breaking news
East Godavari
-
విజయమివ్వు విఘ్నేశ్వరా..
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 100 మంది పాల్గొన్నారు. ముగ్గురికి తులాభారం నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 జంటలు పాల్గొనగా, స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 27 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1,480 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.2,05,396 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం
● పాఠశాలల అభివృద్ధికి యూ డైస్ ప్లస్ ● 23 నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు వేగవంతం చేయాలి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యూ డైస్ ఫ్లస్ నమోదు, అప్డేషన్ను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ వేగవంతం చేయాలి. ఈ నెలాఖరులోగా నూరు శాతం పూర్తి చేయాలి. ఇప్పటికే ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు అవగాహన కల్పించాం. గడువుకు ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. – డి.తాతారావు, ఏఎస్ఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ముమ్మిడివరం సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియ, అప్డేషన్ నిరంతరాయంగా జరుగుతోంది. ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న ఆధార్ అప్డేషన్ను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. యూ డైస్ ఫ్లస్ సమాచారం ఆధారంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల సదుపాయాలకు నిధులు కేటాయిస్తున్నారు. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం: విద్యా వ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక్క క్లిక్తో ప్రభుత్వ పాఠశాలల పూర్తి సమాచారం వెబ్సైట్లో ప్రత్యక్షమవుతోంది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతో పాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయో, ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారన్న విషయాలు స్పష్టంగా తెలుసుకునే వీలుంది. ఇప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూ డైస్ ఫ్లస్ను అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో యూడైస్ నమోదు మాన్యువల్గా ఉండగా 2022–23 నుంచి యూడైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)గా ఆధునికీకరించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని సేకరించి, అప్డేట్ చేస్తున్నారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా.. ఇకపై నిరంతరం సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యుల్స్గా వెబ్సైట్ను మూడు భాగాలుగా విభజించి సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వివరాలు కీలకం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థి వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు నమోదు చేయగా, ప్రస్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలతోపాటు వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ఫ్లస్లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనుంది. వెబ్సైట్లో నమోదైన విద్యార్థులకే యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నారు. ప్రతి విద్యార్థికి నంబర్ కేటాయింపు యూ డైస్ ప్లస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి ఏడాది అన్ని పాఠశాలల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో నమోదు చేసిన ప్రతి విద్యార్థికి ఒక పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్) కేటాయిస్తారు. దీని ద్వారా ఆ విద్యార్థి దేశ వ్యాప్తంగా ఏఏ పాఠశాలల్లో ఏఏ తరగతులు చదివాడు అనేది కచ్చితంగా తెలుస్తుంది. పదో తరగతి విద్యార్థి బోర్డు పరీక్షలు రాయాలంటే ఇందులో నమోదై ఉండాల్సిందే. అలాగే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు మాదిరిగానే జారీ చేయాలి. జిల్లాలో 2.40 లక్షల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాల్సి ఉండగా, 2.25 లక్షల మందికి పూర్తయ్యింది. ఇంకా 15 వేల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాలి. 23 నుంచి ఆధార్ శిబిరాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్లు పైబడి ఉన్న విద్యార్థుల వేలిముద్రల అప్డేషన్ చేయనున్నారు. జిల్లాలో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 2.40 లక్షల మంది విద్యార్థుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1.98 లక్షల మంది అప్డేట్ కాగా, ఇంకా 42 వేల మంది విద్యార్థులకు ఆధార్ వేలిముద్రల అప్డేషన్ చేయాల్సి ఉంది. దీనికోసం పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధార్ అప్డేషన్ శిబిరాలను ఈ నెల 23 నుంచి 30 వరకూ నిర్వహించనున్నారు. -
శ్రీప్రకాష్లో ధన్వంతరి జయంతి వేడుకలు
తుని: స్థానిక శ్రీప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సీహెచ్వీకే నరసింహారావు, రామసీత దంపతులు ధన్వంతరి హోమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. రవీంద్రన్ను చాగంటి కోటేశ్వరరావు సత్కరించారు. డాక్టర్ గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆరోగ్యరమైన జీవనానికి ఆయుర్వేదం దిక్సూచి లాంటిదన్నారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందుతామన్నారు. ఉన్నత స్థితికి చేరడానికి గురువు దిక్సూచి అన్నారు. నరసింహారావు మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు ఆయుర్వేద వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. అకాడమీ ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్ యు.ఇందులాల్, సైకాలజికల్ కౌన్సిలర్ అపర్ణశర్మ, శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రధాన వైద్యులు టి.రమేష్బాబు, ఎంఏ సుమయ్య పాల్గొన్నారు. -
ముంపే మేజర్ సమస్య
ఫ అభివృద్ధికి దూరంగా శంకరగుప్తం డ్రైన్ ఫ ఏళ్ల కాలంగా పట్టించుకోని పాలకులు ఫ ముంపు నుంచి రక్షించాలని రైతుల మొర మలికిపురం: రాజోలు దీవిలో బంగాళాఖాతానికి కాస్త పైన, రెండు గోదావరి పాయల మధ్య సహజ సిద్ధంగా రక్తతుల్య నది ఏర్పడింది. ఇది క్రీక్ అని భౌగోళిక నదీ పరివాహక మ్యాప్లో ఉంది. ఈ క్రీక్కు బంగాళాఖాతానికి మధ్య ఏడు గ్రామాలతో మరో దీవి ఉంది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాక కాటన్ మహాశయుడు ఈ క్రీక్కు శంకరగుప్తం మేజన్ డ్రైన్గా పేరు పెట్టారు. ఆనకట్ట నిర్మించిన సమయంలో ఏర్పడిన పలు కొత్త మేజర్, మైనర్ డ్రైన్లు, ప్రధాన కాలువల నుంచి శివారు కాలువలు ఈ డ్రైన్లలో కలిసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వైనతేయ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే మేజర్ డ్రైన్లోకి మురుగునీరు రావడం, ఒకవైపు సముద్ర పోటు పాట్లు, వరదల వేళ పోటెత్తడంతో యాభై ఏళ్లుగా ఈ క్రీక్ రైతులకు దుఃఖదాయినిగా మారింది. సుమారు 80 గ్రామాలతో కూడిన రాజోలు దీవి కి మూడు వైపులా గోదావరి నది, మరోవైపు బంగాళాఖాతం ఉన్నాయి. మొత్తం గోదావరి నదికి వచ్చే వరద నీటిలో ఏటా సుమారు 90 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు అంటే మూడొంతుల్లో రెండొంతుల నీరు వశిష్ఠ, వైనతేయ పాయల మధ్యే సముద్రంలో కలుస్తుంది. సరిగ్గా ఈ రెండు పాయల మధ్యే శంకరగుప్తం డ్రైన్ ఉంది. క్రీక్ వైనతేయ నదిలో కలిసే ముఖ ద్వారానికి ఎదురుగా కూనవరం మేజర్ డ్రైన్ ఉంటుంది. అటు నుంచి వచ్చే ముంపునీరు కూడా ఈ డ్రైన్కు ఎదురు కావడం వల్ల శంకరగుప్తంపై భారీ ఒత్తిడి పడుతోందని డ్రైనేజీ శాఖ ప్రస్తుత అంచనా. శంకరగుప్తం డ్రైన్కు బంగాళాఖాతం వైపు ఉన్న ఏడు గ్రామాల దీవికి, రాజోలు దీవితో 1970 వరకూ వంతెనలే లేవు. పి.గన్నవరం అక్విడెక్ట్ కట్టిన తర్వాత నుంచి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థపై ప్రభుత్వ శాఖలు శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా నేటికీ డ్రైన్లకు హద్దులు లేక ఆక్రమణలతో, ముంపు సమస్యలతో ఆనకట్ట రైతాంగం వ్యవసాయానికి దూరమవుతోంది. అప్పటి నుంచీ ఇలా.. రాజోలు దీవిలో శంకరగుప్తం డ్రైన్తో అవస్థలు తొలగించాలని 1960 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఫలితంగా 1971–72 మధ్య కేశనపల్లి సర్పంచ్ యెనుముల బాపిరాజు హయాంలో రూ.లక్షతో శంకరగుప్తం డ్రైన్కు మరమ్మతులు చేశారు. అప్పట్లో తూర్పుపాలెం వైపు అడ్డుకట్ట వేసి సుమారు 400 మంది కార్మికులు కొన్ని నెలల పాటు పూడిక తీసి ఏటిగట్లు వేశారు. కనుమరుగైన ఆ ఏటిగట్లనే నేడు పునర్నిర్మించాలని అంతా కోరుతున్నారు. తిరిగి 1980లో డ్రైన్లో ముంపునీటి పారుదల మెరుగుకు డ్రైన్ చివరి భాగం అయిన కేశవదాసుపాలెం నుంచి నేరుగా సముద్రంలోకి స్ట్రెయిట్ కట్ తవ్వారు. ఇక్కడ మెరక వల్ల, సముద్ర కెరటాల ఉధృతి వంటి సాంకేతిక సమస్యలతో స్ట్రెయిట్ కట్ మూసుకుపోయి మురుగు కిందకు దిగని దుస్థితి నెలకొంది. తిరిగి 2006లో కేశవదాసుపాలెం నుంచి కత్తిమండ వరకూ అప్పట్లో రూ. 40 లక్షలతో పూడికతీసి గట్లు వేశారు. ఇది చాలా ఉపయోగపడింది. గట్లు వేయడం వల్ల ఉప్పునీరు పొలాలకు చేరకపోవడంతో రైతులకు మేలు జరిగింది. అనంతరం 2016లో రూ.15 కోట్లతో డ్రైన్ ముఖ ద్వారం కరవాక నుంచి కేశనపల్లి వరకూ 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. అప్పట్లో డ్రెడ్జింగ్ మట్టిని గట్లుగా వేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఇంజినీర్లు, అప్పటి పాలకులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గట్లు వేయకుండా, పూడిక మట్టిని నేరుగా రైతుల పొలాల్లోకి తరలించడంతో వేలాది ఎకరాలలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. నిధుల బట్టి చర్యలు డ్రైన్ పొడవునా ప్రత్యేక బృందంతో అధ్యయనం చేశాం. ఇందులో ఇరిగేషన్కు చెందిన జీడీఎస్, సీడీఓ ఇంజినీర్ల బృందం ఉన్నారు. ముంపు నుంచి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. నిధుల లభ్యతను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. –ఎంవీవీ కిషోర్, డ్రైనేజీ శాఖ ఈఈ, కాకినాడ పార్టీలకతీతంగా ఏకమై.. శంకరగుప్తం డ్రైన్ ముంపు రాజోలు దీవిలో పది వేల మంది రైతులకు చెందిన సుమారు 20 వేల ఎకరాల్లో 1.50 లక్షల కొబ్బరి చెట్లను నాశనం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నారు. అయినా ఈ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో చేసిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావుతో పర్యటించి తిరిగి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ నెలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ డ్రైన్ను పరిశీలించనున్నారు. కొత్త ప్రతిపాదనలతో అంచనాలు రూ.30 కోట్ల వరకూ చేరే అవకాశం ఉంది. డ్రెడ్జింగ్ చేసి ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పుతో ఏటిగట్లు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికిగాను ప్రస్తుత డ్రైన్వ వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు సర్వే చేస్తున్నారు. -
కార్తిక స్నానాలకు గోదావరి ఘాట్లు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం రామహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు వేలాదిగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 ఘాట్లలో పుణ్య స్నానాలకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, దుర్గాదేవి ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమ ఘాట్లలో స్నానాలు ఆచరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయలేని వృద్ధులు, చిన్నారులు, మహిళల కోసం దుర్గాదేవి ఘాట్ మినహా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు కార్మికులను అదనంగా నియమించారు. రెండు షిఫ్ట్లలో సుమారు 80 మంది పని చేయనున్నారు. స్నానాలు ఆచరించే సమయంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ఘాట్లలో ఇసుకను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కార్త్కి సోమవారం, పౌర్ణమి సమయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నగరపాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్ ఐ.శ్రీనివాస్ వెల్లడించారు. -
పెట్రోల్కు బదులు వర్షం నీరు
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు వద్ద ఓ పెట్రోల్ బంకులో యాజమాన్యం నిర్వాకంతో పెట్రోల్కు బదులుగా మోటార్ సైకిళ్లకు వర్షపు నీరు పోశారు. ఆదివారం ఉదయం పెట్రోల్ కోసం పలువురు వాహనదారులు వెళ్లారు. పెట్రోల్ నింపినా వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. చివరికి బంకులో నింపిన పెట్రోల్ను బయటకు తీసి చూడగా ఎర్రగా నీరు వచ్చింది. ఆందోళన వ్యక్తం చేసి వాహనదారులు బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో డబ్బు తిరిగి ఇచ్చేస్తామనడంతో వాహనదారులు శాంతించారు. బంకులో పెట్రోల్ ట్యాంకు పైపులైన్కు మరమ్మతులు చేస్తుండడం, శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు చేరి ఈ పరిస్థితి నెలకొన్నట్టు యాజమాన్యం సర్థి చెప్పింది. ఆరేళ్ల కిందట ఇదే పరిస్థితి తలెత్తడంతో ఈ విషయం జిల్లా అధికారులకు వెళ్లడంతో తనిఖీలు చేశారు. ఈ మేరకు జరిమానాలు విధించారు. ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించడంతో వాహనదారులు అధికారులకు ఫిర్యాదు చేయకపోవడంతో సమస్య సద్దుమణిగింది. -
విధుల్లోనే ఉండమంటారు!
● దీపావళికి నోచుకోని అగ్నిమాపక శాఖ ● కుటుంబాలకు దూరంగా ఉండాల్సిందే! ● ఖాళీ పోస్తులు భర్తీకాక మరింత ఇబ్బంది కొత్తపేట: దీపావళి.. అందరికీ ఎంతో అమితమైంది. టపాసులు పేల్చుతూ, ఆ వెలుగులను చూసి కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు అది. అలాంటి పండగకూ అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ దూరమే.. ఎందుకంటే ఆ పండగ రోజునే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో, ఆ రాత్రంతా మేల్కొని విధులు నిర్వహిస్తామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి అగ్నిమాపక కేంద్రం వద్ద విధుల్లో ఉండే ఫైర్మెన్ల పరిస్థితి దయనీయమనే చెప్పాలి. దీనికితోడు ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే ఒత్తిడి పెరిగి పండగ రోజుల్లోనూ అందరూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ శాఖలకు దీపావళి రోజు సెలవు అయినప్పటికీ, కానీ ఒక్క అగ్నిమాపక శాఖకు మాత్రం సెలవు ఉండదు. కచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని అప్రమత్తంగా ఉంటూ డ్యూటీ చేయాలి. అంతేకాదు దీపావళికి వారం, పది రోజుల ముందు నుంచే ఆఫ్ కూడా తీసుకోకుండా ఆన్ డ్యూటీలో ఉండాలి. ఈ విధంగా వారు దీపావళి పండగకు దూరమవుతున్నారు. సిబ్బంది లేక.. ఇబ్బంది రాష్ట్రంలో పోలీసు, జైళ్ల శాఖ, ఏపీఎస్పీ, ఏఆర్ డిపార్ట్మెంట్లలో అన్ని ఖాళీలు భర్తీ చేశారు. కానీ అగ్నిమాపక శాఖలో మాత్రం ఖాళీలను మాత్రం భర్తీ చేయలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి లీడింగ్ ఫైర్మెన్, ఫైర్మెన్, డ్రైవర్లు, ఇలా సుమారు 15 మంది ఉండాలి. అలా జిల్లాలో సుమారు 255 మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం 147 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ఇందులో అమరావతి, కూనవరం తదితర డ్యూటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిబ్బందినే పంపిస్తున్నారు. అలా డ్యూటీ పడిన సిబ్బంది ప్రతి నాలుగు నెలలకు 15 రోజులు అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ శాఖ జిల్లా యూనియన్ నాయకులు చెబుతున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది ఎదురవుతోందని, అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. ఏ పండగ వచ్చినా ఇంతే.. ఒక్క దీపావళి మాత్రమే కాదు.. ఏ పండగకు నోచుకోం.. దీపావళి అంటే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న పండగ. సంక్రాంతి పండగ అంటే ఎక్కడికక్కడ ప్రభల ఉత్సవాలు, ఊరేగింపులు, బాణసంచా కాల్పులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ప్రతి పండగ మా శాఖతో ముడిపడి ఉంటుంది. కుటుంబ ఆనందాలు వదులకుని ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణ కర్తవ్యంగా పనిచేస్తున్నామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఏడాది దీపావళికి ముందురోజు డ్యూటీ ఆఫ్ వస్తే టపాసులు కొని ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చి జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పి తిరిగి డ్యూటీకి వచ్చేవాళ్లమని, ఈసారి రాయవరంలో భారీ విస్ఫోటం కారణంగా ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని వారు వాపోయారు.వరుసగా మూడు రోజులూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ అండ్ ఆఫ్ డ్యూటీలు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో దీపావళికి రెండు రోజుల ముందు నుంచీ విధులు నిర్వర్తించాల్సిందే. వరుసగా దీపావళి వరకూ ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే. ఇటీవల రాయవరంలో జరిగిన బాణసంచా పేలుడు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో వరుసగా మూడు రోజులూ విధులు నిర్వర్తిస్తున్నారు. -
చీరమేను... అదిరేను
యానాం: గోదావరి నదీ ముఖ ద్వారాల వద్ద చీరమేను అధికంగా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. పులస తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో వచ్చే చీరమేనుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉండటంతో మాంసాహార ప్రియులు చీరమేను కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా పడుతుండటంతో చీరమేనును కూరతో పాటు గారెలను సైతం వేసుకుంటున్నారు. స్థానికంగా ఓ కుటుంబం చీరమేనును గారెలుగా వేసి పలువురికి రుచి చూపించారు. గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు సైతం ప్రదర్శించారు. అమ్మకాల జోరు యానాం మార్కెట్లో చీరమేను అమ్మకాల సందడి నెలకొంది. సేరు, బకెట్, క్యారేజీ కొలతల్లో చీరమేను అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది సేర్ల బకెట్ రూ.18 వేలకు అమ్ముడుకాగా, అనంతరం చీకటి పడటంతో అదికాస్తా రూ.12 వేలకు దిగింది.యానాం మార్కెట్కు విరివిగా చేపలు -
క్వారీ.. సారీ
ఫ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఫ కుదేలైన పరిశ్రమ ఫ గౌరీపట్నం ప్రాంతంలో 60 క్రషర్లు, 40 క్వారీలు ఫ క్రషర్లను స్క్రాప్కు అమ్మేస్తున్న యజమానులు ఫ ఉపాధి లేక వలస పోతున్న కార్మికులు ఫ సంక్షోభంలో క్వారీలు దేవరపల్లి: ఒకప్పుడు యజమానులకు కాసులు కురిపించిన నల్లరాతి క్వారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొండగూడెం, దుద్దుకూరు, బందపురం, లక్ష్మీపురంతో పాటు కొవ్వూరు మండలం ఐ.పంగిడి, దేచర్ల ప్రాంతాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నల్లరాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలువురు స్టోన్ క్రషర్లను స్థాపించి ఇక్కడి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నల్లరాతి మెటల్ను సరఫరా చేస్తున్నారు. క్వారీల్లోని నల్లరాతి ముక్కలను (పాల్స్) లారీల ద్వారా క్రషర్ వద్దకు తరలిస్తారు. అక్కడ వివిధ సైజుల్లో క్రషింగ్ చేసి భవన నిర్మాణాలు, సీసీ, తారు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి సరఫరా చేస్తూంటారు. కరెంట్ బిల్లులు సైతం కట్టలేక.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ క్వారీ త్వకాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన క్వారీ పరిశ్రమ దాదాపు రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కూటమి సర్కారు అనుసరిస్తున్న వైఖరే కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూటమి సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో, కొత్త పనులు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రధాన రహదారులు, ప్రభుత్వ కాలనీల నిర్మాణం వంటి పనులు నిలిచిపోయాయి, ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ప్రభుత్వ వైఖరితో తమ వ్యాపారం కుదేలైందని క్వారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించి, కొత్త పనులు ప్రారంభిస్తేనే మెటల్ వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో కూరుకుపోయామని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో క్రషర్కు సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో క్రషర్ తిప్పితే కరెంటు బిల్లుకు కూడా రాబడి ఉండటం లేదని వాపోతున్నారు. జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ప్రతి ఆరు నెలలకోసారి మైనింగ్ సెస్ జమ చేసేవారు. క్వారీలు సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ రూపేణా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిందని ప్రజాప్రతినిధులు అంటున్నారు. మూత పడుతున్న క్రషర్లు వ్యాపారాలు లేకపోవడంతో స్టోన్ క్రషర్లు మూత పడుతున్నాయి. కొంత మంది యజమానులు క్రషర్లను తిప్పలేక స్క్రాప్కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. స్క్రాప్కు అమ్మితే క్రషర్కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వస్తోందని, కొత్త క్రషర్ నిర్మించాలంటే సుమారు రూ.3 కోట్లు అవుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి క్వారీ పరిశ్రమలో సుమారు 30 క్రషర్లు మూత పడి, స్క్రాప్కు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పదేళ్ల క్రితం సుమారు 150 క్రషర్లు, 120 క్వారీలు ఉండేవి. ప్రస్తుతం 40 క్వారీలు, 60 క్రషర్లు ఉండగా, వీటిల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 5 వేలకు పడిపోయింది. ఇక్కడ ఉపాధి లేక అనేక మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. అప్పుల్లో కూరుకుపోయారు కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు ప్రారంభంకాలేదు. దీని ప్రభావం పరిశ్రమపై పడి, క్వారీలు, క్రషర్ల యజమానులు అప్పుల్లో కూరుకుపోయారు. మూడు నెలల్లో 20 క్రషర్లు మూతబడ్డాయి. కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. యూనిట్ మెటల్ రేటు రూ.1,800 ఉంది. డీజిల్, కరెంట్ చార్జిలు, కార్మికుల వేతనాలు పెరిగాయి. కానీ, మెటల్ ధర పెరగకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. పుష్కరాల పనులపై ఆశలు పెట్టుకున్నాం. – ముదునూరి సూర్యనారారాయణరాజు, ఉపాధ్యక్షుడు, జిల్లా క్వారీ, క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్, గౌరీపట్నం వ్యాపారం పడిపోయింది క్వారీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. మెటల్ వ్యాపారం పడిపోయింది. క్రషర్లు తిప్పడారని యజమానులు భయపడుతున్నారు. ఇప్పటికే చాలా క్రషర్లు మూతబడ్డాయి. ఇటీవల 20 క్రషర్లను స్క్రాప్కు అమ్ముకున్నారు. స్టోన్ క్రషర్లను ఎంఎస్ఎంయూలో చేర్చి రాయితీలివ్వాలి. రహదారుల నిర్మాణం చేపడితే పరిశ్రమ కోలుకుంటుంది. పరిశ్రమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా. – ఆండ్రు అనిల్, అధ్యక్షుడు, జిల్లా క్వారీ, క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్, గౌరీపట్నం ఉపాధి కోల్పోయిన కార్మికులు మెటల్ ధర పతనం కావడంతో క్వారీలు, క్రషర్లు మూతబడుతున్నాయి. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు ఉపాధి కోల్పోయి, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – షేక్ మస్తాన్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య 20 వేల మందికి ఉపాధిఇక్కడ లభించే నల్లరాతి మెటల్ ఎంతో నాణ్యతగా ఉంటుంది. అందుకే దీనిని నల్ల బంగారంగా పిలిచేవారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని క్వారీ పారిశ్రామిక వాడగా గుర్తించింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భీమవరం, విజయవాడ ప్రాంతాలకు చెందిన యజమానులు ఈ ప్రాంతంలో క్వారీలు ఏర్పాటు చేసి, స్టోన్ క్రషర్లు స్థాపించి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. విశాఖపట్నంతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమలోని వివిధ రంగాల్లో ఉపాధి పొందేవారు. పుష్కరాల పనులపై ఆశలు ప్రస్తుతం క్వారీ, క్రషర్ యజమానులు 2027లో గోదావరి పుష్కరాలపై ఆశలు పెట్టుకున్నారు. ఆ సందర్భంగా కొత్త పనులతో పాటు రోడ్ల అభివృద్ధి, భవన నిర్మాణాల వంటి పనులు ప్రారంభమై, వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తున్నారు. పుష్కరాల పనులకు ఈ ప్రాంతంలోని మెటల్ను వినియోగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం ఇక్కడి క్వారీల ద్వారా మైనింగ్ సెస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.120 కోట్ల ఆదాయం వస్తోంది. గతంలో ఏటా రూ.150 కోట్లు వచ్చేది. ఈ మొత్తంతో స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు, గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించేవారు. -
ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు
ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఐకమత్యం, సంతోషం నిండాలన్నారు. ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళిని సురక్షితంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. -
సర్కారు నిర్వాకం.. అన్నదాతకు అన్యాయం
ోరుకొండ: విత్తు నుంచి పంట దిగుబడుల విక్రయం వరకూ అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు విత్తనాలతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేవారు. వీటిలో సిబ్బందిని నియమించి, సకాలంలో వ్యవసాయ సలహాలు, సూచనలు అందించారు. అలా ఎన్నో విధాలుగా ఈ ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలిచేవి. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే)గా మార్చారు. ఆ తరువాత నుంచి వీటిని క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తద్వారా రైతులకు సరైన సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకుని, ఆర్ఎస్కే భవనాలను ఇతర అవసరాలకు వినియోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కోవలో కోరుకొండ–1 ఆర్ఎస్కేలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేశారు. ఇప్పటి వరకూ కోరుకొండ పోలీస్ స్టేషన్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉంది. వర్షం కురిస్తే ఆ భవనం కారిపోతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు కొత్త భవనం నిర్మించాల్సింది పోయి, ఏకంగా ఆర్ఎస్కేలోనే మకాం పెట్టేశారు. అయితే, దీనిని రెండు నెలలకు మాత్రమే అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ లాకప్ వంటి శాశ్వత ఏర్పాట్లు చేశారు. రెండు నెలలకే అయితే, పక్కా ఏర్పాట్లు ఎందుకు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ–1 ఆర్ఎస్కే పరిధిలో సుమారు 600 మంది రైతులు ఉన్నారు. సాగు సూచనల కోసం వస్తున్న రైతులు అక్కడ పోలీస్ స్టేషన్ దర్శనమివ్వడంతో నివ్వెరపోతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే గ్రామంలో కోరుకొండ–2 ఆర్ఎస్కే ఉందని, రైతులు అక్కడకు వెళ్లాలని చెబుతున్నారు. -
కార్తికం.. భక్త్యుత్సవం
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవీ ఏర్పాట్లుకార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు. ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి. ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్ ద్వారా పంపిస్తారు. ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు. ఫ విద్యుత్ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు. ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫార్మాస్యూటికల్స్ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.3 కోట్లతో ఏర్పాట్లు కార్తిక మాసంలో లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణా లు చేపట్టాం. వివిధ సత్రాలకు రూ.కోటితో మరమ్మతులు చేసి, రంగులు వేయించాం. వ్రతాలాచరించే భక్తుల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశాం. భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వ్రత పురోహితులను ఆదేశించాం. రూ.15 లక్షలతో తెప్పోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే భక్తులకు మజ్జిగ, పండ్లు, ఫలహారాలు పంపిణీ చేస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం ఫ రేపు రాత్రి ఆకాశ దీపంతో ఉత్సవాల ప్రారంభం ఫ నవంబరు 2న సత్యదేవుని తెప్పోత్సవం ఫ 5న గిరి ప్రదక్షిణ ఫ రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు -
ఆనంద దీపావళి చేసుకోండి
– జిల్లా కలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కుటుంబ సమేతంగా జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండగను జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా ప్రజలకు శనివారం ఓ ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగుల పండగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం, శబ్ధ కాలుష్యం తక్కువగా ఉండే టపాసులు కాల్చి, నూనె దీపాలు వెలిగించి పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి, జాగ్రత్తలు తీసుకుంటూ పండగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ లేదు దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సెలవు రోజు కావడంతో జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో పీజీఆర్ఎస్ను నిర్వహించడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: ఒకే రోజు పంచారామ పుణ్య క్షేత్రాలను (కార్తిక సోమవారాలు) దర్శించే ప్యాకేజీతో రాజమహేంద్రవరం డిపో నుంచి బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ మాధవ్ శనివారం తెలిపారు. కార్తిక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం డిపో నుంచి ఉదయం ఏడు గంటలకు పంచారామ స్పెషల్ బస్సులు బయలుదేరుతాయన్నారు. సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని, అదే రోజు రాత్రి పది గంటలకు డిపోకు చేరుతాయన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో వెళ్లే సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సుకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. బస్సుకు సరిపడా భక్తులు ఉండి, ఏ రోజైనా కోరితే తగిన చార్జీలతో వారి ఊరు నుంచే సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతామని తెలిపారు. వివరాలకు 95023 00189 నంబరును సంప్రదించాలన్నారు. ప్రకృతిని పరిరక్షిద్దాం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం సిటీ: ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆమెతో పాటు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా శనివారం స్థానిక వీఎల్ పురంలో స్వచ్ఛ ఆంధ్రా– స్వర్ణ ఆంధ్రాలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్తో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని, భావితరాల భవిష్యత్తు అందరి చేతుల్లో ఉందన్నారు. పర్యావరణ హిత జీవనశైలితో స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర జీవనాన్ని పొందవచ్చన్నారు. హరిత విస్తీర్ణం పెంపుతో పాటు, ప్రజా రవాణా, సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఇప్పటివరకు నగరంలో 4,780 మొక్కలు నాటినట్టు వివరించారు. దీపావళిలో గ్రీన్ టపాసులు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, ఎస్ఈ (ఇన్చార్జి) రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, ఏడీహెచ్ అనిత, సీఎంఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో భౌతిక, రసాయన జీవ శాస్త్రాల్లో సరిహద్దులు–వ్యవసాయ, ఆహార, సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వంలో అనువర్తనాలు అనే అంశంపై డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను శనివారం విడుదల చేశారు. అలియోంకీ పబ్లిష్కో(హైదరాబాద్) సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి చైర్మన్గా ప్రొఫెసర్ చంద్రమౌళి, కన్వీనర్గా డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డాక్టర్ కె.దీప్తి, పబ్లిష్కో డైరెక్టర్ స్వాతి గోనుగుట్ల వ్యవహరిస్తారన్నారు. సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను నవంబర్ 24లోగా సమర్పించవచ్చన్నారు. -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బహుజనులకు వైద్య విద్యను దూరంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై కాకినాడ అంబేడ్కర్ భవన్లో శనివారం మేధోమథన సదస్సు నిర్వహించారు. తొలుత కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కలెక్టరేట్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జై భీమ్రావ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రావణ్కుమార్ హాజరు కాగా, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్కుమార్ మాట్లాడుతూ, ఓ హాస్పిటల్ నిర్మించాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు అవసరం అవుతుందన్నారు. కేవలం బినామీలకు దోచిపెట్టడానికే పీపీపీ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం పూర్తిగా లేకుండా పోతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి రూ.5,600 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తే, మిగిలిన రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించలేక ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్లో కేటాయిస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చనే అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. నిరుపేదల విద్యార్థుల డాక్టర్ అయ్యే కలను కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. 33 ఏళ్ల లీజుకు ఇచ్చే పీపీపీ విధానం వల్ల రూ.వేలాది కోట్ల ధనార్జన చేస్తారన్నారు. పీపీపీ విధానంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బినామీలు మాత్రమే ఉన్నారని ఆరోపించారు. పిఠాపురం ప్రజలు బాధపడుతున్నారని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇప్పుడు పిఠాపురం ప్రజల ఆలోచన మరోలా ఉందని ఎద్దేవా చేశారు. రియల్ స్టార్కి, రీల్ స్టార్కి చాలా తేడా ఉందని పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు ఉండాలో చెప్పాలని, దీనిపై న్యాయస్థానంలో రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జై భీమ్ రావ్ భారత పార్టీ నుంచి ఎనిమిది లక్షల సంతకాల సేకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలపై బాధ్యతా రాహిత్యం కూటమి ప్రభుత్వం ప్రజలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలు బాగుండాలని కోరుకునే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.ఎనిమిది వేల కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మించాలని భావిస్తే, వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న దురాలోచనలతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఒకరోజు హాస్పిటల్లో ఉండాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నేడు ఉందన్నారు. గత 15 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆగిపోతున్న గుండెలను తిరిగి కొట్టుకునేలా చేసిన మహానేత దివంగత వైఎస్సార్ సేవలు, గత ప్రభుత్వంలో కరోనా సమయంలో చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72 రకాల మందులను, 14 రకాల ఉచిత టెస్టులను చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. పార్వతీపురం కేంద్రంలో 230 మంది చిన్నారులు అస్వస్థతకు గురై కామెర్లు వస్తే 120 మంది చిన్నారులను కేజీహెచ్లో చేర్పించే స్థాయికి కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తాగునీటిలో మలమూత్రాలు ఉన్నాయని రిపోర్టు వచ్చిందన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవడం సిగ్గుచేట్టన్నారు. జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ కూటమి ప్రభుత్వ పీపీపీ విధానంపై నేతల మండిపాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధోమథన సదస్సు ప్రజలు పోరాడాలి మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి విద్య నిజమైన ఆయుధం లాంటిదని, అటువంటి విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే పని కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ, న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు, గుగ్గిలపు హరీష్, వైఎస్సార్ సీపీ నాయకులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాగిరెడ్డి బన్నీ, సుంకర విద్యాసాగర్, వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
● కిలో గరిష్టం రూ.430 ● లో గ్రేడ్ రూ.80 దేవరపల్లి: పొగాకు మార్కెట్ ఒడిదొడుకుల్లో కొనసాగుతోంది. మార్కెట్ నిలకడ లేకపోవడంతో ధర ఎగసిపడుతోంది. రెండు వారాల పాటు మార్కెట్లో పొగాకు ధర కిలో రూ.425 కొనసాగింది. రెండు రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. శనివారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.430 పలికింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు మార్చి 24న ప్రారంభించింది. శనివారం నాటికి 168 రోజులు జరిగిన వేలం ప్రక్రియలో మార్కెట్ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొనుగోళ్లు ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ.290 పలికింది. ఈ ధర దాదాపు రెండు నెలలు కొనసాగింది. ఆ సమయంలో చాలా మంది చిన్న రైతులు తమ వద్ద ఉన్న పొగాకును అమ్ముకోగా, పెద్ద రైతులు నిల్వ ఉంచారు. అనంతరం మార్కెట్ అంచెలంచెలుగా నిలదొక్కుకుని, రోజురోజుకూ ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.430 పలకడంతో.. ముందుగా అమ్ముకున్న చిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లు ప్రారంభంలో ధర కంటే ప్రస్తుత ధర కిలోకు రూ.140 పెరగడంతో ముందుగా అమ్ముకున్న రైతులు డీలా పడ్డారు. ఈ ఏడాది పొగాకు రైతుల పంట పండిందని చెప్పవచ్చు. గతేడాది కంటే కిలోకు రూ.30 గరిష్ట ధర అదనంగా రైతులకు లభించింది. గతేడాది కిలో రూ.410 పలికిన పొగాకు.. ఈ ఏడాది రూ.430 పలుకుతోంది. లో గ్రేడ్ మార్కెట్ ఎగిసిపడుతోంది. మొన్నటి వరకూ కిలో ధర రూ.60 నుంచి రూ.70 పలకగా, ఈ ధర రూ.60 నుంచి రూ.80కి చేరింది. అయినా లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో సుమారు 84 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 74.29 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మరో 10 మిలియన్ల కిలోల పంట కొనుగోలు చేయాల్సి ఉంది. -
బాణసంచి నింపాల్సిందే..!
అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపేదే దీపావళి పండగ. కష్టసుఖాలతో సాగిపోతున్న జీవితానికి ఈ పర్వదినం భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది. అలసిన బతుకులకు కాస్తంత ఊరటనిస్తోంది. అందరిలాగే పండగలూ, పర్వదినాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వ్యాపారులూ ఆశిస్తుంటారు. దీపావళికి కొద్ది రోజులు కష్టపడితే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావిస్తారు. అలా అనుకుని బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులను కొందరు అధికారులు మామూళ్ల పేరుతో ఎడాపెడా దండుకుంటున్నారు. మళ్లీ బాణసంచా గిఫ్ట్లు వేరు. నిలకడ లేని మార్కెట్తో అసలే అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారాలకు తోడు.. ఈ మామూళ్ల దందా వ్యాపార వర్గాలను నిరాశానిస్పృహలకు గురి చేస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: దీపావళి పండగ అధికారులకు కాసులు కురిపిస్తోందా..? బాణసంచా తాత్కాలిక షాపుల ఏర్పాటులో దందాకు తెరలేచిందా..? ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇదీ సంగతీ దీపావళికి తాత్కాలిక ప్రాతిపదికన బాణసంచా దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, జీఎస్టీ శాఖలు సమన్వయంతో తాత్కాలిక లైసెన్స్ మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు గాను వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవడం, ఆపై అనుమతులు ఇవ్వడం ప్రతి ఏటా జరుగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న అధికారులు అక్రమాలకు తెర తీస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా రూ.లక్షలు దండుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు తెగబడుతున్నట్టు తెలిసింది. వసూలు చేయాల్సిందిలా.. బాణసంచా తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే సదరు వ్యాపారి ప్రభుత్వ నిబంధనల మేరకు లైసెన్స్ నిమిత్తం అగ్నిమాపక శాఖకు రూ.500 చలానా, రెవెన్యూ శాఖకు రూ.500 చలానా, జీఎస్టీ శాఖకు రూ.5 వేల అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. ఇలా ఓ దుకాణానికి రూ.6 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంతకు మించి దండుకుంటున్నారు. రూ.40 వేల వరకు వసూలు: బాణసంచా దుకాణాల లైసెన్స్ల మంజూరులో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. షాపునకు ఓ ధర పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు దండుకుంటున్నట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 400 దరఖాస్తులు అందాయి. ఇప్పటికే రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో 257 దుకాణాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. కొవ్వూరు డివిజన్లో సైతం వందకు పైగా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఒక్కో షాపు నుంచి రూ.30 వేల చొప్పున లెక్కగట్టినా.. రూ.1.10 కోట్లు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి రూ.6 వేల చొప్పున రూ.21 లక్షలు ప్రభుత్వానికి వెళ్లగా.. మిగిలిన సుమారు రూ.90 లక్షలు అధికారుల జేబుల్లోకి చేరినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తులను అడ్డుపెట్టుకుని లైసెన్స్ జారీ అయినట్టు సమాచారం. కూటమి నేతల సిండికేట్..? మద్యం షాపులే కాదు.. బాణసంచా దుకాణాల్లో సైతం కూటమి నేతలు సిండికేట్గా ఏర్పడినట్టు ఆరోపణలున్నాయి. తమ కనుసన్నల్లోనే లైసెన్స్ల మంజూరు ప్రక్రియ నిర్వహించినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయినట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి బాణసంచా విక్రయాల కోసం మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్, జీఎస్టీ శాఖల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే అసలు చేతివాటం మొదలవుతోంది. తాత్కాలిక విక్రయదారులకు డీలర్షిప్ ఉండదు. దీంతో వారికి అడ్వాన్స్డ్ లైసెన్స్లు జారీ చేస్తారు. దీని ప్రకారం తాము విక్రయించబోయే సరకు విలువపై 18 శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. రూ.లక్ష విలువైన సరకు విక్రయిస్తే రూ.18 వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక, అమ్మిన సరకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి. తక్కువైతే అదనంగా కట్టిన డబ్బును అధికారులు తిరిగి వెనక్కు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కొందరు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులతో కుమ్మకై ్క ఎంత సరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, తమకు కొంత సమర్పిస్తే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల పరిధిలో ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సర్కిళ్ల వారీగా వసూళ్లకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఉన్నత స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు పంచుకుంటున్నట్టు విమర్శలున్నాయి. అక్రమ తయారీపై చర్యలేవీ..? బాణసంచా తయారీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. మామూళ్లు దండుకుని కేంద్రాలకు లైసెన్స్లు రెన్యూవల్ లేకపోయినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఇటీవల చాగల్లు మండలం చిక్కాలకు వెళ్లే రోడ్డు సమీపంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పెద్దఎత్తున తయారీ సామగ్రిని పట్టుకున్నారు. కేవలం ఇక్కడ ఒక్కటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నా.. మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రమాదాలు ఏమైనా జరిగితే రెండు రోజుల పాటు హడావుడి చేయడం.. అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారుతోంది. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు క్యాష్ కొట్టు... లైసెన్స్ పట్టు మామూళ్లు ఇచ్చుకో.. లైసెన్స్ పట్టుకో.. దుకాణాల ఏర్పాటులో లంచావతారాలు ఒక్కో షాపునకు ఒక్కో రేటు నిర్ణయం రూ.30 వేల నుంచి రూ.40 వేల వసూళ్లు అన్ని శాఖల అధికారులకూ వాటాలు! జిల్లావ్యాప్తంగా 400కు పైగా షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు -
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 1,800 స్వామివారి వ్రతాలు జరిగాయి. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణలు చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఇలాఉండగా, ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోఛ్చాటన మధ్య మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతిలో పోటెత్తిన భక్తులు పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు పది వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,47,150, అన్నదాన విరాళాలుగా రూ.54,035, కేశ ఖండన ద్వారా రూ.4,240, తులాభారం ద్వారా రూ.50, ప్రసాద విక్రయం ద్వారా రూ.16,845, స్వామివారికి కానుకగా రూ.101తో మొత్తం రూ.2,22,421 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,500 మంది భక్తులు మధ్యాహ్నం అన్న ప్రసాదం స్వీకరించారు. -
ఎస్ఈజెడ్ భూములపై కపట ప్రేమ
● 2,800 ఎకరాల భూమిని మాజీ సీఎం జగన్ రైతులకు ఇచ్చారు ● చంద్రబాబు ప్రభుత్వంలో వారిపై అక్రమ కేసులు పెట్టారు ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన యేడాదిన్నరకు ఎస్ఈజెడ్ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తుందని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తునిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ కాకుండా ఒక మెమో ఇచ్చి, 2,800 ఎకరాలను డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు ఫ్రీగా తిరిగి ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్డర్ కాపీ ఇచ్చి ఆ భూములను రైతులకు వెనక్కు ఇచ్చారని గుర్తు చేశారు. గత వారం రోజులుగా ఎల్లో మీడియాలో రూపాయికే ఎకరం భూమి చంద్రబాబు ఇచ్చినట్టు గొప్పగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, క్షీరాభిషేకాలు చేయించుకున్నారన్నారు. తన గురించి, తన క్యారెక్టర్ గురించి ఈనాడులో అవాకులు, చవాకులు రాశారన్నారు. చంద్రబాబు ఇటీవల మెమో మాత్రమే ఇచ్చారని, అది జీఓ కాదని, 2024, డిసెంబర్ 5న ఈనాడు పత్రికలో తనను వ్యక్తిత్వ హసనం చేసిన విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెగాస్టార్నే గుడ్డలిప్పి నిలబెట్టారు ఎల్లో మీడియాలో మెగాస్టార్ చిరంజీవికే దిక్కులేదని, ఆయననే గుడ్డలు విప్పి రోడ్డుపై నిలబెట్టారని, ఇక తామెంతని రాజా ప్రశ్నించారు. డిసెంబర్ 5, 2024లో ఈనాడు మొదటి పేజీలో కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుని రైతులను అన్యాయం చేసి భూములు నొక్కేశారని తనపై అసత్య ప్రచారం చేశారన్నారు. ఈనాడు పేపర్ ఆ రోజు రాసింది తప్పా లేదంటే ఈ రోజు చంద్రబాబు భూములు వెనక్కు ఇచ్చేయడం అసత్యమా అనేది ఈనాడు స్పష్టం చేయాలని రాజా సవాలు విసిరారు. నచ్చిన ధరకు అమ్ముకున్నారు జగన్ ప్రభుత్వం రైతులకు భూములు ఇచ్చిన వారికి నచ్చిన ధరకే అమ్ముకున్నారన్నారు. ఆ ధరకే తాను కొనుగోలు చేశానన్నారు. ఆ భూములను ఈనాడుగానీ మరే కూటమి ప్రభుత్వం వారికిగాని కొనుగోలు చేస్తానంటే తాను తిరిగి అదే ధరకు అమ్మేస్తానన్నారు. కొన్న ధరకంటే రూ.లక్ష, రూ.రెండు లక్షలో అదనంగా వస్తుందని ఆశపడి కొనుగోలు చేశానని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నామనే అక్కసుతో ఈనాడు తనపై అసత్యాలు ప్రచురిస్తోందన్నారు. చంద్రబాబు 1999లోనే రూ.370 కోట్లు ప్రజాధనంతో కాకినాడ పోర్టును మూడు బెర్త్లతో కట్టిన తరువాత పీపీపీ మోడ్లో కేవీ రావు అనే అయన బినామీకి రూ.50 కోట్లకే ధారాదత్తం చేశారని ఆరోపించారు. దీని ద్వారా వచ్చిన ఆదాయం చంద్రబాబుకా ఆయన బినామీకా, లేక ప్రభుత్వానికి వస్తుందో ఈనాడు స్పష్టం చేయాలని రాజా డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో రూ.370 కోట్లు అంటే ఈ రోజు ఎన్ని వేల కోట్లో అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి విషయాలను బయటపెట్టినందుకు తనను, తన వాళ్లను ఖూనీకోర్లు, అవినీతిపరులు అంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాస్తారా? అని రాజా నిలదీశారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు, పత్రాలతో సహా ఎల్లో మీడియాలో ప్రచురించాలని సవాలు విసిరారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ ఆర్డర్ కాపీ ఇచ్చారు: జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి మంత్రి కన్నబాబు నేతృత్వంలో ఈ విషయమై కొందరు ఐఏఎస్లను ప్రభుత్వం సబ్ కమిటీగా వేసి రైతు సమస్యలు తెలుసుకుని ఆ భూములను వెనక్కి ఇచ్చారని, అందులో 1,400 ఎకరాలు రైతులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఎస్ఈజెడ్ భూములపై రైతులు 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నారన్నారు. వారిపై చంద్రబాబు హయాంలో అట్రాసిటీ కేసులు నమోదు చేయించారన్నారు. రిమాండ్లో ఉన్న రైతులతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్లు శుభ్రం చేయించిందని గుర్తు చేశారు. -
రాములోరి భూములకు మోక్ష ం..
దేవదాయ శాఖకు 19.92 ఎకరాల అప్పగింత కొత్తపల్లి: ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు పిఠాపురం మహారాజు గోర్స గ్రామంలో ఉన్న పురాతన సీతారామస్వామి ఆలయానికి కొంత భూమిని దానం చేశారు. దానిని పండించుకుంటూ కొందరు రైతులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. భూమి తమదేనని, పట్టాలున్నాయంటూ దేవునికే శఠగోపం పెట్టేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు చేసిన పోరాటం నేటికి ఫలించింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని పోలీసుల సహకారంతో శనివారం దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. కొమరగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 121, 122లో ఉన్న 19.92 ఎకరాలను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ చిన్నారావు, పాడా పీడీ చైత్రవర్షిణి సమక్షంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ రమేష్, సహాయ కమిషనర్ నాగేశ్వరరావు సీతారామ ఆలయ ఈవో ధనలక్ష్మికి అప్పగించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కొత్తపల్లి–గోర్స, పండూరు–గోర్స రోడ్డులో వాహనాలను నిరోధించారు. ఉప కమిషనర్ రమేష్ మాట్లాడుతూ, ఈ భూములను 34 మంది రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారన్నారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రైతులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. గ్రామస్తుల సహకారంతో దేవదాయ శాఖ కోర్టులో పోరాడడంతో, ఇటీవల అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ భూమిని ఐదు భాగాలుగా చేసి, త్వరలో కౌలుకు బహిరంగ వేలం నిర్వహిస్తారన్నారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. పోరాటం ఫలించింది పురాతన సీతారాముల ఆలయానికి చెందిన ఆలయ భూములు అన్యాక్రాంతంపై గ్రామస్తులంతా ఒక్కటై పోరాడారు. కుటుంబ సభ్యులు, మహిళలు సైతం పాల్గొన్నారు. దేవుని ఆలయ భూముల కోసం రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు అధికారులు స్పందించడం హర్షణీయం. – రొంగలి వీరబాబు, సర్పంచ్, గోర్స గ్రామస్తుల సహకారంతో.. పురాతన గోర్స సీతారామ ఆలయానికి కోట్ల రూపాయ లు విలువ చేసే భూమలు ఉన్నా అన్యాక్రాంతం కావడంతో ధూప దీప నైవేద్యాలు భారమైంది. కొన్నేళ్లుగా గ్రామస్తుల సహకారంతో స్వామివారి నిత్య కై ంకర్యాలు, ప్రతి సంవత్సరం స్వామి అమ్మవార్ల కల్యాణం జరుగుతుంది. – అనంతాచార్యులు, సీతారామ ఆలయ అర్చకుడు -
పంట మార్పిడితో మేలైన దిగుబడి
● చీడపీడల నుంచి రక్షణ ● భూసారం పెంపు ● ఎరువులు, మందుల ఖర్చు ఆదా ● సమీకృత వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి ● రబీ సీజన్లో సాగుకు సన్నాహాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు భూముల్లో ప్రతి సారి సాగు చేసే పంటలనే మళ్లీ మళ్లీ వేస్తుండడంతో భూమిలో సారం తగ్గిపోయి పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పంటల మార్పిడి చేయడం వల్ల భూమిలో నాణ్యత పెరిగి దిగుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఖర్చులు కూడా తగ్గుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాణిజ్య పంటలు లాభదాయకంగా ఉన్నందున రైతులు ఒకే పంటను అదే పొలంలో ప్రతి ఏడాది సాగు చేస్తున్నారు. దీని వల్ల భూసారం క్షిణించి, పంటలను చీడపీడలు విజృంభించి దిగుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలకో సారైనా పంట మార్పిడి చేస్తేనే చీడపీడలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. పంట మార్పిడిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. పంట మార్పిడితో భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందడంతో పాటు చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. పంట మార్పిడితో లాభాలు పంట మార్పిడి వల్ల చీడపీడలను అదుపులో ఉంచవచ్చు. ఒక పంటను ఆశించే చీడపీడలు రెండో పంటను ఆశించవు. పంట మార్పిడిలో రెండు మూడు పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర రాకున్నా వేరే పంటల వల్ల తగిన లాభం పొందవచ్చు. పంటల మార్పిడితో వివిధ పంటల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవచ్చు. రైతులందరూ ఒకే రకమైన పైరు వేయడం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా ఉండి దిగుబడి తగ్గడమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయడం వల్ల సస్యరక్షణ కోసం వాడే పురుగు మందులు ఖర్చు తగ్గించవచ్చు. వేర్లు భూమిలో తక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లను, వేర్లు ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల భూమిలోని వివిధ పొరల్లో ఉన్న తేమ పోషకాలను సమర్థంగా వినియోగించుకుంటాయి. ప్రత్తి వేసిన పొలంలో మిరప పంట సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది. మిరప పంట వేసిన పొలంలో పత్తి సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడంతో సాగు దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిరప పంట సాగు చేయడానికి ముందు సదరు భూమిలో జనుము, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి, దాన్ని ట్రాక్టర్ ద్వారా తొక్కించిన తర్వాత పంటలు సాగు చేస్తే భూసారం పెరిగి చీడపీడలు దరిచేరవు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో టమోట, బెండ, పెసర, మినుము పంటలు వేయకూడదు. వాటిని వేస్తే పురుగులు మరింత అభివృద్ధి చెందుతాయి. పంట మార్పిడిలో భాగంగా నేలంతా పూర్తిగా కప్పే పంటలు ఎంపిక చేసుకోవాలి. వేరుశనగ, బొబ్బర్లు, పెసర, మినుము పంటలను వేయడంతో నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలు అధికంగా రాకుండా నివారించవచ్చు. వరి పంట తర్వాత పప్పుధాన్యాల పంటలను కానీ నూనె గింజల పంటలను కానీ సాగు చేయడం వల్ల వరిని తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు ఏడాదిలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక, నేలల్లో మిశ్రమ పంటలను సాగు చేసుకోవచ్చు. కంది పంటలను సాగు చేయడం వల్ల నేలలో పైరు ఆకుల రాలి కుళ్లిపోవడం వల్ల నేలలో సేంద్రియ పదార్ధం పెరిగి భూ భౌతికస్థితి మెరుగుపడి భూసారం వృద్ధి చెందుతుంది. వేరుశనగ, కంది, పప్పుశనగ మొదలైనవి సాగు చేయడం వల్ల వాటి వేర్ల బుడిపెలోని రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజని స్థిరీకరించి నేలను సారవంతం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో సమతుల్యతను పెంచడానికి వీలు కలుగుతుంది. ● శాస్త్రవేత్తలకు అవగాహన రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఐదారు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. – ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ సమీకృత వ్యవసాయంపై అవగాహన రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించే విధంగా రైతులకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోను సమీకృత వ్యవసాయంతో కలిగే లాభాలను శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక ఎకరంలో ఫిష్ కల్చర్, వరి, కోళ్లఫారం, కూరగాయాలు పండిచే విధంగా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులు రాగులు, కొర్రలు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు సాగు చేసుకోవచ్చు. వరి పంట సుమారు 120 నుంచి 150 రోజులు వస్తుంది. అదే చిరు ధాన్యాలు సాగు చేస్తే 90 రోజుల్లో పంట పూర్తై సంవత్సరానికి మూడు పంటలు వేసుకోవచ్చు. ఇలా ఎకరానికి పెట్టుబడి పోను రూ.50 వేల నుంచి 60 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదే వరి సాగు చేస్తే రెండు సీజన్లోను రూ.25 వేలు మిగులుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలోని అన్ని మండలాల్లో సమీకృత వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్న రైతులను ప్రోత్సహించి వారితో సమీకృత వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మండల వ్యవసాయశాఖాధికారులు. -
యువకుడిని కాపాడిన ట్రైనీ ఎస్సై
గోపాలపురం: చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు కాపాడిన సంఘటన గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పురిటిగడ్డ భానుప్రకాష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేశాడు. అతని స్టేటస్ను చూసిన మిత్రుడు అనంతపురం నుంచి 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న గోపాలపురం ట్రైనీ ఎస్సై పి.శివగణేష్, తనతో పాటు విజయ్ అనే కానిస్టేబుల్ను తీసుకుని సంఘటనా స్థలానికి మూడు నిమిషాల్లో చేరుకుని, చెరువులో మునిగిపోతున్న భానుప్రకాష్ను కాపాడారు. భానుప్రకాష్ తల్లిదండ్రులు, బంధువులు, అతని స్నేహితులు, గ్రామస్తులు ట్రైనీ ఎస్సైను అభినందించారు. -
బైక్ను ఢీకొన్న ఆటో
ఒకరి మృతి, మరొకరికి గాయాలు నల్లజర్ల: పోతవరం శివారులో శుక్రవారం ఉదయం ఓ బైక్ను ట్రక్కు ఆటో ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న బల్వేంద్రసింగ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బల్వేంద్రసింగ్ ఆరు నెలల క్రితం కొయ్యలగూడెం మండలం కనకాద్రిగూడెంలో మారుతి కోళ్లఫారంలో పనికి చేరాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సెలవు కావడంతో బైక్పై కూరగాయలు తేవడానికి పోతవరం వెళ్తుండగా నల్లజర్ల నుంచి కొయ్యలగూడెం వెళ్తున్న ట్రక్కు ఆటో ఢీకొంది. ఏఎస్ఐ శోభనాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా చూసి.. ఆరా తీసి
ఫ రాయవరంలో బాణసంచా పేలుడిపై పరిశీలన ఫ ఘటనా స్థలాన్ని సందర్శించిన ద్విసభ్య కమిటీ ఫ బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ త్రిమూర్తులు డిమాండ్ రాయవరం: కోనసీమ జిల్లాను కుదిపేసిన రాయవరం బాణసంచా పేలుడి ఘటనపై ద్విసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి నిబంధనల అమలును పరిశీలించారు.. ఈ నెల 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బాణసంచా ప్రమాదం జరగ్గా, ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్, ఈగల్ ఐజీ పీడీ రామకృష్ణలు ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ అఖిల, డీఎస్పీ బి.రఘువీర్లు ద్విసభ్య కమిటీకి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. అక్కడ పరిశీలించిన సభ్యులు బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) చిన్న కుమారుడు చిట్టిబాబును కూడా విచారణ చేశారు. ప్రమాదం జరిగిన గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ సమీపంలోని భవానీ గ్రాండ్ ఫైర్ వర్క్స్ను చూసిన ద్విసభ్య కమిటీ అక్కడ తీసుకున్న భద్రతా చర్యలను పరిశీలించింది. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో సమీక్షించింది. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ద్విసభ్య కమిటీని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిశారు. ప్రమాదంలో మృతి చెందిన యజమానిని మినహాయిస్తే, చనిపోయిన తొమ్మిది మంది కూలీలు నిరు పేదలేనని కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. వారివి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలని, ఘటన జరిగి పది రోజులవుతున్నా నేటికీ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందలేదన్నారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాష్ట్ర మంత్రులు సందర్శించినా, నేటికీ సాయం అందలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన కూలీలకు కనీస న్యాయం చేయని ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిన తీరును ఎమ్మెల్సీ ఉదాహరించారు. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటలు తిరక్కుండానే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకటరమణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు ఆరిఫ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెలగల సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి నివేదిస్తాం.. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ.. బాధిత కుటుంబాల పరిస్థితి.. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ద్విసభ్య కమిటీ సభ్యుడు ఎస్.సురేష్కుమార్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ బాణసంచా తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, కార్మిక తదితర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడామన్నారు. ప్రమాదంలో పది మంది చనిపోగా, ముగ్గురు బయట పడినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. న్యాయం చేయాలంటూ.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు, ప్రజా సంఘాలు వచ్చి ఆందోళన చేశారు. కమిషనర్ బయటకు రావాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాయవరం సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత ధూళి జయరాజు, రైతు కూలీ సంఘ నేత వెంటపల్లి భీమశంకరం, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కోన లాజర్ తదితరులు బాధిత కుటుంబాల తరఫున ద్విసభ్య కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు కమిటీ సభ్యులకు వినతిపత్రం అందించారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి పాలచర్ల శివారులో టిప్పర్ చోరీ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాలను శుక్రవారం స్థానిక మీడియాకు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ నడుపుతున్న మన్యం గణేశ్వర్రావు గత నెల 24న వ్యక్తిగత పనిపై హైదరాబాద్కు వెళ్తూ తనకున్న నాలుగు టిప్పర్లను తన స్నేహితుడైన అబ్బిరెడ్డి నాగేశ్వర్రావుకు చెప్పి అతని ఏఎన్ఆర్ లారీ కాటాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేశాడు. గత నెల 25న రాత్రి వాటిలో సుమారు రూ. 42 లక్షల ఖరీదైన ఒక టిప్పర్ చోరీకి గురైంది. దీంతో అబ్బిరెడ్డి నాగేశ్వర్రావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తును సీసీ కెమేరాల సాయంతో విస్తృతం చేసిన పోలీసులకు నిందితులు కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో టిప్పర్తో సహా దొరికిపోయారు. ఇందులో రాజస్థాన్ రాష్ట్రంలోని ధహోటగావ్కు చెందిన షౌకత్ ఖాన్ (38), శేర్పూర్గావ్కు చెందిన జామాల్ఖాన్ (35), సోహిల్ (19)లతోపాటు హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఫసీఉద్దీన్ఖాన్ (41) ఉన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఏస్సైలు ప్రియకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వశాంతిని కాంక్షిస్తూ శాంతి కల్యాణం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. మూడో రోజు స్వామివారికి, ఉభయ దేవేరులకు అలంకరించిన పవిత్రాలను తీసుకు వచ్చి చక్ర పెరుమాళ్లుకు సమర్పించారు. చతుస్థానార్చనలతో ఉత్సవాలను ప్రారంభించి శ్రీపుష్పయాగంతో ముగించారు. 108 కలశాలతో స్వామి, అమ్మవార్లకు శత కలశ స్నపన తిరు మంజన సేవ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజాదికాల్లో పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణం కోరుతూ శ్రీవారి శాంతి కల్యాణం కనుల పండువగా జరిపించారు. శ్రీపుష్ప యాగం, మహాదాశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్ఠి, బుత్విక్ సన్మానంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో గుడివాడకు చెందిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
అక్రమ బాణసంచా తయారీ నిందితుల అరెస్ట్
చాగల్లు: అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచాను తయారు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం నార్త్ జోన్ ఏసీపీ, కొవ్వూరు ఇన్చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చాగల్లు శివారులోని మట్టా శివనారాయణ జీడిమామిడి తోటలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న ఊనగట్లకు చెందిన ఆత్కూరి గోపాలకృష్ణ, మట్టా శివనారాయణ, దొనక మురళి, పల్లెల రవికుమార్, కోకనాటి సూరిబాబులను అరెస్ట్ చేశామన్నారు. బాణసంచా తయారీ సామగ్రితోపాటు పాటు రెండు వ్యాన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఈ దాడుల్లో కొవ్వూరు రూరల్ సీఐ విజయ్బాబు, చాగల్లు ఎస్సై కె.నరేంద్ర, తహసీల్దార్ ఎం.మెరికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిడదవోలు రూరల్: జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం డి.ముప్పవరం పీఏసీఎస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యానికి మద్దతు ధర రూ.69 అధికంగా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా యూనిక్ నంబర్తో కార్డులు అందిస్తామన్నారు. అనంతరం ధాన్యం జల్లెడ, ధాన్యం నాణ్యత, గోనె సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాన్ని, డిజిటల్ తూనిక యంత్రాలను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆ వాయిస్ ఫేక్ టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం వ్యాపారులతో మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని, అది ఫేక్ అని నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో నకిలీ వీడియోలు, వాయిస్లు సృష్టిస్తున్నట్లు చూస్తున్నామని, ఇది కూడా అలాంటిదేనని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. స్థానిక పాత సోమాలమ్మ పుంత రోడ్డులోని శ్రీకన్య ఇన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తనకు లిక్కర్ షాపులు లేవని, మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేదని రాంబాబు తెలిపారు. -
టీడీపీ నేతలపై చట్టపరమైన చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ లిక్కర్ వ్యాపారానికి తెర తీసిన రాజమహేంద్రవరం నగర టీడీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలసి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన ఆందోళన నిర్వహించారు. అనంతరం అదనపు ఎస్పీ ఎంబీఎన్ మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా భరత్రామ్ మాట్లాడుతూ, నగరంలో టీడీపీ నేతల ఆధ్వర్యాన అక్రమ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలన్నారు. మద్యం వ్యాపారులతో ఫోనులో మాట్లాడిన నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే బ్రాండ్లకు ఎంతెంత వసూలు చేయాలో నిర్ణయించుకుంటున్నారని, ఆ బ్రాండ్లు ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమాలకు బైలా రాసుకోవాలని అనుకోవడం దారుణమన్నారు. నకిలీ మద్యం తాగి జీఎస్ఎల్ ఆసుపత్రిలో ముగ్గురు యువకులు మృతి చెందారని, అందుకే నగరంలో నకిలీ మద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఎకై ్సజ్ అధికారులకు ఎన్ని కేసులు ఇవ్వాలో కూడా టీడీపీ నేతల ఆధ్వర్యంలోని సిండికేట్ నిర్ణయించడం చూస్తూంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఇట్టే తేటతెల్లమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారుల ప్రమేయంపై కూడా విచారణ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. అక్రమ లిక్కర్ వ్యవహారంలో ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన -
సాంబార్లో పడిన వ్యక్తి మృతి
కాకినాడ క్రైం: ఓ వివాహ వేడుకకు వెళ్లి ప్రమాదవశాత్తూ సాంబార్లో పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళితే.. భీమవరం గునిపూడి ప్రాంతం అంబేడ్కర్ కాలనీకి చెందిన కటికల సునీల్కుమార్ (27) ఈ నెల 12న అదే ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ భోజనాలకు సిద్ధం చేసిన భారీ సాంబార్ బాణీలో పడిపోయాడు. అప్పుడే వండిన సాంబార్ వేడిగా ఉండడంతో దేహం కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యాడు. సునీల్కుమార్ను అక్కడి వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. నాలుగు రోజులుగా బర్న్స్ వార్డులో చికిత్స కొనసాగుతుండగా అతను శుక్రవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడు. సునీల్కుమార్ నాలుగేళ్ల క్రితం తాను నివసిస్తున్న ప్రాంతానికే చెందిన నీలమను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు షాలేం రాజు ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడిని పోషించుకుంటున్న సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. వ్యక్తి దుర్మరణం శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన బోడ రాంబాబు (65) కత్తిపూడిలో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ పెట్రోల్ బంక్ వద్ద హైవే దాటుతుండగా, తుని నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమాదు చేసినట్లు ఎస్సై జి.హరిబాబు తెలిపారు. -
కలంపై కక్షా?
● జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనలు ● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు ● అధికారులకు వినతులు ● ఏపీయూడబ్ల్యూజే, ప్రజా సంఘాలు, ప్రెస్ క్లబ్ మద్దతు సాక్షి, రాజమహేంద్రవరం: కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు గళమెత్తాయి. సర్కారు మీడియా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసనకు దిగాయి. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు, ప్రజా సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రజల స్వరాన్ని వినిపిస్తున్న పాత్రికేయ కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై గళమెత్తారు. ప్లకార్డులు చేబూని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి దారుణమైన సంస్కృతికి వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు, పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వార్తలు రాస్తే కేసులు పెట్టడం దారుణమని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్తా సంస్థలనూ ఒకేలా చూడాలని హితవు పలికారు. ‘‘నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా.. దీనిపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా? నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా? నకిలీ మద్యం మంచిదేనని ప్రభుత్వం చెబుతోందా? ఇప్పటికై నా ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు మానుకోవాలి. తప్పుడు కేసులు ఎత్తివేయాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అని హెచ్చరించారు. ● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడాన్ని మండల కేంద్రమైన పెదపూడిలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్ పీవీ సీతాపతిరావుకు వినతిపత్రం సమర్పించారు. ● జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యాన నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ నాగరాజు నాయక్కు వినతిపత్రం అందజేశారు. ● గోపాలపురంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ● నియోజకవర్గ కేంద్రమైన కొవ్వూరులో జర్నలిస్టులు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’పై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు జర్నలిస్టులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో... ఏపీయూడబ్ల్యూజే, రాజమండ్రి ప్రెస్క్లబ్, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు. ఎస్పీ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రోజులుగా సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. అడిషనల్ ఎస్పీ ఎంబీఎన్ ముళీకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి మండెల శ్రీరామ్మూర్తి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించి ఎడిటర్ ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జిలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం, పత్రికా కార్యాలయంలో హడావుడి చేయడం, ఒక వార్త రాసినందుకు విచారణ పేరుతో 170 ప్రశ్నలు సంధించడం ప్రత్యక్ష వేధింపుల కిందకే వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రాన ఎడిటర్, సంబంధిత ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, వాటిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ హరీష్, సాక్షి పత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, జర్నలిస్టులు విశ్వనాథ్, సత్యంబాబు, పీఎస్ గంగాధర్, సత్యనారాయణ, దానవాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు భావ్యం కాదు వార్తలు రాసే మీడియా సంస్థలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు బనాయించి వేధించడం తగదు. వార్తల్లో తప్పు ఉంటే రిజాయిండర్ ఇవ్వాలే తప్ప ఇలాంటి చర్యలు తగవు. ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – మండెల శ్రీరామ్మూర్తి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి పత్రికా స్వేచ్ఛను హరించడమే పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా పత్రికలను నియంత్రించడం మంచి పరిణామం కాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. – కుడుపూడి పార్థసారథి, రాజమండ్రి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియాపై ప్రభుత్వాలు కక్ష కట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి పత్రిక, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించుకునేంత వరకూ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. – గెడ్డం రవీంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కుల నిర్మూలన పోరాట సమితి, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం ‘సాక్షి’పై దాడులు ఆపాలి ‘సాక్షి’ మీడియాపై పోలీసు దాడులను తక్షణం ఆపాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయడం మంచిది కాదు. ‘సాక్షి’ కార్యాలయాల్లో సోదాలు చేయడం, ఎడిటర్, బ్యూరో ఇన్చార్జిలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం రాజ్యాగం విరుద్ధం. – షేక్ మస్తాన్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు -
ఎక్సైజ్ సీఐలను కూర్చోబెడదాం.. కమీషన్ మాట్లాడదాం.. టీడీపీ నేత ఆడియో లీక్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ(TDP) నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్(Liquor Belt Shop) షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీలో కూటమి పాలనలో మరోసారి మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. రాజమండ్రి అర్బన్, రూరల్లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఈ సందర్బంగా.. రాజమండ్రిలో ఎక్కడెక్కడ బెల్టు షాపులు పెట్టాలి. ఎక్కువ ధరకు అమ్మినా ఎక్సైజ్ అధికారులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారికి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఇప్పటికే ఎక్సైజ్ నార్త్, సౌత్ సీఐలను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్లు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా రూ.2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత? రూ.2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూళ్లు ఎక్సైజ్ అధికారులకు ఇప్పించాలో నిర్ణయిస్తామన్నారు. ఒక ఏరియాలో ఉన్న మద్యం దుకాణం పరిధిలో ఉన్న బెల్టు షాపుల విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా పకడ్బందీగా రూల్స్ పెట్టుకుందాం. మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా రూపొందించుకుందాం. 39 షాపుల నిర్వాహకులను బాండ్లపై సంతకాలు పెట్టించాలి.ఇక, ఎమ్మార్పీకంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఏ బ్రాండ్పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. 39 షాపుల్లో ఎవరిపై కేసు నమోదు చేసిన అందరూ భరించాలి. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చర్చిద్దాం. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇప్పించాలి. రెండోసారి షాపుమీద కేసు పెడితే షాపు క్యాన్సిల్ చేస్తారు కనుక కేసు పడకుండా వాళ్లే చూసుకుంటారు అని మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశం వెనుక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ వ్యాపారాన్ని లీగలైజ్ చేసే విధంగా టీడీపీ నేత మధ్య రాంబాబు మాట్లాడిన ఆడియోపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్ కోడ్ అడ్డమే కాదు.. -
కోటసత్తెమ్మ వారికి రూ.36.11 లక్షల ఆదాయం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీలో రూ.34,61,125, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.1,50,761 కలిపి మొత్తం రూ.36,11,886 నగదు, 16 గ్రాముల బంగారం, 245 గ్రాముల వెండి, 5 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని దేవదాయ శాఖఅసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. వంద రోజులకు గాను ఈ లెక్కింపు జరిగింది. దేవదాయ శాఖ జిల్లా అధికారి ఈవీ సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది హుండీల నగదును లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ తదితరులు పాల్గొన్నారు. అన్నవరప్పాడు వెంకన్నకు రూ.4.18 లక్షల రాబడి పెరవలి: మండలంలోని అన్నవరప్పాడులో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.4,09,326, అన్నదాన హుండీ ద్వారా రూ.8,831, కలిపి మొత్తం రూ.4,18,157 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. మొత్తం 50 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు జి.సత్యవర ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. -
ఘాట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● గోదావరిలో బోటుపై ప్రయాణించి పరిశీలించిన కీర్తి తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి, సౌకర్యాలు, భక్తులకు సురక్షిత ఏర్పాట్లపై హేతుబద్ధమైన విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, కృష్ణచైతన్య, భక్తాంజనేయ, శివాలయం, పిండ ప్రదానం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, హేవలాక్ బ్రిడ్జి, శ్రీనివాస, ఎరినమ్మ తదితర ఘాట్లను ఆమె గురువారం పడవ ద్వారా పరిశీలించారు. కుమారదేవం వద్ద సినిమా చెట్టును ఘాట్ను కూడా పరిశీలించారు. ఎరినమ్మ ఘాట్ నుంచి గోష్పాద ఘాట్ వరకూ పడవలో తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం గోదావరి నీరాజనం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్లో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత తదితర అంశాలపై అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని అన్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమీక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అన్ని విభాగాలూ సమన్వయంతో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసేలా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాలపై విభాగాల వారీగా సమీక్షించి, తక్షణమే లోపాలను సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు వద్ద గోదావరి తీరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో ఉన్న పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని అధికారులు కలెక్టర్కు వివరించారు. 26 కాటేజీలు, బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాలు వంటి సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2027 పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా పర్యాటకాధికారి పి.వెంకటాచలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టాలు ఇచ్చారు..
భూమి చూపలేదు బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఇచ్చిన పట్టాలకు నేటికీ భూమిని చూపించలేదు. అక్టోబర్ పదో తేదీ 2014లో వాకతిప్పలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది అక్కడకక్కడే మృతి చెందారు. వారిలో నా భార్య మసకపల్లి పుష్పావతి, మరదలు మసకపల్లి కుమారి ఉన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్లు భూమి ఇస్తానని బి పట్టాలు ఇచ్చింది. ఆ భూమి చూపించాలని తహసీల్దార్ కార్యాలయం, స్పందనకు కాళ్లు అరిగేలా తిరుగుతూ వచ్చాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ పట్టాలకు సంబంధించిన భూమిని గతంలో వేరే వారికి ఇచ్చారు. వారి దగ్గర పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇస్తానన్న 50 సెంట్ల భూమిని ఇవ్వాలి. – మసకపల్లి నాగేశ్వరరావు, వాగతిప్ప ప్రభుత్వం ఆదుకోవాలి నా తల్లి విజయలక్ష్మిని కోల్పోయాను. ఇంతకాలం మా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రమాదంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. – దుర్గాదేవి, సోమేశ్వరం, రాయవరం -
సాయం చేసే చేతులేవీ..?
చితికిపోయినా..సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వానికి మానవత్వం బొత్తిగా లేకుండా పోతోంది. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవలసిన బాధ్యతను విస్మరిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో సంభవించిన బాణసంచా విస్ఫోటంలో ప్రాణాలు కోల్పోయిన పది మందిలో బాణసంచా తయారీ దుకాణం యజమాని తప్ప మిగిలిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. ఈ పెను విషాదం జరిగి వారం రోజులు గడిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లడమే తప్ప తక్షణ సాయం అందించే దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎప్పుడో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అదే ఉదారత రాయవరం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిపై లేకపోవడం ఏంటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగి అధికారులను నిలదీశాయి ఈ దుర్ఘటనలో బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన బాణసంచా యూనిట్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మినహాయిస్తే మిగిలిన వారంతా పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వచ్చిన వారే. కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, చిట్టూరి యామిని, అనపర్తి సావరానికి చెందిన కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, కొమరిపాలెం, పెదపూడి మండలం వేండ్రకు చెందిన లింగం వెంకటకృష్ణ, ఒడిశాకు చెందిన కె. సదానందం మృతులు. యజమాని మినహా మిగిలిన వారంతా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. తమ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అగ్రాసనం వేస్తుందని గొప్పగా చెప్పుకొనే సర్కార్ కనీసం వారిని ఆదుకోవాలని ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఘటన జరిగిన రోజు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెళ్తున్నారు తప్ప ఎటువంటి సాయం ప్రకటించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. అలా కాదని సాయం కోసం ప్రశ్నిస్తే ఇచ్చే సాయం ఇవ్వరేమోననే భయం వారిని మాట్లాడనీయలేదు. వా రిని పక్కనబెడితే కూటమి నేతలైన మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పలకరించి ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేసింది. అసలు సంఘటన జరిగిన రోజు వచ్చిన సందర్భంలోనే మంత్రులు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలా కాకుండా ఈ ఘటనపై సమీక్షించిన తరువాత అయినా ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జ్యుడీషియల్, ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరుగుతోంది, పరిహారం ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలయాపనపై ప్రజా సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తనంతట తానుగా మంగళవారం కేసు నమోదుచేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు కారణాలను ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. బాఽధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా అనే విషయాన్ని కూడా రెండు వారాల్లో అందించే నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన వాకతిప్ప బాణసంచా పేలుడు 2014 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. ఆ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఒకో కుటుంబానికి రూ.50 వేలు సొంత నిధులు అందించి ఆదుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ తొలుత లక్షన్నర పరిహారం ప్రకటించింది. జగన్ వచ్చి వెళ్లాక ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలు చేసింది. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. సామర్లకోట మండలం జి. మేడపాడులో 2019 అక్టోబర్లో బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సుమారు రూ.15 లక్షలు సాయం అందించింది. రంపచోడవరం మన్యం ప్రాంతంలో కచ్చులూరు వద్ద 2019లో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన సంఘటనలో 48 మంది మృత్యు వాతపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించింది. అలాగే తాళ్లరేవు మండలం జి.వేమవరంలో బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. వెంటనే కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారాన్ని, క్షతగాత్రులకు రూ.3 లక్షలు అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విస్మయం పది మంది ప్రాణాలు పోయినా పరిహారానికి మీనమేషాలు ఎదురుతెన్నులు చూస్తున్న బాధిత కుటుంబాలు సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జగన్ హయాంలో 24 గంటల్లోనే సాయం నేడు ఉన్నత స్థాయి కమిటీ రాక రాయవరం: బాణసంచా ప్రమాద ఘటనపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం రాయవరం రానుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ బీవీ భాస్కర్ తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రానున్నట్లు తెలిసింది. వీరి వెంట జిల్లా అధికారులు ఉంటారు. ప్రమాద ఘటన తీరుతెన్నులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించే అవకాశముంది. అలాగే బాధిత కుటుంబాలతో మాట్లాడవచ్చు. పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. -
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్పోలో అదానీ డేటా సెంటర్తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు
దేవరపల్లి: రాష్ట్రంలో నాలుగు స్పోట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖలలో అకాడమీల ఏర్పాటుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఒక్కొక్క అకాడమీలో 14 నుంచి 16 గేమ్స్ ఉంటాయని, ఆరు టీమ్ గేమ్స్ కాగా, మిగిలినవి వ్యక్తిగత క్రీడలని ఆయన తెలిపారు. విజయనగరంలో సుమారు 60 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో 100 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో దేవరపల్లి, కొండిపి, కుప్పం, పాయకరావుపేటలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొవ్వూరులో రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీలు, దేవరపల్లిలో అండర్–17 సెపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. 2025 డీఎస్సీ ద్వారా 450 మంది విద్యార్థులకు పైబడి ఉన్న పాఠశాలకు ముగ్గురు పీడీలు ఉన్నారని, మిగిలిన పాఠశాలకు ఇద్దరు పీఈటీలు ఉన్నట్టు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, యర్నగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల్లో మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులుసాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.16,100 కోట్లు ఉండేదని, ప్రస్తుతం చాలా పెరిగిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉందని, ప్రతి నీటి బొట్టును మనం వాడుకోవాలని అభిప్రాయపడ్డారు. మన ప్రాంతంలో రొయ్యలు, చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, దీని వల్ల రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, అమెరికాలో తీసుకున్న పన్నుల విధానం వల్ల ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు నివాళులర్పించారు. ఐఫోన్ కొనుగోలులో రూ.1.04 లక్షల మోసం రాజమహేంద్రవరం రూరల్: ఓఎల్ఎక్స్లో పెట్టిన ఐఫోన్ను కొనుగోలు చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి నగదు వేస్తే ఐఫోన్ అందజేస్తానని చెబితే అతని బ్యాంకు ఖాతాకు రూ.1.04 లక్షలు వేస్తే తనను మోసం చేసాడని మోరంపూడి సాయినగర్కు చెందిన పసగడుగుల రాజా శ్రీవెంకటసాయి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం మోరంపూడి సాయినగర్కు చెందిన సాయి ఓఎల్ఎక్స్లో ఐఫోన్ ఎం ప్రో మోడల్ను కొనుగోలు చేయడానికి గుర్తు తెలియని వ్యక్తికి గత నెల 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.1.04 లక్షలు పంపాడు. కానీ సదరు వ్యక్తి ఐఫోన్ను అందించకుండా సాయి ఫోన్నెంబర్ను బ్లాక్ చేశాడు. సదరు వ్యక్తిపై వెంటనే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తంలో రూ.1,03,970ను హోల్డ్లో పెట్టినట్టు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● విజయనగరంలో 60 ఎకరాల్లో క్రీడా పాఠశాల ● శాప్ డైరెక్టర్ రవీంధ్రనాథ్ -
‘ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు’
పత్రికలు, వాటిలో పనిచేసే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగడం అన్యాయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయ్యినా ఇప్పటికీ బ్రిటీష్ పాలన మాదిరిగా పత్రికలపై దాడులకు దిగడం నీతి బాహ్యమైన చర్యే. విజయవాడ, హైదరాబాద్ సాక్షి కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం ద్వారా పత్రిక రోజువారీ దినచర్యలకు ఆటంకం కలిగించడం సహేతుకం కాదు. పత్రికల స్వేచ్చకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే... – రెడ్డిపల్లి రాజేష్, అధ్యక్షుడు, సిటీ ప్రెస్క్లబ్,కాకినాడ రాజకీయ కక్షలు కార్పణ్యాలతోనే... రాజకీయ కక్షలు కార్పణ్యాలతో ‘సాక్షి’ విూడియా సంస్థపై దాడికి దిగడం సరైన విధానం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోకూడదు. అదికూడా సమయం సందర్భం లేకుండా తరచు సాక్షి కార్యాలయంపై పోలీసుల దాడి, కార్యాలయంలో పోలీసుల హల్చల్, సంపాదకుడు ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రజాస్వామ్యవాదులు ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిందే. – నదీముల్లాఖాన్ దురాని, మాజీ ఉపాధ్యక్షుడు ఏపీడబ్ల్యూజే, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా -
ఆహా ఏమి రుచి.. అతిథులు మైమరచి..
● నన్నయలో ఆహార మహోత్సవ్ ప్రారంభం ● తొలిరోజు ఆకట్టుకున్న ‘తూర్పు’ రుచులు ● పోటాపోటీగా వంటకాల తయారీ రాజానగరం: పిజ్జాలు, బర్గర్లు అంటూ రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడిన నేటి కాలంలో అసలైన సంప్రదాయ ఆహార పదార్థాల రుచులను గోదావరి వాసులు తమ వంటల ద్వారా నిరూపిస్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఆహార మహోత్సవ్ 2025 బుధవారం ప్రారంభమైంది. గోదావరి జిల్లాల్లోని ఆహారపు అలవాట్లు, వంటకాల గురించి తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్టాళ్ల ఏర్పాటు మొదటి రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, తమ సన్నిహితులతో కలిసి సంప్రదాయ, ఆరోగ్యకర ఆహార పదార్థాలను తయారు చేయడంలో పోటీ పడ్డారు. తాము తయారు చేసిన పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, పలువురు అతిథులు, యూనివర్సిటీ, కళాశాలల ఉద్యోగులు, విద్యార్థులు సందర్శించి రుచులను ఆస్వాదించారు. గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తమ వంటలతో పోటీపడనున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తారు. తొలిరోజు విజేతలు ● శాకాహారం విభాగంలో బి.ప్రశాంతిశ్రీ, పి.హేమ ప్రియాంక ప్రథమ, డాక్టర్ పి.శిరీష బృందం ద్వితీయ, కె.మమత తృతీయ స్థానాల్లో నిలిచారు. ● మాంసాహార వంటలకు సంబంధించి యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ప్రథమ, బి.లక్ష్మి ద్వితీయ, వై.బాబీ తృతీయ స్థానాలు పొందారు. ● న్యాయ నిర్ణేతలుగా జిల్లా రోగనిరోధక అధికారి డాక్టర్ కోమలి, కెమిస్ట్రీ అధ్యాపకురాలు బీబీ నళిని, గైనకాలజిస్టు డాక్టర్ చందన పర్వత వర్ధిని, శ్రీలక్ష్మి, ఎస్.పుష్పలత వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయ నిర్మల, హెచ్ఓడీ ఆచార్య డి.కల్యాణి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర, అడ్వకేట్ ఎ.రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ కారణంగా మస్కట్లో చిక్కుకుపోయిన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన పిప్పర శ్రీలతను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. శ్రీలత గత జూన్లో మస్కట్ వెళ్లింది. అక్కడ సరైన పని దొరక్కపోవడం, యజమాని వేధింపులు, మూడు ఇళ్లలో పనికి చేరినా లాభం లేక తీవ్ర ఇబ్బందులు పడింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలతో భారత రాయబార కార్యాలయానికి వచ్చేసింది. ఆమె సమాచారం మేరకు తండ్రి మల్లవరపు వెంకటేశ్వర్లు.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. తన కుమార్తెను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని కలెక్టర్కు అర్జీ అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడి భారత రాయబారి ఇంటి రాజ్యలక్ష్మితో సంప్రదింపులు జరిపి, భారత విదేశీ రాయభార మంత్రిత్వ శాఖ సహకారంతో స్వదేశానికి సురక్షితంగా చేర్చినట్టు నోడల్ అధికారి, డీఆర్ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ బుధవారం తెలిపారు. -
దేదీప్యం.. బ్రహ్మోత్సవం
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారి విహారం ● దర్శనానికి పోటెత్తిన భక్తులు కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలోని శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం స్వామివారు శ్రీకృష్ణుని అలంకరణలో సూర్యప్రభ, మోహినీ అలంకరణలో చంద్రప్రభ వాహనాలపై విహరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వాహన సేవలను వీక్షించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, పర్యవేక్షణలో ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధా న అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేదపండితులు పూజలు నిర్వ హించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పాల్గొన్నారు. రెండు వాహనాలపై ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రెండు వాహనాలపై స్వామివారు ఊరేగారు. ఉదయం శ్రీకృష్ణుని అవతారంలో సూర్యప్రభ వాహంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకున్న భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి శ్రీవారు మోహినీ అలంకారంతో చంద్రప్రభ వాహనంపై విహరించారు. దీని వల్ల భక్తులకు శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా నిర్వహించిన మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నేటి కార్యక్రమాలు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి రాజాధిరాజ అలంకరణలో గజ వాహన సేవ నిర్వహిస్తారు. -
రూ.72.23 లక్షలకు కొబ్బరి చెక్కల వేలం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల కొట్టిన కొబ్బరి చెక్కలను పోగుచేసుకునే వేలం రూ.72,23,499కు ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ ఏడాది పాటు కొబ్బరి చెక్కలు తీసుకునేందుకు బుధవారం అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ – టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా పాట జరిగింది. తొండంగి మండలం సీతారామపురానికి చెందిన గింజాల నాగ వెంకట సత్తిబాబు రూ.72,23,499కు పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.45 లక్షలకు వెళ్లి వేలం ఈ సారి మరింత పెరిగిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
ధాన్యపు సిరులొలికేనా!
ప్రజా సమస్యలు గాలికి..సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ వరి కోతలు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 500 హెక్టార్లకు పైగా కోతలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల వ్యవధిలో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు ప్రాంభించాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దళారులు, ప్రైవేటు వ్యాపారులు కోతలు పూర్తయిన వెంటనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధర అని తెలిసినా రైతులు వాళ్లకే విక్రయిస్తున్నారు. ‘తూర్పు’లో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వరి కోతలు విస్తృతంగా సాగుతున్నాయి. జేసీ మేఘ స్వరూప్ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 221 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాచారు. ఈ–పంటలో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్దేశించినట్లు పేర్కొన్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సారైనా సమయానికి ధాన్యం నగదు అందిస్తారా? 48 గంటల్లో డబ్బులు జమ చేస్తారా? లేదా గత రబీ సీజన్లో ఎదురైన అనుభవాలే మిగులుస్తారా? అన్న సందిగ్ధం వ్యక్తమవుతోంది. రబీలో రైతులకు అన్యాయం జిల్లాలో 2024–25 రబీలో వరి సాధారణ విస్తీర్ణం 60,042 హెక్టార్లు కాగా ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 5.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో 60 వేల మెట్రిక్ టన్నులు ఫైన్ వైరెటీ ధాన్యం. మిగిలిన 4.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. 216 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రక్రియ ప్రారంభించారు. తొలుత 2,63,076 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి, లక్ష్యాలను అధిగమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు ముగియడంతో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. దీంతో చేసేది లేక రైతులు ఆందోళన బాట పట్టారు. వారి నిరసనలకు దిగివచ్చిన ప్రభుత్వం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు ఇచ్చింది. 3.53 లక్షలు సేకరించి అనంతరం కొనుగోలు కేంద్రాలు మూసేసింది. ఇక సేకరించేది లేదంటూ చేతులెత్తేసింది. 30,448 మంది రైతుల నుంచి 3,53,199.280 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. మిగిలిన ధాన్యం వదిలేయడంతో వాటికి విక్రయించేందుకు రైతులు పడిన పాట్లు వర్ణనాతీతమైంది. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించకుండా చేతులెత్తేసింది. ధాన్యం డబ్బుల కోసం తిప్పలు ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన పాలకులు నెలలు గడిచినా ఇవ్వలేదు. గత రబీలో రూ.812.4 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం రూ.682.49 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.129.91 కోట్లు విడుదల చేయకుండా నానా తిప్పలు పెట్టింది. ఎప్పుడు విడుదలవుతుందని రైతులు ప్రశ్నిస్తే అధికారులు దిక్కులు చూశారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురవుతుందా..? డబ్బులు సకాలంలో ఇస్తారా..? అన్న ప్రశ్న రైతుల్లో ఉంది. గతంలో కోతల వెంటే కొనుగోళ్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోతలు ప్రారంభమయ్యే నాటికి రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్రాలు ప్రారంభించిన వెంటనే కోనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. విస్తృతంగా కోతలు జిల్లా వ్యాప్తంగా చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజెర్ల, నిడదవోలు, రాజమండ్రి రూరల్ మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూలీల రేట్లు అధికంగా ఉండటంతో కోతలకు రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 నుంచి 80 శాతం రైతులు యంత్రాల ద్వారానే కోతలు చేపడుతున్నారు. జిల్లాలో వరి సాగు ఇలా.. మండలం కోతల విస్తీర్ణం (ఎకరాల్లో)అనపర్తి 8744.13 బిక్కవోలు 14502.28 చాగల్లు 7901.23 దేవరపల్లి 8580.89 గోకవరం 13993.3 గోపాలపురం 10858.59 కడియం 4870.01 కోరుకొండ 13732.16 కొవ్వూరు 11039.89 నల్లజెర్ల 9065.62 నిడదవోలు 17194.81 పెరవలి 8139.98 రాజమండ్రి రూరల్ 3490.41 రాజానగరం 10530.21 సీతానగరం 13523.45 తాళ్లపూడి 9584.36 ఉండ్రాజవరం 11480.74 రేపటి నుంచి కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా 221 కేంద్రాల ఏర్పాటు ఊపందుకున్న వరి కోతలు ఆలస్యంగా ధాన్యం సేకరణ గత సీజన్లో చేతులెత్తేసిన ప్రభుత్వం ఈసారైనా కనికరిస్తారా అని అన్నదాత ఎదురుచూపు ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ధ్వజం కడియంలో రచ్చబండి, కోటి సంతకాల సేకరణ -
రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..
ఆలమూరు: బంధువులే రాబంధువులు అయ్యారు. అయిన వాళ్లే గద్దల్లా అనునిత్యం పొడుచుకుతిన్నారు. కేసులు పెట్టి హింసించి జైలుకు పంపించారు. సూటిపోటి మాటలతో వ్యక్తిత్వాన్ని కించపరచేవారు. దీంతో సమాజంలో తాను బతకలేనని అతడు భావించాడు. తాను చనిపోతే బిడ్డలు అనాథలైపోతారని భావించి, ముక్కుపచ్చలారని వారికి పురుగు మందు పట్టించి హత్య చేశాడు. తాను కూడా ఇంట్లో సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచార సంఘటన ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇవీ.. స్థానిక శ్రీషిర్డీసాయి ఆలయం సమీపంలో నివసిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) గతంలో గ్రామ వలంటీర్గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో, తన కులవృత్తి అయిన సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం చంటి భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి చంటే కారణమంటూ అత్తింటి వైపు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఆలమూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంతో చంటి జైలు శిక్షకు గురయ్యాడు. ఇటీవల భార్య నాగదేవి ఆత్మహత్య కేసుపై రాజీ కుదరడంతో బయటపడ్డాడు. కానీ బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. క్లూస్ టీం రాక బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడు చంటి సెల్ఫీ వీడియోలోని ఆరోపించిన విధంగా ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీటి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని అప్యాయంగా పలుకరించే తన కుమారుడు చంటి, బుడిబుడి అడుగులతో అల్లరితో సందడి చేసే ఇద్దరు మనవలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులను చంపి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డావంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని ఆ పసి బాలురు మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య ముగ్గురి వేధింపులే కారణమని సెల్ఫీ ఆలమూరు మండలం మడికిలో విషాదం కారణం ఆ ముగ్గురే.. తన సమీప బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రొలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసరావు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చంటి ఆరోపించాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను రూపొందించి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇటీవల ఆ ముగ్గురూ తనను చంపేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. తాను చనిపోతే తన కుమారులు అనాథలై పోతారని ఆందోళన చెందాడు. తన మాదిరిగా బిడ్డల ఆలన పాలన ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన చెందాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు, ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. -
ఆహారం.. ఆరోగ్యం
కపిలేశ్వరపురం: మనిషి జీవితంలో ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కేవలం ఆకలి తీరడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యం పెరగడానికి, శక్తి రావడానికి, తద్వారా సమాజ ప్రగతికి ఎంతో కీలకం. ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వ్యవసాయ ప్రాధాన్యమైన ఈ జిల్లాలో పౌల్ట్రీ, ఆక్వా రంగాలు కూడా ఊపందుకున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆహార ఉత్పత్తి రంగాలకు చేయూత లభించింది. ప్రస్తుత కూటమి పాలనలో ప్రధాన ఆహార ఉత్పత్తి రంగమైన వరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం (అక్టోబర్ 16 ) ప్రపంచ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యం 1945 అక్టోబర్ 16న యునైటెడ్ నేషన్స్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్ (ఎఫ్ఏవో) అనే సంస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ రోజును ప్రపంచ ఆహార దినంగా జరుపుకొంటున్నారు. ఆహారానికి సంబంధించిన వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమ తదితర రంగాల్లో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ప్రగతిపై ఎఫ్ఏవో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేకతలు ● ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకంగా మారింది. దీనిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.54 లక్షల ఎకరాల వరి సాగు నుంచి 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తోంది. కాకినాడ జిల్లాలో 2.14 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల ఎకరాల నుంచి 5.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ● కోనసీమ జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లలో దాదాపు 2.25 లక్షల టన్నుల కూరగాయలు, ఆకుకూరలు దిగుబడి అవుతున్నాయి. ● ఉమ్మడి జిల్లాలో సుమారు 10 మధ్య, చిన్నతరహా, 40 కుటీర మామిడి తాండ్ర తయారీ పరిశ్రమలు ఉన్నాయి. విస్తారంగా మామిడి సాగు ఉంది. కోనసీమలోని ఆత్రేయపురం, కాకినాడ జిల్లాలోని పండూరు, సర్పవరం, తమ్మవరం, గొల్లప్రోలు, కత్తిపూడి, తొండంగి, జగ్గంపేట, చేబ్రోలు, ధర్మవరం, మల్లిశాలల్లో ఉత్పత్తి విస్తారంగా సాగుతోంది. ● ఉమ్మడి జిల్లాలో 25,58,729 పశువుల పెంపకంతో పాలు, మాంసం ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 200 పౌల్ట్రీల్లో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా మాంసం, గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ● 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా 190 హేచరీలు ద్వారా ఏడాదికి 20 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి జరుగుతోంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 36,736 ఎకరాల్లో ఆక్వాసాగు చేస్తున్నారు. కూటమి పాలనలో అస్తవ్యస్తం రాష్ట్రంలో పేదలు రేషన్ షాపుల్లో ఇచ్చే సరకులపై ఆధారపడతారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి నుంచి దాదాపు తొమ్మిది నెలలుగా కంది పప్పు సరఫరా చేయడం లేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. దీని వల్ల పేదలు అవస్థలు పడుతున్నారు. జీఎస్టీ 2.0 నూతన శ్లాబుల విధానం క్షేత్ర స్థాయిలో అమలు కాకపోవడంతో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.తూతూమంత్రంగా తనిఖీలు ఆహార భద్రతా విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలోని హోటళ్లు, ఇతర ఆహారం తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేయడంలో లోపాలు తలెత్తుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ 85 తనిఖీలు చేయగా 38 కేసులు నమోదు చేశారు. రూ.3.21 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. సమాజ ప్రగతికి మూలం ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా కీలకం వ్యవసాయం, పౌల్ట్రీ, ఆక్వా రంగాల్లో ముందంజ దేశ, విదేశాలకు ఎగుమతులు నేడు ప్రపంచ ఆహార దినోత్సవం -
కోనసీమలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
సాక్షి, కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు తాగించి చంపిన తండ్రి పావులూరి కామరాజు.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న కామరాజు.. తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనివాస్, దుర్గారావు అనే వ్యక్తుల వల్లే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘వినేవాడుంటే చెప్పేవాడే చంద్రబాబు.. లోకేశ్ శైలీ ఇదే’
సాక్షి, తూర్పుగోదావరి: వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు.. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. డేటా సెంటర్పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు. తొమ్మిది హార్బర్స్కు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో చేసినా ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాం.. ఇది వాస్తవం. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదం.డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్?. డేటా సెంటర్పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్తో చర్చకు లోకేష్ సిద్ధమా? దీనిపై సవాల్ చేస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు, గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే. జిందాల్ సంస్థ తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రాపర్టీ ఏది?. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా ఉంటాయి’ అని హితవు పలికారు.ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి.. ఆయన వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు?. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయండి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.సిట్ వేయడం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. టీడీపీ నేతలపై సిట్ కేసు నమోదు చేస్తుందా?. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వాములు కదా.. సీబీఐకి అప్పగించండి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు. పాలకొల్లు, అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. జోకర్లు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. రాజమండ్రిలో ప్రవీణ్ చౌదరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 9000 రూపాయలు పెంచి వేతన సవరణ చేశారు. రాజమండ్రి ప్రస్తుత ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే 5400 మాత్రమే చేయించారు’ అని చెప్పుకొచ్చారు. -
లో గ్రేడ్.. వెరీ బ్యాడ్
దేవరపల్లి: వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మార్కెట్లో లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. గత ఏడాది కొనుగోలు చేసిన లో గ్రేడ్ పొగాకు ఇప్పటికీ వ్యాపారుల వద్ద నిల్వ ఉండిపోయింది. ఈ ప్రభావం ఈ ఏడాది మార్కెట్పై పడిందని టుబాకో బోర్డు అధికారులు చెబుతున్నారు. రైతుల వద్ద ఉన్న నాణ్యమైన (బ్రైట్) గ్రేడ్ పొగాకు అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయి. ఇక లో గ్రేడ్ పొగాకు మాత్రమే అమ్ముకోవలసి ఉంది. కానీ, దీనిని అడిగే నాథుడే లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. రూ.150 ఇవ్వాలి ఈ ఏడాది లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు వ్యాపారులు మొదటి నుంచీ అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో, చివరిలో అమ్ముకోవచ్చునే ఉద్దేశంతో రైతులు దీనిని నిల్వ చేశారు. పొగాకు కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకోవడంతో ప్రస్తుతం తమ వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. అయితే, రెండు మూడు కంపెనీలు మాత్రమే తమకు నచ్చిన లో గ్రేడ్ పొగాకును మొక్కుబడిగా కొనుగోలు చేస్తున్నాయని వాపోతున్నారు. 2023–24లో లో గ్రేడ్కు మంచి డిమాండ్ ఏర్పడింది. కిలో రూ.170 వరకూ అమ్ముడు పోయింది. 2024–25లో కిలో రూ.130 నుంచి రూ.140కి అమ్ముడవడంతో మంచి రేటు వచ్చిందని రైతులు సంతోషించారు. ఈ ఏడాది ప్రస్తుతం కిలో రూ.70 నుంచి రూ.80కి మాత్రమే అమ్ముడు పోతోందని చెబుతున్నారు. ఈ ధర గిట్టుబాటు కాదని, కనీసం రూ.150 ఇవ్వాలని కోరుతున్నారు. 4 మిలియన్ కిలోల ఉత్పత్తి పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలంలో సుమారు 4 మిలియన్ కిలోల లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో వేలం కేంద్రంలో 5 లక్షల నుంచి 6 లక్షల కిలోల లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి జరిగిందన్నది వారి అంచనా. ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని దక్షిణాది వేలం కేంద్రాల ప్రాంతాల్లో నాణ్యమైన లో గ్రేడ్ పొగాకు తక్కువ ధరకు దొరుకుతోంది. దీంతో, ఇక్కడి ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని అధికారులు అంటున్నారు. దక్షిణాది వేలం కేంద్రాల్లో కిలో రూ.60 నుంచి రూ.80 ధర పలుకుతోంది. ఎగుమతులకు అవసరమైన నికోటిన్ శాతం ఉన్న పొగాకు ఉత్పత్తి ఆ ప్రాంతాల్లో జరిగింది. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో నికోటిన్ శాతం తక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. అక్కడ, ఇక్కడ దాదాపు ఒకే ధర పలుకుతున్నప్పటికీ, ఇక్కడ కొనుగోలు చేసిన పొగాకును గుంటూరు ప్రాంతానికి తరలించేందుకు రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారు. అయితే, లో గ్రేడ్ పొగాకు గ్రేడింగ్లో రైతులు అశ్రద్ధ చూపారని, మిక్సింగ్ గ్రేడ్ ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు ఇష్టపడటం లేదని అధికారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈ ఏడాది లో గ్రేడ్ పొగాకు అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలూ పడుతున్నారు. రూ.2,376 కోట్ల పొగాకు విక్రయాలు పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఈ సీజన్లో ఇప్పటి వరకూ రూ.2,376 కోట్ల విలువైన 73.01 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మొత్తం 5,78,919 బేళ్ల అమ్మకాలు జరిగాయని బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ పొగాకు 69.70 మిలియన్ కిలోలు, బ్లాక్ సాయిల్ పొగాకు 3.31 మిలియన్ కిలోల మేర అమ్మకాలు జరిగాయన్నారు. 2024–25 పంట కాలానికి 59 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 84 మిలియన్ల కిలోల పంట పండించారని తెలిపారు. కిలోకు గరిష్టంగా రూ.427, కనిష్టంగా రూ.70, సగటున రూ.310.71 చొప్పున ధర పలికిందని వివరించారు. బ్లాక్ సాయిల్ పొగాకు కిలో సగటు ధర రూ.237.44 లభించిందన్నారు. మరో నెల రోజులు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, రైతుల వద్ద దాదాపు 12 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకానికి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 164 రోజుల పాటు వేలం ప్రక్రియ జరిగిందన్నారు. రైతులు స్వీయ నియంత్రణ పాటించాలి రైతులు పొగాకు సాగులో స్వీయ నియంత్రణ పాటించాలి. పరిమితికి లోబడి మాత్రమే వచ్చే ఏడాదికి పండించాలి. బోర్డు నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేకుండా పొగాకు సాగు చేయవద్దు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మించిన బ్యారన్లను తొలగించాలి. అటువంటి బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ చేయబోమని బోర్డుకు రైతు అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ ఇచ్చిన తర్వాత బ్యారన్ వినియోగిస్తే పొగాకు అమ్మకాలను నిలుపు చేస్తాం. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు మందకొడిగా ఉన్నాయి. కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. లో గ్రేడ్ పొగాకు గ్రేడింగ్ సరిగా లేదు. మిక్సింగ్ గ్రేడ్లు ఉన్నందున ధర పలకడం లేదు. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డ్ రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం ఫ మందకొడిగా లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు ఫ 4 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా ఫ కొనుగోలుకు ఆసక్తి చూపని వ్యాపారులు ఫ కిలో ధర రూ.70 ఫ అయోమయంలో రైతులు -
దళారుల దందా పెళ్లి బృందాలకు క్షవర కల్యాణం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పేదలు తమ బిడ్డల వివాహాలు చేసుకునేందుకు వీలుగా రత్నగిరిపై పలువురు దాతలు ఉచిత కల్యాణ మండపాలు నిర్మించారు. కానీ, వీటి కేటాయింపులో దళారుల దందా సాగుతోంది. వారికి కొంతమంది దేవస్థానం సిబ్బంది అండదండలు ఉండటంతో పేదలకు ఉచిత కల్యాణ మండపాలు లభించడం దుర్లభంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఉచిత కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానం అధికారులు సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో దళారులు, కొంతమంది సిబ్బంది ఒక్కటై వివాహ బృందాలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఉదంతమే దీనికి ఉదాహరణ.రూ.25 వేలకు ఒప్పందంపశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తోట నాగతేజ గత శనివారం రాత్రి రత్నగిరిపై వివాహం చేసుకున్నారు. ఈ వివాహ ఏర్పాట్ల కోసం ఆయన గత ఆగస్టులో దేవస్థానానికి వచ్చారు. మట్టే వారి సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపంలో ఏసీ కల్యాణ మండపం, పక్కనే సత్రంలో రెండు ఏసీ గదులు, పురోహితుడు, సన్నాయి మేళం కోసం దేవస్థానం సీఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించారు. సత్రం గదులు, వివాహ మండపం వివాహానికి నెల రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేస్తారని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి నుంచి నాగతేజ వెలుపలకు రాగానే అశోక్, పోరి అనే ఇద్దరు దళారులు అతడి వద్దకు వెళ్లారు. అక్టోబర్ 11 వివాహానికి గదులు, వివాహ మండపం సెప్టెంబర్ 11న వస్తే రిజర్వ్ చేస్తారని చెప్పారు. ఆయన రానవసరం లేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తామని, రూ.25 వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగతేజ.. వారికి తన, పెళ్లి కుమార్తె ఆధార్ నకళ్లతో పాటు శుభలేఖ, రూ.15 వేల నగదు ఇచ్చారు. మిగిలిన రూ.10 వేలు వివాహ సమయంలో ఇస్తామని చెప్పారు. అయితే, వివాహం చేసుకునేందుకు గత శనివారం దేవస్థానానికి వచ్చిన నాగతేజకు నాన్ ఏసీ కల్యాణ మండపం, రెండు నాన్ ఏసీ గదులు మాత్రమే ఇచ్చారు. దీంతో, అతడు దళారులకు రూ.10 వేలకు బదులు రూ.7,500 మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.2,500 కూడా ఇవ్వాలని దళారులు గొడవకు దిగడంతో నాగతేజ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఈఓ వీర్ల సుబ్బారావుకు ఫిర్యాదు చేశాడు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం సంగతి అలా ఉంచితే.. ఈ ఎపిసోడ్లో అసలు వ్యక్తులు రాకుండా దళారులు ఆధార్ కార్డులు ఇస్తే వివాహ మండపం, సత్రంలో గదులు ఎలా రిజర్వ్ చేశారు? సీఆర్ఓ కార్యాలయ సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది జరిగే పనేనా వంటి అనేక సందేహాలు కలుగుతున్నాయి.నెరవేరని దాతల లక్ష్యంఅన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు 2022లో 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఇదేవిధంగా విశాఖపట్నానికి చెందిన దాత ఎంఎస్ రెడ్డి కూడా 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద కల్యాణ మండపం నిర్మించారు. ఈ రెండు మండపాల్లో చెరో తొమ్మిది మినీ కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానానికి అప్పగించారు. మిగిలిన చెరో మూడు మండపాలను దాత సిఫారసు మేరకు కేటాయిస్తారు. ఈ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు రూపాయి కూడా అద్దె చెల్లించనవసరం లేదు. అలాగే, ఒక్కో వివాహానికి రెండు గదులను దేవస్థానం అద్దె ప్రాతిపదికన ఇస్తుంది. వివాహ ముహూర్తానికి నెల రోజుల ముందు మాత్రమే ఈ కల్యాణ మండపాలను రిజర్వ్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది వివాహానికి చాలా రోజుల ముందే వస్తున్నారు. తీరా విషయం తెలిశాక మళ్లీ రాలేకపోతున్నారు. అటువంటి వారిని గుర్తించి, దళారులు వల విసురుతున్నారు.ఇలా చేస్తే మేలు దేవస్థానంలో వివాహ మండపాలు, సత్రం గదుల కేటాయింపుపై ఎటువంటి ప్రచారమూ లేదు. వీటిని వివాహాలకు నెల రోజుల ముందు మాత్రమే కేటాయిస్తారని ఫ్లెక్సీలు, మైకుల ద్వారా ప్రచారం చేయాలి. సీఆర్ఓ కార్యాలయంతో పాటు దేవస్థానంలో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలి. వివాహ మండపాలు కేటాయించాలంటే పెళ్లి బృందం సభ్యులు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే సీఆర్ఓ కార్యాలయం వద్దకు రావాలంటూ ప్రకటనలు చేయాలి. వివాహ బృందాల వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలి. ఆ నంబర్పై విస్తృత ప్రచారం చేయాలి. వివాహాల సీజన్లో ఈఓ, ఇతర ఉన్నతాధికారులు తరచుగా వివాహ మండపాలు, సీఆర్ఓ కార్యాలయంలో తనిఖీలు చేయాలి. పెళ్లి బృందాల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.ఫ ఉచిత వివాహ మండపాలు కేటాయించడానికి ముందు, వివాహం అయ్యాక ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీసి, ఆ మేరకు చర్యలు చేపట్టాలి. -
వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలి
అంబాజీపేట: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అన్నారు. అంబాజీపేట మండలం నందంపూడిలో వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని స్మృత్యర్థం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వడ్లమాని లక్ష్మీనారాయణ మెమోరియల్ ట్రస్ట్ పేరిట మంగళవారం వేద సభ నిర్వహించారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలకు భారతదేశం, కోనసీమ వేద పండితులకు పుట్టినిల్లని అన్నారు. వేద పండితులకు ఎన్నో ఆర్థిక సమస్యలున్నాయని, అయినప్పటికీ వేదాల ప్రాశస్త్యాన్ని, అర్థాలను సమాజానికి చాటి చెబుతున్నారని అన్నారు. ఇలాంటి వేదసభలు గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తే వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు వేదాలకు, వేద పండితులకు ఎంతో గుర్తింపు లభించి, వారి ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ సమక్షంలో వేద పండితులు సుమారు గంటసేపు వేదస్వస్థి గావించారు. అనంతరం వేద పండితులను సత్కరించారు. తొలుత సుబ్రహ్మణ్య ఘనపాఠి ఆధ్వర్యాన వేద పండితులు జస్టిస్ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన వేద పండితులు ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనపాఠి, టీటీడీ దేవస్థానం శ్రీ వెంకటేశ్వర హయ్యర్ వేదిక్ స్టడీస్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ దువ్వూరి ఫణి యజ్ఙేశ్వరయాజులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పీకే రావు, పేరి శ్రీనివాస్, అధిక సంఖ్యలో వేద పండితులు పాల్గొన్నారు. నా జన్మ ధన్యం ఈ సందర్భంగా జస్టిస్ రమణ కొద్దిసేపు సుబ్రహ్మణ్య ఘనపాఠితో ముచ్చటించారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య ఘనపాఠితో తీయించుకున్న ఫొటో లను ఆయన నివాసంలో చూసి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. వెంకటేశ్వరస్వామి దయ వల్లే తాను తన పదవిని ఎంతో సమర్థంగా నిర్వహించానని, భగవంతుని ఆశీస్సులతో పాటు వేద పండితుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు. చిన్నతనం నుంచీ వేదపండితుల మధ్య కూర్చొని వేద ఘోషను ఆస్వాదించాలనే తన జీవిత కాల కోరిక నెరవేరిందని తన్మయత్వానికి లోనయ్యారు. వేదపఠనాన్ని ఆస్వాదిస్తూ, ఎంతో పులకించిపోయానని, మానసికంగా ఎన్నడూ పొందని ఆనందాన్ని పొందానని అన్నారు. లక్ష్మీనారాయణ అవధాని మెమోరియల్ ట్రస్టుకు రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని మనుమడు, ప్రముఖ వేద పండితుడు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య రవితేజ ఘనపాఠికి జస్టిస్ రమణ సింహతలాటం అలంకరించి సత్కరించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ -
మళ్లీ పోటెత్తిన ఎర్ర కాలువ
నిడదవోలు రూరల్: భారీ వర్షాలకు ఎర్ర కాలువ మరోసారి పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో నిడదవోలు మండలం కంసాలిపాలెం – మాధవరం వంతెన వద్ద మంగళవారం ఉదయం నుంచీ ప్రవాహ ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. వంతెనపై ప్రమాదకర స్థితిలో ఎర్రకాలువ నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిడదవోలు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనుల దృష్ట్యా అధికారులు నిడదవోలు నుంచి తాడేపల్లిగూడేనికి సింగవరం మీదుగా తాళ్లపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నుంచి కార్లు, బైక్లను మళ్లించారు. అయితే, ఎర్ర కాలువ సమీపంలో ఉండటంతో ఈ బ్రిడ్జి వద్దకు కూడా నీరు చేరింది. తప్పని పరిస్థితుల్లో వాహనదారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. -
చంద్రబాబు డైరెక్షన్తోనే జనార్దనరావుతో వీడియో రికార్డింగ్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇందులో భాగంగానే ఈ కేసులో అరెస్టయి, రిమాండులో ఉన్న నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతో వైఎస్సార్సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ పేరును చెప్పిస్తూ వీడియో లీక్ చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.మంగళవారం రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో వేణు మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు వరుసగా అరెస్టవుతున్నా, సిగ్గు లేకుండా వైఎస్సార్సీపీకి ఈ బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ మిథున్రెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, దీంతో భయపడ్డ చంద్రబాబు దీనిని డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ పేరును తెరపైకి తీసుకువచ్చారన్నారు. హడావుడిగా మీడియా సమావేశం నిర్వహించి ‘దీనిలో కుట్రకోణం ఉంది.దాని కోసం సిట్ వేశాను. కొత్త పాత్రలను ప్రజలకు చూపిస్తాను’ అన్నట్టుగా చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వెంటనే జనార్దనరావు వీడియో విడుదలైందన్నారు. జోగి రమేష్ చెప్తేనే తాను నకిలీ మద్యం రాకెట్ నడిపించానంటూ ఈ వీడియోలో అతడు ఆరోపించాడన్నారు. సీఎం తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. ఈ సందేహాలకు బాబే జవాబు చెప్పాలి ‘జుడీషియల్ రిమాండ్లో ఉన్న జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? అంతకుముందే ఆయన తన ఫోన్ పోయిందని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఫోన్లేని వ్యక్తి వీడియో ఎలా రికార్డ్ చేశాడు? జుడీషియల్ రిమాండ్లో ఉండే ఈ వీడియో రికార్డ్ చేశాడని భావించినా, ఆయనను విచారించే అధికారులు చుట్టూ ఉంటారు. ఆయన నిలబడి, వినమ్రతతో మాట్లాడతాడు. కానీ.. ఈ వీడియో చూస్తే ఆయన చాలా స్వేచ్ఛగా కుర్చీలో కూర్చుని ఉన్నట్టు, పక్కనుంచి ప్రాంప్టింగ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోగా కూడా దీనిని భావించే పరిస్థితి కనిపించడం లేదు.అందువల్ల జనార్దనరావుతో ఉద్దేశపూర్వకంగానే కావాల్సిన విధంగా చెప్పించి, వీడియో చిత్రీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సందేహాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి’ అని వేణు అన్నారు. జైలులో రిమాండులో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి, బయటకు విడుదల చేశారంటే, దీనికి ఏ అధికారి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జోగి రమేష్ కు జనార్దనరావు సన్నిహితుడంటూ ఓ కట్టుకథ అల్లారన్నారు. 2024లో తంబళ్లపల్లి టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు బి–ఫామ్ ఇచ్చిన సమయంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బదులు జనార్దనరావు ఉన్నాడన్నారు.ఈ ఫొటోలు కూడా అన్ని పత్రికల్లోనూ వచ్చాయన్నారు. దీనినిబట్టి జనార్దనరావు ఎవరికి అత్యంత సన్నిహితుడో ప్రజలే అర్థం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ, భరోసా లేకపోతే అంత ధీమాగా ఒక కేసులో నిందితుడు ఆఫ్రికా నుంచి ఆవిధంగా వస్తాడా అని ప్రశ్నించారు. తొలుత ఆయన ఆఫ్రికా నుంచి విడుదల చేసిన వీడియోలో నకిలీ మద్యం వ్యవహారంలో ఏ రాజకీయ పార్టీ సంబంధం లేదని చెప్పాడన్నారు. రిమాండ్కు వెళ్లిన తరువాత జనార్దనరావు మాట ఎలా మారిందని ప్రశ్నించారు. -
హరిప్రియకు అభినందనలు
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతి విద్యార్థిని కుడుపూడి కావ్య సుందరి హరిప్రియను మంగళవారం ప్రధానోపాధ్యాయుడు కడలి సాయిరామ్ అభినందించారు. బాపట్ల జిల్లా పేటేరు హైస్కూల్లో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 కేజీల విభాగంలో హరిప్రియ మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కార్యక్రమంలో పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరరావు, పీఈటీ అందె సూర్యకుమారి, కోచ్ త్రిమూర్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దేవరపల్లి: జాతీయ రహదారిపై యర్నగూడెం గండి చెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలవరం మండలం కొత్తపట్టిసం గ్రామానికి చెందిన దొడ్డి నాగు (35) కొవ్వూరు మండలం పంగిడిలో నివాసం ఉంటున్నాడు. దొమ్మేరుకు చెందిన తాళ్ల అభిషేక్తో కలిసి నాగు బైక్పై విజయవాడలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. యర్నగూడెం సమీపంలో గండి చెరువు వద్ద హైవేపై వెళుతున్న క్వారీ లారీ సడన్గా సర్వీస్ రోడ్డులోకి వచ్చింది. దీంతో సర్వీస్ రోడ్డులో వెళుతున్న బైక్ అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొడ్డి నాగు తలకు బలమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అభిషేక్ తల, కాలికి బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అభిషేక్ అవివాహితుడు. నాగు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
భక్తులకు అన్నవరమై..
పెళ్లి భోజనంలా.. అన్నదాన పథకంలో భక్తులకు పెళ్లి భోజనం మాదిరిగా ఆహార పదార్థాలు వడ్డిస్తారు. పులిహోర, స్వీట్, రెండు రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో కలిపి కేవలం అరటి ఆకులోనే భోజనం పెడతారు. ఇక్కడకు వచ్చిన భక్తులతో పాటు వాడపల్లి క్షేత్రానికి వెళ్లి వస్తున్న వారు కూడా అన్నవరప్పాడులో ఆగి, అన్న ప్రసాదం స్వీకరిస్తారు. స్వామి వారికి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అంగరంగా వైభవంగా కల్యాణం జరుపుతారు. ఆ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ వారం రోజుల పాటు అన్నదానం చేయడం విశేషం. ప్రస్తుతం ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి దేవదాయ ధర్మాదాయశాఖకు అనుమతులు కోరుతూ నివేదికలు సమర్పించారు. ● అన్నవరప్పాడు వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ ● ప్రతి శనివారం అన్నదానం ● పెళ్లి భోజనంలా ఆహార పదార్థాలు ● నిత్యాన్నదానంగా మార్చేందుకు చర్యలు పెరవలి: జాతీయ రహదారి పక్కనే పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతోంది. నిత్యం ఈ ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అయితే కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమం జరపడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ చరిత్ర అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఓసూరి సోమన్న కలలో తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి, ఈ దివ్యస్థలిలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంట. ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో అందరూ స్వామివారి ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి 1965లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్వం ఇదే ప్రదేశంలో అత్రి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ఇంతటి తేజస్సు లభించిందని నమ్మకం. అన్నదాన పథకం ఆలయంలో ఐదేళ్ల క్రితం అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేవలం భక్తుల విరాళాలతో మాత్రమే నిర్వహిస్తున్నారు. స్వామివారి మూలధనం నుంచి ఒక్క పైసా కూడా వినియోగించరు. ప్రతి శనివారం నిర్వహించే ఈ అన్నదానానికి భక్తులు ముందస్తుగానే తమ విరాళాలు అందిస్తారు. ఆలయంలో ప్రతి శనివారం 6 వేల నుంచి 9 వేల మంది వరకు భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రత్యేక రోజుల్లో వారి సంఖ్య మరో మూడు వేలకు పెరుగుతుంది. ప్రతి వారం దర్శనం అన్నవరప్పాడులో కొలువైన వేంకటేశ్వరస్వామిని ప్రతి శనివారం దర్శించుకుంటాను. దాదాపు పదేళ్లుగా ఆలయానికి వస్తున్నాను. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలను స్వామివారు తప్పకుండా తీర్చుతారు. – కాపక పాపారావు, భక్తుడు, కాకరపర్రు అన్నదానం బాగుంది ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం చాలా బాగుంది. వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం వడ్డిస్తారు. అది కూడా పెళ్లి భోజనంలా పెడతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. – కంటిపూడి సూర్యనారాయణ, భక్తుడు, తీపర్రు భక్తుల తాకిడి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి శనివారం నిర్వహించే అన్నదానాన్ని నిత్యాన్నదానంగా మార్చేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. 1965లో నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలస్థితికి చేరింది. దీంతో నూతన ఆలయ నిర్మాణానికి కూడా నివేదిక ఇచ్చాం. – మీసాల రాధాకృష్ణ, ఆలయ ఈఓ, అన్నవరప్పాడు విరాళాలు అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం కింద ఇప్పటి వరకు రూ.4 లక్షల డిపాజిట్లు, బంగారం 376 గ్రాములు, 30 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. భక్తులు నిత్య గోత్రార్చన కింద రూ.12 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఇవి స్వామివారికి శాశ్వత డిపాజిట్లు కాగా, ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం మాత్రం ఎప్పటికప్పుడు భక్తులు విరాళాలతో నిర్వహిస్తారు. పెళ్లిళ్ల గుడి ఆలయంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ముహూర్తాల సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లపైనే వివాహాలు జరుపుతారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. అందుకే ఈ వెంకన్న సన్నిధి.. పెళ్లిళ్లకు చల్లని పెన్నిధి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఈ ఆలయాన్ని పెళ్లిళ్ల గుడిగా పిలుస్తారు. -
సంప్రదాయాలపై అవగాహన అవసరం
● నన్నయ వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ ● వర్సిటీలో ఘనంగా యువజనోత్సవాలు రాజానగరం: చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్ (కాకినాడ) ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీడీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహ దపడతాయన్నారు. ఈ సందర్భంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న 944 మంది విద్యార్థులు జానపద నృత్యం, జానపద గేయాలు, స్టోరీ రైటింగ్, పోస్టర్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, పర్యావరణ పరిరక్షణ మున్నగు వాటిలో పోటీ పడ్డారు. విజేతలు వీరే.. ● ఇన్నోవేషన్ ట్రాక్ (సైన్స్ మేళా ప్రదర్శన)లో వంగ అయ్యప్ప గ్రూప్ ప్రథమ, షేక్ మోనినా గ్రూప్ ద్వితీయ, జానపద నృత్యం (గ్రూప్)లో ఎస్ఆర్ఎస్ గ్రూప్ ప్రథమ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ ద్వితీయ, పి.డోలా స్రవంతి గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● జానపద గేయాల విభాగంలో తాతరాజు గ్రూప్ ప్రథమ, ఎ.మొలరాజు గ్రూప్ ద్వితీయ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ తృతీయ స్థానాలు సాధించాయి. ● ఉపన్యాసంలో విధూషీ శాండిల్య ప్రథమ, జి.ధ్రువిత్ ద్వితీయ, వైష్టవి కొల్లిమల్ల తృతీయ, కథ రాయడంలో వీబీ జ్ఞాన షర్మిల ప్రథమమ, అపూర్వ కొచ్చే ద్వితీయ, ఎ.లాలస్య తృతీయ బహుమతులు సాధించారు. ● పెయింటింగ్లో మహ్మద్ సమీర్, డి.వెంకట త్రివిక్రమ్, కె.లాజర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కవిత్వంలో జి.ధ్రువిత్ ప్రథమ, బోడా హాసిని ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. -
గరుడ వాహనంపై మలయప్ప దర్శనం
● ఘనంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో భూసమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహనసేవ, ఊరేగింపులు జరిపారు. గరుడ వాహనంపై శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్శంగా పండితులు గరుడ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. కాగా..ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రామేశంపేట మెట్టలో అక్రమ మైనింగ్
● ఆగే వరకూ పోరాటం చేస్తాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు బోట్క్లబ్ (కాకినాడసిటీ): మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగవారం పెద్దాపురం మండలం రామేశం పేట మెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై విలేకర్ల సమావేశం నిర్వహించారు. రామేశంపేటలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తనకు 60 ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా అక్కడ వెళ్లగా అనధికార మైనింగ్ జరుగుతోందన్నారు. దానిపై కలెక్టర్కు, మైనింగ్ శాఖ డీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు. కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇటీవల గ్రావెల్ వాహనం ఢీకొని కళాశాల విద్యార్థి మృతి చెందాడన్నారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్ కారణంగా కొండలు రోజురోజుకీ తరిగిపోతున్నాయన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 900 ఎకరాల్లో కేవలం 260 ఎకరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. మిగిలినదంతా అనధికారికంగా జరుగుతోందన్నారు. రామేశంమెట్టలో అక్రమ మైనింగ్ ఆగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కుండల సాయి, మొసలగంటి సురేష్ , చోడిశెట్టి రమేష్బాబు పాల్గొన్నారు. -
అప్పు తీర్చలేక స్నేహితుడి హత్య
● ఆపై భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం ● వీడిన హత్యకేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి రాజు ఏలేశ్వరం: తీసుకున్న అప్పు తీర్చాలని స్నేహితుడు ఒత్తిడి చేయడంతో అతడిని హత్య చేశాడో దుర్మార్గుడు. ఆపై పోలీసులకు దొరికిపోతాననే భయంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని పోలీసులు విచారణ చేయడంతో హత్య కేసు మిస్టరీ వీడింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడ్డతీగల మండలం కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 4న ఏలేశ్వరంలోని తన కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పురుగు మందు తాగి అడ్డతీగల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా అతడే వెంకటేశ్వర్లును హత్య చేసినట్టు తేలింది. కోడిపందేలకు పిలిచి.. బొదిరెడ్డి వెంకటేశ్వర్లుకు ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్తో కోడి పందేల వద్ద స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు నుంచి రాజా రమేష్ రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తన బాకీ తీర్చమని వెంకటేశ్వర్లు ఒత్తిడి తేవడంతో అతడిని కడతేర్చేందుకు రాజా రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో కోడి పందేలు ఉన్నాయని చెప్పి, తనతో కారులో వెంకటేశ్వర్లును తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో మత్తు మందు కలిపిన డ్రింక్ను వెంకటేశ్వర్లుకు ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని హత్య చేసి, అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకున్నాడు. బురదరాళ్ల ఘాట్ రోడ్డులోని బొంతువలస గ్రామం వద్ద తుప్పల్లో మృతదేహాన్ని పారవేసి వెళ్లి పోయాడు. ఆ డబ్బుతో తాను తీసుకున్న బాకీలను తీర్చాడు. అయితే హత్య కేసులో పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాజా రమేష్ పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని విచారణ చేసిన పోలీసులకు జరిగిన సంఘటన వివరించాడు. చికిత్స అనంతరం ఈ నెల 13న కోలుకోగా ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు కోర్టుకు తరలించారు. -
వంట గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
పిఠాపురం: మల్లాం గ్రామంలోని ఒక ఇంట్లో వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మల్లెపాముల వీర నాగేశ్వరరావు ఇంట్లో పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అతడితో పాటు, భార్య నాగలక్ష్మి, తమ్ముడు లోవరాజుకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. చిన్న పిల్లాడు ఏడుస్తుండడంతో ఆ బాలుడితో పాటు మరో వ్యక్తి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి
అనపర్తి, రాయవరం: రోడ్డు ప్రమాదంలో జూనియర్ కళాశాల రికార్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ (52) రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రోజూలాగే వేమగిరి నుంచి అనపర్తి కొప్పవరం మీదుగా రాయవరంలోని కళాశాలకు బయలుదేరారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో కొప్పవరం గ్రామ శివారుకు చేరుకునే సరికి ఆయన బైక్ రోడ్డుపై జారి పోయింది. వాహనంతో పాటు ఆయన రోడ్డుపై పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గమనించారు. ఆయన జేబులోని సెల్ఫోన్ తీసి రాయవరం కళాశాలలోని సహోద్యోగులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి హుటాహుటిన అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సై సుజాత కేసు నమోదు చేశారు. -
కళాశాల బస్సును ఢీకొన్న వ్యాన్
13 మంది విద్యార్థులకు గాయాలు దేవరపల్లి: ప్రైవేటు కళాశాల బస్సును బొలెరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో బస్సులోని 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు సుమారు 40 మంది విద్యార్థులతో సోమవారం ఉదయం కళాశాలకు వెళుతుండగా, కృష్ణంపాలెం వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి కిరాణా సరకులతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా స్థానిక పీహెచ్సీలో వైద్యం చేసి ఇళ్లకు పంపించారు. వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఎంపికై న బాలురు రాష్ట్ర స్థాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై న బాలికలు పెదపూడి: క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడ జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, లయన్స్ క్లబ్ అడ్మిన్ మండ రాజారెడ్డి అన్నారు. జి.మామిడాడలోని జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ద్వారంపూడి దివాకర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 బాలుర, బాలికల విభాగాల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా జట్ల ఎంపికలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా ద్వారంపూడి భాస్కర్రెడ్డి, మండ రాజారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్రెడ్డి మాట్లాడుతూ ఈ ఎంపికలు స్థానిక లయన్స్ క్లబ్, జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సహకారంతో నిర్వహించామన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యులు టీఎన్వీఆర్ మూర్తి, ఫిజికల్ డైరెక్టర్లు ద్వారంపూడి యువరాజారెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. కడు రమణీయం
● వాడపల్లిలో శ్రీనివాసుని కల్యాణం ● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ● యోగనారసింహ అలంకరణలో శ్రీవారు విహారం కొత్తపేట: శ్రీవారు ఓరకంట చూడగా.. అమ్మవారు సిగ్గులమొగ్గగా మారగా.. జగద్రక్షకుడి కల్యాణం కన్నుల పండువగా జరగ్గా.. ఈ క్రతువును తిలకించిన భక్తజనం మురిసిపోగా.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీనివాసుని కల్యాణం అట్టహాసంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం కల్యాణోత్సవాన్ని, వాహన సేవను తిలకించి పులకించింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టకలశారాధన, మహాస్నపనం, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పం, దిగ్దేవతా బలిహరణ తదితర పూజలు నిర్వహించారు. కనుల వైకుంఠం.. శ్రీనివాసుని కల్యాణం లోక సంక్షేమార్థం శ్రీనివాసుని కల్యాణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రదానం నుంచి తలంబ్రాల వరకూ వేదపండితుల వ్యాఖ్యానం నడుమ వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తీసుకువచ్చి మండపంలో అలంకరించారు. దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణ మాలలు తదితరాలు సమర్పించారు. నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం జరిపారు. సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు శ్రీవారు యోగనారసింహ అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సింహ వాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు సింహ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. ఈ ఘట్టం భక్తులకు ఐశ్వర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం తదితర గుణాలను ప్రసాదిస్తారని అర్థం. సింహం ధైర్యం, వేగం, చురుకుదనానికి ప్రతీక. కాబట్టి స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతూ పైలక్షణాలను అనుగ్రహిస్తారు. యోగనారసింహ రూపంలో శ్రీవారిని దర్శించిన వారికి మంచి జరుగుతుందని వివరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేంకటేశ్వర స్వామివారి వేషధారణలో ఒక కళాకారుడు ఆకట్టుకున్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం వసంతోత్సవం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహిస్తారు. సాయంత్రం హనుమత్ మూలమంత్ర హవనం, అష్టోత్తర శత కలశారాధన, పంచశయ్యాధివాసం విశేష పూజలు, సేవలు, రాత్రి మలయప్ప అలంకరణతో గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. -
మాగాంలో కొండముచ్చు దాడి
ఐదుగురికి తీవ్ర గాయాలు అయినవిల్లి: మాగం గ్రామంలో ఓ కొండముచ్చు రెండు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసింది. ఆ గ్రామానికి చెందిన బి.సత్యనారాయణ, బొడపాటి రాజేష్, కొట్టల శ్రీనులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో కొండముచ్చు దాడి చేసి గాయపరిచింది. ఇలా మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్తులు చెప్పారు. బాధితులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండముచ్చు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా 15 మందిపై దాడి చేసినా అధికారులు స్పందించలేదని అంటున్నారు. ఇప్పటికై నా కొండముచ్చులను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రత్నగిరిపై సంప్రోక్షణ పూజలు ప్రారంభం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయంలోని దర్బారు మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఈ పూజలు, హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలుత కలశాలతో మండపారాధన చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ పూజలు నిర్వహించారు. తర్వాత శాంతి హోమానికి అంకురార్పణ చేశారు. అన్నవరం దేవస్థానంలో కొన్ని నెలలుగా అనేక అగ్ని ప్రమాదాలు, అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో ఈ సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. బుధవారం ఉదయం శాంతి హోమం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. తరువాత మంత్ర జలాన్ని దేవస్థానం ఆవరణలో వెదజల్లి శుద్ధి చేస్తారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు కాని జరగకపోవడంతో మూడు నెలల నుంచి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో ‘అపశ్రుతులు అందుకేనా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించి శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పూజల్లో చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ ఛామర్తి కన్నబాబు తదితర బృందం పాల్గొన్నారు. -
నకిలీపై యుద్ధం
● నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చారు ● టీడీపీ నేతలే సూత్రధారులు ● దీనిపై సీబీఐ విచారణ జరపాలి ● వైఎస్సార్ సీపీ డిమాండ్ ● కలెక్టరేట్, ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన రాజమహేంద్రవరం రూరల్: మద్యపాన వ్యసనానికి ప్రజలను దూరం చేసి, వారి ఆరోగ్యాన్ని, తద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, ఫుల్ కిక్ ఇచ్చే మద్యాన్ని అందిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో మందుబాబులకు వల వేశారు. వారి బలహీనతతో ఆటాడుకుని, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను కూటమి నేతలకు కట్టబెట్టారు. తద్వారా వారికి ‘సంపద సృష్టించారు.’ అధిక ధరలకు మద్యం అమ్మకాలు మొదలుపెట్టి ఎడాపెడా దోచుకోవడం మొదలెట్టారు.. వీధివీధినా బెల్టు షాపులు తెరచి, మద్యం ఏరులై పారిస్తున్నారు. డోర్ డెలివరీ సైతం ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు చేటుగా పరిణమించిన ఈ నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. రాజమహేంద్రవరంలో కలెక్టరేట్తో పాటు ఆయా నియోజకవర్గాల్లోని ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన ర్యాలీలు, మానవహారం, ఆందోళనలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. టీడీపీ కీలక నేతలే నిందితులుగా ఉన్న నకిలీ మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, నకిలీ మద్యం కుటీర పరిశ్రమలను, బెల్టు షాపులను అరికట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్యకు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం, బెల్టు షాపులను అరికట్టాలని, నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, అబద్ధానికి అధికారమిస్తే ప్రజలకు మిగిలేది కష్టాలు, నష్టాలేనని, దీనికి కూటమి ప్రభుత్వమే ఉదాహరణని అన్నారు. అబద్ధాలను వండి వార్చడమే చంద్రబాబు లక్షణమన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల ముందు మద్యం తాగాలంటూ ప్రమోట్ చేసిన నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, గిరిజాల బాబు, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
అరాచక పాలనపై పోరాటం
● షెడ్యూల్ ప్రకారం రచ్చబండ కార్యక్రమాలు ● నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన, దురాగతాలపై పోరాడనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. సంతకాల సేకరణలో భాగంగా పార్టీ నాయకులు రచ్చబండలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసులునాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై సీబీఐ విచారణ
మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ దేవరపల్లి: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత డిమాండ్ చేశారు. దేవరపల్లిలోని ఎౖక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయం వద్ద సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యంపై వేసిన సిట్లోని ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటారని, దీనివల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉండదని అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవడం లేదనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల బలహీనతను ఆసరాగా తీసుకుని నకిలీ మద్యం తయారీ, అమ్మకాలతో వారి ప్రాణాలు తీయడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడి, గుడి అనే విచక్షణ లేకుండా ప్రతి వీధిలో 10 నుంచి 15 బెల్టు షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. దీంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి బాటిల్పై అధికంగా వసూలు చేస్తూ కూటమి నాయకులు దోచుకుంటున్నారని, అయినప్పటికీ ధన దాహం తీరక నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని అన్నారు. మద్యం దుకాణాల తనిఖీ బాధ్యతను అధికారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
యాచకులపై స్పెషల్ డ్రైవ్
18 మంది నేరస్తుల గుర్తింపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పోలీసులు సోమవారం యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించారు. గోదావరి ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో కొంతమంది యాచకులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మద్యం తాగి ఉంటూ, నేరా లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా 193 మందిని గుర్తించగా, వారిలో 18 మందికి నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. విచారణ అనంతరం వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి, స్వగ్రామాలకు పంపించామని పోలీసులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.17 నుంచి ధాన్యం కొనుగోళ్లు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ధాన్యం కొనుగోలు విధానం, కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది బాధ్యతలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను కలెక్టరేట్లో సోమవారం ఆమె, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులెవ్వరూ కనీస మద్దతు ధర కంటే తక్కువకు తన పంటను అమ్మాల్సిన అవసరం లేదన్నారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. జేసీ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని చెప్పారు. జిల్లాలో మొత్తం 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూము నంబర్లు 1967 లేదా 83094 87151లను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.సీతారామమూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత వహించాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అర్జీల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ఆమెతోపాటు అధికారులు 137 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏ సమయంలోనైనా తమ సమస్య తెలియజేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పట్టణ పేదలకు స్థిరమైన జీవనోపాధి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పట్టణ ప్రాంతాల్లోని పేదలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించేందుకు మెప్మా ఆధ్వర్యాన జీవనోపాధి మిషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ బ్రోచర్ను జేసీ మేఘస్వరూప్తో కలసి ఆమె కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, వారి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. మొదటి దశలో ప్రతి సిటీ లెవెల్ ఫెడరేషన్కు నాలుగు యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అందులో మూడు కొత్తవి, ఒక అప్గ్రడేషన్ యూనిట్ ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొత్తం 31 సంస్థల ద్వారా 51 రకాల యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ కీర్తి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ సీతారామమూర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.కనకరాజు, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ పి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ భరించేది అన్నదాతలే..
సాగులో ఎదురయ్యే కష్టనష్టాలతో పాటు మార్కెట్లో ఏర్పడే ఒడుదొడుకులన్నింటినీ భరించేది అన్నదాతలే. ప్రకృతి కరుణించి, చీడపీడల బెడద లేకపోతే మంచి దిగుబడులు వస్తాయి. లేకుంటే ఆశించిన దిగుబడులు రావు. అన్నీ అనుకూలిస్తేనే ఎంతో కొంత మిగులు ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చినా రైతు వ్యవసాయాన్ని వదల్లేడు. తరువాత పంటలోనైనా మేలు జరుగుతుందనే ఆశతో మరోసారి అడుగు వేస్తాడు. – ప్రగడ వీర వెంకట్రావు, రైతు, నరేంద్రపురం ధాన్యం కొనుగోలు చేయాలి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిరంతరం అన్నదాతల మేలు కోసమే ఆలోచించి, ఆచరణీయమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లేది. రైతులు ఆ విషయాన్ని నేడు గ్రహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో, మిల్లర్లు చెప్పిన ధరకే పంటను అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇదే సీజన్లో గత ప్రభుత్వం బస్తా ధాన్యానికి రూ.1,750 గిట్టుబాటు ధర ప్రకటించడంతో మిల్లర్లు రూ.1,800కు పైబడి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేక రైతులు నష్టపోతున్నారు. పాలకులు వెంటనే మేల్కొని, తక్షణమే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి. – అడబాల చినబాబు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత బీసీ సంక్షేమ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖలు, లేపాక్షి ఎంపోరియం అధికారులతో ఆమె నగరంలో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని, దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కాచి చల్లార్చిన నీరు, తాజాగా వండిన ఆహారం మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. విశ్రాంతి, తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి ఆహారం తీసుకురానీయవద్దని స్పష్టం చేశారు. ప్రతి వసతి గృహం, గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆప్కో, లేపాక్షి విక్రయాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఏపీ బీసీ కో ఆపరేటివ్ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, ఆప్కో జీఎం కె.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త ఉపాధ్యాయులు
లీప్ యాప్లో పోస్టింగ్ ఆర్డర్ల విడుదల రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు సోమవారం కొలువుదీరనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,241 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,230 పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. వీరిలో 28 మంది మున్సిపల్ యాజమాన్యాల్లో నియామకం పొందగా, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల్లో 386 మంది చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు 164 మంది ఉపాధ్యాయులను కేటాయించగా, వీరిలో 53 మంది మున్సిపల్ కార్పొరేషన్, 111 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో నియామకం పొందారు. కాకినాడ జిల్లాకు వివిధ కేటగిరీలకు చెందిన 474 మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో 124 మంది మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లోను, 350 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల్లో నియమితులయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 173 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో వివిధ క్యాటగిరీల కింద నియామకం పొందారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి తరఫున నియామక ఉత్తర్వులు లీప్ యాప్లో జారీ చేశారు. ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరతారు. కేటాయించిన పోస్టుల వివరాలిలా.. కాకినాడ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 03 34 ఎస్ఏ హిందీ 02 26 ఎస్ఏ తెలుగు 04 16 ఎస్ఏ బీఎస్ 06 50 ఎస్ఏ గణితం 02 41 ఎస్ఏ పీఈ 0 66 ఎస్ఏ పీఎస్ 0 43 ఎస్ఏ ఎస్ఎస్ 5 50 ఎస్జీటీ 102 24 కోనసీమ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 18 105 ఎస్ఏ హిందీ 03 45 ఎస్ఏ తెలుగు 01 14 ఎస్ఏ బీఎస్ 0 91 ఎస్ఏ గణితం 01 06 ఎస్ఏ పీఈ 02 20 ఎస్ఏ పీఎస్ 0 31 ఎస్ఏ ఎస్ఎస్ 0 05 ఎస్జీటీ 18 105 తూర్పుగోదావరి జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 02 06 ఎస్ఏ హిందీ 0 06 ఎస్ఏ తెలుగు 01 02 ఎస్ఏ బీఎస్ 0 19 ఎస్ఏ గణితం 0 05 ఎస్ఏ పీఈ 0 42 ఎస్ఏ పీఎస్ 2 04 ఎస్ఏ ఎస్ఎస్ 6 17 ఎస్జీటీ 42 10 ఏఎస్ఆర్ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 0 17 ఎస్ఏ హిందీ 0 01 ఎస్ఏ తెలుగు 0 04 ఎస్ఏ బీఎస్ 0 05 ఎస్ఏ గణితం 0 09 ఎస్ఏ పీఈ 0 09 ఎస్ఏ పీఎస్ 2 07 ఎస్ఏ ఎస్ఎస్ 6 02 ఎస్జీటీ 0 119 -
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను రథంపై మూడుసార్లు ఊరేగించారు. తలుపులమ్మ సన్నిధి.. రద్దీ తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 10 వేల మంది భక్తులు అమ్మవారి సన్నిధికి తరలి వచ్చారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం సమకూరిందని వివరించారు. వసతి గదులు లభించని భక్తులు ఆలయ ప్రాంగణంలో చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేటు కాటేజీల్లోను వంటలు, భోజనాలు చేశారు. ఏసీ బస్సులో 10 శాతం రాయితీఅమలాపురం రూరల్: ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్కు నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో ఈ నెల 31 వరకూ 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్కు రూ.1,250, బీహెచ్ఈఎల్కు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం నుంచి రాత్రి 8.30 గంటలకు, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుందని తెలిపారు. -
సెప్టిక్ ట్యాంక్లో ఆవు నరకయాతన
బయటకు తీసి రక్షించిన స్థానికులు అమలాపురం టౌన్: సెప్టిక్ ట్యాంక్లో పడిన ఆవు నరకయాతన అనుభవించింది. నీరు, తిండి లేక బాగా నీరసించిపోయి కుంగిపోయింది. చివరకు స్థానికులు ఆ ఆవును సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి రక్షించారు. అమలాపురం పట్టణం 22వ వార్డు పరిఽధి భోగరాజు వీధిలో తుప్పల్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో ఆవు ప్రమాదవశాత్తూ పడిపోయింది. పచ్చిక మేత కోసం వెళ్లిన ఆవు ఆ ట్యాంక్లో పడి బయటకు రాలేక పోయింది. అమలాపురం సత్యసాయి సేవా సంస్థల డివిజన్ కో ఆర్డినేటర్, ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జి.ప్రభాకర్ ఈ సమాచారాన్ని ఆ వార్డు కౌన్సిలర్ గొవ్వాల రాజేష్కు అందించారు. జేసీబీని రప్పించి ఆవును బయటకు తీయించారు. స్థానికుల సహాయంతో గంటకు పైగా శ్రమించి ఆవును బయటకు తీశారు. స్థానికులు గంగుమళ్ల శ్రీను, మేడిద రమేష్, రాజులపూడి భాస్కరరావు శ్రమించారు. బయటకు తీసిన ఆవు బాగా నీరసించిపోయి ఉండడంతో దానికి తాగునీరు, అరటి పండ్లు పెట్టి సేద తీర్చారు. -
రూ.ఐదు లక్షల దీపావళి సామాన్లు సీజ్
తుని రూరల్: ఎస్.అన్నవరంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.ఐదు లక్షల విలువ చేసే దీపావళి సామాన్లను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి ఆదివారం తెలిపారు. ముందస్తు చర్యగా తనిఖీలు చేస్తుండగా ఎస్.అన్నవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాన్లను గుర్తించామన్నారు. సామాన్లను సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వీఆర్వో కృష్ణ పాల్గొన్నారు. 7వ బ్యాచ్ శిక్షణ ప్రారంభం సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని మండల పరిషత్తు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా ఆదివారం 7వ బ్యాచ్ శిక్షణను గ్రామీణ తాగునీటి విభాగం ప్రభుత్వ సలహాదారు తోట ప్రభాకరరావు ప్రారంభించారు. తాగునీటిపై ఏఈఈలకు అవగాహన ఉండాలన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు, విశ్రాంత ఎస్ఈలు ఉమాశంకర్, శ్రీనివాసు, సురేష్, పెద్దాపురం డీఈఈ స్వామి, ఎఈఈ శ్రీరామ్, ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ శేషుబాబు శిక్షణ నిర్వహించారు. రామాలయంలో నగల చోరీ రంగంపేట: మండల పరిధిలోని ముకుందవరంలో దేవుని గుడిలో నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కాపుల రామాలయంలో దేవతల విగ్రహాలకు నాలుగు వెండి కిరీటాలు, అమ్మవారి బంగారు తాళిబొట్టు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వెండి కిరీటాల విలువ రూ.1.50 లక్షలు, బంగారం విలువ రూ. 1.20 లక్షలు ఉంటుందన్నారు. నగలు చోరీ జరిగినట్టు 9వ తేదీ గురువారం గుర్తించామన్నారు. 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
చూసిన కనులదే భాగ్యం!
12ఆర్వీపీ66 ● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● 3వ రోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు తిరువీధుల్లో శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. శ్రీవారు కోదండరాముని అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వాహన సేవను వీక్షించారు. భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచామృత మండపారాధన, మహాస్నపనము, ప్రధాన హోమాలు, దుష్ట్రగహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, తోమాల సేవ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మాడవీధుల్లో హనుమద్వాహనంపై కోదండరామునిగా ఊరేగుతున్న శ్రీవారు హనుమద్వాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు కోదండరామ అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హనుమద్వాహనంపై స్వామివారిని అలంకరించగా మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని కోదండరాముని అవతారంలో అలంకరించి, హనుమంత వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఘట్టం హనుమంతుడు తన భుజాలపై శ్రీరాముడిని మోసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. హనమద్వాహనంపై స్వామి వారి విహారం భగవంతుని పట్ల హనుమతునికి ఉన్న భక్తికి, నమ్మకానికి, అణకువకు ప్రతీక. ఈ వాహన సేవ మనిషిలోని భక్తి, సేవ ద్వారా దివ్యత్వానికి ఎలా చేరగలరో చూపిస్తుంది. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు సోమవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం జగత్ కళ్యాణార్థం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం విశేష పూజలు, సేవలు, రాత్రి యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ నిర్వహిస్తారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
మహిళా కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ప్రారంభం
పెదపూడి: జి.మామిడాడ డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల కబడ్డీ జట్టు టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ, కరస్పాండెంట్ డి.ఆర్.కే.రెడ్డి హాజరయ్యారు. డీఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి మాట్లాడుతూ రెండ్రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేస్తారన్నారు. ఈ జట్టు ఈ నెల 29 నుంచి నవంబర్ రెండు వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటుందన్నారు. ఎంపికై న జట్టుకు పది రోజులపాటు డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు. అబ్జర్వర్లుగా డాక్టర్ జీ.ప్రమీలరాణి, సభ్యులుగా వై.సుధారాణి, ఎం.వీరబాబు వ్యవహరించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.లోవరాజు, జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
యానాం: పట్టణంలో శనివారం సంచలనం కలిగించిన వ్యక్తి దారుణహత్య కేసుకు సంబంధించి నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ అడలరసన్ తెలిపారు. ఈ హత్యకేసుకు సంబంధించి వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. కాజులూరు మండలానికి చెందిన హతుడు తిపురశెట్టి నారాయణస్వామి 2022, మార్చి 12న యానాం గోపాల్నగర్ శివారు మోకా గార్డెన్స్కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జిని అతని స్వగృహంలోనే కత్తితో పొడిచి హత్య చేశాడన్నారు. ఆర్థిక లావాదేవీలు, చీటీలకు సంబంధించిన సొమ్ము గురించి అప్పట్లో ఆ హత్య జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కాలాపేట జైలులో శిక్ష అనుభవిస్తున్న నారాయణస్వామి ఇటీవలి కండిషన్ బెయిల్పై విడుదలయ్యాడన్నారు. ప్రతి రోజూ యానాం పోలీస్స్టేషన్లో సంతకం పెడుతున్నాడని తెలిపారు. శనివారం రాత్రి మోకా వెంకటేశ్వరరావు కుమారుడు మోకా ఆనందమూర్తి బైక్ పై వచ్చి స్థానిక న్యూకాంప్లెక్స్ సమీపంలో మెయిన్రోడ్డుపై ఉన్న తిపురశెట్టి నారాయణసామిని కత్తితో విచక్షణా రహితంగా 13 పోట్లు పొడిచాడని దీంతో నారాయణసామి మృతిచెందాడన్నారు. శనివారం మోకా ఆనందమూర్తి కుమారుడు, వెంకటేశ్వరరావు మనుమడు పుట్టినరోజు అని తెలిపారు. దీంతో తన తండ్రి ఉంటే మనుమడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగేవని కాని తన తండ్రి లేకుండా చేసింది నారాయణస్వామి అని కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి రావడం.. యాధృచ్చికంగా మెయిన్రోడ్డుపై నిలబడి ఉన్న నారాయణస్వామి కనిపించడంతో విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడన్నారు. అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి కత్తి, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని సబ్కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న క్రైమ్టీమ్ జాంటీ, దుర్గారావు ను అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సైలు పునీత్రాజ్, కట్టా సుబ్బరాజు పాల్గొన్నారు. -
పదికి చేరిన బాణసంచా పేలుడు మృతుల సంఖ్య
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి కాకినాడ క్రైం/అనపర్తి: ఈ నెల 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న పెను విస్ఫోటం వల్ల మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు నలుగురిని కాకినాడకు తరలించారు. వారిలో ముగ్గురు కాకినాడ జీజీహెచ్లో చేరగా మరో వ్యక్తి ట్రస్ట్ ఆసుపత్రిలో చేరాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్రస్ట్ ఆసుపత్రిలో చేరిన పాట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వాసంశెట్టి విజయలక్ష్మి అనే మహిళ కాకినాడ జీజీహెచ్లో మృతి చెందింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ జీజీహెచ్ ఎస్ఐసీయూలో చికిత్స పొందుతున్న అనపర్తికి చెందిన చిట్టూరి యామిని(32) ఆదివారం తెల్లవారుజామున ఉదయం 3.19 గంటలకు ప్రాణాలొదిలింది. అదే ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (21)కాలిపోయి మాంసపు ముద్దగా మారి తుది వరకు మృత్యువుతో పోరాడాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. ఆదివారం నాటి మరణాలతో విస్ఫోటంలో తీవ్ర గాయాలపాలైన వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. అనపర్తిలో విషాద ఛాయలు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారి బంధువులకు అప్పగించారు. అనపర్తికి చెందిన యామిని మృతదేహం మధ్యాహ్నం తీసుకురావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
శ్రీనివాసా..చిద్విలాసా
కొత్తపేట: ఏడు కొండలవాడా.. శ్రీవేంకటేశా.. చిద్విలాసా అంటూ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తజనం కొలిచింది. కోనసీమ తిరుమల వాడపల్లి తిరు వీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలతో ఆలయం నూతన తేజస్సుతో వెలుగొందింది. అశేష భక్తజనం గోవింద నామస్మరణతో మార్మోగింది. వాడపల్లిలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి అశేష భక్తజనం తరలివచ్చింది. కలియుగ దైవాన్ని దర్శించుకున్న ప్రతి మదీ పరవశించిపోయింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత శోభాయమానంగా సాగాయి. హంస వాహనంపై ఊరేగిన శ్రీవారిని వీక్షించిన భక్తులు పులకించిపోయారు. మహిమాన్విత మనోహరమూర్తిని కాంచిన కనులదే భాగ్యమంటూ ఆనంద డోలికల్లో తేలియాడారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, హోమాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం నుంచి సంకల్పం, పుణ్యాహ వచనం, సప్త కలశారాధన, అభిషేకం, ప్రధాన హోమాలు, దిగ్ధేవతా బలిహరణ, అనంతరం మహా పుష్పయాగం, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం స్వస్తివచనం, ప్రధాన హోమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, విశేషార్చన తదితర పూజలు జరిపారు. కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. హంస వాహనం.. మనోహరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సరస్వతి అలంకరణలో స్వామివారికి హంస వాహన సేవ మనోహరంగా సాగింది. వాహనంపై శ్రీవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవ ఆధ్యంతం భక్తుల గోవింద నామస్మరణ నడుమ వేద పండితులు వ్యాఖ్యోపన్యాసంతో కన్నుల వైకుంఠంగా సాగింది. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళలకు అధిష్టాన దేవత కాబట్టి ఈ అలంకారంలో జ్ఞాన ప్రదాతగా శ్రీవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు జ్ఞానం, చదువులో విజయం, కళలలో నైపుణ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాత్రి వరకూ వేచి ఉండి సరస్వతీదేవి అలంకారంలో ఉన్న శ్రీవారిని వీక్షించి తన్మయత్వం చెందారు. అలరించిన స్వరార్చన ఉత్సవాల్లో భాగంగా ఆలయ వసంత మండపంలో దేవస్థానం సంకీర్తనాచారి కరుటూరి వెంకట శ్రీనివాసరావు అన్నమయ్య స్వరార్చనలు అలరించాయి. పలు సంకీర్తనలు ఆలపించగా, వేలాది మంది భక్తులు పరవశితులయ్యారు. ఒక్కరోజే రూ. 54.66 లక్షల ఆదాయం బ్రహ్మోత్సవాలు, శనివారం సందర్భంగా రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూ ప్రసాద విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.54,66,022 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఫ కమనీయంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఫ కోలాహలంగా వాడపల్లి వెంకన్న క్షేత్రం ఫ ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తజనం -
ప్రమాద స్థలం పరిశీలన
రాయవరం/ అనపర్తి: రాయవరంలోని శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బాణసంచా ప్రమాద స్థలాన్ని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వంశీకృష్ణ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో ఎవరెవరున్నారు? ప్రధానంగా ప్రమాదానికి గల కారణాలపై న్యాయమూర్తి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన విధానం, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు, ప్రమాదం జరిగిన అనంతరం తీసుకున్న చర్యలను ఎస్సై డి.సురేష్బాబు వివరించారు. బాధితులతో మాట్లాడిన న్యాయమూర్తి వంశీకృష్ణ న్యాయ సహాయం కోసం ఇద్దరు లీగల్ వలంటీర్లను నియమించినట్టు తెలిపారు. -
రైతు అదృశ్యంపై కేసు
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన రైతు కోడూరి వెంకట్రావు (65) అదృశ్యంపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇంటి నుంచి మోటార్ సైకిల్పై బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రవికుమార్ తెలిపారు. ఆచూకీ తెలిచిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం అంబాజీపేట: ప్రేమించమని వెంట పడుతున్నా ఓ యువతి నిరాకరించడంతో యువకుడు అంబాజీపేట బస్టాండ్లో శనివారం రాత్రి గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. అంబాజీపేటకు చెందిన ఒక యువతి అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ విధులు నిర్వహిస్తోంది. ఆ యువతిని ఇరుసుమండకు చెందిన ఎస్.పవన్ కొన్ని నెలలుగా ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం సాయంత్రం స్థానిక బస్టాండ్లో పవన్ ఆ యువతితో ప్రేమ విషయమై మాట్లాడాడని, ఆమె నిరాకరించడంతో బ్లేడ్తో గొంతు కోసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి హెచ్సీ పీవీవీఎస్ఎన్ మూర్తి చేరుకుని పవన్ను చికిత్స నిమిత్తం అమలాపురం ఆసుపత్రికి తరలించారు. డీఎస్సీ టీచర్లకు పోస్టింగ్ ఆర్డర్లు రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,659 మంది ఇండక్షన్ ట్రైనింగ్కు హాజరైన విషయం విదితమే. ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయుల్లో 524 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 9న మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 9, 10 తేదీల్లో 811 మంది స్కూల్ అసిస్టెంట్లు, జోన్–2 పరిధిలోని 324 మంది టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ద్వారా పోస్టింగ్ ప్లేస్లను ఎంపిక చేసుకున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో లీప్ యాప్ ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఉపాధ్యాయులు 13న విధుల్లో చేరే అవకాశముంది. -
5.09 లక్షల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
దేవరపల్లి: జిల్లాలోని 18 మండలాలు, రాజమహేంద్రవరం అర్బన్లో శనివారం నాటికి 5,09,162 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆగస్ట్ 15 నుంచి కార్డుల పంపిణీ జరుగుతోంది. జిల్లాలో 5,59,348 రేషన్ కార్డులు ఉండగా, 5,09,362 కార్డులు గ్రామ సచివాలయ ఉద్యోగులు, రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేశారు. మరో 49,986 కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. 91.06 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగినట్టు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్లో 3,34,472 రేషన్ కార్డులకు, 3,00,957 పంపిణీ జరిగింది. కొవ్వూరు డివిజన్లో 2,24,876 రేషన్ కార్డులకు, 2,08,405 కార్డుల పంపిణీ చేశారు. మండలాల వారీగా కార్డుల పంపిణీ ఇలా.. మండలం మొత్తం పంపిణీ రాజమండ్రి ( అర్బర్ ) 83,325 71,824 రాజానగరం 36,131 32,020 రాజమండ్రి (రూరల్) 50,176 44,847 కడియం 28,667 25,593 రంగంపేట 19,606 17,718 అనపర్తి 22,285 20,342 గోకవరం 22,400 20,469 సీతానగరం 23,806 22,162 కోరుకొండ 26,766 24,991 బిక్కవోలు 22,310 20,991 ఉండ్రాజవరం 23,877 21,628 గోపాలపురం 20,794 18,884 దేవరపల్లి 25,165 22,921 తాళ్లపూడి 16,674 15,217 నల్లజర్ల 27,294 25,303 కొవ్వూరు 33,005 30,803 చాగల్లు 20,903 19,605 పెరవలి 22,965 21,545 నిడదవోలు 34,194 32,499 -
పెళ్లింట విషాదం
కాట్రేనికోన: పెళ్లింట విషాదం నెలకొంది.. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు చిన్నాన్న మృతితో అంతులేని శోకం మిగిలింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం పల్లం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు మల్లాడి భాగ్యరాజు (42) అన్నయ్య చిన ధర్మారావు కుమారుడి వివాహం సందర్భంగా పార్టీ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ వెళ్లి ఆశీర్వదించారు. అనంతరం ముమ్మిడివరం మండలం అయినాపురం పెండ్లి కుమార్తె ఇంటికి పల్లం నుంచి మోటార్ సైకిల్పై మల్లాడి భాగ్యరాజుతో పాటు అర్థాని వెంకటేశ్వర్లు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పల్లం – దొంతికుర్రు రోడ్డులో ఢాం సెంటరు సమీపంలో నీళ్లరేవు నుంచి కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి మోటార్ సైకిల్ను ఢీకొని భాగ్యరాజు మీదుగా వెళ్లిపోయింది. అనంతరం ట్రాక్టర్ పంట కాలువలో బోల్తా పడింది. దీంతో భాగ్యరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్పై ఉన్న అర్థాని వెంకటేశ్వర్లుకు బలమైన గాయాలు కాగా, ట్రాక్టర్ డ్రైవర్కు క్షేమంగా ఉన్నాడు. పెళ్లింట విషాదం నెలకొనడంతో వివాహం నిలిచిపోయింది. మృతుడు భాగ్యరాజుకు భార్య సత్యవతి, ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి ఉన్నారు. సాయంత్రం పెళ్లి జరుగుతుందనే సంతోషంలో ఉన్న కుటుంబంలో ఈ ఘటన అంతులేని విషాదాన్ని నింపింది. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో భాగ్యరాజు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. ఆసుపత్రిలో భాగ్యరాజు భౌతికకాయం వద్ద మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్, పాలెపు ధర్మారావు, మల్లాడి బాబ్జి, కోలాటి సత్యం తదితరులు అంజలి ఘటించారు. ఫ బైక్ను ఢీకొన్న ట్రాక్టర్ ఫ ఒకరి దుర్మరణం -
ఏడు యూనిట్లకు త్వరలో ఎన్నికలు
జిల్లా అడ్హక్ కమిటీ చైర్మన్ మీసాల సీటీఆర్ఐ: జిల్లాలోని రాజమహేంద్రవరం, ధవళేశ్వరం అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఏపీ ఎన్జీజీఓ సంఘం తాలూకా యూనిట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని సంఘ జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ మీసాల మాధవరావు అన్నారు. శనివారం స్థానిక ఏపీఎన్జీఓ సంఘ భవనంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. 7 యూనిట్లలోని, వివిధ శాఖల ఉద్యోగులు అందరూ విధిగా ఏపీ ఎన్జీఓ సంఘ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ విషయమై చర్చించడానికి ఏడు తాలూకా యూనిట్లకు సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం రాజమహేంద్రవరం ఏపీ ఎన్జీజీఓ భవనంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎన్జీఓ సంఘ నాయకత్వంతో కలిసి పనిచేస్తామని మాధవరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడహక్ కమిటీ కన్వీనర్ అనిల్ కుమార్, కో చైర్మన్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి సత్యనారాయణ రాజు, జిల్లా సభ్యులు ఎన్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి.వేణుమాధవరావు పాల్గొన్నారు. బాక్సింగ్ పోటీలలో ప్రమాణాలు నిల్ ప్రకాశం నగర్: 69వ అంతర్ జిల్లాల బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వైవీఎస్ ఉమామహేశ్వరరావు అరోపించారు. శనివారం స్థానిక ఎస్కేవీటీ పాఠశాలలో జరుగుతున్న పోటీలకు ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు అసోసియేషన్ కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులకు సరైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఓపెన్ రింగ్ ఏర్పాటు చేయడం వల్ల పలువురు క్రీడాకారులు డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందని అందోళన వ్యక్తం చేశారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు పోటీలు నిర్వహించాల్సి ఉండగా, రోజుకు నాలుగు పోటీలు నిర్వహించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. క్వాలిఫైడ్ జడ్జిలు, రిఫరీలు లేకుండా కేవలం బయట కోచ్లను తీసుకువచ్చి పోటీలు నిర్వహించడం సరికాదని మండిపడ్డారు. శృంగార వల్లభుని ఆదాయం రూ.3 లక్షలు పెద్దాపురం(సామర్లకోట): మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన స్వామివారి ఆలయానికి శనివారం జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 20వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,65,610, అన్నదాన విరాళాలకు రూ.1,08,476, కేశ ఖండన ద్వారా రూ.5,640, తులాభారం ద్వారా రూ.600, ప్రసాదం విక్రయం ద్వారా రూ.22,365, మొత్తంగా రూ.3,02,691 ఆదాయం వచ్చిందని చెప్పారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
ఏడాదిలో శత వసంతం.. అంతలోనే ఇంత విషాదం
రాయవరం: మరో ఏడాది గడిస్తే శత వసంతాల వేడుకలు జరుపుకొనేందుకు ఆలోచనలో ఉన్నారు. ఆ వేడుక అనంతరం వ్యాపారాన్ని విరమించుకునే ప్రయత్నంలో ఉండగానే విధి చిన్నచూపు చూసింది. రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) సహా ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఇరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం పాఠకులకు విదితమే. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన వెలుగుబంట్ల వీరన్న 1926లో శ్రీగణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం తొలుత ఏడాదికి పర్మిషన్ ఇచ్చింది. అప్పట్లో కలెక్టర్ వచ్చి ఏటా పరిశీలించిన అనంతరం బ్రిటిష్ ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్లుగా తాతనారాయణమూర్తి కుమారుడు శేషగిరి తెలిపారు.తాత నారాయణమూర్తి చైనా వెళ్లి ఆరేళ్ల పాటు నేర్చుకున్న అనంతరం బాణసంచా తయారీలో సర్టిఫికెట్ పొందారు. చైనా వెళ్లి అక్కడ బాణసంచా తయారీని పరిశీలించి వ్యాపారం ప్రారంభించినట్లు చెబుతారు. 1936లో పర్మినెంట్ లైసెన్స్ పొందిన అనంతరం తయారీని విస్తరించినట్లు తెలుస్తోంది. వీరన్న బాణసంచా పరిశ్రమ స్థాపించినప్పటికీ ఆయన కుమారులు తాతనారాయణమూర్తి, రామకృష్ణలు పరిశ్రమను అభివృద్ధి చేశారు. దక్షిణ భారతదేశంలోనే హ్యేండ్ మేడ్ బాణసంచా తయారీ ప్రారంభించినట్లు చెబుతారు. అప్పట్లో చిచ్చుబుడ్లు, మతాబులు, తారాజువ్వలు తప్ప మిగిలిన తయారీ ఉండేది కాదు. వీరి హయాంలో బాణసంచాలో ఆధునిక పద్ధతులు జోడించారు. మల్లెపందిరి, నాగసర్పం, ఈతచెట్టు, సూర్య, చంద్ర చక్రాలు, గ్లోబు, చైనా రింగు వంటి వివిధ రకాల ఆకృతుల్లో బాణసంచా తయారీ చేసి అందరి మన్ననలు పొందారు. వీరు ఇన్నోవేటివ్గా కొన్ని ఆకృతుల్లో బాణసంచా తయారు చేసి ఆకట్టుకునే వారు. అనంతరం తాతనారాయణమూర్తి కుమారుడు సత్తిబాబు పరిశ్రమను మరింత విస్తరించి రాష్ట్ర స్థాయిలో జరిగే వివిధ కార్యక్రమాల్లో బాణసంచా కాల్చడంతో పరిశ్రమకు గుర్తింపును తీసుకు వచ్చారు. ఇదిలా ఉంటే 2026లో శత వసంతాల వేడుక నిర్వహించాలని భావించారు. వెలుగుబంట్ల కుటుంబం బాణసంచా తయారీని స్థాపించి వందేళ్లయిన సందర్భంగా వేడుక నిర్వహించిన అనంతరం తయారీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. కాగా అంతలోనే ఇంత పెను ప్రమాదం సంభవించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిని కదిలిస్తే కన్నీళ్లు మాత్రమే సమాధానమవుతోంది. -
పీఠం కోసం పచ్చపాట్లు
● ఎప్పుడు ప్రకటిస్తారా అని క్యాడర్లో ఉత్కంఠ ● అభిప్రాయ సేకరణ జరిగి రెండు నెలలైనా అదే జాప్యం ● పోటీలో ముగ్గురు సీనియర్లు ● దక్కేది ‘బొడ్డు’కేనని ఊహాగానాలు ● పోటీలో మరో ఇద్దరు సీనియర్లు సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎన్నిక పీటముడి వీడడం లేదు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ పూర్తయి నెలల గడుస్తున్నా.. నేటికీ ఎవరినీ ఎంపిక చేసిన దాఖలాలు లేవు. ఆ పదవికి ఎవరిని, ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. త్రిసభ్య కమిటీ వచ్చి అభిప్రాయ సేకరణ చేపట్టిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అయితే.. అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడని పరిస్థితి నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా కనీసం పార్టీ పదవుల భర్తీకి కూడా అధిష్టానం మొగ్గుచూపకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అభిప్రాయ సేకరణ జరిగినా.. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కేఎస్ జవహర్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. అంతేగాక జిల్లా కమిటీల ఏర్పాటుకు సైతం టీడీపీ అధిష్టానం పచ్చజెండా ఊపింది. జిల్లా అధ్యక్షుడి నియామకం, కమిటీల ఎంపిక కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని నేతలతో మాట్లాడి మెజారీటీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పేర్లను అధిష్టానానికి అందించనుంది. ఇందులో భాగంగా ఇటీవల బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో పాటు నియోజకవర్గానికి సుమారు 10 మంది ప్రత్యేక ఆహ్వానితుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందన్న అభిప్రాయాలు వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. బొడ్డుకే అవకాశం..? ● టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సింహభాగం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, ప్రత్యేక ఆహ్వానితులు సైతం ఆయన అభ్యర్థిత్వాన్నే బలపరచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. దీనికి తోడు చినబాబు అండదండలు, ఆశీర్వాదం సైతం ఆయనకే ఉండటంతో అధ్యక్ష పదవి ఎంపిక లాంఛనం కానుందన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ● మరో సీనియర్ నేత గన్నికృష్ణ ఇప్పటికే రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఆశిస్తున్నారు. ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవైనా దుక్కుతుందన్న ఆశలో ఆయన ఉన్నారు. ● ఇక మరో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా వ్యవహరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పదవైనా దక్కుతుందని భావించారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సిఫార్సులకే ప్రాధాన్యం పార్టీ విజయానికి శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారు. వాళ్లు చెప్పిన వారికే పదవులు కట్టబెట్టడంతో చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగింది. పెద్ద పదవులైతే చినబాబు చలవ లేనిదే దక్కని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం టీడీపీ నేతల్లో పార్టీపై వ్యతిరేక భావన నింపింది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ ఇదే తంతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు అలవిగాని హామీలు ఇచ్చేశారు. బీజేపీ, జనసేన పార్టీలకు ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల సీట్లు గల్లంతయ్యాయి. వారిని బుజ్జగించేందుకు ఆయన అప్పట్లో నామినేటెడ్ పోస్టుల మంత్రం వేశారు. కూటమి అధికారం చేపట్టిన ఏడాది వరకు ఆ పోస్టుల భర్తీకి ఎడతెగని జాప్యం జరిగింది. ఈ పరిణామం సీనియర్ నేతల్లో ఆగ్రహావేశాలు నింపింది. తమకు ఎప్పుడు న్యాయం చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఒకానొక దశలో పార్టీ కోసం కష్టపడితే తమకు దక్కే గౌరవం ఇదేనా..? అన్న భావన వారి అనుచరుల్లో వ్యక్తమైంది. దీంతో అధిష్టానం మూడు దశల్లో నామినేటెడ్ పదవులు ప్రకటించారు. జిల్లా అధ్యక్ష రేసులో ముగ్గురు జిల్లా అధ్యక్షుడి రేసులో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీనియర్ నేత గన్నికృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పోటీ పడుతున్నారు. త్రిసభ్య కమిటీ సభ్యులు సైతం వీరి పేర్లే అధిష్టానానికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మద్యం మహమ్మారిపై ఐద్వా పోరాటం
అమలాపురం టౌన్: మద్యం మహమ్మారిపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ఐద్వా ఉపాధ్యక్షురాలు పి.పూర్ణ అన్నారు. శనివారం అమలాపురంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా ఐద్వా మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత ఐద్వా జిల్లా ప్రతినిధి కందికట్ల గిరిజా ఐద్వా జెండాను ఎగురవేసి మహాసభలను ప్రారంభించగా, మరో జిల్లా ప్రతినిధి కె.సుధారాణి అధ్యక్షత వహించారు. పూర్ణ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్, మహిళల ఉపాధి, తక్కువ వేతనాలు, మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాల తదితర సమస్యలపై ఐద్వా ఎప్పుడూ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో ఐద్వా రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఏరులైన పారుతున్న మద్యం, బెల్ట్ షాపులతో ప్రశాంత గ్రామాల్లో లొల్లిపై రాష్ట్ర సభల్లో చర్చిస్తామన్నారు. జిల్లా ఐద్వా గౌరవాధ్యక్షురాలిగా ఆర్.సుశీల, అధ్యక్షురాలిగా జి.దైవకృప, కోశాధికారిగా సత్యవేణి, ఆఫీస్ బేరర్లుగా హైమావతి, భవాని, చంద్రకళ, ముగ్గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సీతాదేవి, జిల్లా కార్యదర్శి చంద్రకళ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు శంకర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. -
● దారిదాపుల్లోకి వెళ్లలేం
అక్కడక్కడా రోడ్డు... అన్నీ గుంతలే అన్నట్లు ఉంది.. ఇది తలుపులమ్మ అమ్మవారి లోవ దేస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి. నిత్యం ఇటుగా వెళ్లే భక్తులు, ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. జూన్లో తలుపులమ్మ తల్లి ఆషాఢ మాసోత్సవాలకు వేలాది మంది భక్తులు వస్తారని భావించిన అధికారులు తాత్కాలికంగా కంకర బూడిదతో గుంతలను పూడ్చారు. ఇది నెల రోజులకే యథాస్థితికి చేరింది. అప్పటి నుంచి చినుకు పడితే గుంతల్లో నీరు నిలిచిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. లోవదేవస్థానికి, లోవకొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, తుని పట్టణ వాసులకు నాలుగు వేల ఇళ్లు నిర్మిస్తున్న జగనన్న కాలనీకి, రౌతులపూడి మండలం ధార జగన్నాథపురం, మరికొన్ని గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. జాతీయ రహదారి నుంచి ఆరేడు కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. – తుని రూరల్ -
యానాంలో వ్యక్తి దారుణ హత్య
యానాం: స్థానికంగా శనివారం రాత్రి అందరూ చూస్తుండగానే వ్యక్తి దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఆ వివరాల ప్రకారం.. నిత్యం వాహన రాకపోకలతో కిటకిటలాడే యానాం పద్మా థియేటర్ జంక్షన్ వద్ద ఓ వ్యక్తిని బైక్పై వచ్చిన మరో వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో ఘటనా స్థలంలోనే అతను కుప్పకూలిపోయాడు. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. మృతుడు కాజులూరు మండలం సుబ్బారాయుడు వీధికి చెందిన తిపురశెట్టి నారాయణస్వామి (45)గా పోలీసులు గుర్తించారు. అతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ఎస్సైలు పునీత్రాజ్, కట్టా సుబ్బరాజు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యకు ప్రతీకారమా? 2022 మార్చి 12న మోకా వెంకటేశ్వరరావు (బుజ్జి) యానాం గోపాల్నగర్ శివారు మోకా గార్డెన్స్లో తన ఇంటి వద్దే హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా శనివారం రాత్రి హత్యకు గురైన తిపురశెట్టి నారాయణసామి ఉన్నాడు. అప్పట్లో ఈ హత్య సంచలనం రేపింది. నారాయణసామి కొన్నేళ్లపాటు పుదుచ్చేరి కాలాపేట జైలులో శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్పై బయటకు వచ్చాడని, ఆ విధంగా యానాం పోలీస్ స్టేషన్లో రోజూ సంతకం పెడుతున్నాడని తెలిసింది. వెంకటేశ్వరరావు హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగిందా.. వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే కారణమంటున్న స్థానికులు -
● చేప.. చిక్కిందోచ్
చేపలను పట్టేందుకు కొత్త ఎత్తుగడ ఇది.. వల, గేలం వేయకుండానే మత్స్యకారులు ప్లాస్టిక్ బాటిళ్లు, మైదాతో చేపలను చేజిక్కించుకుంటున్నారు. ఉప్పాడ, అమీనాబాదు తీర ప్రాంతాల సమీపంలోని ఉప్పుటేరు, పెదయేరులో మత్స్యకారులు మైదా పిండిని ఎరవేసి చేపలను పట్టేస్తున్నారు. మత్స్యకారులు ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. రెండు లీటర్ల వాటర్ బాటిల్ అడుగు భాగంలో కోసి నీటిలో మునిగే విధంగా బరువైన వల పూసలను కట్టి బాటిల్ను తయారు చేస్తున్నారు. దానికి పొడవైన ధారం అమర్చుతున్నారు. ఆ బాటిల్లో నీటిలో కలిపిన మైదా పిండిని వేసి ఉప్పుటేరులో విసురుతున్నారు. మైదా పిండిని తినేందుకు చేప బాటిల్లోకి వచ్చి ఇరుక్కోగానే ధారాన్ని లాగుతున్నారు. దీనిద్వారా సుమారు కిలో నుంచి రెండు కిలోల వరకూ కట్ట చేపలు పడుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. – కొత్తపల్లి -
వ్యసనాలకు బానిసై చోరీలు
కాజులూరు: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గొల్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల కిందట కోలంక శివారు గుబ్బలవారిపేటలో ఓ ఇంటి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. 128 గ్రాముల బంగారు ఆభరణాలు, 334 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన ప్రమిదల శ్రీను వ్యసనాలకు బానిసై చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. శనివారం ఎస్సై తన సిబ్బందితో కలసి యానం – ద్వారపూడి రహదారిలో కోలంక శివారులో శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి, కోర్టుకు తరలించామని ఎస్సై తెలిపారు. -
భారీగా బాణసంచా స్వాధీనం
అల్లవరం: బోడసకుర్రు పోస్టాఫీస్ సమీపంలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అల్లవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై సంపత్కుమార్ ఆధ్వర్యంలో అల్లవరం పోలీసులు దాడి చేసి బాణసంచాను గుర్తించారు. బోడసకుర్రు పోస్టాఫీస్ను ఆనుకుని కిరాణా వ్యాపారం చేస్తున్న జక్కా కామేశ్వరరావు ఇంటి వెనుక బాత్రూమ్లో నిల్వ చేసిన బాణసంచాను సీఐ ప్రశాంత్కుమార్, తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు సమక్షంలో మూటలుగా కట్టి ట్రాక్టర్లోకి లోడ్ చేసి నిశిద్ధ ప్రదేశానికి తరలించారు. ఈ బాణసంచా విలువ రూ.1.94 లక్షలు ఉంటుందని సీఐ ప్రశాంత్కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
అదివో.. అల్లదివో..
ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళాలు ఫ బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫ తొలిరోజు పరావాసుదేవ అలంకరణలో స్వామివారు కొత్తపేట: కోనసీమ వెంకన్నగా.. ఏడు వారాల స్వామిగా.. పూజలందుకుంటున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభువుగా వేంచేసిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ చవితి శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు ఆ స్వామిని చూసిన భక్తజనం మురిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని కొలిచారు. శేష వాహనంపై శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ప్రాంగణం, మాడ వీధులు రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ అలంకరణలతో కనువిందు చేసింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహన సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారు జామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తీర్థ బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్ర నామాలతో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.35 గంటల నుంచి స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యహ వాచనం, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, విశేషార్చన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్యుంగ్రహణ, శాలా విహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈఓ చక్రధరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శేషవాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేళ స్వామివారు పరావాసుదేవగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు శేషవాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్శంగా పండితులు శేష వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ స్వామి శేష పాన్పుపై ఉంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రథమ వాహనం శేష వాహనం అని, ఈ వాహనంపై స్వామివారిని దర్శిస్తే వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శించిన ఫలితం లభిస్తుందని వివరించారు. ఆ విధంగా స్వామివారిని దర్శించిన భక్తులు ఆనంద డోలికల్లో తేలియాడారు. తొలిరోజు కార్యక్రమాల్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని ఈఓ చక్రధరరావు సత్కరించి, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. పలువురు ప్రముఖులు, నాయకులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీసు బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇలా.. వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం మహా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రాత్రి సరస్వతి అలంకరణతో హంస వాహనసేవ ఉంటుంది. -
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
రామచంద్రపురం: రాయవరంలో శ్రీగణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి, ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడారు. ఆ ఫైర్ వర్క్స్లో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఆ రోజు 30 మంది మాత్రమే వచ్చారని, భోజన విరామ సమయంలో ప్రమాదం సంభవించడంతో మరణాల సంఖ్య కొంత తగ్గిందన్నారు. అయినప్పటికీ, నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, అగ్నిమాపక చర్యల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెవెన్యూ, అగ్నిమాపక, పరిశ్రమల, కార్మిక శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సంఘటన స్థలాన్ని సందర్శించినా ఇప్పటి వరకూ ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకపోవడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయవరం మండలంలోని అన్ని ఫైర్ వర్క్స్ యూనిట్లను తక్షణం తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై సమీక్ష చేపట్టాలని అధికారులను కోరారు. -
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
సఖినేటిపల్లి: అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హార్బర్లో స్థానిక మత్య్సకారులు నిరసన వ్యక్తం చేశారు. హార్బర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు వనమాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హార్బర్ నిర్వహణను పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియ చేపట్టి కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ఫిషర్మెన్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి 20 ఎకరాలు ఇచ్చామని, గ్రామస్తులతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారంతా కలసి ఇక్కడ మంచి వాతావరణంలో వేట కొనసాగిస్తున్నట్టు తెలిపారు. స్థానికేతరులు వేట విరామం సమయంలో స్వగ్రామాలకు వెళ్లి, అనంతరం తిరిగి వచ్చి తమతో పాటు ఉంటారని అన్నారు. కాగా పీపీపీ పద్ధతిలో కొంత మంది తమకు కావాల్సిన వారిని జీతాలకు పెట్టుకుని, తమను బయటకు గెంటేసే పద్ధతిలో ఉన్నారని, మత్స్య సంపదను ఇక్కడ అమ్మడానికి వీల్లేదంటూ అప్పుడే ఒత్తిళ్లు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ వల్ల తమ బతుకు తెరువుకు ఇబ్బందిగా మారనుందని, తమకు పూర్తి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుడు పొన్నాల జయకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు హార్బర్కు స్థలం ఇచ్చామని, గ్రామంలో ఎవరినీ సంప్రదించకుండా మధ్యస్థంగా పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
చెరువు నీటిలో విష అవశేషాలు
తాళ్లపూడి: పెద్దేవం చెరువు నీటిలో విష అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని, రైతులు తమ పశువులకు ఇన్సూరెన్స్ చేసుకుంటే నష్టాన్ని నివారించవచ్చునని పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పెద్దేవం గ్రామంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న గేదెల జబ్బును గుర్తించేందుకు వీలుగా ఆయన ఆధ్వర్యంలో బృందం పర్యటించి గేదెల పేడ, మూత్రం పరీక్షలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా 50 మందికి పైగా రైతుల హాజరై తమ గేదెల పేడ పరీక్షలు చేయగా 90 శాతం గేదెలలో జలగ వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు పశు సంవర్ధక శాఖ డీడీ పేర్కొన్నారు. డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా గేదెలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం అమలులో లేనందున ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్్స్ అయినా సరే తీసుకుంటే నష్ట నివారణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులను రైతులకు పరిచయం చేశారు. మృత్యువాత పడ్డ ఒక గేదెకు పోస్ట్మార్టం నిర్వహించి, జరిపిన పరీక్షల్లో రెండు వైరస్లు గుర్తించినట్లు, చెరువు నీటిలో పేరాకాట్ పోయిజినింగ్ అవశేషాలు ఉన్నట్లు తేలిందని, అవి ప్రమాదకరమని, గేదెలలో వ్యాధి నిరోధక శక్తి నశించి, మిగతా వైరల్ రోగాల పెరుగుదలకు అవకాశం ఇస్తోందని అన్నారు. నష్ట పరిహారం ఇవ్వాల్సిందే గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు పేరాకాట్ పాయిజన్ పొలాల్లో వాడతారని దీనివల్ల గేదెలకు రోగాలు వచ్చాయనటం ఆశ్చర్యంగా ఉందని, గేదెలకు వచ్చిన రోగాన్ని నిర్ధారణ చేసి సరైన మందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులో నీరు తాగని గేదెలకు కూడా వ్యాధి వచ్చిందని దానికి సమాధానం చెప్పాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్లు చేస్తున్న వైద్యం తమ గ్రామంలో రైతులకు సంతృప్తిగా లేదని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా గేదెలు నష్టపోయినవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎ.వెంకటరెడ్డి, కాకినాడ ల్యాబ్కు చెందిన డాక్టర్ సందీప్, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, తాళ్లపూడి మండల పశువైద్యాధికారులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం
● బాణసంచా పేలుడు బాధితులకు సాయం ప్రకటించని కూటమి ప్రభుత్వం ● తీరిగ్గా ఇప్పుడు తనిఖీలు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం సాక్షి, అమలాపురం/ రాయవరం: రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటం జరిగి నిరుపేద కూలీలు మృత్యువాత పడినా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మి క శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, హోం శాఖమంత్రి వంగలపూడి అనితతోపాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పరిహారంపై స్పష్టత లేదు. ఇటువంటి చోట పనిచేసేవారికి అటు యాజమాన్యం, ఇటు కార్మిక శాఖలు కలిసి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంది. కాని చనిపోయిన వారి వివరాలు కూడా కార్మిక శాఖకు వెంటనే తెలియని దుస్థితి. మృతులు కార్మికశాఖ రికార్డుల్లో నమోదు కానట్టు తెలిసింది. ‘ఎంప్లాయిస్ కాంపన్సేషన్ యాక్టు’ ప్రకారం యజమానుల వద్ద నుంచి పరిహారం కోరతామని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. చేతులు కాలాక హడావుడి బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటంతో తీవ్ర విషాదం నెలకొనడంతో జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తోంది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ జిల్లాలోని అన్ని శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ యూనిట్లు, హోల్సేల్ విక్రయ కేంద్రాల లైసెన్స్లను, భద్రత, రక్షణ ప్రమాణాల అంశాలను మూడు రోజులపాటు పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేంద్రాలలో పనిచేసే కార్మికులకు నైపుణ్యం ఉన్నదీ లేనిదీ చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, హోల్సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారన్నారు. ప్రతి కార్మికునికి బీమా చేయిస్తున్నదీ లేనిదీ చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో తయారీ, విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బాణసంచా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పార్టీ సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు. -
కూలీలను కాపాడబోయి యజమాని ఆహుతి
రాయవరం: బాణసంచా ప్రమాదాల్లో సాధారణంగా కూలీలే సమిధలవుతారు. అయితే రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో కూలీలతో పాటుగా తయారీ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మృత్యువాత పడ్డారు. దీపావళి సమీపిస్తుండడం, వివాహ ముహూర్తాలకు ఆర్డర్లు వస్తుండడంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. అనుకోకుండా జరిగిన దుర్ఘటన యజమాని సత్తిబాబుతో సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు బయట కూర్చున్న సత్తిబాబు ప్రమాదంలో చిక్కుకున్న కూలీల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే మృత్యువాత పడినట్లుగా భావిస్తున్నారు. ప్రమాద జరిగిన వెంటనే ఇద్దరు కూలీలను బయటకు లాగినట్లుగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మరొకరిని బయటకు లాగే సమయంలో అప్పటికే అగ్నికీలలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మృత్యువుకు చేరువైనట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బయట కుర్చీలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికే వారని, కాని కూలీలను రక్షించే క్రమంలోనే అసువులు బాసినట్లుగా సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రం యజమాని వేల్పూరి సత్తిబాబు చెబుతున్నారు. అప్పటి వరకు బయట కూర్చున్న మృతుడు సత్తిబాబుతో తాను మాట్లాడి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లుగా సత్తిబాబు తెలిపారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు. -
పొగాకు నాట్లు ప్రారంభం
పరిమితికి మించి పంట వేయవద్దు పొగాకు బోర్డు ఇచ్చిన పరిమితికి లోబడి పంట వేయాలి. బ్యారన్కు 1.6 హెక్టార్ల విస్తీర్ణంలో పంట వేసి 35 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలి. అధిక విస్తీర్ణంలో పంట సాగు అనర్థదాయకమే. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. వరి పంట వేసిన బాడవ భూములు, పల్లపు ప్రాంత భూముల్లో సాగు చేయవద్దు. నారుమడిలో మేలైన నారును ఎంచుకుని నాట్లు వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గల నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలి. అప్పర్ ఎన్ఎల్ఎస్లో నాట్లు జరుగుతున్నాయి. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో రెండు రోజులుగా నాట్లు వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ట్రే నారు నాట్లు వేస్తున్నారు. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరందేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్న వర్జీనియా పొగాకు సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. 2025–26 పంట కాలానికి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించారు. వారం రోజులుగా నాట్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఎర్రమట్టి ఇసుక నేలలు, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు జరుగుతుంది. ఉత్తర తేలిక నేలల్లో(ఎన్ఎల్ఎస్) పండిస్తున్న పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, ఏలూరు జిల్లాల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు జరుగుతుంది. ఈ పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఉండడంతో మంచి ధర పలుకుతుంది. రెండేళ్లుగా పొగాకు పంట రైతులకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట ఎన్ఎల్ఎస్ సాగు. ఎకరాకు దాదాపు రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుంది. నవంబర్ నెలాఖరుకు పొగాకు నాట్లు పూర్తికానున్నాయి. ఈ నెల 15 తర్వాత నాట్లు ముమ్మరంగా జరుగుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతాన్ని అప్పర్ ఎన్ఎల్ఎస్, లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతాలుగా పిలుస్తారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను అప్పర్ ఎన్ఎల్ఎస్, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంగా పిలుస్తారు. ఏటా అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముందస్తు సాగు ప్రారంభిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో అక్కడ నాట్లు వేయగా, 20 రోజుల తేడాలో లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముమ్మరంగా నాట్లు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. పెరిగిన సాగు రెండు జిల్లాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పొగాకు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది బోర్డు లెక్కల ప్రకారం 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా మరొక నాలుగు వేల హెక్టార్లలో సాగు చేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం రీజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,2 వేలం కేంద్రాల పరిధిలో 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు కలిగి ఉన్నారు. అధిక దిగుబడుల వంగడాల సాగు అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థల నుంచి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఎల్వీ–7, 1353 వంగడాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్లు దిగుబడి నిస్తున్నాయి. కిలో విత్తనం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నారు. అంతరించిపోతున్న జీడిమామిడి పంట జీడిమామిడి పంట మెట్ట ప్రాంతంలో అంతరించిపోతోంది. మార్కెట్లో పొగాకు ధర లాభసాటిగా ఉండడం, కౌలు ఎక్కువగా రావడంతో రైతులు జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జీడిమామిడి పంట దిగుబడి తగ్గడంతో పాటు ధర లేకపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు అంటున్నారు. దేవరపల్లి మండలం సంగాయగూడెంలో పొగాకు నాట్లు వేస్తున్న కూలీలు నాటడానికి మడుల్లో సిద్ధంగా ఉన్న పొగాకు నారు 80 వేల ఎకరాల్లో పంట సాగు 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు ఆసక్తి చూపుతున్న కౌలురైతులు లాభసాటిగా పొగాకు సాగు గణనీయంగా పెరగనున్న సాగు విస్తీర్ణం కౌలు రైతుల మధ్య పోటీ రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉంది. కిలో రూ.430 ధర పలకడంతో కౌలుదారులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కౌలుదారుల మధ్య పోటీ ఏర్పడంతో భూమి కౌలు ఎకరం రూ.80 వేల నుంచి రూ.1 లక్ష పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి కౌలు పలుకుతుంది. బ్యారన్ లీజు రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు పలుకుతుంది. బ్యారన్ లైసెన్స్ ఖరీదు రూ.10.50 లక్షలు పలుకుతుంది. మూడేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఉండగా, గత ఏడాది రూ.8 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతుండడంతో ఎక్కువ బ్యారన్లు ఉన్న రైతులు కొన్ని బ్యారన్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
బాణసంచా కేంద్రాలపై దాడులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ బాణసంచా నిల్వలు, తయారీ కేంద్రాలపై జిల్లా పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ డి.నరసింహకిశోర్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బొమ్మూరు, రాజానగరం, బిక్కవోలు, కడియం, చాగల్లు, సమిశ్రగూడెం, సీతానగరం, గోకవరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్లపై కేసులు నమోదు చేశారు. బాణసంచా లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జన సంచార స్థలాల్లోను, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఈ తనిఖీలు కొనసాగించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు తెలిస్తే డయల్ 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
దేవరపల్లి: రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలకు తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక గురువారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపిక పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో బాల బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ జట్లు ఈ నెల 11,12 తేదీల్లో బాపట్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంథ్రనాథ్ తెలిపారు. బాలుర జట్టుకు జి. కోట సతీష్(దొమ్మేరు), ఎం.ఆంథోని(రామన్నపాలెం), వై. పాల్(దొమ్మేరు), బి, చరణ్(దొమ్మేరు), ఎ. వివేక్(దేవరపల్లి), బి. రాధాకృష్ణ (రామన్నపాలెం) ఎంపికయ్యారు. బాలికల జట్టులో దుర్గామాధవశ్రీ (చిన్నాయగూడెం), ఎం. మహాలక్ష్మి (రామన్నపాలెం), ఎం.లాస్య(రామన్నపాలెం), ఎస్కే మనిషాబేగం(రామన్నపాలెం), ఎం.జేసీశ్రీ(రామన్నపాలెం), డి. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సుభాషిణి (రామన్నపాలెం) ఎంపికై నట్టు రవీంధ్రనాథ్ తెలిపారు. పోటీలను పీడీలు ఎల్. గణపతి, టి.సరస్వతి, సీహెచ్ సతీష్, పి.సాయి పర్యవేక్షించారు. 11, 12 తేదీల్లో బాపట్లలో జాతీయ స్థాయి పోటీలు -
బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు
● పాటించకుంటే కఠిన చర్యలు ● అవసరమైతే క్రిమినల్ కేసులు ● తయారీదారులతో సమీక్షలో కలెక్టర్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాల్లో ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని, అనుమతులిచ్చేందుకు మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. బాణసంచా తయారీదారుల సంఘాల ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న యూనిట్లను తనిఖీ చేసి, భద్రతా లోపాలుంటే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, ఆ తరువాత మాత్రమే అనుమతులివ్వాలని ఆదేశించారు. తయారీ కేంద్రాలు నివాస ప్రాంతాలకు దూరంలో ఉండాలన్నారు. బాణసంచా తయారీలో పాల్గొనే కార్మికుల మధ్య భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, దీనిపై కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. లైట్నింగ్ అరెస్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, పొడి ఇసుక, నీరు వంటి అగ్నిప్రమాద నివారణ పరికరాలు, సామగ్రిని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిల్వ కేంద్రాల్లో సరైన వెంటిలేషన్ ఉండాలని చెప్పారు. విక్రయ లైసెన్సుల జారీలో జాగ్రత్తలు దీపావళి బాణసంచా విక్రయ కేంద్రాలకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయడంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి, రిటైల్ బాణసంచా దుకాణాలు సురక్షితంగా ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి దుకాణం మధ్య తగినంత ఖాళీ ఉండేలా మార్గదర్శకాలు పాటించాలన్నారు. దీపావళి పండగ సందర్భంగా బాణసంచా అమ్మకాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే జరపాలన్నారు. దీపావళి రోజు సాయంత్రం 5 గంటలకల్లా అన్ని దుకాణాలనూ మూసివేయాలని స్పష్టం చేశారు. అధికారులు కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు నిర్వహించాలని రిటైల్ బాణసంచా దుకాణాల నిర్వాహకులతో చెప్పారు. దీపావళి అనంతరం మిగిలిన బాణసంచాను ఇంట్లో నిల్వ చేయకుండా పోలీస్, రెవెన్యూ బృందాలు తనిఖీలు చేయాలన్నారు. తయారీదారులు తయారు చేసిన, విక్రయించిన బాణసంచా వివరాలు, ఎవరికి విక్రయించారనే సమాచారాన్ని నిరంతరం ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. దీపావళి రోజున విక్రయ కేంద్రాల్లో అత్యవసర సేవలకు మెడికల్ టీములు, అగ్నిమాపక బృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం భద్రతా సూచన బోర్డులు, అత్యవసర నంబర్లు ప్రదర్శించాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, అదనపు ఎస్పీ డి.మురళీకృష్ణ, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఎస్పీలు దేవకుమార్, భవ్య కిషోర్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్కింగ్, డీపీఓ వి.శాంతామణి, కార్మిక శాఖ సహాయ కమిషనర్ బీఎస్ఎం వలీ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్గా రాహుల్ మీనా
ఎట్టకేలకు పోస్టు భర్తీ సాక్షి, రాజమహేంద్రవరం: కాకినాడ జిల్లా జా యింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మీనా 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన నియామకంతో కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న నగర పాలక సంస్థ కమిషనర్ స్థానం భర్తీ అయింది. మితిమీరుతున్న రాజకీయ జోక్యం రాజమహేంద్రవరం సిటీ, రూరల్ టీడీపీ నేతల మితిమీరిన రాజకీయ జోక్యానికి ఇప్పటికే ఓ కమిషనర్ బలయ్యారు. బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే తాను ఇక్కడ పని చేయలేనంటూ గత కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. దీనినిబట్టి ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కేతన్ గార్గ్ నగరాన్ని సుందరంగా, ఆక్రమణలు లేకుండా తీర్చిదిద్దాలని భావించారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించడంలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ప్రజాప్రతినిధి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. ఏదైనా అక్రమ నిర్మాణం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సందర్భంలో వెంటనే ఆ అధికారులకు ఓ ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ వచ్చేది. అది తమ వారిదేనని, దాని జోలికి వెళ్లవద్దంటూ హుకుం జారీ చేసేవారు. చేసేది లేక వెనుదిరగాల్సి వచ్చేది. ప్రధాన రోడ్లలో ఆక్రమణల తొలగింపులో కూడా కేతన్ గార్గ్ అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రతి పనినీ స్వయంగా పరిశీలించి, నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించే వారు. తను సంతృప్తి చెందితేనే బిల్లులు మంజూరు చేసేవారు. దీంతో ఎలాగైనా ఆయనను బదిలీ చేయించేందుకు కూటమి నేతలు కంకణం కట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల వద్ద పైరవీలకు తెర తీశారు. దీంతో విసుగెత్తిపోయిన కేతన్ గార్గ్ ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేనని భావించి బదిలీ కోసం స్వయంగా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయనను ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నం నగర పాలక సంస్థకు బది లీ చేసింది. తాజాగా వస్తున్న కమిషనర్ రాహుల్ మీనానైనా కూటమి నేతలు సక్రమంగా పని చేసుకునే అవకాశం కల్పిస్తారా.. 2027 పుష్కరాల వరకూ అయినా విధులు నిర్వహించే వీలు కల్పిస్తారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 18 వరకూ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని, రాజగోపురంతో సహా ఉపాలయాలను, పరిసరాలను, ఆ ప్రాంగణాన్ని, రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారు వివిధ అలంకరణలతో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. తొలి రోజు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజ పతాక హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఊరేగించనున్నారు. -
గత ప్రభుత్వానికి పేరొస్తుందనే అక్కసు
పేదలందరికీ సొంతిల్లు ఉండాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం. అది కూడా నివాసయోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో జగనన్న కాలనీల్లో అన్ని రకాల వసతులూ కల్పించాం. ఎక్కడో కాకుండా రూ.కోట్లు వెచ్చించి గ్రామాలకు సమీపంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇళ్లు కాకుండా కొత్తగా ఊళ్లు నిర్మించాం. మా ప్రభుత్వ హయాంలోనే అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నాం. గృహ నిర్మాణాలు పూర్తయితే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం చూపుతోంది. ఉన్న వసతులు మెరుగుపరచాల్సింది పోయి వాటిని నాశనం చేస్తోంది. చివరకు ట్రాన్స్ఫార్మర్లు సైతం పట్టుకుపోతున్నారంటే పేదలపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. జగనన్న కాలనీల్లో వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే -
జక్కంపూడి రామ్మోహనరావుకు ఘన నివాళి
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా పోరాట యోధుడు, మాజీ మంత్రి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు సెంటర్లో ఆయన విగ్రహానికి గురువారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక లోకం అభ్యున్నతి కోసం తన తండ్రి నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆయుధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన జక్కంపూడి రామ్మోహనరావు.. వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మందుపాతరలతో సహజీవనం
తనిఖీ చేసిన కేంద్రంలోనే భారీ ప్రమాదం తయారీ కేంద్రాల వద్ద తీసుకుంటున్న రక్షణ చర్యలు, అధికారుల తనిఖీలు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఉండాల్సిన స్థాయిలో వాటర్ ట్యాంకులు ఉన్నాయా? ఇసుక నిల్వలు ఉంచారా? తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఏర్పాటు చేశారా లేదా? మంటలను ఆర్పే కార్బన్ డయాకై ్సడ్ కిట్ ఉందా, లేదా చూసి లైసెన్సులు రెన్యువల్ చేయడం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తున్నారు. రాయవరంలో ప్రమాదానికి గురైన బాణసంచా తయారీ కేంద్రాన్ని కూడా అధికారులు ఇటీవల తనిఖీ చేసి రెన్యువల్ చేశారు. అటువంటి చోటే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.సాక్షి, అమలాపురం: బాణసంచా తయారీ కేంద్రాలలో పని చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. మిగిలిన చోట్ల ఏమో కానీ.. బాణసంచా తయారీ కేంద్రంలో పని చేయడం అంటే మృత్యువుతో నిత్యం చెలగాటం ఆడడమే. అది తెలిసి కూడా కార్మికులు, కూలీలు పొట్టకూటి కోసం వీటిలో పని చేసేందుకు వెళుతున్నారు. మందుపాతర మీద కూర్చుని జీవన పోరాటం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాలు జరిగితే మృత్యువు బారిన పడుతున్నారు. గాయాలతో బయట పడినా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అనుమతి లేని కేంద్రాలే అధికం రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం పెను విస్ఫోటం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడు తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధి తులందరూ అతి పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. జీవనోపాధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ వీరు ఇక్కడ పని చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు అధికారికంగా 18 వరకూ ఉండగా, ఒక స్టోరేజ్ కేంద్రం ఉంది. కానీ, వాస్తవంగా అనుమతి లేని కేంద్రాలు చాలా ఉన్నాయి. అనుమతి ఉన్న కేంద్రాలలో మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని తయారీ కేంద్రాలు, అమ్మకం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటీవల అయినవిల్లి మండలం విలసలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలడం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుల రక్షణ పట్టని అధికారులు ● నిబంధనల ప్రకారం అన్ని రక్షణ చర్యలూ తీసుకుంటేనే అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ, కార్మికుల రక్షణ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ● బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులు. ఇక్కడ పని చేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. వీరెవ్వరూ వృత్తి నైపుణ్యం ఉన్నవారు కాదు. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే ముడిసరకుపై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి ఉండటంలేదు. ● బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. దీనికి కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలిపోయే స్వభావం ఉంటుంది. అయితే పని చేసే వారికి ఈ అవగాహన లేకుండా పోతోంది. ● పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. పౌడర్గా తగు పాళ్లలో కలిపి క్రాకర్స్ తయారు చేయాల్సి ఉంది. ● బాణసంచా తయారీ కేంద్రాల్లో అన్ని రసాయనాలూ కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అన్ స్కిల్డ్ లేబర్తో నూరిస్తున్నారు. అదే పేలుళ్లకు దారి తీస్తోంది. ● బాణసంచా తయారు చేసే ప్రతి కార్మికునికి చేతులకు గ్లౌజ్లుండాలి. అగ్నిప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. తయారు చేస్తున్న బాణసంచా, దానికి వాడే రసాయనాలు, వాటిని ఎలా కలపాలనే దానిపై కార్మికుడికి అవగాహన కల్పించాలి. కానీ, ఎక్కడా ఇటువంటివి పాటించడం లేదు. ● బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా వారి శరీరాలు మారిపోతున్నాయి. జిల్లాలో ఇంచుమించు ప్రతి బాణసంచా తయారీ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ● రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతీ కార్మికుని ముఖానికి మాస్క్ తప్పనిసరి. ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో పాటు చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ● దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు అప్పటికప్పుడు సాధారణ కూలీలను కూడా పనిలో పెట్టుకుంటున్నారు. వారికి అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ● చిన్న పిల్లలను, మహిళలను మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు అనుమతించ కూడదు. కానీ, కొమరిపాలెం పేలుడులో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలే. ● ఇంత జరుగుతున్నా వీటిపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, వైద్య శాఖలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. బాణసంచా కేంద్రాల్లో భద్రత లేని కూలీలు కనీస రక్షణ కరవు చుట్టూ పేలుడు పదార్థాలు శరీరంపై కూడా రసాయనాలే అందుకే ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోతున్న కార్మికులు ఘటనా స్థలంలోనే మృత్యువాత నిపుణులు కూడా కొరత దీపావళి సమయంలో తాత్కాలికంగా కూలీల నియామకం ఆర్డర్ల పేరుతో అవిశ్రాంతంగా పనులు రసాయనాల పట్ల అవగాహన ఉండాలి బాణసంచా తయారు చేసేందుకు వాడే రసాయనాలపై ప్రతి కార్మికునికి, కూలీలకు అవగాహన ఉండాలి. ఇందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రసాయనాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇవన్నీ మండే కారకాలే. కార్మికుల ఒంటి నిండా రసాయనాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చిన్న నిప్పురవ్వ రాజుకున్నా పేలుడు సంభవించడం, కార్మికులు చనిపోవడం పరిపాటిగా మారింది. – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, అమలాపురం -
విద్యార్థిని మృతదేహం లభ్యం
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని కప్పుల పూజిత (17) మృతదేహం బుధవారం మోర్త సరిహద్దు ప్రాంతంలో లభ్యమైంది. 24 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. పూజిత మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వేలివెన్ను ఓ ప్రైవేట్ కళాశాలలో పూజిత ఇంటర్ చుదువుతోంది. మంగళవారం విద్యార్థులతో కలిసి బస్సులో ఇంటికి బయలుదేరింది. దమ్మెన్ను వంతెన వద్దకు రాగానే తనకు వాంతులు వస్తున్నాయని బస్సు ఆపమని కిందకు దిగింది. పూజిత వెంటనే వంతెన దగ్గర చెప్పులు విడిచిపెట్టి కాలువలో దూకేసింది. దీంతో బస్సు డ్రైవర్, సహచర విద్యార్థులు పెద్దగా అరవడంతో స్థానికులు స్పందించి కాలువలో గాలించారు. ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్డీఎఫ్ బృందాలు కాలువలో గాలించగా చివరకు పూజిత మృతదేహం లభ్యమైంది. విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉండ్రాజవరం ఎస్సై డి. రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరిపై ‘కార్తిక’ ఏర్పాట్లు
అన్నవరం: ఈ నెల 22 తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం రత్నగిరిపై జరిగిన దేవస్థానం, ప్రభుత్వ శాఖల అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ప్రకాష్సదన్ సత్రంలోని ట్రస్ట్బోర్డు సమావేశ హాలులో జరిగిన సమావేశానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షత వహించారు. కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ నవంబర్ రెండో తేదీన సత్యదేవుని తెప్పోత్సవం, ఐదో తేదీన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ భక్తులకు సత్యదేవుని దర్శనం సులభంగా జరిగేలా, వ్రతాల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్ఐ శ్రీహరి బాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు దేవస్థానం అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్.కుమార్రాజా పాల్గొన్నారు. కార్తిక మాసోత్సవ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ● వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలకు అదనంగా కౌంటర్ల ఏర్పాటు ● పర్వదినాలలో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి బృందాల వారీగా దర్శనానికి భక్తులకు అనుమతి ● రెండో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పంపా నదిలో జరిగే తెప్పోత్సవానికి 20 మంది గజ ఈతగాళ్లు, తెప్పకు ఎస్కార్ట్ గా రెండు బోట్లు ఏర్పాటు ● గిరి ప్రదక్షిణ జరిగే ఐదో తేదీన రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాల ఏర్పాటు ● నెల రోజులు చిన్నకార్లు, ఆటోలు మినహా మరే ఇతర పెద్ద వాహనాలను కొండమీదకు అనుమతించరు. ● రత్నగిరి, సత్యగిరి పై సుమారు వేయి కార్లు, మూడు వేల బైకులు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు సిద్ధం ● మెయిన్ క్యాంటీన్ భవనాన్ని డార్మెట్రీ గా చేయాలని నిర్ణయం. ● గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు ● బెండపూడి వైపు ఆర్చి నుంచి మండపం సెంటర్ ఆర్చి వరకు రోడ్డుకు మరమ్మతులు ● ముఖ్యమైన దేవస్థానం అధికారులకు 20 వాకీటాకీలు అందించాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న 20 వాకీటాకీ లకు ఇవి అదనం. ● రత్నగిరిపై అన్నిచోట్లా సీసీ టీవీ కెమెరాలు, పశ్చిమ రాజగోపురం, ఆలయ ప్రాంగణంలో రెండు చోట్ల రెండు సమాచార కేంద్రాలు, పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటు ● విజయవాడ, విశాఖపట్నం, జిల్లాలోని ముఖ్య పట్టణాల నుంచి అదనపు ఆర్టీసీ బస్లు -
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని శరభవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అటికే సత్యవతి (58), ఆమె భర్త, మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు అటికే సత్యనారాయణలు బైక్పై టి రాయవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా స్థానిక పెట్రోల్ బంకు సమీపానికి వచ్చేసరికి తుని వైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో సత్యవతి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సత్యనారాయణకు స్థానిక సీహెచ్సీలో ప్రాధమిక చికిత్స అనంతరం కాకినాడ తరలించారు. సత్యవతికి ముగ్గురు కుమారులున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరాల వెంకన్నకు బ్రహ్మోత్సవం
● రేపటి నుంచి వాడపల్లి క్షేత్రంలో ప్రారంభం ● రోజుకో ప్రత్యేక అలంకారంలో దర్శనం ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు కొత్తపేట: ‘ఏడు వారాల వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం వాడపల్లిలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. దేవదాయ, ధర్మదాయ శాఖ, జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. అటు రావులపాలెం, ఇటు బొబ్బర్లంక నుంచి స్వాగత ద్వారాలు, అక్కడి నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలంకరణలు చేశారు. 1759లో ఆలయ నిర్మాణం స్వామివారి ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే వ్యాపారి 1759వ సంవత్సరంలో నిర్మించారు. ఆయన స్నేహితుడు, ప్రాంతీయ పరిపాలకుడైన పెద్దాపురం మహరాజు రాజా వత్సవాయి తిమ్మ జగపతిరాజు ఈ ఆలయ నిర్వహణకు 275 ఎకారాలను విరాళంగా సమకూర్చారు. దీప ధూప నైవేద్యాల కోసం 110 ఎకరాలు, స్వామి వారి సేవల నిమిత్తం 165 ఎకరాల భూమి సమర్పించారు. అంతకంతకూ పెరుగుతున్న భక్తజనం.. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి తరువాత అత్యంత భక్తజనాదరణ పొందిన క్షేత్రంగా వాడపల్లి విలసిల్లుతోంది. గౌతమీ–వశిష్ట గోదావరుల నడుమ, గౌతమీ నదికి అతి సమీపంలోని ఈ క్షేత్రానికి కొద్ది దూరంలోనే విజ్జేశ్వరం, లొల్ల గ్రామానికి ఆనుకొని ఉండటంతో ఈ గ్రామాన్ని లొల్ల వాడపల్లి, చిన్న వాడపల్లిగా పిలుస్తారు. ఇక్కడ నిత్యం తిరుమల తరహాలో సుప్రభాత, నిత్య కల్యాణ సేవలు నిర్వహిస్తారు. ఏడు శనివారాల పాటు, ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించి, మరో వారం అష్టోత్తర పూజ చేయిస్తే సంకల్పాలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ప్రాశస్త్యం మేరకు పదేళ్ల కాలంలో స్వామివారి ఖ్యాతి గణనీయంగా పెరిగి ప్రతి శనివారం సుమారు రూ.55 లక్షలకు పైబడి, నిత్యం రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలు వరకు ఆదాయం వస్తుండగా, ప్రతి నెలా హుండీల ద్వారా సుమారు రూ 1.35 కోట్లు పైబడి ఆదాయం సమకూరుతోంది. దానితో ఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరింది. వైఎస్సార్ సీపీ హయాం నుంచీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృషి, దాతల సహకారంతో సుమారు రూ.65 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అవరణలో గోశాల, భారీ రేకుషెడ్లు, అన్నదాన భవనం నిర్మాణం, వకుళమాత అన్న ప్రసాద భవనం, స్వామి వారి తెప్పోత్సవం నిర్వహణకు కోనేరు ఏర్పాటుకు శ్రీకారం. కాలినడకన వచ్చే భక్తులకు విశ్రాంతి, సామూహిక వివాహాలు, ఉపనయనాలు జరిపేందుకు వీలుగా మూడు అంతస్తుల భవనం నిర్మాణం, స్వామి వారికి శాశ్వత వార్షిక కల్యాణ వేదిక, వాటర్ ప్లాంట్, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఏర్పాటుచేశారు. ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పదో తేదీన పరావసుదేవి అలంకరణలో శేషవాహనంపైనా, 11న సరస్వతిగా, హంసవాహనంపైనా, 12న కోదండరామునిగా హనుమద్వాహనంపైనా, 13న యోగనారసింహునిగా సింహ వాహనంపైనా, 14న మలయప్పస్వామిగా గరుడునిపైనా, 15న శ్రీకృష్ణునిగా ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి మోహినీదేవిగా చంద్రప్రభవాహనంపై, 16న రాజాధిరాజుగా గజవాహనంపై, 17న కల్కిగా ఉదయం కల్పవృక్షవాహనంపై, రాత్రి అశ్వవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 18న స్వామివారికి చక్రస్నానం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో.. ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ అదనపు బస్సులు ప్రతి శనివారం రావులపాలెం డిపో నుంచి 12 బస్సులు, మిగిలిన రోజుల్లో అదనంగా మూడు బస్సులు చొప్పున, అలాగే ఉమ్మడి జిల్లాలో ఇతర డిపోల నుంచి అదనపు బస్సులు నడుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్టు రావులపాలెం డీఎం వైవీవీఎన్ కుమార్ తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేశాం. అందరూ సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ ఈఓ, వాడపల్లి -
లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో రోజా
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వరుదు కల్యాణి స్వామివారికి పూజలు చేశారు. తొలుత ఆలయం వద్ద వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస్ కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు పి.రామశేషాచార్యులు, ఎస్బీఎం రమేష్ స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ సూపరింటెండెంట్ పి.విజయ సారథి వారికి స్వామివారి చిత్రపటాలను, లడ్డు ప్రసాదాలను అందజేశారు. ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు.హుండీలో మంగళ సూత్రాలుఅమలాపురం టౌన్: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక రవణం వీధిలోని మహిషాసుర మర్దినిదేవి ఆలయంలో హుండీని ఆలయ కమిటీ, ఆ వీధి ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం తెరిచి లెక్కించారు. ఈ సమయంలో కరెన్సీ నోట్లు, చిల్లర నాణేలతో పాటు బంగారు మంగళ సూత్రాలు గమనించారు. మొక్కు చెల్లింపులో భాగంగా అజ్ఞాత భక్తురాలు హుండీలో తాళి బొట్టు వేసి ఉంటుందని భావిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యుడు చిక్కం కిట్టు తెలిపారు. దసరా శరన్నవ రాత్ర ఉత్సవాల సమయంలో అమ్మ వారి హుండీలో రూ.82 వేల నగదు వచ్చిందని కమిటీ తెలిపింది. -
హుండీల ఆదాయం లెక్కింపు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి, ఉమా కమండలేశ్వర స్వామివారి ఆలయాల హుండీలను ఆరు నెలల 19 రోజుల అనంతరం బుధవారం తెరిచి నగదు లెక్కించారు. ఆయా దేవస్థానాల ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి ఉప్పలపాటి జానకమ్మ అన్నదాన సత్రం ఈఓ మీసాల రామకృష్ణ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో హుండీల ఆదాయం లెక్కించారు. జగన్మోహినీ కేశవ స్వామి ప్రధాన హుండీల ద్వారా రూ 8.29.515, అన్నదానం హుండీల ద్వారా రూ.3,67,275, విదేశీ యూఎస్ఏ 100 డాలర్ 1, 10 డాలర్లు మూడు, 5 డాలర్లు పది, 1 డాలర్ 59, సింగపూర్ 10 డాలర్లు 1, యూఏఈ 5 దినారం ఒకటి వచ్చినట్టు ఈఓ తెలిపారు. అలాగే ఉమా కమండలేశ్వరస్వామి ఆలయం హుండీల ద్వారా రూ.2,64,918 ఆదాయం సమకూరిందన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
● సంఘటనా స్థలంలో హత్య చేసినట్లు ఆనవాళ్లు● దర్యాప్తు చేస్తున్న పోలీసులు పిఠాపురం: పట్టణ శివారు చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద బుధవారం ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై మణికుమార్ వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు తెలిపారు.బండరాయితో మోది..మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఒక బండ రాయి రక్తపు మరకలతో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడే మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో మద్యం సేవించి అనంతరం బండరాయితో కొట్టి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
మంచి అలవాటుగా తపాలా బిళ్లల సేకరణ
బాలాజీచెరువు (కాకినాడ): సాంకేతికత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తపాలా బిళ్ల సేకరణ మంచి అలవాటుగా మార్చుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.రామచంద్రరావు పేర్కొన్నారు. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిరంలో బుధవారం జిల్లా స్థాయి ఫిలాటెలి ఎగ్జిబిషన్ (తపాలా బిళ్లల ప్రదర్శన)‘ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఫిలాటెలి అభిరుచి అతి ప్రాచీనమైనదని, తపాలా శాఖ తరచుగా విడుదల చేసే స్టాంపుల వలన ఈ కళ అజరామరంగా భావితరాలకు అందాలని ఆకాంక్షించారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఫిలాటెలి), ఆంధ్రప్రదేశ్ సర్కిల్, విజయవాడ జి.శివనాగరాజు మాట్లాడుతూ ఫిలాటెలి అభిరుచి గల అభిమానులు, ఔత్సాహికులు ఒకే వేదికపై తరచూ ఇలా ప్రదర్శనల ద్వారా ఈ కళకు జీవం పోస్తున్నారని కొనియాడారు. కాకినాడ డివిజనల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హెడ్ క్వార్టర్స్) గంటి రామకృష్ణ పి.వి.రమణమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ (రెగ్యులర్), సామర్లకోట అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ డి.అనిల్ అంబేడ్కర్ కుమార్ పాల్గొన్నారు. -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ఈ నెల ఒకటో తేదీన ‘అలక్ష్యంతో అనర్థం’, నాలుగో తేదీన ‘ప్రాణ సంకటంగా బాణసంచా’ శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీపావళి సమయాల్లో గతంలో జరిగిన ప్రమాదాలను ఊటంకిస్తూ.. అధికారులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపింది. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. తయారీ కేంద్రాన్ని ఇటీవల సందర్శించామని, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంత ప్రమాదం జరగడం స్థానికులను విస్మయ పరుస్తోంది. -
