రైతుకు అరుదైన పురస్కారం | - | Sakshi
Sakshi News home page

రైతుకు అరుదైన పురస్కారం

Feb 10 2026 7:42 AM | Updated on Feb 10 2026 7:42 AM

రైతుకు అరుదైన పురస్కారం

రైతుకు అరుదైన పురస్కారం

రాజవొమ్మంగి: మండలంలోని కిండ్రకాలనీకి చెందిన రైతు గంపా నాగరాజుకు అరుదైన పురస్కారం దక్కింది. ఈ రైతు గ్రాండ్‌ నైన్‌ అనే అరటి సాగులో మంచి ఫలితాలు సాధించడంతో ఈ అవార్డు అందుకున్నారు. పంత్‌నగర్‌ (ఉత్తరాఖండ్‌) వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన అఖిల భారత పండ్ల సమన్వయ పథకం వార్షిక గ్రూప్‌ మీటింగ్‌లో నాగరాజుకు ఈ గౌరవం దక్కింది. ప్రాజెక్టు కోఆర్డినేటర్లు డాక్టర్‌ ఘోష్‌, ప్రకాష్‌ పాటిల్‌ తదితరులు నాగరాజును సత్కరించి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతు టిష్యూ కల్చర్‌ అరటి సాగులో సాంకేతిక సలహాలు ఇస్తూ, తనను ప్రోత్సహించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన వన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన్ని మండలంలోని రైతులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement