులు పట్టించుకోవడంలేదు. దీనితో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లాలో ధాన్యం నిల్వలు ఎన్ని జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేసి, అందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు జిల్లాలో 28,180 మంది రైతుల నుంచి 2,10,210.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగోలు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో ఇంకా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించవలసి ఉంది. ఇప్పటి వరకు కోతలు 60 శాతం పూర్తయ్యాయి. నాలుగు రోజులుగా జిల్లాలో వరి కోతలు జరిగి రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం సుమారు లక్ష మెట్రిక్ టన్నులని అంచనా. వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు రావటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. తగ్గుతున్న దిగుబడులు జిల్లాలో మోంథా తుపాన్కు ముందు జరిగిన మాసూళ్లలో దిగుబడి 30 నుంచి 35 బస్తాలు వస్తే ఇప్పుడు దిత్వా తుపాను వల్ల పండిన పంట తడిసి ఈదురు గాలులకు చేలు పడిపోయి ధాన్యం రాలిపోవటంతో దిగుబడి 18 నుంచి 22 బస్తాలు మాత్రమే వస్తోంది. ఖండవల్లి కొనుగోలు కేంద్రంలో సర్వర్ పనిచేయక ఎదురు తెన్నులు నల్లాకులవారిపాలెంలో మొలక వచ్చిన ధాన్యం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. 2023లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తుపాను సమయంలో రైతులకు ముందస్తుగా హెచ్చరికలు చేయటంతో పాటు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి చేలల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. తడిసిన ధాన్యం సేకరించాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు ఆఫ్లైన్లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఇప్పడు అటువంటి హెచ్చరికలు లేవు. అధికారులు పత్తాలేకుండా పోయారని, సంచులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరాయించిన సర్వర్లు పట్టించుకోని అధికారులు నిలిచిపోయిన కొనుగోళ్లు తడిసి ముద్దయి మొలక వస్తున్న వైనం గగ్గోలు పెడుతున్న రైతన్నలు జిల్లాలో వరి సాగు 79,966 హెక్టార్లు కోతలు పూర్తి అయింది 60 శాతం ధాన్యం కొనుగోలు అంచనాలు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికి 2.10 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు ఽతుపాను వలన ఽచేను ఎక్కడ పడిపోతుందోనని భయపడి రాత్రి సమయంలో వరికోత యంత్రంతో కోతలు కోయించి ధాన్యం పట్టుకొచ్చి గట్టుపై వేశాను. అంతే వర్షం వచ్చింది. కొనుగోలు కేంద్రానికి వెళితే ధాన్యం తడసింది, ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు. –బండెల సాయిరామ్, కౌలు రైతు, ఖండవల్లి ఏం చేయాలో అర్థం కావడం లేదు చేతికి వచ్చిన పంట నోటికి దక్కుతుందో లేదో తెలియటం లేదు. కష్టపడి కోతలు కోయించాను. ఆరబెట్టాను. తీరా కొనుగోలు కేంద్రానికి పట్టుకెళ్లితే సర్వర్లు పనిచేయటం లేదు, రేపు పట్టుకు రమ్మని చెప్పారు. వర్షం వచ్చి ధాన్యం తడిసి మొలక వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. –కె.రాఘవులు, కౌలు రైతు, ఖండవల్లి గత ప్రభుత్వంలో అధికారులు సహకరించారు రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? రైతులు నానా పాట్లు పడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడు. వర్షాల వల్ల ధాన్యం మొలక వచ్చాయి. ఎండ కాస్తే కానీ ధాన్యం ఆరదు. అధికారులు ఎవరూ కనిపించటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు పనిచేయటం లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే అఽధికారి లేరు. నాయకులు లేరు. గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు అధికారులు సహకరించారు. – పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం -
కోటసత్తెమ్మ తిరునాళ్లకు వేళాయె
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శక్తి స్వరూపిణి అయిన కోటసత్తెమ్మపై భక్తులకు అపారమైన భక్తి. అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఏటా ఇక్కడ దేవీ నవరాత్ర మహోత్సవాలతో పాటు డిసెంబర్ నెలలో అమ్మవారి ‘తిరునాళ్లు’ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ ఏడాది తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయ చరిత్ర ఇదీ.. తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అమ్మవారు ‘శంఖచక్రగధ అభయ హస్తయజ్ఞోప వీత ధారిణిగా ఏక శిలావిగ్రహంతో దర్శనమిస్తారు. ఈ ఆలయ క్షేత్రంలో గతంలో కోట ఉండేదని కాలక్రమంలో అది అంతరించిందని భక్తులు చెబుతారు. కోటసత్తెమ్మ విగ్రహం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల నాటిది. నాటి నిరవద్యపురాన్ని (నిడదవోలు)పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకుని కాలక్రమంలో కనుమరుగైన అమ్మవారి విగ్రహం 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. ఈ భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి ఒకరోజు వచ్చిన కలను అనుసరించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని భక్తుల పాలిట పుణ్యస్థలంగా పేరుగాంచింది. ఇవీ కార్యక్రమాలు కోటసత్తెమ్మ అమ్మవారి ‘తిరునాళ్లు గురువారం నుంచి 8 తేదీ వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలంకరణలు, భారీ సెట్టింగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. గురువారం ఉదయం ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, ఛైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభించి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేస్తారు. ప్రతి రోజు అమ్మవారికి సహస్ర నామ పూజలతో పాటు ఉదయం చండీపారాయణం, సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. 5న ఉదయం 10 గంటలకు గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, నిడదవోలు నాంగల్యదేవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి చీర–సారె సమర్పణ, 6న నిడదవోలు ఆర్యవైశ్య వర్తక సంఘం వారి చీర–సారె సమర్పణ, 7న అఖిల తెలుగుసేన మహిళా అధ్యక్షురాలు జి.ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి 101 మహిళలతో చీర–సారె, కలశాలు, బోనాలతో అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. 8న సోమవారం సాయంత్రం 6 గంటలకు విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయిమేళం, గరగ నృత్యాలు, నందన డాన్స్ ఆకాడమీ (తణుకు) వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన, కేరళ చందామేళం, కాళికా డాన్స్, మహిళల కోలాటం ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఈ ఏడాది కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే తిరునాళ్లు కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – వి.హరిసూర్యప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ, తిమ్మరాజుపాలెం. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మహోత్సవాలు విద్యుత్ కాంతులతో మెరుస్తున్న ఆలయ ప్రాంగణం -
వైఎస్సార్ సీపీ నేత కారుకు నిప్పు పెట్టిన యువకులు
రమేష్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న చెల్లుబోయిన నరేన్ పెట్రోలు పోసి నిప్పటించడంతో దగ్ధమైన రమేష్కు చెందిన కారు రాజమహేంద్రవరం రూరల్: వెంకటనగరం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత మోతా రమేష్కు చెందిన ఐ20 కారును మంగళవారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.20 గంటల మధ్య సమయంలో ఇద్దరు యువకులు పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ఇంటిముందు కారు పార్కింగ్ చేసి ఉండగా ఈ ఘటనకు పాల్పడ్డారు. వెంకటనగరంనకు చెందిన కొల్లపుధోనీ, గుమ్మడి చరణ్లపై అనుమానం ఉందని, పూర్తి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని మోతారమేష్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. త్రీ టౌన్ ఎస్సై అప్పలరాజు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఈ విషయం తెలియగానే తిరుపతి పర్యటనలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్లో ఎస్పీ డి.నరసింహకిశోర్కు ఫిర్యాదు చేశారు. వెంకటనగరం గ్రామంలో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కారు దగ్ధం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వేణుగోపాలకృష్ణ తన కుమారుడు నరేన్, పార్టీ నాయకులను వెంకటనగరం పంపించారు. మోతారమేష్ను చెల్లుబోయిన నరేన్ కలిసి ఘటనపై ఆరా తీశారు. అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నరేన్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఆచంట కళ్యాణ్, సుందరపల్లి అనిల్, చాపరాజా, అప్పానాని, ఓడూరి రాంకీ, కొల్లినాని, కల్లూరి చైతన్య, ఉండ్రాజవరపు సూర్య, నక్కాధనరాజ్, అల్లంపల్లి శ్రీను, పంతం ప్రసాద్, వెంకటనగరం వైఎస్సార్ సీపీనే తలు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని దుగ్గుదుర్రులో కౌలురైతు కొప్పుశెట్టి అన్నవరం (67) విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మూడు రోజులు క్రితం అదృశ్యమైన కౌలురైతు మంగళవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద శవమై కనిపించటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం గ్రామంలోని ఒక రైతుకు చెందిన మూడున్నర ఎకరాల పొలం కొన్నేళ్లుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఆదివారం పొలానికి వెళ్లిన అన్నవరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నవరం పొలానికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద తుప్పలలో నుంచి పొగలు రావటం స్థానిక రైతులు గమనించారు. మంగళవారం సాయంత్రం కొందరు రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అన్నవరం విద్యుత్ వైర్లకు చుట్టుకుని ఉన్నాడు. విద్యుత్ షాక్ వల్ల అతని శరీరం నుంచే పొగలు వస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి తుప్పలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం అన్నవరం పొలం పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా వర్షం కారణంగా ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగులుకుని షాక్కు గురై మృతిచెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం మోహన్కుమార్, ట్రాన్స్కో, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు అన్నవరం భార్య ఇటీవల మృతి చెందగా కుమార్తె వద్ద ఉంటున్నాడు. రామేశంపేటలో మరొకరు రంగంపేట: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శివప్రసాద్ తెలిపారు. రామేశంపేట గ్రామానికి చెందిన పిల్లల తాతబ్బాయి (51) మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న తన ఇంటి రెండో ఫ్లోర్ పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దామని పైకి వెళ్లాడు. అక్కడ పనులు పరిశీలిస్తుండా పిట్ట గోడ పక్క నుంచి వెళుతున్న కరెంటు వైర్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు పిల్లల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై వివరించారు. -
ఉద్యోగాల పేరిట టోపీ
● రూ.75 లక్షల వసూలు ● ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్కు చెందిన ఎనిమిది మంది అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్ పిఠాపురం: ఉద్యోగాల పేరుతో యువకులకు గాలం వేసి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి మోసగించిన కేసులో ట్రాంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెట్వర్క్కు చెందిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్డీపీవో (సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్) మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. పిఠాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. రాయుడుపాలేనికి చెందిన నాళం గంగాభవాని గత నెల 24వ తేదీన పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ‘ఉద్యోగ అవకాశాలు. నెలకు రూ.15,000 నుంచిరూ రూ.35,000 జీతం‘ అని ఉన్న పాంప్లెట్ చూసి, అందులోని నంబర్లకు కాల్ చేసింది. అటువైపు మాట్లాడిన వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజులు, ల్యాప్ట్యాప్ పేరుతో రూ.24,000 ఫోన్ పే ద్వారా పంపించమని చెప్పి పంపిన తరువాత మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటపల్లి సాయి, అతని స్నేహితులు మరో ముగ్గురు ఒక్కొక్కరు రూ.13 వేల చొప్పున ఇలాగే మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్, ఎస్సైలు వి.మణికుమార్, ఎస్కే జానీబా షాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించామన్నారు. ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రాజమహేంద్రవరంలో కార్యాలయం ఏర్పాటు చేసి, డేటాఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాల పేరుతో పాంప్లెట్లు ముద్రించి పిఠాపురం సహా పరిసర ప్రాంతాల్లో అతికించి, నిరుద్యోగుల నుంచి రూ.13,000 చొప్పున వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల పట్టివేత ఎవరినైనా కొత్త వ్యక్తులను కంపెనీలో జాయిన్ చేసినవారికి కంపెనీ రూ.900 ఇస్తుందని నమ్మించారు. జాయిన్ అయిన కొత్త వ్యక్తులతో బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసి ఫోన్ కాల్స్ ద్వారా ఇతర వ్యక్తులను మోసం చేసేవారు. అకౌంట్లో డబ్బు వేయించుకున్నాక, మొత్తం నగదును వారితో డ్రా చేయించి సొమ్ముని మేనేజర్ అయిన మంజునాథ్ తీసుకుని కంపెనీకి డిపాజిట్ చేస్తున్నట్లు నమ్మించేవారు. గత సంవత్సరం నుంచి సుమారు రూ.75 లక్షలు నిరుద్యోగ యువతీ యువకుల వద్ద నుంచి వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా ఈ మోసాలకు పాల్పడిన సత్యసాయి జిల్లా గుండువెల్ల గ్రామానికి చెందిన మేకల మంజునాథ్, కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా మల్లనాయకనపల్లికి చెందిన సిద్ధేశ్ శ్రీధర్, సిద్దేశ్ సుదీ, నంద్యాల జిల్లా హనుమంతుకుండకు చెందిన యశ్వంత్ కుమార్, అనంతపురం జిల్లా మార్తాడుకు చెందిన వడ్డి జయరాముడు, పార్వతీపురం జిల్లాకు చెందిన దేశం సౌజన్య, అనంతపురం జిల్లా మద్దన్నకుంటకు చెందిన నాగప్ప కావ్య, యానాంకి చెందిన రేపు మహాలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి ల్యాప్ట్యాప్, అకౌంట్ బుక్స్, ఏటీఎం కార్డులు, మొబైల్స్, సిమ్ కార్డ్స్, రూ.53,000 నగదు, 20 గ్రాముల బంగారం, టీ షర్ట్స్ ట్రాన్స్ ఇండియా కంపెనీ ప్రమోషన్ ఐటమ్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం పిఠాపురం జీఎఫ్ సీఎం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక వైఎస్సార్ స్కేటింగ్ రింక్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ఐ రోలర్ స్కేటింగ్ పోటీలు మంగళవారం ఉత్సాహంగా సాగాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో రింక్–1, రింక్–2, ఇన్లైన్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మంగళవారం నిర్వహించిన పోటీలను మహబూబ్ బాషా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. విజేతలకు మహబూబ్ బాషా, హరిష్, రవిచంద్ర బహుమతులు అందజేశారు. ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీను, సీనియర్ పీడీలు జార్జి, రవిరాజు, జాన్, కౌర్, పరశురామ్, సురేష్రాజు పాల్గొన్నారు. -
వైకల్యంపై గెలిచిన సంకల్పం
● విధిని ఎదిరించి నిలబడిన దివ్యాంగులు ● మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న వైనం ● ఆపన్న హస్తమందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ ● చంద్రబాబు పాలనలో పింఛన్ల వెరిఫికేషన్ పేరుతో వేధింపులు ● నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కపిలేశ్వరపురం: వైకల్యం భౌతికంగా మాత్రమే వెనుకబాటు. సంకల్ప బలం ఉంటే వైకల్యం తోక ముడుస్తుంది. ప్రతిభ కనబర్చడంలో దివ్యాంగులు ఏ మాత్రమూ తక్కువ కాదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దివ్యాంగుల ప్రగతి, ప్రతిభను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వారి పట్ల చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు విస్తుగొల్పుతున్నాయి. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కథనం... చంద్రబాబు పాలనలో సతమతం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దివ్యాంగులకు చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎడాపెడా వాగ్దానాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే దివ్యాంగ పింఛను లబ్ధిదారుల్లో అనర్హులున్నారంటూ సర్వే చేపట్టి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేశారు. వైకల్యంతో బాధపడుతున్న వారి రూ.15వేల పింఛన్లపై అక్కసు వెళ్లగక్కుతూ దివ్యాంగులను వేధిస్తున్నారనే విమర్శలున్నాయి. కొత్తగా అందజేసిన దరఖాస్తులు తిరస్కరణకు గురి చేశారంటూ దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో రాణిస్తూ.. ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ వీల్ చైర్ క్రికెట్ జట్టు ప్రతిభ కనబర్చింది. 15 జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన క్రీడాకారులున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్థాన్ అల్వార్లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ –2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్ విభాగంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. కంటి చూపులేకపోయినా... కాళ్లు కదలకపోయినా.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామానికి చెందిన 36 ఏళ్ల కసిరెడ్డి సత్తిబాబు పుట్టుకతో అంధుడు. తండ్రి జోగిరాజు వ్యవసాయ కూలి, అమ్మ నాగమణి గృహిణి. వారికి సత్తిబాబు పెద్ద కుమారుడు కాగా మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆరో తరగతి వరకూ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనూ, 7 నుంచి పది వరకూ మండపేటలోని అంధుల పాఠశాలలోనూ, గ్రాడ్యుయేషన్ను 2007–10 విద్యాసంవత్సరంలో తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోనూ చదివారు. ఉపాధ్యాయుడు అవ్వాలన్న తలంపుతో నెల్లూరు జిల్లా గూడూరులో బీఈడీ పూర్తి చేశారు. 2014లో డీఎస్సీ రాసినా విజయం వరించలేదు. అదే ఏడాది రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. సత్తిబాబు మాత్రం మనోధైర్యంతో ముందుకు సాగుతూ 2018లో మరోసారి ప్రయత్నించారు. రెట్టించిన ధైర్యంతో 2025 డీఎస్సీలో విజయం సాధించారు. ప్రస్తుతం కాకినాడలోని ఆనంద భారతి మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. పాఠశాలలో వీల్ చైర్పై కూర్చుని విద్యార్థులకు బోధిస్తున్నారు. పాఠ్యాంశాలను తన బ్రెయిలీ లిపిలో చదువుకుని అవగాహనను పెంచుకుంటున్నారు. జననేత జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న దివ్యాంగులు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసి దివ్యాంగుల చెంతకు పాలనను తీసుకొచ్చారు. ఒకటో తేదీ తెల్లవారుజామునే దివ్యాంగుడికి రూ.మూడు వేలు, తీవ్ర వైకల్యం గలవారికి రూ.15వేల చొప్పున పింఛను అందించారు. ఉమ్మడి జిల్లాలో 70,984 మంది దివ్యాంగులు రూ.22,14,63,000 విలువైన పింఛన్లను నెల నెలా పొందారు. సచివాలయంలోనే సదరం స్లాట్ బుకింగ్ సదుపాయం దక్కింది. ఉమ్మడి జిల్లాలోని 64 భవిత కేంద్రాలను బలోపేతం చేశారు. మానవత్వం చూపండి వైకల్యం ఉన్నవారిని జాలితో కాకుండా మానవత్వంతో చూడాలి. వారికి చేయూతనివ్వాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. – వేల్పూరు వీరబాబు, ఉపాధ్యాయుడు, వెదురుమూడి 15 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు దూరమైనా.. రాయవరం మండలం వెదురుపాకకు చెందిన అంధుడైన వేల్పూరి వీరబాబు తల్లిదండ్రులు 15 ఏళ్ల వయసులో చనిపోయారు. ఒకపక్క కంటి చూపు లేకపోవడంతో పాటు అమ్మనాన్నల తోడు దూరమవ్వడం వీరబాబును కుంగదీసింది. 2008 నుంచి 2010 వరకూ బొమ్మూరు డైట్ కళాశాలలో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి 2012 డీఎస్సీలో ప్రతిభ కనబర్చి దివ్యాంగ కోటాలో కాకుండా జనరల్ కోటాలో ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని సాధించారు. ప్రస్తుతం వెదురుమూడి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఆరు నెలలకే శిశువు జననం
ప్రత్తిపాడు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామానికి చెందిన తూరంగి సుహాసిని ఆరు నెలల గర్భిణి. ఆరు నెలలు గడిచి రెండు రోజులైనా కాకముందే నొప్పులు రావడంతో 108 అంబులెన్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం అయ్యింది. నవజాత శిశువుకు ఉండాల్సిన లక్షణాలు లేకపోవడంతో సీహెచ్సీ సూపరింటెండెంట్, చిన్నపిల్లల వైద్యురాలు బి.సౌమ్యమైఖేల్ బృందం తక్షణ చికిత్సలు అందించారు. శిశువు సాధారణ స్థితికి రావడంతో తల్లి క్షేమంగా ఉంది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు కేవలం 800 గ్రాముల బరువుతో క్షేమంగా ఉండడం విశేషమని డాక్టర్ సౌమ్యమైఖేల్ చెప్పారు. శిశువు ఊపిరితిత్తులు వృద్ధి చెందక పోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు.తల్లీ బిడ్డా క్షేమం -
బాలిక అదృశ్యంపై కేసు
సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్నంకు చెందిన పదేళ్ల మల్లి సాత్విక కనిపించడం లేదని పెదనాన్న మల్లి బాపిరా జు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్కుమార్ మంగళవారం తెలిపారు. పురుషోత్తపట్నంకు చెందిన మాటలు సరిగా పలకని (మూగ) సాత్విక సోమవారం 5.30 గంటలకు వీధిలో తోటి పిల్లలతో ఆటలు ఆడింది. తర్వాత కనిపించకుండా పోయింది. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 94409 04832, 94409 04829 నంబర్లకు కాల్ చేయాలని ఎస్సై కోరారు. జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకం ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అండర్–17 విభాగంలో నగరానికి చెందిన జూహిత గుణ బంగారు పతకం సాధించింది. లాలాచెరువు మున్సిపల్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న జూహిత అరుణాచల్ప్రదేశ్లో జరుగుతున్న జాతీయ స్ధాయి పోటీల్లో ఈ ఘనత సాధించింది. ఇటీవలే కామన్ వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొన్ని బంగారు పతకం సాధించిన జూహిత ఆసియన్ ఒలింపిక్స్లో ఇండియా తరఫున పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా పుణే స్టోర్ట్స్ అకాడమిలో శిక్షణ తీసుకుంటోంది. -
పరిహారం ఎప్పుడు బాబూ?
సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను అక్టోబర్ నెలాఖరులో విరుచుకుపడి రైతులను నిండా ముంచేసింది. పంట చేతికందే సమయంలో వచ్చిన ఈ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పొలాల్లో నీరు చేరి, పంట కోతలకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపత్కాలంలో రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పంట నష్టం అంచనాలు అరకొరగా రూపొందించి మమ అనిపించేసింది. ఇక పరిహారం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారి అవస్థలను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా రైతులకు ఎంతో చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలకు నాంది పలికిందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రచారార్భాటానికి శ్రీకారం చుట్టింది. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తెస్తామని చెబుతోంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోనూ తూతూ మంత్రంగానే నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు బుధవారం నల్లజర్ల రానున్నారు. తమను ఆదుకోవాల్సిన సమయంలో ఇటువంటి ప్రచార కార్యక్రమాలేమిటనే విమర్శ రైతుల నుంచి వస్తోంది. అన్నదాతకు అపార నష్టం ● జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు ప్రభుత్వానికి తుది నివేదిక పంపారు. దీని ప్రకారం మొత్తం 18 మండలాల పరిధిలోని 33,262 మంది రైతులు 16,540 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయారు. దీని విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. ● ఇందులో 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. ● మోంథా తుపానుతో జిల్లావ్యాప్తంగా ఏడు రకాల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రాజానగరం, రంగంపేట, సీతానగరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పంట నష్టం అత్యధికంగా జరిగింది. 14 మండలాల్లో 802.193 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు నిర్ధారించారు. 2,153 మంది రైతులకు సంబంధించి రూ.2,75,77,692 కోట్ల నష్టం జరిగినట్లు తేల్చారు. ● పంట నష్టపోయిన రైతులందరి పేర్లూ నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన వారి పేర్లు మాత్రమే నమోదు చేశారు. ● వరికి హెక్టారుకు రూ.25 వేలు, మినుముకు హెక్టారుకు రూ.17 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ● నివేదిక సమర్పించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఇస్తారన్న స్పష్టత కూడా ఇవ్వకపోవడంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్నిటా అన్యాయమే.. ● తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు, కూటమి నేతలు ప్రకటించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాది ఈ సాయం ఎగ్గొట్టారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 18,511 మంది రైతులకు మొండిచేయి చూపారు. ● ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు వాటాగా రూ.1,575 (1.50 శాతం) ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాదిగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫలితంగా మోంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టానికి వీరికి బీమా పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది. ● రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు ఎంతో ప్రోత్సాహం అందించింది. రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందించింది. అటువంటి వ్యవస్థ ప్రస్తుతం నిర్వీర్యమైంది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించారు. ఫలితంగా ఎరువులు పొందేందుకు రైతులు నానా అవస్థలూ పడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబే. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్ణయిస్తే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 17 నెలల చంద్రబాబు పాలనలో ధాన్యం, పొగాకు, మిర్చి, టమాటా, ఉల్లి, అరటి, మామిడి, పత్తి, బత్తాయి, మొక్కజొన్న, చీనీ ఇలా.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 2014లో రూ.80 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి.. రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు కూడా అదే పంథా అవలంబించారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఇస్తూ మోసం చేస్తున్నారు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి మిగిలిన వాటికీ నిరీక్షణే.. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఇతర రంగాలకు కూడా నష్టం వాటిల్లింది. మొత్తం 56 ఇళ్లు నేలమట్టమవగా రూ.28 లక్షల నష్టం జరిగినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖకు రూ.37.34 లక్షల నష్టం జరిగింది. 48 రోడ్లు ధ్వంసమయ్యాయి. రంగంపేటలో రూ.6.26 కోట్లు, బిక్కవోలులో రూ.4.04 కోట్లు, రాజానగరంలో రూ.16 కోట్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. 33 పంచాయత్రాజ్ రోడ్లు దెబ్బ తినగా.. రూ.45.81 కోట్ల మేర నష్టం జరిగింది. 21 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులకు రూ.6.87 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వీటి పరిస్థితి ఏమిటనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఫ ‘మోంథా’ పంట నష్టం రూ.40.96 కోట్లు ఫ నేటికీ రైతుకు నయాపైసా అందించని ప్రభుత్వం ఫ నేడు నల్లజర్లలో ‘రైతన్నా మీకోసం’ ఫ హాజరు కానున్న సీఎం చంద్రబాబు ఫ రైతులను ఆదుకోకుండా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడమేమిటంటూ విమర్శలు -
ఖర్మాస్పత్రులు
ఫ వైద్యానికి తాళాలుఫ ప్రభుత్వాస్పత్రుల్లో పడకేసిన వైద్యం ఫ పిఠాపురం నియోజకవర్గంలో పీహెచ్సీలకు రాత్రి వేళ తాళాలు ఫ సకాలంలో వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న రోగులు ఫ సీహెచ్సీలో సెక్యూరిటీ గార్డుతోనే వైద్య సేవలు ఫ భయాందోళనలకు గురవుతున్న ప్రజలు పిఠాపురం: ఎవరైనా అస్వస్థతకు గురైతే ప్రతి క్షణం ఒక యుగంలా మారుతుంది. గోల్డెన్ అవర్స్లో వైద్యం అందితే నిండుప్రాణం నిలబడే చాన్స్ ఉంటుంది. అదే క్షణం ఆలస్యం చేస్తే ఆ ప్రాణదీపం కొడిగట్టిపోయే ప్రమాదం ఉంటుంది. కాస్త స్థితిమంతులైతే కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ నిరుపేదలకు ప్రభుత్వ ధర్మాస్పత్రులే దిక్కు. కానీ, నేడు అక్కడకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు లేక వైద్యం అందకపోవడం ఒక ఎత్తయితే.. తీరా వెళ్లినా ఆస్పత్రులకు తాళాలు వేసి ఉండటంతో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలవరపెడుతోంది. 24 గంటలూ వైద్య సేవలందించాల్సిన పీహెచ్సీలు సాయంత్రం 4 గంటలు దాటితే చాలు.. మూత పడుతున్నాయి. ఈ నియోజకవర్గానికే పెద్దాస్పత్రి అయిన పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)తో పాటు కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని పీహెచ్సీలు వైద్య సేవల్లో ప్రగతి చూపాల్సింది పోయి నానాటికీ దిగజారిపోవడం.. సేవా లోపాలతో వీటి ప్రతిష్ట మసకబారిపోవడం వంటి సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక అనర్థం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా లేని వైద్య సేవలు తీసుకొస్తున్నామంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నెరవేరతాయో లేదో తెలీదు కానీ, సరైన వైద్య సేవలందక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. దిగజారిన సేవలు ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా పిఠాపురం సీహెచ్సీ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకుంది. అటువంటి సీహెచ్సీ పరిస్థితి కొన్నాళ్లుగా దిగజారింది. ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న బాలింతలకు ఇక్కడి వైద్యులు వణుకు పుట్టిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆపరేషన్లను తూతూమంత్రంగా పూర్తి చేసి, కుట్లు వేసే పనిని ఎటువంటి శిక్షణ, అవగాహన లేని కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో, ఆ కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ బాలింతలు, వారి బంధువులు గత సెప్టెంబర్లో ఆందోళన చేశారు. ● పిఠాపురం మండలం విరవకు చెందిన గర్భిణి ఉమామహేశ్వరి తొమ్మిది నెలలుగా ఈ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందింది. తొమ్మిది నెలలు పూర్తవుతూండగా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఇక్కడి వైద్యురాలు సుజాత స్కానింగ్ చేయించి, రెండు రోజుల అనంతరం పురుడు కోసం కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. కాకినాడ ఆస్పత్రిలో చేరిన తరువాత రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేసి, చనిపోయిన బిడ్డను బయటకు తీసి తల్లిని రక్షించారు. ● గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన నిండు గర్భిణి దొండపాటి శ్రీదుర్గ(25)కు వైద్యల పర్యవేక్షణలో పురుడు పోయాల్సి ఉంది. అయితే, వైద్యులు బలవంతంగా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించి, ఆమె మృతికి కారకులయ్యారని బంధువులు ఆరోపించి, ఆందోళనకు దిగారు. ● మరీ దారుణంగా పిఠాపురం సీహెచ్సీలో వైద్యులు చేయాల్సిన పనిని కాపలా కాసే సెక్యూరిటీ గార్డుతో చేయించడం రోగులను తీవ్రంగా కలవరపెట్టింది. ఏకంగా మార్చురీలో పోస్టుమార్టం కూడా సెక్యూరిటీ గార్డే చేయడం చూస్తేనే ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ఏవిధంగా దిగజారయో అర్థం చేసుకోవచ్చు. ● తాజాగా సోమవారం రాత్రి గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇమంది మాణిక్యం అనే వ్యక్తి అస్వస్థతకు గురవగా స్థానికులు చేబ్రోలు పీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండటంతో 108కి ఫోన్ చేశారు. అది కూడా గంట అయినా రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక మాణిక్యం మృతి చెందాడు. ● ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెంచి, పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించి ఉంటే రోగుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఉండేది కాదని పలువురు అంటున్నారు. ప్రాణం పోసే చోటే ప్రాణాలు పోతున్నాయి వైద్య వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమనే భయాందోళనలను ప్రజల్లో కలిగించింది. ఇటీవల జరిగిన అన్ని సంఘటనల్లోనూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వాస్పత్రుల్లోని కొంత మంది వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నిరుపేదలు ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం వారి ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోనే ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం చాలా దారుణం. 24 గంటలూ వైద్యం అందాల్సిన పీహెచ్సీలకు తాళాలు వేయడం చూస్తేనే వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం. వైద్యులు చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డులతో చేయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ సంఘటనలపై విచారణ జరిపించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
భారత కథకు మూలపురుషుడు వ్యాసుడు
అల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత కథను రచించినవాడే కాదు.. దీనికి మూలపురుషుడు కూడా వేద వ్యాసుడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస భారత ప్రవచనాన్ని ఆరో రోజైన మంగళవారం ఆయన కొనసాగించారు. ‘వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే’ అని ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. వ్యాసుడు విష్ణువే. కనుకనే మహాభారతాన్ని రచించగలిగాడు. ఇతరులకు అది సాధ్యం కాదు. వ్యాసోచ్ఛి ష్టం జగత్ సర్వం అన్నది అక్షరసత్యం. సాహిత్యమంతా వ్యాసుని ఉచ్ఛిష్టం నుంచి వచ్చినదే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాత శాకున్తలమ్, మాఘుని శివుపాల వధ తదితర కావ్యాలన్నిటికీ మూలం భారతమే’ అని చెప్పా రు. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు రాయలేదని, బాదరాయణుడు, మరొకరంటూ కొందరు పండితులు వ్యాఖ్యానాలు చేయడం శోచనీయమన్నారు. భారత భాగవతాలు, పురాణాలు రచించిన వ్యాసుడు కాక బ్రహ్మసూత్రాలు రాసింది మరొకరు కాదని స్పష్టం చేశారు. ‘మట్టి కుండ నుంచి పుట్టిన నీ పుట్టుక ఎట్టిది?’ అనే సినీ కవుల సంభాషణలు మూలగ్రంథాలను అధ్యయనం చేయకుండా రాసినవేనన్నారు. ఋషి హృదయాన్ని ఉపాసన ద్వారా గ్రహించాలని, కేవలం భాషాపాండిత్యాలు సరిపోవని చెప్పారు. భాగవతంలో విష్ణుదేవుని 21 అవతారాలు కనపడతాయని, వాటిలో 17వది వ్యాసుడేనని అన్నారు. ‘మహాత్ముల పుట్టుకలను మామూలు పుట్టుకలుగా భావించరాదు. అవి దివ్యమైనవి. నిన్న వైజ్ఞానికంగా అసాధ్యమనుకున్నవి నేడు రుజువు కావడం చూస్తున్నాం. నాటి మానవుల ఆయుఃప్రమాణాలు వేరు. జగత్తుకు మూలం ధర్మం. ధర్మానికి మూలం వేదం. వేదాల్లో ఉన్న ధర్మాలను చెప్పడానికే స్మృతి పురాణేతిహాసాలు ఆవిర్భవించాయి. 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించిన వాడు మహాయోగి కాగలడని స్వామి వివేకానందుడు అన్నాడు. ధర్మనిష్ఠయందే నిరంతరం చరించే మహామునుల మనస్సులు కొన్ని సందర్భాల్లో చలించడం దైవప్రేరణ వల్లనే జరిగింది’ అని వివరించారు. కురుపాండవుల జనన విశేషాలను సామవేదం తన ప్రవచనంలో వివరించారు. -
‘నన్నయ’కు 5 ఐఎస్ఓ సర్టిఫికెట్లు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి ఒకేసారి 5 ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయని, ఇదే ఒరవడిలో త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ కూడా అందుకుంటామని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలోని ఈసీ హాలులో ఐక్యూ ఏసీ డైరెక్టర్ వి.పెర్సిస్ సమన్వయంతో మంగళవారం జరిగిన ఐఎస్ఓ ఎగ్జిట్ సమావేశంలో హిమ్ (హెచ్వైఎం) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ సంస్థ అధిపతి ఆలపాటి శివయ్య వీటిని వీసీకి అందజేశారు. అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ, పర్యావరణ నిర్వహణ వ్యవస్థలను, విద్యార్థులకు అందిస్తున్న ఉత్తమ విద్యా సేవలకు, జెండర్ సెన్సిటైజేషన్ ఆడిట్ అమలుకు ఈ సర్టిఫికెట్లు ప్రతీకగా నిలుస్తాయన్నారు. శివయ్య మాట్లాడుతూ, వర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆడిట్ ప్రక్రియ సంతృప్తినిచ్చిందన్నారు. దీనికిగాను త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ అందిస్తామని చెప్పారు. తమ సంస్థ ద్వారా తొలిసారిగా ‘నన్నయ’ వర్సిటీకే ఈ సర్టిఫికెట్ అందజేయనున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మొరాయించిన సర్వర్లు
ఫ 4 రోజులుగా నిలిచిన ధాన్యం కొనుగోళ్లు ఫ రైతుల పడిగాపులు పెరవలి: ఖరీఫ్ ఆది నుంచీ నష్టాల పాలైన రైతులకు ధాన్యం చేతికి వచ్చినా కష్టాలు తప్పటం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే సర్వర్లు మొరాయించడంతో అమ్మకాలకు పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఒకవైపు తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తూండగా.. మరోవైపు గత శనివారం నుంచి సర్వర్ సమస్య రావడంతో ధాన్యం అమ్మలేక, దాచడానికి చోటు లేక నానాపాట్లూ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా పట్టించుకున్న వారే లేరని వాపోతున్నారు. కొనుగొలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నా ఏ ఒక్క రైతు వివరాలూ ఆన్లైన్ అవడం లేదని, మరోవైపు వాతావరణం భయపెడుతోందని ఆవేదన చెందుతున్నారు. సర్వర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. -
పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సెక్యూరిటీ గార్డు డాక్టర్ అవతారం ఎత్తాడు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్గా వైద్యం చేయడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు విస్తుపోతున్నారు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయడంతో పాటు గాయాలతో వచ్చిన రోగులకు సెక్యూరిటీ గార్డ్ చికిత్స చేస్తున్నాడు. గేటు బయట కాపలాగా ఉండాల్సిన గార్డ్ వైద్యం చేయడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు. అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు. -
‘అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు’
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు...నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి...చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ రావులపాలెం మధ్య ఉన్న గౌతమీ గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గోదావరి మధ్యలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల కంటపడింది. వారు ఇచ్చిన సమాచారంతో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగ నిక్కరు, బనియను ధరించి ఉన్నాడు. అతనికి ఎడమ చేయి లేదు. కాళ్లు, చేతి వేళ్లు కొరికినట్టు ఉన్నాయి. ఈ మృతదేహాన్ని జంతువులు కొరికివేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 4న వాలీబాల్ ఎంపికలు అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రీడా మైదానంలో జూనియర్స్ బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కుంచె యశ్వంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ మైదానంలో డాక్టర్ పరి మి రామచంద్రరావు మెమోరియల్ వాలీబాల్ కో ర్టులో ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జూనియర్స్ కేటగిరిలో పాల్గొనే బాల బాలికలు 2008 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారు ఈ పోటీలకు అర్హులు. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డును సమర్పించాలని సూచించారు. వివరాలకు 99595 07330, 92472 59703 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశారు. సంస్థను మోసగించిన ఉద్యోగి పరారీబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన గ్రాసీం ఇండీస్ట్రీ అనుబంధ సంస్థ సిగాచిలో హెచ్ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సాంగిశెట్టి రామకృష్ణ సంస్థను మోసం చేసి పరారీలో ఉన్నట్టు ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపారు. సోమవారం సిగాచి సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజరు మల్లాడి సుధాకర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం మల్కజగిరి ప్రాంతానికి చెందిన సాంగిశెట్టి రామకృష్ణ సిగాచి సంస్థలో హెచ్ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేశాడు. ఆయన సోదరుడు సాంగిశెట్టి రాజేష్తో పాటు, బంధువులు, పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లతో వారు సంస్థలో పనిచేయకపోయినా పనిచేసినట్లు జీతాలు ఇచ్చాడు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.9,38,175 వారి ఇచ్చినట్లు గుర్తించారు. సంస్థ ఆడిట్ చేసే లోపే విధుల నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
హెచ్ఎం కులవివక్ష చూపుతున్నారని ఆందోళన
● ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ● విద్యాశాఖాధికారి హామీతో నిరసన విరమణ కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ తల్లిదండ్రులను కూడా చులకన చేసి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులకు సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. మండలంలోని ఎండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లల పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.సురేష్ బోస్ పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ అగ్రకులాలకు చెందిన విద్యార్థులతో చులకనగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారులు వేణుగోపాల్, పైడిరాజు, ఎస్సై వెంకటేష్ పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఈ ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ చేపడతామని, వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
బడోపేతానికి కసరత్తు
● ఆందోళనకరంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ● 5న మెగా పీటీఎం 3.0 ● ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నం రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు లక్ష్యంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి మెగా పీటీఎం 3.0గా నామకరణం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకు, సమాజ భాగస్వామ్యం పెంచేందుకు, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేలా అవసరమైన సూచనలను తల్లిదండ్రుల నుంచి సేకరించడం, పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అర్థించడం వంటి అంశాల ప్రాతిపదికగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 5వ తేదీ ఈ సమావేశాన్ని జిల్లా వ్యాప్తంగా 1,582 ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలను ఉప విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే రెండు ఫార్మేటివ్, సమ్మేటివ్–1 పరీక్షలు నిర్వహించారు. వీటిలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రగతి నివేదికల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందించనున్నారు. ఈ ప్రగతి నివేదికల్లోనే విద్యార్థుల హాజరు, క్రీడా ప్రగతి, వ్యక్తిగత ఆరోగ్యాంశాలు పొందుపరచనున్నారు. విద్యార్థులు సెల్ఫోన్ అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు ఈ సమావేశాల వేదికగా అవగాహన కల్పించనున్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు మహిళా పోలీసుల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. విద్యార్థులతో పాటుగా మెగా పేటీఎం రోజు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారు సాధించిన విజయాలను తెలియజెప్పేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మధ్యాహ్నం ఒంటిగంటకు సహ ఫంక్తి భోజనంతో ముగియనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నం మెగా పీటీఎం ఏర్పాట్లలో భాగంగా పాఠశాలల్లో అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఉన్నతాధికారులు అదేశాలు ఇచ్చారు. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా పీటీఎంను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు డీవైఈవోలు, ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని అందుకనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యా శాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
భార్యపై అనుమానంతో హత్య
● ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఘటన ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకినాడ రూరల్: పచ్చని సంసారంలో అనుమానమనే జాడ్యం చిచ్చురేపింది. బతుకు తెరువు కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కష్ట సుఖాల్లో కడ వరకూ తోడు ఉంటానని ఏడు అడుగుల సాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్తే దారుణంగా సహధర్మ చారిణిని కడతేర్చాడు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంద్రపాలెం పిల్ల కాల్వ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్న బేతా మల్లీశ్వరి(47) భర్త గంగరాజు చేతిలో హత్యకు గురయ్యింది. మల్లీశ్వరి, గంగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిది నర్సీపట్నం సమీపంలోని వేమూలపూడి గ్రామం. కూతురుకు కాకినాడ రూరల్ స్వామినగర్కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొడుకు మెకానిక్గా పనిచేస్తున్నాడు. పనీపాటూ లేకుండా ఇంటి వద్ద గడిపే గంగరాజు తరచూ భార్యను వేధించడంతో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో కూతురు స్వామినగర్లో ఉండడంతో వారు కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు నెలన్నర కిత్రం మకాం వచ్చారు. అప్పటి నుంచి ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఉంటున్నారు. మల్లేశ్వరి ఇంటింటా పాచి పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, కొడుకు మెకానిక్గా పనిచేస్తున్నాడు. గంగరాజు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో కొడుకు తన సోదరి ఇంటికి వెళ్లాడు. మల్లీశ్వరితో గొడవ పెరిగి తీవ్ర వాగ్వాదం జరగడంతో నాపరాయితో తలపై గట్టిగా మోదాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కుమారుడు తల్లి గాయాలతో పడి ఉండడం చూసి ఇరుగుపొరుగు వారి సాయంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం ఎస్సై వీరబాబు కేసు నమోదు చేయగా సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
గుర్తు తెలియని మృతదేహం వెలికితీత
కిర్లంపూడి: గుర్తు తెలియని మృతదేహం లభ్యంపై సోమవారం కేసు నమోదైనట్టు హెడ్ కానిస్టేబుల్ మూర్తి తెలిపారు. మండల పరిధి వేలంకలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కాలువలో స్థానికులకు మృతదేహం కనబడడంతో వీఆర్ఓ ఇప్పర్తి దేవ సహాయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి 35–45 వయసు ఉంటుంది. బ్లూ టీషర్టు, షార్టు దుస్తులు వేసుకున్నట్లు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు పీహెచ్సీకు తరలించారు. -
రూ.200, రూ.150 నాణేల సేకరణ
అమలాపురం టౌన్: స్వామి దయానంద సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, ఆర్య సమాజ స్థాపన జరిగి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్కతా టంకశాల రూ.200, రూ.150 నాణేలను ముద్రించి విడుదల చేసింది. ఈ నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. 1824 ఫిబ్రవరి 12న జన్మించిన స్వామి దయానంద సరస్వతి అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాలను ఎదిరించి పోరాడిన ఓ మహర్షి. 1875 ఏప్రిల్ 10న ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా ఆర్య సమాజాన్ని నెలకొల్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఈ నాణేలను నికెల్ సిల్వర్తో రూపొందించారు. ఈ నాణేలు ఒక్కొక్కటి 32 గ్రాముల బరువు ఉండి 60 శాతం రాగి, 20 శాతం నికెల్, మరో 20 శాతం జింక్ కలిగి ఉంటాయి. స్వామి దయానంద సరస్వతి ముఖచిత్రంతో రూ.200 నాణెం, ఆర్య సమాజం ముద్రతో రూ.150 నాణేన్ని ముద్రించారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. -
ఉద్యోగుల నిర్వాకం.. దివ్యాంగులకు శాపం
● సదరం సర్టిఫికెట్ల కోసం పడిగాపులు ● ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకూ నిరీక్షణ ● చివరకు అక్కడ ఈ సౌకర్యం లేదని చెప్పిన సిబ్బంది గోపాలపురం: గ్రామ పంచాయతీ, సచివాలయాల ఉద్యోగుల నిర్వాకం వల్ల దివ్యాంగులు అవస్థలు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల కోసం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఉదయం 9 గంటలకు రావాలంటూ ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయాల్లో దివ్యాంగులకు కాగితాలు అందజేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల నుంచి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 10మంది దివ్యాంగులు వచ్చారు. కానీ అక్కడ వారికి చుక్కెదురైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వేచి ఉన్నా సర్టిఫికెట్ ఇచ్చే వైద్యులు రాకపోవడంతో ఆకలితో అలమటించిపోయారు. అప్పటికి స్పందించిన సీహెచ్సీ సిబ్బంది ఈ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఇక్కడకు డాక్టర్లు రారని చెప్పడంతో నిరాశతో దివ్యాంగులు వెనుతిరిగారు. దీనిపై ఆసుపత్రి సూపర్రింటెండెంట్ డాక్టర్ చైతన్యరాజును వివరణ కోరగా సదరం సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్ ఇక్కడ లేదని, విశాఖ జిల్లా గోపాలపట్నంలో సదరం సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమహేంద్రవరం, అనపర్తి ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్నారు. గత నెలలో కూడా గ్రామ సచివాలయాలకు సూచించినప్పటికీ గోపాలపురం ఆసుపత్రికి పంపుతున్నారని తెలిపారు. -
విద్యార్థులతో కలిసి చిందులేసిన స్టార్స్
రాజానగరం: సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)కి సోమవారం వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో నటీనటులు కాలేజీ విద్యార్థులతో కలసి కొంతసేపు సందడి చేశారు. హీరోయిన్లు ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతీ చిత్రంలోని పాటలను విడుదల చేస్తూ, ఆయా పాటలకు అనుగుణంగా విద్యార్థులతో కలసి స్టెప్స్ వేస్తూ, కేరింతలు కొట్టించారు. విద్యార్థులతో సెల్ఫీలు తీసుకున్నారు. తొలుత దర్శకుడు కిషోర్ తిరుమల ఆధ్వర్యంలో యూనివర్సిటీకి వచ్చిన చిత్ర బృందానికి జీజీయూ చాన్సలర్ కేవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ఆహ్వానం పలికారు. -
తీవ్ర నష్టాలు
అరటి పంట తీవ్ర నష్టాలు మిగిల్చింది. తోటలు అమ్మినప్పుడు మంచి ధర లభించింది. నేడు మార్కెట్లో ధరలు పతనమవడంతో వ్యాపారులు సగానికి సగం కోత పెడుతున్నారు. దీంతో, మేం నష్టపోవాల్సి వచ్చింది. అసలు తోటలు కొనుగోలు చేయటానికే ఎవరూ రావటం లేదు. – వాకలపూడి గాంధీ, అరటి రైతు, కానూరు కొబ్బరి ధర పతనం కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రెండు నెలలు క్రితం వెయ్యి కాయల ధర రూ.32 వేలు పలికితే నేడు రూ.8 వేలు ఉంది. అంటే వెయ్యి కాయలకు రూ.24 వేల మేర ధర పతనమైంది. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, కొబ్బరి రైతు, ఖండవల్లి ఇంత దారుణం ఎప్పుడూ లేదు కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారులు సిండ్కేట్గా మారి ధరలు తగ్గించారు. గతం ప్రభుత్వంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.350 లభిస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, కోకో రైతు, కానూరు ప్రభుత్వమే ఆదుకోవాలి క్వింటాల్ మొక్కజొన్న గింజలకు గత ఏడాది ధర రూ.2,600 ఉంటే నేడు రూ.2,200కు పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయాం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులను ఆదుకోవలసింది ప్రభుత్వమే. – కంటిపూడి సూర్యనారాయణ, మొక్కజొన్న రైతు, తీపర్రు -
పీజీఆర్ఎస్కు 178 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 178 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీనీ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సజావుగా పింఛన్ల పంపిణీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ సజావుగా సాగిందని కలెక్టర్ కీర్తి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకే 79 శాతం పంపిణీ పూర్తయ్యిందన్నారు. రాజమహేంద్రవరంలోని గాంధీపురం–1 సుబ్బారావుపేటకు చెందిన నామాల రామాయమ్మ(78)కు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేయడాన్ని కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.102.64 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఏపీఎస్ఈఏ కార్యవర్గం ఎన్నిక సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఎస్ఈఏ) జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఎన్నికల అధికారి రౌతు రామకృష్ణ, ఉప ఎన్నికల అధికారి రమాబాయి ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యకుడిగా తాళ్లపూడి మండల సర్వేయరు (ఎంఎస్)పి.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వేయర్ కేవీవీ రవికాంత్, కార్యదర్శిగా కాతేరు–3 (వీఎస్) ఎస్.సత్యనారాయణ, ఉప కార్యదర్శిగా వెదురుపాక విలేజ్ సర్వేయర్ (వీఎస్) వై.గంగరాజు, కోశాధికారిగా దూబచర్ల –1 (వీఎస్) జి.వెంకటేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాగేంద్ర, చరణ్, షాజహాన్, రత్నాచారి, రాజ్ కుమార్, సత్య మణికంఠలను ఎన్నుకున్నారు. పోలీసు పీజీఆర్ఎస్కు 33 ఫిర్యాదులు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 33 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసులకు సంబంధించి ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్గా దుర్గాప్రసాద్ తాళ్లపూడి: కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్న వాజా దుర్గాప్రసాద్ జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు అధికారులు ఈ అవార్డు అందించారు. టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ జిల్లా అధికారి వసుంధర, జిల్లా జడ్జి, కళాశాల ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ను సత్కరించి, ప్రసంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. దుర్గాప్రసాద్కు గతంలో 2012, 2013, 2023 సంవత్సరాల్లో కూడా ఉత్తమ సేవలకు అవార్డు లభించాయి. ఆయనను ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. -
ముగిసిన ‘వర్జీనియా’ అమ్మకాలు
దేవరపల్లి: అనేక ఒడుదొడుకులు, రైతుల ఆందోళనల నడుమ 2024–25 సంవత్సరం వర్జీనియా పొగాకు అమ్మకాలు లాభసాటిగా ముగిశాయి. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ఈ ఏడాది మార్చి 24న ప్రారంభించారు. పొగాకు కొనుగోళ్లు శనివారంతో ముగిశాయని టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. వేలం ప్రక్రియ పారంభించి సుమారు 255 రోజులు కాగా, 200 రోజుల పాటు కొనుగోళ్లు జరిగాయన్నారు. ఈ నెల 2న దేవరపల్లి, 8న గోపాలపురం, 21న కొయ్యలగూడెం, 28న జంగారెడ్డిగూడెం–1, 29న జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని ఆయన వివరించారు. 83.88 మిలియన్ కిలోల విక్రయాలు మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చారు. అయితే, 83.62 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేయగా, 83.88 మిలియన్ల కిలోల మేర ఉత్పత్తి జరిగింది. దీని విలువ సుమారు రూ.2,664 కోట్లు. మొత్తం 14,754 మంది రైతులు, 12,723 బ్యారన్లు కలిగి ఉండగా, 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. కిలోకు గరిష్టంగా రూ.453, కనిష్టంగా రూ.250, సగటున రూ.297.50 చొప్పున రైతులకు ధర లభించింది. మొత్తం 6,79,450 బేళ్ల వేలం నిర్వహించారు. 45.13 మిలియన్ కిలోల బ్రైట్ గ్రేడ్ ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు 45.13, మీడియం గ్రేడ్ 31.19, లో గ్రేడ్ 7.56 మిలియన్ కిలోల చొప్పున ఉత్పత్తి జరిగింది. బ్రైట్ గ్రేడ్కు కిలో సగటు ధర రూ.347.93, మీడియం గ్రేడ్కు రూ.270.60, లో గ్రేడ్కు రూ.132 చొప్పున లభించింది. కిలో అత్యధిక సగటు ధర దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.311 లభించింది. అత్యధిక ఉత్పత్తి జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం–1 కేంద్రంలో రూ.299, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో రూ.300.66, కొయ్యలగూడెంలో రూ.296.60, గోపాలపురంలో రూ.296.57 చొప్పున కిలో సగటు ధర లభించింది.ఫ 200 రోజుల పాటు వేలం ఫ విక్రయించిన పొగాకు విలువ రూ.2,664 కోట్లు ఫ కిలో గరిష్ట ధర రూ.453 ఫ సగటు ధర రూ.297.50 దేవరపల్లి 13.18 జంగారెడ్డిగూడెం–1 18.56 జంగారెడ్డిగూడెం–2 19.18 కొయ్యలగూడెం 17.87 గోపాలపురం 15.06 వేలం కేంద్రాల వారీగా పొగాకు ఉత్పత్తి (మిలియన్ కిలోలు) -
తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభించామని వైస్ చాన్సలర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు సోమవారం తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ విద్యార్థులుగా చేరిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని చరిత్ర – సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠం పీఠాధిపతి డాక్టర్ మునుగు శ్రీనివాసరావు, కూచిపూడిలోని సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేతం వైస్ ప్రిన్సిపాల్ చింతా రవిబాలకృష్ణ, సాహిత్య పీఠం ఇన్చార్జి పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, విద్యార్థులతో వీసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తామని చెప్పారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకొని, భావి జీవితం సుఖవంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, కేంద్ర సంగీత, నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కూచిపూడి నాట్య సంప్రదాయం ప్రకారం ‘అంబాపరాకు’ స్తుతిని అభినయించారు. అధ్యాపకులు డాక్టర్ వెంకట రామకృష్ణ, విశ్వ విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
ముందుగానే గుర్తిస్తే హెచ్ఐవీ నివారణ సాధ్యం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ముందుగానే గుర్తిస్తే హెచ్ఐవీ నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా స్థానిక వై.జంక్షన్ నుంచి ప్రభుత్వ అటానమస్ కళాశాల వరకూ సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి ప్రారంభించి, రెడ్ బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవీ పరీక్షలు గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టడం పూర్తిగా సాధ్యమవుతుందని చెప్పారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవీ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణుల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. పాజిటివ్ శిశువుల కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలకి్ష్మ్ మాట్లాడుతూ, పిల్లల్లో నేర ప్రవృత్తిని ముందుగానే గుర్తించి, సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జువైనల్ హోమ్స్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉండటం ఆందోళనకరమని అన్నారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం ద్వారా పిల్లలను రక్షించగలమని అన్నారు. పిల్లల ముందు గొడవలు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, అలాంటి వాతావరణం పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ అధికారి ఎన్.వసుంధర, ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వధర్మం విడిచిపెట్టరాదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్వధర్మాన్ని విడచి పెట్టరాదని, ఎక్కడికి పోయినా ఆకాశం కిందనే ఎలా ఉంటారో, ఏది చేసినా స్వధర్మం నీడనే ఆచరించాలని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన హిందూ సమాజంలో జరుగుతున్న వేదవ్యాస భారత ప్రవచన యజ్ఞంలో ఆయన సోమవారం అయిదో రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. వ్యామోహాలను విడిచి గృహస్థాశ్రమ విధులు నిర్వహించాలని, పుండును బలవంతంగా పెకలిస్తే, మరో పుండు తయారవుతుందని రామకృష్ణ పరమహంస అన్నారని చెప్పారు. ‘‘జరుత్కారుడు ఒక తపస్వి. ఆయనకు గృహస్థాశ్రమం మీద ఆసక్తి లేదు. ఆయన పితరులు ‘నీవు గృహస్థాశ్రమం స్వీకరిస్తేనే మాకు దుర్గతులు తొలగిపోయి, సద్గతులు కలుగుతాయ’ని చెబుతారు. జరుత్కారుడు కొన్ని నిబంధనలతో వివాహానికి అంగీకరిస్తాడు. నేను వివాహం చేసుకునే కన్య పేరు నా పేరే అయి ఉండాలి. నేను దరిద్రుడను, దుఃఖశీలుడను. నన్ను వివాహం చేసుకునే సీ్త్రని నేను పోషించను. నా నియమాలకు అంగీకరిస్తే, నేను కన్యాదానం స్వీకరిస్తానని ప్రకటిస్తాడు. ఆ నియమాలకు లోబడి, ఆయనకు వివాహంజరిగింది. జరుత్కారునికి జన్మించిన పుత్రుడే జనమేజయుని సర్పయాగాన్ని నిలుపుతాడు. దేవతలు గొప్పవారా, ఋషులు గొప్పవారా అంటే ఋషులే గొప్పవారు’’ అని సామవేదం వివరించారు. ప్రపంచ సాహిత్యంలో నాగవిజ్ఞాన సర్వస్వం భారతంలో కనపడినట్టు మరి ఏ ఇతర గ్రంథంలోనూ కనపడదన్నారు. సర్పయాగ వృత్తాంతం విన్నవారికి సర్పాల వలన భయం కలగదన్నారు. వేదంలో మంత్ర రూపంలో ఉన్న ఇతిహాసాలు, కథలూ వ్యాసుని భారతంలో శ్లోక రూపంలో మనకు అందుతున్నాయని చెప్పారు. ‘కద్రువ అన్న పేరుకు కుత్సిత స్వభావం కలదని అర్థం. ఆమె రజస్తమోగుణాలకు ప్రతీక. వినత వినమ్ర స్వభావం కలది. సత్వగుణానికి ప్రతీక’ అని అన్నారు. సృష్టిలోని ప్రతి ప్రాణినీ కాపాడుకోవాలని, ప్రకృతిలో ఏ శక్తినీ నిర్మూలించే హక్కు మనకు లేదని, అందరూ బతకాలని చెప్పారు. ఏ ప్రాణినీ నిర్మూలించకూడదని, నియంత్రించవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు శుభారంభం పలికారు. -
అదిరే.. కళ్లు చెదిరే..
ల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చిన్నారుల కేరింతలు.. ముద్దులొలికే మాటలు.. అబ్బురపర్చిన వివిధ వేషధారణలు.. ఉర్రూతలూగించేలా జానపద నృత్యాలు.. శాస్త్ర సాంకేతికపరమైన సైన్సు ప్రయోగాలు.. కోలాటాల మధ్య గోదావరి బాలోత్సవం ఆదివారం అట్టహాసంగా ముగిసింది. శనివారం ఉదయం రాజమహేంద్రవరం ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన గోదావరి బాలోత్సవంలో ఆదివారం సాయంత్రం వరకూ వేలాది మంది చిన్నారులు వివిధ రంగాల వారీగా తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. మొత్తంగా రెండు రోజుల పాటు సుమారు 10 వేల మందికి పైబడి పిల్లలు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటుకునేందుకు చిన్నారులు క్లాసికల్ డ్యాన్స్, సైన్సు ప్రయోగాలు, గణిత ఫజిల్స్, జానపద నృత్యాలు, కోలాటం, లఘు నాటికలు, జానపద గీతాలాపన, దేశభక్తి గీతాలాపన, విచిత్ర వేషధారణలు, బురక్రథలతో పాటు, కార్టూన్లు, మట్టితో బొమ్మల తయారీ, చిత్రలేఖనం పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చిన్నారులతో పాటు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారులకు వివిధ రంగాల వారీగా జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఇందులో యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎ.విశ్వేశ్వరరావు, ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ, ఆపుస్మా జిల్లా కార్యదర్శి పి.కళ్యాణ్రెడ్డి, ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారావు మనుమడు డేన్నిస్ దామెర్ల, స్వామి యాడ్స్ అధినేత జి.భాస్కర్, అమరావతి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.తులసి, గోదావరి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి దాసరి సాయిబాబా, ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి ఎన్.అరుణ కుమారి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడు కోలా సత్యనారాయణ తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. కార్యక్రమంలో బాలోత్సవం ఆర్గనైజర్లు నవీన కుమారి, ఆనంద్, వినోద్, పట్నాయక్, మురళి, అంజలి, గొల్లపల్లి సత్యనారాయణ, బుద్ధా శ్రీనివాస్, విజయ్బాబు, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫ అట్టహాసంగా ముగిసిన బాలోత్సవం ఫ అబ్బురపరిచిన చిన్నారుల ప్రదర్శనలు ఫ విజేతలకు బహుమతుల ప్రదానం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
అప్పటి ధాన్యం రవాణాకు ఇప్పుడు చెల్లింపులా!
ఫ బాక్ట్లిస్టులో పెట్టిన కాంట్రాక్టర్కు రూ. 3 కోట్లా! ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు అల్లవరం: పిఠాపురం మండలంలో 2017లో ఫేక్ నంబర్లతో ధాన్యం కొనుగోలు చేసి, రైస్ మిల్లులకు రవాణా చేసినట్లు బుక్లో నమోదు చేసిన స్కామ్లో కాంట్రాక్టర్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్కు రూ. 3 కోట్ల నిధులు ఎలా చెల్లిందని ప్రశ్నించారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేయాల్సిన కాంట్రాక్టర్ ఆటోలు, మోటారు సైకిల్ నంబర్లు బుక్లో ఎంటర్ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పిఠాపురం మండలంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి చెల్లింపులు చేయకుండా నిలిపివేసిన రూ. 3 కోట్లను సివిల్ సప్లయిస్ మంత్రి సహకారంతో ఇప్పుడు విడుదల చేశారన్నారు. దీనికి పిఠాపురం మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని డ్రైనేజీ నిర్వహణ పనులకు రూ. 2 కోట్ల నిధులను ఒక వ్యక్తికి అప్పగించడం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. డ్రైనేజీ నిర్వహణ పనులు చేయకుండా బిల్లులు కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎలా నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలోని రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు లభ్యం కావడం లేదని తెలిపారు. ఖరీఫ్లో ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల వద్ద గంటలకొద్ది క్యూలో రైతులు నిలబడి నరకం చూశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నమాదిరిగా ఉందని రామారావు అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. రైతులు పండించిన పంటను దాళారులచే కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్నారు. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యానికి దిక్కు లేదన్నారు. మోంఽథా తుపానుకు రైతులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రూ. 3 వేల కోట్ల నిధులతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొరతనేది లేకుండా చేశారని రామారావు తెలిపారు. రైతులకు వైఎస్సార్ సీపీ రైతు విభాగం భరోసాగా ఉంటుందన్నారు. -
దోసకాయలపల్లిలో వ్యక్తి దారుణ హత్య
కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లి పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని సమీప బంధువే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ సత్యకిషోర్ కథనం ప్రకారం.. నరేంద్రపురానికి చెందిన పిల్లి ఆనంద్ (30) దోసకాయలపల్లిలో స్థిరపడ్డాడు. మేకలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఆనంద్ భార్యతో అతని సమీప బంధువు, బొబ్బిల్లంకు చెందిన రాజ్కమల్ అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహించిన ఆనంద్ వెంటనే రాజ్కమల్పై మండిపడ్డాడు. దీంతో రాజ్కమల్ కక్ష పెంచుకున్నాడు. ఏదోలా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం ఉదయం దోసకాయలపల్లిలోని పంచాయతీ కార్యాలయ సమీప ప్రాంతంలో మేకలను మేపుతున్న ఆనంద్ దగ్గరకు వెళ్లి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ సుబ్బరాజు, నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ సిఐ సత్యకిషోర్ పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్, జిల్లాకు చెందిన క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. హత్యకు సంభందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పులిరాజా మళ్లీ వస్తున్నాడా?
రాజమహేంద్రవరం రూరల్: ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..?’ ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒకప్పుడు చేసిన ప్రచారమిది. విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాల నేపథ్యంలో ఎయిడ్స్ కేసులు కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతూండటం అధికారులను, ఈ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న వారిని కలవరపరుస్తోంది. ఎయిడ్స్ అంటే.. ఎకై ్వర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవీ) ద్వారా వ్యాప్తి చెందుతుంది. సురక్షితం కాని లైంగిక సంబంధాల వలన ఈ వైరస్ వ్యాప్తి ప్రధానంగా జరుగుతుంది. దీని బారిన పడిన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, అలసట, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తూంటాయి. అయితే, ఇటువంటి లక్షణాలున్న వారందరూ హెచ్ఐవీ బారిన పడినట్లు కాదు. వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకున్నాకే వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాప్తి అందుకేనా.. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న కొంత మంది పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని, గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం యువతులను ఇక్కడకు రప్పిస్తున్నారు. వీరిలో హెచ్ఐవీ బాధితులు కూడా ఉంటున్నారు. వీరి ద్వారానే ఎయిడ్స్ వ్యాప్తి జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే, జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు కూడా సమాజంపై కక్షతో.. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఎయిడ్స్ వ్యాప్తికి కారకులవుతున్నారు. పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. ఒక ప్రాంతంలో పోలీసులు పట్టుకుంటే వ్యభిచార ముఠాలు మరో ప్రాంతానికి మకాం మారుస్తున్నాయి. అలాగే, ఇటీవల డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్న యువత మత్తు ఇంజక్షన్లకు ఒకే సిరంజి వాడుతున్నారు. దీనివలన కూడా హెచ్ఐవీ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏటా వందల్లో కేసులు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా వందల్లో ఎయిడ్స్ బాధితులను గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2022–23 నుంచి 2025–26 (అక్టోబర్) వరకూ 1,57,623 మంది సీ్త్ర, పురుషులకు వైద్య పరీక్షలు చేయగా.. 1,342 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. అలాగే, 62,928 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా 52 మందిని పాజిటివ్గా నిర్ధారించారు. గర్భిణుల భర్తలకు కూడా పరీక్షలు చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎయిడ్స్ నిర్ధారణ అయిన కేసులు ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాలేదు. అవన్నీ కలిపితే బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో 10,762 హెచ్ఐవీ బాధితులు చికిత్స పొందుతున్నారు. నివారణకు చర్యలు జిల్లావ్యాప్తంగా హెచ్ఐవీని అదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ నియత్రణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతి నెలా లక్షల్లో కండోమ్లు అందించి, వారు హెచ్ఐవీ బారిన పడకుండా, వారి నుంచి మరొకరికి సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా యాంటీ రిట్రోవైరల్ థెరపీ మందులు వాడితే హెచ్ఐవీ బాధితుల్లో వైరల్ లోడ్ తగ్గుతుంది. తద్వారా వారి నుంచి ఇంకొకరికి హెచ్ఐవీ వ్యాప్తి చెందే శాతం తగ్గుతుంది. ఈ క్రమంలోనే హెచ్ఐవీ నిర్ధారణ కాగానే బాధితులకు ఏఆర్టీ మందులు సిఫారసు చేస్తారు. వారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే తగ్గించేందుకు మందుల డోస్ పెంచుతారు. హెచ్ఐవీ బాధితులకు ఈ మందులు ప్రతి నెలా ఉచితంగా అందిస్తున్నారు. అయితే, తమ వివరాలు బయటకు తెలుస్తాయని, సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది ఏఆర్టీ సెంటర్కు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. మందులు వాడకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఇతరులకు కూడా వైరస్ వ్యాప్తి చేస్తూ మరింత చేటు తెస్తున్నారు. నేడు ర్యాలీ ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం వై.జంక్షన్ నుంచి అటానమస్ కళాశాల వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ‘హెచ్ఐవీ పరీక్ష చేయించుకోండి.. సమాచారం పొందండి.. సురక్షితంగా ఉండండి’ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు కళాశాల సెమినార్ హాలులో అవగాహన సమావేశం నిర్వహిస్తారు. ఫ చాప కింద నీరులా ఎయిడ్స్ విజృంభణ ఫ అవగాహన లోపంతో పెరుగుతున్న బాధితులు ఫ ప్రభుత్వ లెక్కల్లో లేని కేసులే అధికం ఫ నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం వ్యాధి కట్టడికి చర్యలు జిల్లాలో హెచ్ఐవీ అదుపులో ఉంది. దీని తీవ్రత గురించి తెలుసుకున్న చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. హెచ్ఐవీ బాధితులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాం. బాధితుల రక్షణకు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. కలెక్టర్, వైద్య, ఆరోగ్యంతో పాటు ఇతర శాఖలు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్భిణుల నుంచి పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. – డాక్టర్ ఎన్.వసుంధర, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణాధికారి, రాజమహేంద్రవరం -
వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే..
ఆల్కాట్ గార్డెన్స్ (రాజమహేంద్రవరం రూరల్): వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఆయన గరుత్మంతుని ఆవిర్భావం, మహిమలను వివరించారు. ‘ఉచ్చైశ్రవం అనే అశ్వం తోకకు చుట్టుకుని, నల్లగా కనపడేటట్లు చేయాలని కద్రువ తన సంతానమైన సర్పాలను ఆదేశించింది. అలా చేయడానికి తిరస్కరించిన కొన్ని సర్పాలను జనమేజయుడి సర్ప యా గంలో ఆహుతి కమ్మని శపించింది. అయితే, ఈ సర్పాలు అత్యంత తీవ్రమైన విషాన్ని, మానవ జాతిని నాశనం చేసే శక్తి కలిగినవి. వినత తొందరపాటుతనంతో ఒక అండాన్ని పగులగొట్టినందుకు, పూర్తి అంగాలు ఏర్పడని ఒక కుమారుడు కలిగాడు. అతనే సూర్యుని రథసారథిగా వెళ్లిపోయాడు. మరో అండం నుంచి గరుత్మంతుడు వెలువడ్డాడు. అతడు వేద స్వరూపుడు. వేదంలోని ఛందస్సులు ఆయన రెక్కలు. వేదంలో సౌపర్ణ సూక్తాలు కనపడతాయి. వీటిని చదవలేని వారి కోసం వేదవ్యాసుడు 12 శ్లోకాలతో దేవతలు చేసిన గరుడ స్తుతిని మనకు అందించారు. గరుత్మంతుని స్తోత్రంలో విష్ణుపరమైన నామాలు, విష్ణు సహస్రంలో ‘సుపర్ణ’ ఇత్యాది గరుత్మంతుని నామాలు కనబడతాయి’ అని సామవేదం వివరించారు. ‘తల్లి దాస్య విముక్తికి సుర లోకం నుంచి అమృతాన్ని తీసుకువచ్చిన గరుత్మంతుడు దర్భలపై ఆ కలశాన్ని ఉంచాడు. స్నానం చేసి రావడానికి సర్పాలు వెళ్లాక, ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్లిపోయాడు. వచ్చిన సర్పాలు దర్భలను నాకడం వలన వాటి నాలికలు రెండుగా చీలిపోయాయి. దర్భలు పవిత్రమైనవిగా భావించడానికి కారణం– వాటిపై గరుత్మంతుడు అమృత కలశాన్ని ఉంచడమే. విషసర్పాలకు అమృతం ఇవ్వడం ప్రమాదకరమని భావించి, ఇంద్రుడు ఈ కార్యానికి పూనుకున్నాడు. గరుత్మంతుడు, ఆయన తల్లి దాస్యవిముక్తులయ్యారు’ అని వివరించారు. కష్టాన్ని సహించడమే తపస్సని చెప్పా రు. విద్య అంటే సమాచార సేకరణ కాదని, ఒక దివ్యమైన శక్తి అని, మనది విద్యల దేశమని, ఇక్కడున్నన్ని విద్యలు మరెక్కడా లేవని అన్నారు. నిలబడి ఆచమనం చేయరాదని, ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయరాదని, ఆచమన జలం మీసాలకు తగలరాదని, వేడిగా ఉండరాదని చెప్పారు. చరిత్ర పుస్తకాలు చదివే మనం మహర్షులు రాసిన సత్యాలను నమ్మకపోతే ఎలాగని సామవేదం ప్రశ్నించారు. -
నేటి నుంచి ఫీజుల చెల్లింపులు
● ఓపెన్ స్కూల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల ● అపరాధ రుసుం లేకుండా 10 తుది గడువు రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే అభ్యర్థులు సోమవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. దీనిని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు గత నెల 24న విడుదల చేశారు. సోమవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుండగా, అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 10వ తేదీ లోపు చెల్లించవచ్చు. అపరాధ రుసుం లేకుండా పదో తరగతికి ఓ సబ్జెక్ట్కు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5, పరీక్ష ఫీజుగా రూ.95 వెరసి మొత్తం రూ.100లు, ఇంటర్కు ఓ సబ్జెక్ట్కు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5లు, పరీక్ష ఫీజుగా రూ.145లు వెరసి రూ.150 చెల్లించాల్సి ఉంది. ప్రాక్టికల్ ఒక్కో సబ్జెక్ట్కు రూ.100లు చెల్లించాలి. ఉత్తీర్ణత సాధించని ఇంటర్ విద్యార్థులు పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్కు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.250, ఫెయిలైన సబ్జెక్టుకు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాలి. ప్రాక్టికల్ ఒక సబ్జెక్టుకు రూ.100 కట్టాలి. రూ.25 అపరాధ రుసుంతో ఈ నెల 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓపెన్ స్కూల్లో ప్రవేశానికి 875 మంది, ఇంటర్లో చేరేందుకు 3,447 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పదో తరగతిలో ప్రవేశానికి 1,708, ఇంటర్లో 3,415 మంది, కాకినాడ జిల్లాలో పదో తరగతి ప్రవేశానికి 1,642, ఇంటర్లో ప్రవేశానికి 5,213 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారు. వీరంతా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది. అదనపు ఫీజులు చెల్లించవద్దు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించే విద్యార్థులు నిర్ణీత రుసుం మించి ఎవరూ అదనంగా పరీక్ష ఫీజును చెల్లించనవసరం లేదు. ఎవరైనా అధికంగా ఫీజులు వసూలు చేస్తే జిల్లా విద్యాశాఖ కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. –షేక్ సలీం బాషా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి ఇబ్బందులుంటే ఫోన్ చేయండి.. ఓపెన్ స్కూల్ ద్వారా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులు పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా గాని లేదా హైస్కూల్స్/కళాశాలల్లో ఉండే ఓపెన్ స్కూల్ కేంద్రాల కోఆర్డినేటర్ల వద్ద గాని పరీక్ష ఫీజును చెల్లించాలి. పరీక్ష ఫీజుల్లో ఎటువంటి సందేహాలు, ఇబ్బందులు తలెత్తినా 89776 45704 నంబర్కు ఫోన్ చేయవచ్చు. – పి.సాయివెంకటరమణ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
విజయవంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష
రామచంద్రపురం రూరల్: జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్రాక్షారామ జెడ్పీ హైస్కూల్ కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా సైన్స్ అధికారి గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పరీక్షల్లో రామచంద్రపురం డివిజన్కు జిల్లా పరిషత్ తరఫున కన్వీనర్గా శనివారపు పాపాయి, కోఆర్డినేటర్లుగా గణేష్, రాజశేఖర్ వ్యవహరించారు. పరీక్ష రాసిన 2,600 విద్యార్థులకు సోమవారం ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేస్తామని గిరజాల తెలిపారు. కార్యక్రమంలో పీడీ ఆని శ్రీనివాస్, స్టాఫ్ సెక్రటరీ అరవ విస్సు, చోడి రమణ సహకారం అందించగా, జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బీరు బాటిల్తో తల బద్దలు కొట్టుకుని... ఫ అభిమాన హీరో ఫ్లెక్సీకి రక్త తిలకం ఫ నిందితుడిపై కేసు నమోదు అమలాపురం టౌన్: స్థానిక వెంకటరమణ థియేటర్లో శనివారం హీరో మహేష్బాబు నటించిన బిజినెస్మేన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేశాడు. దీంతో ఆ అభిమాని అయిన అయినవిల్లి మండలం నేదునూరు గ్రామానికి చెందిన కేతా వర్ధన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. మహేష్బాబుపై అభిమానంతో కేతా వర్ధన్ తన తలను బీరు బాటిల్తో కొట్టుకున్నాడు. తల నుంచి కారుతున్న రక్తంతో ఆ హీరో ఫొటో ఉన్న ఫ్లెక్సీపై వీర రక్త తిలకం దిద్దాడు. అంతటితో ఆగకుండా ఆ థియేటర్ వెలుపల రోడ్డుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ మంటల నుంచి తన అభిమాన హీరోకి హారతి ఇచ్చాడు. అభిమాని వర్ధన్ చేస్తున్న పిచ్చి పనులను చూసిన ప్రేక్షకులు, అటుగా వెళుతున్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడని సీఐ వీరబాబు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్లో చాంపియన్గా ‘తూర్పు’ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన అండర్–14, 17 రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల రోలర్ స్కేటింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు కై వసం చేసుకుంది. పోటీల ముగింపు ఉత్సవానికి ఎమ్మెల్సీ పద్మశ్రీ, టీచర్స్ ఎమ్మెల్సీ మూర్తి, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధి రవిచంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎస్జీఎఫ్ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 10 జిల్లాల నుంచి 400 మంది హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీనివాస్, డీఎస్ఏ జిమ్నాస్టిక్స్ కోచ్ సురేష్, పీడీ ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి మాచరరావు, సీనియర్ పీడీలు జార్జి, రవిరాజు, జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్, సంఘ కార్యదర్శి విఠల్ పాల్గొన్నారు. -
బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం పొంచి ఉందని యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆంధ్ర, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. నగరంలో ఆదివారం జరిగిన యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకుల ప్రైవేటీకరణను అన్ని విధాలా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాలంతో పాటు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి, సమస్యలపై పోరాటం సాగించాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్ మాట్లాడుతూ, రోజువారీ బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రాంతీయ కార్యదర్శిగా యాళ్ల మురళీధర్, ఉప కార్యదర్శులుగా కిషోర్, స్వాతి, కోశాధికారిగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాలే శ్రీనివాసరావు, ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోటసత్తెమ్మ సన్నిధిలో భక్తుల సందడినిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. చిన్నాయిగూడేనికి చెందిన శ్రీ రాధేశ్యామ్ కల్యాణ భజన మండలి ఆధ్వర్యాన శ్రీరాముల కల్యాణంపై భజన నిర్వహించారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,13,255 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. శాసీ్త్రయ అంశాలపై 5 నుంచి సదస్సు రాజానగరం: శాసీ్త్రయ అంశాలపై డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సద స్సు నిర్వహిస్తున్నట్లు ఆది కవి నన్నయ యూనివర్సి టీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ – ఆహార సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వం – ఉపయోగాలు’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామని వివరించారు. అయోంకీ పబ్లిష్కో (హైదరాబాద్) సహకారంతో జరిగే ఈ సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను మంగళవారంలోగా సమర్పించాలని కోరారు. వైద్యుడి సస్పెన్షన్ ఫ విధుల నుంచి స్టాఫ్ నర్స్ తొలగింపు తుని: స్థానిక ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం ఓ యువకుడి కాలు లోపలే సర్జికల్ బ్లేడ్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ సంఘటనపై ‘బోల్టు తొలగించమంటే.. బ్లేడు వదిలేసి కుట్టేశారు’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్తకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారి చక్రధర్బాబును ఆదేశించారు. ఆ మేరకు చక్రధర్బాబు ఆసుపత్రిలో ఆదివారం విచారణ చేపట్టారు. ఆపరేషన్ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని: లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి 15 వేల మంది భక్తులు తరలివచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు ఈ వివరాలు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,86,405, పూజా టికెట్ల ద్వారా రూ.2,06,550, కేశఖండన టికెట్లకు రూ.11,080, వాహన పూజల ద్వారా రూ.8,900, కాటేజీల ద్వారా రూ.65,150, ఇతరాలు రూ.52,525 కలిపి మొత్తం రూ.5,30,610 ఆదాయం సమకూరిందని వివరించారు. -
ఇహపరాలకు ధర్మమే పట్టుగొమ్మ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘అర్థకామాలు కావు. ధర్మమే ఇహపరాలకు పట్టుగొమ్మ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వేదవ్యాస మహాభారతం మూడో రోజు ప్రవచనాన్ని ఆయన శనివారం కొనసాగించారు. నాలుగు వేదాలు, పురాణాలన్నింటినీ చదివితే వచ్చే ఫలం ఒక్క భారత శ్రవణం, అధ్యయనాల ద్వారా లభిస్తుందని అన్నారు. భారతం మనల్ని తరింపజేసే గంగ అని, కలిదోష పరిహారానికి భారతాన్ని మించినది లేదని చెప్పారు. వేదాలకు లిఖిత రూపం లేదని, కానీ మహాభారతం లిఖిత రూపంలో లభించే కావ్యమని వివరించారు. భారత కథను ప్రారంభిస్తూ.. ‘జనమేజయుడు దీర్ఘసత్ర యాగాన్ని ప్రారంభించినప్పుడు అక్కడికి ఒక కుక్క వస్తుంది. దానిని అతడి తమ్ముళ్లు కొడతారు. ఆ కుక్క ఏడుస్తూ తల్లి వద్దకు వెళుతుంది. నీవేదో తప్పు చేసి ఉంటావు, లేకపోతే ఎందుకు కొడతారని తల్లి అంటుంది. దీంతో ఆ కుక్క హవిస్సును చూడలేదు, తాకలేదు అని బదులిస్తుంది. ఏ తప్పూ చేయని కుక్కను దండించారు కాబట్టి మీకు మహా భయం ఏర్పడుతుందని తల్లి కుక్క శపిస్తుంది. మహాభారతం ఆదిపర్వం కుక్కతో ప్రారంభమైయి, స్వర్గారోహణ పర్వంలో కుక్కతో ముగుస్తుందని సామవేదం చెప్పారు. ‘గురుభక్తికి సంబంధించిన ఉపమన్యు కథలో దేవ వైద్యులు అశ్వనీ దేవతల స్తోత్రం కనపడుతుంది. స్తోత్ర రూపంలో మనకు అందివచ్చిన వేద మంత్రాలు భారతంలో అడుగడుగునా కనపడతాయి’ అని వివరించారు. మహాభారత అర్థ గౌరవాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం విధాతకై నా కష్టమేనని సామవేదం వివరించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మంగళ శ్లోకంతో ప్రవచన యజ్ఞం ప్రారంభమైంది. ఆన్లైన్లో సత్యదేవుని సేవా టికెట్లు అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం కొనుగోలు, వసతి గదుల కేటాయింపు తదితర సేవలకు ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చునని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామివారి అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చునని తెలిపారు. ఆన్లైన్ టికెట్ల కోసం APTEMPLES.ORG వెబ్సైట్ ద్వారా అన్నవరం దేవస్థానాన్ని సంప్రదించాలన్నారు. అలాగే, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా నిర్దేశిత మొత్తం చెల్లించి పై సేవలు పొందవచ్చని తెలిపారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ తదితర యూపీఐ యాప్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ పెళ్లిబృందాలు, నవదంపతులతో పాటు ఇతర భక్తులు కూడా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా తరలి వచ్చారు. దీంతో, ఆలయంలో తెల్లవారుజాము నుంచీ తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. మూడు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. దశమి పర్వదినం కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. నేటి ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
తూర్పు.. కొత్త కూర్పు
● పెద్ద జిల్లాగా ఏర్పడనున్న తూర్పు గోదావరి ● మండపేట విలీనంతో 8 నియోజకవర్గాలకు విస్తరణ ● మండలాలు 19 నుంచి 22కు పెరుగుదల ● గెజిట్ విడుదలసాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాల పునర్విభజన అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం మూడు సమావేశాల అనంతరం పునర్విభజనకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం ఇప్పటి వరకూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. దీంతో, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలవనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. కొత్త ప్రతిపాదనలపై సంబంధిత ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు రాతపూర్వకంగా తెలపాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో 30 రోజుల్లోగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపాలని కోరారు. నిర్దేశిత సమయంలోగా అన్ని సూచనలూ అందితే ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని తెలిపారు. వచ్చే జనవరి 1 నుంచి మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో పూర్తిగా విలీనం అవుతుంది. ఇకపై ఆ నియోజకవర్గ పరిధి కార్యకలాపాలన్నీ రాజమహేంద్రవరం నుంచే జరుగుతాయి. అతి పెద్ద జిల్లాగా.. మండపేట విలీనం అనంతరం తూర్పు గోదావరి రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. జిల్లాలో ప్రస్తుతం 7 నియోజకవర్గాలు (రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం) 19 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. సుమారు 16 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మండపేట కూడా కలిపితే జిల్లా 8 నియోజకవర్గాలకు విస్తరించనుంది. మండలాలు 22కు పెరుగుతాయి. 2 లక్షల మందికి పైగా ఓటర్లు ఈ జిల్లాలో కలిసే అవకాశం ఉంది. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం సుమారు 15.90 లక్షల మంది ఓటర్లున్నారు. ఇప్పటి వరకూ 22 మండలాలు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మండపేట ‘తూర్పు’లో విలీనం కానుండటంతో కోనసీమ 6 నియోజకవర్గాలకు, 19 మండలాలకే పరిమితం కానుంది. కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాలతో కొనసాగనుంది. రాజమహేంద్రవరం – మండపేట మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరిలో కలపాలనే డిమాండ్ మొదటి నుంచీ ఉంది. దీనిపై, గతంలో ఆందోళనలు సైతం చేపట్టారు. అయితే, నీతి అయోగ్ సూచనల ప్రకారం అప్పట్లో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక జిల్లాగా రంపచోడవరం జిల్లాల పునర్విభజన జరిగితే రంపచోడవరం నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలో కలిసే అవకాశం ఉంటుందన్న ఆ నియోజకవర్గ ప్రజల ఊహాగానాలకు తెర పడింది. రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, చింతూరు, ఎటపాక, కూనవరం మండలాలతో ప్రత్యేకంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. ఆ మండలాలు యథాతథం ● అనపర్తి నియోజకవర్గం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. అందులోని పెదపూడి మండలం మాత్రం కాకినాడ జిల్లాలో ఉంది. జిల్లాల పునర్విభజన జరిగితే దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపించింది. చివరకు పెదపూడిపై చంద్రబాబు సర్కారు ఎటువంటి నిర్ణయ మూ తీసుకోకుండా అపరిష్కృతంగా వదిలేసింది. ● గోపాలపురం నియోజకవర్గం కూడా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండగా.. అందులోని ద్వారకా తిరుమల మండలం మాత్రం ఏలూరు జిల్లాలో ఉంది. పునర్విభజనలో ఈ నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలపాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ, దీనిపై కూడా ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా మ్యాప్ మండపేట నియోజకవర్గ మ్యాప్ ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం విస్తీర్ణం 2,560.7 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం 89.9 చదరపు కిలోమీటర్లు రెవెన్యూ డివిజన్లు 2 మండలాలు 19 మున్సిపల్ కార్పొరేషన్ రాజమహేంద్రవరం మున్సిపాలిటీలు కొవ్వూరు, నిడదవోలు రెవెన్యూ గ్రామాలు 272 గ్రామ పంచాయతీలు 300 మండపేట నియోజకవర్గం మండలాలు 3 జనాభా సుమారు 2.46 లక్షలు ఓటర్లు సుమారు 2.14 లక్షలు గ్రామ పంచాయతీలు 43 మున్సిపాలిటీ మండపేట 1 వార్డులు 30 ‘పచ్చ’ ప్రయోజనాలే లక్ష్యంగా.. తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజన అంశాన్ని తెర పైకి తెచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ సరిహద్దుల మార్పుల అంశానికి నాంది పలికినట్లు విమర్శలున్నాయి. టీడీపీ నేతల లబ్ధి కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయకుండా తమకు రాజకీయంగా అనువైన ప్రాంతాల్లోనే మార్పులు చేపట్టినట్లు సమాచారం. మండపేట నియోజకవర్గం పౌల్ట్రీ, రైస్ మిల్లులకు పెట్టింది పేరు. ఆర్థికంగా స్థితిమంతమైన నియోజకవర్గం. టీడీపీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. దీనిని ‘తూర్పు’లో కలిపితే మరింతగా బలపడవచ్చనే ఉద్దేశంతోనే ఈ విలీనం చేపట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆశగా సాగుతూ..
● దాళ్వాకు శ్రీకారం ● ఆకుమడులు వేస్తున్న రైతులు ● జిల్లావ్యాప్తంగా 56 వేల హెక్టార్లలో రబీ సాగు దేవరపల్లి: ఒకవైపు సార్వా వరి కోతలు, ధాన్యం అమ్మకాలు జరుగుతూండగానే.. మరోవైపు దాళ్వా పంట సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. డెల్టాలో కాలువల కింద, మెట్ట ప్రాంతంలో బోర్ల కింద ఆకుమడులు సిద్ధం చేస్తున్నారు. దీనికి అవసరమైన భూమిని వారం రోజులుగా దమ్ము చేసి, విత్తనాలు పోస్తున్నారు. తుపాన్లు, అధిక వర్షాల కారణంగా ఖరీఫ్లో వేసిన వరి పంట చేతికి వస్తుందనే నమ్మకం రైతులకు ఉండటం లేదు. దీంతో, దాళ్వాపై ఆశలు పెట్టుకుని సాగుకు ఉపక్రమిస్తున్నారు. కొవ్వూరు డివిజన్లోని మెట్ట ప్రాంతంలో బోర్ల కింద ముమ్మరంగా ఆకుమడులు వేస్తున్నారు. ఖరీఫ్ పంట మోంథా తుపానుకు దెబ్బ తినడంతో దిగుబడులు పడిపోయాయి. సాధారణంగా ఎకరాకు 32 నుంచి 36 బస్తాల ధాన్యం దిగుబడి రావాల్సి ఉండగా.. 28 నుంచి 30 బస్తాలు మాత్రమే వస్తున్నాయి. అదే దాళ్వాలో అయితే, ఎకరాకు 55 నుంచి 60 బస్తాల వరకూ ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. తొలకరి పంటలో నష్టాలు చవి చూసిన రైతులు దాళ్వా పంటకు ఆశగా ఉపక్రమిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రబీ వరి సాగు లక్ష్యం సుమారు 56 వేల హెక్టార్లుగా నిర్ధారించారు. కొవ్వూరు డివిజన్లో సుమారు 19,500 హెక్టార్లు, రాజమహేంద్రవరం డివిజన్లో 36 వేల హెక్టార్లలో దాళ్వా వరి సాగు జరగనుంది. అధిక దిగుబడులిచ్చే వంగడాలకు మొగ్గు దాళ్వాలో రైతులు అధిక దిగుబడులనిచ్చే వంగడాల వైపు మొగ్గు చూపుతున్నారు. 120 రోజుల కాలపరిమితితో దిగుబడినిచ్చే ఎంటీయూ–1121, ఆర్ఎన్ఆర్–15048, ఎంటీయూ–1156, ఎంటీయూ–1153 రకాల వంగడాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు డీసీఎంఎస్ ద్వారా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. రైతులు తీసిన విత్తనాల కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో రైతులే విత్తనాలు తయారు చేసి, అవసరమైన రైతులకు సరఫరా చేస్తున్నారు. సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద కూడా అందుబాటులో ఉన్నప్పటికీ రైతువారీ విత్తనాల కొనుగోలుకే రైతులు ఆసక్తి చూపుతున్నారు. విత్తనశుద్ధి తప్పనిసరి వరి నారుమడులు వేసే రైతులు తప్పనిసరిగా 2 గ్రాముల కార్బండిజం మందును కిలో విత్తనంలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి నాట్లు వేసే ముందు రోజు ఆఖరి దుక్కులో ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25 కిలోల పొటాషియం, 25 కిలోలు నత్రజని ఎరువు వేసుకుంటే చలిని తట్టుకుని పంట ఆరోగ్యంగా ఉంటుంది. విత్తన శుద్ధి వల్ల మొలక శాతం కూడా బాగుంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రబీ ప్రణాళిక సిద్ధం రబీ సాగు ప్రణాళిక సిద్ధం చేశాం. జిల్లావ్యాప్తంగా రబీలో అన్ని రకాల పంటలూ కలిపి సాధారణ విస్తీర్ణం 83 వేల హెక్టార్లు కాగా, ఇందులో 75 వేల హెక్టార్లలో వాస్తవ సాగు జరుగుతుంది. దీనిలో వరి 56 వేలు, మొక్కజొన్న 8 వేలు, ఇతర పంటలు 9 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గోదావరి నీటిని డిసెంబర్ 1న విడుదల చేస్తే నారుమళ్ల ద్వారా సుమారు 60 శాతం, వెదజల్లు విధానంలో 40 శాతం వరి సాగు చేయవచ్చు. డిసెంబర్ మొదటి వారంలో నారు పోసుకుని, 25వ తేదీ లోగా నాట్లు వేస్తే 60 శాతం పంట మార్చి నెలాఖరుకు కోతకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మూడో పంట వేసుకునే వీలుంటుంది. పంటలకు అన్ని రకాల ఎరువులు సిద్ధం చేశాం. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి -
వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
కొత్తపేట: అనాథ రక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తుల గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామి దర్శనం, తీర్థ ప్రసాదాల స్వీకరణ అనంతరం వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్ రాము, వాడపల్లిలో ట్రాఫిక్ను నియంత్రించారు. ఏపీఎస్ ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. మార్మోగిన గోవింద నామ స్మరణ మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో శనివారం గోవింద నామ స్మరణ మార్మోగింది. ఏడుకొండలవాడా గోవిందా.. వెంకటరమణా గోవిందా.. అంటూ భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు. ప్రాతః కాలంలో స్వామి వారికి సుప్రభాత సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలి హారతిని భక్తులు దర్శించుకున్నారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. తమ కోర్కెలు నెరవేరాలని స్వామికి ప్రణమిల్లారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.2,72,239 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.89,450 విరాళాలుగా అందించారన్నారు. అయిదు వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 2,800 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. పాశర్లపూడిలంకకు చెందిన పితాని సూర్యనారాయణ, వెంకటరమాదేవి దంపతులు స్వామివారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,116 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి అందజేశారు. -
పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా పుష్కరాలకు భారీ స్థాయిలో సన్నద్ధమవుతున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులూ క్షేత్ర స్థాయిలో పర్యటించి, అంచనాలతో వచ్చారని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, వచ్చే పుష్కరాలకు ఏడెనిమిది కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీనికి అనుగుణంగా రవాణా, భోజనం, తాగునీరు, శానిటేషన్, భద్రత వంటి అంశాల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, పుష్కరాల ఏర్పాట్లపై అన్ని శాఖల నుంచీ హేతుబద్ధంగా పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్.కృష్ణనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ బిల్లుల వసూలురాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లుల వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా తెరచి ఉంటాయని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు ఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్లలో కూడా ఆదివారం బిల్లులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా డిసెంబర్ నెలలో పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ – అనకాపల్లి (07041) రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (ప్రతి ఆదివారం) నడుస్తుంది. అనకాపల్లి – సికింద్రాబాద్ (07042) రైలు డిసెంబర్ 8, 15, 22, 29 తేదీల్లో (ప్రతి సోమవారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ క్లాసులు బోగీలు ఏర్పాటు చేశారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. దాత ఒబ్బిలిశెట్టి వెంకట కృష్ణారావు కుమారుడు మణికంఠ రామ కిషోర్ దంపతుల ఆర్థిక సహాయంతో 9 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. స్వామివారికి పుష్పాలంకరణ కూడా దాతలు చేయించారని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. తొలి తిరుపతి కిటకిట పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువుదీరిన శృంగార వల్లభ స్వామి ఆలయం వేలాది మంది భక్తులతో శనివారం కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 16 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,27,770, అన్నదాన విరాళాలు రూ.58,138, కేశఖండన టికెట్ల ద్వారా రూ.7,280, తులాభారం రూ.300, లడ్డూ ప్రసాదం విక్రయాలతో రూ.16,845 కలిపి మొత్తం రూ.2,10,333 ఆదాయం సమకూరిందని వివరించారు. 3,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. -
పంట తరలింపునకు యత్నించిన వారిపై కేసు
తాళ్లరేవు: వరి పంటను అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని పటవల గ్రామానికి చెందిన యన్నపు సత్తిరాజు 2010లో కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన దండుప్రోలు వెంకటలక్ష్మి, దండుప్రోలు సత్యవతి, దండుప్రోలు లక్ష్మణస్వామి వద్ద ఎకరా 95 సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, సాగు చేసుకుంటున్నారు. అయితే దండ్రుప్రోలు లక్ష్మణస్వామికి చెందిన 65 సెంట్ల భూమిని సత్తిరాజు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ అగ్రిమెంట్ ప్రకారం ఆ భూమికి సత్తిరాజు పన్నులు చెల్లిస్తున్నారు. ఆయన స్వాధీనంలోనే ఆ భూమి కొనసాగుతోంది. శనివారం లక్ష్మణస్వామి కుమారుడు అగ్గిరాముడు, అతని కుటుంబ సభ్యులు ఆ పొలంలోకి ప్రవేశించి సత్తిరాజుపై దాడి చేయడంతోపాటు కోసి ఉన్న వరి పంటను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సత్తిరాజు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరంగి పోలీసులు ఘటనా స్థలానికి రాగా అగ్గిరాముడు పురుగు మందు డబ్బాను చేతితో పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా అక్కడి నుంచి వెళి్ల్పోయారు. ఈ భూమికి సంబంధించి కాకినాడ రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు పెండింగ్లో ఉందని ఎస్ఐ తెలిపారు. సత్తిరాజు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భూ వివాదంలో న్యాయం కోసం వెళ్లిన తమపై కోరంగి పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ దండుప్రోలు అగ్గిరాముడు, అతని కుటుంబ సభ్యులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ వద్ద ప్రధాన రహదారిపై వెళుతున్న లారీల కిందకు పడేందుకు ప్రయత్నించగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఔట్పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ రమణ స్థానికుల సాయంతో అడ్డుకున్నారు. -
కారు చోరీ
కాజులూరు: గొల్లపాలెంలో కారు చోరీకి గురైనట్టు ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని పెద్దవీధికి చెందిన నేతి భగవాన్ ఇంట్లో శుక్రవారం రాత్రి ఈ చోరీ జరిగిందన్నారు. దొంగలు గేటు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి హుందాయ్ వెన్యూ కారును దొంగిలించుకుపోయారని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య కాకినాడ క్రైం: వ్యక్తిగత కారణాలతో కాకినాడకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, కాకినాడ బుడంపేటకు చెందిన దొడ్డిపాటి రాఘవ(53) శుక్రవారం ఇంట్లో ఉన్న పలురకాల మాత్రలు మింగాడు. కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఘటనపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలోత్సవం ఆరంభం
థీమ్ సాంగ్ ఆవిష్కరణఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో 3వ గోదావరి బాలోత్సవం శనివారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాన్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం బాలోత్సవ పతాకాన్ని గోదావరి బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు, ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ఎస్వీవీ కృష్ణకుమార్ ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పిల్లల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు బాలోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు మంచి మార్గంలో పయనిస్తున్నారా? పెడతోవలో నడుస్తున్నారా అనే ఆందోళన తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయుల్లోనూ ఉందన్నారు. ఈ తరుణంలో పిల్లలు చిన్ననాటి నుంచే కళలు, సాంస్కృతిక కార్యకలాపాలపై మక్కువ చూపేలా శ్రద్ధ చూపాలన్నారు. ఎంఎల్సి బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సమాజ మార్పునకు అవసరమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పాలకులు ఆలోచించాలన్నారు. నున్న తిరుమలరావు మాట్లాడుతూ బహుమతుల కోసం కాకుండా తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చేందుకు బాలోత్సవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను బట్టీ చదువులకే పరిమితం చేస్తోందని సీసీసీ ఎండీ పంతం కొండలరావు అన్నారు. నాట్యాచారి సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు బట్టీ చదువులతోనే ఉంటే సృజనాత్మకత ఎప్పుడు వెలుగులోకి వస్తుందని ప్రశ్నించారు. గోదావరి బాలోత్సవ లక్ష్యాలను ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.తులసి వివరించారు. గోదావరి బాలోత్సవం థీమ్ సాంగ్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. విద్యార్థులకు నృత్యాలు, నాటికలు, జానపద గీతాలతో పాటు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖా అధికారి కె.వాసుదేవరావు, ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాడ్యం, ఎల్ఐసీ సీనియర్ మేనేజర్ సత్యనారాయణ సాహూ, అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజర్లు నవీణకుమారి, కోలా సత్యనారాయణ, పువ్వుల ఆనంద్ పాల్గొన్నారు. -
మైనింగ్ లారీల అడ్డగింపు
● ఉదయం నుంచి రోడ్డుపై నిలిపివేసిన ఎస్.పైడిపాల గ్రామస్తులు ● రోడ్ల ధ్వంసం, శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన రౌతులపూడి: కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా గ్రామం మీదుగా రవాణా సాగిస్తున్న లేటరైట్, నల్లరాయి వంటి మైనింగ్ లారీలను శనివారం మండలంలోని ఎస్.ౖపైడిపాల గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది భారీ లారీలు గ్రామం మధ్య నుంచి వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి వ్యాపించి అనారోగ్యాలకు గురవుతున్నామని శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిని పూర్తిగా ధ్వంసం చేశారని, మోటారు వాహనాలు అదుపు తప్పి తరచూ ప్రమాదాలకు గురువుతున్నామని చెప్పారు. ఉదయం ఆరుగంటల నుంచి గ్రామస్తులు అడ్డుకోవటంతో లారీలను రోడ్డుపై నిలిపివేశారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరరావు తమ సిబ్బందిని పంపించి గ్రామస్తులతో చర్చలు జరిపారు. గ్రామం మధ్యలోనుంచి కాకుండా వేరే మార్గం గుండా రవాణా సాగించుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై గ్రామ పెద్దలకు ఫోన్ చేసి ప్రస్తుతం లోడుతో వున్న లారీలను వదిలేయండి, ఆ తరువాత వస్తే ఆపుకోండి అని చెప్పగా లారీలను వదిలిపెట్టారు. మరో గంట తరువాత లోడు కోసం ఖాళీ లారీలు వెళ్లటానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఎస్.పైడిపాల వచ్చి చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ లారీలను అడ్డుకోరాదని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలుంటాయని చెప్పడంతో ఆయనతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇలా మైనింగ్ మాఫియాకు వత్తాసు పలకడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలోనుంచి రవాణా సాగించడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక లారీలను వెనక్కి తీసుకెళ్లారు. -
దొంగతనం కేసులను ఛేదించిన పోలీసులు
● రూ. 59.60 లక్షల విలువైన ఆభరణాల స్వాధీనం ● ఆరు కేసుల్లో 12 మంది అరెస్టు ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి, సుమారు రూ.59.60 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు శనివారం ప్రకటనలో తెలిపారు. బంగారం విలువ రూ.40 లక్షలు, వెండి విలువ రూ.19,60 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 24వ తేదీన ప్రత్తిపాడు మెయిన్రోడ్డులోని శ్రీసురేష్ జ్యూయలరీ షాపు షట్టర్ పగులగొట్టి గుర్తు తెలియని చోరులు సుమారు 11 కేజీల వెండి ఆభరణాలను దోచుకుపోయారు. దుకాణ యజమాని గొంతిన సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నెల్లూరుకు చెందిన షేక్ ఫక్రుద్దీన్ బిషనై, అతని స్నేహితులైన మధ్యప్రదేశ్ రాష్ట్రం దాకాకు చెందిన దొంగల ముఠా సభ్యులు మొత్తం పది మంది కలిసి నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఇదే గ్యాంగ్ నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనం చేసినట్లు గుర్తించారు. నల్లజర్ల పోలీసుల సమన్వయంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫక్రుద్ధీన్ బిషనై, మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేషు మెహదా, బారిక్ సింగ్, రఘాన్ హాటియా, హీరు, మెహరు కల్లు మెహదాలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఫక్రుద్దీన్ బిషనై ఇచ్చిన వాగ్మూలం మేరకు ప్రత్తిపాడు నగల దుకాణంలో దొంగిలించిన వస్తువులన్నీ తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లికి చెందిన కర్రీ సాయి చంద్రారెడ్డి అనే వ్యక్తికి కమీషన్ పద్ధతిలో అమ్మకానికి ఇచ్చాడు. అయితే దొంగతనం కేసులో తణుకు సబ్ జైలులో ఉన్న కర్రీ సాయి చంద్రారెడ్డిని పీటీ వారెంట్పై ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరచి, రెండు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రారెడ్డి ఇంటి నుంచి సుమారు 11 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరిని, నెల్లూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. గత నెల 4వ తేదీన అన్నవరం గాయత్రి కాలనీ మెట్టకు చెందిన గుత్తిన పవన్ హరిప్రసాద్ ఇంటికి వెనుక తలుపు పగులగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలు, 1.4 కేజీల వెండి వస్తువులను దోచుకుపోయారు. ఈ కేసులో విశాఖ జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన చినమాన ఎల్లాజీ అనే రాజును అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎల్లాజీపై 20 బైక్ దొంగతనాలు ఉన్నాయి. జగ్గంపేట పోలీసు స్టేషన్లో అన్నవరం నుంచి ప్రయాణం చేస్తున్న వి దేవి బ్యాగ్లో హారం, రెండు నెక్లస్లు వెరసి 95 గ్రాములు, జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్ కుమారి వద్ద 11 గ్రాముల విలువ గల బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయి. తుని గొల్ల అప్పారావు సెంటర్ వద్ద 15 గ్రాముల బంగారు వస్తువుల చోరీ, ఎన్టీఆర్ జిల్లా గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో లెనిన్ సెంటర్ బస్ స్టాప్ 55 బంగారు నగలను మాయం చేసిన అంతర్ జిల్లా మహిళా దొంగల గ్యాంగ్ను అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 176 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో గేరక వరలక్ష్మి (తాడేపల్లిగూడెం), మరసాని సత్యవేణిని అరెస్ట్ చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న సొత్తును ఎస్పీ బింధుమాధవ్ కాకినాడలో పరిశీలించి, ఆయా స్టేషన్ల పోలీసు సిబ్బందిని అభినందించినట్టు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. స్టెప్నీ టైర్ పేలి ప్రయాణికుడికి గాయాలుకాకినాడ క్రైం: సామర్లకోట – కాకినాడ మార్గం మధ్యలో వీకే రాయపురం సమీపంలో ఓ ఆర్టీసీ బస్లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఏలేశ్వరం నుంచి కాకినాడకు వస్తున్న ఏలేశ్వరం డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులో స్టెప్నీ టైర్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సామర్లకోట సమీపంలోని విప్పనపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడి ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. తోటి ప్రయాణికులు బాధిత యువకుడిని కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. అక్కడి వైద్యులు పట్టించుకోలేదని విమర్శిస్తూ క్షతగాత్రుడు తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై జీజీహెచ్ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. -
వెండితో సూక్ష్మ ప్రెషర్ కుక్కర్
అమలాపురానికి చెందిన స్వర్ణకారుడు తాళాబత్తుల బ్రహ్మాజీ వెండితో సూక్ష్మ ప్రెషర్ కుక్కర్ను రూపొందించారు. ఈ సూక్ష్మ డబుల్ డెక్కర్ ప్రెషర్ కుక్కర్ను కేవలం 4 సెంటీ మీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు, 20 గ్రాముల బరువుతో దీన్ని తయారు చేశారు. కుక్కర్తోపాటు రెండు అతి చిన్న స్పూన్లు, రెండు రబ్బర్ గ్యాస్ కట్లు రూపొందించారు. దీని తయారీకి పది రోజులు పట్టిందని బ్రహ్మాజీ తెలిపారు. ఈయన గతంలో బంగారం, వెండితో 36 సూక్ష్మ వస్తువులు తయారు చేసి మినియేచర్ వరల్డ్ రికార్డు హోల్డర్గా గుర్తింపు పొందారు. – అమలాపురం టౌన్ -
అందరికీ చంద్ర గోల్డ్ టీ
● జనసేన కీలక నేతకు నజరానా ● రిటర్న్ గిఫ్ట్గా టీ టైమ్ మినీ మార్ట్లు ● జనం కోరుతున్న కందిపప్పునకు మంగళం ● డిసెంబర్ కోటాలో టీ పొడి అమ్మకాలు ● ఎవరూ అడగకపోయినా ప్రభుత్వం వింతపోకడ ● కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిపెట్టాడనే సామెత చందాన చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలని జనం నెత్తీనోరూ బాదుకుంటున్నా స్పందన లేదు. ప్రతి పేద కుటుంబానికీ అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసిన సర్కార్.. ఏ ఒక్కరూ అడగని టీ పొడిని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతూండటం విస్మయం కలిగిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి అమ్మకాలను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. సర్క్యులర్ విడుదల ప్రజలపై ప్రేమతో రేషన్ షాపుల్లో టీ పొడి విక్రయాలు చేపడుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ టీ పొడి సరఫరాకు టీ టైమ్ను వ్యాపార భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి రేషన్ షాపుల్లో ఏదైనా ఒక ఉత్పత్తి విక్రయం చేపట్టాలని అనుకుంటే ముందుగా సంబంధిత కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలి. వాటిని మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి కమిటీ పారదర్శకంగా ఖరారు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. టీ పొడి విక్రయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈవిధంగా బహిరంగ టెండర్లు ఆహ్వానించి ఉంటే తాజ్మహల్, టాటా చక్రా గోల్డ్, త్రీ రోజెస్ తదితర జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన టీ ఉత్పత్తిదారులు పాల్గొనే అవకాశం ఉండేది. తద్వారా వారి మధ్య పోటీ నెలకొని నాణ్యమైన టీ పొడి సరసమైన ధరకే ప్రజలకు అందించే వీలు కలిగేది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఎటువంటి టెండర్లూ పిలవకుండానే టీ టైమ్ సంస్థకు ఏకపక్షంగా ఈ కాంట్రాక్ట్ అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ కూడా విడుదల చేసింది. రిటర్న్ గిఫ్ట్! ఎటువంటి టెండర్లూ లేకుండానే టీ టైమ్ సంస్థ ద్వారా టీ పొడి అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచీ జనసేన పార్టీకి ఆర్థికంగా చేయూత ఇచ్చిన సంబంధిత నేతకు రిటర్న్ గిఫ్ట్గా ఈ భారీ నజరానా ఇచ్చారని అంటున్నారు. అనుకున్నదే తడవుగా.. కాకినాడ జిల్లాలో జనసేనకు అన్నీ తానై చక్రం తిప్పిన క్రియాశీలక నేతకు చెందిన కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చేలా ఈ డీల్ కుదిరిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి రాష్ట్ర కేబినెట్లో పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. దీంతో, అనుకున్న పని సులువైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లపై ఒత్తిళ్లు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లోనూ దశల వారీగా టీ పొడి విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డిసెంబర్ 1న టీ పొడి అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కార్డుదారులకు టీ పొడి అమ్మాలంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ జిల్లాల్లోని రేషన్ డీలర్లపై అధికారుల నుంచి ఇప్పటికే ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసినప్పటి నుంచీ రేషన్ డీలర్లు రెండు రకాల టీ పొడి ప్యాకెట్లు విక్రయించాలని చెబుతున్నారు. ఈ నెల 30 లోగా ఏ రేషన్ షాపునకు ఎన్ని ప్యాకెట్లు కావాలనే ఇండెంట్ పంపించాలంటూ రెవెన్యూ, పౌర సరఫరాల అధికారుల నుంచి డీలర్లకు మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం. రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి విక్రయించే డీలర్లు సంబంధిత కంపెనీకి రూ.5 వేలు చెల్లించాలి. టీ పొడి అమ్మిన తరువాత కమీషన్ ఇస్తామని ఆ ఉతర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచే బియ్యం ఇతర నిత్యావసరాలతో పాటు టీ పొడి కూడా కోటా ప్రకారం విడుదల చేసుకోవాలి. టీ టైం మినీ మార్టుల పేరుతో రేషన్ షాపులను మినీ మార్టులుగా మారుస్తామని, రేషన్ షాపుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. టీ టైం మినీ మార్టులకు ఆ కంపెనీ చంద్ర గోల్డ్ టీ మాత్రమే సరఫరా చేస్తుంది. 20 గ్రాముల ప్యాకెట్ రూ.10, 40 గ్రాముల ప్యాకెట్ ధర రూ.20గా నిర్ణయించారు. ఒక్కో రేషన్ షాపునకు 10 గ్రాముల ప్యాకెట్లు 276, 20 గ్రాముల ప్యాకెట్లు 144 సరఫరా చేయనున్నారు. 10 గ్రాముల ప్యాకెట్లు అమ్మితే రూ.339, 20 గ్రాముల ప్యాకెట్లపై రూ.354 డీలర్కు లాభం ఉంటుందని చెబుతున్నారు. రూ.5 వేల విలువైన ప్యాకెట్లు అమ్మితే డీలర్కు రూ.693 ఆదాయం వస్తుందని అంటున్నారు. వాస్తవానికి జాతీయ, అంతర్జాతీయ టీ బ్రాండ్ ఉత్పత్తుల ధర కంటే ఈ ధరలు ఎక్కువని పలువురు అంటున్నారు. ప్రస్తుతానికి 10 గ్రాములు, 20 గ్రాముల ప్యాకెట్లని చెబుతున్నా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో కార్డుదారులందరికీ అమ్మడమంటే వ్యవహారం రూ.కోట్లలోనే ఉంటుంది. టీ టైమ్ మినీ మార్టుల పైలట్ ప్రాజెక్టును భవిష్యత్తులో రాష్ట్రమంతా విస్తరించాలనే వ్యూహం ఇందులో లేకపోలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
తొలి జీతానికి తకరారు!