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది. తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు. 1952లో మద్రాస్లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో నల్లజర్ల, కోరుకొండ, సీతానగరం, తాళ్లపూడి, అనపర్తి, రాజానగరం మండలాల్లో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్టు గుర్తించామని కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమ్మ, బొప్పాయి, కూరగాయల పంటల్లో ఈ నత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు. కానీ పంటల ఉత్పత్తి మీద ఇప్పటి వరకు ఈ నత్తల ప్రభావం ఏమి లేదన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నత్తల నిర్మూలనకు వివిధ పద్ధతులపై ప్రదర్శనలతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నత్తలను చేతితో సేకరించి ఉప్పు ద్రావణంలో వేయడం, కాపర్ సల్ఫేట్, ఫెరరస్ సల్ఫేట్ ద్రావణాలను పిచికారీ చేయడం, మెటా డీఎన్ మందును పొలాల్లో వేయడం వంటి చర్యల ద్వారా సమర్థవంతంగా నిర్మూలించవచ్చని తెలిపారు. ఉప్పు ద్రావణంలో ముంచిన గన్ని బ్యాగులను పొలాల గట్లపై ఉంచితే, నత్తల వ్యాప్తి ఇతర పొలాలకు చేరకుండా అడ్డుకోవచ్చని వివరించారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి 1,32,101 ఎకరాల్లో ఈ పంట నమోదు పూర్తయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 6,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ విధానం ద్వారా పంటలను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,573 మంది రైతులు 4,246 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు, ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గేష్, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. -
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిచ్చుబుడ్డిని దట్టించే సమయంలో ప్రమాదం జరిగిందా.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది నిర్ధారించలేకపోతున్నారు.భీతావహ పరిస్థితిప్రమాద స్థలం మొత్తం మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల సమయానికి కూడా ఆరో మృతదేహాన్ని గుర్తించలేక పోయారంటే అసలు పనికి ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది పక్కాగా నమోదు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.నివ్వెరపోయిన అధికారులు, ప్రజలుప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలిలో మృతదేహాలు ఉన్న తీరును చూసి అధికారులకు నోట మాట రాలేదు. అక్కడి పరిస్థితిని చూసిన వారు చలించిపోయారు.ఘటనా స్థలిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డీఎస్పీ బి.రఘువీర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తదితరులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. -
బతుకులు చితికి..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. కానీ ఈ దీపావళి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. మిరుమిట్లు గొలుపుతూ ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డి వెలుగులు వారి జీవితాల్లో చిచ్చుపెట్టాయి. ఎవరికి ఎవరూ కాకుండా చేశాయి. మరో పది రోజుల్లో దీపావళి వస్తుంది. ఇంటిల్లిపాదీ ఈ పండగకు ఏ లోటూ లేకుండా బాణసంచా కాల్చాలి.. కొత్త దుస్తులు వేసుకోవాలి.. ఇలా ఎన్నో ఆశలతో ఆ కూలీలు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుకున్న చిన్న నిప్పురవ్వ పేదల ఇంట పెను విషాదాన్ని నింపి వారి కుటుంబాలను అంధకారమయం చేసింది.సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు.ఆలనాపాలనా చూసేవారెవరు?పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు. శేషారత్నం సంపాదిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. తల్లి మృతి చెందిందని తెలిసి బేలగా చూస్తున్న చిన్నారులు స్థానికులకు కంట తడిపెట్టిస్తున్నారు. తమ చిన్నారుల పరిస్థితి ఏమిటని తండ్రి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.పిల్లల చదువు కోసం పనికి వెళ్లి..నిరుపేద కుటుంబానికి చెందిన చిట్టూరి శ్యామలకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి వార్త విన్న వృద్ధురాలైన ఆమె అత్తగారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. పిల్లలు ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారని వారికి ఖర్చులకు ఉంటాయని పనికి వెళ్లిందని, ఇలా మృత్యువాత పడుతుందని ఊహించలేదని రోదిస్తున్నారు. అత్తగారు గుండెలు పగిలేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు మాటలు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.మా జీవన ‘జ్యోతి’ ఆరిపోయిందికుడిపూడి జ్యోతి కుటుంబ పరిస్థితి చాలా దయనీయం. కుమార్తె, కుమారుడు, వయసు పైబడిన తల్లి లక్ష్మి ఆమైపె ఆధారపడి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేయగా, కుమారుడుకి ఇటీవలే వివాహమైంది. నాలుగు నెలల క్రితం భర్త సత్యనారాయణ మృతి చెందాడు. దీంతో వారి భారం జ్యోతిపై పడింది. ఆమె అనుకోకుండా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని, అనారోగ్యంతో ఉన్న తనను ముందు రోజు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి రూ.రెండు వేలు ఖర్చు పెట్టిందని గుండెలు పగేలా రోదిస్తోంది.మృతులు, క్షతగాత్రుల వివరాలుమృతులు1. వెలుగుబంట్ల సత్యనారాయణ (65), బాణసంచా తయారీ దుకాణం యజమాని, కొమరిపాలెం, బిక్కవోలు మండలం2. పాకా అరుణ(35),సోమేశ్వరం, రాయవరం మండలం3. చిట్టూరి శ్యామల(35), అనపర్తి4. పెంకే శేషారత్నం(40), అనపర్తి సావరం5. కుడుపూడి జ్యోతి(38), అనపర్తి సావరం6. కె.సదానందం (52), ఒడిశా వాసి7. పొట్నూరి వెంకటరమణ (55), కొమరిపాలెం, బిక్కవోలు మండలం8. వాసంశెట్టి విజయలక్ష్మి (51), సోమేశ్వరం, రాయవరం మండలంక్షతగాత్రులు1. చిట్టూరి యామిని, అనపర్తి2. లింగం వెంకట కృష్ణ, వేండ్ర, పెదపూడి మండలం -
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. -
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
సద్వినియోగం చేసుకోవాలి వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా.. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ● విద్యార్థులకు వీరగాథ 5.0 ● మూడు నుంచి 12వ తరగతుల వారికి పోటీలు ● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ ● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది. నాలుగు విభాగాల్లో.. పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ఎంచుకోవాల్సిన అంశాలు వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. నమోదు విధానం ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. -
మార్కెట్లో కొత్త థార్–రీఫ్రెష్ విడుదల
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ మహేంద్రా డీలరైన రాజమహేంద్రవరంలోని ఎంఅండ్ఎన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రిఫ్రెష్డ్ డిజైన్, మెరుగైన కంఫర్ట్, స్మార్ట్ కనెక్టివిటీతో కొత్త థార్ను మంగళవారం సాయంత్రం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, ఐకానిక్ డిజైన్ డ్యుయల్–టోన్ బంపర్తో పాటు, విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టీరింగ్ వీల్తో, పూర్తిగా కొత్త బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్, ఆరు రంగుల్లో (టాంగో రెడ్, బ్యాటిల్షిప్ గ్రే కొత్తవి) లభ్యమవుతాయన్నారు. కంఫర్ట్, కన్వీనియెన్స్, స్లైడింగ్ ఆర్మ్రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్, డోర్–మౌంటెడ్ పవర్ విండోస్, అంతర్గతంగా పనిచేసే ఇంధన మూత, డెడ్ పెడల్ (ఏటీ), రియర్ వాష్ వైపర్, ఏ–పిల్లర్ ఎంట్రీ అసిస్ట్ హ్యాండిల్, రియర్ వ్యూ కెమెరా, స్మార్ట్ టెక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో 26.03 సెం.మీ. హెచ్డీ ఇన్ఫోటై మెంట్ స్క్రీన్, యూఎస్బీ పోర్ట్ (ముందు, వెనుక) ఉంటాయని వివరించారు. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. కొత్త థార్ను కొత్త డిజైన్, అధునాతన కంఫర్ట్ ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో రూపొందించబడిందన్నారు. బహుళ ట్రాన్స్మిషన్లతో జత చేయబడిన విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యాలకు అనుగుణంగా మహీంద్రా అనేక రకాల ఇంజిన్ ఎంపికలను అందిస్తుందన్నారు. 6–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6–స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తదితర సౌలభ్యాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ రాజా, సేల్స్ మేనేజర్లు, ప్రాసెస్ సిబ్బంది, కస్టమర్లు, ఫైనాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో త్వరలో సంప్రోక్షణ, శాంతి పూజలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ, శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులతో కూడిన వైదిక కమిటీ నిర్ణయించింది. మంగళవారం ‘సాక్షి’లో ‘అపశ్రుతులు అందుకేనా..?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పండితులతో సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కానీ, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడంతో మూడు నెలలుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నట్టు ఆ కథనంలో వెలువడింది. అదేవిధంగా రెండు నెలల క్రితం సిక్స్ వీఐపీ సత్రంలో భక్తుడు మరణించినప్పటికీ, అతడు కొండ దిగువన ఆస్పత్రిలో మృతి చెందాడని భావిస్తూ సంప్రోక్షణ పూజలు చేయలేదని కూడా పేర్కొనడం జరిగింది. వీటిపై స్పందించిన చైర్మన్, ఈఓలు మంగళవారం పండితులతో కూడిన దేవస్థానం వైదిక కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్తిక మాసం లోపుగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ పూజల తేదీని నిర్ణయించాలని పండితులను కోరినట్టు చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనం సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.07టియుఎన్104 : తానార అప్పల నాయుడు (ఫైల్) -
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక ● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు. -
ప్రతీ కేసులో సాంకేతిక ఆధారాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా శిక్షాకాలం పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నెలవారీ నేర సమీక్షా సమావేశం సోమవారం పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. గ్రేవ్ కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా పేలుళ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అంతట దీపావళి మందు గుండు సామగ్రి స్టోరేజ్ గోడౌన్లు, అమ్మకాలు జరిగే ప్రదేశాలను ఆకస్మిక తనిఖీలు చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా, లేదా పరిశీలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్ నిర్వహించాలని, సంబంధిత పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్ తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. అనంతరం గత నెల రోజులలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. దీపావళి సందర్భంగా బాణసంచా తయారీదారులు, అమ్మకందారులు, వినియోగదారులు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, పోస్టర్లను విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ,సుబ్బరాజు, జోనల్ డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. క్రైం రివ్వూలో ఎస్పీ నరసింహకిశోర్ -
కార్యకర్తపై మండిపడ్డ మంత్రి దుర్గేష్ బంధువు
నిడదవోలు : పదేళ్ల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడిన ఓ కార్యకర్తపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమాలు పర్యవేక్షించే ఆయన బంధువు ప్రశాంత్ మండిపడ్డ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఫణీంద్రకుమార్ను ఇటీవల విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఫారసు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన అంజి అనే జనసేన కార్యకర్త మంత్రి దుర్గేష్ బంధువు ప్రశాంత్కి ఫోన్ చేసి అసలు గ్రామంలో ఎంకై ్వరీ చేయకుండా పదవి ఎందుకు ఇచ్చారంటూ నిలదీశాడు. గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా పదవి ఎలా ఇచ్చారంటూ అంజి ప్రశ్నించాడు. దీంతో ప్రశాంత్ కార్యకర్త అంజిపై విరుచుకుపడ్డాడు. పార్టీ పదవుల విషయంపై నీకు ఏమిటి సంబంధం, నువ్వు ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాకు సంబంధం లేదా అంటూ కార్యకర్త అంజి వాపోయాడు. మంత్రి దుర్గేష్ ఇష్ట ప్రకారం డైరెక్టర్ పదవి ఇచ్చారని, ఎక్కువగా మాట్లాడితే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ అన్నాడు. జనసేన పార్టీ నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. ఈ విషయమై మంత్రి కందుల దుర్గేష్కి ఫోన్ చేసి అడుగుతానని కార్యకర్త అంజి చెప్పడంతో మంత్రితో నువ్వు మాట్లాడతావా నువ్వు ఎంత..నీ స్థాయి ఎంత.నువ్వు కేవలం కార్యకర్తవు మాత్రమే.. లీడర్ను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డాడు. వైరల్ అవుతున్న ఆడియో -
ముగిసిన పవిత్రోత్సవాలు
పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు.పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు.కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశంఅన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్సదన్ సత్రంలోని ట్రస్ట్బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.ఘనంగా ప్రత్యంగిర హోమంఅన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు. -
సీజేఐపై దాడి దుర్మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై దాడి దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. న్యాయమూర్తిపై దాడికి నిరసనగా మంగళవారం ఆర్ట్స్ కళాశాల అర్బన్ స్క్వేర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై మతోన్మాదుల దాడి అన్యాయమన్నారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే చెప్పు విసరడం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతోన్మాదులు ఆగడాలు పెరిగిపోతున్నాయని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడికి తెగబడేంత ధైర్యం చేశారన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఏముంటుందన్నారు. ఇలాంటి దాడులను ఖండించాలన్నారు. సనాతన ధర్మం పేరుతో ఎవరిపైబడితే వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు లహరి, జ్యోతి, సౌమ్య, భాగ్యలక్ష్మి, అమృత, సంధ్య, బాలాజీ, కనక, కార్తిక్, హేమంత్, మౌళి, సాయి పాల్గొన్నారు. -
కమిషనర్ లేక పాలన అస్తవ్యస్తం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఐదు నెలలుగా రాజమహేంద్రవరరం నగర పాలక సంస్థకు కమిషనర్ లేకపోవడంతో పాలన ముఖ్యంగా శానిటేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారైందని ఏఐటీయూసీ జిల్లా నాయకులు తాటిపాక మధు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నగరపాలక సంస్థకు కమిషనర్ని నియమించాలని మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ విభాగంలో చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులను ఉద్యోగాల్లో నియమించాలని, 60 ఏళ్లు నిండిన ఔట్ సోర్సింగ్ కార్మికుల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మధు మాట్లాడుతూ రాజమహేంద్రవరం లాంటి చారిత్రక నగరానికి కమిషనర్ని నియమించడానికి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు ఒకపక్క రానున్న గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నాయని అయినా ప్రభుత్వానికి చలనం లేదన్నారు. ప్రతిరోజు మున్సిపల్ కార్మికులకు సమస్యలు ఉంటాయని ప్రతిసారి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాజమండ్రి అధ్యక్షుడు రెడ్డి రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ పాల్గొన్నారు.ఏఐటీయూసీ నేతలు తాటిపాక మధు -
పట్టుబట్టి.. తూర్పార బట్టి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్క్లబ్: కూటమి సర్కార్ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్ పాలనా తీరును వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం అనంతరం జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్మోహన్రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు. నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జీఎస్టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్న చైర్పర్సన్ విప్పర్తి. చిత్రంలో కలెక్టర్ షణ్మోహన్,, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావుసాగునీటి కొరత రాకుండా చర్యలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్ ప్లస్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్రాజ్, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం యూరియా కొరతపై గళం విప్పిన సభ్యులు నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత రంపచోడవరం మన్యంలో ప్రొటోకాల్పై చర్చ గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం -
వాల్మీకి జీవితం ఆదర్శనీయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే.భాస్కరరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా భాస్కర రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదని వాల్మీకి నిరూపించారన్నారు. సీపీఓ అప్పలకొండ మాట్లాడుతూ రామాయణం రచన ద్వారా సీతారాముల సద్గుణాలు, కుటుంబ విలువలు, పాలనా సూత్రాలు, సమాజ శ్రేయస్సు వంటి ఎన్నో జీవన సూత్రాలను వాల్మీకి మహర్షి అందించారన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి బి. శశాంక మాట్లాడుతూ రామాయణం సామాజిక నీతిని బోధించే గ్రంథం అని, వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో, ఏడు కాండలతో మానవాళికి అద్భుతమైన కావ్యాన్ని అందించారన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎన్.జ్యోతి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ముత్యాల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఘనంగా మహర్షి జయంతి -
అపశ్రుతులు అందుకేనా..?
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఎనిమిది నెలలుగా వివాదాల నడుమ వార్తల్లో నిలుస్తోంది. మూడు నెలలుగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడేళ్లుగా ఎటువంటి యాగాలు, కోటి తులసి పూజలు జరగకపోవడం, భక్తుని మృతి తర్వాత కూడా సంప్రోక్షణ పూజలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమనే అభిప్రాయం పండిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరిట.. సత్యదేవుని సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. వీరిలో కొందరు భక్తులు తెలిసో తెలియకో అశౌచం, ఇతర రాకూడని పరిస్థితుల్లో స్వామివారి సన్నిధికి వస్తుంటారు. ఇది అన్ని దేవస్థానాల్లో జరిగేదే. వైష్ణవాలయాల్లో పవిత్రోత్సవాల పేరుతో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు ప్రత్యేక పూజలు చేసి, ఆలయాన్ని శుద్ధి చేస్తుంటారు. తిరుమల తిరుమతి దేవస్థానం, సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో బ్రహ్మోత్సవాలకు ముంందు ఇటువంటి పూజలు చేస్తుంటారు. దీంతో ఆయా దేవస్థానాల్లో దుస్సంఘటల వల్ల ఏర్పడిన ప్రభావం పోయి మరలా పవిత్రత చేకూరుతుందనే నమ్మకం ఉంది. గతంలో యాగాలు, సంప్రోక్షణలు అన్నవరం దేవస్థానంలో కూడా గతంలో రెండేళ్లకోసారి మహానారాయణ యాగం, కోటి తులసి పూజలు నిర్వహించేవారు. చివరగా 2022 ఫిబ్రవరిలో సత్యదేవుని సన్నిధిన పది రోజులు కోటి తులసి పూజ నిర్వహించారు. దేవస్థానంలో భక్తుడు మరణిస్తే వెంటనే సంప్రోక్షణ పూజలు చేసేవారు. మృతదేహాన్ని తరలించిన మార్గంలో కొండ దిగువ వరకూ సంప్రోక్షణ చేసేవారు. దీంతో తిరిగి పవిత్రత నెలకొంటుందనే భావన ఉండేది. కొన్నాళ్లుగా దేవస్థానంలో ఇటువంటి యాగాలు, సంప్రోక్షణ పూజలు జరగలేదు. రెండు నెలల్లో దుస్సంఘటనలు ● రెండు నెలల క్రితం దేవస్థానంలోని సిక్స్ వీఐపీ సత్రంలో బస చేసిన భక్తుడు అపస్మారక స్థితిలో ఉండగా, కొండ దిగువన దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొండపైనే అతడు మృతి చెందాడని, ఉద్దేశపూర్వకంగా కొండదిగువన చనిపోయినట్టు ప్రకటించారని తర్వాత వెల్లడైంది. ● ఆగస్టు ఒకటో తేదీన దేవస్థానంలోని స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, హుటాహుటిన తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నవరం వచ్చి పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది. ● ఆగస్టు ఆరో తేదీన ప్రకాష్ సదన్ సత్రం వద్ద పార్కింగ్లో ఉంచిన సీఎన్జీ కారు దగ్ధమైంది. ఆ కారుతో పాటు పక్కనున్న మరో రెండు కార్లూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ● గత నెల 27వ తేదీన పశ్చిమ రాజగోపురం వద్ద ఫాన్సీ షాపు గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి రూ.పది లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. దేవస్థానం సెక్యూరిటీ అధికారులు సకాలంలో స్పందించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే మరిన్ని దుకాణాలకు మంటలు వ్యాపించి, ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండేది. ● ఈ నెల మూడో తేదీ రాత్రి విష్ణుసదన్ సత్రంలో మూడో అంతస్తు నుంచి తల్లీకుమారుడు కిందపడ్డారు. తల్లికి రెండు కాళ్లు విరగగా, కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కుమారుడికి స్పల్ప గాయాలయ్యాయి. ● ఇవే కాకుండా కొద్ది నెలలుగా అధికారుల వ్యవహార శైలి కారణంగా దేవస్థానం తరచూ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతుండగా, నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేస్తుంటారు. తెల్లవారుజామున రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. కార్తిక పౌర్ణిమ నాడు జరిగే గిరి ప్రదక్షిణలో మూడు లక్షలు మంది భక్తులు పాల్గొంటారు. అదే రోజు స్వామివారి ఆలయానికి లక్ష మంది వరకు విచ్చేస్తారు. ఈ నేపథ్యంలో కార్తిక మాసానికి ముందే దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు చేయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పండితులతో చర్చిస్తాం దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు జరిపించే విషయమై దేవస్థానం పండితులతో చర్చిస్తాం. అవసరమనుకుంటే కార్తిక మాసం కన్నా ముందుగానే చేయిస్తాం. – ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం రత్నగిరిపై వరుస దుస్సంఘటనలపై అనుమానాలు ఎనిమిది నెలలుగా దేవస్థానంలో పలు వివాదాలు మూడు నెలలుగా ప్రమాద ఘటనలు గతంలో రెండేళ్లకోసారి నారాయణ యాగం, కోటి తులసి పూజలు భక్తుడు మరణిస్తే సంప్రోక్షణ ఇప్పుడు అవి లేకనే దుష్ప్రభావాలంటూ అభిప్రాయాలు -
14 నుంచి ‘నన్నయ’లో ఫుడ్ ఫెస్టివల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన అధ్యాపకులతో సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని, గోదావరి రుచులను, అభిరుచులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఆహార పదార్థాల తయారీలో చేయితిరిగిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, తమ ప్రతిభను చాటాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల, హెచ్ఓడీ ఆచార్య డి.కల్యాణి, అధ్యాపకులు ఎంఎం కృష్ణవేణి, కె.సింధూజ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన గర్వకారణం
బాలాజీచెరువు (కాకినాడ): అంతర్జాతీయ వేదికపై శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు ప్రదర్శనలిచ్చి ప్రతిభ చూపడం గర్వకారణమని శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్(తాష్కెంట్)లో సాంస్కృతిక పర్యటన విజయవంతంగా పూర్తి చేసి, స్వదేశానికి వచ్చిన విద్యార్థుల బృందాన్ని సోమవారం అభినందించారు. కింగ్ లియర్, జూలియస్ సీజర్ వంటి క్లాసిక్ నాటకాలను అత్యున్నత స్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారన్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధ పరిషత్, స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రం సహకారంతో భారత రాయబార కార్యాలయం (అస్తానా, కజికిస్తాన్) సమన్వయంతో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు. విద్యార్థుల జీవితాల్లో ఇది స్ఫూర్తిదాయక మైలురాయి అవుతుందని విజయ్ ప్రకాష్ తెలిపారు. -
ఆటోను అటకాయించి దాడి
రాయవరం: వేకువజామున ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కొందరు వ్యక్తులు అటకాయించి, దాడి చేసినట్టు కేసు నమోదు చేశామని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు, మండలంలోని వి.సావరం గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణారావు ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం వేకువజామున 3.30 సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని ఆటో ఎక్కించుకునేందుకు మాచవరం వంతెన వద్దకు వచ్చాడు. ప్రయాణికులను ఎక్కించుకుని వి.సావరం వెళ్తున్న సమయంలో సోమేశ్వరం గ్రామం వద్ద అదే గ్రామానికి చెందిన శాకా వినయ్వంశీ ఆటోను అడ్డగించాడు. డ్రైవర్ౖ రామకృష్ణపై దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న ప్రయాణికురాలు అన్నపూర్ణపై కూడా దాడికి పాల్పడ్డాడు. వంశీతో పాటు, మరో ముగ్గురు కలిసి డ్రైవర్ రామకృష్ణ, అన్నపూర్ణతో దురుసుగా ప్రవర్తించారు. దాడికి గురైన రామకృష్ణ అనపర్తి ఆస్పత్రిలో చేరగా, ఆటోలో ప్రయాణిస్తున్న వారు మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై హెచ్సీ వీర్రాజు కేసు నమోదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ దొరరాజు తెలిపారు. భయంతో వణికిపోయాం రాయవరం పోలీస్స్టేషన్ వద్ద బాధితులు చింతపల్లి సత్యసాయి ప్రసన్న, అనుసూరి కీర్తన, అనుసూరి అన్నపూర్ణ, అనుసూరి శ్రీను తమ గోడును వెళ్లబోసుకున్నారు. శ్రీను, అన్నపూర్ణ, వారి కుమార్తెలు సత్యసాయిప్రసన్న, కీర్తనతో కలిసి హైదరాబాద్ నుంచి బస్సు దిగి మాచవరం వంతెన వద్ద ఆటో కోసం వేచిచూస్తున్న సమయంలో వినయ్వంశీ, మరో ముగ్గురు తమ వాహనంలోకి రావాలని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. ఈలోగా ఆటో రావడంతో, అందులో ఎక్కి వెళుతుండగా ఆ నలు గురూ వెంబడించి, ఆటోను అడ్డగించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అంతేకాకుండా అన్నపూర్ణపై వంశీ దాడి చేసి కొట్టాడన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.డ్రైవర్, ప్రయాణికులపై దురుసు ప్రవర్తన -
రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్ల పట్టివేత
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో సోమవారం మున్సిపల్ అధికారులు రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్లను పట్టుకున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణంలోని దుకాణాలకు వినియోగదారుల్లా వెళ్లి కవర్లు అడిగి తీసుకున్నారు. అనంతరం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వాణిమహల్ రోడ్ పాత విక్టరీ బజార్ ఎదురుగా ఉన్న హోల్సేల్ ప్లాస్టిక్ కవర్ల దుకాణంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలోని సిబ్బంది దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. -
అనారోగ్యంతో ఎంపీడీఓ కృష్ణగోపాల్ మృతి
కరప: కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరప ఎంపీడీఓ బి.కృష్ణగోపాల్(61) సోమవారం మృతి చెందారు. కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో ప్లానింగ్ సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి లభించడంతో గత నెల 19న ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారు. ఆయనకు భార్య, వివాహమైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు నాయకులు, అధికారులు సంతాపం తెలిపారు. బైక్ చోరీ కేసులో ఇద్దరికి జైలు గోపాలపురం: మోటార్ బైక్ చోరీ కేసులో ఇద్దరికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్టు ఎస్సై పి.మనోహర్ సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది అప్పటి ఎస్సై కర్రి సతీష్కుమార్ బైక్ చోరీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూలపల్లి శివసుబ్రహ్మణ్యం, మరపట్ల రాజ్కుమార్ను అరెస్టు చేశారు. నిందితులపై నేరం రుజువు కావడంతో, కొవ్వూరు సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కె.నాగలక్ష్మి వారికి జైలు శిక్ష విధించారు. తైక్వాండో పోటీలకు ఇద్దరి ఎంపిక రాజోలు: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు కోచ్ మణికుమార్ సోమవారం తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన అండర్–17 జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో వై.గంగాభవాని, హేమ సత్యశ్రీ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. స్థానిక ఎల్బీ నగర్లో జరిగిన కార్యక్రమంలో వీరిని మాజీ ఎమ్మెల్యే వేమా, జిల్లా ఒలింపిక్ సంఘ ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ తదితరులు అభినందించారు. -
దొంగ హల్చల్
నిడదవోలు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఆదివారం రాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. అసోం ప్రాంతానికి చెందిన యువకుడు రాత్రి 12 గంటల సమయంలో గోడ దూకి రెండంతస్తుల భవనంలోకి ప్రవేశించాడు. భవనంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో కర్ర తీసుకొచ్చిన యువకుడు తలుపులు, కిటికీలు కొడుతూ, హిందీలో తలుపు తీయాలని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ దంపతులు భయపడి పైన అద్దెకుంటున్న వారికి సమాచారమిచ్చారు. వారు కిందకొచ్చి పలువురు స్థానిక యువకుల సాయంతో దొంగను పట్టుకున్నారు. కర్రతో అతడు హల్చల్ చేయడంతో యువకులు అతడిని నిర్బంధించారు. కాళ్లూచేతులు కట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. నైట్బీట్లో ఒకే కానిస్టేబుల్ ఉండటంతో దొంగను తీసుకెళ్లడానికి తీవ్ర జాప్యం జరిగింది. స్థానికులు నిద్రపోకుండా దొంగకు కాపలాగా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ ఎస్సై సీహెచ్ పరమహంస అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. దొంగపై దాడి చేసిన యువకులపై ఎస్సై మండిపడ్డారు. ఈ క్రమంలో పలువురు మహిళలు ఎస్సైతో వాగ్వాదానికి దిగా రు. చివరకు వేకువజామున మూడు గంటల సమయంలో యువకులు దొంగను పోలీస్స్టేషన్కు అప్పగించారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు ఆ దొంగ మానసిన పరిస్థితిపై ఆరా తీశారు. అతడి మానసిక స్థితి బాగోలేకనే ఇలా చేశాడని, అసోంలో ఉన్న అతడి బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు -
ఆర్ఎంసీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను http: //rmckakinada.com వెబ్సైట్లో వారి పరిశీలనార్థం విడుదల చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో అభ్యంతరాలున్న వారితో పాటు, గతంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వారు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆర్ఎంసీ కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్గా సత్యనారాయణ కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్గా రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 28న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్గా పనిచేసున్న కె.ఆనందరావును అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆనందరావు స్థానంలో ఉమ్మడి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్చార్జి రిజిస్ట్రార్గా నియమించారు. ఆమె వ్యక్తిగత కారణాలతో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆమె స్థానంలో రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రెండు షాపుల్లో చోరీలు
అమలాపురం టౌన్: పట్టణంలోని ఎర్ర వంతెన వద్ద, బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండు చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఈదరపల్లి బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్ షాపు, స్థానిక ఎర్ర వంతెన సమీపంలోని కొల్లూరి బిల్డింగ్ మార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ షాపులో ఈ చోరీలు జరిగాయి. బైపాస్ రోడ్డులో కారులో వచ్చిన దొంగ.. షాపు షట్టర్లు పగులగొట్టి దోచుకున్నాడు. ఎర్ర వంతెన సమీపంలోని షాపు పైకప్పు పగులగొట్టి, లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. మరికొంత మంది దొంగలు ఇదే షాపు షట్టర్లు పగులగొట్టి మరీ షాపులోకి ప్రవేశించారు. ఈ షాపులో రూ.వేలల్లో నగదు, పది వైరు కట్టలు, ఇతర మెటీరియల్ను దోచుకున్నారు. బైపాస్ రోడ్డులోని పవన్ మారుతీ కేర్లో కొంత నగదును దొంగ తస్కరించాడు. సంఘటన స్థలాల్లో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. షాపు యాజమాని జయిన గణేష్, ఎర్ర వంతెన సమీపంలోని షాపు యాజమాని కొల్లూరి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఆయా షాపుల్లో చెరో రూ.25 వేల సొత్తు దొంగిలించినట్టు చెప్పారు. ఒకే రాత్రి రెండు షాపుల్లో దొంగలు చొరబడ్డారంటే పట్టణంలోకి వేరే ప్రాంతానికి చెందిన దొంగల ముఠా వచ్చిందని వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వ్యాపారి హత్య!
ఏలేశ్వరం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించడంతో పోలీసులు హత్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, అడ్డతీగల మండలం డి.కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు సీజనల్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల రెండో తేదీన దసరా కావడంతో ఏలేశ్వరంలో నివసిస్తున్న కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. దసరా రోజు కావడంతో బంగారు ఆభరణాలు ధరించి, కొంత నగదు తీసుకుని వేరే వ్యక్తితో కలిసి ఏజెన్సీకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజన సమయం దాటాక ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు కుమారుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు సమీపంలోని బొంతువలస ప్రాంతం వద్ద వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. మృతుడితో వెళ్లిన వ్యక్తిని పోలీసులు ఆరా తీయగా, విషయం బయటపడింది. మృతుడికి భార్య సత్యవతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏలేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 25 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు కూడా పాల్గొన్నారు. సారాపై ఫిర్యాదులకు 14405 కాల్ సెంటర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 14405 నంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయన్నారు. ఎకై ్సజ్, జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సారా నిర్మూలనకు జిల్లాలో 19 మండల స్థాయి, 240 గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమం కింద ఇప్పటివరకు 313 అవగాహన సమావేశాలు నిర్వహించామని, 63 మంది దత్తత అధికారులను నియమించామని జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్య తెలిపారు. కలెక్టర్ కీర్తి, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి లావణ్య, ఇతర అధికారులు కలిసి నవోదయం 2.0 – 14405 కాల్ సెంటర్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేడు జెడ్పీ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని కోరారు. -
సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 35 రోజులకు హుండీల ద్వారా రూ.1,48,77,755 రాబడి వచ్చింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,39,47,961, చిల్లర నాణేలు రూ.9,29,794 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. హుండీల ద్వారా 62 గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 76, ఇంగ్లండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 4, సౌదీ రియల్స్ 6, యుఏఈ దీరామ్స్ 20, ఖతార్ రియల్స్ 1, మలేషియా రింగిట్స్ 1 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు. గత 35 రోజులకు సరాసరి హుండీ ఆదాయం రూ.4.25 లక్షలుగా నమోదైంది. ఈ 35 రోజుల్లో 23 రోజులు భాద్రపదం కాగా, 12 రోజులు మాత్రమే ఆశ్వయుజ మాసం. దసరా సెలవుల్లో భక్తులు రత్నగిరికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడం కూడా హుండీ ఆదాయం పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓలతో పాటు సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించారు. -
సానుకూల దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కారం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ సీతారామమూర్తితో కలసి ప్రజల నుంచి ఆమె 149 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 78, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 24, హోం 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించి 10 చొప్పున అర్జీలు అందాయి. మరో 9 శాఖలకు సంబంధించి 26 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, మండల, డివిజన్ స్థాయి సమస్యలు జిల్లా స్థాయి గ్రీవెన్స్కు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఆయా స్థాయిల్లోనే పరిష్కరించాలని, దీనికి తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇక నుంచి అర్జీలపై అంశాలు, మండలాల వారీగా విశ్లేషిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చురుకుగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, ఈ శాఖలు తమ పని తీరు మెరుగు పరచుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నప్పుడు సంబంధిత భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, మ్యుటేషన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటలపై నత్తల సమస్యకు సంబంధించి మండలాల వారీగా రైతుల వద్ద సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయాలని కలెక్టర్ సూచించారు.