● ప్రానం పెట్టి పని చేయొద్దా..● ఒకటిన జీతాలియ్యకుంటే ఎలా? ● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్త టీచర్లు ● ఐడీల కేటాయింపులో తీవ్ర జాప్యం ● ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు ● వచ్చే నెల 15 తరువాత వచ్చే అవకాశం ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి సాక్షి, అమలాపురం: మెగా డీఎస్సీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం నాడు ఈ ఫైల్పై సంతకం చేసినప్పటి నుంచి నియామకాలు పూర్తయ్యి తొలి జీతం ఇచ్చే వరకూ అంతా గందరగోళమే. కొలువుల్లో చేరి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ జీతమే లేదు. డిసెంబరు 1వ తేదీన జీతం అందే పరిస్థితీ కానరావడం లేదు. వచ్చే నెల 15వ తేదీ వరకూ వీరికి జీతాలు పడే అవకాశం కనిపించడం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని డీఎడ్, బీఎడ్ చదివి, పూర్తిచేసి ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం వీరు డీఎస్సీ పరీక్షలు రాశారు. మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తొలి జీతం అందుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా వేతనం చెల్లించేందుకు ట్రెజరీలో ఉద్యోగి ఐడీతో పాటు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) జనరేట్ చేస్తారు. ఈ సంఖ్య కోసం కొత్త టీచర్లు ఇప్పటికీ ట్రెజరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,351 మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 మంది ఉపాధ్యాయులు కొత్తగా కొలువుల్లో చేరారు. అంతకు ముందు వారికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐదు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక కేంద్రంలో ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు. లాంగ్వేజ్, సైన్స్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ.. ఇలా క్యాడర్ల వారీగా టీచర్లు శిక్షణ పొందారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చిన అనంతరం 13న విధుల్లో చేరారు. కొంత తర్జనభర్జనల అనంతరం శిక్షణ తీసుకున్న రోజు నుంచి విధుల్లో చేరినట్లుగానే భావించాల్సి ఉంది. తొలుత 3వ తేదీనా లేక 13వ తేదీనా అనే విషయం తేల్చడానికి సమయం పట్టింది. సర్వీస్ రిజిస్టర్(ఎస్ఆర్)లో జాయినింగ్ తేదీ నిర్థారిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యంతో వేతనాల చెల్లింపులో కూడా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తప్పని ఎదురుచూపులు కొత్త ఉపాధ్యాయులు వేతనం పొందాలంటే ఐడీ, ప్రాన్ తప్పనిసరి కావడంతో వాటిని క్రియేట్ చేయాల్సి ఉంది. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వారికి డీడీఓలు వేతన బిల్లులు తయారు చేసి మళ్లీ ట్రెజరీకి పంపుతారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్ ట్రైనింగ్ పొందిన కొత్త టీచర్లు అదే నెల 13న విధుల్లో చేరారు. వారందరికీ మూడో తేదీ నుంచి వేతనాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విధుల్లో చేరే సమయానికి ట్రెజరీ ఐడీ, ప్రాన్ కేటాయించక పోవడంతో అక్టోబర్ నెల జీతం పొందలేకపోయారు. నవంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో పొందుపరచే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి కూడా ట్రెజరీ ఐడీ, ప్రాన్ పూర్తి స్థాయిలో కేటాయింపు కాలేదు. ఈ నెల 15వ తేదీ నాటికి కొంతమందికి మాత్రం ఆయా నంబర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్టోబర్ నెల బకాయి బిల్లు తీసుకుంటేనే కానీ నవంబర్ నెల రెగ్యులర్ బిల్లు చేయడానికి వీలు కాదు. దీంతో, డిసెంబర్ 1వ తేదీన తొలి వేతనం పొందే అవకాశం కొత్త టీచర్లకు చిక్కలేదు. డిసెంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో అరియర్ బిల్లులు సబ్మిట్ చేస్తే డిసెంబర్ 15 తర్వాత రెండు నెలల వేతనాలూ పొందే అవకాశముంటుంది. కొత్త ఉద్యోగం మొదటి జీతం కళ్ల చూద్దామంటే ట్రెజరీలో ఏర్పడ్డ సాంకేతిక ఇబ్బందులతో ఆ కల దూరమవుతోందని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చుప్పనాతి శూర్పణఖ, సైంధవుడిలా అడ్డుపడ్డాడు, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు– తదితర జాతీయాలు మన జీవితాల్లోకి చొచ్చుకుని పోయాయని, రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయని ప్రవచన విరించి సామవేద షణ్ముఖశర్మ అన్నారు. వేదవ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం హిందూ సమాజంలో ఆయన మలి రోజు ప్రసంగం చేశారు. ‘‘పుస్తకాలు జీవితాన్ని నడుపుతాయని ప్రముఖ పండితులు జఠావల్లభుల పురుషోత్తం అన్నారు. అయితే, అసత్యం మీద ఆధారపడిన గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోతాయి. సత్యాన్ని ప్రతిష్ట చేసే కావ్యాలు కాలానికి ఎదురొడ్డి నిలిచిపోతాయి. రామాయణ, భారత, భాగవతాలు ఇటువంటివే’’నని సామవేదం అన్నారు. మహాభారత విశిష్టతను వివరిస్తూ.. కావ్యాలకు పుట్టినిల్లు మహాభారతమని అన్నారు. హిమవత్పర్వత ప్రాంతంలో ఒక గుహలో, ఆచమనాది ప్రక్రియలతో దేహాన్ని శుద్ధి చేసుకుని, శాంతచిత్తంతో ఆశీనుడైన వ్యాస మహర్షికి సత్యం గోచరించిందని, అదే మహాభారతమైందని చెప్పారు. గ్రంథాన్ని విస్తారంగా చెప్పే ముందు అందులో కథనాన్ని సంక్షిప్తంగా చెప్పడం ప్రాచీన రుషుల నైజమని, అనుక్రమణిక పర్వం ఈ కోవకు చెందుతుందని అన్నారు. వ్యాసప్రోక్తమైన భారతం మానవులతోనే కాకుండా రుషులు, దేవతలతో సైతం పూజలందుకుంటోందని, ముల్లోకాల్లోని జ్ఞానమంతా భారతంలో ప్రతిష్టితమైనదని వివరించారు. మన దేశంలో నేడు చూస్తున్న పెక్కు నగరాలు, ప్రాంతాలు, వీటి ఆనవాళ్లు మహాభారతంలో కనబడతాయని, కొద్ది కాలం క్రితం తెలుగునాట జనమేజయుని శాసనాలు లభ్యమయ్యాయని అన్నారు. మనకు అసలైన, సిసలైన చరిత్ర చదువుకునే అలవాటు తక్కువని భారతంలో మానవులు, దేవతలు కూడా పాత్రలేనని, దీనిని నాస్తికవాదులు అంత సులభంగా అంగీకరించరని అన్నారు. అంతే కాకుండా రామాయణాన్ని రచించిన వాల్మీకి, భారతాన్ని అందించిన వ్యాస మహర్షి ఆయా గ్రంథాల్లో పాత్రలుగా కనపడతారని గుర్తు చేశారు. భారతీయ గ్రంథాలు దేవతలు, రుషులు, చక్రవర్తుల మీద ఆధారపడి ఉంటాయంటూ ఒక విదేశీ చరిత్రకారుడు అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. ‘‘భారతంలో పరలోక గమన వృత్తాంతాలు కనపడతాయి. అర్జునుడు దేవలోకానికి వెళ్లడం.. దుర్యోధనుడు పాతాళానికి వెళ్లడం.. త్రిలోక సంచారులైన నారదాది మహర్షులు భూలోకానికి వచ్చిపోతూ ఉండటం భారతంలో కనిపిస్తుంది. అయితే దీనిని కాల్పనిక సాహిత్యంగా భావించరాదు. సాంకేతికంగా ఇప్పుడు మనం సాధించిన ప్రగతిని నాడు తపస్సు ద్వారా మునులు సాధించారు. ఇప్పుడు యంత్రాలు సాధిస్తున్న విజయాలు అప్పుడు మంత్రాలతో సాధ్యమయ్యాయి’’ అని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు కృష్ణస్మరణ పూర్వకమైన శ్లోకంతో సభకు శుభారంభం పలికారు. -
మహిళా విద్యకుఫూలే మార్గదర్శకుడు
రాజమహేంద్రవరం రూరల్: దేశంలో మహిళా విద్యకు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మార్గదర్శకుడని, బాలికల విద్య కోసం జీవితాంతం పాటు పడ్డారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఫూలే వర్ధంతి శుక్రవారం నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి వేణు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని అన్నారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించి, సామాజికాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ నేత చెల్లుబోయిన నరేన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపల్లి దుర్గారావు, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ఫణికుమార్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాప రాజా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. సీనియర్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీనియర్ టీచర్లను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి నేతృత్వంలో యూటీఎఫ్ నాయకులు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి స్థానిక పలుకు కేంద్రం వద్ద శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. విద్య హక్కు చట్టం 23(2) నిబంధన ప్రకారం ఉపాధ్యాయులంతా విధిగా టెట్ పాసవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందన్నారు. అయితే, 2011 నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి మాత్రమే టెట్ విధానం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికే 20 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశారని, ఇప్పుడు టెట్ రాయాలనే నిబంధన వలన వారు చాలా ఇబ్బంది పడతారని వివరించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, అలాగే పార్లమెంటు, ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరారు. విద్యా హక్కు చట్టంలోని 23(2) నిబంధన సవరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) కూడా జాతీయ స్థాయిలో ఎంపీలకు విజ్ఞాపన చేస్తోందని చెప్పారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, ఈ విషయంపై చర్చించి, పార్టీ నిర్ణయం మేరకు తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి ఈవీఎస్ఆర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి చిలుకూరి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు. -
● కార్డు లేదంటారు.. కనికరించరు
ఈ వృద్ధుడి పేరు పిల్లకత్తుల సుబ్బారావు. వయసు 84 సంవత్సరాలు. ఊరు నల్లజర్ల మండలం ముసుళ్ళుగుంట. ఒకప్పుడు పదెకరాల రైతు. ఆస్తి పిల్లలకు పంచగా ఆయన దగ్గర ఇప్పుడున్నది కేవలం 97 సెంట్ల భూమి. మూడేళ్ల క్రితం భార్య మరణించింది. పిల్లలు ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. సుబ్బారావు ప్రస్తుతం ఒంటరి వృద్ధుడు. ఐదు నెలల క్రితం ఆయన రేషన్ కార్డును ఏలినవారు రద్దు చేశారు. దీంతో, బియ్యం, ఇతర నిత్యావసర సరకులు అందక ఆయన నానా ఇక్కట్లూ పడుతున్నారు. తన పేరిట ఉన్న భూమికి కనీసం అన్నదాత సుఖీభవ సాయం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు. రేషన్ కార్డు కోసం రెవెన్యూ కార్యాలయానికి ఇప్పటికి సుమారు ఇరవైసార్లు వెళ్లారు. అయినా సరైన సమాధానం లేదు. సమస్య పరిష్కరించుకునేందుకు నానా అగచాట్లూ పడి రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తన రేషన్ కార్డు కొనసాగుతోందని అక్కడి వారు చెప్పారు. తీరా సొంతూరు వచ్చి చూస్తే కార్డు రద్దయిపోయింది పొమ్మంటున్నారు. ఏం చేయాలో తెలీక సుబ్బారావు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రెవెన్యూ కార్యాలయానికి గురువారం వెళ్లి అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో తనను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లజర్ల సెంటర్లో నిరాహార దీక్ష చేస్తేనైనా అధికారులు స్పందిస్తారేమోనని ఆవేదనతో అన్నారు. – నల్లజర్ల -
మొదటి నెల వేతనానికి ఇబ్బంది లేదు
కొత్త టీచర్లకు ఎంప్లాయీ ఐడీతో మొదటి నెల వేతనం ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండో నెల వేతనం మంజూరుకు మాత్రం ప్రాన్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం వెంటనే ఆ నంబర్లు కేటాయిస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుంటే వెంటనే నంబర్లు కేటాయిస్తున్నాం. – బి.రామనాథం, జిల్లా ట్రెజరీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంకేతిక ఇబ్బందులు తొలగించాలి కొత్తగా ఎంపికైన టీచర్లకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ట్రెజరీ అధికారులు సాంకేతిక ఇబ్బందులను తొలగించి వెంటనే వేతనాల చెల్లింపునకు చర్యలు చేపట్టాలి. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు సకాలంలో స్పందించాలి ఉపాధ్యాయుల బిల్లుల చెల్లింపు విషయంలో ట్రెజరీ అధికారులు సకాలంలో స్పందించాలి. వారు సీఎఫ్ఎంఎస్, ప్రాన్ కేటాయింపులో అనవసరమైన కొర్రీలు వేయకుండా చూడాలి. సకాలంలో బిల్లులు పాస్ చేసి కొత్త ఉపాధ్యాయులు తొలి వేతనం తీసుకుని ఆనందం పొందేలా సహకరించాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న ముఖ్య అతిథి డీఈఓ రమేష్ ● పోటీలను ప్రారంభించిన డీఈఓ రమేష్ ● చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనని విద్యార్థులకు పిలుపు ● పది జిల్లాల నుంచి 400 మంది హాజరు ● రేపటి వరకు పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అంతర్ జిల్లాల జిమ్నాస్టిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉపవిద్యాశాఖ అధికారి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు క్రీడా సామగ్రిని అందిస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వాటిని అందించారని, త్వరలో కాకినాడ జిల్లాలోని పాఠశాలలకు ఆ సామగ్రి అందిస్తామన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ఐ వారు ఈ ఏడాది 5 రాష్ట్ర స్థాయి మీట్లు తీసుకున్నారని, ఇది నాలుగో మీట్ అని, పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీనులను అభినందించారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు కూడా మండల స్థాయి నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని, అవి శనివారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. డీవైఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ గెలుపు ఓటముల కన్నా క్రీడాస్ఫూర్తి ప్రధానం అన్నారు. ఎస్జీఎఫ్ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు జరిగే ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారన్నారు. డీఎస్డీఓ సతీష్కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో జాతీయస్థాయి ప్రమాణాలతో జిమ్నాజియం ఉందని, వచ్చే ఏడాది జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ జిమ్నాస్టిక్స్ పోటీలను ఏదో ఒక విభాగంలో కాకినాడకు కేటాయించేలా చూడాలని డీఈఓను కోరారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జిమ్నాస్టిక్స్ సంఘ ప్రతినిధి విఠల్, కాకినాడ రూరల్ ఎంఈఓ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, మాచరరావు, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్ప్రకాష్, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ జెండాను డీఈఓ రమేష్, ఎస్జీఎఫ్ఐ జెండాను డీఎస్డీఓ ఆవిష్కరించారు. వివిధ జిల్లాల క్రీడాకారులు కవాతు చేసి డీఈఓకు గౌరవ వందనం చేశారు. పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి బెలూన్లు ఎగురవేశారు. డీఈఓ క్రీడాజ్యోతిని వెలిగించారు. సెయింట్ అన్స్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థుల యోగాసనాలు ఆహూతులను ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్ సంఘ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, పీడీలు ప్రసాద్, హరిబాబు, సూరిబాబు, సురేష్రాజు, దీప్తి ఎస్తేరు, మౌని, త్రిపుల, దుర్గ, డీఎస్ఏ జిమ్నాస్టిక్స్ కోచ్ సురేష్, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఎంపిక కమిటీ సభ్యులు శరత్చంద్ర, జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బోల్ట్ తొలగించమంటే బ్లేడు వదిలేసి కుట్టేశారు!
● ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం ● అదేమని ప్రశ్నిస్తే దాడి చేశారన్న బాధితుడు తుని: స్థానిక ఏరియా ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరి రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వ్యక్తి కాలులో అమర్చిన ఐరన్రాడ్డు బోల్టు తొలగించి సిజేరియన్ బ్లేడును కాలులోనే ఉంచి కుట్టు వేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం ఎస్.అన్నవరం పంచాయతీ రామకృష్ణానగరానికి చెందిన వ్యక్తి ఏడాదిన్నర క్రితం కాలుకు గాయం కావడంతో ఏరియా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గాయం బలమైంది కావడంతో అప్పట్లో ఐరన్రాడ్డు సైతం అమర్చారు. ఐరన్ రాడ్డు బోల్టును తొలగిస్తే త్వరగా సర్దుకోవచ్చు అనే ఆలోచనతో శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రిలో సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్డు బోల్టు తొలగించారు. అయితే కాలులో సిజేరియన్ బ్లేడును ఒకటి ఉంచేసి కుట్లు వేసేశారు. ఇలా చేసారేంటని బాధితుడు సిబ్బందిని ప్రశ్నిస్తే దాడికి యత్నించారని రోగి వాపోయారు. -
నరసన్న ఆదాయం రూ.47.49 లక్షలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం దేవస్థానం అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులో స్వామి వారికి మొత్తం రూ.47,48,862 ఆదాయం సమకూరింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ 78 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు సమక్షంలో దేవస్థానం సిబ్బంది లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో ప్రధాన హుండీల ద్వారా రూ.46,61,265, గుర్రాలక్క అమ్మవారి హుండీ ద్వారా రూ.19,774 ఆదాయం, అన్నదానం హుండీల ద్వారా రూ.67,823 ఆదాయం లభించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అలాగే రెండు గ్రాముల బంగారం, 23 గ్రాముల వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ వచ్చినట్టు ఏసీ పేర్కొన్నారు. సర్పంచ్ కొండా జాన్బాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు, సేవకులు పాల్గొన్నారు. 37 బడి బస్సుల తనిఖీ అమలాపురం రూరల్: రహదారి భద్రత ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఒక ప్రవేట్ పాఠశాలకు చెందిన 37 బస్సులను తనిఖీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తనిఖీలు నిర్వహించిన బస్సుల్లో చిన్నపాటి సాంకేతిక లోపాలను గుర్తించామని ఈ లోపాలను వారం రోజుల్లోగా సరిచేయించుకోవాలని సూచించారు. అక్కడికక్కడే స్కూల్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశామని డీటీఓ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు డిసెంబర్ 4 వరకూ కొనసాగుతాయని, ఇందుకు ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ పాల్గొన్నారు. -
ఇద్దరు విద్యార్థుల వివాదం
పాఠశాల గేటుకు తాళం వేసిన విద్యార్థి తండ్రి కొత్తపల్లి: పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన వివాదంలో ఒక విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని వేసిన తాళం తీయించారు. వివరాల్లోకి వెళితే స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పది, ఆరో తరగతి విద్యార్థుల మధ్య నమస్కారం విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో 6వ తరగతి విద్యార్థి జరిగిన వివాదాన్ని తన తండ్రికి చెప్పాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తండ్రి పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశాడు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తాళం వేసిన వ్యక్తిని తీసుకువచ్చి తాళం తీయించారు. పాఠశాలలో సమస్య ఏర్పడినపుడు హెచ్ఎంలకు ఫిర్యాదు చేయాలేకానీ ఇలా తాళం వేయకూడదని హెచ్చరించి విద్యార్థి తండ్రిని మందలించారు. దీనిపై ఎంఈఓ వేణుగోపాల్ను వివరణ కోరగా పాఠశాల హెచ్ఎం సెలవులో ఉన్నారని దీనికి సంబంధించి సరైన వివరాలు లేవని తెలిపారు. విద్యార్థుల వివాదంపై శనివారం విచారణ నిర్వహిస్తామన్నారు. -
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వాడపల్లి ఖ్యాతి
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఖ్యాతి దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. రోజూ ముఖ్యంగా శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ అత్యధిక సంఖ్యలో భక్తులు వాడపల్లికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ‘ఏడు వారాల వెంకన్న దర్శనం–ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో ‘ఏడు వారాల వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం తిరుమల (పెద్ద తిరుపతి) తరహాలో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం నుంచి శుక్రవారం 16 మంది సభ్యుల భక్త బృందం వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ ఓం నమో వేంకటేశాయనమః అని నమస్కరిస్తూ తాము అందరం ఒడిశా నుంచి వచ్చామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులమని, దేశ వ్యాప్తంగా అనేక పుణ్య క్షేత్రాలు, ఆయా దేవతామూర్తుల గురించి తెలుసు.. కానీ ఈ వాడపల్లి క్షేత్రం, ఈ దేవుడి విశిష్టత గురించి ఇటీవలే తెలిసిందన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటామని వారన్నారు. -
పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించాలి
● సినీ గేయరచయిత భాస్కరభట్ల ● ఉత్సాహంగా ‘కేరింతలు’ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ గేయ రచయిత, కవి భాస్కరభట్ల రవికుమార్ అన్నారు. శ్రీ షిర్డీ సాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో కేరింతలు పేరుతో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు విద్య ఒక్కటే కొలమానం కాదని, వారిలో విద్యతో పాటు ఏ ఇతర రంగాల్లో ఆసక్తి ఉందో గమనించి, దానికి అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. మరో ముఖ్య అతిథి 9వ అదనపు జిల్లా సివిల్ జడ్జి మాధురి మద్దాలి మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలకు కొంత సమయం కేటాయిస్తే బంధాలు బలపడతాయన్నారు. పిల్లలు చెప్పిన విషయాలను వింటూ, మంచి చెడులను వారికి తెలియజేయాలన్నారు. ముందుగా శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ పాలేశ్వరరావు సతీమణి నాగమణి చేతుల మీదుగా అతిథుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, సివిల్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీలేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలిక అదృశ్యం
పెరవలి: మండలంలోని ఖండవల్లి గ్రామానికి చెందిన ఉమ్మిడి గంగధరరావు చిన్న కుమార్తె రమశ్రీ సత్య నాగలక్ష్మి (17) ఈ నెల 26న అదృశ్యమైంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక ఆ రోజు ఉదయం నుంచి ఇంట్లోనే ఉందని, మధ్యాహ్నం 2 గంటలకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96642కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. డిసెంబర్లో ‘నన్నయ’లో బెస్ట్ ఫిజిక్ పోటీలు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్పోర్ట్సు బోర్డు ఆధ్వర్యంలో డిసెంబర్ 27 నుంచి 30 వరకూ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్ షిప్ జరగనుందని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమ బ్రోచర్ను గురువారం విడుదల చేశారు. పోటీలకు హాజరయ్యే వారందరూ 15 లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ ఎంవీఎస్ఎస్ మూర్తి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇద్దరు జీవిత ఖైదీల విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ మేరకు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ గురువారం ఆ వివరాలు తెలిపారు. బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన కటికిరెడ్డి నాగేశ్వరరావు హత్య కేసులో 2011 మార్చిలో జైలుకు వచ్చాడు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చంద్రాలకు చెందిన మద్దూరి సువర్ణరాజు భార్యను చంపిన కేసులో 2010 లో జైలుకు వచ్చారు. వీరిని ప్రభుత్వ జీవోను అనుసరించి విడుదల చేశారు. -
‘నా మనవడు తీసుకువెళతాడు’
● రాజానగరం సాయిబాబా గుడిలో వృద్ధురాలి ఎదురుచూపులు ● ఎవ్వరూ రాకపోవడంతో ఓల్డేజీ హోమ్కు తరలింపు రాజానగరం: ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు తీసుకువచ్చారో తెలియదు గానీ సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు రాజానగరంలోని సాయిబాబా గుడి వద్ద గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన వారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తన మనవడు వస్తాడని, తనను తీసుకువెళతాడంటూ ఆమె అమాయకంగా చెప్పడం స్థానికులను కలచివేసింది. తన పేరు ఆళ్ల వెంకాయమ్మ అని చెప్పింది. ఊరు పేరు అడిగితే ఒకసారి కట్టమూరు, మరోసారి వడ్లమూరు అని బదులిచ్చింది. అలాగే రాజమహేంద్రవరం నుంచి వచ్చానని కూడా పొంతన లేని విధంగా చెబుతూ వచ్చింది. వయోభారం వలన జ్ఞాపక శక్తి మందగించినట్టుగా ఉన్న ఆమె.. ‘నా మనవడు సత్తిబాబు వస్తాడు, నన్ను తీసుకువెళతాడు’ అని అంటూనే ఎదురు చూసింది. కానీ సాయంత్రం అయినా ఆమె కోసం ఎవరూ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో సమీపంలోని ఒక ఓల్డేజ్ హోమ్లో ఆమెను చేర్పించారు. -
పుట్టిన రోజు వేడుకలో వివాదం
పిఠాపురం: పుట్టిన రోజు వేడుక ఏర్పాట్ల సందర్భంగా చెలరేగిన వివాదంలో ఒక వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీమంతుల దయ మనవరాలు యశస్విని పుట్టిన రోజు సందర్భంగా గురువారం రోడ్డుకు అడ్డంగా బల్లలు పెట్టి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అదే గ్రామానికి చెందిన వెంపల సూరిబాబు పెద్ద కోడలు కృష్ణవేణి అటుగా వెళుతూ దారికి అడ్డుగా ఉన్న బల్లను కొంచెం పక్కగా పెట్టడంతో ఆ బల్ల పడిపోయింది. దీంతో కావాలనే బల్లను తోసేశారంటూ కృష్ణవేణి, ఆమె మావ వెంపల సూరిబాబుపై శ్రీమంతుల దయ కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. దీంతో వారి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ గొడవలో వెంపల సూరిబాబు (59) కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని పిఠాపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకు వెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి. సూరిబాబును దయ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసి ఆయన మృతికి కారణమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి సంఘంగా అయోధ్య సొసైటీ రాజమహేంద్రవరం సిటీ: ఆర్థిక రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న నల్లమిల్లి మధుసూదనరెడ్డి రాష్ట్ర స్థాయి సంఘంగా అయోధ్య సొసైటీ స్థాపించడం అభినందనీయమని జిల్లా సహకార ఆడిట్ అధికారి ఎం.జగన్నాథరెడ్డి అన్నారు. కంబాలచెరువులోని రామచంద్రరావుపేటలో ఏర్పాటు చేసిన అయోధ్య సొసైటీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ఈ సంఘం చేయూతనందిస్తుందన్నారు. చైర్మన్ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అయోధ్య సొసైటీ సభ్యుల ఆర్థిక అవసరాలకు సకాలంలో రుణాలు అందించి, వారి అభ్యున్నతికి సొసైటీ సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో యర్రా వేణుగోపాల రాయుడు, కొల్లేపల్లి శేషయ్య, తేతల ఆనందరెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, అయోధ్య సీఈఓ బి.చిరంజీవులు, సిబ్బంది పాల్గొన్నారు. కుప్పకూలి ఒకరి మృతి -
క్రికెట్ ట్రోఫీకి శ్రీప్రకాష్ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ విజయ్ మర్పంట్ క్రికెట్ ట్రోఫీకి అండర్–16 విభాగంలో కాకినాడ శ్రీప్రకాష్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ గురువారం తెలిపారు. పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న జి.లక్ష్మీగౌతమ్, 10వ తరగతి విద్యార్థి కె.తమన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. భవిష్యత్తులో తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, కోచ్ దుర్గాప్రసాద్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరిష్, కార్యదర్శి నక్కా వెంకటేష్, శ్రీప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ సమీరా అభినందించి, మెమెంటోలతో సత్కరించారు. -
గృహ నిర్మాణ పనుల అడ్డగింపు
కాజులూరు: గొల్లపాలెం శివాలయం సమీపంలోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులను పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగడంతో గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గృహ నిర్మాణాలు నిలుపుదల చేయాలని హెచ్చరించారు. దానికి లబ్ధిదారులు అంగీకరించకపోవడంతో తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్సై ఎం. మోహన్కుమార్ రంగప్రవేశం చేసి, లబ్ధిదారులను శాంతిపచేయటంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామంలోని సర్వే నెంబరు 113/2లో పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు మంజూరు చేశారు. లబ్ధిదారులు ఇటీవల తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపడుతుండగా పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది అడ్డుపడ్డారు. దీనిపై బీఎస్సీ, పలు కుల సంఘాల నాయకులు కల్పించుకుని లబ్ధిదారులకు పట్టాలు ఉన్నప్పటికీ, పలువురు స్థానిక నాయకులు రాజకీయ పలుకుబడి ని ఉపయోగించి ఆ భూమి ప్రభుత్వ స్థలమని స్థానిక పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలు పెట్టించి పనులు అడ్డుకుంటున్నారని ఆందోళనలు చేపట్టారు. తాజాగా గురువారం ఆ గ్రామ సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక, బీఎస్పీ నాయకులు మాత సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాటి పుల్లారావు, పండు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంచా యతీ, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారికి లబ్ధిదారులు ఎదురు తిరగటంతో వివాదం తలెత్తింది. కొద్దిసేపటికి తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి ఆ భూమి ప్రభుత్వ స్థలమని, డూప్లికేట్ పట్టాలతో కొందరు ఆక్రమించుకుంటున్నారని తమ ఫిర్యాదులు వచ్చాయన్నారు. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి సోమవారం కాజులూరు తహశీల్దార్ కార్యాలయానికి వస్తే పట్టాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. -
స్వామి రథోత్సవం.. అంగరంగ వైభవం
● బిక్కవోలులో విహరించిన సుబ్రహ్మణ్యస్వామి ● భారీగా తరలివచ్చిన భక్తులు బిక్కవోలు: సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాల్లో భాగంగా గురువారం బిక్కవోలులో కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీపై ఆలయ ప్రాంగణంలో ఉరేగించారు. అనంతరం రథంపై స్వామిని ఆశీనులు చేసి రథోత్సవం నిర్వహించారు. బ్యాండ్ మేళాలు, కోలాటాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, కేరళ వాయ్యిదాలు, భారీ భక్త జన సందోహం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రథోత్సవాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లె శ్రీనివాసరెడ్డి (వాసు) ప్రారంభించారు. ఆలయం నుంచి జి.మామిడాడ రోడ్డు మీదుగా వెళ్లి తిరిగి గ్రామంలోని ప్రధాన రోడ్ల మీదుగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సుమారు వంద మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యుడు పాలచర్ల చిట్టిబాబు చౌదరి, ఆలయం ఈవో రామలింగ భాస్కర్, సీఐ సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వలస జీవుల సాపాట్లు
రాయవరం: ఆకలికి రుచి తెలియదు, నిద్ర సుఖమెరగదు అన్నది సామెత. ఈ సామెత శ్రామిక జీవులకు అక్షరాలా సరిపోతుంది. కనీసం నిలువ నీడ లేని ఆ కుటుంబాలు ఉపాధిని వెదుక్కుంటూ జిల్లాకు వలస వచ్చాయి. కుటుంబ పోషణలో భాగంగా రాష్ట్రాలు దాటి జీవనం సాగిస్తున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు వ్యవసాయ పరికరాల తయారీ దారులు జిల్లాకు తరలి వచ్చారు. ఇక్కడే గ్రామాల్లో ఉంటూ, పరికరాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సుమారు వంద కుటుంబాలు వ్యవసాయ పనుల్లో నిత్యం ఉపయోగించే కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం తదితర పనిముట్లతో పాటు ఇంట్లో ఉపయోగించే కత్తి పీటలను మధ్యప్రదేశ్ వాసులు తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని సాగర్, భోపాల్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు జిల్లాకు తరలివచ్చాయి. గ్రామాల్లో రహదారి పక్కనే తాత్కాలికంగా నివాసముంటూ, అక్కడే వ్యవసాయ పరికరాలు తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నాయి. ఆయా వస్తువులకు ఉన్న డిమాండ్ను బట్టి రెండు, మూడు రోజులు గ్రామంలో ఉంటాయి. అనంతరం మరో గ్రామానికి పయనమవుతాయి. కళ్లెదుటే తయారీ మధ్యప్రదేశ్ వాసులు తమతో తీసుకువచ్చిన ఇనుప రాడ్లను రైతుల ముందే కొలిమిలో కాల్చి, వారు కోరిన విధంగా పనిముట్లు తయారు చేస్తారు. ఒక్కో పనిముట్టును దాని బరువు ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకూ విక్రయిస్తారు. షాపుల్లో ఇటువంటి వస్తువులు లభించినా, తమ కళ్ల ఎదురుగానే తయారు చేసే పనిముట్లను కొనుగోలుకు మన రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీరందరూ ఏడాదిలో పని నెలల పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పరికరాలు తయారీ కోసం సంచార జీవితం గడుపుతారు. ప్రస్తుతం నవంబర్ నుంచి మన రాష్ట్రంలో తిరుగుతున్నారు. తాము తయారు చేసే పరికరాలు మన్నికతో ఉంటాయని, అందుకే తమ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారని శివరాజ్సింగ్ అనే కార్మికుడు తెలిపాడు. మగవారితో సమానంగా.. వ్యవసాయ పరికరాల తయారీలో పురుషులతో సమానంగా మహిళలు, పెద్దవారితో సమానంగా బాలలు చెమటోడుస్తున్నారు. ఇనుమును కటింగ్ చేసే సమయంలో మగవారితో సమానంగా సమ్మెట దెబ్బలు వేస్తున్నారు. కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తూ పురుషులకు తామేమి తీసిపోమని నిరూపిస్తున్నారు. చదువుకు పిల్లలు దూరం పదేళ్ల వయసున్న చిన్నారులు కూడా సమ్మెట దెబ్బలు వేస్తూ పరికరాల తయారీలో తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు. నిత్యం తల్లిదండ్రులతో పాటే వలస జీవితం సాగించే చిన్నారులు పూర్తిగా చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు వెళ్లడం లేదా అని ‘సాక్షి’ ప్రశ్నిస్తే..ముందు పొట్ట గడవాలి కదా అని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తామని, తమకు నిలువ నీడలేదని, అటువంటప్పుడు చదువు ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి రాక వ్యవసాయ పరికరాల తయారీ పనిలో మగవారికి సాయంగా మహిళలు, పిల్లలు మధ్యప్రదేశ్ వాసుల అవస్థలు పొట్టకూటి కోసం పొట్టకూటి కోసం ప్రతి ఏటా ఇలా వస్తున్నాం. చలైనా, ఎండైనా సాపాటు కోసం పాట్లు తప్పవు. రహదారి పక్కనే జీవిస్తున్న సమయంలో ప్రమాదాలకు కూడా గురవుతుంటాం. – రాజేష్, వ్యవసాయ పనిముట్ల తయారీ దారుడు, భోపాల్ ఏటా వస్తున్నారు వ్యవసాయ పనిముట్లు తయారీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఏటా మన ప్రాంతానికి వస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరు తయారు చేసే పనిముట్లకు డిమాండ్ ఏర్పడింది. – చేవా సత్యనారాయణ, రైతు, లొల్ల, రాయవరం మండలం. -
సమగ్ర శాసీ్త్రయ కులగణన చేపట్టాలి
యానాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. యానాం గీతా మందిరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రతినిధుల సమావేశం మల్లాడి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారథన్ మహారాజు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్లు మాదిరిగా ఏపీలోనూ స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోని లోపాలను సరిదిద్ది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. జాతీయస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేపడతామని, త్వరలో ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గారమేష్, పెస్పింగి ఆదినారాయణ, గూడూరి వెంకటేశ్వరరావు, బీసీ రమణ, కర్రి చిట్టిబాబు, ఘంటసాల వెంకటలక్ష్మి, కడలి ఈశ్వరి, చొల్లంగి వేణుగోపాల్, మన్నే నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వీడని కాట్రగడ్డ హత్య కేసు మిస్టరీ
నల్లజర్ల: మండలంలోని పుల్లలపాడు గ్రామానికి చెందిన రైతు, డ్యాక్యుమెంట్ రైటర్ కాట్రగడ్డ ప్రభాకరావు (64) హత్య కేసు మిస్టరీ నేటికీ వీడలేదు. ఆయనను 2023 నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటలు దాటాక ఇంటి వద్దే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పిస్టల్తో కాల్చి చంపారు. రెండు బుల్లెట్లు చాతీలో దిగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించారు. కానీ ఇంత వరకూ ఆ కేసు మిస్టరీ వీడలేదు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గన్ కల్చర్ పల్లె ప్రాంతాలకు విస్తరించిందనటానికి పుల్లలపాడు సంఘటనే అద్దం పడుతోంది. కాట్రగడ్డ స్వతహాగానే 20 ఎకరాల భూస్వామి. అలాగే డాక్యుమెంట్లు రాయడమే కాకుండా పరిసర గ్రామాల వారి డాక్యుమెంట్లు రాసేవారు. సమాచార హక్కు చట్టమంటూ రెవెన్యూ అధికారులను పలుమార్లు లోకాయుక్తకు పిలిపించేవారు. ఇలా చాలామందితో ఆయనకు తగాదాలు ఉన్నాయి. ఆయన హత్య జరిగి రెండేళ్లు గడిచినా ఈ కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీనిపై నల్లజర్ల సీఐ రాంబాబును వివరణ కోరగా ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోందన్నారు. -
మస్కట్ నుంచి స్వదేశానికి..
అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ దేశానికి వెళ్లి, అక్కడ ఐడీ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలానికి చెందిన తెడ్లపు మల్లమ్మ, తాతారావు భార్యభర్తలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మల్లమ్మ.. ఏజెంట్ ద్వారా 2025 ఫిబ్రవరిలో మస్కట్కు వెళ్లింది. అక్కడ మూడు నెలలు పని చేసినా ఆమెకు ఆ దేశ ఐడీ కార్డు ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని మల్లమ్మను మస్కట్లోని హవాలా ఆఫీస్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. అక్కడి ఆఫీస్ వారు రూ.2 లక్షలు చెల్లిస్తే గానీ ఇంటికి పంపబోమని స్పష్టం చేశారు. మల్లమ్మ కుటుంబం కొంత మొత్తం చెల్లించినప్పటికీ పూర్తి మొత్తం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో పరిచయస్తుల సూచన మేరకు తాతారావు అమలాపురం కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణ చర్యలు తీసుకుని ఆమెను సురక్షితంగా ఇండియా చేర్చాలని కేసీఎంను ఆదేశించారు. మస్కట్ తెలుగు అసోసియేషన్ సభ్యురాలు ఇంటి రాజ్యలక్షి, ఏజెంట్తో కేసీఎం బృందం సంప్రదింపులు జరిపింది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి మల్లమ్మను విజయవంతంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్రం నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తెలిపారు.కేసీఎం చొరవతో క్షేమంగా చేరిన మల్లమ్మ -
చంద్రబాబు ప్రభుత్వంలో దిగజారిన పోలీస్ పనితీరు
దేవరపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ శాఖ పనితీరు దిగజారి పోయిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం మండలం గోపవరంలో గురువారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోలీస్ శాఖ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం ప్రథమ స్థానం ప్రకటించి 83 అవార్డులు అందజేసినట్టు ఆమె తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో 16 నెలల పాలనలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 36 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ర్యాంకింగ్ 36 అని పేర్కొన్నారు. దీని బట్టి రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా దిగజారిందో అర్థమవుతుందన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖను వినియోగించడం లేదని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై బనాయించిన కేసులతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టడం తప్ప ఎక్కడా శాంతి భద్రతలకు వినియోగించట్లేదని ఆమె ఆరోపించారు. ఇంత జరుగుతున్నా హోంశాఖ మంత్రి స్పందించే పరిస్థితి లేదన్నారు. దిశా యాప్ను ఉపయోగించుకొని మహిళలు, యువతులు, విదేశాల్లో ఉన్న మహిళలు కూడా పోలీస్ల సహాయంతో ఇబ్బందుల నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు చేసి హత్యలు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే టీడీపీ, జనసేన నాయకులేన ని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? లేక చంద్రబాబు ప్రభుత్వం సొంత రాజ్యాంగ ప్రభుత్వంలో బతుకున్నామా? అనేది తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు గాని మేలు చేసిందేమి లేదని, త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సాలి వేణు, నియోజకవర్గ అధ్యక్షుడు కాకులపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత -
మూలగ్రంథాలే సర్వదా ప్రామాణికం
● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ● సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ఆరంభం రాజమహేంద్రవరం రూరల్: మూలగ్రంథాలే మనకు సర్వదా ప్రామాణికం, ధర్మాధర్మాల విచక్షణలో, వివేచనలో మూలగ్రంఽథాలనే అధ్యయనం చేయాలి. అనువాద రచనలలో సాహితీ సౌరభాలు ఉండవచ్చును, కానీ మూలగ్రంథాలే మనకు శిరోధార్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హిందూ సమాజంలో వేదవ్యాస భారత ప్రచవన యజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ ‘సంప్రదాయ విరుద్ధమైన మాట నా నోట రాకూడదని జగన్మాతను ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు. భారతంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, శాంత్యనుశాసన పర్వాలపై గతంలో 18 రోజులు ప్రవచనాలు అందించానని, సంపూర్ణ భారతంపై హైదరాబాద్లో 18 రోజులు ప్రవచించానని అన్నారు. పండిత వరేణ్యులు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి తదితరులు భారతానికి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు. కొందరు కవులు, కొన్ని సినిమాల్లో అవగాహనా లోపంతో కువ్యాఖ్యానాలు చేశారు. వేద పురాణేతి హాసాలను కలిపి చూడాలి, అప్పుడే మనకు రామాయణ, భారత, భాగవతాదుల పట్ల సరి అయిన అవగాహన కలుగుతుందని సామవేదం అన్నారు. భారతంపై కొందరు కవుల రచనలలో అపోహలు, అపార్థాలతో పాటు నిందలు కూడా చోటు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ప్రపంచ వాజ్ఞ్మయంలో ‘ఇలియట్’, ఒడిస్సీ వంటి అతి పెద్ద గ్రంథాలు లేకపోలేదు. కానీ భారతానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇతర ప్రపంచ సాహిత్యంలో కానరావు. తెలుగు వారికి కవిత్రయ భారతంతో ఆత్మీయతానుబంధం ఉన్నదని సామవేదం అన్నారు. ప్రపంచ సాహిత్యంలో భారతం వంటి మరో గ్రంథం లేదని సామవేదం స్పష్టం చేశారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒంటి చేత్తో రామాయణ, భారత, భాగవతాలను రచించిన కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి రాజమహేంద్రనగరానికి చెందిన వారే. అలాగే, రామాయణ, భారత, భాగవతాలను రాజమహేంద్రవరంలో ప్రవచనం చేసిన ఖ్యాతి సామవేదానికే దక్కిందన్నారు. కంచి, శృంగేరీ పీఠాల నుంచి ఆశీస్సులను, మంత్రాక్షతలను ఆయన అందజేశారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ వేదవ్యాసమహర్షి మూడు సంవత్సరాల కాలంలో భారతాన్ని నిర్మించారని, అధర్మం ఏదో తెలుసుకుని దానిని వదిలిపెట్టాలని భారతం మనకు చెబుతోందన్నారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకరశర్మ, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఘన సమ్రాట్ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ, హిందు సమాజం ట్రస్టీ న్యాపతి సుబ్బారావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభను నిర్వహించారు. -
ఆరని కుంపట్లు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమిలో కయ్యాల కాపురం సాగుతోందా? జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య రేగిన అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదా? టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారా? ఆధిపత్యం కోసం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారా? తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనలో సైతం వైషమ్యాలు బహిర్గతమయ్యాయా? నిడదవోలులో జరిగిన మున్సిపల్ వజ్రోత్సవంలో టీడీపీ, జనసేన వర్గ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. రాజానగరంలో గరం.. గరం..! రాజానగరం నియోజకవర్గంలో స్వపక్ష శ్రేణులే టీ‘ఢీ’పీ అంటూ తలపడుతున్నాయి. పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ వర్గాల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎంతగా అంటే.. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై మరొక వర్గం విమర్శలు చేసుకోవడం.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం పరిపాటిగా మారుతోంది. ఈ పరిణామం ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పర్యటనలో కొట్లాట డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ కేంద్రంగా పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కుమారుడు పెందుర్తి అభిరామ్ విమానాశ్రయం టెర్మినల్ లోపలికి వెళ్లడం వివాదానికి కారణమైంది. అభిరామ్ను లోపలకు పంపి మమ్మల్నిను ఎందుకు పంపించడం లేదంటూ బొడ్డు వర్గీయులు ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసులను ప్రశ్నించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిందంటూ గొడవకు దిగారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఎదుటే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగారు. బొడ్డు వర్గీయులు పోలీసులను నిలదీయడం, పెందుర్తి అభిరామ్పై బూతుల దండకం అందుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. స్పందించని అధిష్టానం పెందుర్తి అభిరామ్, బొడ్డు వర్గీయుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు ఇప్పటికే టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. టీడీపీలోని కొందరు నేతలను టార్గెట్గా చేసుకుని అభిరామ్ వేధింపులకు పాల్పడుతున్నారని రాజానగరం, సీతానగరం, కోరుకొండకు చెందిన నాయకులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. అభిరామ్ తమను దూషించిన వీడియోలు సైతం అందించారు. దీని వెనుక బొడ్డు వర్గంలోని కొందరి పాత్ర ఉందని అభిరామ్ వర్గం భావిస్తోంది. ఈ విషయమై ఇరు వర్గాల నేతలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ఏడాది నుంచి విభేదాలు ఉన్నా.. టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినా.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. అభిరామ్ ఎంట్రీతో.. పెందుర్తి వెంకటేష్ను సీఎం పర్యటన వ్యవహారాల ఇన్చార్జిగా నియమించడంతో ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో యాక్టివ్గా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది. తనకు మంత్రి లోకేష్ అండదండలు ఉన్నాయని, తనకే దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్టు వినికిడి. పెందుర్తి వెంకటేష్ సైతం సీఎం చంద్రబాబు వద్ద తన కుమారుడి పదవికి కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ పరిణామం వెంకటరమణ చౌదరి వర్గంలో ఆగ్రహావేశాలు నింపుతోంది. కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏంటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. నిడవోలులో జనసేన, టీడీపీ నేతల మధ్య కుంపటి నిడదవోలులో టీడీపీ, జనసేన నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు సమసిపోవడం లేదు. 2024 ఎన్నికల్లో కందుల దుర్గేష్కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడంతో ఈ విభేదాలు మొగ్గ తొడిగాయి. అప్పటి నుంచీ టీడీపీ సీనియర్ నేత, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగు పల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ మధ్య సయో ధ్య కుదరడం లేదు. కేవలం అధికారిక సమావేశాల్లో నామ్కే వాస్తే అన్నట్లు కలుస్తున్నారనే తప్ప.. అంతర్గతంగా మాత్రం వైషమ్యాలు చల్లారడం లేదు. ఇటీవల జనసేన నేతలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రా ధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్స వాల్లో సైతం విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి టీడీపీ మంత్రి పొంగూరి నారాయణ హాజరైనా టీడీపీ నేతలు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ శేషారావు హాజరుకాకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.పెరిగిన ఆధిపత్య పోరు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో రాజానగరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జ్గా పనిచేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఇన్చార్జి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వెంకటరమణ చౌదరి పొత్తులో భాగంగా జనసేనకు పోవడంతో భంగపడ్డారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి జనసేన విజయానికి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవి వరిస్తే.. నియోజకవర్గ పదవి ఎవరికి దక్కుతుందన్న మీమాంస నెలకొంది.ఒకరిపై మరొకరు కేసులు ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే పరిస్థితి నిత్యకృత్యంగా మారుతోంది. ఇటీవల సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో పేకాట స్థావరంపై ఓ వర్గం దాడులు నిర్వహించి పట్టించి తమపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించిందని మరో వర్గం ఆరోపించింది. కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందేలపై పోలీసులు దాడి నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించిన వ్యవహారంలో కూడా ఈ వర్గాల ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఇరు వర్గాల మధ్య తలెత్తుతున్న వర్గ విభేధాలతో అధికారులు నలిగిపోతున్నారు. కూటమి నేతల మధ్య చల్లారని వర్గ విభేదాలు జనసేన ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు రాజానగరం నియోజకవర్గ టీడీపీలో రెండు వర్గాలు పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ మధ్య ఆధిపత్య పోరు తాజాగా పవన్ పర్యటనలోనూ వర్గ విభేదాలు బట్టబయలు నిడదవోలులో కొనసాగుతున్న జనసేన, టీడీపీ నేతల విభేదాలు -
కొత్తగా 217 పోలింగ్ కేంద్రాలు
కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో కొత్తగా 217 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 1,581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. కొత్తవాటితో కలిపి మొత్తం 1,798 పోలింగ్ కేంద్రాలు అవుతాయన్నారు. నియోజవర్గాల వారీగా అనపర్తి 40, రాజానగరం 49, రాజమహేంద్రవరం సిటీ 50, రాజమహేంద్రవరం రూరల్ 51 , కొవ్వూరు 54, నిడదవోలు 55, గోపాలపురంలో 66 పెరగనున్నట్టు తెలిపారు. నవంబర్ 26న ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణ నిర్వహించామన్నారు. జిల్లాలోని మొత్తం 16,23,741 ఓటర్లలో 4,19,204 మంది ఓటర్లు బీఎల్ఓ ద్వారా మ్యాప్ చేశామన్నారు. కొత్తగా 12,696 మంది వివరాలు కూడా బీఎల్ఓలు నమోదు చేశారన్నారు. జేసీ మేఘ స్వరూప్, డీఆర్ఓ సీతారామ్మూర్తి పాల్గొన్నారు. స్కూల్ బస్సుల తనిఖీకి ప్రత్యేక డ్రైవ్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలోని విద్యాసంస్థల స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి రవాణా శాఖ శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో రెండు వేలకు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు ఉదయం, సాయంత్రం సమయంలో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. వాహన రిజిస్ట్రేషన్, సీటింగ్ కెపాసిటీ, అనుమతులు, అత్యవసర నిష్క్రమణలు, ఎస్కేఫ్ హాచ్, అత్యవసర విండోలు, ఫైర్ డిటెక్షన్, అగ్ని నిరోధక వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, స్పీడ్ గవర్నర్ పనితీరు పరిశీలిస్తామని తెలిపారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, లోపాలు కనిపిస్తే వెంటనే సరి చేయాలని, నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ధాన్యం సేకరణ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
రాజమహేంద్రవరం సిటీ: ధాన్యం కొనుగోలు సంబంధిత ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జేసీ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. ఇది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని రైతులు 83094 87151 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 21,794 రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని 17 శాతం తేమ వరకు ఆరబెట్టుకోవాలని సూచించారు. జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థిని మిరియాల ప్రియదర్శిని రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంద్రనాథ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎంపికయింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు కేరళలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. ఆమె 9వ తరగతి చదువుతోందని, ఫిజికల్ డైరెక్టర్ టి.సరస్వతి విద్యార్థినికి శిక్షణ ఇచ్చినట్టు హెచ్ఎం చెప్పారు. ఒడిశా ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ(నిర్కా)లో ఒడిశా రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ ప్రతినిధులకు, అధికారులకు సూక్ష్మ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం శనివారం వరకు నిర్వహిస్తారు. గురువారం జరిగిన కార్యక్రమంలో నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ సమాజంతో నిత్యం పనిచేసే పంచాయతీరాజ్ ప్రతినిధులు తాజా వ్యవసాయ సాంకేతికతలు, గ్రామీణ అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నిర్కా శాస్త్రవేత్తలు, ఎంపీడీవోలు ఆర్మ్స్ట్రాంగ్, కె.రమేష్ పాల్గొన్నారు. భీమేశ్వరస్వామి ఆదాయం రూ.43.95 లక్షలు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వారి హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 27 వరకూ 43 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.43,95,359 వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.52,682 వచ్చిందన్నారు. ఈ కార్యక్రమన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి వి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ, పోలీస్ శాఖ,సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
మోసపూరిత పాలనకు చరమ గీతం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు పిలుపు ● గోపవరంలో రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం గోపాలపురం: రాష్ట్రంలో సాగుతున్న మోసపూరిత పాలనకు జనం చరమగీతం పాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. గోపాలపురం మండలం గోపవరంలో గురువారం రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రయివేటు పరం చేయడానికి చంద్రబాబు సర్కార్ కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తానేటి వనిత మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవానికి వైద్యం అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకున్నారని గుర్తు చేశారు. తండ్రి అడుగు జాడల్లో నడిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే చంద్రబాబు సర్కార్ వాటిని ప్రయివేటు పరం చేయాలని చూడటాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు. రాబో యే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీపీ వుండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, మండల పార్టీ అధ్యక్షుడు వెలగా శ్రీరామమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, పఠాన్ అన్సర్బాషా, గోపవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉక్కుసూరి సురేష్, ఎంపీటీసీ సభ్యుడు మేడ్ని రామచంద్రరావు, నాయకులు దుగ్గిరాల రమేష్బాబు, మల్లిపూడి సలీం, కాకులపాటి శ్రీను, ముచ్చికర్ల రవి, నల్లజర్ల పార్టీ సుబ్రహ్మణ్యం, పీతల ప్రసాద్బాబు పాల్గొన్నారు. -
కర్షకుల్లో కలవరం!
● మరో తుపాను హెచ్చరికతో రైతుల్లో ఆందోళన ● ఇప్పటికే మోంథాతో తీవ్ర నష్టం ● బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ● తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను ఇప్పటికే రైతులను ముంచేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెరసి రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. మోంథా మిగిల్చిన నష్టంతో కర్షకులు ఆర్థికంగా అతలాకుతలం అయ్యారు. నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం మంజూరు కాలేదు.. రైతులు కుదుటపడకముందే.. మరో తుపాను ప్రభావం జిల్లాపై ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తుపానుగా మారే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ పరిణామం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో మునిగిన తమకు రాబోయే తుపానుతో మరింతగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అల్పపీడనంతో ఆందోళన రైతులను ‘అల్పపీడన’ కలవరం వెంటాడుతోంది. దీని ప్రభావంతో శనివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో సైతం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షం దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరానికి 40 బస్తాలు రావాల్సిన దిగుబడి 30 బస్తాలు దాటే పరిస్థితి లేదు. ‘తూర్పు’లో ఇలా... జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వరి కోతలు విస్తృతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నాటికి 36,375 హెకార్లలో కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సైతం కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, రాజమండ్రి రూరల్ మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి మరింతగా ఊపందుకోనున్నాయి. ఇలాంటి సమయంలో తుపాను హెచ్చరికలు రైతుల్లో ఆందోళన నెలకొంది. పంట చేతికొచ్చే సమయంలో.. ఖరీఫ్ వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని చోట్ల నూర్పులు పూర్తవగా, మరి కొన్ని ప్రాంతాల్లో కంకులు పొలాల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల వరి పనలపై ఉండగా, మరికొన్ని చోట్ల కుప్పలు వేసి నూర్పిళ్లు చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన కోతలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో యంత్రాలతో కోతలు చేపడుతున్నారు. ధాన్యాన్ని రహదారుల అంచులపై ఆరబెడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టార్పాలిన్ కవర్లు కప్పి భద్రపరిచే పనుల్లో రైతులు తలమునకలవుతున్నారు. కొనుగోళ్లపై చిత్తశుద్ధి ఏదీ? ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. కోతలు ప్రారంభించిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయారు.జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు గాను 212 ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. కానీ నేటికీ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న దాఖలాలు లేవు. కేంద్రం వారి టార్గెట్ పూర్తయిందని మిన్నకుండిపోతున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన రైతు తిరిగి మరుసటి రోజు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అందని మోంథా సాయం మోంథా తుపాను రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోగా.. వాటి విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వరి కోతలు ఇలా... మండలం వరి సాగు(హెక్టార్లలో) కోతలు(హెక్టార్లలో)అనపర్తి 3,669 4,050 బిక్కవోలు 6,369 4,130 చాగల్లు 3,373 1,926 దేవరపల్లి 3,719 1,658 గోకవరం 6,251 320 కొవ్వూరు 4,810 3,310 నల్లజర్ల 3,944 2,462 నిడదవోలు 7,370 4,392 రాజానగరం 4,789 3,457 తాళ్లపూడి 4,172 2,247 -
జుడో పోటీల్లో పతకాల పంట
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జుడో అసోసియేషన్, ఏపీ జుడో అసోసియేషన్, శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంయుక్త సహకారంతో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా సీనియర్ జుడో చాంపియన్ షిప్ పోటీల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని డీఎస్డీఓ వి.సతీష్కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ వెయిట్ కేటగిరీల్లో మొత్తం 14 మెడల్స్, ఇందులో ఏడు స్వర్ణ, నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు సాధించినట్టు చెప్పారు. పురుషుల విభాగంలో టీం చాంపియన్ షిప్ ప్రథమ స్థానం, మహిళా విభాగంలో టీం చాంపియన్ షిప్ ద్వితీయ స్థానం కాకినాడ జిల్లాకు దక్కిందని వివరించారు. మొత్తం ఏడు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్లో వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ జుడో చాంపియన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, డీఎస్ఏ జుడో కోచ్ పి.వెంకటతేజను డీఎస్డీఓ అభినందించారు.రాష్ట్ర స్థాయిలో 14 మెడల్స్ కై వసం -
సాగునీటి ప్రణాళికలపై సమీక్ష
ధవళేశ్వరం: గోదావరి డెల్టా పరిధిలో నీటి లభ్యత, ఆయకట్టు, సాగు ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బుధవారం కలెక్టరేట్లో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షత వహించారు. గోదావరి తూర్పు, మధ్య , పశ్చిమ డెల్టాల పరిధిలోని మొత్తం 8,96,533 ఎకరాలకు అవసరమయ్యే 93.26 టీఎంసీల నీటి లభ్యత, సీలేరు, పోలవరం నిల్వలు, డిసెంబర్ – మార్చిలో అంచనా ఇన్ఫ్లోపై సమీక్షించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రబీ 2025–26 పంట సాగు సమయానికి అవసరమైన నీటి పంపిణీ, కాలువల సంరక్షణ, ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన ప్రాథమిక వివరాల నివేదికను శనివారానికి సమర్పించాలని అధికారులను ఆదేశించా రు. జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆధ్వ ర్యంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ సిబ్బందిని సమన్వయం చేసి 60 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. షట్టర్ల మరమ్మతులు, బండ్ల పటిష్టత, కాటన్ మ్యూజియం నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయా లన్నారు. ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.గోపీనాథ్ మాట్లాడుతూ గోదావరి డెల్టాకు సంబంధించిన ఆయకట్టు, నీటి అవసరత, లభ్యత వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రవచనయజ్ఞం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రుషిపీఠం చారిటబుల్ ట్రస్టు, రుషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో టి.నగర్లోని హిందూ సమాజంలో గురువారం నుంచి 2026 జనవరి 25 వరకు 60 రోజుల పాటు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వేదవ్యాస భారతంపై ప్రవచనాలను అందజేస్తారు. ఈ విషయాన్ని భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ప్రకటనలో తెలిపారు. నిత్యం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ప్రవచనాలు కొనసాగుతాయన్నారు. -
రాష్ట్రంలో అమలు కాని అంబేడ్కర్ రాజ్యాంగం
● లోకేష్ రెడ్బుక్ పాలనతో అస్తవ్యస్తం ● రాజ్యాంగ దినోత్సవంలో మాజీ మంత్రి వేణు ● అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మనకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించారని, కానీ రాష్ట్రంలో అది అమలు కావడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ హక్కులు, స్వేచ్ఛను కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ద్వారా సమానతను చేరువ చేసిన ఘనత ఒక్క అంబేడ్కర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో పోలీసుశాఖ పనితీరు ద్వితీయ, తృతీయస్థానంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ పాలనలో అథమ స్థానానికి పడిపోయిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు ప్రతిపక్ష నేతలపై వేధింపులు మాని, పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ఫణికుమార్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాపా రాజ, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షట్టర్ బాషా, జిల్లా యువజన విభాగం కార్యదర్శి అప్పా పరిమళ కుమార్ (నాని), మండల యువజన విభాగం అధ్యక్షుడు కొల్లి వెంకటరత్నం (నాని), తోడేటి రాహుల్, జాలా మోషే, మేడిశెట్టి టింకు, వాసంశెట్టి శ్రీనివాస్, పట్టా ఉత్తేజ్, తాడిపూడి విజయరాజు, కొల్లి నాని, మెరుగొల్ల చిన్నబాబు, చెల్లుబోయిన నరేష్, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి
కొత్తపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు సినీ రంగంలో హాస్య దిగ్గజంగా మన్ననలు అందుకున్నారు రేలంగి వెంకట్రామయ్య. వందేళ్ల తెలుగు సినీ రంగ చరిత్రలో హాస్య నటునిగా, హాస్య పితామహునిగా సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు ఎందరు హాస్యనటులు వచ్చినా రేలంగికి సాటి లేరన్నట్టుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్య నటునిగా చరిత్రలో నిలిచారు. రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య 1910 ఆగస్ట్ 9న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో రామదాసు (రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవారు. చిన్నతనంలో తండ్రి వద్దే రేలంగి ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. కాకినాడ మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నారు. రేలంగి రూపం చూసి తండ్రి పోలీసును చేయాలని ఆశపడ్డారు. కానీ రేలంగి దృష్టి నాటక రంగం వైపు మళ్లింది. చదువుకునేటప్పుడే నాటకాల్లో నటించారు. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, కుమారుడిని ఎంఎస్ఎస్ చార్టీస్ సాయంతో చదివించాలనుకున్నారు. నాటకాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండడంతో రేలంగి చదువు తొమ్మిదో తరగతిలో ఆగిపోయింది. నాటక రంగ ప్రవేశం ఓసారి రామదాసు తన కుమారుడిని యంగ్మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకెళ్లారు. అది రేలంగికి బాగా నచ్చి, తానూ నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. తండ్రికి తెలియకుండా నాటకాల్లో నటించడం మొదలెట్టారు. యంగ్మెన్ హ్యాపీ క్లబ్లో చేరి 1919లో తన పదో ఏట బృహన్నల అనే నాటకంలో తొలిసారి సీ్త్ర పాత్రలో నటించారు. తర్వాత కాలంలో ఇదే క్లబ్లో ఎస్వీ రంగారావు, అంజలీదేవి తదితరులూ నాటకాలు వేశారు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు రాకపోవడంతో రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చాయి. బుచ్చియమ్మతో వివాహం పెళ్లి చేస్తే జీవితం గాడిలో పడుతుందని భావించి తండ్రి రామదాసు తాడేపల్లిగూడెం పక్కనున్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మతో రేలంగికి పెళ్లి చేశారు. అప్పటికీ రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా, కళాకారుడిగా గౌరవించారు ఆయన బావమరుదులు. భార్య తరఫున ఎంత సంపద ఉన్నా, సొంత కాళ్లపై నిలబడాలని రేలంగి మళ్లీ నటించడం మొదలెట్టారు. వచ్చిన సంపాదనను భార్య చేతిలో పెట్టేవారు. వారికి జన్మించిన కుమారుడితో ఆ దంపతుల జీవితం అన్యోన్యంగా సాగింది. ప్రత్యేక అనుబంధం పౌరాణిక రంగస్థల, సాంఘిక నాటక కళాకారుడు, తెలుగు సినీ హాస్య నటుడు రేలంగికి కళలకు పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ లలిత కళా నికేతన్ వారు హాస్య బ్రహ్మగా పేరొందిన భమిడిపాటి కామేశ్వరరావు చేతుల మీదుగా హాస్య నటచక్రవర్తి బిరుదును అందుకున్నారు. ఇదే సభలో రేలంగిని గోదావరి జిల్లాల అభిమానులు సువర్ణ కంకణంతో ఘనంగా సత్కరించారు. అపర దానకర్ణుడు రేలంగి వెంకట్రామయ్యను అప్పట్లో అపర దానకర్ణుడిగా చెప్పుకొనేవారు. మద్రాసులో రేలంగి ఇంటి వద్ద నిత్య అన్నదానం జరిగేది. సాయం ఆర్థించి వెళ్లిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసిన గొప్ప వ్యక్తి రేలంగి అని చెబుతారు. గోదావరి ప్రాంతంపై ఉన్న మమకారంతో తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్ర మందిర్ పేరిట ధియేటర్ను నిర్మించారు. చివరి అంకంలో ఆయన అక్కడే స్థిరపడ్డారు. 1975 నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో వయోభారం, అనారోగ్యంతో బాధ పడుతూ తుది శ్వాస విడిచారు. గోదావరి తీరాన కాంస్య విగ్రహం ఉభయ గోదావరి జిల్లాలకు చిరపరిచితుడైన రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహం రాజమహేంద్రవరంలో నెలకొల్పారు. ఆయన అభిమానులు, రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేలంగి ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేటలో ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ రూపొందించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున దివంగత సినీ ప్రముఖుల విగ్రహాల సరసన గతేడాది సెప్టెంబర్ 19న విగ్రహావిష్కరణ జరిగింది.1935లో ప్రవేశం నాటక రంగంలో అనుభవమున్న రేలంగికి 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం ఆకట్టుకుంది. తానూ చలనచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమా నిర్మాణానికి నిర్మాత ఐ.రాజారావు సన్నాహాలు పూర్తి చేశారు. తబలా కళాకారుడు పరదేశి.. రేలంగిని దర్శకుడు సి.పుల్లయ్యకు పరిచయం చేశారు. అలా శ్రీకృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లో రేలంగిని దర్శకుడు పుల్లయ్య సినీ రంగానికి పరిచయం చేశారు. అందులో కొద్దిసేపు కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి పాత్రల్లో రేలంగి నటించారు. ఈ సినిమాలో నటనకు రేలంగికి నాలుగు నెలల బస, భోజనం పెట్టి, రూ.డైబ్భె పారితోషికం ఇచ్చారు. ఆ సమయంలో పుల్లయ్య వద్ద నటనతో పాటు, పలు సినీ విభాగాల్లో పని చేశారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో రేలంగి కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత కీలుగుర్రం, నర్తనశాల, హరిశ్చంద్ర, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, జగదేకవీరుడు, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న హాస్య నటుడిగా రేలంగి గుర్తింపు పొందారు. నటుడిగా తారాస్థాయి అందుకున్న రేలంగి అనేక సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1954లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్మశ్రీ అవార్డును కళా రంగం నుంచి హాస్య నటునిగా అందుకున్న ఘనత రేలంగికే దక్కింది. 1970లో ప్రదానం చేసిన ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆ సందర్భంగా మద్రాస్ పురవీధుల్లో తెలుగు, తమిళ మహా నటుల నడుమ రేలంగిని అంబారీపై ఊరేగించి, విజయా గార్డెన్స్లో ఘనంగా సన్మానించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి భారతీయ హాస్య నటుడు గోదావరి ప్రాంతంతో ఎనలేని అనుబంధం రాజమహేంద్రవరంలో ఆయన కాంస్య విగ్రహం నేడు 50వ వర్ధంతి -
శరణు..శరవణ
బిక్కవోలు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి వేడుకలు జిల్లాలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. జిల్లాలోనే పేరు గాంచిన బిక్కవోలు ప్రాచీన గోలింగేశ్వరస్వామి ఆలయంలో కొలువైన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ పల్లె శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజాము 1.10 గంటలకు తీర్థపు బిందె సేవతో షష్ఠి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామి సేవ అనంతరం దర్శనం కోసం భక్తుల వెల్లువ కొనసాగింది. నాగుల చీరలు ధరించి.. భక్తులు గోదావరి కాలువలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సంతానం లేని మహిళలు ఆలయం వెనుక నాగులు చీరలు ధరించి నిదురించారు. 9 గంటలకు స్వామివారికి నెమలి వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్ కచేరీలు వచ్చిన భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సాధారణ దర్శనానికి మూడ గంటలు, వీఐపీ, రూ.100 దర్శనాలకు రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు వితరణ ఆలయానికి వచ్చిన భక్తులకు, చిన్నారులకు పలు స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, పాలు, మజ్జిగ, బిస్కట్లు పంపిణీ చేశాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకూ భారీ స్థాయిలో జరిగిన బాణసంచా కాల్పులను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాల నడుమ రాత్రి 11 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ బాణసంచా ప్రదర్శనలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా షష్ఠి వేడుకలు సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు కిటకిటలాడిన ఆలయాలు బిక్కవోలుకు పోటెత్తిన భక్తులు -
గోవుల మరణాలపై సమగ్ర విచారణ
రాజమహేంద్రవరం రూరల్: రాజమండ్రి సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో చనిపోయిన గోవులు ఎన్ని, ఏ కారణాల వల్ల చనిపోయాయి, గోశాల సామర్థ్యం ఎంత, సిబ్బంది, ఆహారం, నీటి నిల్వలు తదితర అంశాలపై సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్ ఆర్టీఐ కింద 2023 అక్టోబర్ 30న సమాచారాన్ని అడిగారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, గతేడాది జూన్లో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్లో సెకెండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ ఏడాది ఆగస్ట్ 12న విచారణ చేసిన ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గోశాలలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. గోశాల నిర్వహణలో లోపాలను గుర్తించింది. సీసీ కెమెరాలు పని చేయటం లేదని, రికార్డులను సరిగా నిర్వహించటం లేదని నివేదికలో పేర్కొంది. గోశాల నిర్వహణను ఎండోమెంట్ శాఖకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోవులను రెగ్యులర్గా పర్యవేక్షించేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ను నియమిస్తూ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళగిరి కమిషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విచారణకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ప్రత్యక్షంగా హాజరై, విచారణ నివేదిక కమిషనర్కు, దరఖాస్తుదారుకు సమర్పించారు. భగవాన్ మహావీర్ జైన్ గోశాల ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అఽధీనంలో లేదని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దృష్టికి తీసుకొచ్చారు. గోశాల ప్రైవేటు సంస్థ నిర్వహణ కింద ఉన్నప్పటికీ, గోవుల సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. గోశాలలో గోవుల మరణాల ఆరోపణలు, వాస్తవ పరిస్థితిపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఆదేశించిన ఆర్టీఐ కమిషనర్ -
జాతీయ బ్యాడ్మింటన్లో హరికృష్ణ, చరణ్రామ్కు కాంస్యం
సామర్లకోట: జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలుర డబుల్స్ విభాగంలో సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి హరికృష్ణ, చిత్తూరు జిల్లాకు చెందిన తిప్పన చరణ్రామ్ జంట తృతీయ స్థానం సాధించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు అరుణాచల్ప్రదేశ్ ఇటానగర్లో జరిగిన యోనెక్స్–సన్రైజ్ 48వ జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల జంట ప్రతిభ చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హరికృష్ణ–చరణ్రామ్ కాంస్య పతకాన్ని పొందారు.చికిత్స పొందుతూ ఖైదీ మృతికాకినాడ క్రైం: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గుంటూరు సమీపంలో అంకిరెడ్డిపాలేనికి చెందిన మెట్టు భాస్కర్రెడ్డి(53).. 30 ఏళ్ల క్రితం బాబాయి, కొడుకు హత్యలకు గురైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. పాతికేళ్ల పాటు బెయిల్పై ఉండి, ఐదేళ్ల నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 31న అనారోగ్యానికి గురయ్యాడు. రాజమహేంద్రవరం వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆరోగ్యం విషమించి బుధవారం మధ్యాహ్నం మరణించాడు. దీనిపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిడదవోలు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
● హామీ ఇచ్చిన మంత్రి నారాయణ ● ఘనంగా పురపాలక సంఘ వజ్రోత్సవంనిడదవోలు: నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. బుధవారం జరిగిన నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు పార్కులో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ స్థూపాన్ని ఆవిష్కరించారు. నిడదవోలు నియోజకవర్గానికి గోదావరి జలాలు రప్పించే ప్రాజెక్టు, మాలకోడు చెరువు ఆధునికీకరణ, ప్రధాన రహదారులు తదితర రూ.131 కోట్ల అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్థానిక లయన్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ వినతి మేరకు నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు. చాళుక్య, కాకతీయులు ఏలిన పురాతన పట్టణం నిరవద్యపురం గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని, భౌగోళిక స్వరూపాన్ని తెలిపేలా సాంస్తృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన నిడదవోలు చరిత్ర అనే పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన చైర్మన్లు, కౌన్సిలర్లు, అభివృద్ధిలో భాగమైన సేవా సంస్థలను, పౌరులను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే వజీరుద్దీన్ పాల్గొన్నారు. -
కోతలకు మరింత ఇబ్బంది
మోంథా తుపాను ప్రభావం ఇప్పటికీ రైతులను వెంటాడుతోంది. అప్పట్లో కురిసిన వర్షాలకు ఇప్పటికీ వరి చేలల్లో తడి ఆరలేదు. దీంతో వరి కోతలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరం పొలంలో గంటలో పూర్తవ్వాల్సిన కోతలకు మూడు గంటల సమయం పడుతోంది. మళ్లీ తుపాను ప్రభావంతో వర్షం కురిస్తే వరి పంట కోసే పరిస్థితి ఉండదు. ధాన్యం రంగుమారి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. – బూరుగుపల్లి సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జరిగిన 41వ సీనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదు పతకాలు (4 కాంస్య, ఒకటి రజత) సాధించినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. వీరిలో పి.హరికిరణ్ రజత పతకం సాధించగా, వై.గంగాభవాని, జి.వంశీ, ఎల్ వెంకన్నదొర, ఎం హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. ఈ టోర్నమెంట్కు కోచ్గా పి.భార్గవి, మేనేజర్గా ఆర్ మణికంఠ వ్యవహరించారన్నారు. సీనియర్ ఏపీ టీం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్ను డీఎస్డీఓ సతీష్కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వీరభద్రారెడ్డి, కార్యదర్శి జి.ఎలీషాబాబు, తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఎ.మధుసూదన్రావు, కోచ్లు డీఎన్ సత్యనారాయణ, ఎన్ తులసి, కేవీ సత్యనారాయణ, ఎంపీ త్రిమూర్తులు, ఎన్ రత్న తదితరులు అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
కాలువకు పొంచి ఉన్న ముప్పు
● తవ్వేస్తున్న పోలవరం కుడి కాలువ గట్టు ● పరిహారం పొందినా.. 20 ఎకరాల్లో చేస్తున్న సాగు ● చదును చేసి కౌలుకు ఇస్తున్న వైనం గోపాలపురం: బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం కుడి ప్రధాన కాలువకు ముప్పు పొంచి ఉంది. మండలంలోని చెరుకుమిల్లి, చిట్యాల గ్రామాల మధ్య ఉన్న సుమారు 20 ఎకరాల కాలువ గట్టు మట్టిని కొల్లగొట్టి, ఆ భూమిని సాగులోకి తెచ్చేలా అక్రమార్కులు యత్నిస్తున్నారు. కాలువ తవ్వకాల సమయంలో ఆయా గ్రామాల రైతులకు భూముల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. భవిష్యత్తు అవసరాల మేరకు కాలువల విస్తరణ కోసం భూసేకరణ చేసింది. ఆ భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కాలువ గట్టు మట్టిని అమ్ముకోవడమే కాకుండా, ఆ భూమిలో సాగు చేపట్టారు. చెరుకుమిల్లి గ్రామంలో ఏకంగా కాలువ గట్టు సైతం తవ్వేశారు. దీంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని సమీప భూముల రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్టుపై నుంచి వర్షపు నీరు పోలవరం కుడి ప్రధాన కాలువకు వచ్చేలా ఏకంగా కాలువకు గండి కొట్టేశారు. అధిక వర్షం కురిస్తే కాలువలోకి వచ్చే వరద నీటితో పాటు, కాలువ కాంక్రీట్ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. చెరుకుమిల్లి, చిట్యాల కాంటూరు నంబరు 17, 18 వద్ద ఉన్న కాలువ గట్ల పటిష్టత పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. మట్టి తరలింపు అలాగే భీమోలు, గోపాలపురం, పెద్దాపురం, గుడ్డిగూడెం గ్రామాల మీదుగా వెళుతున్న పోలవరం కుడి ప్రధాన కాలువ గట్టు మట్టిని రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వి, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. చెరుకుమిల్లిలో గట్టు మట్టిని తరలించి, పొగాకు సాగు కోసం ఎకరం రూ.50 వేల నుంచి రూ.70 వేలకు కౌలుకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటువైపు కాలువకు సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూ, పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కాలువ మరమ్మతులు చేపట్టి, గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పాల కావడి.. భక్తుల సందడి
కావడి ఉత్సవంలో 216 కలశాలతో ఊరేగింపుకావడి ఉత్సవం చేస్తున్న స్వాములుబిక్కవోలు: మండలంలోని కొమరిపాలెంలో పవిత్ర తుల్యభాగ నది తీరాన నెమలి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాల కావడి ఉత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. షష్ఠి ఉత్సవాలను పురస్కరించుకుని ద్రవిడ విధానంలో పళని సంస్కృతి ప్రకారం షష్ఠి ముందు రోజున 108 మంది భక్తులు మురుగన్ మాలధారణ చేశసి, పాల కావళ్లతో గ్రామోత్సవం చేశారు. దీనిలో భాగంగా 216 కలశాలతో గోదావరి జలాలను బిందెలతో తెచ్చి స్వామి వారికి అభిషేకం చేశారు. గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులు, మురుగన్ నృత్యాలతో ఈ ఉత్సవాన్ని ఆద్యంతం కోలాహలంగా నిర్వహించారు. అనంతరం మురుగన్ మాలధారులు స్వామివారి ఉత్సవ మూర్తిని గ్రామంలో ఊరేగించారు. కార్యక్రమంలో గురుస్వామిలు కర్రి భీమారెడ్డి, సత్తి గంగిరెడ్డి, కొవ్వూరి అబ్బాయిరెడ్డి, బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
అయినకాడికి ఇచ్చేస్తున్నాం
మార్కెట్లో ధరలున్నప్పుడు వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.20 వేల నుంచి రూ.22 వేలు ఇచ్చేవారు. నేడు అదే కాయలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. గత్యంతరం లేక అయినకాడికి అమ్మేస్తున్నాం. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు కలసి వస్తున్నదేమీ లేదు మార్కెట్లో ధరలు తగ్గిన ప్రస్తుత సమయంలో దిగుబడి పెరగటం వలన మాకు పెద్దగా కలసి వస్తున్నదేమీ లేదు. వ్యాపారులు చెప్పిన ధరకు ఇచ్చేస్తున్నాం. ఎక్కడికై నా వెళ్లి అమ్ముదామంటే అయినకాడికి అడుగుతున్నారు. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు,తీపర్రు ఇతర రాష్ట్రాల కొబ్బరితో.. ఇతర రాష్ట్రాల కొబ్బరి కాయలు మార్కెట్కు ఎక్కువ మొత్తంలో రావడంతో మన కొబ్బరికి డిమాండ్ తగ్గి, ఎగుమతులు పడిపోయాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి లేక మన కొబ్బరికి డిమాండ్ వచ్చింది. నేడు ఆ పరిస్థితి లేదు. ధర ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. అందుకే కొనుగోలు చేయటం లేదు. – గొల్లకొటి వెర్రిబాబు, కొబ్బరి వ్యాపారి, ఖండవల్లి -
వయసు డిగ్రీలు
73ఆల్కాట్తోట (రాజమహేంద్రవరవం): నిరంతరం చదువుతూ, జ్ఞానవృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న సరస్వతీ పుత్రుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కర్రి రామారెడ్డి తన చదువుల మార్గంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆయన ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించారు. ఈ క్రమంలో తాజాగా దేశంలోనే పేరొందిన ఐఐటీలు నిర్వహించే ఎన్పీటీఈఎల్ కోర్సులు ఒకే సెమిస్టర్లో 12 పూర్తి చేసి రికార్డు సృష్టించారు. వీటిలో 8 పరమ విశిష్ట శ్రేణిలోను (ఎలైట్ ప్లస్ గోల్డ్), 4 కోర్సులు విశిష్ట శ్రేణిలోను (ఎలైట్ ప్లస్ సిల్వర్) ఉత్తీర్ణులై, వరుసగా మూడోసారి మెగాస్టార్ సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. డాక్టర్ రామారెడ్డి వాస్తవ వయస్సు 71 ఏళ్లు అయినప్పటికీ సరిఫికెట్ల ప్రకారం 73 సంవత్సరాలు. ఇన్నేళ్లలో ఒకవైపు వైద్య వృత్తి కొనసాగిస్తూనే సైకియాట్రీ, సైకాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం, ఎడ్యుకేషన్, ఆంగ్ల సాహిత్యం, లైబ్రరీ సైన్స్, యోగా థెరపీ, జర్నలిజం, కామర్స్, పొలిటికల్ సైన్స్ వంటి అనేక విభాగాల్లో ఆయన సాధించిన మొత్తం డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు, తాజాగా సాధించిన 12 సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరడం విశేషం. ఇవి నా కష్టార్జితం, ఇష్టార్జితం ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని మానస ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. తానూ పూర్తి చేసిన డిగ్రీలు, పీజీలు, సర్టిఫికెట్ కోర్సుల్లో ఏదీ అయాచితంగానో, గౌరవపూర్వకమైన నామమాత్రపు అర్హతతోనో రాలేదని, ప్రతి సర్టిఫికేషన్ పూర్తిగా పరీక్షల ఆధారంగా సాధించనదేనని స్పష్టం చేశారు. ఇవన్నీ తన కష్టార్జితం, ఇష్టార్జితమని చెప్పారు. కాన్పూర్, రూర్కెలా, ఖరగ్పూర్ ఐఐటీల నుంచి మూడేసి కోర్సులు, గౌహతి ఐఐటీ నుంచి రెండు, మద్రాస్ ఐఐటీ నుంచి 1 కలిపి ఈ ఏడాది జూలై – డిసెంబర్ సెమిస్టర్లో 12 ఎన్పీటీఈఎల్ కోర్సులు పూర్తి చేశానని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు మెగాస్టార్ అర్హత సాధించగా వరుసగా మూడో సెమిస్టర్కు కూడా మెగాస్టార్ అర్హత వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని పరీక్షలూ రాజమహేంద్రవరంలోని రాజీవ్గాంధీ కళాశాల కేంద్రంలో జరిగాయని, చాలా కఠిన నిబంధనల నడుమ ఈ పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని డాక్టర్ రామారెడ్డి అన్నారు. వచ్చే సెమిస్టర్లో 16 కోర్సులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చదువుకు వయస్సు సంఖ్య మాత్రమేనని, నేర్చుకోవడం జీవితాంతం కొనసాగించవచ్చని అన్నారు. ఇలా కోర్సులు చేయడం ద్వారా యంగ్ లైఫ్ పొందుతున్నానన్నారు. ఫ ఒకే సెమిస్టర్లో 12 ఎన్పీటీఈఎల్ కోర్సులు పూర్తి ఫ 9 కోర్సులలో టాపర్ ఫ వరుసగా మూడోసారి మెగాస్టార్ అర్హత ఫ డాక్టర్ కర్రి రామారెడ్డి ఘనత భావితరాలకు స్ఫూర్తి రాజీవ్గాంధీ కళాశాల నిర్వాహకుడు, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడుతూ, 70 ఏళ్లు నిండిన తరువాత కూడా డాక్టర్ రామారెడ్డి ఇంతటి తీవ్ర అధ్యయనం చేయడం అరుదైన విషయమని, ఇది ప్రజలకు, భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఇప్పటికే రామారెడ్డికి డాక్టర్ బీసీ రాయ్ అవార్డు వచ్చిందని గుర్తు చేస్తూ, వంద డిగ్రీలు పూర్తయ్యే సమయానికి కేంద్ర పురస్కారాలు కూడా వస్తాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఓలేటి సత్యనారాయణ, మాట్లాడుతూ, అందరిలానే డాక్టర్ రామారెడ్డికి కూడా రోజుకు 24 గంటలే ఉన్నాయని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ, వృత్తి నిర్వహిస్తూ, అధ్యయనం సాగిస్తున్నారని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్రాజు మాట్లాడుతూ, ఇన్ని డిగ్రీలు వచ్చే తరంలో ఎవరూ చేయలేరని, అందుకే డాక్టర్ రామారెడ్డి తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. విలేకర్ల సమావేశంలో భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు కూడా మాట్లాడారు. -
ప్రభుత్వ తప్పులపై పోరాటాలకు సిద్ధం
● క్షేత్రస్థాయి నుంచి యువజన విభాగం బలోపేతమే లక్ష్యం ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి ● తణుకులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం సాక్షి, భీమవరం: చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాల యువజన విభాగం విస్తృత స్థాయి సమావేశం పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్్ హాలులో మంగళవారం జరిగింది. యువజన విభాగం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ అధ్యక్షతన జరిగిన సభలో యువజన విభాగం సంస్థాగతంగా బలోపేతానికి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని రాజా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం ఏదోరకంగా ప్రజలను మోసగించడం, మభ్యపెట్టడం సీఎం చంద్రబాబు నైజమన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సూపర్ సిక్స్ పేరిట ఓట్లు దండుకుని ప్రజలకు మొండిచేయి చూపించారన్నారు. ఏడాదిన్నరైనా ఇంటికో ఉద్యోగం, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వాగ్దానాల ఊసే లేదన్నారు. అసెంబ్లీలో వాటి గురించి ప్రస్తావన గాని, బడ్జెట్లో కేటాయింపులు గాని లేవన్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేశారు యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కారుమూరి సునీల్ మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతను ఈ ప్రభుత్వం మోసగించిందన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారని, ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని విమర్శించారు. 17 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ యువతకు ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎస్ఈసీ సభ్యుడు కొట్టు నాగేంద్ర, యువజన విభాగం ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అధ్యక్షులు కామిరెడ్డి నాని, పిల్లి సూర్యప్రకాష్, కంటమనేని రమేష్, రాగిరెడ్డి అరుణకుమార్, సంచార జాతుల కార్పొరేషనన్ మాజీ చైర్మనన్ పెండ్ర వీరన్న, ఐదు జిల్లాల్లోని యువజన విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
యువజనోత్సాహం
సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: తణుకు వేదికగా జరిగిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం సమావేశంలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన యువ నేతలతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. క్షేత్ర స్థాయి నుంచి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో యువజన విభాగం బలోపేతానికి, పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగనన్మోహన్న్రెడ్డి పిలుపు మేరకు కార్యక్రమాల విజయవంతానికి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సంస్థాగతంగా బలోపేతం : జక్కంపూడి రాజా వైఎస్సార్ సీపీ యువజన విభాగాన్ని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో క్రియాశీలక యువజన నాయకులతో పార్టీ అభివద్ధికి కృషి చేస్తాం. కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులపై పోరాటాలు, ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు : కారుమూరి సునీల్ రైతులు, మహిళలు, యువత, అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాది కావస్తున్నా అసెంబ్లీల్లో ప్రస్తావన గానీ, బడ్జెట్లో కేటాయింపులు గానీ చేయలేదు. అబద్ధపు హామీలతో పబ్బం గడుపుకుంటున్న కూటమి నేతలకు గుణపాఠం చెప్పేందుకు యువత ఎదురుచూస్తోంది. యువత పాత్ర కీలకం: కారుమూరి నాగేశ్వరరావు మన నాయకుడు జగనన్ మాట ఇస్తే తప్పే మనిషి కాదు. పార్టీలో యువతకే ప్రాధాన్యం కల్పిస్తారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉంది. అప్పుడు జగనన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల మార్కెట్లో వ్యాపారాలు జరిగేవి. జగన్ లేకపోవడంతో వ్యాపారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మళ్లీ వడ్డీలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చేశారు. యువతను మభ్యపెట్టారు : ముదునూరి మురళీ కృష్ణంరాజు యువతను మభ్యపెట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 20 లక్షలు ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి అని హామీలు ఇచ్చి చంద్రబాబు యువతను మోసం చేశారు. జగనన్మోహన్్రెడ్డి పిలుపునందుకుని అన్ని ఉద్యమాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోంది. మళ్లీ జగనన్మోహన్న్రెడ్డి అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి. యువశక్తితో ఏదైనా సాధ్యం: ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూల్చగలరు, అధికారంలోకి తీసుకురాగలరు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్లు చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షనన్ పాలిటిక్స్ చేస్తున్నారు. యువతంతా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి. యువత కష్టపడి పనిచేయాలి: కొట్టు నాగేంద్ర, సీఈసీ సభ్యుడు యువత దశ, దిశగా మారి పార్టీని బలోపేతం చేయాలి. 2029లో జగన్న్మోహన్న్రెడ్డి మళ్లీ సీఎం అవ్వడానికి యువత కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఏడాదిన్నరలో ఏ పథకం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. వితంతు పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. పార్టీ కష్టకాలంలో బాగా పనిచేసి 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలి. -
శుభాలకు విరామం!
● ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 15 వరకు శుక్ర మూఢం ● 80 రోజుల పాటు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలకు బ్రేక్ ఐ.పోలవరం: ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండున్నర నెలలకు పైగా... ఇంచుమించు పదకొండు వారాల పాటు శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. శుక్ర మూఢం కారణంగా 80 రోజుల పాటు శుభ కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. సంవత్సరంలో కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాగా, మరికొన్ని రోజులు అందుకు పనికిరావు. ప్రత్యేకించి మూఢం రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 28వ తేదీ నుంచి శుక్ర మూఢం ఏర్పడనుంది. 2026 ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ శుక్ర మూఢం కొనసాగుతుంది. అయితే ఆయా ప్రాంతాలు, అనుసరిస్తున్న సంప్రదాయాలు, కొన్ని పంచాంగాల ప్రకారం తేదీలలో స్వల్ప మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. పలువురి ఉపాధికి గండి ఈ మూఢం సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహ ప్రవేశాలు, ఇంటికి శంకుస్థాపనలు ఉండవు. యజ్ఞాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేయరు. 80 రోజుల పాటు జిల్లాలో శుభ కార్యక్రమాలు లేకపోతే వాటి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది. ముఖ్యంగా వివాహాలకు బ్రేకులు పడితే బ్రాహ్మణులు, వంటవారు, వడ్డించేవారు, బాజాభజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్లు, కల్యాణ మండపాల నిర్వాహకులు ఇలా ఎంతోమందికి పనులు ఉండవు. ఇటీవల పెళ్లిళ్లలో వచ్చిన ఆధునిక పోకడల వల్ల వీటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంచుమించు రెండున్నర నెలల పాటు పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల వీరు ఆర్థికంగా గడ్డుకాలం ఎదుర్కోవలసి ఉంది. పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మూఢంలో శుభకార్యాల్ని చేయకపోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం. కాబట్టి మాఘ మాసం వచ్చే వరకు వివాహాది కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు లేనట్టే. అయితే ఆయా ప్రాంతాలు, అనుసరిస్తున్న సంప్రదాయాల ప్రకారం తేదీలలో మార్పులు ఉంటాయి. – నాగాభట్ల రవిప్రసాద్ శర్మ, పురోహితుడు, మురమళ్ల, ఐ.పోలవరం మండలం గ్రహాలు బలహీనం మూఢం అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మూఢం అంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢం సంభవిస్తుంది. అయితే మూఢం సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి. కాబట్టి ఎలాంటి శుభకారా్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు. -
ఉమ్మడి ఏపీ డ్రగ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆకస్మిక మృతి
అనపర్తి: ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ డైరెక్టర్ మండ వెంకటరెడ్డి(79) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. అనపర్తి వాసి అయిన వెంకటరెడ్డి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. డ్రగ్ ఇనస్పెక్టర్గా నిబద్ధతతో పని చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన ఉమ్మడి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడిగాను పని చేశారు. ఆధ్యాత్మిక సేవల్లో భాగంగా సత్యసాయి సేవాసంస్థలు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. వెంకటరెడ్డి మృతి పట్ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. -
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం
బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోను, ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించారు. శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు ఉన్నత పాఠశాల ఆవరణ, మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, షష్ఠి ఉత్సవాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పాటించి, సంయమనంతో దర్శనం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలతో పాటు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలిపారు. బాణసంచా కాల్పుల సమయంలో తగిన జాగత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం, ఎస్పీ బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ అనసూరి శ్రీనివాస్, అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ యోగా పోటీలకు భవానీ చౌదరి దేవరపల్లి: చిన్నాయగూడేనికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి ఇమ్మణ్ణి అర్మిత భవానీ చౌదరి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జి.పంగులూరు మండలం చందలూరులో ఈ నెల 24న జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 ట్రెడిషనల్ యోగా బాలికల విభాగంలో ప్రథమ స్థానం సాధించి త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2023–24లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ 2023లో అసోంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ, 2023 డిసెంబరులో ఉత్తర ప్రదేశ్ హజియాబాద్లో జరిగిన జాతీయ స్థాయి యూవైఎస్ఎఫ్ ప్రపంచ యోగా పోటీల్లో ద్వితీయ స్థానాలు సాధించానని వివరించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 2024లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపానన్నారు. ఈ ఏడాది జనవరిలో సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ఐదో స్థానం సాధించినట్టు చెప్పారు. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణపతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించడమే ప్రధాన ధ్యేయమన్నారు. వారాహి అమ్మవారికి ఆభరణాల సమర్పణ పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాత అమ్మవారికి పలువురు భక్తులు, దాతలు మంగళవారం వివిధ ఆభరణాలు సమర్పించారు. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి రూ.25 వేల విలువైను వెండి రుద్రాక్ష మాల, మేడపాటి శ్రీకాంత్రెడ్డి అమ్మవారి ఉత్సవమూర్తికి రూ.20 వేల విలువైన వెండి కిరీటం, నల్లమిల్లి గణేష్రెడ్డి రూ.75 వేలు విలువైన హస్తాలు, చైతన్య బ్యాంకర్స్ సౌజన్యంతో అమ్మవారి ముఖ అలంకారాలు, వానపల్లి వెంకట గణేష్ బంగారం, వెండితో తయారు చేయించిన మంగళ సూత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తులకు ప్రతి రోజూ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ వారాహి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, సబ్బెళ్ల మోహన్రెడ్డి, పప్పు రామకృష్ణారెడ్డి, భాస్కర్స్వామి, అశోక్ స్వామి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నారికేళం ఢమాల్
పెరవలి: కార్తికం, పండగల ప్రభావం.. దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి లేకపోవడంతో మంచి ధర పలికి.. ఇటు రైతులకు, అటు వ్యాపారులకు లాభాలు పంచిన కొబ్బరి ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. నెల రోజుల కిందటి వరకూ వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. అటువంటిది ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పడిపోయింది. వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రైతుకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే దక్కుతోంది. దీంతో, వారు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలుండగా.. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో దీని సాగు జరుగుతోంది. దీంతో పాటు చేలు, పుంత, చెరువు గట్ల పైన, లంక భూముల్లోను మరో 2 వేల హెక్టార్ల వరకూ రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. అందుకే ధరల పతనం ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్లో జరిగిన కుంభమేళా నుంచి కొబ్బరి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఇదిలానే కొనసాగుతూ, గత సెప్టెంబర్ నెలఖారులో ఏకంగా రూ.32 వేలకు చేరింది. అక్టోబర్ నుంచి కొద్దికొద్దిగా తగ్గుతూ నెలాఖరుకు రూ.21 వేలకు పడిపోయింది. నవంబర్ ప్రారంభం నుంచీ ఈ ధర మరింత పతనమవుతూ వస్తోంది. మొన్నటి వరకూ దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు, దీపావళి, కార్తిక మాసం వంటి కారణాలతో కొబ్బరికి మంచి డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు కూడా గణనీయంగా ఎగుమతులు జరిగేవి. అదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఫలితంగా ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు పండగల సీజన్, కార్తిక మాసం ముగియడం.. ఇదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి పెరగడం, అక్కడి నుంచి నాణ్యమైన కాయలు మార్కెట్ను ముంచెత్తడం వంటి కారణాలతో మన కొబ్బరికి డిమాండ్ పడిపోయింది. మరోవైపు శుక్ర మూఢం రావడం, సంక్రాంతి వరకూ శుభకార్యాలు పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో ఎగుమతులు, ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల్లో ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు జరిగేవి. నేడు 20 లారీలకు మించి వెళ్లడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచైతే రోజుకు పది పన్నెండు లారీలకు మించి ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. దిక్కు తోచని స్థితిలో.. ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి కాయలు రూ.10 వేలు పలుకుతున్నా.. దింపు, మోత, ఒలుపు, రవాణా వంటి పేర్లతో వ్యాపారులు రైతులకు ధరలో కోత పెడుతున్నారు. ధరలు పడిపోతూండటంతో ఇటు రైతులు, అటు వ్యాపారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ధర లేదని చెట్టు నుంచి దించకపోతే కొబ్బరి కాయలు నేల రాలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎంతో కొంత వస్తుందని సరిపెట్టుకుని దింపు తీద్దామన్నా వ్యాపారులెవ్వరూ రావడం లేదని వాపోతున్నారు. గతంలో ధర ఉన్నప్పుడు తోటల్లో ఎకరానికి దింపునకు వెయ్యి కాయల దిగుబడి వచ్చేదని, నేడు తీతకు 1,500 నుంచి 1,700 కాయలు వస్తున్నా కొనుగోలు చేసేవారే కనిపించడం లేదని అంటున్నారు. అయితే, దింపు తీస్తే ధర ఎక్కడ మరింతగా తగ్గిపోతుందోనని భయపడుతున్న వ్యాపారులు కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదు. తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.ఫ దారుణంగా పడిపోయిన కొబ్బరి ధరలు ఫ గతంలో వెయ్యి కాయలు రూ.32 వేలు ఫ నేడు రూ.10 వేలు ఫ రైతుకు దక్కుతున్నది రూ.7 వేల నుంచి రూ.8 వేలు ఫ 10–12 లారీలు మాత్రమే ఎగుమతులు ఫ కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కొబ్బరి భారీగా దిగుమతులు ఫ అందువల్లనే ధర తగ్గిందంటున్న వ్యాపారులు -
నారు.. గిరాకీ జోరు
ధర బాగుంది నారుకు కొరత ఎక్కువగా ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. దీంతో ధర బాగుంది. మొన్నటి వరకూ ఎకరం విస్తీర్ణంలో నాటడానికి అవసరమైన 6 వేల మొక్కల ధర రూ.7 వేలు ఉంది. ప్రస్తుతం అది రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. మడిలో నారు రూ.8 వేలు పలుకుతోంది. నాట్లు ఆలస్యంగా మొదలవడంతో నారుకు డిమాండ్ ఏర్పడింది. ఎక్కువగా ట్రే నారు నాట్లు వేస్తున్నారు. మూడేళ్లుగా నారు వ్యాపారం లాభసాటిగా ఉంది. ఎకరాకు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల ఆదాయం వస్తోంది. – వల్లభనేని సత్యనారాయణ, రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలంఫ ఎకరం నారు రూ.14 వేలు ఫ మడి నారు రూ.8 వేలు ఫ ఎకరానికి రూ.10 లక్షల ఆదాయం ఫ ఊపందుకున్న పొగాకు నాట్లు దేవరపల్లి: మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు నాట్లు ఊపందుకోవడంతో నారుకు గిరాకీ పెరిగింది. ఇరవై రోజుల నుంచి పొగాకు సాగు ముమ్మరంగా జరుగుతోంది. ఈ ఏడాది 20 నుంచి 30 రోజులు పొగాకు నాట్లు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మడుల్లోని నారు తీయలేదు. దీంతో, మొక్కల కింద ఉన్న చిన్న మొక్కలు గాలి, వెలుతురు అందక, ఎదుగుదల లేక అణగారిపోయాయని నారుమడుల రైతులు తెలిపారు. ఒక్కసారిగా నాట్లు ప్రారంభం కావడంతో మడుల్లోని నారు ముదర అయిపోవడంతో లేత నారుకు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఉన్న నారుకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది మడి నారు ఎకరం (6 వేల మొక్కలు) రూ.3,500 నుంచి 5 వేలు పలకగా, ట్రే నారు రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలికింది. ట్రే నారు ఆరోగ్యకరంగా, మాను దృఢంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు ట్రే నారు కొనుగోలు చేసి, నాట్లు వేశారు. మడుల్లో నారు దాదాపు పూర్తి కాగా, ట్రే నారు రైతుల వద్ద సిద్ధంగా ఉంది. నారు కొరత ఏర్పడటంతో ధర రెట్టింపు పలుకుతోంది. ప్రస్తుతం మడి నారు ఎకరం రూ.6 వేల నుంచి రూ.8 వేలు, ట్రే నారు రూ.12 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. ఈ ధర మున్ముందు మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు. నారు వ్యాపారులకు ఈ ఏడాది మంచి లాభాలు వచ్చాయి. ఎకరం విస్తీర్ణంలో నారుమడి కట్టిన రైతుకు సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం వచ్చినట్టు సమాచారం. ఎకరం నారుకు 2023 సీజన్లో రూ.18 వేలు, 2024 సీజన్లో రూ.16 వేలు చొప్పున ధర పలికింది. గత రెండేళ్లూ నారుమడులు కట్టిన రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. ఈ ఏడాది పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 285 హెక్టార్లలో నారుమడులు వేశారు. రీజియన్ పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో పొగాకు సాగుకు రైతులు సన్నద్ధం కావడంతో నారుకు కొరత ఏర్పడినట్టు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఎకరం రూ.70 వేల చొప్పున రైతులు కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. కిలో విత్తనాలు రూ.25 వేలకు కొనుగోలు చేశారు. ఎకరం విస్తీర్ణంలో నారుమడుల సాగుకు సుమారు రూ.3 లక్షల ఖర్చవుతోందని రైతులు తెలిపారు. దేవరపల్లి మండలం దేవరపల్లి, పల్లంట్ల, లక్ష్మీపురం, సంగాయగూడెం, చిన్నాయగూడెం, బందపురం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు నర్సరీలు వేశారు. వ్యాపారులు మడుల్లోను, పంట సాగు చేసే పెద్ద రైతులు ట్రేలలోను నారు పెంచారు. -
‘షష్ఠి’ వేడుకలకు సర్వం సిద్ధం
బిక్కవోలు: దేవ సేనాని అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి ఉత్సవాలకు ఆ స్వామి క్షేత్రమైన బిక్కవోలు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని, విద్యుద్దీప తోరణాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో స్వామివారి షష్ఠి ఉత్సవాలు మంగవారం రాత్రి 1.10 గంటలకు (తెల్లవారితే బుధవారం) తీర్థపు బిందె సేవతో ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం నుంచి ఉమ్మలాడ, భీమవరం, దువ్వ, బిక్కవోలు గ్రామాల కళాకారులతో బ్యాండ్ కచేరీలు, అనంతరం సాయంత్రం 4 గంటల వరకూ బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 9 గంటలకు భారీ బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాలు, శక్తివేషధారులు, గారడీ విన్యాసాల నడుమ స్వామివారి గ్రామోత్సవం కోలాహలంగా నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ బాణసంచా ప్రదర్శన చేస్తారు. భక్తుల రధ్దీ దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి 50 మంది పారిశుధ్య సిబ్బందిని తీసుకు వచ్చారు. స్నాన ఘట్టాల్లో విద్యుద్దీపాలు, ఆలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
పంచ సూత్రాలు కావు.. పచ్చి అబద్దాలు: కన్నబాబు
సాక్షి, కాకినాడ: 18 నెలల పాలనలో రైతును నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం.. పంచ సూత్రాల పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల కోసం ధరల స్థిరీకరణ ప్రణాళికతోపాటు నిధీ కూడా లేని చంద్రబాబు ప్రభుత్వానికి.. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు.రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్టే లేదని.. ఉన్నదల్లా చంద్రబాబు వ్యక్తిగత మార్కెటింగేనని తేల్చి చెప్పారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల జరిగన నష్టం కన్నా.. ప్రభుత్వం చేసిన నష్టమే ఎక్కువుగా ఉందని ఆక్షేపించారు. అరటికి రేటు లేదని రైతులు గోలపెడుతుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ బాబు కహానీలు చెబుతున్నారని మండిపడ్డారు. దేశంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా రూ.99 పైసలకే సంతర్పణ చేసిన చరిత్ర మరే ప్రభుత్వానికీ లేదన్న ఆయన.. దీన్ని విశాఖ భూదోపిడీకి జరుగుతున్న పెద్ద స్కామ్గా అభివర్ణించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..రైతులను మభ్యపెట్టే కార్యక్రమం..గడిచిన వారం రోజులుగా ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త డ్రామాలకు తెరతీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడం మానేసి.. తామేదే చేస్తున్నామని వారిని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది. 18 నెలల కూటమి పాలనలో కంటతడిపెట్టని రైతు లేడు. వరి దగ్గర నుంచి అపరాలు వరకు, అరటి నుంచి కొబ్బరి వరకు ఏ పంట పండించిన రైతును కదిలించినా ఒకటే బాధ. కానీ చంద్రబాబు తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడో.. ప్రజలను మభ్యపెట్టాలనుకున్నాడో తెలియడం లేదు. ఇది ఆశ్చర్యం.రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని చూస్తే.. అశ్వద్ధామ హతహ్ హతహ్ కుంజరహ తరహలో.. రైతన్నా మీ కోసం అని గట్టిగా చెబుతూ.. మనసులో మాత్రం మీకేమీ చేయలేం అన్నది గుర్తుకు వస్తుంది. రైతులు కోసం మీరు ఏం మేలు చేశారని చంకలు గుద్దుకుంటూ భుజాలెగరేస్తున్నారు? రైతులను కాలరెగరేసుకునేలా చేస్తామని చెప్పుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా? రాష్ట్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ఫలానా పంట పండించిన రైతు ఆనందంగా ఉన్నాడని ఇచ్చాపురం నుంచి తడ వరకు, అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఒక్కరిని చూపించండి.కనీసం అంటే కనీసం మానవత్వం, ప్రేమ, దయలేని ప్రభుత్వమిది. పండించిన పంటకు దిక్కూ మొక్కూ లేదు కానీ పంచ సూత్రాల పేరుతో రైతన్నా మీకోం అని తయారై ఇంటింటికీ తిరుగుతూ ఏం చేయబోతున్నారు. రైతు పండించిన పంటకు దిక్కులేదు కానీ పంచసూత్రాల పేరుతో ప్రచారానికి మాత్రం తయారయ్యారు.పంచ సూత్రాలు- పచ్చి అబద్దాలునీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్..ప్రపంచ వేదికగా మార్కెటింగ్.. ఇలా మీ మాటలు వినడానికి మాత్రం సొంపుగా ఉంటాయి. వీటిలో ఒక్కటీ చేసిన పాపాన పోలేదు. నీటి భద్రత తీసుకుంటే.. ఒక్క కాలువ కూడా మీరు బాగుచేయలేదు. రెండోది డిమాండ్ ఆధారత పంటలు... ఉల్లి, టమోట రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక పొలంలోనే విడిచిపెడుతున్న దుస్థితి. కనీసం ఫలానా పంటకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ పంట సాగుచేయండి అనైనా మీరు రైతులకు చెప్పలేదు. అదీ లేదు.అగ్రిటెక్.. ఈ విషయంలో మీ ప్రభుత్వం మరింత ఫెయిల్. ఏ విషయంలో టెక్నాలజీని వ్యవసాయానికి సంధానం చేశారు. ఉన్న ఇ-క్రాప్ పథకాన్నే మొత్తానికి సున్నా చుట్టించేశారు. పుడ్ ప్రాసెసింగ్ విషయానికొస్తే... రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో ఫలానా దగ్గర ఉంది అని మీరు చెప్పండి. చివరిగా ప్రపంచవేదికగా మార్కెటింగ్ .. ఇక్కడ దిక్కులేదు కానీ ప్రపంచ వేదిక అని చెబుతున్నారు.అరటి రైతుల వెతలు పట్టని ప్రభుత్వం..మీరు అమలు చేస్తున్న పంచ సూత్రాలేమిటంటే... రైతుకు ఆశపెట్టి బొమ్మ చూపించడం, పబ్బం గడుపుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, మోసం చేయడం, పబ్బం గడుపుకోవడం ఇదే మీ పంచ సూత్రాలు చంద్రబాబూ. ఇంత అన్యాయంగా రైతుల పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదు? అరటి పంట ధర దారుణంగా పడిపోయి, రైతులు దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు.ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే.. త్వరలో ఏపీ అరటిని కొంటాం అన్న ఈ వార్త చూస్తే.. కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటుందేమోనని అనిపిస్తుంది. ఈ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వమూ కాదు. ఢిల్లీ దగ్గర ఉన్న ఆజాద్ పూర్ మండి వ్యాపారులు హామీ ఇచ్చారని ఈనాడులో రాశారు. మరో వార్తలో రైతుల్లో కలవరం, వాతావరణంలో మార్పు.. గోనె సంచుల కొరత, కొనుగోలు చేసిన ధాన్యం నమోదవ్వని వైనం, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం... అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది.ఈ రెండు వార్తలు రాష్ట్రంలో ఉన్న రెండు పవిత్ర పత్రికల్లో వచ్చాయి. వీటిని కూడా అబద్దాలు అని మీరు కొట్టిపారేస్తారా?18 నెలల్లో ఒక్క పంటకూ లేని మద్ధతు ధర..18 నెలల కాలంలో ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. టమోట పంటను రైతులు ధర లేకపోవడంతో కోయలేక వదిలిపెట్టారు. మామిడికి ధరలేదు, మద్ధతు ధర ఇస్తామని ఇవ్వలేదు. మొక్క జొన్న రైతులైతే దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిపోయారు. పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అధికంగా మొక్కజొన్న పండిస్తారు. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాళ్లకి రూ.2300 నుంచి రూ.2400 కొంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం రూ.1700 మాత్రమే ధర పలుకుతుంది. మా ప్రభుత్వ హయాంలో మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాడు చేసి.. అన్నిచోట్ల 30-40 శాతం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీరెందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు?మొక్కజొన్న రైతులు అన్యాయమైపోతుంటే చూస్తూ ఎందుకు కూర్చున్నారు. బత్తాయి రైతులు సర్వనాశనం అయిపోయారు. మార్కెట్ లో కనీస ధరకు కూడా అడిగే పరిస్థితి లేదు. చివరకిరైతులు బత్తాయి తోటలను తెలిగిస్తున్నారు. ఉల్లి రైతులైతే పంట తొలగిస్తున్నారు. తీత ఖర్చులు కూడా రావు. అరటి పంట విషయంలో ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ధర లేదు అంటే ఢిల్లీలో ఉన్న వ్యాపారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా రైతుల దగ్గర అరటి కొనండని బ్రతుమాలుతోంది.ఇదే అరటి పంటకు కోవిడ్ టైంలో ధరలు పడిపోతే... అరటిని ఎగుమతి చేసే కంపెనీలతో తీసుకొచ్చాం. ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి చేసాం. గూడ్స్ రైళ్లు తీసుకొచ్చి ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించి అరటి పంటను ఎగుమతి చేశాం. మీ హయాంలో అసలు ధరలస్ధిరీకరణ కోసం నిధి లేదూ, ప్రణాళిక కూడా లేదు. రైతన్నా మీ కోసం అని తిరగడానికి సిగ్గనిపించడం లేదా?అరటి గడిచిన మూడేళ్లలో సగటున వైయస్సార్సీపీ ప్రభుత్వంలో టన్నుకు రూ.25 వేలు పలికితే... ఇప్పుడు టన్ను రూ.500, కేజీ రూ.50 పైసలు పలుకుతోంది. కనీసం కోత ఖర్చులు అయినా వస్తాయా?మీరేమో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి అడిగితే వారు 15 రోజుల తర్వాత వచ్చి కొంటామని చెబుతున్నారంట. ఈలోగా కాయ పండిపోయి కుళ్లిపోవడం ఖాయం. ఇదీ రైతన్నా మీకోసం అని మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమం.ధాన్యం మద్ధతుధర 75 కేజీలకు మా హయాంలో కన్నా ఇప్పుడు రూ.300-రూ.400 తక్కువ ధరకు కొంటున్నారు. మొక్కజొన్న సగటున గత మూడేళ్లలో రూ.2300 నుంచి రూ.2090 ఉంటే ఇప్పుడు రూ.1200- రూ.1700 ఉంది. పత్తి ఎంఎస్పీ మా హయాంలో క్వింటాళ్ కి రూ.7020 ఉంటే.. ఈరోజు రూ.4500 నుంచి రూ.5000 ఉంది. వేరుశెనగా మా ప్రభుత్వ హయాంలో 6370 ఉంటే ఇవాళ రూ.4000 నుంచి రూ.4300 ఉంది. వైఎస్ జగన్ ముఖ్యంత్రిగా ఉన్నప్పుడు వరికోత యంత్రాల అద్దెలను కూడా నియంత్రించాం. గంటకు రూ.2500 ఉంటే ఇప్పుడు రూ.4000- రూ.4500 వసూలు చేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.గత 18 నెలలుగా రైతులు ఇంత ఇక్కట్లు పడుతుంటే రైతన్నా మీ కోసం నేనున్నాను అని నిలబడిన నాయకుడు ఒక్కడు లేడు. ఇవాళ మీరు స్లోగన్లు ఇస్తుంటే ఖర్మ కాకపోతే మరేంటి? చంద్రబాబు నాయుడు వ్యక్తిగత మార్కెటింగ్ తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ లేదు. 18 నెలల కాలంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీరు డేటా చెప్పగలరా? ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా? ఎందుకు ఈ డేటా చెప్పడం లేదు? ఏ రోజు పత్రికలు తిరగేసినా ఎంతమంది రైతులు బలవన్మరణం పొందారో రాస్తున్నారు. అయినా చీమకుట్టినట్లైనా లేదు.ఇక కౌలురైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఎన్నికల ముందు వైయస్.జగన్ ప్రభుత్వంలో అయితే కేంద్రంతో కలిపి రూ.13,500 ఇస్తున్నారు.. నేను అయితే అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడిసాయంగా రూ.20వేలు కేంద్రంతో సంబధం లేకుండా ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒక్కో రైతుకు రూ.40వేలు ఇవ్వాలి.కానీ ఇప్పటివరకు కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీ అనుకూలంగా మర్చిపోయారా? గుర్తుందా? వారికి ఎందుకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోతే మీరు వేసిన లెక్కల ప్రకారమే రూ.600 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఈ 18 నెలల కాలంలో దాన్ని ఎందుకు చెల్లించలేదు?. రైతన్నా మీ కోసమే అని స్లోగన్ చెబుతూ.. మీరు రైతులకు చెల్లించాల్సింది ఎందుకు ఇవ్వడం లేదు?అబద్దపు ప్రచారాలు- రైతుకు అందని చిల్లిగవ్వ సాయంఒక వైపు రైతులు చితికి పోతుంటే... మరోవైపు అన్నదాత సుఖీభవ అని మీరు దీవిస్తుంటే ప్రజలు అర్దం చేసుకోలేరా? మీ పంచ సూత్రాలు పచ్చి అబద్దాలు. వ్యక్తిగత ప్రచారాలు, డ్రామాలకే మీరు పరిమతమవుతున్నారే తప్ప.. రైతుల కోసం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పగలరా? ఆ రోజు వైస్.జగన్ ప్రభుత్వం కన్నా మిన్నగా మేము ఇది చేశామని చెప్పగలరా? అరటి పంటనే తీసుకుంటే మీరెంత సాయం చేశారు? మేమేం చేశామో తెలుస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ అరటి రైతులను పరామర్శించి వారికి అండగా నిలబడనున్నారు.మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం, కందులు, పెసలు, ఉల్లి, మిర్చి, పెసలు, పొగాకు, అరటి, సజ్జలు, కోకో, చీనీ, మామిడి ఇలా ఎవిరిని తీసుకున్నా... ఒక్క రైతుకూ చేయూతనివ్వని, ఒక్క రైతునీ నిలబడ్డనీ మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది?ఆ హక్కు మీకెక్కడుంది. ఏ వర్గం మీ పాలనలో ఆనందంగా లేదు. వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఎవ్వరూ మీ ప్రభుత్వంలో ఆనందంగా లేరు.ఉచిత పంటల బీమా రద్దు, సున్నా వడ్డీకి ఎగనామం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రకృతి విపత్తుల కన్నా రైతులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే నష్టమే ఎక్కువగా ఉంది. మామిడి పంట తీసుకుంటే... మామిడి రైతులకు డబ్బులిస్తామని ప్రకటించారు. ఇవాల్టి వరకు ఒక్క రూపాయి వాళ్ల అకౌంట్లో వేస్తే చూపించండి. మామిడి రైతుల కోసం కర్ణాటక, తమిళనాడులో రూ.5 నుంచి రూ.18 వరకు మద్ధతు ధర ఇచ్చింది. ఏపీలో రూ.4 మద్ధతు ధరతో సరిపెట్టుకోవాలని చెప్పారు. ఇప్పుడేమో ఇంకా లెక్కలు తీస్తున్నామని చెబుతున్నారు. సీజన్ అయిపోయనా... ఇంకా లెక్కల పేరుతో కాకమ్మ కధలు చెబుతున్నారు.రైతులకి చంద్రబాబు ఇచ్చినన్ని హామీలు ఎవ్వరూ ఇచ్చి ఉండరు. రైతుల నుంచి ఉల్లి పంటను క్వింటాల్లు రూ.1200 కొనుగోలు చేస్తుందని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు. క్వింటాళ్లకు రూ.1200 ఇస్తామని చెప్పి అది అమలైందో లేదో కూడా చూడలేదు. మామిడి పంటకు కేజీ రూ.12 ఇస్తామన్నారు. మిర్చికి క్వింటాళ్లకు రూ.11,781 ఇస్తామన్నారు. ఏ ఒక్కటైనా అమలు చేశారా?. ఏది తీసుకున్నా ఆ రోజుకి పత్రికల్లో హెడ్ లైన్స్ లో ఉండాలన్న తపన తప్ప..ఆ పథకంపైనా కానీ, ఆ కార్యక్రమం పైనా కానీ రైతులకు చేరువ అయిందా? లేదా అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప మరేం లేదు.ఫెయిలైనా బాబు బుకాయింపు..చివరికి యూరియా రైతులకు సక్రమంగా సరఫరా లేదు, .. .ఒక బస్తా యూరియా కూడా రైతులకు ఇవ్వడంలో మీరు విఫలమయ్యారు అంటే.. యూరియా వాడితే కేన్సర్ వస్తుందని చెబుతాడు. అన్నం తింటే మీ ఆరోగ్యాలు మటాష్ అయిపోతాడు అంటాడు. పేదవాడి ఐదువేళ్లు నోటిలోకి వెళ్లాని... కిలో రెండు రూపాయలు బియ్యం పథకం చంద్రబాబు మామ ఎన్టీఆర్ గారి ప్రవేశపెడితే.. దాని వల్లఅందరి ఆరోగ్యాలు పోయాయన్నట్టు మాట్లాడుతున్నాడు.విత్తనాలు అందవు, పురుగుమందులు, యూరియా కూడా అందవు. చంద్రబాబు రైతులతో ముఖాముఖిలో ... డ్రోన్లకు కెమెరాలు ఏర్పాటు చేసి దాని సాయంతో ఏ మొక్కమీద పురుగు ఉందో చూస్తే.. డ్రోన్ ఆ మొక్క మీదే పురుగుమందు పిచకారీ చేస్తుందని చెబుతున్నాడు.ఇంకా చిత్రంగా గాలిని కూడా ఎనలైజ్ చేస్తామని చెబుతున్నాడు. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకొస్తాడంట. అరటికి రేటు లేదు మహాప్రభో అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తామంటున్నాడు. పండిన ధాన్యం కొనేవాడు లేరంటే... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎవరికి కావాలి.. దయచేసి రియల్ ఇంటెలిజెన్స్ వాడండి చంద్రబాబూ.పండిన పంటకు ధరలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే.. ప్రపంచ మార్కెట్ వేదికగా చేస్తానని చెబుతున్నాడు. అంటే మండీల దగ్గరకు వెళ్లి వ్యాపారులను బ్రతిమాలడమా? ఇదేం ప్రభుత్వం. అసలు మీకేమీ బాధ్యత అనిపించడం లేదా? కోనసీమలో కొబ్బరిరైతులు రేటు పెరిగిందని ఆనందపడేలోపే కొబ్బరి రేటు అనూహ్యంగా పడిపోయింది. అంబాజీ పేట మార్కెట్ లో నెల రోజుల వ్యవధిలో 1000 కాయిలకు రూ.9వేలు ధర తగ్గింది. ప్రభుత్వం కనీసం జోక్యం చేసుకోలేదు. గత నెలలో ఇదే సమయానికి 1000 కాయిలకు రూ.23-రూ.24 వేలు ఉండే ధర... రూ.9వేలు తగ్గిపోయింది. కనీసం నాఫెడ్ కి లేఖ రాసి మా కొబ్బరి కొనండని లేఖ కూడా రాయలేదు. రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.మీరు మామిడి రైతులకు కేజీ రూ.4 సబ్సిడీ అదనంగా ఇస్తామన్నారు. ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఎన్ని టన్నులకు ఇచ్చారు? ఆ వివరాలు ఉంటే ఇంటింటికీ వెల్లి చూపించండి. మనుషులతో, ప్రజల ఎమోషన్స్ తో చంద్రబాబురాజకీయం చేస్తున్నారు. తుపాన్ వస్తే అగ్గిపెట్టలు, కొవ్వెత్తులు సరఫరా చేయడం, యోగా డే వస్తే మ్యాట్ లు సరఫరా చేయడం, పుష్కరాలు వస్తే ముక్కులు పెట్టించడం, వరద వచ్చినా, తుపాను వచ్చినా పండగ చేసుకోవడం మీ కలవాటు.విశాఖ భూసంతర్పణ - భారీ స్కామ్..ఇక మీ భూముల పందేరం చూస్తే... రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎకరా రూ.99 పైసలకే కట్టబెడుతున్నారు. దేశ చరిత్రలో రూ.99 పైసలకే ఎకరాలకు ఎకరా పంచిన ప్రభుత్వం మరొక్కటి లేదు. అదేమిటని ప్రశ్నిస్తే పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు అని చెప్తారు ఇదో పెద్ద స్కామ్. విశాఖలో భూముల ధారాదత్తం చేయడం ఏమిటి? మీరు అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతిలో భూములు కేటాయించవచ్చు కదా? విశాఖలో భూకంపాలు వస్తాయని, సునామీలు, తుపాన్లు వస్తాయని మన పత్రికల్లోను కథనాలు రాశారు కదా? ఇప్పుడు రావా? కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వస్తాయా? మీ శిల్పి చెక్కిన మహనగరం అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఏ మహానుభావుడు ఎందుకు ముందుకు రావడం లేదు?వైజాగ్ కే ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్ గా ఉండాల్సిన మీరు వీటన్నింటినీ మీకు ఇష్టం వచ్చిన రేటుకి ధారాదత్తం చేయడమనేది ఏ విధంగా సబబు? వేల కోట్లు ఆస్తులు ఎవరికో అప్పనంగా కట్టబెట్టే మీరు రైతులకు మేలు చేద్దామన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు? రియల్ ఎస్టేట్ కంపెనీలకు రూ.99 పైసలకే ఎకరా ఇచ్చే మీరు.. రూ.99 రూపాయలకు గజం జాగా పేదవాడి ఇంటి స్థలానికి ఇవ్వలేరా? విశాఖపట్నం భూములకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి... కాబట్టి వాటిని నెమ్మదిగా కృష్టార్ఫనం చేస్తున్నారు.వైఎస్ జగన్.. అడుగడుగునా అన్నదాతలకు అండగా..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2024 వరకు చూస్తే ఒక్క ఉచిత పంటల బీమా కిందే రూ.7802 కోట్లు, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 3262 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కింది రూ. 34,288 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ దాదాపు రూ.43744 కోట్లు, ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3497 కోట్లు, సున్నా వడ్డీ రాయితీ రూ.2051 కోట్లు, రూ.1380 కోట్లు విత్తన సబ్సిడీ ఇవ్వడంతో పాటు రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి పీడర్లు సామర్ధ్యాన్ని పెంచాం.అదే విదంగా రూ.8845 కోట్లు మీ విద్యుత్ బకాయిలు తీర్చడంతో పాటు సెనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్, ధాన్యం సేకరణకు రూ.960 మీ బకాయిలు తీర్చాం. మీ విత్తన బకాయిలు రూ.384 కోట్లు తీర్చాం. ఇది కాకుండా పంటల కొనుగోలుకు రూ.7787 కోట్లు ఐదేళ్లో ఖర్చు పెట్టింది. మీ ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు 18 నెలల కాలంలో ఎంత చేశారు? మా మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ ఎంత? బడ్జెట్ లో మీ కేటాయింపులెంత? సమాధానం చెప్పండి చంద్రబాబూ అని నిలదీశారు.కూటమి ప్రభుత్వంలో రైతు పండించిన ఏ పంటైనా రోడ్డు పాలవ్వడం పరిపాటిగా మారిందని, అదే వైయస్.జగన్ ప్రభుత్వంలో కోవిడ్ లాంటి విపత్తులోనూ రైతు పండించిన ప్రతి పంటనూ కొనుగోలు చేయమని చెప్పారు. రైతులకు నష్టం రాకుండా చూడాలని చెప్పారు. అదే మార్కెట్ ఇంటర్ వెన్షన్, అదే రైతుని స్థిరీకరించే పద్ధతని కన్నబాబు తేల్చి చెప్పారు. అలా కాకుండా అశ్వద్ధామ హతహ్ తరహాలో రైతన్నా మీకోసం అని గట్టిగా చెప్పి... మనసులోపల ఏమీ చేయలేమన్నదే చంద్రబాబు నిజస్వరూపమని తేల్చి చెప్పారు. -
ధర పతనం.. అరటి రైతులకు శోకం
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: తీపి పంట అరటి.. రైతు నోరు చేదు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి దిగుబడి రావడం, ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడం, దేశీయంగా అరటి ధరలు గణనీయంగా పడిపోవడం, జిల్లా రైతులకు శాపంగా మారింది. ధరలు తగ్గడంతోపాటు ఎగుమతులు కూడా పెద్దగా సాగకపోవడంతో అరటి రైతులు విలవిలలాడుతున్నారు. (Banana Prices Drop In AP)ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరటి సాగు అధికం. ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు 25,204 ఎకరాల్లో అరటి పంట సాగు జరుగుతోంది. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, అంబాజీపేట మండలాల్లో ఈ సాగు అధికం. డెల్టాలోనే కాకుండా లంక గ్రామాల్లో అరటి ఏక పంటగాను, కొబ్బరిలో అంతర పంటగా సాగవుతోంది. మొత్తం సాగులో 80 శాతం తెల్ల అరటి, కర్పూరం కాగా, మిగిలిన 20 శాతం కూర అరటి, అమృతపాణి, ఎర్ర చక్కెర కేళీ వంటి రకాలు పండిస్తున్నారు.ఈసారి సీన్ రివర్స్సాధారణంగా కార్తిక మాసంలో అరటి ధరలు అధికంగా ఉంటాయి. కాని ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. కార్తిక మాసం మొదలైన నాటి నుంచి అరటి ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రావులపాలెం, అంబాజీపేట మార్కెట్ యార్డులలో అరటి ధరలు పరిశీలిస్తే కర్పూరం కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.200 చొప్పున ఉంది. చక్కెర కేళీ (తెలుపు) రూ.150 నుంచి రూ.250 వరకు, బుషావళి రూ.125 నుంచి రూ.200 వరకు, బొంత (కూర అరటి) రూ.150 నుంచి రూ.200 వరకు, అమృతపాణి రూ.200 నుంచి రూ.350 వరకు, చక్కెర కేళీ (ఎరుపు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడున్న ధరలకు గెలకు అదనంగా రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటే కాని రైతులకు గిట్టుబాటు కాదు. పైగా ఈ ధరలు నాణ్యత ఉన్న గెలలకు మాత్రమే. ఇప్పుడు మార్కెట్కు వస్తున్న గెలలు చాలా నాసిరకంగాను, చిన్న సైజువి కావడంతో ధరలకు మరింత కోత పెడుతున్నారు. (Banana Farmers Struggles In AP)నాణ్యత లేక ధరాఘాతం గత నెలలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు, వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలనంటిన విషయం తెలిసిందే. జిల్లాలో 3,379.90 ఎకరాల్లో పంట నేలకొరిగి దెబ్బతింది. తుపాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయింది. దీనివల్ల చెట్టు శక్తి కోల్పోవడంతో ఆ ప్రభావం గెలలపై పడింది. దీనివల్ల ఇప్పుడు కోత కోస్తున్న గెలల్లో 60 శాతం నాసిరకం గెలలు, మరో 20 శాతం మధ్యస్థంగా ఉండే మొరటు (నాణ్యమైన) గెలలు, మరో 20 శాతం మొరటు గెలలు వస్తున్నాయని రావులపాలెం మార్కెట్ యార్డు వ్యాపారులు చెబుతున్నారు.పది రోజులుగా పెరిగిన మంచు కూడా అరటి కాయల దిగుబడిని దెబ్బ తీస్తోంది. కాయల సైజు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆశించిన ధరలు రావడం లేదంటున్నారు. దీనివల్ల రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. సీజన్లో ఇక్కడ నుంచి రోజుకు 25 నుంచి 30 లారీల అరటి (లారీకి సగటున 800 గెలలు) చొప్పున రోజుకు 25 వేల గెలలు ఎగుమతి జరిగేది. ఇప్పుడు కేవలం 15 వేల నుంచి 18 వేల గెలలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి.నలువైపులా పోటీరాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురంలో దశాబ్దకాలంగా అరటి సాగు అధికంగా ఉన్నా అక్కడ జి–9 మాత్రమే పండించేవారు. ఇప్పుడు కర్పూరం అధికంగాను, అమృతపాణి, చక్కెర కేళీలు అధికంగా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి మొరటు 80 శాతం వరకు వస్తున్నాయి. దీనితో అక్కడ అరటికి డిమాండ్ పెరిగింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరటి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్కు ఎగుమతి అధికం. ఎర్ర చక్కెర కేళి మాత్రం తమిళనాడు వెళుతోంది. ఈ ఏడాది శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని ఖమ్మం, భద్రాది కొత్తగూడెంలో కూడా అరటి విస్తారంగా సాగు జరిగింది. మంచి దిగుబడి కూడా వస్తోంది. దీంతో ఉత్తరాదికి ఆయా జిల్లాల నుంచి ఎగుమతి అధికంగా ఉండడంతో ఇక్కడ అరటికి డిమాండ్ తగ్గింది.(Banana Farmers Challenges)తమిళనాడుకు ఎర్ర చక్కెర కేళీ ఎగుమతి అధికం. సీజన్లో దీని ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటోంది. ఇప్పుడు దిగుబడి నాణ్యత లేని కారణంగా రూ.200 నుంచి రూ.300కు పడిపోయింది. గతంలో రోజుకు ఆరు నుంచి ఎనిమిది మినీ వ్యాన్ల అరటి ఎగుమతి జరిగేది. ఇప్పుడు ఇది నాలుగు వ్యాన్లకు మించడం లేదు. పైగా తమిళనాడు నుంచి బొంత అరటి ఇక్కడకు పెద్ద ఎత్తున దిగుమతి అవుతోంది. దీని ధర కూడా తక్కువగా ఉండడం విశేషం.సంక్రాంతి వరకు డిమాండ్ వచ్చేలా లేదురావులపాలెం మార్కెట్కు పదిహే ను రోజులుగా నాణ్యత లేని గెలులు అధికంగా వస్తున్నాయి. తుపాను ప్ర భావం, మంచు వల్ల గెలల నాణ్యత దెబ్బతింటోంది. ధర పడిపోయింది. రాయలసీమలో పంట పెరగడం కూడా ధర పెరుగుదలకు అడ్డంకిగా మారింది. పండగల సీజన్ పూర్తవడంతో సంక్రాంతి వరకు డిమాండ్ వ చ్చేలా లేదు. – కోనాల చంద్రశేఖర్, అరటి వ్యాపారి, ఊబలంక, రావులపాలెం మండలంగాలులు దెబ్బ తీశాయితుపాను వల్ల ఈదురు గాలులకు అరటి తోటలకు పెద్ద దెబ్బ తగిలింది. గెలలు సరిగా తయారవడం లేదు. దీనివల్ల ధర రావడం లేదు. తుపాను ముందు గెల రూ.200 నుంచి రూ.400 వరకు ఉంది. ఇప్పుడు సగం ధర కూడా రావడం లేదు. గెలలు తయారవుతున్న సమయంలో గాలులు దెబ్బ తీశాయి.– పిల్లా గంగాధర్, అరటి రైతు, అంబాజీపేట -
పెళ్లింట కనువిందు!
డూడూ బసవన్నలు సింహద్వారం వద్ద రడీమేడ్ అరటి గెలలు వయ్యారాలు పోతున్న పల్లెటూరు యువతి తిరగలి తిప్పుతున్న పల్లె పడుచు ట్రెండుకు అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవితంలో ఒకసారి జరిగే వివాహ వేడుక చిరస్థాయిగా గుర్తుండిపోయేలా భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెదపట్నంలంకలో కొమ్ముల వారి మన మండువాలో సోమవారం రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్లో పలు రకాల బొమ్మలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కోనసీమ కొబ్బరాకు పందిళ్లు, అరటి బొందలతో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలకు ఈ బొమ్మలు తోడయ్యాయి. డూడూ బసవన్నలు, ఆవు, దూడ, కాళీయ మర్దనం, తిరగలి వద్ద కూర్చుని తిప్పుతున్న పల్లె పడుచు, డోలు, సన్నాయి వాయిస్తున్న వాద్యకారులు, బిందెతో వయ్యారాలు పోతూ కూర్చున్న పల్లె పడుచు బొమ్మలు రంజింపజేశాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చాయి. అతిథులు ఆసక్తిగా వీటిని తిలకించారు. వాటి వద్ద నిల్చుని సెల్ఫీలు, ఫొటోలు తీయించుకున్నారు. – మామిడికుదురు -
కాకినాడలో లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ లక్కీ షాపింగ్ మాల్ తన నూతన బ్రాంచ్ను కాకినాడ మెయిన్రోడ్డులో సోమవారం ప్రారంభించింది. సినీ తారలు ఓజీ ఫ్రేమ్ నటి ప్రియాంక మోహన్, యాంకర్, సినీనటి అనసూయ, జబర్దస్ నటుడు హైపర్ ఆది షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే వనమాడి వేంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు రాజశేఖర్, గ్రంధిబాబ్జి పాల్గొన్నారు. షోరూమ్ ప్రతినిధులు శ్రీను, రత్తయ్య, స్వామి మాట్లాడుతూ కాకినాడలో తమ బ్రాంచ్ను పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాలుగు అంతస్తుల్లో ఏర్పాటు చేశామన్నారు. కిడ్స్, మెన్, ఉమెన్కు సంబంధించిన వస్త్రాలతో పాటు పెళ్లి వేడుకలకు కావాల్సిన అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లు ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
సాఫ్ట్బాల్లో ఉమ్మడి తూర్పునకు ద్వితీయ స్థానం
ఐ.పోలవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 22 నుంచి 24 వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈ పోటీలు జరిగాయి. అండర్– 14 సాఫ్ట్బాల్ బాలబాలికల పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రెండు జట్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఇరు జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. ఈ జట్లలో జి.వేమవరం ఉన్నత పాఠశాలకు చెందిన బాలురు ఆరుగురు, బాలికలు ఏడుగురు జట్టు విజయం సాధించడంలో ప్రధాన భూమిక పోషించారు. బాలికల విభాగం నుంచి జి.వేమవరం పాఠశాల చెందిన ఎం బాబు బెస్ట్ పిక్చర్ గాను, మద్దింశెట్టి బాల ఆదిత్య బెస్ట్ బ్యాట్స్మెన్గా, బాలికల విభాగం నుంచి ఎం.ఝాన్సీ శ్రీ బెస్ట్ క్యాచర్గా అవార్డు అందుకున్నారు. రెండు జట్లలో స్థానిక క్రీడాకారులను సోమవారం స్థానిక పాఠశాలలో పాఠశాల హెచ్ఎం వారణాసి సుభద్ర లక్ష్మీదేవి, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బసవ అప్పారావు, సర్పంచ్ నల్లా సుదర్శన్రావు సత్కరించారు. ఇరు జట్లకు కోచ్, మేనేజర్గా వ్యవహరించిన ఎం.నాగ రాంప్రసాద్, జి.సునీల్ కుమార్, జి.కళావతిలను పలువరు అభినందించారు. -
జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఛరిష్మా
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) 69వ ఈవెంట్గా నిర్వహిస్తున్న జాతీయ బాస్కెట్ పోటీలకు అంబాజీపేటకు చెందిన విద్యార్థిని నిమ్మకాయల ఛరిష్మా సాయి రుత్విక ఎంపికై ంది. అమలాపురంలోని శ్రీవాగ్దేవి స్కూలులో పదో తరగతి చదువుతున్న ఛరిష్మా బాస్కెట్బాల్ రాష్ట్ర బాలికల జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన అంతర జిల్లాల బాస్కెట్ బాల్ పోటీల్లో ఛర్మిషా ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సాధించింది. వచ్చే నెల మొదటి వారంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజ్నంద్గామ్లో జరుగనున్న జాతీయ పోటీల్లో ఛర్మిషా జిల్లా జట్టుతో తలపడనుంది. సోమవారం సాయంత్రం స్కూలులో జరిగిన అభినందన సభలో విద్యార్థిని ఛర్మిషాను స్కూలు డైరెక్టర్ పరసా భరత్, ప్రిన్సిపాల్ డాక్టర్ శిష్టి శ్రీరామచంద్రమూర్తి, హెచ్ఎం పిచ్చిక సుబ్రహ్మణ్యం, పీఈటీ రాజేష్, ఇతర ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికై న ఛరిష్మా ఆ పోటీల్లో కూడా విజేతగా నిలిచి తమ స్కూలుకు, జిల్లాకు పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. -
షష్ఠి ఉత్సవాలకు వేళాయె
● బిక్కవోలులో పూర్తయిన ఏర్పాట్లు ● రాష్ట్రం నలుమూలల నుంచీ రానున్న భక్తులు బిక్కవోలు: రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు బుధవారం తెల్లవారుజామున 1.10 గంటలకు స్వామివారి తీర్థపు బిందె సేవతో శ్రీకారం చూడతారు. షష్ఠి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్ నుంచి రావిచెట్టు వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. చలువ పందిళ్లను రంగు,రంగుల వస్త్రాలతో అలంకరించారు. ఆలయ చరిత్ర 1,100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసియున్న శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన శివక్షేత్రాలలో ఒకటి. రాజహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే రోడ్డులో ఉన్న ఈ ఆలయం తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో భాసిల్లుతోంది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుని పేరిట విక్రమపురంగాను మూడవ విజయాదిత్యునిగా పేరుగాంచిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీ.శ. 849–892లో బిరుదాంకినవోలుగాను వినుతికెక్కింది. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు. గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శుత్రు సంహార పాప పరిహారం నిమిత్తం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు. తురుష్కుల దండయాత్రలు, మరాఠీ యుద్ధాల వల్ల చాలా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. నేడు బిక్కవోలులో ఆరు దేవాలయాలు చాళుక్యుల శిల్పాకళా వైభావానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. తూర్పుచాళుక్యుల తరువాత బిక్కవోలును రాజధానిగా పరిపాలించిన వారిలో ముఖ్యులు కొండవీటి రెడ్లు. వీరి కాలంలో సంగీత, సాహిత్య కళా సంగమ ప్రదేశంగా బిక్కవోలు పేరుగాంచింది. తర్వాత ఈ ప్రాంతం పెద్దాపురం సంస్థాఽనాధీశుల ఏలుబడిలోకి వచ్చింది. శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు 234 ఎకరాల చెరువును తవ్వించగా ఆ ప్రదేశంలో అనేక శివలింగాలు, శిథిలమైన దేవాలయాలు బయట పడటంతో నేటికీ లింగాల చెరువుగా పిలుస్తారు. రాజుగారి గోవులు దేవాలయ శిథిలాల పైకి వెళ్లి, అక్కడ వున్న పుట్టలో పాలు విడిచేవి. ఆ విషయం రాజుగారికి తెలిసి అక్కడ మట్టిని తవ్వించగా మూడు శివాలయాలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తున్నారు. గోవు పాదాలతో తొక్కడం వల్ల, గోవు పాలతో అభిషేకించడం వల్ల అప్పటి వరకు విజయేశురునిగా పిలిచిన స్వామిని నేడు గోలింగేశ్వరస్వామిగా పూజిస్తున్నారు. ఆలయంలో శ్రీ పార్వతి అమ్మవారు – శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు దక్షిణ ముఖంగాను, శ్రీ విజయ గణపతి, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయానికి ఇరుపక్కలా శ్రీ చంద్రశేఖరస్వామి, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు 25వ తేదీ రాత్రి 6 గంటకు భజన, 9 గంటలకు గొర్రెల బ్రదర్స్ రామచంద్రపురం వారి బుర్రకథ, 1.10 గంటలకు తీర్థపు బిందె సేవ అనంతరం ఏలూరు వారి నాబత్ ఖానా కచేరీ, 26న 7.20 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, ఉమ్మలాడ, భీమవరం, దువ్వ, బిక్కవోలు గ్రామాల బ్యాండ్ కచేరీ, 4.30 గంటలకు బాణసంచా 7.35కు గంటలకు వివిధ రకాల బ్యాండ్ మేళాలు, కోయ డాన్సులతో సంబరం, రాత్రి 10 గంటలకు బాణ సంచా పోటీలు. 27న కొలాటం, చండీమేళం, కేరళ వాయిద్యాలతో రథోత్సవం, 27న తాపేశ్వరం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్ నైట్, 28న బిక్కవోలువారి కూచిపూడి నృత్య ప్రదర్శన, 29న అనపర్తి వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్ నైట్, 30న రాజమహేంద్రవరం కూచిపూడి నృత్య ప్రదర్శన, సత్య హరిశ్చంద్ర నాటకం, డిసెంబర్ 1న ఏకాహం ప్రారంభం, 2న ఉదయం ఏకాహం ముగింపు, రాత్రి అన్న సమారాధనతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి.బిక్కవోలు సంతానం కోసం ఆలయంలో నిద్రిస్తున్న మహిళలు (ఫైల్) బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం అభయ ముద్రలో దర్శనం ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారిగా పూజలందుకుంటున్నారు. చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇస్తారు. పై రెండు చేతులలో దండం, పాశం ఉన్నాయి. కింద కుడిచేతితో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనంపై ఉంచారు. స్వామివారికి కుడి వైపున సహజ సిద్దమైన పుట్ట ఉంది. రోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. అంగారక క్షేత్రంగా పిలిచే ఈ దేవాలయంలో భక్తులు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సంతానం లేని మహిళలు పుట్ట పై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి సంతాన ప్రాప్తి కలుగజేస్తాడని భక్తుల నమ్మకం. అందరికీ స్వామి దర్శనం కల్పిస్తాం గత ఏడాది 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వస్తారని భావిస్తున్నాం. సుమారు రు.55 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అధికారులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – పల్లె శ్రీనివాసరెడ్డి(వాసు), షష్ఠి ఉత్సవ కమిటీ చైర్మన్, బిక్కవోలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ధాన్యం చెల్లింపుల్లో జాప్యానికి అధికారులదే బాధ్యత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, జాప్యం జరిగితే అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతుల పంట రోడ్లపై ఎక్కడ నిల్వగా కనిపించినా అధికారులు వెంటనే స్పందించి, సమస్య పరిష్కరించాలని అన్నారు. రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను కొంత మంది దళారులు మభ్యపెట్టి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, తేమ శాతం, దళారీ వ్యవహారాలు, మిల్లర్ల కొనుగోలు పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బి.గణేష్ కుమార్, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ, రవాణా, సహకార, మార్కెటింగ్ అధికారులు వి.పార్వతి, ఎస్.మాధవరావు, ఆర్.సురేష్, ఎం.వెంకట రమణ, ఎం.సునీల్ వినయ్ పాల్గొన్నారు. -
వజ్రోత్సవ సంరంభం
నిడదవోలు: మహత్తర చరితకు నెలవైన నేల ఇది.. చాళుక్య, కాకతీయ రాజవంశాలు ఏలిన జలదుర్గ పురమిది.. ఈ చారిత్రక పట్టణం నిడదవోలు.. పురపాలక సంఘం ఏర్పడి అరవై వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. వజ్రోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల బుధ, గురు, శుక్రవారాల్లో పురపాలక సంఘ వజ్రోత్సవాల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పురపాలక సంఘంగా ఆవిర్భావం : నిడదవోలు 1964 నవంబర్ వరకూ గ్రామంగా ఉండేది. అనంతరం 1964 డిసెంబర్ 1న తృతీయ శ్రేణి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. క్రమంగా అభివృద్ధి చెందుతూ కొన్నాళ్ల తరువాత ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ మారింది. ఈ అరవై వసంతాల కాలంలో నిడదవోలు పురపాలక సంఘానికి 12 మంది చైర్మన్లుగా పని చేశారు. దీనబంధు బిరుదు పొంది, పేదల డాక్టర్గా గుర్తింపు పొందిన బీవీఎన్ రాజు పట్టణ తొలి చైర్మన్గా ప్రజలకు విశేష సేవలందించారు. చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. చైర్మన్లలో చిన్నం వెంకన్న, బొబ్బా కృష్ణమూర్తి రెండేసిసార్లు పదవి చేపట్టారు. ఇద్దరు డాక్టర్లు చైర్మన్లుగా సేవలు అందించారు. వారిలో బీవీఎన్ రాజు, తోపరాల శ్రీరామలక్ష్మి ఉన్నారు. చైర్మన్ కొత్తపల్లి శ్రీరాములు హయాంలో 1972లో పురపాలక సంఘ కార్యాలయం నిర్మించారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మించి, దానికి ఆయన పేరే పెట్టారు. ఈ మున్సిపాలిటీలో ఇప్పటి వరకూ 41 మంది కమిషనర్లు పని చేశారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా భూపతి ఆదినారాయణ, కమిషనర్గా టి.కృష్ణవేణి ఉన్నారు. ఖరారవని షెడ్యూల్ : ఓ పురపాలక సంఘం వజ్రోత్సవాల సమయం సమీపిస్తున్నా ఇప్పటికీ వజ్రోత్సవాల షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో పట్టణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. వివిధ పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు, సినీ మ్యూజికల్ నైట్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వేడుకలను హాజరయ్యే ప్రజాప్రతినిధులు, కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు. మంగళవారం సాయంత్రానికి పూర్తి షెడ్యూల్ ఖరారవుతందని కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో చేసిన దండయాత్రల్లో నిడదవోలులోని అనేక పురాతన దేవాలయాలను మహమ్మదీయులు కొల్లగొట్టారని చెబుతారు. ఆ సందర్భంగా హిందూ సంప్రదాయాలకు సంబంధించిన దైవారాధన విగ్రహాలన్నీ చిన్నాభిన్నం చేశారని, ఈ క్రమంలోనే నిడదవోలులో శైవారాధనకు సంబంధించిన అనేక శిథిల విగ్రహాలు నేటికీ ఉన్నాయని అంటారు. మహమ్మదీయులకు భయపడి నాటి ప్రజలు మరికొన్ని సుందర విగ్రహాలను భూమిలో దాచేవారని నానుడి. గతంలో జరిగిన తవ్వకాల్లో అనేక ఏకశిలా విగ్రహాలు బయటపడటం గమనార్హం. ఆ తరువాత నిడదవోలు అన్ని మతాలు, సంప్రదాయాలకు నెలవైంది. చారిత్రక పరిశోధనల ప్రకారం నిడదవోలు పూర్వం గొప్ప శైవరక్షేత్రం. దీనికి నిదర్శంగా ఇక్కడ అనేక శివాలయాలు, శైవారాధనకు సంబంధించిన అనేక శిలా విగ్రహాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వినాయకుడు, నంది, శక్తి విగ్రహాలు అనేకం ఈ ప్రాంతంలో నేటికీ కనిపిస్తూంటాయి. పట్టణంలోని చినకాశిరేవులో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే, ఇక్కడి పురాతన గోలింగేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, నంగాలమ్మ పూరి గుడి ప్రసిద్ధి చెందాయి. మండలంలోని తిమ్మరాజుపాలెంలో వెలసిన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. 24ఎన్డీడీ02: నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం పట్టణ స్వరూపం వార్డులు 28 విస్తీర్ణం 14.15 చదరపు కిలోమీటర్లు జనాభా 43,809 మహిళలు 22,528 పురుషులు 21,281 గృహాలు 10,873 పార్కులు 6 వార్డు సచివాలయాలు 13 సచివాలయ ఉద్యోగులు 111 ప్రభుత్వాస్పత్రులు 3 మున్సిపల్ పాఠశాలలు 15 విద్యార్థులు 1,113 ఘన చరిత్ర ఫ నిడదవోలు పట్టణాన్ని పూర్వం నిరవద్యపురం, నిరవద్యప్రోలు అనే పేర్లతో పిలిచేవారు. తూర్పు చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య నిరవద్యపురం, పెరువంగూరు గ్రామాల్లో యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. నిరవధ్య అనేది క్రీస్తు శకం 699 – 729 మధ్య పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రెండో విజయాదిత్యుని బిరుదు. ఆయన పేరుతోనే ఈ పట్టణం నిర్మించారని చెబుతారు. విజయాదిత్యుడు ఏకంగా పన్నెండేళ్ల పాటు 108 స్థలాల్లో రాష్ట్రకూటులతో యుద్ధం చేశాడని, అన్నింటిలోనూ ఇతడే విజయం సాధించాడని అంటారు. ఈ యుద్ధం వల్ల వచ్చిన పాపం తనకు అంటకుండా విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడు. ఫ తూర్పు చాళుక్యుల్లో 10వ శతాబ్దంలో మొదటి భీమరాజు ఉండేవాడు. క్రీస్తుశకం 918లో రాష్ట్రకూటులు వేంగీ దేశంపై దండెత్తారు. భీమరాజు నిడదవోలు దుర్గాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రకూటులను పారదోలాడు. మొదటి భీమరాజే సామర్లకోట, ద్రాక్షారామ, భీమవరం గ్రామాల్లో భీమేశ్వరరాలయాలు, పాలకొల్లులో క్షీరారామ దేవాలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఫ చాళుక్యుల అనంతరం నిరవద్యపురాన్ని కాకతీయులు పాలించారు. వీరి కాలంలో శిల్పకళ ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఈ నేల నుంచి బయట పడుతున్న అనేక సుందర విగ్రహాలు కాకతీయుల కాలం నాటివనే చెబుతారు. 13వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు కోస్తాంధ్రను జయించడానికి వచ్చాడు. తాను జయించిన ప్రాంతాల్లో తన పాలనను బలపరచుకోవడానికి ఆ ప్రాంత రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆవిధంగా గణపతి దేవుడు తన కుమార్తె వీర రుద్రమదేవిని నాటి నిరవద్యప్రోలు పరిపాలకుడు వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే, వీరభద్ర చాళుక్యుడు నడి వయసులోనే మరణించడంతో రుద్రమదేవి సంసార జీవితం మధ్యలోనే విచ్ఛిన్నమైందని అంటారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రగతి జోరు ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిడదవోలు మున్సిపాలిటీ ప్రగతి జోరందుకుంది. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా రూ.371.33 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఫ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక అయిన నిడదవోలు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఫ పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో రూ.91.16 లక్షలతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించారు. దీని ద్వారా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందుతున్నాయి. ఫ పట్టణంలోని పాటి మీద సెంటర్ నుంచి గణపతి సెంటర్ వరకూ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణతో పాటు గణపతి జంక్షన్ అభివృద్ధి పనులను రూ.5.50 కోట్లతో చేపట్టారు. గణపతి జంక్షన్ అభివృద్ధిలో భాగంగా విశాలమైన నాలుగు లేన్ల రోడ్లు, వాటర్ ఫౌంటెయిన్, సుందరమైన ‘ఐ లవ్ నిడదవోలు’ పార్కు, మంచినీటి పైప్లైన్, డ్రైనేజీ, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన సుందరీకణ పనులు చేపట్టారు. ఫ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.352.85 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఫ 60 వసంతాల నిడదవోలు ఫ వజ్రోత్సవాలకు సిద్ధమైన పురపాలక సంఘం ఫ రేపటి నుంచి 28 వరకూ వేడుకలు -
వ్యాసహృదయావిష్కరణే లక్ష్యం
ఫ వాస్తవాలను కల్పనలు కప్పివేస్తున్నాయి ఫ 60 రోజుల ప్రవచనాల్లో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఫ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఫ 27 నుంచి వేదవ్యాస భారత ప్రవచనాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): శతాబ్దాల చరిత గల సుందర నగరం.. రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక జగత్తులో నవశకావిష్కరణకు సిద్ధమవుతోంది. ఆదికవి నన్నయ భట్టారకుడు తెలుగు భాషలో ఆంధ్ర భారత రచనకు శ్రీకారం చుట్టిన ఈ నగరి.. వేదవ్యాస భారత ప్రవచన యజ్ఞానికి వేదిక కానుంది. ‘మాసానాం మార్గశీర్షోహమ్’ అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ప్రకటించిన.. భగవద్గీత లోకానికి వెల్లడైన మార్గశిర మాసంలో.. ఆస్తిక లోకం ఎదురు చూపులు ఫలించే తరుణం ఆసన్నమవుతోంది. ఈ నెల 17 నుంచి జనవరి 25వ తేదీ వరకూ వరుసగా 60 రోజుల పాటు రాజమహేద్రవరం హిందూ సమాజంలో వేదవ్యాస భారతాన్ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించనున్నారు. ఏకబిగిన ఇన్ని రోజుల పాటు ఈ ప్రవచన మహాయజ్ఞం జరగడం విశేషం. ఈ ప్రవచన విశేషాలు.. వేదవ్యాస భారతంలోని కొన్ని అంశాల గురించి తనను సోమవారం మర్యాదపూర్వకంగా కలసిన ‘సాక్షి’కి సామవేదం వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ● అదే ఆశయం బహుళ జనాదరణ పొందిన భారత కథలో కవుల ఊహలు.. అధ్యయన రాహిత్యంతో రూపొందించిన నాటకాలు, సినిమాల ప్రభావంతో అనేక కట్టుకథలు, పిట్టకథలు వచ్చి చేరిపోయాయి. అసలు కథ ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది, వాస్తవాలను కల్పనలు కప్పివేస్తున్న ఈ తరుణంలో వ్యాస మహర్షి అందించిన విజ్ఞాన భాండాగారాన్ని యథాతథంగా స్మరించుకోవడమే ఈ ప్రవచనాల ఆశయం. వ్యాస హృదయావిష్కరణే లక్ష్యం. ● భారతేతిహాసానికి కథానాయకుడు ఎవరంటే.. శ్రీమద్రామాయణం పేరు చెప్పగానే రామచంద్రుడు కథానాయకుడని ముక్తకంఠంతో సమాధానం వినవస్తుంది. భారత కథకు నాయకుడు, కథను నడిపించిన వాడు శ్రీకృష్ణుడే. ఈ విషయాన్ని గ్రంథారంభంలోనే వ్యాసుడు స్వయంగా స్పష్టం చేశారు. యుధిష్ఠిరుడు ధర్మమయమైన వృక్షం అనుకుంటే, ఆ వృక్షానికి కాండం అర్జునుడు, శాఖ భీమసేనుడు, నకుల సహదేవులు ఫలపుష్పాలు. దీనికి మూలాలు మూడు కృష్ణుడు, వేదం, వేదవిహిత జీవనం గడిపేవారు. ● నిఘంటు అర్థాలు చూసి అధ్యయనం చేయరాదు వేద వాజ్ఞ్మయాన్ని, ఆర్ష సాహిత్యాన్ని కేవలం నిఘంటు అర్థాలతో అధ్యయనం చేయరాదు. శాస్త్రమర్యాదలు తెలుసుకోవాలి. లౌకికమైన అర్థాలు వేరు, శాస్త్రపదాలు వేరు. ఉదాహరణకు.. కృష్ణుడు రాయబారం పూర్తయ్యాక, కర్ణుని ఏకాంతంలో కలుసుకుని, అతని జన్మరహస్యం చెబుతాడు, పాండవ పక్షానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక్కడ ‘ద్రౌపది ఆరో భర్తగా నిన్ను స్వీకరిస్తుంద’నే అపవ్యాఖ్యానం ఒకటి వచ్చింది. ఈ సందర్భంలో వ్యాసుని శ్లోకం ఈవిధంగా ఉంటుంది. ● రాజన్యా రాజకన్యాశ్చ అనయంత్యభిషేచనం షష్ఠే చ త్వాం తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి ఈ శ్లోకానికి అనువాదం చేస్తూ, కొందరు పండితులు సైతం ‘ద్రౌపది నిన్ను ఆరవ వానిగా వరిస్తుంద’ని అర్థం చెబుతున్నారు. వేదభాషలో ఈ ‘కాలం’ అనే మాటకు అర్థం కనపడుతుంది. ‘చతుర్థకాల పాన భక్తస్యాత్..’ అని అధర్వణ వేదంలో ఉన్నది. అంటే రోజును నాలుగు భాగాలు చేసి, నాలుగో కాలం వచ్చేసరికి భోజనం చేయాలి. రామాయణంలో పేర్కొన్న పంచమ కాలం అనే మాటకు సంధ్యా సమయమని అర్థం. జ్యోతిష శాస్త్రం ప్రకారం షష్ఠే కాలే అంటే పట్టాభిషేక సమయమని అర్థం. అంటే, పట్టాభిషేక సమయంలో మిగతా వారితో పాటు ద్రౌపది నిన్ను కూడా సేవిస్తుంది అని అన్వయించుకోవాలి. ● కర్ణుడు పాల్పడిన ఘోర పాతకం సినిమాల ధర్మమా అని కర్ణుడు దాన వీర శూర కర్ణుడయ్యాడు. నిండు సభలో ద్రౌపదిని వివస్త్ర చేయమని ఆదేశించినది కర్ణుడు. దుశ్శాసనునితో కర్ణుడు ‘‘పాణ్డవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర’’ అని ఆదేశిస్తాడు. అంటే దాని అర్థం పాండవులవి, ద్రౌపదివి బట్టలను ఊడదీయుము’’ అని ఈ శ్లోకపాదానికి అర్థం. ఒక్క పాపం చాలు– అనేక పుణ్యాలను దహించివేయడానికి. ● వాటిల్లో నిజం ఉందా? మయసభలో ద్రౌపది దుర్యోధనుని భంగపాటు చూసి నవ్విందా.. సభాపర్వంలో భీముడు అన్నగారి చేతులు కాలుస్తానని అన్నాడని తెలుగు సాహిత్యంలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా.. కర్ణుడిని ఇంద్రుడు మోసగించి సహజ కుండలాలు తీసుకుపోయాడన్న కథనంలో సత్యం ఉందా.. శకుని పాచికలు మాయ పాచికలని సినిమాలు చెబుతున్నది నిజమా.. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వ్యాసహృదయాన్ని ప్రవచనాల్లో ఆవిష్కరిస్తాం. ● పంచమవేదం ఎలా? వేదం నుంచి వచ్చింది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని విస్తరించి చెప్పినవి పురాణేతిహాసాలు. సనాతన ధర్మాన్ని అతి విస్తారంగా భారతం చెబుతోంది. కర్మ, ఉపాసన, జ్ఞాన కాండలు మహాభారతంలో ఉన్నంత విస్తారంగా మరి ఏ ఇతర గ్రంథంలోనూ కనపడవు. అందుకే భారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తున్నారు. -
అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వస్తున్న అర్జీల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని, సమస్యలను నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆమె, ఇతర అధికారులు 200కు పైగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు చేసిన ప్రతి ఫిర్యాదుపై స్పష్టమైన విచారణ జరిపి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, అభివృద్ధి, హౌసింగ్, సంక్షేమ శాఖలకు చెందిన ఐదుగురు ముఖ్య అధికారులతో పలు సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. హౌసింగ్ సర్వే పురోగతి, భూ రికార్డుల శుద్ధి, రెవెన్యూ వివాదాల పరిష్కారం, ప్రజలకు పారదర్శక సేవల అందుబాటుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుకు సంబంధిత శాఖలు వెంటనే ఆయా ముఖ్య కార్యాలయాలకు ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. వచ్చే నెలలో భారతీయ భాషలపై వర్క్షాప్ రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో భారతీయ భాషలపై వచ్చే నెల 8, 9 తేదీల్లో వర్క్షాప్ జరుగనుంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరు కానున్నారని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ భాషా సమితి మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) సహకారంతో నిర్వహించనున్నారు. దీనికి కోఆర్డినేటర్గా తెలుగు విభాగం అధ్యాపకుడు డాక్టర్ తలారి వాసు వ్యవహరిస్తారు. రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
అదనపు ఏర్పాట్లు లేకుండా ‘సీ్త్ర శక్తి’ అమలు సరికాదు
రాజమహేంద్రవరం సిటీ: అదనపు ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏఎస్ నారాయణ, ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం అమలుతో జరుగుతున్న జాప్యానికి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతూ విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులకు దిగుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం బస్సుల్లో 70 మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు మార్చాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేస్తే హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. దాడికి గురైన సిబ్బంది తిరిగి విధుల్లో చేరే వరకూ ఆన్ డ్యూటీగా పరిగణించాలని, తక్షణం కార్పొరేట్ వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. బస్సులను ఏమాత్రం పెంచకుండా సీ్త్ర శక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. తక్షణం బస్సుల సంఖ్యను పెంచి, చెకింగ్ విధానంలో మార్పులు తేవాలని వారు అన్నారు. కార్యక్రమంలో యూనియన్ డిపో కార్యదర్శి బీఆర్కే కుమారి పాల్గొన్నారు. -
పవన్కళ్యాణ్ పర్యటనలో ‘పచ్చ’ రచ్చ
కోరుకొండ/కొయ్యలగూడెం/ద్వారకాతిరుమల: తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలింది. కూటమి నేతల కొట్లాటలు, శ్రేణుల నుంచి నిరసనలు సైతం తప్పలేదు. పవన్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రాగా.. టీడీపీ శ్రేణులు రచ్చరచ్చ చేశాయి. పవన్ను కలిసేందుకు రుడా చైర్మన్, టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణచౌదరి, సీఎం చంద్రబాబు పర్యటనల కో–ఆర్డినేటర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కుమారుడు అభిరామ్ వర్గీయులు విమానాశ్రయానికి చేరుకున్నారు.ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు అభిరామ్ను మాత్రమే అనుమతించి, బొడ్డు వర్గీయులకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులను బొడ్డు వర్గీయులు నిలదీశారు. పెందుర్తి అభిరామ్పై బూతు పురాణం అందుకున్నారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, కొద్దిపాటి కొట్లాట చోటుచేసుకున్నాయి. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇరువర్గాలకు చెందిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కార్మీకుల నిరసన సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్కళ్యాణ్కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు. గ్రామాల్లో నిరసన సెగ ఏలూరు జిల్లాలో పర్యటించిన పవన్ నిరసన సెగ ఎదుర్కోవాల్సి వచ్చింది. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్తుండగా.. కొయ్యలగూడెం మండం గంగన్నగూడెం, తిమ్మనకుంట గ్రామాల ప్రజలు రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపారు. తమ గ్రామాల్లోని రోడ్లను పట్టించుకోవాలని కోరుతూ ప్రజలు ప్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిలబడ్డారు. ఇవేవీ పట్టించుకోకుండానే పవన్ వెళ్లిపోయారు. అధ్వానంగా ఉన్న రాజవరం ప్రధాన రహదారిపై భారీఎత్తున ఎగసిపడిన దుమ్ము, ధూళి మధ్య కలెక్టర్ వెట్రిసెలి్వతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.పవన్ తమ గోడును వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు తమ గ్రామానికి చెందిన కూటమి నాయకులను నిలదీశారు. దీంతో కూటమి నాయకులు సైతం ప్లకార్డులను ప్రదర్శిస్తూ మూడు పుంతల రోడ్డు వద్ద గంగవరం గ్రామస్తులతో కలసి రోడ్డు సమస్యపై ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం తిరుగు ప్రయాణంలో అక్కడకు రాగా ఆందోళనకారులు కాన్వాయ్ను అడ్డుకుని చుట్టుముట్టారు. దీంతో కారులో నుంచే పవన్కళ్యాణ్ ఆందోళన కారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.ఇచ్చిన పత్రాలనే మళ్లీ ఇచ్చిన పవన్ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన పవన్కళ్యాణ్ ఆ ఆలయ అభివృద్ధికి సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. స్థల పరిశీలన జరిపిన అధికారులు 30 ఎకరాలను కేటాయించారు. ఈ భూమికి సంబంధించిన హక్కు పత్రాలను ఈ ఏడాది మే 16న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తి, మరికొందరితో కలసి శ్రీవారి దేవస్థానం ఈవో ఎన్వీఎస్ఎన్మూర్తికి అందజేశారు. తాజాగా సోమవారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పవన్ ఆ 30 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పత్రాలను మళ్లీ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కు అందించారు. ఒకే భూమికి సంబంధించిన పత్రాలు ఎన్నిసార్లు ఇస్తారని స్థానికులు గుసగుసలాడారు. -
ఉచిత పంటల బీమా ప్రవేశపెటా్టలి
● రైతుల పాలిట శాపంగా చంద్రబాబు ప్రభుత్వం ● ఇన్పుట్ సబ్సిడీకి మంగళం ● బ్లాక్ మార్కెట్లో విత్తనాలు, ఎరువులు ● గిట్టుబాటు ధర ఎక్కడ? ● వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర నేత ధ్వజం నిడదవోలు: రైతులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు అన్నారు. ఈ పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడిందని, రైతులపై భారం లేకుండా ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని అన్నారు. రెండో ఏడాది అమలు చేసినా, 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారని చెప్పారు. ఇప్పుడు రెండో విడత పెట్టుబడి సాయం చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవానికి ఈ పథకం కింద ఇస్తామన్నదెంత, ఇస్తున్నది ఎంత అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల సాయం అందించామన్నారు. నాటి జగన్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయంలో కౌలు రైతులకు మొండి చేయి చూపించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉందని అన్నారు. రైతులను మోసగిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందాల్సిన సాయం చేస్తామని చెబుతూ మోసం చేస్తోందని సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్ విధానం, సబ్సిడీ వంటి అన్ని సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడి, రైతుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. అన్ని వర్గాల మాదిరిగానే రైతులను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దగా చేసిందని ధ్వజమెత్తారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నూరు శాతం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విత్తు నుంచి పంట అమ్మకం వరకూ రైతన్నకు తోడుగా నిలిచేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి, పూర్తిగా నిర్వీర్యం చేసే స్థితికి తీసుకు వచ్చారన్నారు. తద్వారా విత్తనాలు, యూరియా వంటి ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే దుస్థితి తీసుకువచ్చారన్నారు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. వరి పంట వద్దని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన పంట ఏదో సీఎం సూచించాలని ఎద్దేవా చేశారు. గత తుపాను వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోలేదని, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పండించిన పంటలకు ధరలు పతనమై కష్టాల్లో రైతులుంటే పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పాలనను, రైతులను పక్కన పెట్టిందని సుబ్బారావు మండిపడ్డారు. కార్యక్రమంలో ఉండ్రాజవరం సొసైటీ అధ్యక్షుడు సంకురాత్రి సుబ్బారావు, సర్పంచ్ మెంటే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ఫ ‘సాక్షి’ స్పెల్బీ, మ్యాథ్బీకి విశేష స్పందన ఫ ట్రిప్స్ స్కూల్లో ఉత్సాహంగా నిర్వహణ ఫ స్పెల్బీ క్వార్టర్, మ్యాథ్బీ సెమీ ఫైనల్స్ పరీక్ష ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులను ఆంగ్ల భాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివా రం నిర్వహించిన స్పెల్బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్బీ సెమీ ఫైనల్స్కు విశేష స్పందన లభించింది. రాజమహేంద్రవరం త్రిపుర నగర్లోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పరీక్షలు రాయించేందుకు అమితాసక్తి చూపారు. ‘సాక్షి’ స్పెల్బీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 కేటగిరీలుగా నిర్వహించగా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ ‘సాక్షి’ మ్యాథ్బీ 4 కేటగిరీల్లో జరిపారు. 1,180 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కేటగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో 3, 4 తరగతులకు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులకు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ‘సాక్షి’ స్పెల్బీ, మ్యాథ్బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలోని ప్రతిభను గుర్తించడానికి, కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు అన్నారు. స్పెల్బీ, మ్యాథ్బీ నిర్వహించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలాత్రిపురసుందరి, ‘సాక్షి’ రీజనల్ మేనేజర్ రమేష్రెడ్డి’ పర్యవేక్షించారు. ప్రజెంటింగ్ స్పాన్సర్గా డ్యూక్స్వేఫీస్, అసోసియేట్ స్పాన్సర్గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి.ఆంగ్లం, గణితంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ మ్యాథ్బీ పరీక్ష ద్వారా గణితంలో రీజనింగ్, లాజికల్ ఽథింకింగ్తో పాటు పోటీతత్వం పెంపొందించడంలో దోహదం చేస్తుంది. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి ప్రజ్ఞావంతులుగా తయారవుతారు. స్పెల్బీ, మ్యాథ్బీ పరీక్షలు ‘సాక్షి’ నిర్వహించడం అభినందనీయం. – రూపాదేవి గూడూరు, డైరెక్టర్, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం కాన్ఫిడెన్స్ పెరుగుతోంది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ‘సాక్షి’ స్పెల్బీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి. – ధన్యట్రెఫోసా, 8వ తరగతి, ట్రిప్స్ స్కూల్, రాజమహేంద్రవరం భయాన్ని దూరం చేసేందుకు.. ‘సాక్షి’ స్పెల్బీలో గత ఏడాది ఫైనల్స్కు వెళ్లాను. అలాగే ‘సాక్షి’ మ్యాథ్బీ అంటే ఎంతో ఆసక్తి. గణితంపై భయాన్ని దూరం చేసే విధంగా మ్యాథ్స్బీ పరీక్ష ఒక ప్రాక్టీస్లా ఉపయోగపడుతుంది. మా నైపుణ్యాలు పెరుగుతాయి. థ్యాంక్యూ ‘సాక్షి’. – ఆశ్రిత ఎండూరి, 8వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం అకడమిక్గా ఉపయోగం ‘సాక్షి’ స్పెల్బీ కాంపిటేషన్ పరంగానే కాక అకడమిక్గా కూడా చాలా ఉపయోగపడుతోంది. కాంపిటేషన్ కోసం వందల్లో పదాలు నేర్చుకునే అవకాశం కలిగింది. తద్వారా అకడమిక్గా కూడా అన్ని విధాలా సహకారి అయ్యింది. – మేడపాటి శ్రీలక్ష్మీ సాత్విక, 10వ తరగతి, లాహోరల్ స్కూల్, రాజమహేంద్రవరం ప్రోత్సహించడం అభినందనీయం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ‘సాక్షి’ స్పెల్బీ నిర్వహించడం అభినందనీయం. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్లో ఒకాబ్యులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – గోడి అజయ్, విద్యార్థి తండ్రి, రాజమహేంద్రవరం గణితంపై భయం ఉండదు.. గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ‘సాక్షి’ మ్యాథ్బీ దోహదపడుతుంది. ఈ పరీక్షలు పై తరగతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాథ్బీ గణితంపై పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. – నౌషద్ బేగం, విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరంకొత్త విషయాలు తెలుసుకున్నా.. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడంతో నేను కొత్త విషయాలను తెలుసుకున్నాను. స్పెల్లింగ్స్తో పాటు, ఇంగ్లిష్లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడింది. ‘సాక్షి’ యాజమాన్యం స్పెల్బీ పరీక్ష రాయించి విద్యార్థులను ప్రోత్సహించడం బాగుంది. – పూర్వి మల్లెల, 6వ తరగతి, ఆదిత్య స్కూల్, శ్రీనగర్, కాకినాడ -
ఏం చేశారని మాకోసం?
సాక్షి, రాజమహేంద్రవరం: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూంటే.. చుట్ట కాల్చుకునేందుకు నిప్పు కావాలన్నాడట మరొకడు. చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇదే చందంగా ఉందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఓవైపు ప్రకృతి విపత్తులతో వ్యవసాయం అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పైగా రైతులకు ఎంతో చేసేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలకు నాంది పలికింది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి 30వ తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రచారార్భాటానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రతి రైతు ఇంటికీ వెళ్లి వారి జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ పరిశీలిస్తారు. అదే రోజు రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. అయితే, దాదాపు ఏడాదిన్నరగా ‘ప్రచారార్భాటం పీక్.. ఆచరణ వీక్’ అనే రీతిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వాధినేతలు, అధికారులు.. తమకు చేసిందేమీ లేకున్నా, ఇప్పుడు ఈ ప్రచారార్భాటమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సమస్యలపై రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలోననే మీమాంస ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. ‘సుఖీభవ’ అంటూ దుఃఖపెడుతున్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు డప్పేసి చెప్పారు. తీరా అధికారం చేపట్టిన తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు జెల్ల కొట్టారు. రెండో ఏడాది జిల్లావ్యాప్తంగా 18,511 మంది రైతులకు మొండిచేయి చూపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతుభరోసా నిధులు అందించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంఖ్య 1,14,991కు తగ్గిపోయింది. మరోవైపు సుమారు 1.10 లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి దుఃఖాన్నే మిగిల్చారు. గత నాలుగేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్ల మేర రైతుభరోసా సాయం అందించింది. వ్యవసాయ విద్యుత్కు కోతలు వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సర్కారు గొప్పగా చెప్పింది. కొన్ని రోజులకే విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించింది. దీంతో, రైతులు పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం సొమ్ము ఏదీ? ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా నగదు ఇవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా గత రబీలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు నెలలు గడుస్తున్నా చెల్లించిన దాఖలాలు లేవు. ధాన్యం సేకరణలో నిబంధనలు ఖరీఫ్ ధాన్యం సేకరణలో అనేక నిబంధనలు విధించింది. తడిసి, రంగు మారి, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లర్లకు నచ్చి, వాళ్లు ఇచ్చే ధరకే విక్రయించుకోవాలంటూ చేతులెత్తేసింది. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉంటుందని, దీనికి మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు చెబుతూండటంతో రైతులు దారణంగా నష్టపోతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు పెద్దపీట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడిచింది. తుపాను ప్రభావంతో కూరిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటల లెక్క వెంటవెంటనే తేల్చింది. నెలల వ్యవధిలోనే పెట్టుబడి సాయంగా రూ.14.80 కోట్లు అందించింది. ● వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద గత ప్రభుత్వం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి మండలంలో మూడు ఆర్బీకేలకు డ్రోన్లు మంజూరు చేసింది. జిల్లాకు మొత్తం 91 డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ పనులకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం రెండో ఏడాది ఇచ్చింది కొంత మందికే.. తుపాను బాధిత రైతులకు అందని పరిహారం పుట్టెడు కష్టాల్లో అన్నదాతలు ఈ పరిస్థితుల్లో ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రభుత్వ కార్యక్రమం నేడు ప్రారంభం రైతులు నిలదీస్తే ఏం చెప్పాలన్న మీమాంసలో ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ (రూ.) పంట ఇన్పుట్ సబ్సిడీ వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000 మొక్కజొన్న 12,500 మినుములు, పెసలు, శనగలు, 10,000 ప్రొద్దుతిరుగుడు, పొగాకు జొన్న 8500ఉచిత బీమాకు మంగళం ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతుల పైనే మోపింది. 2024–25 రబీకి సంబంధించి ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం హెక్టారు వరికి రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. పంట భూమి విస్తీర్ణం పెరిగేకొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇంత మొత్తం చెల్లించడం భారం కావడంతో వేలాదిగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫలితంగా గత నెలలో మోంథా తుపానుకు పంట నష్టపోయిన రైతులు పరిహారం పొందలేని దుస్థితి తలెత్తింది.ఆర్బీకేలు నిర్వీర్యం విత్తు నుంచి విక్రయాల వరకూ రైతులకు అడుగడుగునా తోడుగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 ఆర్బీకేలు (రైతు భరోసా కేంద్రాలు) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు రైతులకు సాగులో సలహాలు సైతం అందించింది. ఉద్యాన పంటలకు సైతం ప్రోత్సాహం అందించేది. ఇటువంటి రైతుహిత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించింది. తద్వారా రైతులు అదునుకు యూరియా వంటి ఎరువులు పొందేందుకు రైతులు నానా అగచాట్లూ పడాల్సి వచ్చింది ‘మోంథా’ సాయమేదీ? మోంథా తుపాను జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. అధికారుల తుది నివేదిక ప్రకారం జిల్లాలోని 18 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 33,262 మంది రైతులు ఈ తుపాను వలన నష్టపోయారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ పంటలకు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. తుపాను వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి. -
అనేక కార్యక్రమాలు
సత్యసాయి బాబా వారి స్ఫూర్తితో సత్యసాయి సేవా సమితుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే నారాయణ సేవగా అన్నదాన కార్యక్రమం ఒకటి. నిరుపేదలు, కనిపెంచిన సంతానం, ఆదరణ లేక జానెడు పొట్ట కోసం ఎంతోమంది విలవిల్లాడుతున్నారు. వారి జీవన స్థితిగతులను స్వయంగా చూశాం. వారు బయటకు రాలేరు. చేయి చాచి యాచించలేరు. అటువంటి వారి కోసం పలు సేవా సమితులు నిత్య నారాయణ సేవ అమలు చేస్తున్నాయి. ఎందరో అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాయి. – మన్యం పర్వత వర్థనరావు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల వలంటరీ కన్వీనర్, రావులపాలెం -
జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా తలాటం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన తలాటం హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కార్యదర్శి నక్క వెంకటేష్ శనివారం తెలిపారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్ఫరాజ్ నవాజ్, కోశాధికారి జి.అప్పారావు (జిమ్మీ), ఎన్ సత్యానందంలతో పాటు సభ్యులు ఏకగ్రీవంగా హరీష్ను ఎన్నుకున్నారు. ఈయన గతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్కి సేవలు అందించడంతో పాటు హరీష్ ఫౌండేషన్ పేరుతో క్రీడామైదానాల అభివృద్ధితోపాటు క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రొత్సహిస్తున్నారు. -
పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్
మామిడికుదురు: ‘పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్’ అని ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల పేర్కొన్నారు. ‘రాజి’ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన శనివారం పెదపట్నంలంకలో మాట్లాడుతూ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’, రామ్పోతినేని నటించిన ‘ఆంధ్రాకింగ్’, ‘మహేంద్ర గిరి వారాహి’, ‘తెరచాప’ చితాల్లో నటించానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘డ్రాగన్’ జనవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంతవరకు 225 చిత్రాల్లో నటించానన్నారు. స్టూడెంట్ నెంబర్–1, సూర్యపుత్రులు, రామబంటు, సై, విక్రమార్కుడు, జనతా గ్యారేజ్, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు తనకు గొప్ప క్రేజ్ను తెచ్చాయన్నారు. -
27 నుంచి సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వేదవ్యాస భారతంపై సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ నెల 27 నుంచి జనవరి 25వ తేదీ వరకూ 60 రోజుల పాటు రాజమహేంద్రవరంలో ప్రవచనాలు చేయనున్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్, ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరుగుతుందని భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మహాభారత ప్రవచన యజ్ఞం వివరాలు తెలియజేశారు. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకూ టి.నగర్ హిందూ సమాజంలో ప్రవచనాలు జరుగుతాయన్నారు. ప్రపంచ భాషల్లో 1.25 లక్షల శ్లోకాలు కలిగిన అత్యంత ఉత్కృష్ట గ్రంథం భారతం ఒక్కటేనని చెప్పారు. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. సమకాలీన పరిస్థితుల్లో మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి, ఏది ధర్మమో, ఏది కాదో తెలుసుకోవడానికి భారతం చదవాలని చెప్పారు. ఇవేమీ కాకుండా మోక్షం కావాలనుకునే వారు సైతం భారతం చదవాలన్నారు. భారతంలోని సనత్సుజాతీయం అనేక వేద, ఉపనిషత్తుల సారాంశమని, విష్ణు, శివ సహస్ర నామాలు, భగవద్గీత మనలను తరింపజేసేవని అన్నారు. భారతంలోని అద్భుత సన్నివేశాలను క్రోడీకరించి, సమన్వయపరచి అందించే ప్రవచనకర్తల్లో సామవేదం వారిని ముందుగా చెప్పుకోవాలని నారాయణరావు అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ, సామవేదం షణ్ముఖశర్మకు రాజమహేంద్రవరంతో ఎనలేని అనుబంధముందని చెప్పారు. ఇక్కడ ఆయన నెలకొల్పిన వల్లభ గణపతి ఆలయం నేడు ఒక దివ్యక్షేత్రంలా భక్తులను అలరిస్తోందన్నారు. గతంలో వ్యాస భాగవతం, వాల్మీకి రామాయణాలపై ప్రవచనాలు అందించిన సామవేదం.. త్వరలో చేయనున్న సంపూర్ణ వ్యాస భారత ప్రవచనాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. -
కిక్కిరిసిన అన్నవరప్పాడు
పెరవలి: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ దేవేరులతో కొలువు తీరిన స్వామివారికి అర్చకులు విశేష పూజలు, వివిధ సేవలు నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాత దోనెల వెంకటేశ్వరరావు దంపతుల ఆర్థిక సహాయంతో 8 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. జిల్లావ్యాప్తంగా సత్య సాయి బాబా శత జయంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా సచివాలయ స్థాయి వరకూ భక్తిప్రపత్తులతో నిర్వహించనున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణపై రెవెన్యూ, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల, విద్యా శాఖ, సంగీత కళాశాల, సమాచార, పౌర సంబంధాల శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాబా జయంతి సందర్భంగా ఆదివారం అన్ని కేంద్రాల్లోనూ తప్పనిసరిగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, సంబంధిత పొటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి ‘రైతన్నా మీకోసం’సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో సోమవారం నుంచి శనివారం వరకూ ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ అంశంపై తన క్యాంపు కార్యాలయం నుంచి వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, మత్స్య, అనుబంధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకూ విశ్లేషించి, డిసెంబర్ 3న 2026–27 కార్యాచరణ ప్రణాళిక ఖరారుకు ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్షాపులు నిర్వహించాలని సూచించారు. ప్రతి 3 కుటుంబాలను ఒక క్లస్టర్గా విభజించి, ఒక బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 ఇళ్లు) సందర్శించాలని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశం, కరపత్రం అందజేయాలని కలెక్టర్ అన్నారు. టెలి కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి, ఆర్డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు. -
కొండలు కరిగించేస్తున్నారు
లేబర్ కోడ్ల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి● నల్గొండలో విచ్చలవిడిగా ఎర్రమట్టి తవ్వకాలు ● రేయింబవళ్లు యథేచ్ఛగా తరలింపు ● రోజుకు సుమారు రూ.30 లక్షలు పైగా దోపిడీ సీతానగరం: అధికారం అండగా కొండలను సైతం కరిగించేస్తున్నారు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ఎర్రమట్టి తవ్వేసి.. వందలాదిగా టిప్పర్లతో తరలించుకుపోతున్నారు.. దీని వెనుక కొంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి. మండలంలోని నల్గొండ వద్ద కొండ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరం – సీతానగరం రోడ్డు బెర్ములకనే పేరుతో కొంత మంది అక్రమార్కులు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. కొండను పొక్లెయిన్తో పిండి చేసి, లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలకు మైన్స్ అనుమతి ఉన్నప్పటికీ టిప్పర్లకు బిల్లులతోనే రవాణా చేయాలి. కానీ, ఇక్కడ ఎటువంటి బిల్లులూ లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొండ వద్ద ఒక్కో టిప్పర్ పొక్లెయిన్తో లోడింగ్కు సుమారు రూ.1,600 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా లోడ్ చేసిన టిప్పర్ గ్రావెల్ను బయట రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజూ సుమారు 150 టిప్పర్లతో గ్రావెల్ తరలించుకుపోతున్నారని సమాచారం. అలాగే, ట్రాక్టర్పై పొక్లెయిన్తో లోడింగ్కు రూ.600 వరకూ వసూలు చేస్తున్నారు. దీనిని బయట సుమారు రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఈవిధంగా ప్రతి రోజూ 100 ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా టిప్పర్లు, ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు గ్రావెల్ తరలిస్తూ రోజుకు సుమారు రూ.34 లక్షల వరకూ జేబుల్లో నింపుకొంటున్నారని సమాచారం. దీనిపై తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఒకచోట తవ్వకాలకు మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చినట్లు సమాచారముందని చెప్పారు. ప్రతి లారీకి బిల్లు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో అక్రమ మైనింగ్పై స్థానిక ఎస్సై డి.రామ్కుమార్ను వివరణ కోరగా.. ఈ విషయాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సి ఉందని అన్నారు. గ్రామాల్లో అడ్డొస్తే తొక్కేస్తామనే రీతిలో టిప్పర్లు అతి వేగంగా దూసుకుపోతూండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాగే వదిలేస్తే ఈ కొండ ఏడాది కాలంలో కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ స్థానిక శ్యామల సెంటర్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. లేబర్ కోడ్ల నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ, నూతన లేబర్ కోడ్ల వల్ల యువత ఉద్యోగ భద్రత కోల్పోతుందన్నారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలతో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ మాట్లాడుతూ, భారత కార్మిక వర్గానికి ఇది చీకటి రోజని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోరాటాన్ని ఉఽధృతం చేస్తామని అన్నారు. -
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
● అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవు ● ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అమలాపురం టౌన్: విద్యార్ధులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చేతి గోళ్లు, అరిచేతులు, జట్టు, తినే ఆహారం అన్నింటా పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హితవు పలికారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవం, పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పాఠశాల వద్ద శనివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవన్నారు. విద్యార్ధులు ఇంట్లో అమ్మ పెట్టే ఆహారం తినేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అమ్మ పెట్టే అన్నం అమృతంతో సమానమని పేర్కొన్నారు. చదువులకు ఎంత విలువ ఇస్తారో వ్యక్తిగత పరిశుభ్రతకూ అంతే విలువ ఇవ్వాలన్నారు. మార్కెట్లో దొరికే తాజా కాయగూరలతోపాటు మన ఇంటి పెరటిలోనో, ఆవరణలోనో మొక్కలు పెంచాలని సూచించారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడలకు ప్రాము ఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఏకాగ్రతతో చదివినప్పుడే చదివింది వంట పడుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతోపాటు పూర్వ విద్యార్థులు బోణం కనకయ్య, నల్లా విష్ణుమూర్తి పాల్గొన్నారు. చాగంటిని పాఠశాల తరఫున సత్కరించారు. -
బాలుడి నిజాయితీ
గండేపల్లి: పదేళ్ల బాలుడికి తాను వెళుతున్న మార్గంలో నగదు ఉన్న పర్సు కంట బడటంతో భద్రపరిచి బాధితులకు అందజేసి తన నిజాయితీని చాటాడు. రంగంపేట మండలం వెంకటాపురానికి చెందిన బొడెం దొరబాబు తల్లి అనంతలక్ష్మితో కలసి మోటార్ సైకిల్పై గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో పెళ్లి భోజనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు యల్లమిల్లి మీదుగా తమ గ్రామం వెళుతుండగా తాళ్లూరు శివారులో అనంతలక్ష్మి పర్సు (రూ.7,200) పడిపోయింది. కొంతదూరం వెళ్లాక పర్సు పోయిందని గమనించి, వెనక్కి వెతుక్కుంటూ వచ్చినప్పటికి కనబడకపోవడంతో నిరుత్సామంతో ఇంటికి వెళ్లిపోయారు. తాళ్లూరు మఠంలో అన్న సమారాధనకు స్నేహితులతో వెళుతున్న గ్రామానికి చెందిన కిలాడి పండుకు పర్సు కనిపించింది దానిని భద్ర పరచి మఠంలో ఉన్న తన తండ్రి శ్రీనుకు తెలియజేశాడు. గ్రామానికి చెందిన కూరగాయల విక్రయదారుడు కురందాసు అప్పారావు, శ్రీను కలిసి గ్రామానికి చెందిన ఒమ్మి ప్రసాద్కు తెలియజేయడంతో పర్సులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ప్రసాద్ బాధితులకు సమాచారం అందజేశారు. దీంతో బాధితులు వచ్చి నగదుతో ఉన్న పర్సును తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడిని పలువురు అభినందించారు. బాలుడు స్థానికంగా ఉన్న హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆరంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి పాఠశాలకు క్రీడామైదానం ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా కాకినాడ డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి సత్యన్నారాయణ, డీఎస్డీఓ బి.సతీష్కుమార్; ఖోఖో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జానకిరామయ్య, జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడు పట్టాభిరాం హాజరయ్యారు. ఎస్జీఎఫ్ఐ మహిళా కార్యదర్శి సుధారాణి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖోఖో సంఘ ప్రతినిధులు వాసు, పీడీలు మాచరరావు, రాజశేఖర్, నూకరాజు, సురేష్రాజు, దిశ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి, జేఎన్టీయూకే పీడీ శ్యాంకుమార్ పాల్గొన్నారు. 24వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 13 జిల్లాల నుంచి 180 మంది హాజరు -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● కారు, రెండు బైక్లు, రూ.3 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం ● డీఎస్పీ దేవకుమార్ వెల్లడి నల్లజర్ల : పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ శనివారం నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా తూర్పుగోదావరి జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడినట్టు చెప్పారు. ఒడిశాలో పోలీసులపై ఈ ముఠా కాల్పులకు తెగపడినట్టు వివరించారు. నల్లజర్ల సెంటర్లో నక్కా వారివీధిలో ఒంటరిగా ఉంటున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి చొరబడ్డ ఈ ముఠా సెప్టెంబరు 24వ తేదీ అర్ధరాత్రి రాళ్ళతో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రెండు బైక్లు తీసుకుపోయారు. దీనిపై నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతకుముందు రోజు ప్రత్తిపాడులో జ్యూయలరీ షాపులో 11కిలోల వెండి ,ఒక బుల్లెట్ బండి దొంగతనం చేశారు. దేవరపల్లి సీఐ నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. నెల్లూరుకు చెందిన ప్రక్రద్దీన్ ఒంగోలు జైలులో ఉండగా ఈ మధ్యప్రదేశ్ ముఠాతో సంబంధాలు ఏర్పరుచుకొని నేరాలకు పాల్పడేవాడు. ఈ ముఠాతోనే నల్లజర్లలో నేరానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. రెండునెలల తర్వాత ఈ ముఠాతో మళ్ళీ దొంగతనాలకు పాల్పడే క్రమంలో నల్లజర్ల పోలవరం కాలువగట్టు సమీపంలో శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈముఠాను నల్లజర్ల సీఐ వై.రాంబాబు తమ సిబ్బందితో వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా నల్లజర్లలో దొంగతనం చేసేంది తామే నని ఈ ముఠా ఒప్పుకుంది. నెల్లూరు రూరల్ మండలం మూలపేటకు చెందిన షేక్ ప్రక్రుద్దీన్, మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వివిధ తండాలకు చెందిన హోలీబేడాకు చెందిన కేసు ఉమ్రా, మాల్పురియాకు చెందిన రాగన్ మాధవ్ హటిలా, దేవిపురాకు చెందిన బారిక్ సింగ్ అజినార్, హెలీబెడాకు చెందిన మొహర్కల్లు మోహదా, భుటియాకు చెందిన హీరు హరియా అజినార్లను అరెస్ట్ చేశామన్నారు. వీరిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్టు చెప్పారు. సమావేశంలో దేవరపల్లి, నల్లజర్ల సిఐలు నాగేశ్వరనాయక్, వై.రాంబాబు, ఎస్ఐ దుర్గాప్రసాదరావు, క్రైం ఎస్ఐ రవీంద్ర పాల్గొన్నారు. -
గిరిజాతి ఆవుకు అరుదైన కవల దూడలు
మామిడికుదురు: గిరి జాతి ఆవుకు అరుదైన కవల దూడలు పుట్టిన ఘటన మామిడికుదురులో శనివారం చోటు చేసుకుంది. కుడుపూడి రామేశ్వర్, జానకి దంపతుల పొలంలో గిరి జాతికి చెందిన ఆవు మగ, ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఈ దూడలు 2.8 అడుగుల ఎత్తు, 2.8 అడుగులు పొడవుతో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై పశు వైద్యాధికారి చేగొండి శ్రీరామ్ను సంప్రదించగా ఇలా కవల దూడలు పుట్టడం అరుదైన ఘటన అన్నారు. ఎక్కడో 100కి ఒకటి వంతున ఈ విధంగా జరుగుతుందన్నారు. గిరి జాతి ఆవు పూటకు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలిస్తుందన్నారు. ఆ పాలు 4–5 వెన్న శాతం కలిగి ఉంటాయని చెప్పారు. గిరి జాతి అవు రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖరీదు ఉంటుందని చెప్పారు. స్థానికులు ఈ కవడ దూడలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
విలువను.. గుర్తించరా?
సాక్షి, అమలాపురం: ఇటు వ్యవసాయం.. ఇటు ఉద్యానం సాగు ఏదైనా, పంటలు ఏమైనా ఫలితం ఒక్కటే. దిగుబడులు పెరిగిన సమయంలో ధరలు ఉండవు. ధరలు ఉంటే దిగుబడి ఉండదు. ఈ రెండింటి మధ్య రైతు నష్టపోవడం పరిపాటిగా మారింది. రెండు నెలల క్రితం రికార్డు స్థాయి ధర వచ్చిన కొబ్బరి ఇప్పుడు నేల చూపు చూస్తోంది. అరటి ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ఉన్నా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పోక ధర బాగున్నా డిమాండ్కు తగినట్టుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం దిగుబడులు పెరగడమే కాదు.. స్థానికంగా వినియోగం లేకపోవడం, దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సి రావడమే. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ధరలు రావాలంటే స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రభుత్వం, కోకోనట్ బోర్డు, క్వాయర్ బోర్డు, ఖాదీ, ఎంఎస్ఎంఈ, ఉద్యానశాఖ పరిశ్రమల ఏర్పాటు చేస్తామనే ప్రకటనలకు మాత్రమే పరిమితవుతున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం భారీ పరిశ్రమలు తరలివస్తున్నాయని ప్రచారం చేసుకోవడమే తప్ప స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటును పట్టించుకోవడం లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ముందుకు రాకపోవడంతో రైతుల నష్టాలు తీరడం లేదు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. వరితో ఇలా చేయొచ్చు ఉమ్మడి జిల్లాలో వరి అతి పెద్ద సాగు. ఈ మూడు జిల్లాల్లో కలిపి 5.60 లక్షల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతాయి. ఖరీఫ్, రబీ కలిపి 31.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. ధాన్యా న్ని నేరుగా విక్రయించి రైతులు, బియ్యం, తవుడు విక్రయాలతో మిల్లర్లు సరిపెడుతున్నారు. బియ్యాన్ని అన్నం కోసమే కాకుండా దీనితో నూడిల్స్, పాస్తా, పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, రడీ టూ కుక్ రైస్, రైస్ మిల్క్ తయారు చేసే అవకాశముంది. సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు రైస్ బ్రాన్ కొవ్వు ఆమ్లాలతో సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు తయారు చేయవచ్చు. రైస్ బ్రాన్ జ్యూస్, కొన్ని ఫుడ్ అప్లికేషన్స్ లేదా హెల్త్ డ్రింక్స్ తయారు చేయవచ్చు. తవుడుతో రైస్ రిచ్ ఆయిల్ వంటి వంట నూనెలతో పాటు టైర్లు, పెయింట్లు, సౌందర్య సాధనాలు, టూత్పేస్ట్, పశుగ్రాసం వంటి ఉత్పత్తులను తయారు చేయవచ్చు. కాకినాడ జిల్లా సర్పవరం వద్ద తవుడుతో ఆయిల్ తయారు చేసే పరిశ్రమలున్నాయి. అరటి పౌడర్... చిప్స్కు భలే డిమాండ్ అరటికి ప్రస్తుతం ధర లేక రైతులు విలవిలలాడుతున్న విషయం తెలిసిందే. మూడు జిల్లాల్లో సుమారు 69 వేల ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. కేరళ, తమిళనాడుల్లో అరటి చిప్స్ తయారు చేస్తుంటారు. మన ప్రాంతాల్లో పొటాటో చిప్స్ స్థానంలో అరటి చిప్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే వీటి తయారీ పరిశ్రమలు స్థానికంగా లేవు. వీటితోపాటు అరటి పౌడర్, డ్రై బనానా, పానీయాలు, ఐస్ క్రీం, పెరుగును తయారు చేయవచ్చు. ఎండబెట్టిన అరటి పండును పిండిగా చేసి పూరి, చపాతీ తయారు చేసి అమ్ముతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో వరి, కొబ్బరి, అరటి, కోకో విస్తృత సాగు అన్ని రకాల ఉత్పత్తుల ధరలు తగ్గి రైతులు విలవిల దిగుబడి బాగున్న సమయంలో ధరలు లేక నష్టం విలువ ఆధారిత ఉత్పత్తులు చేస్తే అదనపు ఆదాయం అప్పుడే వ్యవసాయం, ఉద్యానం లాభదాయకం దీనిపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కార్ కోకో హోమ్మేడ్ చాక్లెట్ కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్లో అంతర పంటగా సుమారు 15 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కోకో బీన్స్ను నేరుగా అమ్ముతున్నారు. కానీ కోకో గింజలతో సొంతంగా ఇంటి వద్ద చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పాలు, డార్క్ చాక్లెట్లు, కోకో పౌడర్ను ఉత్పత్తి చేయవచ్చు. తమిళనాడులోని పర్యాటక ప్రాంతమైన ఊటీలో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని సొంతంగా చాక్లెట్ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లాలో ఆ పరిస్థితి లేదు. కోకో గుజ్జుతో జామ్లు, జెల్లీలు, సౌందర్య పోషణ వస్తువులు కూడా తయారు చేయవచ్చు. -
మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి
అమలాపురం రూరల్: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లికి చెందిన ఎం.మంగాదేవి దుబాయ్లో నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతుండగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రం క్షేమంగా ఇంటికి చేర్చినట్టు నోడల్ అధికారి కే. మాధవి, మేనేజర్ గోళ్ల రమేష్ శనివారం తెలిపారు. ఆ మహిళ 2025 11 మే దుబాయ్ వెళ్లిందని అక్కడ 3 నెలల 15 రోజులు ఒక ఇంటిలో పనికి కుదిరిందన్నారు. అక్కడ ఆ ఇంటి యజమాని చాలా ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తూ ఉండేవారని విషయాన్ని ఏజెంట్ దృష్టికి తీసుకు రాగా అతను పనుల నిమిత్తం పలు ఇళ్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టాడని తెలిపారు. భోజనం పెట్టేవారు కాదని ఈ క్రమంలో ఆరోగ్యం చెడిపోయి ఇబ్బంది పడిందని చెప్పారు. మంగాదేవి కుటుంబ సభ్యులు కలెక్టర్ మహేష్కుమార్ను ఆశ్రయించగా ఆయన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రాన్ని ఈ అంశం పరిశీలించమని ఆదేశించగా సిబ్బంది బాధితురాలితో, ఏజెంట్తో సంప్రదింపులు జరిపి ఆమెను క్షేమంగా ఇండియాకు చేర్చారు. -
కొబ్బరితో 106 రకాల ఉత్పత్తులు
మూడు జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సగటున ఏడాదికి 126 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. కొబ్బరి కాయ, ఆకులు, కాండంతో కనీసం 106 ఉత్పత్తులు స్థానికంగా తయారు చేసే అవకాశముంది. కొబ్బరి చిప్స్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కొబ్బరి క్రీమ్, కొబ్బరి విప్పింగ్ క్రీమ్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, నాటా డి కోకో, కొబ్బరి వెనిగర్, కొబ్బరి బెల్లం, చక్కెర, నీరా, కొబ్బరి అమినోలు, సిరప్లు తయారు చేయవచ్చు. కొబ్బరి నూనెను సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. -
సారథిపై సస్పెన్స్
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ సారథి కోసం అభిప్రాయ సేకరణ పేరుతో హడావుడి చేశారు. నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. ఇప్పటి వరకూ ఎవ్వరినీ ఎంపిక చేయకపోగా.. ఎప్పుడు చేస్తారు.. చేస్తారా.. లేదా.. అనే మీమాంస ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నాన్చివేత ధోరణితో ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు నియామకానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎవరికి పదవి వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా పార్టీ పదవుల భర్తీపై కనీసంగా కూడా దృష్టి పెట్టకపోవడమేమిటంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉండే వారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో, పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఆరు నెలలుగా ఈ పదవి ఖాళీగానే ఉంది. కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెట్టడం, వేధించడం, అక్రమాలకు ఆజ్యం పోయడం ద్వారానే కాలం వెళ్లదీస్తున్నారని, పార్టీ నియామకాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. అభిప్రాయ సేకరణ జరిగినా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం ప్రత్యేకంగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని మెజారిటీ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి పేర్లను అధిష్టానానికి సిఫారసు చేస్తుంది. మూడు నెలల క్రితం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, నియోజకవర్గానికి సుమారు 10 మంది చొప్పున ప్రత్యేక ఆహ్వానితుల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అక్కడితో సరి.. ఇప్పటి వరకూ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం ఏ ప్రకటనా చేయలేదు. జిల్లా అధ్యక్షుడు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సీఎం పర్యటన ఈ నెల లేదా వచ్చే నెలలో ఏదో ఒక రోజు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. రాజమహేంద్రవరంలో ఓ సినిమా లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిసింది. ఆలోగా జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఓ స్పష్టత వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. అలా జరగని పక్షంలో కనీసం చంద్రబాబు పర్యటనలోనైనా ఈ విషయం ఓ కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు. సిఫారసులకే ప్రాధాన్యమా? నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ విజయానికి శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేశారు. వారు చెప్పిన వారికి, వారి అనుచరులకే పదవులు కట్టబెట్టడంతో చిత్తశుద్ధితో పని చేసిన తమకు అన్యాయం జరిగిందని పలువురు నేతలు వాపోతున్నారు. పెద్ద పదవులైతే చినబాబు చలవ లేనిదే దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో సైతం అదే పంథా కొనసాగిస్తారా.. లేక పార్టీని సమర్థవంతంగా నడిపే నేతకు కట్టబెడతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లా అధ్యక్ష పదవిపై టీడీపీ నాన్చివేత ధోరణి అభిప్రాయ సేకరణ పూర్తయినా నిర్లిప్తత అధిష్టానంపై శ్రేణుల్లో అసంతృప్తి మూడు వర్గాలుగా పావులు కదుపుతున్న నేతలు -
రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు అతివృష్టి, అనావృష్టితో నష్టపోతూ కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) అన్నారు. బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పంటల ధరలు పతనమై అన్నదాత కష్టాల్లో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనను, రైతులను పూర్తిగా గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రైతుకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు, గొప్ప వ్యవస్థలు తీసుకొస్తే వాటిని చంద్రబాబు అటకెక్కించేశారన్నారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర టన్నుకు రూ.2,400 కాగా రూ.600 కూడా పలకడం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోందన్నారు. తీవ్ర వర్షాలు, మోంథా తుపాను ప్రభావంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గిపోయాయని, పంట నష్టం అంచనాల్లో చంద్రబాబు సర్కారు దారుణంగా కోత విధిస్తూండటంతో మరింత నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేస్తే చివరకు 3,912 ఎకరాలకు కుదించేశారని, రైతులు ఏం పాపం చేశారని ఇలా మోసం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి, గిట్టుబాటు ధర రాక పత్తి రైతుకు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు. కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రంగు మారిందనే నెపంతో పంట కొనుగోలు చేయడం దారుణమన్నారు. రాయలసీమలో అరటి విస్తారంగా సాగు చేస్తున్నారని, టన్ను రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ అమ్మారని, ఇది కొన్ని రోజులుగా రూ.వెయ్యికి పడిపోయిందని న్నారు. రాష్ట్రంలో తొలిసారి పశువులకు దాణాగా అరటి వేయటం చూస్తున్నామన్నారు. తాము చెప్తే రాజకీయ ఆరోపణులంటారని, మరి టీడీపీ అధికారిక పత్రిక ఈనాడులో రాసింది కూడా అబద్ధమా అని ప్రశ్నించారు. అదే సాక్షి రాస్తే గగ్గోలు పెడతారన్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో లక్షలాది క్వింటాళ్ల శనగ నిల్వలు పేరుకుపోయాయన్నారు. వేరుశనగపై దిగుమతి సుంకం తగ్గించడంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఉల్లి, మామిడి రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. చంద్రబాబు సర్కారు ఇప్పటికై నా కళ్లు తెరవాలని, రైతులకు అండగా నిలవాలని రామారావు డిమాండ్ చేశారు. రైతుద్రోహిగా మిగిలిపోతారు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకాన్ని 53 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సి ఉండగా ఏడు లక్షల మంది రైతులను తగ్గించారని చెప్పారు. కిలో అరటిని రైతులు రూపాయికి అమ్ముకుంటున్నట్టు ఈనాడులోనే రాశారన్నారు. రైతును ఆదుకోకపోతే చంద్రబాబు రైతు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం భారంగా మారిందని, మార్కెట్లో ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చే దారి లేక రైతులు పంట పొలాల్లోనే పురుగు మందులు తాగి అర్ధాతరంగా తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ పరిహారం అందించిన దాఖలాల్లేవన్నారు. ఉచిత పంటల బీమాను రైతులందరికీ వర్తింపజేయాలని, పంట నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోపే పరిహారం అందించాలని, తుపాను వల్ల నష్టపోయిన రైతులను, గిట్టుబాటు ధరలు లేని రైతులను వెంటనే ఆదుకోవాలని వేణు డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుందని గుర్తు చేశారు. ఫ పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, అరటి పంటలకు కానరాని గిట్టుబాటు ధర ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబీ


