breaking news
East Godavari District News
-
ఉపాధి హామీకి.. రామ్రామ్
కపిలేశ్వరపురం/రాయవరం: రెండు దశాబ్దాలుగా గ్రామీణ నిరు పేదలకు ఉపాధి కల్పన.. వలసల నివారణకు ఎంతో ఉపయోగపడిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్) పేరు బుధవారం నుంచి మారుతోంది. ఇక నుంచి వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్జీ) పేరిట కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన పాత లక్ష్యాన్ని 100 శాతం మంగళవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపేదిగా ఉందని వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ ఉపాధి హామీ అందరూ ఉపాధి హామీ పథకంగా పిలుచుకునే ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ 2006లో ప్రారంభమైంది. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించాలనే డిమాండుతో రెండు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఈ పథకం అమలు ఉద్యమంలా సాగింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మరో అడుగు ముందుకేసి, వ్యవసాయ అనుబంధ, అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే కూలీలతో చేపట్టే వాటికి మొదటి స్థానం ఇచ్చారు. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి రోజూ లక్షలాది మంది ఉపాధి పొందేవారు. గత టీడీపీ, ప్రస్తుత కూటమి పాలనలో ఈ పథకాన్ని అక్రమాలకు నిలయంగా, అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపించేదిగా మార్చేశారు. కూలీలకు వేతన బకాయిలు పెట్టి నానా తిప్పలు పెట్టారు. చేసిన పనులు సైతం నాణ్యతా లోపంతో ఉండటం వివాదాస్పదమైంది. ఇవీ అభ్యంతరాలు వీబీ జీ రామ్జీలోని వివిధ అంశాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినప్పటికీ బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లేవు. దీంతో, ఈ పెంపు వలన ఎలాంటి ఉపయోగం ఉండదనే విమర్శ వస్తోంది. గతంలో మొత్తం వేతనాలను భరించడంతో పాటు, మెటీరియల్, నిర్వహణ వ్యయంలో 75 శాతం నిధులను కేంద్రం అందించేది. వీబీ జీ రామ్జీలో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపింది. పైగా చేపట్టిన పనులకు రాష్ట్రం 40 శాతం విడుదల చేస్తేనే కానీ కేంద్రం తన వాటా 60 శాతం నిధులు మంజూరు చేయదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వంద శాతం పనులు ఎలా జరుగుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీబీ జీ రామ్జీ.. మార్పులివీ.. ఉపాధి హామీ పథకం అమలుకు 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తోంది. వీబీ జీ రామ్జీలో కేంద్రం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తుంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఉపాధి హామీ పథకంలో నాలుగు కేటగిరీల్లో 269 రకాల పనులు చేపట్టేవారు. వీబీ జీ రామ్జీ ద్వారా దీనిని 318కు పెంచారు. ఉపాధి హామీలో ఒక్కో కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తూండగా.. నూతన చట్టంలో దీనిని 125 రోజులకు పెంచారు. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికీ 15 రోజుల్లోగా పని కల్పించాలి. లేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఎటువంటి జాప్యం లేకుండా శ్రామికులకు ప్రతి వారం క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే పరిహారం కూడా ఇవ్వాలి. నీటిపారుదల శాఖ అధీనంలోని చెరువుల పూడికతీత పనులను ఇప్పటి వరకూ ఉపాధి హామీ కింద చేసేవారు. ఇకపై ఆ ఖర్చులను ఆ శాఖే భరించాల్సి ఉంటుంది. పనులు, వేతనాలు, మస్టర్ల వివరాలు బహిర్గతం చేయాలి. ఆరు నెలలకోసారి సోషల్ ఆడిట్ తప్పనిసరి. మారిన పేరుతో త్వరలో జాబ్ కార్డులు జారీ చేయనున్నారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు అందజేస్తారు. వీబీ జీ రామ్జీ ఓ మాయ వీబీ జీ రామ్జీ పథకంలో పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతున్నామన్నది కేవలం మాయాజాలం మాత్రమే. ఇందులో 60 రోజుల ఉపాధి పనులను వ్యవసాయ పనుల సమయంలో కలెక్టర్ ఆదేశాలపై రద్దు చేసుకునే వీలు కల్పించారు. తద్వారా 60 రోజుల ఉపాధికి మంగళం పాడినట్టే. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఈ పథకాన్ని కేవలం ప్రచారానికి వాడుకోదలిచారు తప్ప ఇందులోని లొసుగులను ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వారి విధానం రాష్ట్రానికి నష్టదాయకం. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి, రాజమహేంద్రవరం జిల్లాలో ఉపాధి శ్రామికుల వివరాలు పంచాయతీలు 343 జాబ్ కార్డులు 1,83,000 యాక్టివ్ జాబ్కార్డుదారులు 1,40,000 ఉపాధి శ్రామికులు 2,80,000 యాక్టివ్ శ్రామికులు 1,96,000 ఉపాధి హామీ 20 ఏళ్ల ప్రస్థానం ముగింపు నేటి నుంచి వీబీ జీ రామ్జీగా మార్పు పని దినాలు 125కి పెంపు 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కొత్త నిబంధనలపై వివిధ వర్గాల పెదవి విరుపు -
డెల్టాలకు 9,593 క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు మంగళవారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది. నేటి నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ధవళేశ్వరం: వరదల సీజన్ ప్రారంభం కానుండటంతో ధవళేశ్వరం హెడ్వర్క్స్ కార్యాలయం వద్ద బుధవారం నుంచి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ పని చేయనుంది. ఇది అక్టోబర్ 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని హెడ్వర్క్స్ ఈఈ జి.శ్రీనివాసరావు తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలన్నా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను 0883–2417066 నంబరులో సంప్రదించాలని సూచించారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలి రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ మంగళవారం పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇంటర్మీడియెట్ విద్యాధికారిగా రాంబాబు బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారిగా జ్యోతుల రాంబాబు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ పని చేసిన వి.కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో, ఆయన స్థానంలో కాకినాడ పీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న రాంబాబును నియమించారు. ఆయనను పలువురు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. -
తూర్పుగోదావరి
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 20267● ప్రభుత్వాసుపత్రిలో భౌభౌప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ప్రస్తుతం వీధి కుక్కల ఆశ్రయ కేంద్రంగా మారినట్టు కనిపిస్తోంది. పలు వార్డుల్లో, ఆసుపత్రి ప్రాంగణంలో కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాటిని చూసి రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. జిల్లాకే పెద్దాసుపత్రి కావడంతో ఇక్కడకు ప్రతి రోజూ సుమారు 1,200 మంది అవుట్ పేషెంట్లు వస్తూంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఆసుపత్రిలో ఒకవేళ కుక్కలు దాడి చేస్తే పరిస్థితేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో వీధి కుక్కలు సంచరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, రోగులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. – కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
మ్యాక్స్పై ఆందోళన
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వందేళ్ల పైబడిన చరిత్ర, రూ.160 కోట్ల డిపాజిట్లు కలిగిన ది ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రమాదంలోకి నెట్టేందుకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు (బాబు), సీఈఓ, కొందరు డైరెక్టర్లు కుట్రలు చేస్తున్నారని ఆ బ్యాంకు డైరెక్టర్లు గుత్తుల భాస్కరరావు, అందనాపల్లి సత్యనారాయణ ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా 1964 సహకార చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (మ్యాక్స్) చట్టం–1995 లోకి మార్చేందుకు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, ప్రజలను, డిపాజిట్దార్లను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో, భయాందోళన చెందుతున్న కొంతమంది తమ డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని అన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మ్యాక్స్లోకి మారితే ప్రమాదం గుత్తుల భాస్కరరావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా చైర్మన్గా ఉన్న కోళ్ల బాబును ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా ఆర్బీఐ మే 25న నోటీసు జారీ చేసిందన్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, నోటీసుకు వ్యతిరేకంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారన్నారు. నాలుగు విడతలు చైర్మన్గా ఉన్న ఆయన బ్యాంకు అభివృద్ధికి చేసిందేమీ లేదని, ఆర్థిక వృద్ధి లేదని అన్నారు. నచ్చని ఉద్యోగులను అక్రమంగా తొలగిస్తూ, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా విధుల్లోకి చేరనివ్వడం లేదని చెప్పారు. జూన్ 18న జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి, 1964 సహకార చట్టం నుంచి మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు సభ్యుల సంతకాలను దుర్వినియోగం చేసేందుకు తెర వెనుక కుటిల యత్నాలు చేశారని ఆరోపించారు. గతంలో ఆయన నిర్వాకంతో సహకార శాఖ రూ.39.50 లక్షల సర్చార్జి విధించిందన్నారు. మ్యాక్స్ చట్టంలోకి మార్చడం వల్ల కోళ్ల బాబు శాశ్వత చైర్మన్గా ఉంటారని, డైరెక్టర్లు ఆయన ఇష్టానుసారం మారుతారని, కావాల్సిన వారికి ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చని, ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ ఉండదని, ఆర్బీఐ క్రమంగా పట్టించుకోవడం మానేస్తుందని అన్నారు. దీంతో, బ్యాంకు పాలన ఇష్టారాజ్యమవుతుందని, ఇంట్లోని వారికి కూడా ఇష్టం వచ్చినట్లు లోన్లు ఇచ్చుకునే ప్రమాదం ఉంటుందని అన్నారు. అదే జరిగితే, జయలక్ష్మి, కార్తికేయ, మిత్ర, కృషి, ధనా బ్యాంకుల సరసన చేరే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ దూరదృష్టి వల్ల నాడు ఎన్నికలు జరిగాయని, తిరిగి నేడు పతనావస్థ నుంచి బ్యాంకును కాపాడుకోగలిగామని అన్నారు. కోళ్లతో పాటు ఆర్బీఐ అనర్హులుగా గుర్తించిన డైరెక్టర్లు ఇకపై బ్యాంకుల్లో విధులు నిర్వహించవచ్చో లేదో సహకార శాఖ అధికారులు స్పష్టం చేయాలని గుత్తుల డిమాండ్ చేశారు. సహకార చట్టమే శ్రీరామరక్ష అందనాపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మ్యాక్స్ చట్టంలోకి మార్చే యత్నాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. బ్యాంకు నిర్వహణ సహకార చట్టంలో ఉండటం వల్ల ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుందని, కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. డిపాజిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యజ్జవరపు మరిడయ్య మాట్లాడుతూ, 40 ఏళ్లుగా సహకార బ్యాంకుల రంగంలో డైరెక్టర్గా, డిపాజిట్దారుగా ఉన్నానని చెప్పారు. సహకార బ్యాంకుల ఉద్దేశం దెబ్బ తినేలా కోళ్ల బాబుతో పాటు మరికొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదవి నుంచి తప్పుకోవాలని చైర్మన్కు ఆర్బీఐ చెప్పడంతో మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు ప్రయత్నించారన్నారు. గత నాలుగు విడతలుగా ఎన్నికలు జరపకుండానే కోళ్ల బ్యాంకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఒత్తిడితో గత్యంతరం లేక ఎన్నికలు పెట్టారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ సభ్యులు లేరని, హాజరైన సభ్యుల సంతకాలతో హైకోర్టును తప్పుతోవ పట్టించే కుటిల యత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం ఉద్యోగ నియమాకాలు చేపడుతున్నారని మరిడయ్య అన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో వావిలాల గోపాలకృష్ణయ్య మేనల్లుడు భువనగిరి వెంకటరమణ, బ్యాంకు నుంచి అక్రమంగా తొలగించిన మాజీ ఉద్యోగులు, డిపాజిట్దారులు పాల్గొన్నారు. బ్యాంకును చైర్మన్ ప్రమాదంలో పెడుతున్నారు ఆయనను తొలగిస్తూ మే 25నే ఆబీఐ నోటీసు గుట్టుగా హైకోర్టును ఆశ్రయించారు ‘ఇన్నీసుపేట బ్యాంకు’ డైరెక్టర్ల వెల్లడి -
ఎస్సై అయ్యే వేళ.. విషాదం
● గుండెపోటుతో రాజానగరం ఏఎస్సై మృతి ● మొక్కలకు నీరు పోస్తూ తుదిశ్వాస రాజమహేంద్రవరం రూరల్/రాజానగరం: ఎస్సై కావాలనుకున్న తన కల ఒక్క రోజులో నెరవేరుతుందనుకున్న వేళ.. ఊహించన విధంగా ఓ ఏఎస్సై హఠాత్తుగా మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పాత బొమ్మూరు మధురా నగర్కు చెందిన 1989 బ్యాచ్ కానిస్టేబుల్ ఎ.రాజా ప్రకాష్బాబు (59) రెండేళ్లుగా రాజానగరంలో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో 45 రోజుల పాటు ఎస్సై శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన.. ఏలూరు రేంజ్ కార్యాలయంలో బుధవారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో తన ఇంటి వద్ద మొక్కలకు మంగళవారం నీళ్లు పోస్తూండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రకాష్బాబు మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు 2019లో పట్టిసీమ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సైగా బాధ్యతలు చేపడతారని అనుకున్న ఆనంద సమయంలో ప్రకాష్బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న ప్రకాష్బాబు మృతదేహానికి పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. పోలీసు లాంఛనాలతో ప్రకాష్బాబు మృతదేహాన్ని ధవళేశ్వరంలో ఖననం చేశారు. యోగా ట్రైనర్గా.. ప్రకాష్బాబు పోలీసు వృత్తితో పాటు యోగా ట్రైనర్గా కూడా సేవలందిస్తున్నారు. పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణకు వచ్చే కానిస్టేబుళ్లకు యోగా శిక్షణ ఇచ్చేవారు. పోలీసు శాఖలో జాతీయ స్థాయిలో జరిగిన యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి మెడల్స్ కై వసం చేసుకున్నారు. ఎస్పీ సంతాపం ఏఎస్సై ప్రకాష్బాబు మృతి పట్ల ఎస్పీ డి.నరసింహ కిషోర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాఖాపరంగా ఆర్థిక సహాయాలు, సేవా సంబంధిత ప్రయోజనాలు ఎటువంటి జాప్యం లేకుండా ప్రకాష్బాబు కుటుంబానికి అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుని కుటుంబానికి పోలీసు సంక్షేమ నిధి ద్వారా అంత్యక్రియల ఖర్చులు, వితంతు నిధి, ఇతర వ్యయాల నిమిత్తం రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ప్రకాష్బాబు పార్ధివ దేహానికి పోలీసు అధికారులు పుష్పాంజలి ఘటించారు. -
బీఎల్ఓలు పూర్తి తటస్థంగా ఉండాలి
రాజమహేంద్రవరం రూరల్: బూత్ లెవెల్ అధికారులు (బీఎల్ఓ) పూర్తి తటస్థంగా వ్యవహరించాలని, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఢిల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. అనంతరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ)తో బీఎల్ఓలు సమన్వయం చేసుకుంటూ సర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ వివిధ కారణాలతో మ్యాపింగ్ కాని ఓటర్లను రాజకీయ పార్టీల సహకారంతో గుర్తించి, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అవసరమైతే అదనంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించి ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని తెలిపారు. సర్ విధుల్లో నిర్లక్ష్యం చూపే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. షోకాజ్ నోటీసు రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన స్వర్ణ గ్రామ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వీవీఎన్ఎస్ఎస్ఆర్కే సుధీర్ సర్ విధులకు హాజరు కాకపోవడం, కార్యాలయ ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, డీఆర్ఓ ఎస్.భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ ఉపసంహరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ పార్టీ బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పెట్టిన పీడీ యాక్ట్ను ఉపసంహరించాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ను వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కోరారు. ఈ మేరకు ఎస్పీని ఆయన కార్యాలయంలో మంగళవారం కలసి వినతిపత్రం అందజేశారు. నగరానికి చెందిన రామకృష్ణ తమ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడంతో ఆయనపై స్థానిక ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. రామకృష్ణను 12 కేసుల్లో ఇరికించడంతో పాటు రౌడీషీట్ కూడా తెరిచారన్నారు. ఈ కేసులు, రౌడీషీట్, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఈ మేరకు హైకోర్టు 10 కేసులు కొట్టివేసిందని, కేవలం రెండు కేసులు మిగిలాయని, వాటి ఆధారంగా ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు రామకృష్ణను వేధిస్తున్నారని తెలిపారు. స్థానిక 40వ వార్డులో అధికార పార్టీకి చెందిన రెండు గ్రూపుల మధ్య పేకాట, బ్రాకెట్ వంటి నేరపూరిత కార్యకలాపాల నిర్వహణలో విభేదాలు తలెత్తి కొట్టుకున్నారన్నారు. ఈ ఘర్షణలో ఒక వర్గం తలలు పగిలిపోగా, బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే, దెబ్బలు తిన్నవారిపై ఎమ్మెల్యే సానుభూతి చూపించి, న్యాయం చేయకపోగా తిరిగి వారిపై మరో కేసు నమోదు చేయించారని ఎస్పీకి భరత్ తెలిపారు. పైగా ఆ వార్డుతో పాటు నగరంలోని ఏ వార్డులోనూ వైఎస్సార్ సీపీ వారిని, చివరకు తనను సైతం తిరగనిచ్చేది లేదంటూ అధికార పార్టీ నాయకులు, అనుచరులు బహిరంగ సవాళ్లు చేసి, శాంతిభద్రతల సమస్య సృష్టించారన్నారు. ఈ నేపథ్యంలో శెట్టిబలిజ సంఘీయులు వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, సంఘ పెద్దలు తమ వర్గీయుడైన రామకృష్ణపై ఈవిధమైన చర్యలు సహించేది లేదని, ఆయనకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో కేసులతో సంబంధం లేకపోయినా పోలీసులు అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించి రామకృష్ణను సెంట్రల్ జైలుకు పంపించారని, దీంతో, ఆయన కుటుంబం ఇబ్బందుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన విజ్ఞప్తిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని భరత్రామ్ తెలిపారు. -
ఉత్తమ కథగా అడవి మల్లి
అనపర్తి: జీబీఆర్ కళాశాల గణిత ఐఐటీ ఫ్యాకల్టీ కొత్తపల్లి రవికుమార్ రచించిన అడవి మల్లి కథకు శ్రీమతి చల్లా సరోజనీదేవి స్మారక సంస్థ పురస్కారం లభించింది. ఈ మేరకు జూన్ 28న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రవికుమార్ పురస్కారం అందుకున్నారు. చల్లా భాను కిరణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రచయితలు ఆకెళ్ల రాఘవేంద్ర, గోపి చిరంజీవి, పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు, హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాగా.. రవి కుమార్ను జీబీఆర్ సంస్థల కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పీఎల్ఆర్ స్వామి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నల్లమిల్లి అబ్బాయిరెడ్డి అభినందించారు. -
వ్యాన్ బోల్తా పడి కూలీలకు గాయాలు
చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం ఎర్రంపేటలో ఇంటి నిర్మాణ పని కోసం భద్రాచలం నుంచి 10 మంది కూలీలు వ్యాన్లో బయలుదేరారు. వారి వాహనం సింగన్నగూడెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి 30పై పశువులు అడ్డుగా వచ్చాయి. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తా పడడంతో దానిలో పది మంది కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో వర్సా వీరభద్రం, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలానికి రిఫర్ చేశారు. అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ కాకినాడ క్రైం: కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల పరిధిలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ బిందుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథఫురానికి చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్, అనపర్తి మండలం బలభద్రపురానికి చెందిన గొర్రిపూడి వెంకట రమణ, కుతురులూరుకు చెందిన పాసి శేఖర్, తాడేపల్లిగూడెం కాకర్లమూడికి చెందిన గేదెల మహేష్తో పాటు ఓ బాలుడు రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరందరూ ఇప్పటివరకూ 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వారిని సోమవారం సాయంత్రం తూరంగి శివాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వారి విలువ సుమారు రూ.57 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను అభినందించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని టిప్పర్ దగ్ధం
నిడదవోలు రూరల్: మునిపల్లి గ్రామ శివారున మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభాన్ని టిప్పర్ ఢీకొని దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లి కృష్ణ ఐ.పంగిడి నుంచి నరసాపురానికి మెటల్ లోడ్తో వెళుతున్నాడు. మార్గం మధ్యలో నిద్రమత్తు కారణంగా లారీ అదుపు తప్పి మునిపల్లి రహదారి పక్కనే ఉన్న కోయిల వెంకటేష్కు చెందిన ప్రహరీతో పాటు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో లారీ బోల్తా పడింది. డీజిల్ ట్యాంకుపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్ కృష్ణను స్థానికులు బయటకు లాగారు. ఈ ఘటనలో అతడి కాలుకు తీవ్రగాయమైంది. గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి పెను విషాదం
సామర్లకోట: అది సామర్లకోట – కాకినాడ రహదారి. సోమవారం అర్ధరాత్రి సమయం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ సమయంలో కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. కంటైనర్లో మోటారు సైకిళ్లు, ట్రాలీపై భారీ యంత్ర పరికరం రవాణా అవుతున్నాయి. అయితే ట్రాలీపై యంత్ర పరికరానికి ఉన్న భారీ ఇనుప రాడ్డులు కంటైనర్ను చీల్చుకుంటూ పోయాయి. ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ సీటులోనే మృతి చెందాడు. సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని మధురై నుంచి కాకినాడ యమహా షోరూమ్కు కొత్త మోటారు సైకిళ్ల (యమహా ఎఫ్జెడ్)ను కంటైనర్ తీసుకువస్తోంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి రాజమహేంద్రవరం వైపునకు ఓ భారీ యంత్ర పరికరాన్ని ట్రాలీ తీసుకువెళుతున్నారు. ఆ భారీ యంత్ర పరికరానికి చివర నలువైపులా పొడవైన ఇనుప కడ్డీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామర్లకోట– కాకినాడ రోడ్డులో సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద కంటైనర్, ట్రాలీ ఎదురుపడ్డాయి. ముందుకు సాగు క్రమంలో కంటైనర్ డ్రైవర్ ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు ట్రాలీలోని యంత్ర పరికరానికి ఉన్న ఇసుక కడ్డీలు చీల్చుకుంటూ పోయాయి. ఈ ప్రమాదంలో కంటైనర్ సగం భాగం రెండుగా చీలిపోయింది. డ్రైవింగ్ సీటులో ఉన్న డ్రైవర్ షేర్ సింగ్ (45) అక్కడిక్కడే మృతి చెందాడు. రెండు భారీ వాహనాలు ఎదురు కావడం, చెట్ల కొమ్మలు తగ్గిలే అవకాశం ఉందని, రోడ్డు మార్జిన్ విడిచి వేగంగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో వెనుక వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ట్రాలీని సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ యార్డులోకి తరలించారు. ధ్వంసమైన కంటైనర్ను రోడ్డు మార్జిన్లోకి తీసుకువెళ్లారు. మోటారు సైకిళ్ల షోరూమ్ యజమానులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మరో కంటైనర్లో మోటారు సైకిళ్లు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. డ్రైవర్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఫ ప్రమాదానికి కారణమైన యంత్ర పరికరం ఫ కంటైనర్ను చీల్చుకుంటూ వెళ్లిపోయిన వైనం ఫ డైవర్ మృతి -
టీడీపీ నాయకుల ఇంటి వద్దనే బీఎల్వోలు
సామర్లకోట: బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద, పంచాయతీ కార్యాలయంలో కూర్చుని ఫారాలు పంపిణీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగ నాయకులు ఆరోపించారు. కొందరు బీఎల్వోలు పంచాయతీ కార్యాలయంలో ఫారాలు ఇస్తారని మైక్ ద్వారా ప్రచారం చేయడంతో అనేక మంది అక్కడకు వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని పార్టీల నాయకుల బూత్ లెవెల్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, వైఎస్సార్ సీపీ ఏజెంట్లకు మాత్రం సమాచారం ఇవ్వడం లేదన్నారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన సర్ సర్వే కార్యక్రమం ఏకపక్షంగా కొనసాగుతోందన్నారు. ఫారాల పంపిణీపై బీఎల్వోను ప్రశ్నిస్తే ఇళ్ల చిరునామాలు తెలియకపోవడంతో ఒక చోట ఉండి పంపిణీ చేస్తున్నామంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకుల చేతుల మీదుగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సోమవారం మేడపాడులో ఎమ్మెల్యే చినరాజప్ప, టీడీపీ నాయకులు ఫారాలు పంపిణీ చేశారని రంగనాయకులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా జి.మేడపాడులో నలుగురు బీఎల్వోలు ఉన్నారని, మండల పరిధిలో బీఎల్వోలతో సమావేశమై నిబంధనలు తెలియజేస్తానన్నారన్నారు. -
నేవీ లెఫ్టినెంట్గా తాళ్లపూడి యువకుడు
తాళ్లపూడి: దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ నేవల్ సర్వీస్ (భారత నౌకాదళం)లో తాళ్లపూడి యువకుడు గుడా విహాస్ సత్తా చాటాడు. తన ప్రతిభతో లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ శిక్షణలోనూ ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడిలోని సాయి స్ఫూర్తి ఆస్పత్రి సీఈవో గుడా విజయరాజు, మాజీ సర్పంచ్ హరిత రాణిల ఏకై క కుమారుడు విహాస్. కోరుకొండ సైనిక్ స్కూల్లో తన కెరీర్ను ప్రారంభించాడు. క్రమశిక్షణ, పట్టుదలతో అడుగులు వేస్తూ ఇండియన్ నేవీలో ప్రవేశించాడు. ఇటీవల మహారాష్ట్రలోని లుమావాలాలో గల ఐఎన్ఎస్ శివాజీ ట్రైనింగ్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశాడు. 101వ బ్యాచ్కు చెందిన ఈల్ రౌండ్ ఆఫీసర్ శిక్షణలో ఐదు దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో అత్యంత ప్రతిభను కనబరిచిన విహాస్ ఐదు విభాగాల్లో ద్వితీయ స్థానంతో పాటు, ప్రతిష్టాత్మకమైన ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డును అందుకుని భారత్ తరఫున సత్తా చాటాడు. మైరెన్ ఇంజినీర్గా, లెఫ్టినెంట్గా పదోన్నతి పొందడమే కాకుండా, తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో ఈ అరుదైన అవార్డును కై వసం చేసుకున్నారు. పూణేలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న విహాస్ తల్లిదండ్రులు విజయరాజు, హరిత రాణిలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేశం గర్వించే ఇండియన్ నేవీలో యుద్ధ నౌకకు లెఫ్టినెంట్గా తమ కుమారుడు బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. -
టూరెస్ట్ ప్రాజెక్టు
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ సమీపంలోని పిచ్చుక లంకలో తలపెట్టిన టూరిజం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు. దశాబ్దాల తరబడి పనులు జరగకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. తెలుగుదేశం పాలనలో 1988 ఏప్రిల్ 20న పిచ్చుక లంక రక్షకాభివృద్ధి పథకానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని చందంగా మారింది. దాదాపు 38 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇది ఆహ్లాదకరంగా, ఉపయోగకరంగా ఉంటుందని, పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించారు. రాబోయే పుష్కరాలు నాటికై నా ఇక్కడ టూరిస్ట్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనులు దాదాపు ముందుకు కదల్లేదనే చెప్పాలి. మధ్యలో కొద్దిగా మెరక చేసి వదిలేయడం మినహా ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఏమాత్రం పనులు చేపట్టలేదు. కనీసం చుట్టూ రక్షణ గోడను సైతం నిర్మించకపోవడం దారుణం. ఉపన్యాసాలే తప్ప.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. రాజమహేంద్రవరానికి కూత వేటు దూరంలోనే రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉంటున్నారు. ఆయనతో పాటు కూటమి నాయకులందరూ పిచ్చుకలంక అభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఆచరణలో చూపడం లేదు. పిచ్చుకలంకలో టూరిజం ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్థానిక యువత భావించారు. కానీ ఆ ఆశలన్నీ ఎండమావులుగా మారాయి. అధ్వానంగా.. ప్రస్తుతం పిచ్చుకలంకలో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. గతంలో టీడీపీ పాలనలో పిచ్చుకలంకలో వ్యవసాయ పరిశోధనా స్థానం నిర్మాణానికి సైతం శంకుస్థాపన శిలాఫలకం వేశారు. ఆ పనులకు ఇంతవరకు అతీగతీ లేదు. శిలాఫలకం ఆచూకీ కూడా దొరకడం లేదు. పైగా ఈ ప్రాంతంలో కొందరు దేశం నాయకులు బినామీలుగా అరటి తోటలు సాగు చేసుకుంటూ లబ్ధి పొందుతున్నాని సమాచారం. రాబోయే పుష్కరాల నాటికై నా పిచ్చుకలంక టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. {´ëgñæMýS$t MøçÜ… 1988ÌZ ˘ ఆవిష్కరించిన శిలాఫలకంపిచ్చుక లంక టూరిజం ప్రాజెక్టు కోసం కేటాయించిన ప్రాంతంఫ కలగా మిగిలిన పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు ఫ ముందుకు కదలని పనులు ఫ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన ఫ ఏళ్ల తరబడి ప్రజల ఎదురుచూపులు ఫ పట్టించుకోని పాలకులు -
లోవ ప్రాంగణంలో కొండచిలువల హల్చల్
తుని రూరల్: తలుపులమ్మ లోవ ప్రాంగణంలో కొండచిలువలు హల్చల్ చేశాయి. వాటిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. అమ్మవారి కొండ దిగువన ఉన్న పాకల వద్దకు సోమవారం మధ్యాహ్నం కొండచిలువ వచ్చింది. దాన్ని స్థానికులు గుర్తించి వెంటనే లోవ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. రాజు, సత్తిబాబు అనే ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని 15 అడుగులకు పైగా పొడవున్న కొండచిలువను పట్టుకున్నారు. ఈ క్రమంలో అది అటు ఇటూ తిరుగుతూ భక్తులను బెంబేలెత్తించింది. సిబ్బంది దాన్ని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. అదే రోజు రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి పది అడుగుల పొడవుగల మరో కొండ చిలువ రాజగోపురం మెట్లు దిగుతూ కనిపించింది. వెంటనే దీన్ని సైతం పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇలా ఒకే రోజు రెండు కొండ చిలువలు కనిపించడం, జూన్ రెండో తేదీన కూడా పాకల వద్ద ఓ కొండ చిలువ సంచరించడంపై ఆందోళన నెలకొంది. కాగా.. ఆహార అన్వేషణ, వాతావరణ మార్పులతో కొండ చిలువలు బయటకు వస్తున్నాయని, ఎవరైనా గమనిస్తే సమాచారం ఇవ్వాలని, కనీసం పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలని తుని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు సూచించారు. -
ఆశలు నెరవేరలేదు
పిచ్చుకలంక టూరిజం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. – కుండ అన్నపూర్ణ, ఆత్రేయపురం మండల పరిషత్ అధ్యక్షురాలు అభివృద్ధి చేయాలి పిచ్చుకలంకను అభివృద్ధి చేస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికి టూరిస్ట్ ప్రదేశంగా మారుతుంది. కూటమి నేతలు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికై నా పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. – గొట్టుముక్కల గోపాలకృష్ణంరాజు (గోపి), వైఎస్సార్ సీపీ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల నేత -
నాటకానికి తెర వేసిన సినిమా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వింటే భారతం వినాలి.... తింటే గారెలు తినాలి... చూస్తే సురభి నాటకాన్నే చూడాలి అనేది ఐదు దశాబ్దాల క్రితం మాట. సినిమా మాయాజాలం ప్రజలకు చేరువ కానప్పుడు నాటకమే ప్రేక్షకులకు వినోదాన్ని పంచేది. వాటిలో సురభి నాటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అప్పటి వరకు మన నాటకాలలో పద్యాలను రాగయుక్తంగా ఆలపించి శ్రోతలను అలరించేవారు. సురభి నాటకాలు వచ్చిన తరువాత నాటకాలు మరో స్టేజికి వెళ్లాయి. సురభి నాటకాలు ప్రదర్శిస్తుంటే ప్రేక్షకులు కళ్లుప్పగించే చూసేవారు. ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ సెట్టింగ్స్ అంతా మాయాలోకంలో విహరించే విధంగా ఉండేవి. నిజంగా కళ్ల ముందు ఆ మాయజాలం కనబడటంతో ప్రేక్షకులు మైమరచిపోయేవారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వేంటేశ్వర ఆనం కళాకేంద్రంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, నగరపాలక సంస్థ సౌజన్యంతో ఇటీవల శ్రీనివాస కల్యాణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో కళాకారులు పలు విషయాలను పంచుకున్నారు. స్పెషల్ ఎఫెక్ట్లకు నాంది రంగస్థలం మీద సెలయేళ్లు దూకినట్లు, లేళ్లు పరిగెత్తినట్లు, పక్షుల కిలకిలారావాలు, ఎలుగుబంట్లు నివసిస్తునట్లు, నారదుడు మేఘాల నుంచి కిందకు వచ్చినట్లు, సప్తసముద్రాల మీద నుంచి గండభేరుండం దాటినట్లు, గగనంలో ఆయుధాలతో పోరాడినట్లు, నిండు చంద్రుడు, నక్షతాలు విహరిస్తున్నట్లు, ఘటోత్కచుడు లడ్డూలు అరగిస్తున్నట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో అద్భుతాలు చూపించి ప్రదర్శించటంలో సురభి నాటక సమాజానికి మరెవ్వరూ సరిరారు. ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇప్పటికీ సురభి నాటకానికి ఆదరణ తగ్గలేదు. సురభి నాటకం బతకాలన్నా, సురభి నాటకాలు ప్రజలకు చేరువ కావాలన్నా ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉందని కళాకారులు అంటున్నారు. ఒక నాటకాన్ని ప్రదర్శించాంటే లారీ సెట్టింగ్స్ కావాలి. సురభి నటీనటులు 50 వరకు కావాలి. పాత్రలు లేని వారు తెరలు దించడం, ఎక్కించడం, రంగస్థలం అలంకరణ, లైటింగ్ అన్ని శాఖలు అందరూ చూస్తారు. విగ్గులు, కిరీటాలు రూపొందించడం, దుస్తులు కట్టడం వంటివి చేస్తారు. శ్రీవినాయక నాట్య మండలి(సురభి) 1925లో ఆర్.మోహన్రావు, ఆర్.వేణుగోపాల్రావు శ్రీవినాయక నాట్యమండలి(సురభి) పేరుతో ఒక నాట్య సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో 50 మంది కళకారులు ఉంటారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వీరిలో సీ్త్రలు 18 మంది పురుషులు 25 మంది పిల్లలు ఏడుగురు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో 2009లో టీటీడీ శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి సురభి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటీ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో 3 వేలకి పైగా నాటకాలను ప్రదర్శించారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో నాటకాన్ని ప్రదర్శించడమే కాకుండా నాటకం అయిపోయే వరుకు ఎటువంటి మద్య, మాంసాలను సైతం ముట్టుకోకుండా నియమ నిష్టలతో ప్రదర్శన కొనసాగిస్తారు. ఘటోత్కచుడు పాత్రలో మెప్పించిన వేణుగోపాల్రావు(ఫైల్) నాటకమే మా జీవనాధారం నాటకం ప్రదర్శించడం ఒకప్పుడు పండగలా ఉండేది. ఎంతోమంది దాతలు, ప్రజల సహకారంతో నాటక రంగం ఒక వెలుగు వెలిగింది. కాని నేడు అ పరిస్థితులు కనబడటం లేదు. నాటకం ప్రదర్శించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు పడవలసి వస్తోంది. ఖర్చులు పెరగడమే తప్ప రాబడి లేదు. ఖర్చులు అధికం ఆదాయం శూన్యంగా ఉంది. ప్రభుత్వం సహాకరించి సురభి నాటకోత్సవాల పేరుతో ఒక వారం రోజుల పాటు ప్రతి జిల్లాలో ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తే సురభి కళాకారులను ఆదుకున్నట్టు అవుతుంది. – సురభి వేణుగోపాల్రావు, శ్రీవినాయక నాట్యమండలి సురభి ప్రస్థానం సురభికి 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1850 పూర్వం మహారాష్ట్రకు చెందిన అరే మరాఠీలు ఆంధ్రరాష్ట్రానికి వలస వచ్చారు. వనావన గోవిందరావు సురభి నాటకాలకు ఆద్యుడు. కాలక్రమేణా వీరి కుటుంబం విస్తరించడం వల్ల మూడు శాఖలుగా విడిపోయింది. అందులో ఒక శాఖ సురభిగా వ్యవహారంలోకి వచ్చింది. ఛత్రపతి శివాజీ రాజ్యంలో సైనికులుగా ఉన్న వీరు రాయలసీమ ప్రాంతానికి వలస వచ్చారు. తోలుబొమ్మలాటను వృత్తిగా స్వీకరించారు. 1885లో కడప జిల్లాలో కీచకవధ నాటకంతో గోవిందరావు శ్రీకారం చుట్టారు. సురభి కంటే ముందు ప్రదర్శించే నాటకాల్లో సీ్త్ర పాత్రలు పురుషులే నిర్వహించేవారు. సురభి వచ్చిన తరువాత సురభి కటుంబానికి చెందిన కళాకారులు పాత్రలు పోషించేవారు. 70 ఏళ్ల వృద్ధుని నుంచి 3 నెలల పాప వరకు పాత్రలు పోషిస్తూ సన్నివేశానికి అనుగుణంగా నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఖర్చులు అధికం... ఆదాయం శూన్యం సినీ గ్రాఫిక్స్ను తలపించే సెట్టింగ్లు సురభి సొంతం భారీ సెట్టింగ్స్, లైటింగ్స్తో నాడు ప్రేక్షకులకు కనువిందు నేడు నాటకానికి తగ్గిన ప్రాధాన్యం అయినా మక్కువ తగ్గని సురభి కళాకారులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జైల్లో స్నేహితులు.. కలిసికట్టుగా చోరీలు
ఫ బైక్లు, హుండీ సొమ్ములను దొంగతనం చేస్తున్న ఐదుగురు యువకులు ఫ అరెస్ట్ చేసిన తాళ్లపూడి పోలీసులు తాళ్లపూడి: చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు వివిధ నేరాలపై జైలుకు వెళ్లారు. అక్కడ స్నేహితులుగా మారి, బయటకు వచ్చాక చోరీల బాట పట్టారు. ఈ క్రమంలో దేవాలయాల్లో హుండీలను పగలకొట్టి సొమ్మును చోరీ చేస్తున్న వారిని తాళ్లపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై టి.రామకృష్ణ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. గజ్జరంలోని ఆంజనేయస్వామి, రావూరుపాడు జంక్షన్లోని మేరీమాత ఆలయాల్లో హుండీలను ఇటీవల దొంగలు పగలకొట్టి సొమ్మును చోరీ చేశారు. ఆ మేరకు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో చేపట్టిన తనిఖీల్లో సోమవారం తాళ్లపూడిలో ఐదుగురు యువకులు పట్టుబడ్డారు. వీరు మోటారు సైకిళ్లను కూడా దొంగతనం చేస్తున్నట్టు గుర్తించి, వారి నుంచి రెండు బైక్లను, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి ఎన్టీఆర్ కాలనీకి చెందిన అయినవల్లి వినయ్ కుమార్, అయినవిల్లి అంజి, తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన కట్టుంగ దామోదరం (స్మైలీ సాయి), పెద్దేవంకు చెందిన బట్టు సంతోష్, కొవ్వూరు మండలం ధర్మవరానికి చెందిన బర్ల గౌతమ్గా నిందితులను గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. చెడు వ్యసనాలకు అలవాటు వీరందరూ పాత నేరస్తులు. జైలులో ఉన్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. జూలై 5న మలకపల్లికి చెందిన సాయి విడుదలైన తర్వాత కలిసికట్టుగా దొంగతనాలకు పాల్పడ్డారు. -
● చూడరేమిట్రీ!
రెండు నెలలుగా ఎండ తీవ్రతకు రోడ్ల పక్కన చెట్లు ఎండిపోయాయి. ఈ పరిస్థితి రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం పామర్రు – కె.గంగవరం, కుడుపూరు – పేకేరు, శివల – యర్రపోతవరం, దంగేరు – కుడుపూరు, కాజులూరు మండలం కుయ్యేరు – కాజులూరు, గొల్లపాలెం – ద్రాక్షారామ తదితర రహదారుల్లో ఉంది. రామచంద్రపురం మండలం పామర్రు – రామచంద్రపురం, తాడిగొయ్య – వెంకటయ్యపాలెం, హసన్బాద – వట్రపూడి వంటి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ఎండిపోయిన చెట్లు కోకొల్లలుగా ఉన్నాయి. ఇటీవల వీచిన భారీ గాలులకు ఎండిన చెట్లు నేలకొరిగాయి. ప్రమాదాలు జరగక ముందే ఈ ఎండిన చెట్లను తొలగించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు. –కె.గంగవరం దంగేరు – పేకేరు రహదారిలో ఎండిపోయిన చెట్లు -
ఊరే గోదారిలా..
రాజమహేంద్రవరం చెంతనే గోదావరి ఉందని అందరికీ తెలిసిందే. ఈ చిత్రాలు చూస్తే నగరంలోకి వచ్చిందా ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే.. సోమవారం ఉదయం కురిసిన వర్షానికి చేరిన ముంపునీరు ఇది. ఎటు చూసినా చుట్టేసింది.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి దాపురించింది. వర్షానికి హైటెక్ బస్ షెల్టర్, కంబాలచెరువు రోడ్డు, కోరుకొండ రోడ్డు, వీరభద్రపురం, రామచంద్రరావుపేట, కృష్ణానగర్, రైల్వే స్టేషన్ రోడ్డులో నీరు చేరింది. వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డులో వర్షపునీరుఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయ ప్రాంతంలో.. -
శ్రద్ధ వహించాలి
ఇటీవల కాలంలో చిన్నారుల్లో నేత్ర, దంత వైద్య సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలి. వారికి ఆరోగ్యకర ఆహారం అందించాలి. ఆరోగ్య సమస్యలు గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలి. – జి.హరిశ్చంద్రప్రసాద్, ఆర్బీఎస్కే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి వచ్చే నెల నుంచి పరీక్షలు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరంలోనూ పరీక్షలు చేస్తాం. వచ్చే నెల నుంచి ప్రారంభిస్తాం. జిల్లా సత్వర చికిత్సా కేంద్రం ద్వారా శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా చేయిస్తాం. – ఎన్.వసుంధర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, తూర్పుగోదావరి -
ప్రతిభ ఉంటే మెరికలే : కలెక్టర్
రంగంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన మార్గదర్శకం అందిస్తే మెరికల్లా తయారవుతారని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన రంగంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులను సోమవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గతేడాది అక్టోబర్ 18, 19 తేదీల్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సైన్స్ కాస్టిల్ ఆసియా అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో రంగంపేట పాఠశాల విద్యార్థిని ఆవుపాటి రమ్య సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా ఖండానికి చెందిన 10 దేశాల విద్యార్థులు గట్టి పోటీనిచ్చినప్పటికీ, రమ్య రూపొందించిన ప్రాజెక్టు ‘స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్’తో కాంస్య పతకం సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఈ వినూత్న ఆవిష్కరణ విద్యార్థుల నిజ జీవిత అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ కొనియాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘ఇండియన్ యంగ్ ఇన్నోవేటర్స్ అండ్ ఇన్వెన్షన్ చాలెంజ్’లో రంగంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు బి.పల్లవి, ఎం.జాహ్నవి రూపొందించిన ‘బయోమెట్రిక్ మెషీన్’ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి రజత పతకం లభించడంతో కలెక్టర్ అభినందించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎం వి.పార్ధసారథిని, గైడ్ చేసిన జీవశాస్త్ర ఉపాధ్యాయిని వి.రమ్యసుధను కూడా కలెక్టర్ అభినందించారు. -
కోతల ఆపరేషన్ మొదలు
గతంలో ఇంటికే రేషన్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి వృద్ధులు, వితంతువులు, రోగులతో పాటు లబ్ధిదారులందరి కోసం ఇంటింటికి రేషన్ సరకుల వాహనాన్ని పంపి ఇళ్ల వద్దే రేషన్ తీసుకునే పరిస్థితిని కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లే వాహనాలను రద్దు చేసి చౌక డిపోల వద్దకు వెళ్లే విధానాన్ని మళ్లీ అమలు చేసింది. ఇప్పటి వరకూ డీలర్లు తమ పరిధిలోని వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు రాలేని వారికి ఇళ్లకే రేషన్ సరకులు పంపించేవారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్లకే రేషన్ సరకులు తీసుకు వెళ్లే విధానాన్ని ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వర్తించేలా పరిమితులు విధించింది. ఇక నుంచి డీలర్ల అలా పంపుదామన్నా ప్రభుత్వం చౌక డిపోల సర్వర్లో ఆ ఆప్షన్ను ఈ నెల నుంచి తొలగించింది. కేవలం 65 ఏళ్లు దాటిన వారి ఇంటికి పంపేలా పాత విధానాన్ని కొనసాగించనుంది. డీలర్లు అక్రమాలకు పాల్పడున్నారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అమలాపురం టౌన్ /సీటీఆర్ఐ: వారందరూ ఆరు పదుల దాటిన వృద్ధులు, విధి వంచితులైన వితంతువులు, అనారోగ్యంతో ఇంట్లోంచి బయటకు రాలేని రోగులు. వీరికి ఇప్పటి వరకూ రేషన్ డిపోలకు వెళ్లకుండానే సరకులను డీలర్లు మానవతా దృక్పథంతో ఇళ్లకే అందించేవారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ నెల నుంచి వారికి రేషన్ సరకులు ఇళ్లకు రాకుండా పోతున్నాయి. ఇక నుంచి ప్రతి నెలా 1 నుంచి 15 వరకూ డిపోలకు వెళ్లి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆప్షన్ తొలగించి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోససీమ జిల్లాలోని 779 చౌక డిపోల్లో దాదాపు 3.59 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలోని 871 చౌక డిపోల్లో 6.5 లక్షలు, కాకినాడ జిల్లాలోని 1060 దుకాణాల్లో 6.50 లక్షల కార్డులు ఉన్నాయి. ప్రతి డిపో పరిధిలో ఇళ్లకే రేషన్ పంపించే కార్డులు 50కి తక్కువ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకు అంబాజీపేటలో ఓ వృద్ధ దంపతులు ఉన్నారు. వారిలో భర్తకు 70, భార్యకు 64 ఏళ్ల వయసు ఉంది. ఇంటి ఇల్లాలు పేరుతో రేషన్ కార్డు ఉంటుంది. సంబంధిత డీలరు వారికి రేషన్ను ఎప్పటిలాగే ఇంటికి పంపించేందుకు సర్వర్ ఓపెన్ చేయగా ఆప్షన్ చూపించలేదు. రేషన్ డిపోకు రమ్మంటున్నారు నా భార్య వయసు 64 ఏళ్లు, ఆమె పేరుతోనే రేషన్ కార్డు ఉంది. నాకు 70 ఏళ్లు నిండాయి. పైగా రోగిని కూడా. నా భార్యకు 64 ఏళ్లు కావడంతో డీలర్ సర్వర్లో ఆమెకు ఇంటికే రేషన్ ఇచ్చే ఆప్షన్ లేకుండా చేశారు. ప్రతి నెలా రేషన్ సరకులను ఇంటి వద్దే అందుకునే వాళ్లం. ఇక నుంచి డిపోకు రావాలని చెబుతున్నారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో స్పందించి నాలాంటి వృద్ధులు, రోగుల ఇళ్లకే రేషన్ సరకులను పంపించాలి. – పి.రామారావు, అంబాజీపేట 65 ఏళ్లు దాటిన వారికి మాత్రమే.. ఇక నుంచి 65 ఏళ్లు దాటిన వారి ఇళ్లకు మాత్రమే ప్రతి నెలా 26వ తేదీ నుంచి నెలాఖరు వరకూ రేషన్ డీలర్లు సరకులు పంపిస్తారు. మిగిలిన వారందరూ 1వ తేదీ నుంచి చౌక డిపోలకు వెళ్లి తీసుకోవాల్సిందే. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వితంతువులు, రోగులకు ఇంటికి అందించే ఆప్షన్ను సర్వర్ల నుంచి తొలగించారు. – అడపా ఉదయ భాస్కర్, పౌర సరఫరా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఫ 65 ఏళ్లు నిండితేనే ఇంటికి రేషన్ ఫ చంద్రబాబు ప్రభుత్వం కొత్త మెలిక ఫ ఇప్పటి వరకూ వితంతువులు, 60 ఏళ్లు నిండిన వారికి పంపిణీ ఫ ఇక నుంచి ఆ విధానం తొలగింపు ఫ చౌక డిపోల వద్దే తీసుకోవాలని ఆదేశం -
జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ అన్ని యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు నేషనల్ అవార్డ్స్ టు టీచర్ 2026కు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. దీనికి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అర్హులన్నారు. నేషనల్అవార్డ్స్టీచర్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులను జూలై 10వ తేదీ వరకూ సమర్పించవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం సీటీఆర్ఐ: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 209 అర్జీలు వచ్చాయి. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అందుతున్న ఫిర్యాదులు, వినతులు కేవలం నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వాటికి సత్వర పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కార మార్గం చూపాలన్నారు. 1100 టోల్ఫ్రీ నంబరు ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదులు చేవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 30 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 30 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆయనకు సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, సత్వరమే న్యాయం చేయాలని సూచించారు. అర్జీల్లో సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసుల గురించి ఉన్నాయి. 6 వరకు సహకార వారోత్సవాలు జిల్లా సహకార అధికారి వెంకటరమణ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా వ్యాప్తంగా ‘సహకార్ సే సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో సోమవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి ఎం.వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార రచ్చబండలో సభ్యులు, రైతులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత, సుస్థిర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించామన్నారు. మధ్యాహ్నం జిల్లాలోని 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఒకే రోజులో 10,700 మొక్కలు నాటామన్నారు. మంగళవారం మత్స్యకార సహకార సంఘాల కార్యక్రమాలు, ఇలా 6వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
తనిఖీలు పూర్తయ్యాకే బోట్లకు అనుమతి
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిలో పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లలో ఒక బోటుకు చిన్నపాటి మరమ్మతుల కారణంగా మొత్తం బోట్లను నిలిపివేశారని ‘సాక్షి’లో ‘పాపికొండల్లో పర్యాటంకం’ శీర్షికతో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్కుమార్ స్పందించారు. సోమవారం పోశమ్మగండి వద్ద పర్యాటక బోట్ల యాజమాన్యంతో కలసి సోమవారం ఆయన పర్యాటక బోట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పర్యాటకుల భద్రతే ప్రధానమని, దీనిని దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ కలిగిన వాటిపై జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రతి పర్యాటకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు. బోట్లలో పరిమితికి మించి ఎక్కించుకున్నా, పర్యాటకుల భద్రత విషయంలో నిర్ల్యక్షం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎస్డీపీఏ అష్రాఫ్ అలీ, తహసీల్దార్ సత్యనారాయణ, బోట్ల యజమానులు, టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రక్తమోడిన రహదారి
● వడిశలేరు సెంటర్లో ప్రమాదాలు ● నిమిషాల వ్యవధిలో రెండు ఘటనలు రంగంపేట: అసలే ప్రమాదకర కూడలి.. ఆపై ఒక్కసారిగా కురిసిన వర్షం.. వెరసి ఆదివారం సాయంత్రం రంగంపేట మండలం వడిశలేరు సెంటర్లో రక్తమోడింది. ఈ ఏడీబీ రోడ్డుపై నిమిషాల వ్యవధిలోనే జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. వడిశలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీను తన భార్య శశి, కుమార్తె లాస్యతో కలిసి బైక్పై రాజమహేంద్రవరం వెళ్లేందుకు బయలుదేరారు. వారు వడిసలేరు సెంటర్ దాటుతుండగా, అతి వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ వ్యాన్ వారి బైక్ను బలంగా ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, ఆయన భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తక్షణమే స్పందించి క్షతగాత్రులను రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన గూడ్స్ వ్యాన్ డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి, అనంతరం రంగంపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో ఘటనలో.. ఈ ప్రమాదం జరిగి స్థానికులు కోలుకోకముందే అదే సెంటర్లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కాకినాడ బీచ్ నుంచి నిడదవోలు వెళ్తున్న ఒక టెంపో వ్యాన్ వడిశలేరు సెంటర్ వద్దకు రాగానే అదుపు తప్పి, ఏడీబీ రోడ్డుపై ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ కూడలిలో అనేక ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోయినా, కాళ్లు చేతులు విరిగినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
తలుపులమ్మకు జేజేలు
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైన తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు ఆదివారం భక్తజనం తరలివచ్చింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీగా భక్తులు వచ్చారు. సుమారు 28 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో వంటలు చేసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పులిహోర, లడ్డూ ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,37,435, పూజా టిక్కెట్లకు రూ.4,78,904, తలనీలాలకు రూ.21,080, వాహన పూజలకు రూ.18,828, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.1,02,165, విరాళాలుగా రూ.19,987 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. -
గోదావడిలోకి బాల్యం
● నదిలో మునిగి ఇద్దరి మృతి ● సరదాగా స్నానం చేస్తుండగా ఘటన సీతానగరం: నవ్వుల పువ్వులు రాలిపోయాయి.. ఆటపాటల జ్ఞాపకాలు చెరిగిపోయాయి.. కన్నవారిలో తీరని విషాదాన్ని నింపాయి.. సరదాగా గోదావరిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఆ నది తనలోకి లాగేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సీతానగరం మండలం వెదుళ్లపల్లి పంచాయతీ పరిధి రాజంపేటకు చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (14), రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడుకు చెందిన అల్లు సాయిదుర్గా మహేష్ (14) రాజంపేట వద్ద గోదావరిలో నీట మునిగి మృతి చెందారు. వెదుళ్లపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో దుర్గాప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. తొర్రేడుకు చెందిన మహేష్ సీతానగరం మండలం కాటవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాజంపేటలో బంధువుల ఇంటికి మహేష్ వచ్చాడు. మధ్యాహ్నం వర్షం పడటంతో గోదావరి చూద్దామని దుర్గాప్రసాద్, మహేష్లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి ఏటిగట్టు పక్కన ఉన్న లంక భూమిలో క్రికెట్ను చూసి, అక్కడి నుంచి ఇసుక లారీలు వెళ్లడానికి వేసిన రోడ్డుపై నుంచి గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు ఒడ్డున కూర్చోగా, దుర్గాప్రసాద్, మహేష్లు గోదావరిలోకి దిగి కేరింతలు కొడుతూ ఈత కొట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ వారిద్దరూ గోదావరిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న విగతా ముగ్గురూ భయభ్రాంతులకు గురై పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు, మత్స్యకారులు గోదావరిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్గాప్రసాద్ తండ్రి వెంకటరమణ వ్యవసాయ కూలి. తల్లి శ్యామల, ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్న అక్క హేమసుధ ఉన్నారు. మహేష్ తండ్రి శ్రీను, తల్లి కలసి బోరున విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై టి.శ్యామ్సుందర్ తెలిపారు తాకట్టు పెట్టిన బంగారాన్ని మార్చేసి.. రామచంద్రపురం రూరల్: ప్రైవేట్ సంస్థలో బంగారం తాకట్టు పెడితే, ఆ స్థానంలో నకిలీ బంగారం పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ద్రాక్షారామ మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న 8 మంది ఖాతాదారుల తాలూకా ఆభరణాలను గతంలో పనిచేసిన మేనేజర్ ఎస్.మగేష్ దొంగిలించి, వాటి స్థానంలో నకిలీ బంగారం పెట్టి మోసానికి పాల్పడినట్లు ఇంటర్నల్ ఆడిట్లో గుర్తించారు. ఈ మేరకు ఏరియా మేనేజర్ పి.భానుప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. 8 మంది ఖాతాదారులకు సంబంధించిన సుమారు రూ.19,63,000 విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. -
ఈ పైనమేమిటో!
కష్టం వస్తే దేవుళ్లను కొలుస్తాం.. మమ్మల్ని చల్లంగ చూడాలని కోరుతాం.. అలాంటి అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లే భక్తులు ఇలా ప్రమాదపుటంచున ప్రయాణం సాగిస్తున్నారు. ఆదివారం తలుపులమ్మ లోవ అమ్మవారి దర్శనానికి వచ్చి, వెళ్లిన భక్తుల ప్రయాణ పదనిసలివి. లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోల్లో పరిమితికి మించి, నిబంధనలు విస్మరించి ప్రయాణించారు. ప్రమాదాలు జరగకముందే అంతా మేల్కొంటే మంచిది. – తుని రూరల్ -
దుంపముంచింది!
● కనుమరుగవుతున్న కర్రపెండలం ● పెరగని ధరతో సంక్షోభం ● 60 వేల నుంచి 5 వేల ఎకరాలకు పడిపోయిన సాగు రంగంపేట: ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి మెట్ట ప్రాంత రైతులకు బంగారు పంట కరప్రెండలం (టాపియోకా) సాగు. ఈ దుంప నేడు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. సగ్గు బియ్యం తయారీకి ప్రధాన ముడిసరుకై న ఈ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు సాగును పూర్తిగా వదిలేస్తున్నారు. ఒకప్పుడు 60 వేల ఎకరాల్లో ఉండా, గత ఏడాది 8 వేల ఎకరాలకు, ప్రస్తుతం కేవలం 5 వేల ఎకరాలకు పరిమితం కానుండడం పరిస్థితిని తెలియజేస్తోంది. 1965లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొందరు అభ్యుదయ రైతులు కరప్రెండలం విత్తనాన్ని తీసుకురావడంతో ఈ పంట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టింది. పదేళ్లలోనే 20 వేల ఎకరాలకు విస్తరించిన ఈ పంట, 2000 నాటికి రికార్డు స్థాయిలో 60 వేల ఎకరాలకు చేరుకుంది. రంగంపేట, పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, రాజానగరం, ప్రత్తిపాడు, రంపచోడవరం, గోకవరం, రాజవొమ్మంగి, కోటనందూరు తదితర 14 మండలాల్లో ఈ పంట విస్తరించడంతో జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఏర్పడ్డాయి. క్రమంగా సంక్షోభంలోకి.. 2010 తర్వాత కర్రపెండలం పంట క్రమంగా సంక్షోభంలోకి జారుకుంది. పంట మార్పిడి లేక ఎకరానికి 40 పుట్ల (ఒక పుట్టి– 225 కిలోలు) దిగుబడి 20 పుట్లకు పడిపోయింది. అదే సమయంలో పుట్టికి రూ.వెయ్యి నుంచి రూ.1,200 మాత్రమే ధర లభించడం, పామాయిల్ సాగు వేగంగా విస్తరించడంతో పెద్ద రైతులు దుంప సాగును పూర్తిగా వదిలేశారు. దీంతో 2015 నాటికి సాగు ఇరవై వేల ఎకరాలకు, 2020 నాటికి పది వేల ఎకరాలకు, 2025లో ఎనిమిది వేల ఎకరాలకు, ప్రస్తుతం ఐదు వేల ఎకరాలకు పడిపోయే పరిస్థితి వచ్చింది. మూతపడుతున్న మిల్లులు ఒకప్పుడు జిల్లాలో 45 సగ్గుబియ్యం మిల్లులు ఉండేవి. సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో ప్రస్తుతం 8 మిల్లులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే మిగిలిన మిల్లులూ మూతపడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర ప్రకటించడమే కాకుండా, అధిక దిగుబడినిచ్చే ఆధునిక విత్తనాలు సరఫరా చేయాలి. సగ్గుబియ్యం మిల్లర్లతో చర్చించి కనీస ధరను ఖరారు చేయాలి. రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. రైతన్నలకు ‘పంట’గ లేకుండా చేశారు.. కష్టాల కొరివి పెట్టారు.. సాగును దండగగా మార్చారు.. చివరికి బంగారు పంటగా భావించే కర్రపెండలం కంటిచూపునకు కనిపించకుండా చేస్తున్నారు. ఈ పంటకు గిట్టుబాటు ధర లేక, రైతులు ఆపసోపాలు పడుతున్నారు.. చేసేదిలేక సాగునే వదిలేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. గిట్టుబాటు ధర కల్పించాలి కర్రపెండలం దుంపకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. పదేళ్ల క్రితం ఇచ్చిన ధరే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలి. లేదంటే కర్రపెండలం పంట చరిత్రలో కలసిపోతుంది. –పుట్టా సోమన్నచౌదరి, గౌరవ అధ్యక్షుడు, జిల్లా దుంప రైతుల సంఘం బెధరగొట్టేలా.. ఎరువులు, కూలీల ఖర్చులు, సాగు వ్యయం రెట్టింపు అయినా.. కర్రపెండలం ధర మాత్రం పదేళ్లుగా పుట్టికి రూ.వెయ్యి దాటలేదు. ఈ పరిస్థితి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఈ ఏడాది పంట విరామం ప్రకటించడంతో మిల్లర్లు ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో సన్న, చిన్నకారు రైతులు మళ్లీ కొంతమేర సాగు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రంగంపేట మండలం సింగంపల్లి, దొడ్డిగుంట, వీరంపాలెం, కోటపాడు తదితర గ్రామాల్లో కర్రపెండలం నాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే గిట్టుబాటు ధరపై స్పష్టత లేక రైతులు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల పట్టు పోటీలు
ఆలమూరు: చొప్పెల్లలో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పట్టు పోటీలు జరిగాయి. గ్రామ దేవత శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన సుంకర వెంకట సాయినాథ్కు చెందిన ఎడ్లు ప్రథమ, రావులపాలెం మండలం ఊబలంక శివారు తోకలంకకు చెందిన గెడ్డం ప్రసాద్ ఎడ్లు ద్వితీయ, సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చంద్రాల శ్రీనివాస్ ఎడ్లు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నాయి. విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలను నిర్వాహకులు అందజేసి, సత్కరించారు. పోటీలను తిలకించేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. -
అక్రమాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?
ఐక్యత చాటుతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్రామ్, మార్గాని నాగేశ్వరరావు, కోడి ప్రవీణ్, వాసంశెట్టి గంగాధరరావు తదితరులు శెట్టిబలిజ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని.. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజ సామాజిక వర్గీయుడైన వైఎస్సార్ సీపీ నగర బీసీ సెల్ చైర్మన్ పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ అక్రమంగా నమోదు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని శ్రీగ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అధ్యక్షతన శెట్టిబలిజ సంఘీయుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒత్తిడితో పీతా రామకృష్ణపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించడం దారుణమని సమావేశం పేర్కొంది. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉద్యమాలు చేసేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తే, దేశంలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు. పీడీ యాక్ట్ను ఉపసంహరించుకోకపోతే శెట్టిబలిజ సంఘీయులంతా ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి, లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలు రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు కుట్రలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్రావు మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజల పక్షాన పోరాడుతున్న యువ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఐక్యంగా పోరాటం చేద్దాం వైఎస్సార్ సీపీ నాయకుడు కోడి ప్రవీణ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఐకమత్యంగా పోరాటం చేద్దామన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ముఖ్యంగా రామకృష్ణకు అన్యాయం జరిగిందని, శెట్టిబలిజ సంఘీయులు ఐక్యంగా ఉంటే కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. అమరావతిలో రైతుల పక్షాన నిలబడిన వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకోవడమే కాకుండా, అధికార పార్టీ గుండాలతో రాళ్ల దాడితో చేయించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు తేటతెల్లమవుతున్నాయని అన్నారు. నగరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కక్ష సాధింపు చర్యలు మితిమీరాయని, ఈ రెండేళ్లలో తనపై 17 అక్రమ కేసులు పెట్టారనీ భరత్రామ్ అన్నారు. ఇలా తన పాస్పోర్ట్ను కూడా నిలిపివేయించారన్నారు. కళా, సాంస్కృతిక చారిత్రాత్మక నగరమైన రాజమహేంద్రవరంలో ఎప్పుడూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చూడలేదన్నారు. రామకృష్ణపై పెట్టిన అక్రమ పీడీ యాక్ట్ విషయమై హైకోర్టులో సవాల్ చేస్తానని, న్యాయ పోరాటం చేస్తానని, అతని కుటుంబానికి అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్రేట్లో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశానని.. జిల్లా కలెక్టర్ సంబంధిత డీఎస్సీని వివరణ కోరగా ఆయన సమాధానం చెప్పలేకపోయారన్నారు. సమావేశంలో న్యాయవాది ఇళ్లా భాస్కరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు, శెట్టిబలిజ సంఘీయులు పెద్దఎత్తున హాజరయ్యారు. పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాబోయే రోజుల్లో సిటీ ఎమ్మెల్యేకు గుణపాఠం చెబుతాం మాజీ ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో శెట్టిబలిజల రౌండ్ టేబుల్ సమావేశం -
ఖండాంతరాలు దాటిన శ్రాద్ధకర్మ
● డేవిడ్కు అభిమానుల నిర్వహణ ● వీడియో కాల్లో వీక్షించిన కుటుంబ సభ్యులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే, వారికి వారసులు కానీ, బంధువులు కానీ శ్రాద్ధకర్మలు చేయడం ఆచారం. కానీ ఎక్కడో విదేశాల్లో ఉండే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన అభిమానులు శ్రాద్ధకర్మ నిర్వహించడం ప్రత్యేకతను చాటింది. ఆదివారం రాజమహేంద్రవరం గోదావరి కోటిలింగాల ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పితృకర్మలు, శ్రాద్ధం వంటి హిందూ సంస్కృతిలోని లోతైన అంశాలపై దాదాపు 40 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా అధ్యయనం చేసి, వాటిపై అనేక గ్రంథాలను రచించిన డేవిడ్ ఈ నెల జూలై 4న యూఎస్ఏలోని వర్జినియాలో కన్నుమూశారు. ఆయన ఓ సంస్కృత పండితుడు. ప్రకృతి, సృష్టి ధర్మాల్లో ప్రధానమైన క్రతువులు, యజ్ఞ యాగాదులు నిర్వహించే నిత్య అగ్నిహోత్రుల గురించి డేవిడ్ ఎంతో పరిశోధన చేశారు. దాదాపు 3 వేల ఏళ్లగా యజ్ఞం, యాగం నిర్వహణలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోకుండా ఆ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తూ వస్తున్న అగ్నిహోత్రుల గురించి, యాగ పండితుల గురించి అనేక పుస్తకాలను రచించి ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఓ విదేశీయుడుగా కేవలం గ్రంథాలు చదవకుండా శ్మశానంలో దిగి చితి దగ్గర కూర్చుని కర్మలను డాక్యుమెంట్ చేశారు. ఇది హిందూ మతంపై పాశ్చాత్యులకు ఉన్న అపోహలను తొలగించింది. రాజమహేంద్రవరం, కోనసీమకు చెందిన శ్రీరామపురం అగ్రహారం, నేదునూరు వ్యాఘ్రేశ్వరం, ఇరగవరంలలో పనిచేసిన ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు కోటిలింగాల రేవులో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. డేవిడ్ శ్రాద్ధ కర్మలను యూఎస్ఏలో ఉన్న ఆయన భార్య సుసాన్, కుమార్తె నికోల వీడియో కాల్లో తిలకించారు. -
ఉపాధ్యాయులకు సర్దుపోటు
రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ల నియామకానికి విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు ఎన్రోల్మెంట్ ప్రక్రియ జరుగుతూండగా.. మరోవైపు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్దుబాటు చేయడంపై టీచర్లు, ఉపాధ్యాయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడంతో ఉపాధ్యాయ పోస్టులను భారీగా సర్దుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను, విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ (మిగులు) అయ్యే అవకాశం ఉండటం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. ఈ నెల 30వ తేదీ ఎన్రోల్మెంట్ ప్రాతిపదికగా సర్దుబాటు ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ ఇలా.. ఫ గత ఏడాది జారీ చేసిన జీఓ–21, 33 ప్రకారం 121 మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఒక హెచ్ఎం, ఐదుగురు ఎస్జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది దీనిని 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే, గతంలో మాదిరిగానే 120 మంది విద్యార్థులకు 1+5 విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫ స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) విషయానికి వస్తే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 10 మంది విద్యార్థులకు ఒక ఎస్ఏ, 11 నుంచి 30 వరకూ ఇద్దరు, 31 నుంచి 140 వరకూ నలుగురు, 141 నుంచి 175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్ఏలు ఉండేలా సర్దుబాటు చేయాలని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఫ ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు జీహెచ్ఎం సహా 8 మంది ఎస్ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్ల వరకూ 12 మంది, 8 సెక్షన్ల వరకూ 13 మంది, 9, 10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది చొప్పున ఎస్ఏలను మంజూరు చేశారు. ఈవిధంగా 25 సెక్షన్లకు జీహెచ్ఎంతో కలిపి 31 ఎస్ఏ పోస్టులు మంజూరు చేస్తారు. ఫ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, జీహెచ్ఎంలు వర్క్ అడ్జస్ట్మెంట్ పరిధిలోకి రారు. నిబంధనలు సడలించాలి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో 15 నుంచి 20 మంది విద్యార్థులుంటే కచ్చితంగా ఇద్దరు ఎస్జీటీలను ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలి. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ నూతన నిబంధనల ప్రకారం విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ఫౌండేషన్ స్కూల్స్ విద్యార్థుల పీఎస్ ఎస్జీటీ సంఖ్య హెచ్ఎం 1–20 0 1 21–60 0 2 బేసిక్ ప్రైమరీ స్కూల్స్ 1–20 0 1 21–59 0 2 60–150 1 4 బేసిక్ ప్రైమరీ సెక్షన్స్ ఇన్ హైస్కూల్స్ 1–10 0 1 11–30 0 3 31–59 1 3 మోడల్ ప్రైమరీ స్కూల్స్ 1–20 0 1 21–39 1 2 40–59 1 3 60–150 1 4 151–180 1 5 181–210 1 6 211–240 1 7 241–270 1 8 కటాఫ్ డేట్ పెంచాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5,600 వరకూ ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులున్నారు. సాధారణంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం పరిపాటి. ఇతర పాఠశాలల నుంచి బదిలీలు, రిలీజ్ రిక్వెస్ట్లు ఇంకా పెండింగ్లో ఉండగానే సర్దుబాటు చేపట్టడం వలన విద్యార్థులకు నష్టం జరుగుతుందనేది ఉపాధ్యాయుల వాదన. ఇప్పటికే జిల్లా విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంఈఓలు సర్దుబాటు ప్రక్రియలో తలమునకలయ్యారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ విద్యార్థుల నమోదు ప్రాతిపదికగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలని ఉన్నతాధికారులు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సెలింగ్ ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, ఈ నెల 30వ తేదీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను ప్రాతిపదికగా తీసుకుంటే జూలై మొదటి వారంలో సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. తిరిగి స్పష్టమైన ఆదేశాలతో షెడ్యూల్ ప్రకటిస్తే, ఆ ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఫ ఈ నెల 20వ తేదీ అడ్మిషన్ల ఆధారంగా ఉత్తర్వులు ఫ 30వ తేదీ ప్రాతిపదికగా తీసుకోవాలని టీచర్ల డిమాండ్ జూలై 31 రోల్ అధారంగా.. అడ్మిషన్లు కొనసాగుతూండగానే అత్యవసరంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం తగదు. జూలై 31 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాలి. హడావుడిగా టీచర్లను సర్దుబాటు చేయడం వలన విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. – జీవీ రమణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు
లోకమంతా అన్నదాత అని కీర్తిస్తుండగా చంద్రబాబు మాత్రం కొత్తగా ఆలోచించండంటూ రైతుకు సూచనలు చేస్తున్నారు. వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందులను ఈ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్నారు. – కొవ్వూరి త్రినాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, పసలపూడి, రాయవరం మండలం గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయం ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. సాగు ఖర్చుల కంటే ధాన్యం అమ్మితే వచ్చేది తక్కువ. ఎప్పటికై నా కష్టానికి ప్రతిఫలం దక్కకపోతుందా అన్న ఆశతో వ్యవసాయం చేస్తున్నాం. కనుచూపు మేరలో అది కానరావడం లేదు. – కరెడ్ల శ్రీనివాసబాబు, రైతు, మాచర, కపిలేశ్వరపురం మండలం -
పల్స్పోలియో 83.94 శాతం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పల్స్పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ఒక్క రోజు మొత్తం 1,73,581 మంది చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి బి.శ్రీదేవి తెలిపారు. మొత్తం 83.94 శాతం చిన్నారులకు మందు అందించామన్నారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారని తెలిపారు. గతంలో పోలియో చుక్కలు వేయించినా ఇప్పుడు మరోసారి అదనంగా వేయించి, పిల్లలకు అంగవైకల్యం రాకుండా కాపాడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వసుంధర కోరారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పద్మా శశిధర్, డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి టీవీ చలపతిరావు, డీపీఎంఓ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. నేడు ఏపీ జేఏసీ అమరావతి సమావేశం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపాన ఉన్న రెవెన్యూ భవనంలో జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములుగా ఉన్న వివిధ ఉద్యోగ సంఘాల జిల్లా, డివిజన్ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎం.కాంతిప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏఆర్ శివకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ సమావేశానికి అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. 7 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు వై.రామవరం: మండలంలోని గుర్తేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సుమారు రూ.3.5 లక్షల విలువైన 7 కిలోల గంజాయిని గుర్తేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజకోటి తెలిపిన వివరాల మేరకు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు మండలం జి.కొత్తూరు గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నరసారావుపేటకు చెందిన రాజనాల కోటిరెడ్డి (62) ఈ సరకుతో పట్టుబడ్డాడు. సరకును దారకొండ నుంచి గుర్తేడు మీదుగా నరసారావుపేట తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు, గంజాయితో పాటు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. -
ఏరువాక .. సాగులేక
కపిలేశ్వరపురం: అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే ఏరువాక పౌర్ణమి (జ్యేష్ట మాస పౌర్ణమి) నేడు. గతంలో ఏరువాక పౌర్ణమిని రైతులు పండగలా.. ఎంతో కోలాహలంగా చేసేవారు. కానీ, రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేకపోవడంతో అన్నదాతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 7,62,195 ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వారికి ఆదిలోనే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఎన్నో ప్రతిబంధకాలు ● ముందస్తు సాగు కోసం ఈ నెల ఒకటో తేదీనే సాగునీరు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. కానీ, 28 రోజులైనా క్షేత్ర స్థాయిలో పొలాలకు నీరందని పరిస్థితి. సెంట్రల్ డెల్టాలో కాలువలపై పలు వంతెనలు నిర్మిస్తూండటంతో నీటిపారుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తూర్పు డెల్టాలోని మండపేట, కోరంగి కాలువల్లోనూ అదే పరిస్థితి. ● జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు ఏటా పంటల వారీగా రుణ పరిమితిని (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) నిర్ణయిస్తాయి. ఒక ఎకరా లేదా హెక్టార్ సాగుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి, పంటను బట్టి రైతులు ఎకరాకు ఎంత రుణం పొందవచ్చో దీని ద్వారా నిర్ణయిస్తారు. ఇది ప్రస్తుత ఖరీఫ్లో ఉమ్మడి జిల్లాలో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేల వరకూ నిర్ధారించారు. కానీ, రైతులకు పంట రుణాలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఉదాహరణకు గడచిన రబీ సీజన్లో కాకినాడలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులకు రూ.914 కోట్ల మేర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.160 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ దృష్ట్యా ఈసారి కూడా తమకు రుణాలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి ఉండకపోవచ్చని, ప్రైవేటుగా అధిక వడ్డీలకే అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి దానిని రూ.14 వేలకు కుదించారు. అది కూడా చాలా మంది రైతులకు ఎగ్గొట్టారు. కౌలు రైతులకై తే పూర్తిగా ఎగనామం పెట్టారు. ● గత ఏడాది చివరిలో మోంథా, దిత్వా తుపాన్లు సంభవించాయి. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని 40,860 ఎకరాల్లో 33,262 మంది రైతులకు చెందిన వివిధ పంటలు దెబ్బ తిని, రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కాకినాడ జిల్లాలోని సుమారు 52 వేల ఎకరాల్లో 46,900 మంది రైతులకు రూ.57.21 కోట్లు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు 73 వేల ఎకరాల్లో దాదాపు 41 వేల మంది రైతులకు రూ.73.86 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం అందించలేదు. ● మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. సూపర్ ఫాస్ఫేట్ బస్తా రూ.500 నుంచి రూ.700కు పెంచారు., పొటాష్ రూ.1,800 నుంచి రూ.1,975కు, కాంప్లెక్స్ ఎరువులు రూ.1,300 నుంచి రూ.1,600 వరకూ పెరిగాయి. పైగా, ఈ ఏడాది నుంచి ఎరువుల పంపిణీకి ప్రభుత్వాలు యాప్లు తీసుకొచ్చాయి. దీని ద్వారా ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే అది కూడా మూడు విడతలుగా ఇస్తామని చెబుతున్నారు. అంటే, అంతకంటే ఎక్కువగా ఎరువులు అవసరమైన రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ప్రభుత్వాలు ఈ విధానం అమలు చేస్తున్నాయని రైతు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.50 మాత్రమే పెంచారు. ధరల భారంతో పాటు క్షేత్రస్థాయిలో దళారులు గద్దల్లా వాలిపోతూండటంతో.. మద్దతు ధర లభించక, ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ నష్టపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత పంటల బీమా అందించింది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. గత సీజన్లో హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు రూ.1,575 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాది మంది రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగిన పంట నష్టానికి బీమా పరిహారం అందక కుదేలవుతున్నారు. ప్రభుత్వం తీరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్రాన్ని బ్లాక్లిస్టులో పెట్టాయి. ● ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరిని అన్నివిధాలా ఆదుకునేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాలో 59,282, తూర్పు గోదావరి జిల్లాలో 1,15,718, కాకినాడ జిల్లాలో సుమారు 70 వేలు, పోలవరం జిల్లాలో వెయ్యి మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న లక్ష్యం అమలుకు దూరంగా ఉంది. తమకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకమూ అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సాగు వివరాలు.. జిల్లా వరి సాగు విస్తీర్ణం (ఎకరాలో)్ల తూర్పు గోదావరి 2,40,000 కాకినాడ 2,36,435 కోనసీమ 1,68,760 పోలవరం 1,17,000 (అన్ని పంటలు) ఫ దోబూచులాడుతున్న రుతుపవనాలు ఫ పెరిగిన సాగు ఖర్చు ఫ అందని ప్రభుత్వ సాయం ఫ నేడు ఏరువాక పౌర్ణమి ఫ రైతుల్లో నిర్వేదం -
ముద్రగడ ఆరోగ్యం కోసం మహా మృత్యుంజయ హోమం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసి సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యాన మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. గోదావరి గట్టున శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఈ హోమం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, హైదరాబాద్లోని ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందుతున్నారని, ఆయనకు అందుతున్న వైద్య సేవలపై ప్రజలు ఎటువంటి అపో హా పడవద్దని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రముఖ సూపర్ స్పెషలిస్ట్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నీతి నిజాయితీ గల నాయకుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకోవాలని ఈ హోమం నిర్వహించామని అన్నారు. -
మ్యాక్స్మమ్ బ్రేక్
ఫ ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే యత్నం ఫ వాయిదా వేసుకోవాలని సహకార అధికారి ఆదేశం ఫ అయినా పట్టించుకోని పాలకవర్గం ఫ అజెండాలో నంబర్ మార్చి, ఏమార్చేందుకు కుయుక్తి ఫ మహాజన సభలో అడ్డుకున్న సీనియర్ సభ్యులు ఫ ఈ వ్యవహారంపై హైకోర్టుకు.. ఫ కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామన్న చైర్మన్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నగరంలో 114 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రస్తుతం ఉన్న సహకార సంఘం చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టంలోకి మార్చేందుకు జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజమహేంద్రవరంలోని అల్యూమినియం అసోసియేషన్ హాలులో బ్యాంకు 108వ సాధారణ మహాజన సభ ఆదివారం జరిగింది. బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే అంశంపై అజెండాలో తొలుత 7వ నంబరులో ఉన్న అంశాన్ని 15వ నంబరుకు మార్చారు. సభ్యులకు నజరానాలు పంచారు. తద్వారా మ్యాక్స్ చట్టంలోకి బ్యాంకు మారేలా సభ్యుల ఆమోదం పొందేందుకు చైర్మన్, పలువురు పాలకవర్గ సభ్యులు ప్రయత్నించారు. వారి తీరుపై సీనియర్ సభ్యులు మండిపడ్డారు. దీంతో, మహాజన సభ రసాభాసగా మారింది. మ్యాక్స్ చట్టం వలన సభ్యులు తీవ్రంగా నష్టపోతారని, పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఏర్పడుతుందని సీనియర్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముందుగా సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. బ్యాంకు ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్షన్ 12(3) కింద మూడింట రెండు వంతుల సభ్యుల సమ్మతి ఉండాలని, కానీ, మహాజన సభకు 70 మంది కూడా రాలేదని చెప్పారు. మ్యాక్స్ చట్టం వలన బ్యాంకు అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుందని, దీనిపై పాలకవర్గ సభ్యులకు సైతం తెలపలేదని బ్యాంకు డైరెక్టర్ గుత్తుల భాస్కరరావు తదితరులు చైర్మన్, సీఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాలూ తీవ్ర స్థాయిలో కేకలు వేసుకున్నాయి. ఒక దశలో అంతా రసాభాసగా మారింది. చివరకు బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు (బాబు) మాట్లాడుతూ, మ్యాక్స్ చట్టంపై కొంతమంది సీనియర్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పును అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు మ్యాక్స్ చట్టంపై తీర్మానం చేయకుండానే మహాజన సభ ముగిసింది. ‘మ్యాక్స్’తో అపరిమిత అధికారాలు ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ చట్టం–1964 ప్రకారం సహకార బ్యాంకులు, సంఘాలపై ప్రభుత్వం నియమించిన కో ఆపరేటివ్ రిజిస్ట్రార్కు విస్తృత నియంత్రణాధికారాలుంటాయి. అలాగే, ఈక్విటీ లేదా ఆర్థిక సహాయం ద్వారా ఆయా సంఘాల్లో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది. పాలక మండలి రద్దు, సిబ్బంది నియామకం వంటి వాటిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఈ చట్టం పరిధిలోని సహకార బ్యాంకులు రిజర్వు బ్యాంకు పరిధిలో ఉంటాయి. అయితే, మ్యాక్స్ చట్టం–1995 ప్రకారం ఆయా బ్యాంకులు, సంఘాలు పూర్తి స్వయంప్రతిపత్తి కలిగి ఉంటాయి. పాలకవర్గ సభ్యుల చేతుల్లోనే పాలన ఉంటుంది. సంఘాలు తమ సొంత నియమాలను రూపొందించుకోవచ్చు. డైరెక్టర్లను నియమించుకోవడం, లాభాలు పంచుకోవడం కూడా పాలకవర్గం చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నియంత్రణ లేని కారణంగా బ్యాంకును ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ఆర్థిక అవకతవకలకు ఆస్కారమిస్తుందని సహకార సంఘాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వార్షిక టర్నోవర్ సుమారు రూ.200 కోట్లు. ఈ బ్యాంకులో రూ.145 కోట్ల మేర డిపాజిట్లున్నాయి. సభ్యులు 17 వేల మంది ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే అంశాన్ని మహాజన సభ అజెండాలో పొందు పరిచారు. దీనికి ఆమోదం లభిస్తే సర్వాధికారాలూ చైర్మన్ చేతుల్లోకి వెళ్తాయి. డిపాజిట్లు, ఇతర వ్యవహారాలను బ్యాంకు పాలకవర్గం ఇష్టానుసారం చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఎన్నికలు లేకుండా నచ్చినంత కాలం చైర్మన్ ఆ పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది. దీంతోపాటు, పాలకవర్గ సభ్యులుగా తనకు ఇష్టమైన వారిని నియమించుకునే అవకాశం ఉంటుంది. గత 20 ఏళ్లుగా చైర్మన్గా ఉన్న కోళ్ల బాబు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు బంధువు. ఆయనకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం ద్వారా బ్యాంకును పరోక్షంగా ఎమ్మెల్యే చేతిలో పెట్టినట్టేననే ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్గాని భరత్ ఫిర్యాదుతో.. ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మారిస్తే జరిగే ప్రమాదాన్ని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గుర్తించారు. ఈ బ్యాంకును మాక్స్ చట్టంలోకి మార్చడం వలన డిపాజిట్లు, నియామకాలపై పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఉంటుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని జిల్లా సహకార అధికారి వెంకట రమణను కలెక్టర్ ఆదేశించారు. సభ్యులు, డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నందున ఈ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను వాయిదా వేసుకోవాలని పాలక వర్గాన్ని ఆయన లిఖిత పూర్వకంగా ఆదేశించారు. అయినప్పటికీ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు చైర్మన్, పాలకవర్గం ప్రయత్నాలు కొనసాగిస్తూండటంతో సీనియర్ సభ్యులు డిపాజిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. సొంత జాగీరులా మార్చే యత్నం ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకును తమ సొంత జాగీరులా మార్చేందుకు చైర్మన్తో పాటు పాలకవర్గం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా అవకతవకలకు పాల్పడి మూసేసిన కో ఆపరేటివ్ బ్యాంకులు అనేకం ఉన్నాయి. బ్యాంకు ప్రస్తుతం పురోభివృద్ధి లేదు. మ్యాక్స్ చట్టంలోకి మారితే అంతా పాలకవర్గం ఇష్టారాజ్యమైపోతుంది. దీనిని డిపాజిటర్లు, బ్యాంకు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, రాజమండ్రి -
తూర్పుగోదావరి
ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026అధికారులు అనాలోచిత నిర్ణయంతో పర్యాటకం దెబ్బతింటుంది సమస్య ఏర్పడితే తక్షణమే చక్కదిద్ది పర్యాటకాన్ని కొనసాగించాలి. రోజుల తరబడి బోట్లను నిలిపివేయడం ఇబ్బందిగా మారింది. బోట్లు ఆకస్మికంగా నిలిపివేస్తే ఆసక్తి తగ్గిపోయి ఆ స్థానంలో భయం ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు పునరాలోచించి పర్యాటకాన్ని పునరుద్ధరించాలి. – టి.గాయత్రి, రాజమహేంద్రవరం మంత్రి దృష్టి సారించాలి జిల్లా కేంద్రంలో ఉండే సంబంధిత మంత్రి కందుల దుర్గేష్ పాపికొండల పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇష్టమొచ్చిన నిర్ణయాల వల్ల పాపికొండల పర్యాటకం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అధికారులు పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించాలి. – బి.శ్రీకాంత్ రెడ్డి, పర్యాటకుడు -
పేడరస్ డెర్మటైటిస్పై అపోహలు వద్దు
డీఎంహెచ్ఓ వసుంధర రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ఇటీవల కొన్ని ప్రాంతాలలో పేడరస్ డెర్మటైటిస్ (రోవ్బీటెల్/నైరోబీఫ్లై) వల్ల కలిగే చర్మవ్యాధిపై ప్రజలు ఆందోళనకు గురికావద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎన్.వసుంధర ఓ ప్రకటనలో తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, పేడరస్ అనే చిన్న పురుగు శరీరంపై నలిగినప్పుడు విడుదలయ్యే రసాయనం వల్ల ఈ చర్మ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. వర్షాకాలంలో, వ్యవసాయ పొలాలు, నర్సరీలు, తోటలు, పచ్చిక ప్రాంతాల్లో ఇవి ఉంటాయని, వీటి వల్ల ఎర్రటి మచ్చలు, మంట, దురద, చిన్న నీటి పొక్కులు, గీతల్లాంటి గాయాలు కావొచ్చని వివరించారు. ఇటువంటివి కనపడితే సమీప ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. కార్మికులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు డీఎంహెచ్ఓ సూచించారు. చుక్కల మందుకు సర్వం సిద్ధం ● ఐదేళ్లలోపు చిన్నారులందరికీ రెండు చుక్కలు ● 22 మండలాల్లో 1,126 బూత్ల ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఆరు నెలల క్రితమే పోలియో చుక్కలు వేసినా ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, వలసలు తదితర పరిస్థితులతో ముందస్తు చర్యగా ఆదివారం మరోసారి ఈ కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా ఇమ్యూనిటీ అధికారి బి.శ్రీదేవి తెలిపారు. జిల్లాలో ––– మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ఈ మందు పంపిణీ చేసేందుకు 1,226 బూత్లు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం డివిజన్లో 1,15,303 మంది, కొవ్వూరు డివిజన్లో 80,355 మంది, మండపేట డివిజన్లో 23,822 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 60 ట్రాన్సిట్ కేంద్రాలు, 60 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ ఈ మందు రెండేసి చుక్కలు వేయనున్నారు. సోమేశ్వరునికి హైకోర్టు జడ్జి పూజలునిడదవోలు: పట్టణంలోని పురాతన బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర ఆలయాన్ని ఏపీ హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సోమాల శివ ఆలయ మర్యాదలతో వారిని స్వాగతించారు. ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో జడ్జి కృష్ణమోహన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. డెల్టాలకు 9,593 క్యూసెక్కుల విడుదల ధవళేశ్వరం: గోదావరి డెల్టా కాలువలకు శనివారం 9,593 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 2,679, మధ్య డెల్టాకు 1,914, పశ్చిమ డెల్టాకు 5 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. కాటన్ బ్యారేజీ వద్ద 8.15 అడుగులకు నీటి మట్టం చేరింది. వైభవంగా శ్రీవారి చక్రస్నానం మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు గోవిందా...గోవింద అంటూ భక్తులు గోదావరిలో తలారా స్నానం చేసి పునీతమయ్యారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువు దీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. 27ఎన్డీడీ 05 స్వామివారిని దర్శించుకుంటున్న ఏపీ హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ -
జాడ లేని వాన దేవుడు
● 86 శాతం లోటు వర్షపాతం ● వరి సాగుపై ఎల్నినో ప్రభావం ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు ● ఆకాశం వైపు ఆశగా చూపులు దేవరపల్లి: రోహిణీ కార్తె వెళ్లింది. మృగశిర కార్తె వచ్చింది కదా వర్షాలు కురుస్తాయని అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. కార్తె పూర్తి కావస్తున్నా ఎక్కడా చినుకు జాడే కానరావడం లేదు. ఫలితంగా పొలాల్లో తొలకరి సందడి కనిపించడం లేదు. ఈ పరిస్థితి చూసి రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయానికే పలుమార్లు వర్షాలు కురవగా.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వాన దేవుడు ముఖం చాటేశాడు. జూన్ నెల పూర్తయినా ఇప్పటి వరకూ సరైన వర్షాలు కురవలేదు. ఎండల తీవ్రత తగ్గడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటి వరకూ సాధారణ వర్షపాతం 60 మిల్లీమీటర్లు కాగా, 27 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీని ప్రకారం ఈ నెలలో వర్షపాతం లోటు 33 మిల్లీమీటర్లు. వర్షాలను నమ్ముకుని వరి ఆకుమడులు వేసిన రైతులు.. వాన దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరిలో దీర్ఘకాలిక పంట వేయకపోతే, ఈ నెలాఖరులోగా స్వల్పకాలిక పంట వేసుకోవడం మేలని అంటున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి, ఉద్యాన పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో, రైతులు వర్షాలు కురుస్తాయా లేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలా అనే మీమాంసలో పడ్డారు. ఎండిన చెరువులు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు చెరువులు, కాలువలు, బోర్లపై ఆధారపడి ఖరీఫ్ సాగు చేస్తారు. ఈ సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడం.. మరోవైపు సూర్య ప్రతాపం తగ్గకపోవడంతో పలు చెరువులు చుక్క నీరు లేనివిధంగా ఎండిపోయాయి. అనేక చెరువుల కింద ఆయకట్టు భూములు బీడువారి కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్ల నుంచి సైతం నీరు అంతంత మాత్రంగానే వస్తోంది. ఇప్పటికే వేసిన వరి చేలకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దుక్కి దున్ని మడిని సిద్ధం చేసినా.. తడి అందే దారి లేకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంటల మార్పుపై దృష్టి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, యూరియా కొరత, ధాన్యం అమ్మకాల్లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. అపరాలు, మినుము, మొక్కజొన్నతో పాటు, దీర్ఘకాలిక పంటలైన ఆయిల్పామ్ సాగుపై మొగ్గు చూపుతున్నారు. అధికారులు సైతం వరి సాగు తగ్గించి ఆయిల్పామ్ వేయాలని గ్రామగ్రామానా సదస్సులు పెట్టి మరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సుమారు 4,800 హెక్టార్లలో వరి పంటను తగ్గించి, ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరుతో భవిష్యత్తులో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు మేలు ఫసిపిక్ మహాసముద్రం వద్ద వాతావరణం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో మన దగ్గర వర్షా లు 20 నుంచి 30 శాతం తగ్గుతాయి. ఖరీఫ్పై ఎండల ప్రభావం ఎక్కువ గా ఉంటుంది. రైతులు వరి సాగు తగ్గించి ప్రత్యామ్నా య పంటలను ఎంచుకోవాలి. ఎల్నినో ప్రభావం తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. వరికి బదులు ఆయిల్పామ్ సాగు చేయాలి. దీర్ఘకాలిక పంటలు మానుకుని, స్వల్పకాలిక పంటలు వేసుకోవడం శ్రేయస్కరం. – ఎ.మల్లికార్జునరావు, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం -
ఉసురు తీస్తున్న ఊబులు..
ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: కాటన్ బ్యారేజ్ అందాలు వీక్షించడం ఓ మధురానుభూతి. ఓ పక్క గోదారి గలగలలు, మరో పక్క గోదారి పాయల నడుమ ఇసుక తిన్నెలు. ఇంకో పక్క పక్షుల కిలకిల రవాలు. భావుకులకు అదో అద్వితీయ దృశ్య కావ్యం. ఆస్వాదన వరకు బాగానే ఉంటుంది కానీ.. ఆ అందాలతో ఆకతాయి ఆటలాడితేనే సమస్య. గత మంగళవారం కాటన్ బ్యారేజీ దిగువున ఇసుక తిన్నెల్లో నీళ్లల్లోకి దిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గడిచిన పదేళ్లలో ఇలా సుమారు 70 మంది మునిగిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారంతా 12 నుంచి 25 ఏళ్ల మధ్య యువకులే కావడం గమనార్హం. ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా నీటిని చూసి పొంగే ఆనందంలో, ఇసుక తిన్నెల్లో ఉన్న దొంగ ఊబులను గమనించక అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇసుక గుంతలే మృత్యు కుహరాలు గోదావరి తీరం వెంబడి అనేక స్నాన ఘట్టాలున్నాయి. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, తాతపూడి, కపిలేశ్వరపురం గ్రామాల ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో నదిలో లోతైన గోతులు ఏర్పడి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నదిలో కలసిన ప్రాణాలెన్నో ● ఒక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదావరి పాయల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ● ఈ నెల 14న మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్ దయాకర్ (18) కె.గంగవరం మండలం కోటిపల్లి రేవులో మృతి చెందాడు. ● ఈ నెల 23న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెద్దిపాటి హేమంత్ (21), జస్వంత్ కుమార్ (18) మృతి చెందారు. ● మే 11న యానాం గౌతమీ గోదావరి పుష్కర ఘాట్లో రాజమహేంద్రవరానికి చెందిన షేక్ ఫైజన్ (17) మృతి చెందాడు. ● 2025 నవంబర్ 9న అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు ధనమ్మ మర్రి ప్రాంతంలో ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయాడు. ఇసుక తెన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదాలు పదేళ్లలో సుమారు 70 మంది మృత్యువాత హెచ్చరికలను ఖాతరు చేయని సందర్శకులు -
ఉపేక్షించేది లేదు
బ్యారేజీ దిగువకు స్నానానికి వెళ్ళడం ప్రమాదకరం. అక్కడి ఇసుక తిన్నెల్లో దొంగ ఊబులు ఉండటంతో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. హద్దు మీరి బ్యారేజీ దిగువకు స్నానానికి దిగితే ఉపేక్షించేది లేదు. – టి.గణేష్, సీఐ, ధవళేశ్వరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం వరుస ప్రమాదాలు జరిగిన కేదారిలంక తదితర రేవుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. అవిలేని రేవుల్లో సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. – పి.దొరరాజు, సీఐ, మండపేట -
పాపికొండల్లో పర్యాటంకం!
రాజమహేంద్రవరం సిటీ: ఒక చిన్న అనాలోచిత నిర్ణయం విభిన్న వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 15 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వివరాల్లోకి వెళితే కొద్ది రోజుల క్రితం గండి పోశమ్మ వద్ద నుంచి పర్యాటకులతో బయలుదేరిన బోటు అడుగుభాగంలో ఉండే ఇంపెల్లర్ (ఫ్యాను)కు చేపల వల చిక్కుకుని నిలచిపోయింది. దీంతో సదరు అధికారులు ఆ బోటును మాత్రమే నిలిపివేసి మరమ్మతు చేసిన అనంతరం తిరిగి వినియోగంలోనికి తీసుకువచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా మొత్తం పర్యాటక బోట్లను నిలిపివేయాలని ఆదేశాలివ్వడం అటు పర్యాటకులలోనూ, ఇటు బోటు యజమానుల్లోనూ తీవ్ర గందరగోళాన్ని నింపింది. ఇది జరిగి 15 రోజులైనా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ప్రకటనలకే పరిమితం జిల్లా కేంద్రంలో నివాసం ఉండే పర్యాటక శాఖామంత్రి దేశ, విదేశీ పర్యటనల్లో పర్యాటక రాష్ట్రంగా అభివృద్ధి చేస్తానని ఢాంబికాలు పోవడం తప్ప చేస్తున్నది శూన్య మని పర్యాటకులు అంటున్నారు. పాపికొండల పర్యాటకం అంతకంతకూ నిస్తేజమవుతున్నా పట్టించుకోవ డం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. దేశంలోనే అత్యంత ఆహ్లాదకరమైన పాపికొండల పర్యాటకం ఎ ప్పుడు నడుస్తుందో ఎప్పుడో ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని యాత్రికులు అంటున్నారు. అనుమతులున్న బోట్లను సైతం గండి పోచమ్మ గుడి కేంద్రంగా 15 ఏసీ లగ్జరీ బోట్లు పాపికొండల పర్యటనకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. సాధారణ రోజుల్లో 400 మంది పర్యాటకులు, శని ఆదివారాల్లో సుమారు వెయ్యి మంది వరకు పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఆ ఆలయం నుంచి రాకపోకలు సాధించే పర్యాటక బోట్లకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఒక్క బోటు నిలచిపోవడంతో అన్ని బోట్లను నిలిపివేయాలని నిర్ణయించడం పర్యాటకుల్లో అభద్రతాభావాన్ని పెంచింది. లోపం ఏర్పడిన సంబంధిత బోటును ఒకటి రెండు రోజుల్లో సరిచేసి పర్యాటకాన్ని కొనసాగించాల్సింది పోయి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారా అని పర్యాటకులు దుయ్యబడుతున్నారు. తాజాగా వర్షం హెచ్చరికతో.. భద్రాచలం కేంద్రంగా పోలవరం జిల్లాలోని పోచవరం నుంచి రాకపోకలు సాగించే 20 పర్యాటక బోట్లను వర్షం హెచ్చరికలతో శని, ఆదివారాల్లో నిలిపివేశారు. దీంతో సుమారు 1600 మంది పర్యాటకుల సంతోషం నీరుగారిపోయింది. ఇప్పటికై నా సంబంధిత మంత్రి దుర్గేష్ స్థానికంగా జరుగుతున్న పాపికొండల పర్యాటకంపై దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వందలాది కుటుంబాలకు జీవనాధారం పాపికొండల పర్యాటకులకు సౌకర్యాల కల్పనలో నిరంతరం శ్రమించే వందలాది కుటుంబాలు నేడు వ్యాపారాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోట్లలో పనిచేసే కార్మికులు సైతం జీతాలు రాక, ట్రావెల్స్, క్యాటరింగ్, టిఫిన్ సెంటర్ల యజమానులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకుల అసహనం జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం నుంచి, అలాగే పోలవరం జిల్లాలోని పోచవరం నుంచి భద్రాచలం కేంద్రంగా పాపికొండల పర్యటనకు వందల సంఖ్యలో, సెలవుదినాల్లో వేల సంఖ్యలో పర్యాటకులు పోటెత్తుతుంటారు. తాజా ఘటనతో పోచమ్మ ఆలయం నుంచి పర్యాటక బోట్లను రెవెన్యూ, పర్యాటక శాఖలు నిలిపివేయడంతో ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత అకస్మాత్తుగా బోట్లను నిలిపివేయడంపై వారు అసహనం వ్యక్తం చేస్తూ వారి ప్రణాళికలను మార్చుకున్నారు. ఒక్క బోటులో సాంకేతిక లోపం అన్ని బోట్లను నిలిపివేసిన అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పర్యాటకులు -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. లారీని తప్పించబోయి రహదారి పక్కకు దూసుకుపోయి ఆగింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్ రోడ్డులో వనదుర్గ ఆలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళుతున్న బస్సు వనదుర్గ ఆలయం వద్ద ఉన్న కల్వర్టు సమీపానికి రాగానే, ఎదురుగా లారీ అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఎడమ వైపునకు తిప్పడంతో పక్కనే ఉన్న మట్టిలోకి దూసుకుపోయి పాత రహదారి వద్ద నిలిచిపోవడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టు లేదా, ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లినా ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. వనదుర్గ ఆలయం వద్ద ఉన్న కల్వర్టు ఇరుకుగా ఉండడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులను కాకినాడ డిపోకు చెందిన మరో బస్సులో పంపించారు. -
5 నుంచి సీఆర్సీలో యాక్టింగ్ వర్క్షాప్
రావులపాలెం: ఔత్సాహిక కళాకారులు తమలోని నటనా నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రతి నిత్యం కృషి చేయాలని న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి ఎల్వీ భూషణ్, సీఆర్సీ కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, రావులపాలెం సీఆర్సీ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 5 నుంచి మూడు వారాల పాటు రెసిడెన్షియల్ యాక్టింగ్ వర్క్షాప్ను సీఆర్సీలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తిగా ఉచితంగా ఈ వర్క్ షాప్ నిర్వహిస్తామని, ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు వారాలపాటు తరగతులు జరుగుతాయన్నారు. 15 ఏళ్లు పైబడి, 40 ఏళ్లలోపు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. జూలై 4వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రిజిస్ట్రేషన్ కోసం సీఆర్సీలో ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని వివరాల కోసం 96764 36363 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. దరఖాస్తులను బట్టి అవసరమైతే రెండో బ్యాచ్కు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో కళాకారిణి లహరి, సీఆర్సీ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కరరెడ్డి(చిన్న బుజ్జి), ఆర్వీఎస్ రామాంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ ఇలాకా.. ముంపు తాలూకా
ఫ చిన్న వర్షానికే పిఠాపురం జలమయం ఫ రోడ్లపైకి చేరిన నీరు పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలో ప్రజల కష్టాలు తీరడం లేదు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం అంటున్న నేతలు.. ప్రజల కష్టాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికి పిఠాపురంలోని 3వ వార్డు ముంపు బారిన పడింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్, కాంప్లెక్స్ బ్యాక్ సైడ్, వన్ వే ట్రాఫిక్ రోడ్, భాష్యం స్కూల్ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. పిఠాపురం బస్టాండ్ నుంచి స్కూల్కు వెళ్లే పిల్లలు మోకాలు లోతు నీటిలో వెళ్లడం బాధాకరమని 2, 3, 4 వార్డుల సమస్యల పరిష్కార పోరాట కమిటీ కన్వీనర్ కరణం విశ్వనాథం అన్నారు. ఈ రెండున్నరేళ్లలో అనేకసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ఇచ్చిన ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. -
రత్నగిరిపై నీటి కొరత
ఫ శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకూ భక్తుల అవస్థలు ఫ విద్యుత్ లేకపోవడమే కారణమంటున్న అధికారులు అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శనివారం నీటి సమస్య ఏర్పడింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేసిన భక్తులు చేతులు కడుక్కోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొక్కలకు నీరు పోసే ట్యాంకర్ను తీసుకొచ్చి టబ్లలో ఆ నీటిని నింపారు. దేవస్థానం వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వీటికి నిరంతరం మోటార్ల ద్వారా నీటిని ఎక్కించాలి. అయితే ఏపీఈపీడీసీఎల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ నిలిచిపోవడంతో జనరేటర్ ద్వారా నీటిని దేవస్థానానికి సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి వాటర్ ట్యాంకుల్లో సగం వరకు మాత్రమే నీరు నిల్వ ఉందని, దేవస్థానంపై పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో భక్తులు, సత్రాల్లోని పెళ్లిళ్ల బృందాలు ఈ నీటిని వాడేశాయన్నారు. అలాగే శనివారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఒక్కసారిగా నీటి వినియోగం పెరిగిందని, దీనివల్ల కొరత ఏర్పడిందన్నారు. జనరేటర్ ద్వారా నీటిని తోడినప్పటికి ఎప్పటికప్పడు వాటర్ ట్యాంకులు ఖాళీ అయిపోయాయని వివరించారు. మధ్యాహ్నం నుంచే వివిధ సత్రాల్లో కూడా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో వాటర్ టిన్నుల ద్వారా సరఫరా చేసినట్టు తెలిపారు. అన్నదాన పథకంలో.. అన్నదాన పథకంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటలకే అక్కడ నీటి సమస్య ఏర్పడింది. వంటలు చేయడానికి వాటర్ టిన్నులు తేవాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చేతులు కడుక్కోవడానికి కూడా కుళాయిల ద్వారా నీరు రాలేదు. దీంతో అన్నదానం ఏఈఓ బలువు సత్యశ్రీనివాస్ మొక్కలకు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ను తీసుకువచ్చి అన్నదానం హాలు బయట పెట్టి టబ్లలో నీటిని నింపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి శనివారం భక్తులు రూ.7,12,232 విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన దీప్తి తమ కుమారుడు పి.హరికృష్ణ పేరిట రూ.2 లక్షలు, భీమవరానికి చెందిన ఈదర నాగ వెంకట సుబ్బారావు రూ.2 లక్షలు, ఖమ్మం పట్టణానికి చెందిన బోడిల్ల నాగేశ్వరరావు రూ.1,11,116, అమలాపురానికి చెందిన ఆర్వీఎల్ఎన్ఎస్ పార్వతి రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన యలమంచిలి నవీన్, నాగిని దంపతులు రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. దాతలకు డిప్యూటీ కమిషనర్ బాబూరావు తదితరులు అన్నదానం బాండ్లు అందజేశారు. కొనసాగిన వివాహిత ఆందోళన కొత్తపల్లి: నాగలాపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి మురళీరెడ్డి ఇంటి వద్ద అతడి భార్య రామశంకరి చేపట్టిన ఆందోళన రెండో రోజు శనివారం కొనసాగింది. తనకు పిల్లలు పుట్టిలేదని మురళీకృష్ణ వేరే మహిళను వివాహం చేసుకొని తనను మోసం చేశాడంటూ ఆమె కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువైపులా పెద్దలతో చర్చించారు. వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో మంగ ళవారం మరోసారి మాట్లాడాలని పోలీసులు నిర్ణయించారు. తనకు న్యాయం జరగకపోవడంతో రామ శంకరి ఆందోళనను కొనసాగించింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం గ్రామంలో విద్యుదాఘాతంతో చింతపల్లి వెంకట రమణ (60) మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ తన మామిడి తోటలో విద్యుత్ మోటారు వేసే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరో మూడు రోజులే..
ఫ గ్యాస్ లబ్ధిదారులకు ఈ–కేవైసీ తప్పనిసరి ఫ ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఫ చేయించుకోకుంటే ఇబ్బందులు ఫ ఉమ్మడి జిల్లాలో 19,14,791 ఎల్పీజీ కనెక్షన్లు ఫ 75 శాతమే పూర్తయిన ప్రక్రియ కపిలేశ్వరపురం: గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అక్రమ కనెక్షన్లు తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది. అయితే ఈ విషయంపై గ్యాస్ వినియోగదారులందరికీ పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ విషయం తెలియని వారందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 52, కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 27 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఎందుకంటే.. ఫ గ్యాస్ రాయితీ దుర్వినియోగానికి, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈ–కేవైసీని తప్పనిసరి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 30వ తేదీ లోపు గ్యాస్ ఏజెన్సీ ద్వారా, ఆన్లైన్లో కానీ ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఫ లేకపోతే గ్యాస్ సిలిండర్ ధరలో ప్రభుత్వ రాయితీ నిలిచిపోతుంది. గ్యాస్ సరఫరాను నిలిపివేయడం, సిలిండర్ను రద్దు చేయడమూ చేసే అవకాశం ఉండొచ్చు. ఫ సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈ–కేవైసీని ఉచితంగా చేస్తారు. అవగాహన ఉంటే ఆన్లైన్లో కూడా ఇంటిలో ఉండే చేసుకోవచ్చు. ఫ ప్లే స్టోర్ నుంచి సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన మొబైల్ నంబర్తో యాప్లో లాగిన్ అవ్వాలి. ఫ ఈ– కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఫేస్ స్కానింగ్ ద్వారా లేదా మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా వినియోగదారు గుర్తింపును ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి. 48 గంటల్లోపు ప్రక్రియపూర్తవుతుంది. సామాన్యుడిపై భారం కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని మోపుతోంది. గృహ వినియోగ సిలిండర్పై ఈ ఏడాది మార్చి 7న రూ.60, ఈనెల 7న రూ.29 పెంచడంతో సిలిండర్ ధర రూ.971కి పెరిగింది. డెలివరీ ఖర్చులతో రూ.వెయ్యి అవుతోంది. వాణిజ్య సిలిండర్ ధరను గత మూడు నెలల్లో మూడు సార్లు పెంచడంతో ప్రస్తుతం దాని ధర రూ.3,406కి చేరింది. దీంతో చిరు వ్యాపారులు ప్రత్యక్షంగానూ, వారి వద్ద పదార్థాలు కొనుగోలు చేసే వినియోగదారులు పరోక్షంగానూ తీవ్ర భారాన్ని మోస్తున్నారు. ఉజ్వల పథకం ప్రారంభంలో సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో సిలిండర్కు రూ.300 రాయితీని అందజేసింది. ఆ తర్వాత కాలంలో ఆ సంఖ్యను 9కి ప్రస్తుతం 4కి కుదించింది. కొత్త కనెక్షన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 10 వేల మంది రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా గ్యాస్ బుక్ చేసుకోకపోతే కనెక్షన్ ఇన్యాక్టివ్లోకి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ వినియోగదారుల వివరాలు జిల్లా గ్యాస్ కనెక్షన్లు తూర్పుగోదావరి 6,92,825 కాకినాడ 6.50,000 కోనసీమ 4,79,563 పోలవరం 92,403 మొత్తం 19,14,791 సమాచారం లేక.. గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇప్పటి వరకూ 75 శాతం మాత్రమే పూర్తయ్యింది. చేయించుకోని వారిలో చాలామందికి దీని సమాచారం తెలియదు. తెలిసిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వారు ఆన్లైన్లో చేసుకునే వీలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సాంకేతిక అవగాహన వారికి లేదు. -
ఓట్లు గల్లంతు చేసే ప్రమాదం
● టీడీపీతో అప్రమత్తంగా ఉండాలి ● సర్ కార్యక్రమంపై అజాగ్రత్త వద్దు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుపెరవలి (కొవ్వూరు): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకుని అధికార టీడీపీ.. ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉందని, దీనిపై ప్రతి బూత్ కన్వీనర్ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ఓట్లు ఉండవని చెప్పారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన శనివారం జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో వేణు మాట్లాడారు. చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడం సర్ లక్ష్యమని, కానీ, ఇంట్లో ఉన్నా లేనట్లుగా అధికార పార్టీ నాయకులు ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటే నేడు ప్రభుత్వాలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాయని, ఓట్ల తొలగింపే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీలు ఓడిపోవడానికి ఓట్ల తొలగింపే ప్రధాన కారణమని అన్నారు. నిత్యం అబద్ధాలను సృష్టించటంలో టీడీపీ ఆరితేరిపోయిందని, ఆ పార్టీపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. దోచుకో – దాచుకో అనే రీతిలో టీడీపీ నేతలు దొరికింది దొరికినట్లు దోచేస్తున్నారని, ఇసుక, మట్టి, మద్యం షాపుల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ నేడు ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకులు గాదె కింద పందికొక్కుల్లా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దీనిని బతికించుకోవడానికి యువతే ముందుకు రావాలని వేణు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని, కానీ, ఎన్నికల్లో ఓట్లు లేకుండా చేస్తే వారు అనుకున్న వారే గెలుస్తారని ఆరోపించారు. సర్ కార్యక్రమం సందర్భంగా ఆయా బూత్లలో ఎవరి ఓట్లు తొలగించవచ్చు, ఎవరి ఓట్లు ఉండాలనే విషయాన్ని బూత్ కన్వీనర్లు నిశితంగా పరిశీలించాలని కోరారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వారి ఓట్లు ఉన్నాయో, తొలగించారో పరిశీలించుకునేలా విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, సర్ పరిశీలకుడు వామిశెట్టి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, బుర్ర లక్ష్మణ్, ఉప్పులూరి సూరిబాబు, తోట రామకృష్ణ, టౌన్ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, తాళ్లపూడి, చాగల్లు ఎంపీపీలు జొన్నకూటి పోసిరాజు, వీరాస్వామితో పాటు జిట్టా ఏడుకొండలు, ఇంటి వీర్రాజు, ముప్పిడి వీర్రాజు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ విద్యార్థిని టీచర్ కొట్టిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. నవోదయ ఎంట్రన్స్కు స్థానిక క్వారీ సెంటర్లోని ఓ ఇనిస్టిట్యూట్లో పదేళ్ల బాలుడు కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 19న ఆ బాలుడిని కొంతమూరుకు చెందిన అతడి తండ్రి ఎస్.సూర్యనారాయణ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కుమారుడికి వాంతులవడంతో తండ్రి ఏమైందో ఆరా తీశాడు. వర్క్ చేయలేదని టీచర్ కాళ్లపై కొట్టాడని, అది మర్మావయవాలపై తగిలి విపరీతమైన నొప్పి వస్తోందని ఆ బాలుడు చెప్పాడు. దీంతో, వెంటనే సూర్యనారాయణ తన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుడి మర్మావయవాలకు తీవ్రంగా గాయమైందని, అవసరమైతే వాటిని తీసేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఈ మేరకు సూర్యనారాయణ త్రీటౌన్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. దీనికి కారకుడైన ఆ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యాయుడు వెంకట మోహన్పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.ఒడిశా టు తెలంగాణ ● చిత్రకొండ నుంచి కోదాడకు గంజాయి తరలింపు ● ఐదుగురి అరెస్టు ● 15.51 కేజీల సరకు స్వాధీనం కోరుకొండ: ఒడిశా రాష్ట్రం చిత్రకొండ నుంచి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకు గంజాయి తరలిస్తున్న ఐదుగురు విద్యార్థులను కోరుకొండ పోలీసులు అరెస్టు చేశారు. కోరుకొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం మేరకు బూరుగుపూడి పెట్రోలు బంకు వద్ద ఎస్సై సీహెచ్వీ రమేష్ ఆధ్వర్యాన గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నజీర్, షేక్ అశ్వక్, మహమూద్ అవేజ్ఖాన్, తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి పెద్దిరాజులు మోటార్ సైకిళ్లపై రెండు సంచుల్లో తరలిస్తున్న 15.51 కేజీల పొడి గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.77,550గా నిర్ధారించారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు స్మార్ట్ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని, దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు. నిందితులపై ఖమ్మంలో కేసులున్నాయని చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు విద్యార్థులు, యువత లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్నారన్నారు. నిందితుల్లో కొందరు ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యార్థులు కావడంతో యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నట్టు గుర్తించామని వివరించారు. గతంలో కూడా వీరు గంజాయి రవాణాకు పాల్పడినట్టు తెలిపారు. కాగా, సర్కిల్ పరిధిలోని కోరుకొండ, గోకవరం, సీతానగరం పోలీసు స్టేషన్లలో ఈ ఏడాది ఇప్పటి వరకూ నమోదైన 8 గంజాయి కేసులలో పోలీసులు 1,400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డెల్టాలకు 11,700 క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 11,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.20 అడుగులు ఉంది. -
ఏమంతిరి.. ఏమంతిరి.!
● పేపరు మిల్లు సమస్య పరిష్కారానికి నెలాఖరు డెడ్లైన్ ● లేకపోతే నేనే ఆందోళన చేస్తా ● మంత్రి దుర్గేష్ ప్రకటన ● సమస్య పరిష్కరించాల్సిన అమాత్యుడి ప్రకటనపై కార్మిక వర్గంలో విస్మయం సాక్షి టాస్క్ఫోర్స్: స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చి పేపరు మిల్లు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్కు సైతం ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో, పేపరు మిల్లు కాలుష్యంతో పాటు, కార్మికుల సమస్యలు ఓ కొలిక్కి వచ్చేస్తాయన్నంతగా అనుకూల మీడియాలో హోరెత్తించేశారు. తీరా సీన్ కట్ చేస్తే.. కడియం మండలం మాధవరాయుడుపాలెం పరిధిలోని ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం తీరు యథాతథంగానే కొనసాగుతోంది. ఈ మిల్లులోని పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో, పవన్ కల్యాణ్ చేసింది హడావిడి మాత్రమేననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార కూటమి నాయకులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే పరిస్థితుల్లో లేరనే అభిప్రాయానికి కార్మికులు దాదాపు వచ్చేశారు. మంత్రి తీరుపై కార్మికుల ఆశ్చర్యం ఈ పరిస్థితుల్లో కడియం పేపరు మిల్లు కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం హఠాత్తుగా వచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై మిల్లు యాజమాన్యం నెలాఖరుకల్లా స్పందించకపోతే తాను స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. సమస్య పరిష్కరించే అధికారం ఉన్న రాష్ట్ర కేబినెట్ మంత్రి.. ప్రతిపక్ష నాయకుల మాదిరిగా ఆందోళన చేస్తానంటూ హెచ్చరించడం విచిత్రంగా ఉందని కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏదైనా తీపి కబురు చెప్పడానికి మంత్రి వస్తున్నారేమోనని ఆశ పడితే.. తమతో పాటు ఆందోళన చేస్తానంటూ ప్రకటించి వెళ్లిపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించదా? మంత్రి దుర్గేష్ ప్రకటన నేపథ్యంలో ప్రజలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ● పేపరు మిల్లు ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించింది. దీనిపై కార్మిక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? ● ఇప్పటికే కార్మికులు 60 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సుమారు 850 మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఈ సమస్య పరిష్కరానికి ప్రభుత్వానికి ఎంత టైమ్ పడుతుంది? ● చర్చల పేరుతో హడావుడి చేస్తున్నారు తప్ప, మిల్లు యాజమాన్యం నుంచి కచ్చితమైన హామీ ఒక్కటైనా వచ్చిందా? కార్మికుల డిమాండ్లు నెరవేరుస్తారా? సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తారా? వీటికి యాజమాన్యం నుంచి సమాధానం ఉందా? ● రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లు యాజమాన్యం అతీతమా? వారిని ప్రత్యక్షంగా ఎందుకు చర్చల్లోకి తీసుకు రాలేకపోతున్నారు? ● యాజమాన్యం ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించింది. అంతే ఏకపక్షంగా అర్ధరాత్రి ఉపసంహరించుకుంది. అంటే రాష్ట్రంలో కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితుల్లేవా? వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదా? అలా చేయలేకే చర్చలు, ఆందోళనలు అంటూ కాలయాపన చేస్తున్నారా? ● కార్మికుల వైపే న్యాయం ఉందంటున్న మంత్రి.. అధికారం చేతిలో ఉండి కూడా యాజమాన్యంపై ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోవడం వెనుక ఉన్న మతలబేమిటి? ● కార్మికుల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఆందోళనలు, మద్దతు అంటూ షో చేస్తున్నారా? అటువంటిదేమీ లేకపోతే ఎంత సమయంలో కార్మికులకు న్యాయం చేస్తారు? అసలు చేస్తారా, లేదా అనేది బహిరంగంగా స్పష్టంగా ప్రకటించాలి. ● ప్రజలు లేవనెత్తుతున్న ఈ ప్రశ్నలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. -
మానసిక పరివర్తనకు జైళ్లు దోహదపడాలి
పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుమ చక్రవర్తికంబాలచెరువు (రాజమహేంద్రవరం): కారాగారాలు కేవలం శిక్ష అనుభవించే ప్రదేశాలుగా కాకుండా.. వ్యక్తిత్వ వికాసం, మానసిక పరివర్తన, సామాజిక పునరావాసానికి దోహదపడే కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలని పట్నా హైకోర్టు న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జైలులోని వివిధ విభాగాలు, ఖైదీల సంస్కరణకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పునరావాసానికి అమలు చేస్తున్న వృత్తి శిక్షణ, ఖైదీల వసతి గృహాలు, వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ, ఆహార పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి, వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. జైలు అధికారులు ఆమెకు స్వాగతం పలికి, కారాగారంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ అనుమ చక్రవర్తి మాట్లాడుతూ, ఖైదీలు తమలోని ప్రతిభను వెలికి తీసుకుని, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవరచుకోవాలని సూచించారు. సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా తిరిగి స్థిరపడేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కారాగార పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పచ్చదనం అభివృద్ధి చర్యలు, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ కూడా ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రం దుస్థితిపై విచారణ
సీతానగరం: మండలంలోని ముగ్గళ్ల అంగన్వాడీ కేంద్రం దుస్థితిపై ఐసీడీఎస్ సూపర్వైజర్ రావూరి ఛాయాదేవి విచారణ నిర్వహించారు. ఈ నెల 24న ‘సాక్షి’లో ‘వెలవెలబోతున్న అంగన్వాడీ సెంటర్’ శీర్షికన కథనం వెలువడింది. అంగన్వాడీ కేంద్రంలో ఒకే ఒక్క బాలుడున్నాడని, కేంద్రం పెంకుటింట్లో ఉందని, దానికి నెలకు రూ.2 వేల అద్దె చెల్లిస్తున్నారని, కేంద్రం శిథిలావస్థకు చేరిందని ఈ కథనంలో ‘సాక్షి’ పేర్కొంది. దీనిపై అధికారులు స్పందించారు. సీడీపీఓ సంధ్య ఆదేశాల మేరకు ముగ్గళ్ల సెక్టార్ సూపర్వైజర్ రావూరి ఛాయాదేవి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, విచారణ చేపట్టారు. ఈ కేంద్రాన్ని పిల్లలున్న ప్రాంతానికి మార్చాల్సిందిగా ఇదివరకే సూచించానని, ఏడుగురు పిల్లలు, ఒక గర్భిణి, ఇద్దరు బాలింతలు మాత్రమే ఉన్నారని, విచారణ నివేదికను సీడీపీఓకు అందించానని తెలిపారు. శుక్రవారం సెలవు కావడంతో అంగన్వాడీ వర్కర్కు శనివారం మెమో జారీ చేస్తామని సీడీపీఓ సంధ్య తెలిపారు. -
కార్మికులకు అండగా ఉంటాం
కడియం: మాధవరాయుడుపాలెంలోని ఏపీ పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. మిల్లు కార్మికులు 60 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి సహనాన్ని పరీక్షించడం తగదని హితవు పలికారు. కార్మిక నాయకులను లక్ష్యంగా చేసుకోవడం మానుకోవాలన్నారు. మిల్లు 20 ఏళ్లుగా లాభాల్లో నడుస్తున్నప్పటికీ జీతాలు తగ్గుతూ వస్తున్నాయని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కార్మికులు విధులు నిర్వహించి, సంస్థ పురోగతికి తోడ్పడ్డారన్నారు. తక్షణం అక్రమ లాకౌట్ ఎత్తివేసి, 59 మంది కాంట్రాక్టు, 11 మంది పర్మినెంట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిల్లు తెరచిన తరువాత కూడా కార్మికులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేతన ఒప్పందాన్ని మూడు నెలల్లో పూర్తి చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు మిల్లు కార్మికులతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సహా తామంతా అండగా ఉంటామని చెప్పారు. కార్మికులకు తమ వంతు సాయంగా రాజా రూ.50 వేలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గిరజాల బాబు, కొత్తపల్లి శివాజీ, రాణా హరిశ్చంద్ర, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ తవ్వకాలపై చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు కలెక్టర్ కీర్తికి గురువారం విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన వారి పైనే అక్రమార్కులు తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని, భౌతిక దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని రాజా వివరించారు. కొన్నిచోట్ల చెరువుల్లో అనుమతులను ఉల్లంఘించి, పర్యావరణానికి హాని కలిగించేలా పది రెట్లు మట్టి తవ్వేసి, వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వీటిపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. లారీల్లో అధిక లోడు వేసి, రాత్రింబవళ్లు తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులు, మార్గదర్శకాలకు లోబడి మాత్రమే మట్టి తవ్వకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. రాజానగరం మండలం మల్లంపేటలో చెరువు గట్టు తవ్వేయడంతో ఆయకట్టు రైతులు పంటలు వేసుకునే అవకాశం కోల్పోయారన్నారు. వర్షాకాలంలో చెరువులోకి వచ్చే వరద నీరు గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చెరువు గండి పూడ్చివేయడంతో పాటు గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువు గట్టుకు గండి కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.కలెక్టర్కు వైఎస్సార్ సీపీ నేతల వినతి -
టీడీపీ నేత దూకుడుకు బ్రేకులు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వైఎస్సార్ సీపీ నేత అప్రమత్తతతో టీడీపీ నేత దూకుడుకు అధికార యంత్రాంగం బ్రేకులు వేసింది. 114 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్నీసుపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును సహకార చట్టం నుంచి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) చట్టంలోకి మార్చేందుకు ఆ బ్యాంకు చైర్మన్, టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బంధువు కోళ్ల అచ్యుత రామారావు (బాబు) ప్రతిపాదించారు. దీనికి సహకార శాఖ బ్రేకులు వేయడంతో ప్రజాధనానికి రక్షణ లభించింది. ఏం జరిగిందంటే.. బ్యాంకు సర్వసభ్య సమావేశం ఈ నెల 28న నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను అజెండాలో 7వ అంశంగా చేర్చారు. దీనికి సభ్యుల ఆమోదం తీసుకుని, బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు పాలకవర్గం అన్ని ఏర్పాట్లూ చేసింది. మ్యాక్స్ చట్టం ప్రకారం పాలకవర్గం ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం ఉండటంతో బ్యాంకు డిపాజిట్లు, నియామకాలపై బ్యాంకు ఖాతాదార్లు, సీనియర్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇన్నీస్పేట బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చే ప్రతిపాదనను విరమించుకోవాలని పాలకవర్గాన్ని జిల్లా సహకార అధికారి (డీసీఓ) ఎం.వెంకటరమణ ఆదేశించారు. దీంతో, మ్యాక్స్ చట్టంలోకి మార్చి.. ఇన్నీసుపేట బ్యాంకును తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ నేత పన్నిన పన్నాగానికి బ్రేక్ పడింది. డీసీఓ ఆదేశాలపై డిపాజిటర్లు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదేశాల ద్వారా ప్రజాధనం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఫ ఇన్నీసుపేట అర్బన్ బ్యాంకును మ్యాక్స్ చట్టంలోకి మార్చేందుకు యత్నం ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఫిర్యాదుతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం ఫ ప్రతిపాదనను విరమించుకోవాలని పాలకవర్గానికి డీసీఓ ఆదేశం ఫ డిపాజిటర్లు, సభ్యుల హర్షాతిరేకాలు డీసీఓ ఏమన్నారంటే.. ఫ ఈ వ్యవహారంతో సుమారు రూ.140 కోట్ల ప్రజా నిధులు ముడిపడి ఉన్నాయి. దీంతో. డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఫ బ్యాంకు ప్రయోజనాలను పరిరక్షించడానికి, సెక్షన్ 12(3) కింద మూడింట రెండు వంతుల సభ్యుల సమ్మతిని పూర్తి అవగాహనతో కూడిన పొందాలి. ఫ సెక్షన్–13 కింద డిపాజిట్ ఉపసంహరణకు స్పష్టమైన అవకాశం కల్పించాలి. ఫ ఇటువంటి అంశాలను ముందుగా క్షుణ్ణంగా పరిష్కరించాలి. ఫ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల జారీ చేసిన పాలనాపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా మ్యాక్స్ చట్టంలోకి మారుతోందో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఫ వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల 28న జరిగే సర్వసభ్య సమావేశంలో మ్యాక్స్ చట్టంలోకి మార్చే అంశాన్ని వాయిదా వేసుకోవాలి. -
ఇసుక లారీ ఢీకొని భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
కొత్తపేట: కుమార్తె పెళ్లి శుభలేఖలు పంచి వస్తున్న దంపతులను ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామానికి చెందిన దాసిరెడ్డి నాగ వెంకట రామకృష్ణ, ధనలక్ష్మి కుమార్తెకు జూలై ఒకటిన వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ దంపతులు శుభలేఖలు పంచేందుకు మోటార్ సైకిల్పై ముమ్మిడివరంలో బంధువుల ఇళ్లకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్తపేట బోడిపాలెం సమీపానికి వచ్చేపరికి ఎదురుగా ఇసుక లోడుతో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపి, ఉన్నత వైద్యం కోసం తణుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో తిరగబడి డ్రైవర్ మృతిఆత్రేయపురం: రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో ఆటో తిరగబడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొండేపూడి లక్ష్మీ గణేష్ (20) మంగళవారం ఆత్రేయపురంలో బంధువుల ఇంటికి పెళ్లి పార్టీకి ఆటోలో వచ్చాడు. పార్టీ అనంతరం రాత్రి స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా, ఆత్రేయపురం మెయిన్ రోడ్డులో కుక్క అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో డ్రైనేజీలోకి ఆటో తిరగబడింది. ఈ ఘటనలో లక్ష్మీగణేష్ తలకు బలమైన గాయం కావడంతో కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు వెంకట నాగ ముని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ కలహాలతో భార్యపై చాకుతో దాడిరాజోలు: మండల కేంద్రమైన రాజోలులో బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త చాకుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని కుక్కలవారి పేటలో ఓ అద్దె ఇంట్లో తాడి లక్ష్మీదుర్గ, ప్రకాశరావు దంపతులు నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే మంగళవారం రాత్రి మరోసారి వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. తీవ్ర ఆవేశానికి గురైన భర్త ప్రకాశరావు చాకుతో భార్యపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఘటన అనంతరం ప్రకాశరావు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. -
రత్నగిరిపై శ్రీగోకులానికి మహర్దశ
● రూ.2.50 లక్షలతో పైకప్పు ఏర్పాటుకు చర్యలు ● ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానంఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని శ్రీగోకులం పైకప్పును రూ.2.50 లక్షలతో పటిష్టంగా ఏర్పాటు చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. గోకులం పైకప్పుకు రంధ్రాలు ఏర్పడి, వర్షానికి గోవులు తడిసిపోతుండడంతో ఈ నెల 14న సాక్షి దినపత్రికలో శ్రీగోకులం.. అధ్వానం అనే శీర్షికన కథనం వచ్చింది. రెల్లుగడ్డితో నేసిన పైకప్పు నుంచి వర్షం నీరు కారడంతో సప్త గోవులతో పాటు మధ్యలోని శ్రీకృష్ణుని విగ్రహం కూడా తడిసిపోతున్న వైనాన్ని కథనంలో వివరించారు. దానికి దేవస్థానం అధికారులు స్పందించారు. శ్రీగోకులం పైకప్పుపై వెదురు చాపలు వేసి, వాటిపై వర్షం నీరు దిగువకు కారకుండా టార్పాలిన్ వేసి, ఆ పైన రెల్లుగడ్డి, దానిపై జీఐ ముళ్ల తీగను వేయాలని నిర్ణయించారు. ఇలా చేయడం వలన కోతులు శ్రీగోకులం పైకప్పు పైకి వచ్చే అవకాశం ఉండదని తెలిపారు. ఇదే విషయాన్ని బుధవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. -
● కనుమురుగు
● ఆపొద చూడండి అడ్డతీగల – ఏలేశ్వరం ప్రధాన రోడ్డును వెదురు పొదలు మూసేస్తున్నాయి. రోడ్డు పక్కనే ఉన్న వెదురు పొదలు వాటికి అల్లుకుపోయిన పాదులతో ప్రధాన రోడ్డుపై వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బొంగరాలపాడు సమీపాన శివాలయం వద్ద ఇలా వెదురు పొదలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. సంబందిత అధికారులు కాస్త చూడాలి. – అడ్డతీగల ● కాళ్ల కింద కరకర ఆ దారిలో వెళ్తే కాళ్ల కింద కరకరలాడుతోంది. రాజవొమ్మంగి మండలం బూరుగపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా రూ. 2.5 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు గతంలో మంజూరు అయ్యాయి. కాంట్రాక్టర్ గ్రావెల్, మెటల్ పరిచి, కొంతమేర బిల్లులు తీసుకుని పత్తాలేకుండా పోయారు. దీనిని పూర్తి చేయించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంది. – రాజవొమ్మంగి మండపేట రాజారత్న సెంటర్లో గల డ్రెయిన్లోని పూడిక తీసేందుకు ఓ కార్మికుడు పీకల్లోతు దిగి పనులు చేస్తున్నాడు. అతడికి మరో ఇద్దరు కార్మికులు సాయం చేస్తున్నారు. ఆధునిక కాలంలో సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చినా, ఇంకా ఇలాంటి పనులు మనుషులతో చేయించడం దారుణం. పాలకుల తీరుతో మానవత్వం కనుమరుగు అవుతోందనిపిస్తోంది. – కపిలేశ్వరపురం -
అరటి గెలచింది!
● మార్కెట్లో మంచి ధర ● పది టన్నుల లారీ రూ.1.80 లక్షలు ● ఇతర రాష్ట్రాలకు రోజూ 60 లారీల్లో ఎగుమతులు పెరవలి: అరటి ధరలో గెలిచింది.. రైతుల మోముకు ‘ధర’హాసం తెచ్చింది.. ఏడాదిగా కష్టాలు పడుతున్న కర్షకులకు ఊరటనిచ్చింది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో అరటి దిగుబడి లేకపోవడంతో కలసి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తుపాను దెబ్బకు అరటి తోటలు తలలు వాల్చాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో రైతులు విలవిల్లాడారు. ప్రస్తుతం మార్కెట్లో కర్పూర అరటికి మంచి డిమాండ్ ఉండడంతో గత నష్టాలను పూడ్చుకొనేందుకు తాపత్రయ పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు 10 టన్నుల లారీ రూ.60 వేల నుంచి రూ.90 వేల ధర పలకగా, ప్రస్తుతం మార్కెట్లో రూ.1.80 లక్షలకు చేయడంతో కళ వచ్చింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి నిత్యం 60 లారీల వరకూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రైతులు పక్వానికి వచ్చిన అరటి గెలలను మార్కెట్కు తరలించి, విక్రయిస్తున్నారు. 7500 హెక్టార్లలో సాగు తూర్పుగోదావరి జిల్లాలో అన్ని రకాల అరటి సాగు 7,500 హెక్టార్లలో సాగవుతోంది. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 4 వేల హెక్టార్లలో తోటలు దిగుబడికి వచ్చాయని, కానీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగటంతో ఏమాత్రం పక్వానికి వచ్చినా వెంటనే వాటిని కోతలు కోస్తున్నారు. అరటి మార్కెట్లో గత ఏడాది జూన్ నుంచి ధరలు పతనం అవుతూ ఉన్నాయి. పది టన్నుల అరటి లారీ రూ.60 వేలకు పడిపోయింది. ప్రస్తుతం కర్పూర అరటి మార్కెట్లో రూ.1.80 లక్షలు పలకటంతో రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ అరటి తోటల వైపు కన్నెత్తి చూడని వ్యాపారులు, నేడు నేరుగా చేల వద్దకు వెళ్లి అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. అలాగే చెక్కరకేళీ గెల ఒక్కటి రూ.300, ఎర్ర చెక్కరకేళీ గెల ఒకటి రూ.500 పలుకుతుంది. మార్కెట్లో సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూర అయితే నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800, చక్కరకేళీ రూ.2 వేల నుంచి రూ.2400, ఎర్ర చక్కరకేళీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతున్నాయి. పెరిగిన ఎగుమతులు జిల్లాలో అరటి ఎగుమతులు పది రోజులుగా పెరిగాయి. గతంలో ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి రోజూ 80 నుంచి 100 లారీల సరకు మనకు రావడంతో ఇక్కడి అరటికి తీవ్రంగా దెబ్బతగిలింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సరకు లేకపోవడంతో జిల్లా నుంచి రోజూ 60 లారీల సరకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో మన సరకుకు డిమాండ్ రావటంతో అరటి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉపాధి పొందుతూ.. జిల్లాలో అరటి సాగును 8 వేల మంది రైతులు చేస్తున్నారు. తోటలకు వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే, గెలలను కోసే కూలీలు, అరటి వ్యాపారులు సుమారు 30 వేల మంది వరకూ ఉంటారు. గతంలో మార్కెట్లో ధరలు తగ్గటంతో వీరందరికి ఉపాధి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ధరలు పెరగటంతో రోజుకి కూలి రూ. 500 నుంచి రూ.1500 వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ సాయం అందలేదు గత ఏడాదిగా అరటి ధరలు పతనం కావడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మార్కెట్ పెరగటంతో ఆ నష్టాలు పూడ్చుకొనే పరిస్థితి వచ్చింది. గత తుపాను సమయంలో ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు. – యాతం మల్లికార్జునరావు, రైతు, అన్నవరప్పాడు అడ్వాన్సు ఇచ్చి మరీ.. నిన్న మొన్నటి వరకు తోటలు కొనేవారే లేరు. నేడు వ్యాపారులు తోటల వద్దకు వచ్చి అడ్వాన్సు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకు కర్పూర గెల రూ.50 కొననివారు నేడు రూ.200కు కొంటున్నారు. – దారుపురెడ్డి కృష్ణ, రైతు, అన్నవరప్పాడు నష్టాలు పూడ్చుకునేందుకు.. ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ధరలు పెరిగిన ట్లు పెరిగి ఫిబ్రవరి నుంచి తగ్గిపో యాయి. ప్రస్తుతం ధర పెరగడంతో అరటి సాగు చేస్తున్న రైతులు గత నష్టాలను పూడ్చుకోవటానికి వీలు కలిగింది. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, రైతు, ఖండవల్లి -
రత్నగిరిపై అభివృద్ధి పనులకు ఆమోదం
● ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం ● పాల్గొన్న సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుఅన్నవరం: రత్నగిరిపై బుధవారం దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు, సభ్యులు, ప్రత్యేకాహ్వానితులుగా నియమితులైన మట్టే సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డి, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవే.. ● దేవస్థానంలో నిర్మిస్తున్న సీతారామ సత్రంలో గతంలో నిర్ణయించిన 105 గదులకు బదులు 140 గదులు వచ్చేలా ప్లాన్లో మార్పులు చేస్తూ సవరించిన అంచనాలను మండలి ఆమోదించింది. ఈ ప్రకారం వ్యయం రూ.11.40 కోట్ల నుంచి రూ.12.40 కోట్లకు పెరిగింది. ● సత్యదేవుని జూనియర్ కళాశాలలో చదువుతున్న 200 మంది, డిగ్రీ కళాశాలలో చదువుతున్న 300 దూర ప్రాంత విద్యార్థులకు దేవస్థానం అన్నదాన పథకం నుంచి మధ్యాహ్న భోజనం అందించేందుకు తీర్మానించారు. ● రత్నగిరి పవర్ హౌస్ నుంచి స్వామి వారి ప్రధానాలయం, పరిసర ప్రదేశాలకు 300 స్కేర్ ఎంఎం కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డు ఏర్పాటుకు తక్కువ టెండర్ రూ.20.76 లక్షలను ఆమోదించారు. ● సీతారామ సత్రంలోని గదుల్లో వేయడానికి వంద కొత్త పరుపులు, తలగడలు, ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాలలో సుప్రీం లేదా నీల్ కమల్ మోడల్ కుర్చీల సరఫరాకు రూ.19.80 లక్షలతో రూపొందించిన అంచనాలను ఆమోదించారు. సర్క్యులర్ మండపం, లాకర్సు రూమ్లో ఫ్లోరింగ్, ఇతర అభివృద్ధి పనులకు రూ.15 లక్షల వ్యయంతో అంచనాలను ఆమోదించారు. ● సత్యదేవుని ఆలయానికి వెళ్లే ఉచిత దర్శనం మెష్ క్యూ లైన్ల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు ఏర్పాటుకు రూ.40 లక్షల వ్యయంతో రూపొందించిన అంచనాలను ఆమోదించారు. ● దేవస్థానం సీఆర్వో ఆఫీసు సమీపంలో గల టాయిలెట్ బ్లాక్లో రూ.20.50 లక్షలతో కొత్త టైల్స్, సివిల్ మరమ్మతులు, రంగులు వేయడానికి తీర్మానించారు. భక్తులకు లిఫ్ట్ వద్ద, అన్నప్రసాద భవనం క్యూ లైన్లు వద్ద రూ.6.5 లక్షలు వ్యయంతో పాలి కార్బొనేటెడ్ షెడ్లు వేయనున్నారు. ● పశ్చిమ రాజగోపురం వద్ద గల ఒకటి, రెండు నంబర్ల పూజా ద్రవ్యాలు, ఫ్యాన్సీ షాపులకు గత వారం జరిగిన వేలం పాటలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ షాపులలో మొదటి షాపునకు నెలకు రూ.16.73 లక్షలు, రెండో షాపునకు రూ.18.36 లక్షలకు వేలం పాట ఖరారైంది. అయితే వీటిలో కొబ్బరికాయ, అరటిపండ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ట్రస్ట్బోర్డులో చర్చ జరిగింది. వ్రతం సెట్లో ఆరు కొబ్బరికాయలు, ఆరు అరటిపండ్లను రూ.180 కు విక్రయించాలని పదేళ్ల క్రితం దేవస్థానం నిర్ణయించింది. అయితే ఇప్పుడు అదే ధరకు విక్రయించడం సాధ్యపడదని కనీసం రూ.250కి విక్రయించేలా రేట్లు పెంచాలని పాటదారులు కోరారు. దీంతో పాటదారులు కోరినట్టు రేటు పెంచి మరలా వేలం నిర్ణయించాలని ట్రస్ట్బోర్డులో ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. ● సత్యదేవుని గోధుమనూక ప్రసాదం తయారీలో వాడే ఆవు నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టును విజయ డెయిరీ దక్కించుకుంది. జూలై ఒకటో తేదీ నుంచి దేవస్థానానికి ఆవునెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు పిలవగా కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ కో ఆపరేటివ్ సొసైటీ (విజయ డెయిరీ) కిలో రూ.647.89కి కోట్ చేసింది. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న సంగం డెయిరీ కేజీ రూ.674కి వేసింది. దీంతో లోయెస్ట్ టెండర్దారుగా విజయ డెయిరీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ మేరకు విజయ డైరీ కి నెయ్యి సరఫరా ఖరారు చేస్తూ ట్రస్ట్బోర్డు సమావేశంలో తీర్మానించారు. -
చిట్టితల్లీ ఎక్కడున్నావ్ !
● 19 రోజులైనా లభించని జ్ఞానేశ్వరి ఆచూకీ ● తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు ● నిరీక్షించి నీరసించిన తల్లి భవానితుని రూరల్: ఆయిల్పామ్ తోటలో ఆడుకుంటూ అల్లరి చేసే రెండేళ్ల సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 19 రోజులైనా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సబ్డివిజన్ పోలీసులు, హనుమాన్ టీం, అటవీ బృందాలు ఆ బాలిక ఆచూకీ కోసం చేసిన గాలింపు చర్యలు జరుపు తున్నా ఫలితం ఉండడం లేదు. కాగా.. చిన్నారి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సీహెచ్ అగ్రహారం వద్ద 40 ఎకరాల ఆయిల్పామ్ తోట కాపలాదా రులు సుంకర గణేష్, భవాని దంపతుల ప్రథమ కుమార్తె జ్ఞానేశ్వరి ఈ నెల ఆరో తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తోటతో పాటు సమీపంలోని 500 ఎకరాలకు పైగా విస్తరించిన అటవీ ప్రాంతాన్ని, సీహెచ్ అగ్రహారం, అటికెవానిపాలెం గ్రామాల పరిధిలోని పంట భూములు, చెరువులు, నీటి కుంటలను ఆయా బృందాలు అణువణువునా గాలించాయి. అడవి జంతువుల కదలికలను గుర్తించేందుకు డ్రోన్లు, థర్మల్ స్కానర్లు, నైట్ విజన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాయి. సీహెచ్ అగ్రహారం, దొండవాక, రాపాక, కేఓ మల్లవరం, డి.పోలవరం గండితో పాటు తుని పట్టణంలో ప్రధాన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క ఆధారం లభించలేదు. అటవీ ప్రాంతంలో కూంబింగ్, గాలింపు చర్యలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. నిరీక్షించి నీరసించిన తల్లి తప్పిపోయిన కుమార్తె కోసం ఎదురు చూస్తూ తల్లి భవాని నీరసించిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మోటారు సైకిల్పై ముందు భర్త, వెనుక ఆడపడుచు ఆసరాతో మధ్యలో కూర్చుని తుని ఆస్పత్రికి వెళ్లింది. కుమార్తె కనిపించకపోవడంతో బెంగపెట్టుకున్న భవానీకి నిద్రాహారాలు లేవని, దీంతో నీరసించి పోయిందని భర్త గణేష్ తెలిపాడు.కొనసాగుతున్న దర్యాప్తు కాల్ డేటా, సీసీ ఫుటేజ్, ఇతరేతర సాంకేతిక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం. అనుమానితులను విచారిస్తున్నాం. అనుమానిత ఫోన్ నంబర్లు, అటుగా రాకపోకలు సాగించిన వాహనాల కదలికలపై ఆరా తీస్తున్నాం. పెంపుడు కుక్క పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉంది. గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగుతున్నాయి. – బి.కృష్ణమాచారి, ఎస్సై, తుని రూరల్ -
ఈగల్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈగల్ ప్రాంతీయ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఈగల్ అడ్మిన్ ఎస్పీ కె.నగేశ్బాబు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, ఈగల్ విభాగం కట్టుబడి ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయనున్నామన్నారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలన్నారు. ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ , బీటీసీ వైస్ ప్రిన్సిపాల్ నాగశ్రీనివాస్, ఈగల్ సీఐలు పీవీ.సూర్యమోహన్, జి.వెంకటేశ్వరరావు, వై.రాంబాబు పాల్గొన్నారు.కేసుల పురోగతిపై సమీక్ష కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 9 వ అదనపు జిల్లా జడ్జి షణ్ముఖరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు. వివిధ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న న్యాయవాదులతో కేసుల పురోగతిని సమీక్షించారు. క్రిమినల్ కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ల స్థితిగతులపై వివరాలు తెలుసుకున్నారు. 25, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ : జిల్లా మీదుగా ఈ నెల 25, 28 తేదీలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ చర్లపల్లి –కాకినాడ (07817), 28వ తేదీ కాకినాడ– చర్లపల్లి(07818) నంబర్ గల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగనుందని తెలిపారు. -
అక్రమాలను అడ్డుకుంటే కేసులా?
అక్రమ అరెస్టులకు భయపడేది లేదురాజానగరం: నియోజకవర్గంలో సామాన్య ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోతోందని, దోపిడీయే లక్ష్యంగా చెలరేగిపోతున్న మైనింగ్ మాఫియా ఆగడాలను అడ్డుకున్న వారిపై తప్పుడు కేసులు బనాయించి, అరెస్టులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. మండలంలోని మల్లంపూడిలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన జగనన్న కాలనీలో మట్టిని అదే గ్రామానికి చెందిన పప్పు భీమరాజు అక్రమంగా తవ్వి, తరలిస్తున్నాడు. దానిని ఆ గ్రామ మాజీ సర్పంచ్ ముప్పిడిశెట్టి నాగచక్రదొర, అతని కుమారుడు జస్వంత్, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై భీమరాజు ఇచ్చిన ఫిర్యాదుతో రాజానగరం పోలీసులు మాజీ సర్పంచ్, అతని కుమారుడిని అరెస్టు చేసి, 307 కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న జక్కంపూడి రాజా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాజానగరం పోలీసు స్టేషనుకు చేరుకుని, అక్రమాలను అడ్డుకుంటే అరెస్టు చేస్తారా? అంటూ పోలీసు చర్యను నిరసిస్తూ పోలీసు స్టేషను ముంగిటనే బైఠాయించారు. అక్కడనే నిద్రించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడకు తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువుకు గండి – రైతులకు నష్టం అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మల్లంపూడిలో ఉన్న సాగునీటి చెరువుకు గత నెలలో గండి కొట్టి, మట్టి తవ్వకాలకు తెర తీసినప్పుడు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని జక్కంపూడి రాజా అన్నారు. ఆ సమయంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుని, కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశారని, ఇంతవరకు ఎటువంటి చర్యలూ లేవన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును చెత్త బుట్ట పరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ విధంగా నిర్లిప్త ధోరణితో వ్యవహరించడం వల్లనే ఈసారి ఏకంగా జగనన్న కాలనీలో మట్టిని తవ్వేసి, సొమ్ము చేసుకునేందుకు మట్టి అక్రమార్కులు సిద్ధమయ్యారని విమర్శించారు. అది తప్పు అని అడ్డుకున్న వారిపై ఆగమేఘాలపై కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయడం ఏమంత సమంజమని ప్రశ్నించారు. పోలీసుల చర్యకు నిరసనగానే బైఠాయింపు అక్రమ అరెస్టులను నిరసిస్తూ జక్కంపూడి రాజా చేపట్టిన బైఠాయింపు రాజానగరం పోలీసు స్టేషను వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి కూడా పార్టీ కేడర్ భారీగా తరలివస్తున్న క్రమంలో రాజాతో సీఐ వీరయ్యగౌడ్ చర్చలు జరిపారు. మాజీ సర్పంచ్ వర్గీయుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫిర్యాదు తీసుకుని, పప్పు భీమరాజు వర్గీయులు కేసు నమోదు చేసేందుకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు. రాజానగరం పోలీసు స్టేషను ముంగిట బైఠాయించిన జక్కంపూడి రాజాపోలీసు స్టేషనుకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులునియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందని జక్కంపూడి రాజా విమర్శించారు. గోదావరిలో ఇసుక, గ్రావెల్ కోసం కొండలు, మట్టి కోసం చెరువులు, కాలువగట్లు తవ్వుకుంటూ పోతున్న ఈ అక్రమార్కులు జగనన్న కాలనీల్లో కూడా దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి అక్రమాలను అడ్డుకోవడంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపిణా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగేది లేదని జక్కంపూడి రాజా తేల్చిచెప్పారు. పార్టీ కేడర్ కూడా అందుకు సిద్ధంగానే ఉందన్నారు. అయితే ఈరోజు అక్రమార్కులకు అండగా నిలిచి, అధికార పార్టీ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్న అధికారులు మాత్రం ఒకటి గ్రహించాలని, ఈ భోగం శాశ్వతం కాదని, రాబోయే కాలంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది రాజానగరం పోలీసు స్టేషను వద్ద జక్కంపూడి రాజా నిరసన అర్ధరాత్రి నుంచీ 10 గంటలపాటు బైఠాయింపు తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కేడర్ గంటల తరబడి స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం -
ముందస్తు సాగుకు శ్రీకారం
దేవరపల్లి: దాళ్వా సీజన్ పూర్తికావడంతో సార్వా వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముందస్తు సాగుకు శ్రీకారం చుట్టారు. బోర్లు కింద ముమ్మరంగా వరి ఆకుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల నారుమడులు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా వరి నాట్లు వేస్తున్నారు. కొవ్వూరు డివిజన్లోని నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, అనపర్తి, తాళ్లపూడి, మండలాల్లో వరి నాట్లు జరుగుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేయడంతో డెల్టాలో రైతులు వరి నారు మడులు వేస్తుండగా, మెట్ట ప్రాంతంలోని రైతులు బోర్ల కింద ఆకుమడులు వేస్తున్నారు. చెరువులు, తాడిపూడి కాలువ కింద సాగుకు అవసరమైన నారును బోర్ల కింద ఆకుమడులు వేసి నారు పెంచుతున్నారు. మే నెల రెండవ వారంలో వేసిన నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వారం రోజుల నుంచి నారుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు వచ్చే వంగడాల సాగు దాళ్వాలో అధిక దిగుబడులు ఇచ్చే 120 రోజుల పంట కాలపరిమితి వంగడాలు స్వర్ణ–7029, పీఎల్ఏ–1100, ఎంటీయూ–1318, సంపద స్వర్ణ రకాల వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. 60 శాతం మంది స్వర్ణ రకాల వంగడాలను సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు. నెలాఖరుకు ముమ్మరంగా.. సార్వా పంటకు 4,800 హెక్టార్లలో నారుమడులు వేయవలసి ఉండగా, ఇప్పటి వరకు 1,600 హెక్టార్లలో వేశారు. బోర్ల కింద ఆకుమడులు వేసి నారు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు కురిసిన వెంటనే చెరువులు, కాలువ కింద నాట్లు వేస్తారు. ఈ నెలాఖరుకు ఆకుమడులు ముమ్మరంగా వేస్తారని అధికారులు చెబుతున్నారు. 2,200 ఎకరాల్లో నాట్లు జిల్లావ్యాప్తంగా సార్వా సీజన్లో 96,266 హెక్టార్ల వరి సాగు సాధారణ విస్తీర్ణం ఉంది. ఇప్పటి వరకు 2,200 హెక్టార్లలో నాట్లు వేశారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఇప్పటికే రైతులు బోర్ల కింద, కాలువల కింద ఆకుమడులు వేసి పెంచుతున్నారు. నారుమడులు ఆశాజనకంగా, ఆరోగ్యకరంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆకుమడులకు అవసరమైన విత్తనాలు, సాగుకు అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ముందస్తు చర్యలు సార్వా సీజన్కు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ముందుగా రైతులకు పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా 30 రకాల విత్తనాలను సొసైటీల ద్వారా సరఫరా చేశారు. విత్తనాలను10 కిలోల చొప్పున కిట్లు తయారు చేసి అందజేశారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పచ్చిరొట్ట పంటలు వేశారు. వరి పండించే భూముల్లో పచ్చిరొట్ట పంటలు వేసి, పూత దశలో భూమిలో కలియ దున్నుతున్నారు. కొవ్వూరు డివిజన్లో.. కొవ్వూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 93,874 హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. 4,829 హెక్టార్లలో నారుమడులు వేయవలసి ఉండగా, ఇప్పటి వరకు 2,294 హెక్టార్లలో వేశారు. 17,153 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు అవసరం కాగా, ఈ నెలలో 3328 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. ఎల్నినో ప్రభావంతో దీర్ఘకాలిక రకాలను కాకుండా స్వల్పకాలిక రకాల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దేవరపల్లి మండలం యర్నగూడెం, కృష్ణంపాలెం, సంగాయగూడెం, నల్లజర్ల మండలం అనంతపల్లి, నల్లజర్ల, చోడవరం ప్రాంతాల్లో నాట్లు ప్రారంభించారు. వర్షాలు పడితే ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకుంటాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. బోర్ల కింద నాట్లు ప్రారంభం డెల్టాలో ముమ్మరంగా ఆకుమడులు రైతులకు అందుబాటులో విత్తనాలు 1,600 హెక్టార్లలో ఆకుమడులు 96,266 హెక్టార్లలో సాగు అవసరం మేరకు ఎరువులు సార్వా వరి పంటకు అవసరమైన ఎరువులను సిద్ధంగా ఉంచాం. సొసైటీలు, ప్రయివేటు డీలర్ల వద్ద ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ రైతులకు సరఫరా చేస్తున్నాం. బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. 22 వందల ఎకరాల్లో ఇప్పటికి నాట్లు పడ్డాయి. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉన్నందున వరి సాగు విస్తీర్ణం తగ్గించాలని రైతులకు సూచిస్తున్నాం. ఈ ఏడాది సుమారు 4,800 ఎకరాల్లో వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు చర్యలు చేపట్టాం. వర్షాలు పడే అవకాశం లేదు. ఈ నెలలో జిల్లాలో సగటు వర్షపాతం 60 మిల్లీ మీటర్లు నమోదు కావలసి ఉండగా, 27 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదయింది. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎకరం నారుమడి 20 హెక్టార్లలో నాటడానికి సరిపోతుంది. – బి. వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం -
చంద్రబాబు సాధించింది వంచన, అక్రమ అరెస్టులే
రాజమహేంద్రవరం సిటీ: ప్రజలను వంచించడం, ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, జైలుకు పంపించి, కక్ష సాధించడమే రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం సాధించిందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ భరత్రామ్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అక్కడి ప్రజలకే తెలియరని.. అటువంటి వ్యక్తికి జగమెరిగిన, రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని సవాల్ చేసే స్థాయి లేదని అన్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు, 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటు షేరింగ్ వచ్చిన పార్టీ వైఎస్సార్ సీపీ ఒక్కటేనని గుర్తు చేశారు. అన్ని పార్టీలూ కలసి దాడి చేసినా చలించని తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ను విమర్శించే స్థాయి నానాజీకి ఎక్కడుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్ పార్లమెంటరీ భాషతో మాటలు తగవని, జగన్పై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను నానాజీ తక్షణం ఉపసంహరించుకోవాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. జగన్ సామర్థ్యం, పట్టుదల రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని, ఆయనను తిట్టడం వల్ల కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడాలన్న ఆరాటమే నానాజీలో కనిపిస్తోందని అన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్ను తిట్టినందుకు నానాజీ క్షమాపణ చెప్తే సరిపోయేదని, దీనికి బదులు గుళ్లు, గోపురాల్లో ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో పొర్లుదండాల డ్రామా చేశారని విమర్శించారు. ‘ఇంకా రెండున్నర సంవత్సరాలే ఉంది గుర్తు పెట్టుకో నానాజీ.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు, వడ్డీ కలిపి ఇచ్చేస్తాం’ అని భరత్రామ్ అన్నారు. 17 ఏళ్ల రాజకీయ చరిత్రలో జగన్ ఏనాడూ, ఎవరినీ కఠినంగా మాట్లాడిన సందర్భాలు లేవని, అందరితో ఎంతో గౌరవంగా మాట్లాడతారని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోదా మరచిపోయి సభలు, సమావేశాల్లో తొక్క తీస్తా, తోలు వలిచేస్తా అంటున్నారని, ఇదేం భాషని భరత్రామ్ ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ -
పంతం నానాజీపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: నోటికి వచ్చినట్లు కుసంస్కారంగా మాట్లాడుతున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని, అతనిపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన కార్యాయలంలో మాట్లాడుతూ పంతం నానాజీ వ్యాఖ్యలు సభ్యసమాజం హర్షించే విధంగా లేవని, ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. కాపు నేతల సమావేశాన్ని చూసి వారు ఇటువంటి మాటలు మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడించారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అయ్యుండి తాను వాడిన భాషను నానాజీ ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని, ఒక రాజ్యాంగపరమైన బాధ్యతా యుతమైన వ్యక్తి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పవన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
ఉసురుతీసిన బంతాట
ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా బంతితో ఆడుకుంటుండగా, మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెల వద్దకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్తో నీటిలో క్యాచ్లు ఆడుతుండగా, హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా, వారి మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు. పెద్దిపాటి జశ్వంత్కుమార్, హేమంత్ (ఫైల్)ఫ గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి ఫ ధవళేశ్వరంలో ఘటన -
దిగజారుడు భాష మానుకోండి
● జనసేన నేతలకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరిక ● పదవుల కోసం క్యారెక్టర్ను తగ్గించుకోవద్దని మంత్రి దుర్గేష్కు హితవు రాజమహేంద్రవరం సిటీ: జనసేన పార్టీ ఎమ్మెల్యేలు హద్దులు దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మంత్రి కందుల దుర్గేష్ కాపు నేతలపైన, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన హద్దులు దాటి మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. రోజురోజుకీ భాష ఎక్కడికో వెళుతోందని, సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీలో ఉన్న కాపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో పార్టీ ముఖ్య నేతలు సమావేశమైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. కాపులకు ఉపయోగపడాలని సమావేశం పెడితే దానిపైనా చిల్లర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజకీయాల్లో వాడే భాష హుందాగా ఉండాలని, టీడీపీ వాళ్లను ఆదర్శంగా తీసుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పా రు. వైఎస్ జగన్ మాదిరిగా పవన్కళ్యాణ్లో పోరాట పటిమ ఉంటే ఇప్పటికే జనసేన కూడా బలమైన శక్తిగా ఎదిగేదన్నారు. రాజకీయ శక్తిగా ఎదగడం మానేసి.. ‘మరో 15 ఏళ్లు చంద్రబాబుకు ఊడిగం చేస్తాం. జెండా కూలీలుగా పనిచేస్తాం. మళ్లీ కాపులకు చెవిలో పువ్వులు పెడదాం’ అనుకోవడం జనసేన నేతలకు అలవాటైపోయిందన్నారు. -
ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
నిడదవోలు: ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిడదవోలు ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల రాష్ట్ర స్థాయి జేఏసీ పిలుపుమేరకు మంగళవారం ఉద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేశారు. ముందుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ యాజమాన్యం నిర్వహించాలని, ఆర్టీసీ ఉద్యోగులతోనే విద్యుత్ బస్సుల నిర్వహణ జరపాలని నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలని, ఇప్పటికే విద్యుత్ బస్సుల పేరుతో ఖాళీ చేయించిన డిపోలను కొనసాగించాలని పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, సీ్త్ర శక్తి పథకం అమలులో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సిబ్బందిపై పనిభారాన్ని తగ్గించాలని నినదిస్తూ బస్టాండ్ ఆవరణలో భారీ ర్యాలీ చేశారు. జేఏసీ డిపో కన్వీనర్ మేకల శ్రీనివాస్, బొబ్బిలి రాములు నాయకత్వం వహించారు. అటు ప్రభుత్వానికి, ఆర్టీసీ మేనేజ్మెంట్కు ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఇచ్చిన మెమోరాండంను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో జేఏసీగా రాష్ట్ర కమిటీ తీసుకునే ఏ పిలుపుకై నా కార్మికులు సిద్ధంగా ఉన్నారని కార్మిక నాయకులు హెచ్చరించారు. నోటీసుబోర్డులో అర్హుల జాబితా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మద్యపానం, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సెలర్, పీర్ ఎడ్యుకేటర్ పోస్టులకు సంబంధించి తాత్కాలిక అర్హుల జాబితాను ఆసుపత్రి నోటీసు బోర్డులో ఉంచారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కేవీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఈ విషయం తెలిపారు. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27న సాయంత్రం 4 గంటల్లోపు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో పని వేళల్లో లిఖిత పూర్వకంగా అందజేయాలన్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరామన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ఇసుకను అధికంగా వేసుకుని నడపడం, రహదారుల భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక రీచ్ పాయింట్ల నిర్వహణ ఏజెన్సీలు, ట్రాన్స్పోర్టర్లు, సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి జిల్లాలో పరిమితికి మించి ఇసుకను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం వాహన యజమానులు, ట్రాన్స్పోర్టర్లపైనే కాకుండా అధిక లోడుతో వాహనాలను పంపిస్తున్న రీచ్ నిర్వహణ ఏజెన్సీలపైనా చర్యలు తీసుకుంటామన్నారు. . ఆత్మహత్య ఘటనపై విచారణ చేయాలి చాగల్లు: తన కుమారుడు రవిచంద్ర ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చిట్టూరి ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ భవనం పైనుంచి దూకి 7వ తరగతి విద్యార్థి రవిచంద్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మృతుడి తండ్రి ప్రవీణ్ మంగళవారం రాత్రి కొవ్వూరు రూరల్ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఈ నెల 25న కొవ్వూరు సీఐ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. -
కూలికి వెళ్లి మృత్యుఒడికి..
రంగంపేట/సామర్లకోట: వారందరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు. బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు పనికి వెళ్లారు. దాన్ని పూర్తి చేసి సంతోషంగా స్వగ్రామాలకు బయలుదేరారు. ఇంకో 20 కిలోమీటర్లు అంటే అరగంటలో గమ్యానికి చేసుకుంటారనగా మృత్యువు కబళించింది. మినీ వ్యాన్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పనుల కోసం గుంటూరు జిల్లాకు.. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం జల్లూరు తదితర గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో సిమెంట్ పలకలతో గోడల ఫెన్సింగ్ పనులకు వెళ్లారు. వాటిని పూర్తి చేసుకుని సోమవారం రాత్రి మినీ వ్యాన్లో స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వాహనం రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఏడీబీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనంలోని సిమెంట్ పలకలు పడడంతో ముగ్గురు మృతి చెందారు. వారిని సామర్లకోటకు చెందిన మసకపల్లి బాలు (21), మురముళ్ల రాజ్ కుమార్ (25), తాతపూడి రాజేష్ (22)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని 108 అంబులెన్స్లో పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సుమంత్ తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబాల్లో విషాదం మృతుల్లో మసకపల్లి బాలు (20)కు ఐదేళ్ల క్రితమే చైతన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పూజ అనే కుమార్తె ఉంది. నాన్న వస్తాడు, మనకు బట్టలు తెస్తాడు అని ఆ పసిపాపకు తల్లి చెబుతున్న సమయంలోనే, తండ్రి ఇక లేడన్న వార్త వచ్చింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ చైతన్య, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇక రాజేష్, రాజ్ కుమార్ల మరణాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపాయి. వరుస మరణాలు సామర్లకోటలోని కుమ్మరి వీధిని మరణాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తరచూ మా వీధినే ఎందుకు ప్రమాదాలు వెంటాడుతున్నాయంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. పెద్దాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుమసకపల్లి బాలు, తాటపూడి రాజేష్, మురముళ్ల రాజ్కుమార్ (ఫైల్) క్షతగాత్రులను 108లోకి ఎక్కిస్తున్న సిబ్బంది ఫ వడిశలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం ఫ కూలీలతో వెళుతున్న మినీ వ్యాన్ బోల్తా ఫ ముగ్గురి మృతి, ఎనిమిది మందికి గాయాలు ఫ గుంటూరు జిల్లాలో పనికి వెళ్లి వస్తుండగా ఘటన -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
గోదావరిలో యువకుడి గల్లంతు
సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన కట్టుబోయిన అజయ్ (15) ప్రమాదవశాత్తూ పడవ నుంచి పడి గోదావరిలో గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం గోదావరి మధ్యలోని ములకల్లంక పశు వుల పాకకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు తిరి గి బొబ్బిల్లంకకు రావడానికి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు ప్రయాణం చేసే మరపడవలపై కాకుండా కూలీల పడవపై మరో ఇద్దరి తో అజయ్ ఎక్కాడు. పడవ తెడ్డు వేస్తుండగా గోదావరి మధ్యలోకి చేరుకున్న తరువాత అదుపుతప్పి గోదావరిలో జారిపడి గల్లంతయ్యాడు. మృతదేహం కోసం స్థానికులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోదావరిలో దూకి ఆత్మహత్య మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన కుప్పాల పెదకాపు (43) ఆరోగ్య పరిస్థితి బాగాలేక సోమవారం ఉదయం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుగర్ వ్యాధితో బాధపడుతున్న పెదకాపు కాలి వేళ్లు తీసివేయాలని వైద్యులు చెప్పడంతో మనస్థాపం చెంది ఉదయం 6 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని చెప్పి వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 11 గంటలకు మృతదేహం లభ్యమవగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. తల్లిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్ పిఠాపురం: అడిగిన వెంటనే మంచినీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిపై దాడి చేసి ఆమె మరణానికి కారణమైన కేసులో నిందితుడిని సోమవా రం అరెస్టు చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన పెంటా రాజబాబు తన ఇంట్లో భోజనం చేస్తూ తల్లిని మంచినీరు ఇవ్వాలని అడిగాడు. తల్లి మంచినీరు ఇవ్వడానికి ఆలస్యం చేసిందన్న కోపంతో తన తల్లి నాగమణి ని తలను బల్లకేసి గట్టిగా అదిమి కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు రాజబాబుపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు ఆయన తెలిపారు. -
కాసులకు కక్కుర్తిపఢీ
సాక్షి, అమలాపురం: అఖండ గోదావరితో పాటు ఏలేరు.. పంపా.. తాండవ నదీ పాయల మధ్య దొరికే ఇసుక, లంకల్లోని మట్టి.. మెట్ట ప్రాంతంలోని తూర్పు కనుమల్లో లభ్యమయ్యే బ్లాక్ మెటల్.. రెడ్ గ్రావెల్ ప్రభుత్వానికి ఆదాయం అందించడంతో పాటు అక్రమార్కులకు అక్షయపాత్రలుగా మారాయి. వీటి రవాణా సామాన్యులకు ప్రాణసంకటంగా పరిణమించింది. అనుమతి ఉన్న ర్యాంపుల నుంచే కాకుండా, అక్రమ తవ్వకాల ప్రాంతాల నుంచి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపు సమయంలో టిప్పర్లు, క్వారీ లారీలు, ట్రాక్టర్లు వేగంగా వెళ్లి ఢీకొనడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలను బలిగొంటోంది. ట్రిప్పులు ఎక్కువ వేస్తే సొమ్ము ఎక్కువగా వస్తుందనే అత్యాశ.. పలువురి ప్రాణాలను మింగేస్తోంది. ఇలా అనేక ప్రమాదాల్లో మృతువాత పడినవారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అక్రమ ఇసుక, మట్టి రవాణా కోసం అర్ధరాత్రి రోడ్డెక్కుతున్న టిప్పర్లు, లారీల వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారం వారం పెను విషాదాలకు కారణమవుతున్నాయి. రహదారుల్లో రక్తసిక్తం ● అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విళ్ల గీతారాణి (24) గత నెల రెండో తేదీ తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో చనిపోయింది. తన తండ్రితో కలసి వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న సమయంలో అతివేగంగా వస్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొంది. టిప్పర్ ఆమెను 30 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. తండ్రి వీర్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలన్న ఆమె కలను కష్టపడి చదివి సాధించింది. మంచి కంపెనీలో ఉద్యోగం సైతం పొందింది. కానీ వీధి టిప్పర్ రూపంలో కాటేసింది. ● ఈ ఏడాది మార్చి 21న పి.గన్నవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఊడుమూడి గ్రామానికి చెందిన రైతు విళ్ల నాగేశ్వరరావు (63) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని ఆపకుండా తిరిగి లంక గ్రామంలోకి వెళ్లి మట్టిని దించి అక్కడి నుంచి పరారయ్యాడు. ● అంబాజీపేట మండలం గంగలకుర్రు వంతెన వద్ద ఈ నెల 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత నాగ (ఫణి) మృతి చెందాడు. ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నల్లా సుభాష్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఫణి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ● అంబాజీపేట మండలం గంగలకుర్రులో గత ఏడాది ఏప్రిల్ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగిపూడి నాగరాజు అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అతని సోదరుడు రామచంద్రరావును ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృత్యువాత పడ్డారు. ● మండపేట పట్టణం ఏడిద బైపాస్ నాలుగు రోడ్ల జంక్షన్లో మే 9న టిప్పర్ ఢీకొన్న ఘటనలో పట్టణానికి చెందిన అన్నదమ్ముల కుమారులు దార్ల దుర్గాప్రసాద్ (43), దార్ల శివకుమార్ (34)లు అక్కడికక్కడే మృతి చెందారు. ● కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ వద్ద గత నెల 16న టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు ఉపాధి కూలీలు మృతి చెందారు. ● కోరుకొండలో గత నెల 18న మట్టి లోడు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నొక్కి రాజీవర్మ (27) మృత్యువాత పడ్డాడు. ప్రమాదాలు.. ఇవే కారణాలు లారీ డ్రైవర్ రోజుకు 24 గంటల పాటు నిరాటంకంగా విధులు నిర్వహించాలి. రోజుకు రూ.వెయ్యి జీతం, అదనంగా రూ.ఐదు వందల బేటా. స్థానికంగా అయితే రోజుకు పది ట్రిప్పులు. దూరమైతే ఐదు ట్రిప్పులు వేస్తున్నారు. ఇసుక కొనుగోలు చేసేవారు ట్రిప్పునకు రూ.రెండు వందల వరకు అదనంగా ఇస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు బేటాలకు ఆశపడి అదనపు ట్రిప్పులే వేస్తే కొనుగోలుదారులు మరో రూ.రెండు వందలు, యజమానులు కూడా అదనంగా బేటా ఇస్తారనే అత్యాశతో మితిమీరిన వేగంతో లారీలు, టిప్పర్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనుభవం ఉన్న డ్రైవర్లను పెద్ద నిర్మాణ సంస్థలు అధిక జీతాలతో నెలల తరబడి ఉద్యోగాలకు తీసుకుంటున్నారు. దీంతో డ్రైవర్ల కొరత ఏర్పడింది. ఇసుక, గ్రావెల్ వాహనాలు నడుపుతున్న వారిలో చిన్న వయసు వారే ఎక్కువ. వయసులో ఉండే అతి ఉత్సాహం, వేగ నియంత్రణ లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. సగం మందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 24 గంటల పాటు ఏకధాటిగా పని. పైగా ఈ సీజన్లో ఓవర్ టైమ్ కూడా చేస్తున్నారు. దీంతో నిద్ర ఉండడం లేదు. పైగా మ ద్యం, ఇతర వ్యసనాలతో వారు టిప్పర్లు, లారీలను నడపడంతో నియంత్రణ కోల్పోతున్నారు. -
అంతర్జాతీయ జర్నల్లో కాకినాడ వైద్యుడి పరిశోధన
కాకినాడ క్రైం: కోవిడ్ వేళ వ్యాధి నివారణకు తాను చేసిన మూడు మాత్రల పరిఽశోధన అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైందని కాకినాడ వైద్యుడు యనమదల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నల్ ఆఫ్ ప్రైమరీ కేర్ స్పెషాలిటీస్ మే–ఆగస్టు 2026 సంచికలో తాను ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆస్ప్రిన్, ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్ వైద్య విధానం ఎంతో సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. 2021లో అప్పటి వైద్య రీతులను అనుసరించిన 60 మందితో తన వైద్య విధానాన్ని సరిపోల్చితే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తన పరిశోధనను అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారని మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. -
లక్కీ డ్రా పేరుతో ప్రజలకు టోకరా
● రూ.6 కోట్ల వసూలు ● నిర్వాహకుడి అనుమానాస్పద మృతి ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదు దేవరపల్లి: లక్కీ డ్రా స్కీమ్ పేరుతో వందలాది మందికి టోకరా వేసిన నిర్వాహకుల ఉదంతం నల్లజర్ల మండలం పోతవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దాదాపు ఐదేళ్లుగా బల్లం రాజ్కుమార్, మరి కొంతమంది కలసి శ్రీశ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్ నడుపుతున్నారు. నల్లజర్ల, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సుమారు 1500 మంది నుంచి లక్కీ డ్రా పేరుతో సొమ్ములు కట్టించుకున్నారు. రూ.150, 300, 500, 1000 కార్డులను ఇచ్చి ప్రజల నుంచి వారం వారం, 15 రోజులకోసారి, నెల వారీగా సొమ్ము కట్టించుకున్నారు. డ్రాలో తగిలిన వ్యక్తులకు కొంత కాలం నిబంధనల మేరకు వస్తువులు ఇచ్చారు. ఈ విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఒక్కో బాధితుడు సుమారు రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు కట్టారు. సుమారు 100 మందికి డబుల్ కాట్లు, 60 మందికి సింగిల్ కాట్లు, పరుపులు, 200 మందికి ల్యాప్టాప్లు ఇవ్వాల్సి ఉంది. బాధితుల నుంచి సుమారు రూ.6 కోట్లు వసూలు చేశారు. డ్రాలో తగిలిన లబ్ధిదారులకు సరకులు ఇవ్వకుండా నిర్వాహకుడు రాజ్కుమార్ కాలయాపన చేస్తూ కుంటిసాకులు చెబుతూ వస్తున్నాడు. ఇటీవల నిర్వాహకుడు రాజ్కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అతని ఇంటికి వెళ్లి తాము కట్టిన సొమ్ములు లేదా సరకులు ఇవ్వాలని అతడి కుటుంబ సభ్యులను కోరారు. దీనికి వారు సమాధానం చెప్పకపోగా, లక్కీ డ్రా గురించి తమకు తెలియదని, ఒత్తిడి చేస్తే కేసు పెడతామని బెదిరించినట్టు బాధితులు తెలిపారు. తాము మోసపోయామని గ్రహించిన పోతవరానికి చెందిన బాధితులు సోమవారం నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా సుమారు 1500 మంది మోసపోయినట్టు బాధితులు తెలిపారు. సుమారు రూ.6 కోట్లు నిర్వాహకులు వసూలు చేసి, మోసం చేసినట్టు లబ్ధిదారులు వివరించారు. నిర్వాహకుల్లో ఒకరు మృతి చెందినప్పటికీ మిగిలిన నిర్వాహకులు సొమ్ము చెల్లించడానికి ముఖం చాటేశారని బాధితులు వాపోతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరారు. -
కొబ్బరి ధరహాసం..
నాణ్యతను బట్టి ధర వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.9 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉండవలన మా పంట పండింది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు గిట్టుబాటు ధర గతంలో వ్యాపారస్తుల చుట్టూ తాము తిరిగేవాళ్లం. కానీ నేడు వ్యాపారస్తులు మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర చూడలేదు. దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తోంది. – నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు కొబ్బరికి డిమాండ్ ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. ఈ ధరలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్కు తరలిస్తున్నాం. – అడబాల బ్రహ్మయ్య, వ్యాపారి, అన్నవరప్పాడు పెరవలి: కొబ్బరి కాయలకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు, వ్యాపారస్తుల మోముల్లో ధరహాసం వెల్లివిరుస్తోంది. మార్కెట్లో నెల రోజుల క్రితం వెయ్యి కాయల ధర రూ.11 వేలు కాగా.. ప్రస్తుతం రూ.15 వేలు పలుకుతుంది. కాయల నాణ్యతను బట్టి రైతుల నుంచి కాయను రూ.9 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి కొబ్బరి కాయల ధర తగ్గడమే తప్ప పెరగలేదు. గత మూడు నెలల నుంచి కొబ్బరి కాయలకు డిమాండ్ లేకపోవడంతో బొండాలు తీయడంతో కొబ్బరి కాయలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతుల వద్దకే నేరుగా వ్యాపారస్తులు వచ్చి రూ.9 నుంచి రూ.10 ఇచ్చి కాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరికాయ ధర నాణ్యతను బట్టి రూ.14 వేల నుంచి రూ.15 వేలు పలుకుతున్నా రైతులకు మాత్రం దక్కేది కేవలం రూ.9 నుంచి రూ.10 అని అంటున్నారు. ఎందుకంటే దింపు తీయాలంటే దింపు కార్మికులకు, కాయలు పోగుచేసే కూలీలు, కాయల మోత కూలీలు, ఒలుపు, రవాణా వంటి ఖర్చులు పెరగడంతో రైతులకు మాత్రం దక్కేది ఇందులో సగమే. రైతులకు ఎటువంటి ఖర్చులు లేకుండా నేరుగా చేను వద్దకే వచ్చి కాయకు రూ.9 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెడితే కాయ నాణ్యతను బట్టి రూ.14 వరకూ చెల్లిస్తున్నారు. జిల్లాలో సాగెంత? ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేలగట్లు, పుంత గట్లు, చెర్వు గట్లు, లంకభూముల్లోనూ కొబ్బరి సాగు చేస్తున్నారు. గతంలో ఎకరానికి 600 నుంచి 800 కాయలు పడితే.. నేడు తోటలు ఆరోగ్యంగా ఉండటం వల్ల 1200 నుంచి 1500 కాయల దిగుబడి వస్తుంది. ధరలు పెరగడానికి కారణాలివే.. కొబ్బరికి మార్కెట్లో ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత మూడు నెలల నుంచి కొబ్బరికి డిమాండ్ లేకపోవడంతో రైతులు కొబ్బరి బొండాలను తీసివేయడంతో కాయలకు కొరత ఏర్పడింది. దీంతో ధర ఈ నెల నుంచి క్రమేపీ పెరుగుతూ నేడు రూ.15 వేలకు చేరింది. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవడం కూడా మరో కారణం. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. పెరిగిన ఎగుమతులు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల కాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఈ రెండు జిల్లాలో ప్రధాన మార్కెట్లు అంబాజీపేట, పాలకొల్లు నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల సరకు వెళుతోంది. జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 70 వేల హెక్టార్లలో పంట వెయ్యి కాయలకు రూ.11 వేల నుంచి రూ.15 వేలకు ఎగబాకిన ధర నిత్యం 300 నుంచి 400 లారీల ఎగుమతులు -
చర్యలకు వెనకడుగు ఎందుకో?
● టికెట్ల స్కామ్ కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ ● నివేదిక సిద్ధంగా ఉన్నా చర్యలు శూన్యం ● అధికారులు వెనకాడుతున్నారంటూ ఆరోపణలు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ ఏడాది మార్చి 15న వెలుగులోకి వచ్చిన రూ.200ల నకిలీ టికెట్ల స్కామ్ అప్పట్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. భక్తుల దర్శనం టికెట్ల వ్యవహారంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై అప్పటి ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరిపిన భీమడోలు సీఐ పి.కృష్ణ నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ఎన్ఎంఆర్ ఉద్యోగి, ఒక సెక్యూరిటీ సూపర్ వైజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, తాడేపల్లిగూడేనికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మొత్తం 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు. వారంతా ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అప్పట్లో శాఖాపరమైన విచారణ (డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ) నిర్వహించిన దేవస్థానం ఈఈ డీవీ భాస్కర్ సంబంధిత నివేదికను ఈఓ భద్రాజీకి ఏప్రిల్ 6న సమర్పించారు. జాబ్చార్ట్ ప్రకారం సదరు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. చర్యలు శూన్యం విచారణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత ఉద్యోగులపై అధికారులు ఏ విధమైన శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విచారణ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ దానిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తప్పుబడుతున్న భక్తులు నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ దాదాపు ఏడాది పాటు సాగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సంబంధిత అధికారులు, సిబ్బంది అలసత్వం, పర్యవేక్షణ లోపాలే ఈ స్కామ్ జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలయ ఆదాయానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే స్థాయిలో జరిగిన ఈ వ్యవహారంలో బాధ్యులపై ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని భక్తులు, స్థానికులు తప్పుబడుతున్నారు. రెండూ వేర్వేరు.. డిపార్ట్మెంట్ ఎంక్వయిరీకి, పోలీసుల విచారణకు ఎలాంటి సంబంధం లేదని, శాఖాపరమైన విచారణ ఆధారంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎవరి కోసం చర్యలు తీసుకోవడం లేదో అర్థంలేదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే టికెట్ల స్కాం కేసుకు సంబంధించిన చార్జ్షీట్ను పోలీసులు ఇంకా కోర్టులో దాఖలు చేయలేదు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి కలసి ప్రజల నుంచి మొత్తం 186 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్, మీ సేవా కేంద్రాలు, అలాగే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫిర్యాదులు, వినతులను నమోదు చేసుకోవచ్చన్నారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వం, సర్వే తదితర రెవెన్యూ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. చినవెంకన్న హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. సత్యదేవునికి భారీగా హుండీ ఆదాయం అన్నవరం: పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
మాల సామాజికవర్గం ఐక్యం కావాలి
రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ కపిలేశ్వరపురం (మండపేట): మాల సామాజిక వర్గీయులంతా దేశ వ్యాప్తంగా ఐక్యం కావాల్సిన సమ యం ఆసన్నమైందని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మండపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో దళితులను అణచివేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఆయా పాలకులు చేసిన చట్టాలు శిలాశాసనాలు కాదని, వారి పాలనలో దళిత సామాజిక వర్గానికి లభిస్తున్న ఫలితాలేంటన్న అంశాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. రిజర్వేషన్ల పేరుతో ఇచ్చే నూటికి రెండు శాతం ఫలితాలు ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకూ ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అలా పరిమితంగా అమలు చేసేదాన్ని సామాజిక న్యాయమని ఎలా పిలవగలుతున్నారని నిలదీశారు. రిజర్వేషన్లు అనగానే కేవలం ఉద్యోగాల వరకు మాత్రమే కాదని, చంద్రబాబు, రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో అమలు చేయరా అని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లోని జడ్జిల నియామకాల్లోనూ, ఇతర రాజ్యాంగ వ్యవస్థల్లోనూ అమలు కావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అన్నది దళిత వర్గంపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా ఐక్యం కావాలని, ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీల గొడుగుల కింద ఉన్న దళిత సామాజిక వర్గీయులు ఆలోచన చేయాలని రత్నాకర్ కోరారు. -
రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు ఎంతో ప్రతిష్టాత్మకం. అలాంటి వేడుకలు 2027 జూన్ 27వ తేదీ నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. భక్తుల వసతుల కల్పనకు ఆరు జిల్లాల పరిధిలో రూ.8,500 కోట్ల నిధులతో 7 వేల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. నేటికీ నయాపైసా విడుదల కాకపోయినా.. నిధులు విడుదలపై గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. రానున్న సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభమవుతాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పుష్కరాల బడ్జెట్ను టార్గెట్ చేశారు. ఈ పనులను దక్కించుకుని నిధులు కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర పనులు దక్కాలంటే.. తమకు అనుకూలమైన అధికారులు ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ అడుగులకు మడుగులొత్తే అధికారుల కోసం వెతుకుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. వీళ్లతో కాదులే..? తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్ తెప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులతో పుష్కర పనులు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే అధికారులు చేపడుతున్న పనులను తప్పుబడుతున్నారు. వారు తయారు చేసిన ప్రతిపాదనలకు వంకలు పెడుతున్నట్లు సమాచారం. ఏదో విధంగా తమకు నచ్చని వారిని సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ జిల్లా స్థాయి అధికారి, మరో కార్పొరేషన్లో ఓ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. వారి స్థానంలో తాము ప్రతిపాదించిన వారిని నియమించాలని కోరినట్లు సమాచారం. కాంట్రాక్ట్ కొట్టేసేందుకు పావులు పుష్కర పనుల కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యహాలు రచిస్తున్నారు. దీనికోసం మరో అడుగు ముందుకేసి అవసరమైతే తామే స్వయంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల పనుల్లో ఎంత వీలైతే అంత ఆర్జించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రూపాయి ఖర్చు చేసి రూ.వంద సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇందుకు కాంట్రాక్టుల కోసం బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఏం చేసినా ఈ ఏడాదిలోనే సంపాదించాలనే ఆశతో ఉన్నారు. పుష్కర బడ్జెట్లో ఎవరు ఎక్కువ నిధులు తెచ్చుకుంటే, అంత ఎక్కువ దండుకోవచ్చన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అత్యధిక నిధులు తమకే కేటాయించాలని, జనసేన ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ కలసికట్టుగా ఉంటే.. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పుష్కర పనుల్లో ఏ పనైనా.. 20 శాతం వాటా మిగులుతుందని గత అనుభవాల ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కొత్తగా మోడల్ స్నాన ఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చైన్నె క్రౌడ్ మేనేజ్మెంట్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. అందులో భాగంగా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మోడరన్ స్నానఘట్టం నిర్మాణం, కొవ్వూరు మండలం పెద్ద వాడపల్లి గ్రామం వద్ద రెండు కిలోమీటర్ల మేరకు స్నానఘట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో అభివృద్ధి పనులుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి భరత్రామ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో కల్తీ పాల ఘటనలో బాధితులకు మెరుగైన చికిత్స అందక మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు కలసి బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారని, ఈ రోజు వరకూ సరైన వైద్యం అందించిన దాఖలాలు వేవనన్నారు. బాధిత బాలల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.మూడున్నర లక్షలు ఖర్చయ్యిందని, ప్రభుత్వం ఆ సొమ్ము ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా ఉండే బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారని భరత్రామ్ మండిపడ్డారు. ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే కుట్రలో భాగమేనని, అతని ఒత్తిడి మేరకు పోలీసులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం నగర టీడీపీలో 40వ వార్డు పరిసరాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, కొట్టిన వారు పెట్టిన కేసును పోలీసులు నమోదు చేశారని, దెబ్బలు తిన్న వారిని అరెస్టు చేశారన్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ అమలు చేయడం దారుణమన్నారు. బోట్మెన్ సొసైటీల పేరుతో గామన్ బ్రిడ్జి వద్ద రాత్రి పగలు తేడా లేకుండా డ్రెజ్జింగ్ బోట్లతో ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. గామన్ బ్రిడ్జి ప్రమాదంలో పడుతోందని, స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇసుక దోపిడీ జరుగుతోందని, సామాన్యులకు మాత్రం ఇసుక దొరకడం లేదని విమర్శించారు. ఇసుక దోపిడీకి సంబంధించి సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్కు అందజేశామని చెప్పారు. ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు వ్యతిరేకమని, తన హయాంలో వీరభద్రనగరం వద్ద పాత కబేలా స్థలంలో ముస్లింలకు 2,500 చదరపు గజాలు (50 సెంట్లు) షాదీ ఖానాకు కేటాయించానని, దానికి రూ.50 లక్షలు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు కేటాయించలేదని, పనులు కూడా ప్రారంభించలేదని, దీనిపై ప్రస్తుత ఎంపీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. షాదీఖానా నిర్మాణం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు ఉన్నారు. నిధుల ప్రతిపాదనలు ఇలా..గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 242 గ్రామాల్లో గోదావరి పుష్కరాల పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు కింద టూరిజం శాఖకు చెందిన రూ.94 కోట్లతో రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, హేవలాక్ బ్రిడ్జి పాదచారుల వంతెనగా పనులు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రమేయం లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్నారని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పుష్కర పనుల్లో భాగంగా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.240 కోట్లతో ప్రతిపాదించిన పనులకు శంకుస్థాపన చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గోదావరి జలాల కాలుష్య నివారణకు రూ.100 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నారు. కేంద్రం సైతం రూ.100 కోట్లు కేటాయించింది. అయితే ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రస్తుతం పుష్కర పనులపై గందరగోళం నెలకొంది. అందుకే ఎమ్మెల్యేలు అధికారులను బదిలీ చేసి... తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. గోదావరి పుష్కరాల నిధులు కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారా..? అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందుకు తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారా..? నిక్కచ్ఛిగా ఉన్న అధికారులను సాగనంపేందుకు కుట్రలు పన్నుతున్నారా..? ఆ దిశగా పైరవీలకు దిగుతున్నారా..? అందులో భాగంగా పుష్కరాలకు రూ.8,500 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపారా..? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల సమాధానం వస్తోంది. ఫ పుష్కర నిధులు కొల్లగొట్టేందుకు వ్యూహాలు ఫ పైరవీలకు ప్రజాప్రతినిధుల కసరత్తు ఫ అనుకూల అధికారులను తెచ్చుకునేందుకు పావులు ఫ కల్తీ పాల ఘటనలో బాధితులకు అందని మెరుగైన వైద్యం ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజం -
నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ను పూర్తి చేయండి
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)– 2026 కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు, స్వీకరించిన ఫారాలను సమాంతరంగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. సోమవారం రాజమహేంద్రవరం మండలం హుకుంపేట, మోరంపూడి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. సంబంధిత బీఎల్ఓలు మాట్లాడుతూ, తమ పరిధిలో 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్నారని, అందులో సుమారు 60 శాతం మంది మ్యాపింగ్ పూర్తయ్యిందని తెలిపారు. కొంతమంది ఓటర్లు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, గత నివాస వివరాలను ధ్రువీకరిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల వివరాల నిర్ధారణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ ప్రజలతో నేరుగా మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఇన్చార్జి డీఆర్వో కె.భాస్కర్రెడ్డి, సహాయ ఈఆర్వో శ్రీనివాస్, ఎంపీడీఓ కె.సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. 1న డీసెట్ రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ లేదా సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. -
ప్రశాంతంగా ‘నీట్’
90.02 శాతం హాజరు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, జేఎన్టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్ కట్ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
అంబాజీపేట: ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగలకుర్రు – మొసలపల్లి రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మొసలపల్లి టర్ఫ్ (వంతెన)కు కూతవేటు దూరంలో అంబాజీపేట కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత్ నాగ (ఫణి) (14), నల్లా సుభాష్లు యాక్టీవా స్కూటర్పై గంగలకుర్రు నుంచి అంబాజీపేట వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుల్లేటికుర్రు నుంచి గంగలకుర్రు వైపు వెళుతున్న ఇసుక లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొంది. దాంతో ప్రణీత్ నాగ అక్కడికక్కడే మృతి చెందగా, సుభాష్కు తీవ్రగాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. మృతుడికు తల్లి, తండ్రి, అక్క ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ప్రణీత్ నాగ కొద్ది క్షణాలకే ఇలా కావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న బాలుడి తండ్రి, రామకృష్ణ, చిన్నాన్న రాజులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే నీవు లేవన్న మాట జీర్ణించుకోలేకపోతున్నామని బోరున విలపించారు. మృతుడు స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.మరొకరికి తీవ్ర గాయాలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
యూరియా బస్తాల చోరీకి యత్నం
● రైలు బోగీ నుంచి దించిన దుండగులు ● సంచలనం రేపిన ఘటన సామర్లకోట: రైలు బోగీలో యూరియా బస్తాల చోరీకి ప్రయత్నించిన సంఘటన ఇది. కాకినాడ నుంచి విశాఖపట్నంకు గూడ్స్ బోగీలో యూరియా బస్తాలు వెళుతున్నాయి. సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్దకు వచ్చిన తరువాత బైపాస్ కేబిన్ వద్ద గూడ్స్ రైళ్లు విశాఖపట్నం వెళ్లడానికి సిగ్నల్ కోసం ఆగుతుంటాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న గూడ్స్ రైలు ఉండూరు రైల్వే గేటు దాటిన తరువాత సిగ్నల్ కోసం ఆగింది. ఈ క్రమంలో కొంత మంది దుండగులు రైలు బోగీ తాళం పగలు కొట్టి బోగీలో ఉన్న యూరియా బస్తాలను పొలాల వైపు దింపారు. ఇంజిన్ నుంచి మూడో బోగీలో ఈ చోరీ జరగడంతో శబ్దంతో పాటు కొంత మంది మనుషులు సంచరిస్తున్న విషయాన్ని సిబ్బంది గమనించి వెంటనే రైల్వే మేనేజరు ఎం.రమేష్కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే ఐఆర్ఎంకు తెలియజేశారు. దాంతో స్థానిక ఆర్పీఎఫ్ అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని యూరియా బస్తాలు బోగీ నుంచి పొలాల్లోకి దింపిన విషయాన్ని గమనించారు. రైల్వే అధికారులు వస్తున్న విషయాన్ని గుర్తించిన దుండగులు పరారయ్యారు. పొలాల్లో దింపిన సుమారు 60 యూరియా బస్తాలను ఆర్పీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఆర్పీఎఫ్ సీఐ మధు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన యూరియా బస్తాలతో రైలు బోగీకి సీల్ వేసి గూడ్స్ రైలును పంపామని రైల్వే మేనేజర్ రమేష్ తెలిపారు. -
పరీక్షకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
వ్యక్తి మృతి, యువతికి తీవ్ర గాయాలు కాజులూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. పాతర్లగడ్డకు చెందిన పెండుం సుధీర్కుమార్ (30) తన సమీప బంధువైన మాదుర శ్రీవల్లిని తన బైక్పై రాజమహేంద్రవరంలో నీట్ రాసేందుకు తీసుకువెళ్లాడు. తిరిగి తీసుకువస్తుండగా, గొల్లపాలెం తిరుమల ఫంక్షన్ హాల్ వద్ద మలుపులో కాకినాడ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో సుధీర్కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మాదుర శ్రీవల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రురాలు శ్రీవల్లిని గొల్లపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
గొల్లపల్లి ఇంట విషాదం
రావులపాలెం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు ఇంట విషాదం నెలకొంది. సూర్యారావుకు ఇద్దరు కుమారులు కాగా, ఇందులో రెండో కుమారుడు ప్రసాద్ (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన ప్రసాద్ రావులపాలెంలోని తన ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చిన్న కుమారుడు గొల్లపల్లి ప్రసాద్ మృతి అత్యంత విషాదకరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జగ్గిరెడ్డి రావులపాలెంలో గొల్లపల్లి సూర్యారావు నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్రి అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. నేతల సంతాపం గొల్లపల్లి సూర్యారావును పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి, సంతాపం తెలిపారు. ఇందులో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, మాజీ ఎంపీటీసీ జవ్వాది రవిబాబు తదితరులు ఉన్నారు.చిన్న కుమారుడి మృతి -
సత్యదేవుని ధ్వజస్తంభంపై ఒరిగిన సుదర్శన చక్రం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభం మీది సుదర్శన చక్రం ఇటీవల ఈదురు గాలులకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో, ఆ చక్రాన్ని ఈ నెల 24న కిందకు దించి, ఆలయంలో భద్రపరచి, 25వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, తిరిగి పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని ధ్వజస్తంభంపై అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుని ఆలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో.. 2024 మే నెలలో కొత్తది ప్రతిష్ఠించారు. దీనికి బంగారు రేకును అదే ఏడాది ఆగస్టులో అమర్చారు. ఆ సమయంలోనే స్వర్ణ సుదర్శన చక్రాన్ని కూడా కలశలతో పాటు ధ్వజస్తంభంపై అమర్చారు. గత వారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఈ సుదర్శన చక్రం ఉత్తరం వైపు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఈ నెల 16వ తేదీన గుర్తించి, దేవస్థానం ఆగమ పండితుల కమిటీతో చర్చించారు. వారి సూచన మేరకు ఆ చక్రానికి సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. -
కాలిపోయిన కోళ్ల వ్యాన్
చింతూరు: రహదారి పక్కన ఆపిన కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా కాలిపోయింది. ఈ సంఘటన చింతూరు కాటుకపల్లి వద్ద జాతీయ రహదారి–30పై ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చింతూరులోని కోళ్ల వ్యాపారి శ్రీనుకు చెందిన వ్యాన్ కోళ్లు తీసుకువచ్చే నిమిత్తం తెలంగాణలోని సత్తుపల్లికి బయలుదేరింది. ఈ క్రమంలో కాటుకపల్లి వద్ద వాటర్ బాటిల్ కొనేందుకు డ్రైవర్ వ్యాన్ను ఆపి పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లగా, వ్యాన్ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. దేవరపల్లిలో లారీ.. దేవరపల్లి: కడియం నుంచి రాజస్థాన్కు మొక్కలను తరలిస్తున్న లారీలో 16వ నంబరు జాతీయ రహదారిపై దేవరపల్లి వద్ద మంటలు రేగాయి. లారీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలుపుదల చేసి కిందకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. హైవే పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దేవరపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రశాంతంగా నీట్
21ఆర్జేసీ361–270096 కలెక్టర్ కీర్తికలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ కీర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని కేంద్రాల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేసి, బయోమెట్రిక్ నమోదు, సీసీ కెమెరాలు, జామర్లు, భద్రతా చర్యలను సమర్ధంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో 3,363 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 3,066 మంది హాజరయ్యారని, 297 మంది గైర్హాజరయ్యారని ఆమె తెలిపారు. మొత్తం హాజరు శాతం 91.17 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో సహకరించిన అన్ని శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. కేంద్రాల వారీగా హాజరు ఇలా.. ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మందికి 526 మంది హాజరైయ్యారన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (అటానమస్)లో 507 మందికి 457, నన్నయ వర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 504 మందికి 460, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 240 మందికి గాను 225, కేంద్రీయ విద్యాలయ, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో 360 మందికి 328, ఎస్కేవీటీ ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 360 మందికి 329, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 288 మందికి 261, దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 264 మందికి 244, నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 264 మందికి 236 మంది హాజరైనట్టు తెలిపారు. -
పిచ్చుక ఆకట్టుకుంది!
నాలుగు గోడలు లేక పోయినా కోట కంటే గొప్పదది.. గడ్డి పోచల అమరికలతో అందమైన గూడు అది. చలిగాలులను తట్టుకునే ఆనంద నిలయమది.. పిచ్చుకలు తమ ఇంజినీరింగ్ ప్లాన్తో నిర్మించుకున్న కట్టడమది. ఈ చిత్రం కిర్లంపూడి నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారి పక్క పొలం వద్ద ఆకట్టుకుంది. ఇక్కడి హై టెన్షన్ స్తంభం వద్ద అమర్చిన రక్షణ తీగలపై ఇలా వరుసగా పిచ్చుకలు గూళ్లు నిర్మించుకున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఈ గూళ్లను నిర్మించుకుని, తమ పిల్లలను సాకుతున్నాయి. – కిర్లంపూడి -
పోలీసులను చూసి పారిపోతూ బుక్కయ్యారు
రాజానగరం: పోలీసులను చూసి భయపడి పారిపోతూ, ఇద్దరు పాత నేరస్తులు దొరికారు. దీనికి సంబంధించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ జీవన విలేకరుల సమావేశం నిర్వహించారు. కొంతమూరుకు చెందిన పసల బేబి ఏప్రిల్ 13న సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గండేపల్లి మండలం మురారికి ఆటోలో పయనమైంది. దివాన్చెరువులో అదే ఆటో ఎక్కిన ఇద్దరు మహిళలు ఆమెతో మాటామాటా కలిపి, బ్యాగులో ఉన్న రూ. 4.85 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులను కాజేశారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు సీఐ వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం కొంతమూరులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, గోకవరం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఆటోలోని అంబటి జ్యోతి, నాగెళ్ల దుర్గ పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని తమదైన తరహాలో విచారించారు. పసల బేబి నుంచి బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించింది తామేనని వారు అంగీకరించారు. జ్యోతి, దుర్గ నుంచి 176.470 గ్రాముల బంగారు నగలు, 197.300 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను లూటీ చేయడంలో ఆరి తేరిన ఈ మహిళలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్ -
24 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
25 నుంచి సర్టిఫికెట్లు పరిశీలన రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా పాలిసెట్ కన్వీనర్, బొమ్మూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అక్కుల మురళి తెలిపారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు పేమెంట్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై ఒకటో తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. షెడ్యూల్లో ప్రకటించిన ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు నిర్వహించే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు విద్యార్థులు వారి ర్యాంకుల ప్రకారం హాజరుకావాలని సూచించారు. విద్యార్థులకు సూచనలివీ... ● విద్యార్థులు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఓసీ, బీసీలకు రూ.700, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ● ప్రాసెసింగ్ ఫీజు రసీదుతో పాటు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ మార్కుల మెమో ఒరిజినల్ లేదా ఇంటర్నెట్ కాపీని కౌన్సెలింగ్కు తీసుకురావాలి. ● 4–10 తరగతుల స్టడీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కులధ్రువీకరణపత్రం, టీసీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. ● ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2026–27 మీసేవలో తీసుకున్నది మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరి వర్తిస్తుంది. ● ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు(ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, పిడబ్ల్యూడీ, స్కౌట్స్ అండ్ గైడ్స్) విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఈ నెల 29, 30 తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుంది. 29 నుంచి ఆప్షన్ల ఎంపిక ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. జూలై 4న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తారు. జూలై 6న కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని జిల్లా కన్వీనర్ మురళి వెల్లడించారు. మరిన్ని వివరాలకు హెచ్టిటిపిఎస్://ఏపీపీవోఎల్వైసీఈటీ.ఎన్ఐసి.ఇన్ ను సందర్శించవచ్చన్నారు. ర్యాంకులు వారీగా షెడ్యూల్ ఇదీ... తేదీ ర్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 1 గంట నుంచి జూన్ 25 1–10,000 10,001–20,000 26 21,001–31,000 31,001–42,000 27 42,001–54,000 54,001–65,000 28 65,001–77,000 77,001–88,000 29 88,001–99,000 99,001–1,10,000 30 1,10,001 నుంచి 1,20,000 1,20,001–1,30,000 జూలై 1 1,30,001 నుంచి 1,40,000 1,40,001 నుంచి చివరి వరకు విజయవాడలో ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్లు పరిశీలన ఇలా .. తేదీ కేటగిరీ ర్యాంకులవారీగా జూన్ 29 ఎన్సీసీ, సీఏపీ 1–60,000 ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడీ 1నుంచి చివరిర్యాంకు వరకు జూన్ 30 సీఏపీ, ఎన్సీసీ 60,001 నుంచి చివరిర్యాంకువరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ 1నుంచి చివరిర్యాంకువరకు -
కూటమిలో విపొత్తు!
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026● నిడదవోలులో కొనసాగుతున్న విభేదాలు ● రేండేళ్ల వియోత్సవానికి టీడీపీ డుమ్మా ● టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి నిడదవోలు: నియోజకవర్గ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటు జనసేన అభ్యర్థికి కేటాయించినప్పటి నుంచి వారి విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు సిఫారసు చేస్తున్న పనులకు కనీసం రూ.లక్ష కూడా కేటాయించకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం సహజమైపోయింది. కూటమి విజయోత్సవాల్లో సైతం మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు టీడీపీ వారు హాజరుకాకపోవడంతో నియోజకవర్గంలో అసలు పొత్తు ధర్మం పాటిస్తున్నారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వత్రోత్సవాలకు శేషారావుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు హాజరుకాకపోవడం గమనార్హం. పట్టణంలోని పాటిమీద సెంటర్లో అన్న క్యాంటిన్ పునఃప్రారంభానికి సైతం ఆ వర్గీయులు డుమ్మా కొట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం మూడు పార్టీలు ఎప్పటికీ కలిసే ఉంటాయని ప్రచారం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలతో మొదలై.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈ సీటు కేటాయించినప్పుడే టీడీపీ, జనసేన మధ్య గొడవలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే బూరుగు పల్లి శేషారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. అప్పటికి ఏదో సర్దుబాటు జరిగినా ఆనక దుర్గేష్ గెలిచి మంత్రి పదవి వచ్చాకా కూడా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. జనసేన వైఖరిపై ఆగ్రహించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు తన పదవికి సైతం రాజీనామా చేశారు. అధిష్టానం జోక్యంతో ఆయన తిరిగి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.. కోటసత్తెమ్మ ఆలయ ట్రస్టు బోర్డుపై ప్రభావం టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గపోరుతో పాటు సమన్వయ లోపంతో రాష్ట్రంలోనే పేరుగాంచిన కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు నియామకం చేపట్టకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు కుర్చుని పరిష్కరించుకునే సమస్యలు సైతం పెండింగ్లో ఉంటున్నాయి. 2024 డిసెంబర్లో ఆలయ ట్రస్టు బోర్డు పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కూటమి అధికారం చేపట్టి రెండేళ్లైనా ఆలయ ట్రస్టు బోర్డును నియమించకపోవడంతో ఇరు పార్టీల్లో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కుమ్ములాటల్లో ఆలయాన్ని గాలికి వదిలేశారనేంత వరకు విమర్శిస్తున్నారు. మరోసారి నేనే పోటీ చేస్తా.. పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభలో మంత్రి కందుల దుర్గేష్ ఆశక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. వచ్చె రెండు పర్యాయాలు కూడా నేను నిడదవోలు నుంచి పోటీ చేస్తాననడం మళ్లీ చర్చనీయాంశమైంది. కందుల దుర్గేష్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేస్తారనే ప్రచారానికి ఆయన తెర దించడంతో టీడీపీలో అంతర్మధనం ప్రారంభమైందని జనసేన నేతలు బాహాటంగానే చెప్తున్నారు. శేషారావు ఫ్లెక్సీల తొలగింపుతో.. మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంగా కూటమిలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. జనసేన నేతలు పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఉన్న శేషారావు ఫ్లెక్సీలను తొలగించారు. ఇది మళ్లీ వారి మధ్య తీవ్ర వివాదం సృష్టించింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంక టేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలసి శేషారావు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలతో ఓవర్ బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది తొలగించిన శేషారావు చిత్రపటాలను గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో పడవేసి నిరసన తెలపడం దుమారం రేపింది. -
థార్ దొంగల సంచారం
పెరవలి (కొవ్వూరు): కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో థార్ ప్రాంతానికి చెందిన దొంగల ముఠా సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ పి.విశ్వం తెలిపారు. దొంగలు చూస్తుండగానే మెడలో చైన్లు, బొందులు వంటివి లాక్కుని వెళ్లిపోతారని, తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడతారని వివరించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దొంగల ఫొటోలను ఆయన విడుదల చేశారు. పిడుగు పడి పాడి గేదెల మృతికాట్రేనికోన: పిడుగు పాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. కందికుప్పకు చెందిన కూరాకుల మల్లేశ్వరరావుకు రెండు గేదెలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతో అతను జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడంతో ఆ రెండు గేదెలు మృతి చెందాడు. దీంతో అతను కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని మల్లేశ్వరరావు కోరారు. వేళంగిలో చైన్ స్నాచింగ్కరప: ఉదయాన్నే తుడిచిన చెత్తను పారబోయడానికి బయటకెళ్లిన మహిళ మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయిన ఘటన కరప మండలం వేళంగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. వేళంగి శివారు దళమ్మచెరువు గట్టుకు చెందిన వాసంశెట్టి నాగవరలక్ష్మి ఆదివారం ఉదయం 5 గంటలకు ఇంట్లోని చెత్తను ఊడ్చి, రోడ్డుపక్క వేయడానికి వెళ్లింది. ఆ సమయంలో మోటార్సైకిల్పై అటుగా వెళుతున్న ముగ్గురు వ్యక్తులు నాగవరలక్ష్మి మెడలోని పుస్తెలతాడును తెంచుకుని, ఆమెను పక్కనే ఉన్న కంకర గుట్టపైకి తోసేసి పరారయ్యారు. పసుపుతాడుకు ఉన్న 8 గ్రాముల శతమానాలు చోరీకి గురైనట్టు బాధితురాలు కరప పోలీసులకు ఫోన్చేసి, సమాచారం అందించారు. కరప ఎస్ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కేసు వెనక్కి తీసుకోవాలని భర్త బెదిరింపుఅమలాపురం టౌన్: తనపై పెట్టిన పోలీస్ కేసును వెనక్కి తీసుకోకపోతే చంపుతానని ఓ భర్త తన భార్యను బెదిరించిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు కథనం ప్రకారం.. అల్లవరం ఎస్బీఐ బ్రాంచ్లో మట్టపర్తి సందీప్ ఉద్యోగి. గతంలో తన భార్య ఫిర్యాదుపై కోర్టులో ఇద్దరి మధ్య కేసు నడుస్తోంది. అప్పటి నుంచి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. తన భార్య తల్లి (సందీప్ అత్త) మోటారు సైకిల్పై ఆదివారం వెళుతుండగా, ఆమెను సందీప్ ఫాలో అయ్యాడని ఎస్సై తెలిపారు. అమలాపురం నుంచి కొమరిగిరిపట్నం వెళ్లే మార్గంలో పేరూరు వై.జంక్షన్ వద్ద తన అత్త, భార్యను ఆపి సందీప్ బెదిరించాడన్నది అభియోగం. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై సందీప్పై కేసు నమోదు చేసి పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
అంతకుమించి..!
దిగబడిన ఊక లారీకాజులూరు: మూతికి మించిన ముద్ద.. వాహనానికి మించిన ఓవర్ లోడ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపై అధిక వేగంతో ఊక లారీలు యథేచ్ఛగా తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై వెళ్లే జనం ప్రాణాలతో చెలగాటంలా మారింది. భారీ భారం.. ఆపై ఊక కారణంగా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. అయినా రవాణా శాఖ కళ్లప్పగించి చూస్తోంది. కాజులూరు నియోజకవర్గంలోని కాకినాడ, కోటిపల్లి ప్రధాన రహదారిలో ఊక లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో ఇబ్బంది ఎదురవుతోంది. వాహనానికి ఇరుపక్కలా లోడు వేయడంతో రహదారిని మొత్తం ఆక్రమిస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే, పక్క నుంచి వెళ్లే వాహనాలకు దారి ఉండడం లేదు. గతంలో రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే ఈ ఊక లారీలు, ట్రాక్టర్లు ఇటీవల పగలూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కాజులూరు మండలంలోని దుగ్గుదుర్రు, జగన్నాథగిరి, ద్రాక్షారామ పరిసర గ్రామాల్లోని రైస్మిల్లుల నుంచి ఇటుక బట్టీలకు ఊక, బూడిద రవాణా జరుగుతోంది. లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడు చేయడం వల్ల వాహనం సైజు భారీగా మారి, రోడ్డును ఆక్రమిస్తోంది. ఈ వాహనాలు వేగంగా వెళ్లే సమయాల్లో ఊక, బూడిద ఎగిరి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. ఇలా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే సమయంలో పైన విద్యుత్ తీగలకు తగులుకుని మంటలు రావడం, లేకుంటే వాహనాలు మలుపులు తిరగలేక విద్యుత్ స్తంభాలను ఢీకొనడం తరచూ జరుగుతున్నాయి. గతంలో కాజులూరులో రోడ్డుపై వెళ్తున్న ఊక ట్రాక్టరుకు పైన విద్యుత్ తీగలు తగులుకుని మంటలు సంభవించగా, స్థానికులు గమనించి సకాలంలో ఆర్పివేశారు. ఇటీవల కోలంకలో యానం, ద్వారపూడి రహదారిపై ఊక ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, అది విరిగి ముక్కలై నేలపై పడింది. ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అధికారుల కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆలమూరు: కొత్తూరు –వెదురుమూడి రోడ్డులోని పెదపళ్లలో ఆదివారం ఊక లారీ రోడ్డుపై దిగబడింది. అసలే ఇరుకు రోడ్డు కావడంతో పాటు భారీ వర్షం పడడంతో బెర్ములు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఐదు దశాబ్దాలుగా ఈ రోడ్డు విస్తరణ జరగకపోవడంతో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ఏదో ఒకచోట ట్రాఫిక్కు అంతరాయం కలగడం లేదా ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైంది. ఇబ్బంది పడుతున్నాం ఊక, బూడిద లోడు చేసిన వాహనాలు రోడ్లపై వేగంగా వెళ్లే సమయాల్లో ఇబ్బందిగా ఉంటోంది. ఆ ఊక, బూడిద ఎగిరి వచ్చి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నాం. – నల్లమిల్లి శ్రీవిష్ణురెడ్డి, ప్రయాణికుడు, మొగలిపాలెం రోడ్డును ఆక్రమించేసి.. లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడ్ చేస్తున్నారు. వాహనం సైజు భారీగా మారి రోడ్డు ఆక్రమిస్తుంది. ఇవి ముందు వెళ్తుంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. వీటిని తప్పించుకుని వెళ్లే సమయంలో అనేక మంది ప్రమాదాల పాలయ్యారు. – రాయుడు నూకరాజు, గొల్లపాలెం వాహనాల సామర్థ్యానికి మించి లోడు అధిక లోడుతో ఊక, బూడిద లారీల పయనం రోడ్లను ఆక్రమిస్తుండడంతో ప్రయాణం నరకం -
రైలు నుంచి జారిపడిన కష్టజీవి
కాలు తెగిపోయి రక్తస్రావమై మృతి అనపర్తి: రోజూ రైళ్లలో సమోసాలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ చిరు వ్యాపారి జీవితం విషాదాంతమైంది. అనపర్తి రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. చిరు వ్యాపారి సత్యబాబు (55) రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రోజూ రైలు బోగీల్లో తిరుగుతూ ప్రయాణికులకు సమోసాలు విక్రయించేవాడు. అదే జీవన పోరాటం చివరకు అతని ప్రాణాలను బలిగొంది. శనివారం సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సత్యబాబు రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోగా తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన సత్యబాబును చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ దుర్గాభవానీ, పైలెట్ ఆనందరావులు హుటాహుటిన అతికష్టంపై సత్యబాబును ప్లాట్ఫారమ్పైకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా సత్యబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మనస్తాపంతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వంశీ (33) మృతదేహం శనివారం లభ్యమైంది. పెళ్లి విషయంలో వేరే మహిళతో వాగ్వాదం అనంతరం, వంశీ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, ఇంక జీవించలేనని, గోదావరిలో దూకేస్తున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వంశీ మృతదేహం స్థానిక దోభీ ఘాట్ వద్ద ఉన్న గోదావరి నదిలో కనిపించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టంనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుల్లెట్ నుంచి మంటలు అంబాజీపేట: స్థానిక నాలుగు రోడ్ల సెంటర్కు సమీపంలో సూర్యప్రభ డెంటల్ హాస్పిటల్ వద్ద శనివారం బుల్లెట్ నుంచి ఆకస్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ హాస్పటల్ వైద్యుడు బిల్ల నీరజ్కుమార్కు చెందిన బుల్లెట్ను బయట నిలుపుదల చేశారు. బుల్లెట్ నుంచి మంటలు వస్తున్నాయని బయట నుంచి స్థానికులు కేకలు వేశారు. దాంతో ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, నీరజ్కుమార్లు ప్రయత్నించారు. కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఫైర్ ఫోమ్ను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీ 2008, 1998 ఎస్జీటీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు. ఆ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ – 2008 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 196 మంది ఉపాధ్యాయులకు, డీఎస్సీ– 1998 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 184 మంది ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సమగ్ర శిక్ష మీటింగ్ హాల్ నందు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈఓఈజీ.ఓఆర్జీ వెబ్సైట్ నందు పొందుపరిచిన జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. -
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన
తుని: విద్యతో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, సంపాదన పట్ల అవగాహన ఉండాలని పతంజలి గ్రూప్ ఎండీ, పతంజలి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బాలకృష్ణ అన్నారు. తునికి వచ్చిన ఆయన పొరుగునే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శనివారం శంకుస్థాపన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను పునర్వినియోగం చేసే విధానంపై తమ యాజమాన్యంతో పతంజలి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు తెలిపారు. ఆయుర్వేద చికిత్సాలయం, ఔషధ వనం, పరిపాలన విభాగం నూతన భవనాలను ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి యోగా శక్తిని, ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. త్వరలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టు మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. ఆయనను నరసింహారావు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కంటిపూడి నరేంద్రబాబు, విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొంపముంచిన ఫోన్పే
ఫ రూ.ఐదు లక్షలు ఉన్నాయని తెలుసుకుని హత్య ఫ ఆక్వా రైతు హత్య కేసులో కూలీలే నిందితులు ఫ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఐ.పోలవరం: ఫోన్ పే కొంపముంచింది.. బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు ఉన్నాయని తెలుసుకుని ఓ ఆక్వా రైతును కూలీలే హత్య చేయడం చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల ఆక్వా చెరువు వద్ద రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శనివారం పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్కుమార్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 17న మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు తన ఆక్వా చెరువు వద్ద హత్యకు గురయ్యారు. చెరువు వద్ద పనిచేసే ఇద్దరు కూలీలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన సలాపరెడ్డి బాబ్జీ కాగా, మరొకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలుడు. వారం రోజుల క్రితం వీరిద్దరూ కృష్ణంరాజు చెరువు వద్ద పనికి కుదిరారు. పని చేయకపోతే రైతు కృష్ణంరాజు ఊరుకునేవారు కాదని, ఇక్కడ పని చేయలేమని నిర్ధారించుకుని వారు మానేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల కూలీ డబ్బులు ఇచ్చేయండి, మేం వెళ్లిపోతామని కృష్ణంరాజుతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 14న బాబ్జీ భార్య సెల్ఫోన్కు రూ.వెయ్యి ఫోన్పే చేయించుకున్నారు. అప్పుడే యజమాని కృష్ణంరాజు ఫోన్పేలో రూ.5 లక్షలు ఉన్నట్లు నిందితులు గుర్తించారు. 17న మధ్యాహ్నం కృష్ణంరాజు చెరువు వద్ద కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తుండగా, నిందితులు ఏరియేటర్ రాడ్డుతో ఆయన తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కాళ్లకు నైలాన్ తాడు చుట్టి, ఆ తాడుకు నాలుగు ఫెన్సింగ్ రాళ్లు కట్టి ఎవరికీ కనిపించకుండా చెరువులో పడేశారు. మృతుడు కుర్చీని, షెడ్డు వెనుక మురికి కాలువలో పడేశారు. మోటార్ సైకిల్ను ఎవరికీ కనిపించకుండా రేకుల షెడ్డు పక్కన బాత్రూమ్ గోడకు ఆనుకుని ఉంచి, రాడ్ను సెప్టిక్ ట్యాంక్పై ఉన్న నల్లని బరకల్లో దాచిపెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి ఫోన్, హత్య సమయంలో రక్తపు మరకలు అంటిన తమ దుస్తులు తీసుకుని నిందితులు కాకినాడకు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకున్న పోలీసులు మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని, ఫోన్పే ద్వారా రూ.90 వేలు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ మోహన్ కుమార్, ఎస్సై రవీంద్రబాబును డీఎస్పీ అభినందించారు. -
కచిడి అధరగొట్టింది
సఖినేటిపల్లి: గోదావరిలో దొరికే పులస చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. సముద్రంలో అరుదుగా లభ్యమ య్యే కచిడి చేపలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటోంది. ఇందులో ఆడ చేప కన్నా, మగ చేపకు డిమాండ్ ఎక్కువ. మగ చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు. పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు శనివారం మూడు మీడియం సైజులో కచిడి చేపలు చిక్కాయి. వీటిని హార్బర్లో కొనుగోలుదారుడు రూ.1.35 లక్షలకు దక్కించుకున్నాడు. కచిడి చేపను గోల్డెన్ ఫిష్గా కూడా పిలుస్తారు. -
యోగక్షేమం ఇదేనా!
ఫ యోగాపై ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట ఫ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రూ.కోట్ల ఖర్చు ఫ ఆనక ఆ ఊసెత్తని వైనం ఫ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కపిలేశ్వరపురం: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి ఎవరూ రారు. యోగాంధ్ర 2025 పేరుతో గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సుమారు రూ.350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలో 3,03,654 మందితో విశాఖ తీరాన యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండో గిన్నిస్ రికార్డు దక్కింది. 61,266 పాఠశాలల్లో యోగాంధ్ర నిర్వహించినట్టు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ శ్రీనివాసరావు గతేడాది ప్రకటించారు. అప్పుడు మాత్రమే చెప్పిన ఈ లెక్కలు అంతకు ముందూ లేవు, ఇప్పుడూ లేవు. యోగా కేవలం ప్రచార ఆయుధం మాత్రమే అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పురాతన కాలం నుంచీ యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా అనేక సంస్థలు, వ్యక్తులు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా యోగా కోసం పాటుపడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం యోగా డే నెలలో మాత్రమే ఆర్భాటం చేస్తుంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు గతేడాది విశాఖలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించిందన్న వాదన ఉంది. జిల్లాలో సుమారు రూ.కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సకల సమస్యలకు యోగానే మందు అనే రీతిలో చంద్రబాబు ఉపన్యాసాల్లో చెప్పారు. జిల్లాలో 8,72,916 మంది యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, వారికి యోగా శిక్షకులను కేటాయిస్తూ మ్యాపింగ్ చేసినట్టు, 4,600 ప్రాంతాల్లో యోగా శిబిరాలను నిర్వహించినట్టు గతేడాది ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. రాజమహేంద్రవరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రాంతంలో యోగాసనాలు చేయించింది. పాలన, ఇతర ప్రజావసరాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని యోగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నానంటూ ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. మీ విజ్ఞప్తి మేరకు పలానా చోట యోగా చేసేందుకు అనుమతిస్తున్నామంటూ ప్రజలకు మెస్సేజ్ రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విశాఖకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దూరాన ఉన్న విశాఖకు వెళ్లేందుకు అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లోకి ఎక్కించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందిస్తామన్న ఆహార ప్యాకెట్లు అందక ఆకలితో అలమటించిన వారెందరో ఉన్నారు. ఆ రోజు గడిచాక నేటి వరకూ యోగాపై తీసుకున్న చర్యలేవీ లేవు. ఈ ఏడాది జిల్లాలో కార్యక్రమాలు ఇలా.. జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఆయుష్ సంస్థ, పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాభ్యాసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, పలు ప్రభుత్వ శాఖల, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న కడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. 14న రాజమహేంద్రవరం గౌతమీ ఘాట్ ప్రయాణ ప్రదేశంలో జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. యోగా.. వ్యాధులను తరిమికొట్టే దివ్యౌషధం.. నిశ్చలమైన మనసుతో నిండుగా జీవించేందుకు ఓ ఆయుధం.. మన ‘యోగ’క్షేమాలకు ఇదో శక్తివంతమైన పురాతన చికిత్సా విధానం.. అలాంటి యోగాను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆయుధంగా మార్చుకుంది.. యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకొంటూ రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రచార హంగామా చేస్తోంది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..ప్రాధాన్యం ఇదీ.. ఆధునిక కాలంలో తలెత్తుతున్న రుగ్మతల నేపథ్యంలో ధ్యానం, యోగా వంటి ప్రాచీన విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. యోగా అనేది సంస్కృతంలోని ‘యుజ్’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ్’ అనే పదానికి ఐక్యం కావడమని అర్థం. మనసు, శరీరమూ ఒకదానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. ఆ రెండింటినీ ఏకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాలోని 84 ఆసనాల్లో 32 అతి ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా యోగాసనాలను వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు. సూర్య నమస్కారాల్లోని పదకొండు ఆసనాల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక అంశాలు ఒదిగి ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కదలికలు ఏర్పడి శరీర అవయవాల్లోని భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. -
కక్షసాధింపులే లక్ష్యంగా చంద్రబాబు పాలన
● కారుమూరి సునీల్పై అక్రమ కేసులు దారుణం ● కూటమి నేతలే లిక్కర్ డాన్లు ● డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్న ప్రభుత్వం ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపులే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీసేలా ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని పారదర్శకంగా అమలు చేశామన్నారు. అలాంటి పాలసీలో అవకతవకలంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు టెండర్ వేసే వాళ్లను బెదిరించి, భయపెట్టి మద్యం షాపులను చేజిక్కించుకున్నారని చెప్పారు. టీడీపీ, జనసేనతో పాటు మంత్రి లోకేష్ గల్లాపెట్టెకి వాటాలు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. 2014–19 మధ్య మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.16,912 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 2023–24 వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న చివరి ఏడాదికి మద్యం ఆదాయం రూ.24,760 కోట్లకు పెరిగిందన్నారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే రూ.8 వేల కోట్ల ఆదాయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పెరిగిందని గుర్తు చేశారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఆరోపించడం తగదని మండిపడ్డారు. ఎంపీ మిధున్రెడ్డి నుంచి కారుమూరి సునీల్ వరకూ లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని అన్నారు. బీసీ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారనే దుగ్ధతో కేసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలతో దొరికిపోతే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పోలీసు వ్యవస్థలో సీఐడీ, ఏసీబీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. చిన్నారి మిస్సింగ్ కేసులో పురోగతి ఏదీ? తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో నేటికీ పురోగతి లేదని రాజా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు. పోలీసు వ్యవస్థ వీటిపై దృష్టి సారించకుండా కేవలం పోలీస్ స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చి, వారికి అనుకూలంగా పని చేస్తోందని విమర్శించారు. పోలీసులు ఎంతకు బరితెగించారంటే.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని మర్డర్ చేయడానికి కూడా వెనుకాడటం లేదని దుయ్యబట్టారు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. యువనేత కారుమూరి సునీల్కు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందని రాజా స్పష్టం చేశారు. -
నాన్న స్ఫూర్తితో ప్రజా సేవకుడిగా..
1901 జూలై 15న జన్మించిన రామచంద్రపురం పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చెలికాని రామారావు కాకినాడ నుంచి 1952లో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అంతకు ముందు జాతీయోద్యమంలో చేరి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆ క్రమంలో 1922లో జైలు జీవితాన్ని సైతం గడిపారు. 1985 సెప్టెంబర్ 25లో మరణించే వరకూ ప్రజల మనిషిగా, ప్రజా వైద్యుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు డాక్టర్ చెలికాని స్టాలిన్.. తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు. నాన్న బాటలోనే పయనిస్తూ, ప్రజా వైద్యుడిగా రాణించారు. రిక్షా కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు ఆయన ఆసుపత్రి వద్ద బారులు తీరి చికిత్స పొందేవారు. ఇప్పటికీ ఓపిక మేరకు వైద్య సలహాలు ఇస్తూనే ఉన్నారు. తండ్రి పేరున డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ స్థాపించి రామచంద్రపురం కేంద్రంగా సాహిత్య కృషి చేస్తున్నారు. తండ్రి జీవిత చరిత్రతో పాటు అనేక సామాజిక అంశాలపై పుస్తక రచన, ప్రచురణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. సాహిత్య సదస్సులకు హాజరవుతూ నేటి తరానికి, తన తండ్రి రామారావు తరానికి వారధిగా నిలుస్తున్నారు. సమాజమే ఇల్లు ఆలమూరుకు చెందిన హోమియో వైద్యుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చల్లా వెంకట్రావు పలు రంగాల్లో విశేషంగా శ్రమించారు. మండపేట పట్టణానికి చెందిన ఆయన కుమారుడు, ప్రముఖ హోమియో వైద్యుడు చల్లా రవికుమార్ తన తండ్రి వెంకట్రావు బాటలో హోమియో వైద్యుడిగా, సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుకు సాగుతున్నారు. తన తండ్రితో తాను గడిపిన రోజులు తక్కువ అని, నాన్న ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ గడిపేవారని రవికుమార్ తెలిపారు. అలా ఉండటాన్ని తొలి రోజుల్లో తాను బాధపడ్డానని, దానికి గల కారణాలను నాన్న ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించానన్నారు. సమాజాన్నే ఇల్లు అనుకున్నప్పుడు తాను దూరంగా ఉన్నా నీకు దగ్గరగానే కనిపిస్తాననేవారన్నారు. తన తండ్రి వె వెంకట్రావు మరణానంతరం ఆయన పేరున, ఆయన మెచ్చిన సామాన్య ప్రజల పక్షాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నానన్నారు. సాహిత్య సేవకులు అద్దేపల్లి రామ్మోహనరావు కాకినాడకు చెందిన ప్రముఖ కవి, రచయిత. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం, అభ్యుదయ విప్లవ కవిత్వం – సిద్ధాంతాలు – శిల్పరీతులు వంటి పేరు మోసిన కవితా సంపుటాలెన్నో వెలువరించారు. శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరుతో శ్రీశ్రీ కవితలలోని సారాంశాన్ని రచించారు. లెక్కలేనన్ని సాహిత్య సమావేశాలు నిర్వహించారు. ఆయన కుమారులు ప్రభు, ఉదయ భాస్కరరావు, రాధాకృష్ణ వెంకటరమణ సాహిత్య కృషిలో నాన్న బాటలో పయనిస్తున్నారు. నాన్నతో కలిసి అమలాపురంలో నిర్వహించిన మినీ కవితల సదస్సుకు తాను వెళ్లినప్పుడు అక్కడ మరో గొప్ప ప్రజా కవి అలిశెట్టి ప్రభాకర్తో గడిపానని అద్దేపల్లి ప్రభు అన్నారు. ప్రతి కవితా శ్రమజీవుల జీవన రేఖ కావాలని నాన్న చెబుతుండేవారని, అందుకే తాను రాసే ప్రతి పదమూ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండేట్టు జాగ్రత్త పడుతుంటానన్నారు. తన సోదరులు ఉదయ భాస్కరరావు వ్యక్తిత్వ వికాసం మనస్తత్వ రంగాల్లో పుస్తకాలు రాశారని, వెంకట రమణ కవిత్వం, కథా రచనలో కృషి చేస్తున్నారని, అందరికీ నాన్నే స్ఫూర్తి అని ప్రభు అంటున్నారు. ● జీవితానికి భరోసా నాన్న ● గమనానికి వెలుగు రేఖ ● సమాజానికి దిక్సూచి ● నేడు ఫాదర్స్ డేఅద్దేపల్లి రామ్మోహనరావుతో ఆయన కుటుంబ సభ్యులు -
సాయికృష్ణ లాకప్ డెత్పై విచారణ జరపాలి
● బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి ● మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ దేవరపల్లి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్ డెత్పై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యులందరిపై హత్య కేసు నమోదు చేయాలని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన రక్షణ భటులు ప్రజల పాలిట భక్షక భటులుగా మారి, ప్రాణాలు తీసేస్తూ, కనీసం వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలకు కారణమైన వారిపై విచారణ చేపట్టాలని, వారి వెనుక ఉన్న వారెవ్వరో బయటకు రావాలని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఈ రెండు సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత తీరు దారుణం కాకినాడ జిల్లా తునిలో బాలిక అదృశ్యమైన ఘటనపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి అనిత నవ్వుతూ సమాధానం చెప్పడమేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ నేరస్తుడే కావచ్చునని, అతడిని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. సాయికృష్ణపై సీఐ నాగరాజు థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించాడని ప్రశ్నించారు. సాయికృష్ణ జనసేన కార్యకర్తని, కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించేంత వరకూ ప్రభుత్వం, పోలీసులు ఆ తల్లి గోడును పట్టించుకోలేదని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ పని తీరు చాలా బాగుందని హోం మంత్రి అనిత గొప్పలు చెప్పుకోవడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ప్రజలను ఏం ఉద్ధరించారని రెండేళ్ల పరిపాలనకు విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. -
నీట్ పరీక్ష కేంద్రం పరిశీలన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నీట్ (యూజీ)2026 రీ ఎగ్జామినేషన్ను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ శివరాముడు అన్నారు. ఆదివారం ఆ పరీక్ష జరగనున్న ఎస్కేవీటీ డిగ్రీ ప్రభుత్వ కళాశాలను శనివారం ఆయన పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, సూచిక బోర్డులు, కూర్చునే సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో శనివారం ద్వారకాతిరుమలలోని చిన వెంకన్న ఆలయ రద్దీగా మారింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అన్నదాన సదనం, కల్యాణకట్ట తదితర విభాగాలు కిటకిటలాడాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి ధవళేశ్వరం: రాజమహేంద్రవరం అర్బన్ పరిధి శంభూనగర్ సచివాలయంలో వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటేషన్పై పని చేస్తున్న ధవళేశ్వరానికి చెందిన నిమిషకవి దేవీ వరప్రసాద్ (37) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధవళేశ్వరంలోని నివాస గృహంలో వర ప్రసాద్ పార్దివదేహానికి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. కారుమూరి సునీల్ అరెస్ట్ అక్రమంపెరవలి (కొవ్వూరు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్ దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్ ధ్వజమెత్తారు. కొవ్వూరు ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ పాలనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు. యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చౌటుపల్లి వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మద్యం కేసులు బనాయిస్తున్నారన్నారు. అసలు మద్యం అక్రమాలు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికో బెల్టు షాపు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని, బాటిళ్లపై అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అన్నదాత’ నిధులు రూ.88.64 కోట్ల విడుదల రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 1,33,156 మంది రైతులకు రూ.88.64 కోట్ల మేర తొలి విడత సాయం అందిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజానగరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు
అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్క్రీమ్ పార్లర్లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరంలో శనివారం వందల మంది కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, జీతాలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకూ నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు తిరగడానికి డబ్బులు ఉంటాయే కానీ, కార్మికులు జీతాలు పెంచడానికి, సక్రమంగా జీతాలు ఇవ్వడానికి మాత్రం ఉండవన్నారు. మున్సిపల్ సేవలను ప్రైవేటుపరం చేసే 673 జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాలు దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రెడ్డి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు బంగారు గిరి, సహాయ కార్యదర్శులు మీసాల రమణ, దేవి, రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి సరస్వతి, జ్యోతి, రాజేశ్వరి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నాన్న చెప్పారని..
రాజమహేంద్రవరం రూరల్: తన తండ్రి కోరిక మేరకు పోలీసు అధికారి అయ్యానని జిల్లా ఎస్పీ (లా అండ్ ఆర్డర్), ప్రస్తుతం విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన అల్లూరి వెంకట సుబ్బరాజు అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం రాచగుమడాం తన స్వగ్రామమన్నారు. కాంగ్రెస్ నాయకుడైన తన తండ్రి చిన్న నరసింహరాజు రాచగుమడాం గ్రామానికి 25 ఏళ్ల పాటు ఏకగ్రీవ సర్పంచ్గా, రెండేళ్లు చీపురుపల్లి సమితి ప్రెసిడెంట్గా సేవలందించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యార్థి దశలో తన తండ్రితో పాటు అధికారులను కలిసేందుకు వెళ్లేవాడనని, ప్రజల్లో పోలీసులకు ఉన్న గౌరవాన్ని గమనించిన తన తండ్రి.. తనను పోలీసు అధికారి కావాలని కోరారన్నారు. అలా 1989లో ఎస్సైగా ఎంపికయ్యానని, అనంతరం సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా, 2001లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా, 2010లో డీఎస్పీగా, 2020లో అదనపు ఎస్పీగా, నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందడం జరిగిందని సుబ్బరాజు తెలిపారు. అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎస్పీ -
సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దళిత యువకుడు సాయికృష్ణ వమరణంపై పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని శవాన్ని మాయం చేయడం వెనుక ఉన్న నిజాలను వెలికితీసేందుకు కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం సరికాదని, ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు, హక్కుల సంఘాల నిరంతర ఆందోళనల వల్ల ప్రభుత్వం కేవలం కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే హత్య నేరం కింద కేసు నమోదు చేసిందన్నారు. 20 రోజులుగా ఈ దారుణ ఘటనను దాచడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వెనుక కేసును నీరుగార్చే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మరణం, శవాన్ని మాయం చేయడం వెనుక ఎస్పీ స్థాయి కంటే పై అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అటువంటప్పుడు కేవలం ఎస్పీ స్థాయి అధికారితోనే విచారణ జరిపించడం హేతుబద్ధం కాదని చెప్పారు. విజయవాడకు చెందిన ఉన్నత పోలీస్ అధికారులందరినీ ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ఇవ్వాలన్నారు.పౌరహక్కుల సంఘం డిమాండ్ -
సునీల్కుమార్ అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపే..
రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయన్నారు. సునీల్ కుమార్ అక్రమ అరెస్టు దారుణమని, ఇది ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అత్యంత పారదర్శకంగా జరిగాయన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం కోసమే మద్యం దుకాణాలు తగ్గించి, ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించిందన్నారు. పర్మిట్ రూములను, బెల్ట్ షాపులను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ మద్యం కేసు సృష్టించి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వాస్తవానికి 2014–19 మధ్య రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మద్యం సరఫరా విక్రయాల్లో ఎన్నో అక్రమాలు చేశారన్నారు. బార్లకు మేలు చేకూర్చే విధంగా ప్రివిలేజ్ ఫీజును రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ల చేతుల్లో ఉంచుకుని పర్మిట్ రూములు ఊరూరా, బెల్ట్ షాప్లు వాడవాడలా నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించి జనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై చంద్రబాబుపై కేసు కూడా నమోదయిందన్నారు. అధికారంలోకి రాగానే ఆ కేసును మాఫీ చేసుకోవడంతో పాటు జనం దృష్టిని మరలించడం కోసం లేని కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు దుర్గారావు -
పుష్కరాల నాటికి అభివృద్ధి పనుల పూర్తి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవదాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70 శాతం మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిది ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలోని మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా వివిధ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్, సీఐ శ్రీనాథ్, దేవదాయ శాఖ అధికారులు వి.త్రినాథ్రావు, టి.దుర్గేష్, డి.ఎల్.వి.రమేష్బాబు, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఈ.వి.సుబ్బారావు, ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎస్. హరి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ -
షేర్ల అమ్మకం సరికాదు
రాజమహేంద్రవరం రూరల్: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీ ఇన్సూరెన్స్లో కేంద్ర ప్రభుత్వం 5శాతం షేర్లు అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ఆర్జే మాథ్యూస్, ఎం.కోదండరామ్లు శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ఇంతకు ముందు 2017లో 14.22 శాతం షేర్లు , 2024 సెప్టెంబర్లో 3.4 శాతం షేర్లు ఓఎఫ్ఎస్ ద్వారా అమ్మారన్నారు. ఇప్పుడు మరో 5 శాతం అమ్మడంతోప్రభుత్వ వాటా 77.4 శాతానికి పడిపోతుందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. లాభాల్లో నడుస్తున్న, వ్యూహాత్మకంగా ముఖ్యమైన జిఐసిరీ లాంటి సంస్థల్లో ప్రభుత్వ వాటాను మళ్లీ మళ్లీ తగ్గించడం ప్రమాదకర విధానమన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ సాధించాలని ప్రభుత్వం చెప్తోందన్నారు. కానీ తక్షణ డబ్బు కోసం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదన్నారు. జిఐసిరీ లో గానీ, మరే వ్యూహాత్మక ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో గానీ ఇకపై డిస్ఇన్వెస్ట్మెంట్ నిలిపి వేయాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే విధానాలను ఏఐఈఈఏ గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందన్నారు.వారాహి మాతకు వెండి వస్తువుల సమర్పణ పెదపూడి: జి.మామిడాడ గ్రామం శివారు సూర్యనారాయణపురానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి లక్ష్మీకాంతం దంపతులు, వారి కుమారుడు సత్యనారాయణరెడ్డి (యూఎస్ఏ) గ్రామంలో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారికి సుమారు రూ.లక్షల విలుగల 650 గ్రాముల వెండితో శంకు, చక్ర,హస్తాలను తయారు చేయించారు. వాటిని మల్లిడి శ్రీనివాసరెడ్డి కూమార్తె అల్లుడు కర్రి దుర్గా అర్జున్రెడ్డి లలితా దంపతులు, వారి కుమార్తె వన్షికతేజస్విని రెడ్డి చేతుల మీదుగా మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. అనంతరం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ గావించి అమ్మవారికి వాటిని అలంకరించారు. దాత శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు కమిటీ తరఫున శేష వస్త్రాలను సమర్పించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, సభ్యులు సబ్బెళ్ల మోహనరెడ్డి, ద్వారంపూడి బాలవెంకట సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 93.90 ఉత్తీర్ణత శాతం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,772 మంది హాజరుకాగా, 2,603 మంది పాసయ్యారు. 93.30 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 5 వరకు జరిగాయి. ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 ఫీజు నిర్ణయించారు. ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి 26వ తేదీ రాత్రి 11 గంటల వరకు సీఎఫ్ఎంఎస్ ఆన్లైన్ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజబాబు మాట్లాడుతూ, రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్గా నిలుస్తోందని దుయ్యబట్టారు. -
కూతురితో పాటు తల్లిదండ్రులూ ఇంటర్ పాస్
రంగంపేట: మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం విద్యా ప్రస్థానంలో అరుదైన ఘనత సాధించింది. తండ్రి, తల్లి, కుమార్తె ముగ్గురూ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. గ్రామానికి చెందిన కారి దాసు, ఆయన భార్య ప్రభావతి, కుమార్తె మేఘన మే నెలలో జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలను రాజమహేంద్రవరం సమీపంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో రాశారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ముగ్గురూ విజయం సాధించారు. కారి దాసు 291 మార్కులతో సెకండ్ క్లాస్, ప్రభావతి 208 మార్కులతో థర్డ్ క్లాస్, కుమార్తె కారి మేఘన 330 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. విద్యకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు కూడా చదువు కొనసాగించి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం పలువురి ప్రశంసలు అందుకుంది. ఇంటర్లో ఉత్తీర్ణులైన దాసు, ప్రభావతి, మేఘన -
పిప్పితో ఉపయోగాలు
● రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా వాడవచ్చు. ● వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ● గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్ తయారీకి వాడతారు. ● ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’ అనే ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్ తయారీలలో చిక్కదనం రావడానికి తోడ్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను వాడతారు. ఔషధకారిగా.. ● జీడిమామిడి పండులో లభ్యమయ్యే సి–విటమిన్ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ● జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి పండు ఉపయోగపడుతుంది. ● మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు తిని అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. ● వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. -
మెడికల్ కళాశాలలో సికిల్ సెల్ అనీమియా దినోత్సవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్.రాజు ఆదేశాల మేరకు కళాశాలలో చదువుతున్న రెండవ, మూడవ సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వాల్పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది నినాదంలో ఈక్విటీ అనే అంశం అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడమే ఆరోగ్య సమానత్వం ప్రధాన లక్ష్యమన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన వైద్యం, కౌన్సెలింగ్ అందించవచ్చన్నారు. ఇది వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన వ్యాధి కావడంతో వివాహానికి ముందు స్క్రీనింగ్ నిర్వహించడం అవసరమని, జన్యు సలహాలు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు పాథాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతులకు కూటమి వెన్నుపోటు
● అంతకంతకూ ఫీడ్ ధరల పెంపు సరికావు ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు రామారావు అల్లవరం: ఆక్వా రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం కంపెనీలతో కుమ్మకై ్క వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా పెంచిన రూ. 14 మొత్తాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ఆక్వా, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.వేల కోట్లు ప్రభుత్వానికి వస్తున్నాయన్నారు. ఆక్వా సాగు చేస్తున్న రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా కిలోకి రూ.14 పెంచారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతుల రక్షణ కోసం అప్సాడా చట్టాన్ని ఏర్పాటు చేసి.. ఫీడ్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా మూడు సార్లు ధరలు పెంచితే కంపెనీలతో మాట్లాడి ధరలు స్థిరంగా ఉండేలా చూశారన్నారు. ధరల స్థిరీకరణ ద్వారా రొయ్యల ధరలు పడిపోకుండా కాపాడారని తెలిపారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, ఫీడ్ తయారీదారులకు బాసటగా నిలుస్తుందని విమర్శించారు. గత ఫిబ్రవరిలో కిలోకు రూ. 4 పెంచి, ఇప్పుడు మరో రూ. 10 పెంచి మొత్తంగా రూ. 14 అయిన తర్వాత దాని నుంచి కేవలం రూ. 4 తగ్గించి ఫీడ్ ధరలు తగ్గించామని కూటమి ప్రభుత్వం నాటాకాలు ఆడుతుందని మండిపడ్డారు. రొయ్యలు కిలోకు రూ. 50 తగ్గించి, తిరిగి రూ. 20 పెంచినట్లు చూపుతూ రైతులను మోసగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, కంపెనీలు ఏకమై ఆక్వా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను పూర్తి స్థాయిలో తగ్గించేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని రామారావు అన్నారు. -
సమస్యల్లోకి లాగేసారూ..
అక్షర దీపాన్ని వెలిగించే దైవ స్వరూపం గురువు.. అజ్ఞానపు చీకట్లను తరిమేసి, విద్యార్థి జీవితానికి అర్థాన్ని నేర్పే తొలి సారథి ఆయనే.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సారాన్ని బోధించే ఉన్నతజీవి.. జీవించే విధానాన్ని నేర్పించే గురువు గురించి ఎంత వర్ణించినా తక్కువే.. అలాంటి ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలోనూ వారికి భరోసా దక్కకుంది. కపిలేశ్వరపురం: సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం సమస్యల్లోకి తోసింది. తమ సమస్యలు పరిష్కరించాలని గత విద్యా సంవత్సరంలో గురువులు చేసిన ఉద్యమాలనూ పట్టించుకోకుండా వదిలేసింది. కనీసం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనా తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని ఉపాధ్యాయులు నిట్టూర్పు వదులుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,570 ప్రభుత్వ పాఠశాలలకు గానూ, 18,316 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలోని 1,246 పాఠశాలల్లో 6,493 మంది, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలో 800 ప్రభుత్వ పాఠశాలల్లో 1,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులను ఆకట్టుకునేందుకు వారికి కూటమి నేతలు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారం చేపట్టి రెండేళ్లయినా సీపీఎస్ రద్దు చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. కనీసం హామీకి కట్టుబడి రద్దు చేస్తామన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించ లేదు. 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల చేయాలన్న డిమాండ్ను ఖాతలు చేయలేదు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను నేటికీ ఇవ్వలేదు. ఉద్యోగుల పెన్షనర్ల బకాయి చెల్లింపులకు ఇప్పటి వరకూ రూప్ మ్యాప్ ప్రకటించలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన రోజే పెన్షనరీ బెనిఫిట్లు చెల్లిస్తామన్న హామీ నీటి మీద రాత అయ్యింది. హెల్త్ కార్డు, మెడికల్ బిల్లుల చెల్లింపుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సమస్యలు ఎన్నో.. 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ నుంచి పరీక్షలు, మూల్యాంకనం, ఉపాధ్యాయ శిక్షణ తరగతుల నిర్వహణ సమస్యలమయమైంది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జెడ్పీ హైస్కూల్లో ఈ నెల 7న 1, 2 తరగతులు బోధించే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడిని పెంచడం, బోధనేతర పనులను అప్పగించడంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ఉద్యమాలిలా.. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేక మార్లు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎస్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరంలలోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశారు. సీపీఎస్ రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనం విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివెళ్లారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ‘ఉపాధ్యాయ రణభేరి’ పేరుతో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఫిబ్రవరి 17న చలో విజయవాడను విజయవంతంగా చేపట్టింది. ఈ ఏడాది మార్చి 3న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట, ఏప్రిల్ 1న యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద, ఏప్రిల్ 21న పీఆర్టీయూ ఆధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారిచ్చిన హామీలే అవి! ఉపాధ్యాయులు ప్రభుత్వం ముందు ఉంచినవన్నీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలే. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా అమలు చేస్తారని చూస్తున్నాం. – పి.సురేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా కమిటీ, కాలేరు గురువుల గోడు వినని సర్కారు హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమాలు చేస్తున్నా పట్టని వైనం కొత్త విద్యా సంవత్సరంలోనూ దక్కని భరోసా -
చోరీ కేసులో పని మనిషే నిందితురాలు
ఉప్పలగుప్తం: చోరీ కేసులో పని మనిషే నిందితురాలిగా తమ విచారణలో తేలిందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఎస్.యానాం గ్రామానికి చెందిన చెలుకూరి రాంబాబు భార్య అనంతలక్ష్మి వైద్యం నిమిత్తం 2022 నుంచి విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఉండేవారు. అనంతలక్ష్మికి సహాయకురాలిగా విజయనగరం జిల్లా గట్యాడ మండలం, బుడతనపల్లి గ్రామానికి చెందిన బోనంగి శాంతిని పనిలో పెట్టుకున్నారు. ఇటీవల రాంబాబు, అనంతలక్ష్మి దంపతులు మధురవాడలో ఇల్లు ఖాళీ చేసి స్వగ్రామం ఎస్.యానాం వచ్చేశారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న శాంతిని కూడా వెంట తీసుకొచ్చి మూడు రోజులున్న తర్వాత ఆమెను ఊరికి పంపించారు. ఆమె వెళ్లిన తర్వాత ఇంట్లో బీరువా తాళాలు కనబడకపోవడంతో పగులు గొట్టి తెరిచారు. అందులో 18 కాసుల బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసి, పనిమనిషే నిందితురాలు అని తేల్చారు. దీనిపై శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్, సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్ఐ జానీ బాషాలు వివరాలు వెల్లడించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని రాంబాబుకు ఆభరణాలను అందజేశారు. కేసును ఛేదించిన సిబ్బంది, హెచ్సీలు బీవీ గిరి, హరినాథ్, కానిస్టేబుళ్లు నాగరాజు, కరీంచంద్, ఆర్.కనకదుర్గలను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బ్లేడ్తో దాడి చేసిన వ్యక్తికి రిమాండ్ సీతానగరం: దాడి కేసులో ఓ వ్యక్తికి కోర్టు రిమాండ్ విధించింది. ఎస్సై ఎల్.శ్రీనునాయక్ కథనం ప్రకారం.. రాజానగరం మండలం రఘునాథపురానికి చెందిన మట్ట చిన్నారావు తన మేనత్త కుమారుడి వివాహ వేడుకకు ఏప్రిల్ 26న బొబ్బిల్లంక వచ్చాడు. తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు బొబ్బిల్లంకలోని రామాలయం వద్ద కూర్చుని ఉండగా.. బత్తిన దుర్గాప్రసాద్, మట్ట శివకృష్ణ, లంజపల్లి సుధీర్లు మోటారు సైకిల్పై వచ్చి చిన్నారావు వీపుపై పోల్డింగ్ బ్లేడ్తో గాయపరిచారు. బాధితుడు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కవలగొయ్యి గ్రామంలో నిందితుడు దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్?
ఆచూకీ కోసం నదిలో గాలింపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ వివరాల ప్రకారం.. రాజానగరం మండలం దివాన్చెరువు శ్రీరామపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అదే శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళతో పరిచయం ఏర్పడింది. దీనిపై ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారు. వివాహం కుదుర్చేందుకు అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయి బాగోలేదని వంశీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదిలాఉండగా అతనికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీనిపై వంశీకి ఆ మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి నిలదీసింది. దీనికి అతను ముఖం చాటేస్తుండడంతో రాజమహేంద్రవరం దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వంశీని పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ పోలీసులు మాట్లాడారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుంచి వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీంతో వంశీ శుక్రవారం తెల్లవారు జామున తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, తాను రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఈ విషయాన్ని వెంటనే ఆయన పోలీసులకు తెలిపాడు. వారు అక్కడకు వెళ్లి చూడగా, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నాలుగో ఫిల్లర్ వద్ద వంశీ మోటారు సైకిల్, చెప్పులు లభించాయి. సెల్ఫోన్ కనిపించలేదు. అక్కడ గోదావరి నదిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. వంశీ నిజంగా గోదావరిలో దూకాడా లేదా అనేది తెలియడం లేదు. దీంతో రెండో పట్టణ పోలీసులు వంశీది అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే గడ్డర్లో ఇరుక్కున్న లోడ్ లారీ
కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సామర్లకోట: పిఠాపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట వైపు వస్తున్న లోడ్ లారీ శుక్రవారం ఉండూరు రైల్వే గేటు వద్ద రైల్వే గడ్డర్లో ఇరుక్కుపోయింది. దాంతో ఉండూరు రోడ్డులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిఠాపురం నుంచి మండపేట వెళ్లాల్సిన లోడ్ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ద్వారా వస్తున్నారు. దీనివల్ల అచ్చంపేట ఏడీబీ రోడ్డు నుంచి ఉండూరు మీదుగా రావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీలో లోడ్ ఎత్తుగా ఉండటంతో ఉండూరు ఫిల్టర్ బెడ్ వైపు ఉన్న రైల్వే గడ్డర్ దాటి, రైల్వే పట్టాల తరువాత రెండో వైపు గడ్డర్లో చిక్కుకుంది. దాంతో రైల్వే గడ్డర్ కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీపై ఇరుకున్న గడ్డర్ను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రైల్వే పోలీసులు లారీ డ్రైవర్ నుంచి రికార్డులను స్వాఽధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. హత్య కేసులో నిందితుడికి జైలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విఽధిస్తూ నాల్గవ అదనపు జిల్లా న్యాయస్థానం, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.షణ్ముఖరావు శుక్రవారం తీర్పునిచ్చారు. దీనికి సంబంఽధించిన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డుకు సమీపంలోని శ్రీనివాసనగర్లో చప్పిడి సునీల్కుమార్ (37) నివాసం ఉంటున్నారు. అతన్ని రాజవోలుకు చెందిన డెన్వర్ విలియమ్స్, అతని భార్య మేరీ విలియమ్స్ కలసి హత్య చేశారు. దీనిపై అప్పటి సీఐ ఆర్జే రవికుమార్ కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్, కోర్టు కానిస్టేబుల్ పీవీవీఎస్డీ రమేష్ కేసు విచారణ సమయంలో సాక్ష్యాలను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఏపీపీ కె.కనకలింగేశ్వరరావు వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో రెండో నిందితురాలు మేరీ విలియమ్స్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యువతి ఆత్మహత్య రాజమహేంద్రవరం రూరల్: ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరం ఆవ వాంబే కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆవ వాంబే కాలనీకి చెందిన ముత్యాల భువనేశ్వరి (32) ఆరు నెలలుగా ఓ ప్రైవేటు సంస్థలో డేటా ఆపరేటర్గా పనిచేస్తుంది. గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి వంట గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వరి తరచూ వంశీ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండేదని, పొరుగింట్లో ఉన్న లక్ష్మి అనే మహిళ భువనేశ్వరి పెద్దన్నయ్యకు గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా, వంట గదిలో భువనేశ్వరి ఉరివేసుకుని మృతి చెంది ఉంది. ఆమె తండ్రి ముత్యాల వీర్రాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వరికి వంశీతో ఉన్న ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
● నగరాన్ని ముంచెత్తే
కాకినాడ ప్రధాన రహదారిలోని దిగుమర్తి వారి వీధిలో డస్ట్బిన్లు, రోడ్లపై చెత్త ముంచెత్తింది. ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. జనం ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇటుగా అనేక మంది అధికారులు ఇటుగా వెళ్తుంటారు. వారు కనీసం పట్టించుకోవడం లేదు. దీనివల్ల విష జ్వరాల భయం వెంటాడుతోంది. – నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) ● బురద బజారుకెక్కింది! ఇది నిజమేనండి.. బురద బజారుకొచ్చింది. తుని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారులో వర్షానికి ఇలా బురదమయంగా మారింది. ఇక్కడకు తునితో పాటు రౌతులపూడి, తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి నిత్యం వందలాది మంది రైతులు వచ్చి కూ రగాయలు విక్రయిస్తుంటారు. వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డు వ్యాపారుల నుంచి చెస్ వసూలు చేస్తున్నా, సమస్యను మాత్రం బురదలో వదిలేసింది. – తుని ● విసిగివేసారేలా.. ఆ రోడ్డుపై ప్రయాణం విసిగివేసారేలా ఉంది. ఏలేశ్వరం ప్రధాన రహదారి మూగజీవాలతో పెద్ద చిక్కే వస్తోంది. రాత్రి వేళలో మరీ ఇబ్బందిగా మారుతోంది. యజమానులు ఆవులను వదిలేయడంతో గుంపులు గుంపుగా రోడ్లపైనే తిష్టవేస్తున్నాయి. వీటిని గమనించని పలువురు వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పే. – ఏలేశ్వరం -
బాలిక అదృశ్యం రోజున పెంపుడు కుక్క సంచారం
గోప్యంగా ఉంచిన విచారణ అధికారులు తుని రూరల్: మండలంలోని దొండవాక పంచాయతీ శివారు సీహెచ్ అగ్రహారంలోని ఆయిల్పామ్ తోటలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదేరోజు అదృశ్యమైందని అంతా భావించారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడి వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదృశ్యమైన విషయం తెలిసిందే. చిన్నారితో పాటు అదృశ్యమైన ఆ కుక్క ఒంటరిగా మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి చేరింది. ఇలా చేరుకున్న కుక్క చిన్నారి తల్లి వద్దకు వెళ్లి చీరను నోటితో పట్టుకుంది. చిన్నారి జాడ చూపిస్తుందేమోనన్న ఆత్రుతలో కుక్క వద్దకు గాలింపు బృందాలు చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన కుక్క పరారైంది. అలా వెళ్లిన కుక్క అర్ధరాత్రి ఇంటికి చేరడంతో గాలింపు బృంద సభ్యులు వలలతో పట్టుకుని కట్టేశారు. మరుసటి రోజు సాయంత్రం కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి, చిన్నారి జాడ తెలుసుకునేందుకు గాలింపు బృందాలు ప్రయత్నించాయి. జీపీఎస్ అమర్చిన తర్వాత ఎనిమిది కిలోమీటర్లు సంచరించిన కుక్క ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో నిరసించిపోవడంతో ఇనుప కోళ్లగూడులో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆరుస్తూ అది చనిపోయింది. చనిపోయిన కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి పోస్ట్మార్టం నిర్వహించారు. కుక్క మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఏ కారణంతో చనిపోయిందో నిర్ధారించేందుకు కుక్క అవయవాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానున్న సమయంలో చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం ఆ గ్రామంలో వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ప్రచారం జరిగింది. చిన్నారి అదృశ్యమైన సంఘటనలో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సంచారాన్ని గోప్యంగా ఉంచడం, కొందరికే సమాచారం ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6న మధ్యాహ్నం గుడి వద్ద సంచరించిన కుక్క, జ్ఞానేశ్వరితో అదృశ్యమైన కుక్క ఒక్కటేనని ఎస్ఐ కృష్ణమాచారి శుక్రవారం తెలిపారు. మూడో రోజు కుక్క ఇంటికి రావడంతో సీసీ ఫుటేజ్లో గుర్తించిన విషయాన్ని దర్యాప్తులో భాగంగా వెల్లడించలేదన్నారు. అదృశ్యమైన జ్ఞానేశ్వరి వెంట పెంపుడు కుక్క వెళ్లలేదా, వెళ్తే చిన్నారిని రక్షించేందుకు వెళ్లొస్తూ అటువైపుగాా కనిపించిందా అనే సందిగ్ధత నెలకొంది. ఈ ఆధారమే చిన్నారి ఆచూకీ బయట పెడుతుందనే చర్చ జరుగుతోంది. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి
పి.గన్నవరం : రాజవరం – పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావులపాలెం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రముఖ కవి కొప్పాడి శ్రీనివాస్ (47) మృతి చెందారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముమ్మిడివరం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవిత్వాలు రాశారు. కొన్ని తెలుగు ఆల్బమ్స్కు పాటలు కూడా రాశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి నుంచి పోతవరం గ్రామంలోని స్వగృహానికి మోటార్ సైకిల్పై వస్తుండగా, బెల్లంపూడి వద్ద అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొని పడిపోయారు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో మంచిగా ఉండే కవి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
లగ్గం కుదిరింది..
ఆషాఢంలో మళ్లీ విరామం ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. దాని ప్రకారం ఏ సంవత్సరంలోనూ ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అదే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వివాహాది శుభ కార్యాలు జరగవు. తిరిగి శ్రావణ మాసం అంటే, ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజా మోగనుంది. ఫ నేటి నుంచి రత్నగిరిపై మోగనున్న పెళ్లి బాజా ఫ నెల రోజుల తర్వాత తిరిగి సందడి ఫ నవ దంపతులతో కళకళలాడనున్న సత్యదేవుని ఆలయం అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నిజ జ్యేష్ట మాసం సందర్భంగా తిరిగి శుక్రవారం నుంచి పెళ్లి బాజా మోగనుంది. అధిక జ్యేష్ట మాసం నేపథ్యంలో నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తిరిగి రత్నగిరి నవ దంపతులతో సందడిగా మారనుంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి– ఏప్రిల్ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్, మే 11 వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. తిరిగి 19వ తేదీ శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే.. ఫ అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకు వివాహాలు ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో జరుగుతాయి. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ సారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి. ఫ సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన శ్రీసత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలు, అదే విధంగా విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి నిర్మించిన శ్రీఎంఎస్ రెడ్డి అంజనీ వివాహ వేదికలో 12 చిన్న కల్యాణ మండపాల్లో వివాహ ముహూర్తానికి 24 వివాహాలు జరుగనున్నాయి. ఈ కల్యాణ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నాయి. ఫ దేవస్థానంలోని సత్యగిరిపై విష్ణు సదన్ సత్రంలోని 36 మ్యారేజ్ హాళ్లలో ఈ ముహూర్తాలకు వివాహాలు జరుగనున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు చేయనున్నాయి. ఫ అన్నవరంలోని సుమారు 20 లాడ్జీలలో కల్యాణ మండపాలలో కూడా వివాహాలు జరుగనున్నాయి. సందడే సందడి.. పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. వివాహ ముహూర్తాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి విచ్చేయనున్నారు. వచ్చే నెల తొమ్మిది వరకు.. శుక్రవారం జ్యేష్ట పంచమి ఆశ్రేష నక్షత్రం సందర్భంగా రాత్రి 9.15 గంటల ముహూర్తంలో వివాహాలు జరుగనున్నాయి. ఈ నెల 20, 21, 22, 24, 25, 26, 27 తేదీల్లో, తిరిగి జూలై ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. -
ఏదీ సిరుల ఝరి?
● వచ్చే ఏడాదే గోదావరి పుష్కరాలు ● జిల్లాలో వివిధ పనులకు రూ.2 వేల కోట్లతో అంచనాలు ● ఏడాది కిందటే ప్రతిపాదనలు పంపిన అధికారులు ● నేటికీ నయాపైసా ఇవ్వని ప్రభుత్వం ● మంజూరుపై స్పష్టత కరువు సాక్షి, రాజమహేంద్రవరం: అంతన్నారింతన్నారే.. అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పని తీరు. గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది కాలం ఉంది. అలా చేసేస్తాం.. ఇలా చేసేస్తాం.. పుష్కరాలను కుంభమేళాలా నిర్వహించేస్తాం.. అని ప్రభుత్వ పెద్దలు తరచుగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు నెలలో రెండుమూడుసార్లు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఘాట్లను పరిశీలించడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం మంత్రి, ఎమ్మెల్యేలకు నిత్యకృత్యమవుతోంది. పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించేస్తామని అంటున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో గడప దాటడం లేదు. పుష్కర నిధుల కోసం ప్రతిపాదనలు పంపించి ఏడాది దాటుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం నయాపైసా కూడా విదల్చలేదు. దీంతో, నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేపట్టగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆరు జిల్లాలు.. రూ.8 వేల కోట్లు.. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాల్లో పుష్కరాల పనులు చేపట్టేందుకు అధికారులు రూ.8 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. తూర్పు గోదావరి జిల్లాలో 102, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, కోనసీమలో 175, కాకినాడలో 6, ఏలూరు జిల్లాలో 36 చొప్పున ఘాట్లు అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.8 వేల కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది దాటుతున్నా ఈ ప్రతిపాదనలకు నేటికీ అతీగతి లేదు. వీటిని ఆమోదించారా.. తిరస్కరించారా.. అసలు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కరువైంది. నిధుల ప్రవాహమేదీ! జిల్లావ్యాప్తంగా పుష్కరాల పనులకు తొలి దశలో రూ.1,578 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ.2,105.96 కోట్లతో ఏడాది క్రితం రెండోసారి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నయాపైసా కూడా విడుదల చేయలేదు. పైగా పుష్కరాలకు సంబంధించి ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా చేపట్టాల్సిన పనుల జాబితాను ఆయనకు అధికారులు అందించారు. ఆ సందర్భంగా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మాత్రం చెప్పారు. సమీక్ష జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినా.. పుష్కరాల పనులు, గోదావరి కాలుష్యం పరిశీలనకు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై, గోదావరి పుష్కరాల పనులపై చర్చించారు. పనులు అలా చేయాలి.. ఇలా చేయాలని అంటూ అధికారులకు సూచనలు చేశారు. నిధులు విడుదల కాకుండా పనులు ఎలా చేస్తారని అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత, మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చే వరకూ చూడకుండా శాఖల వారీగా నిధులు వెచ్చించాలంటూ పవన్ ఓ ఉచిత సలహా ఇచ్చి మిన్నకుండిపోయారని అంటున్నారు. దీనినిబట్టి చూస్తే.. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా, లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం పైనే ఆశలు? పుష్కరాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని, కేంద్రం నుంచి విడుదలయ్యే నిధుల పైనే ఆధారపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాదనలు పంపినా.. నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నిధుల విడుదలపై కేంద్రం సైతం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దీంతో, పుష్కర నిధులపై సందిగ్ధత నెలకొంది. స్వల్ప వ్యవధిలో సాధ్యమేనా? పుష్కరాలకు ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. ప్రధానంగా ఘాట్ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్కర ఘాట్లో ఉన్న రాళ్లను తీసి కొత్తవి అమర్చడం, వీఐపీ ఘాట్ వద్ద ఆధునీకరణ, అప్పర్ రివర్ఫ్రంట్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల నుంచి గోదావరికి వరదలు వస్తాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయి. దీంతో, పనుల నిర్వహణ అసాధ్యం. ఆ తరువాత పుష్కరాలకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. అంత స్వల్ప వ్యవధిలో పుష్కరాల పనులు చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో పనులు ఈపాటికే ప్రారంభించాలి. కానీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు ప్రశ్నార్థకమవుతున్నాయి. చివరిలో హడావుడిగా పనులు చేపట్టి, వచ్చిన నిధులు మింగేసేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
సేంద్రియ సాగుపై యువత దృష్టి సారించాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యువత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ (నిర్కా) ఆధ్వర్యాన ఆ సంస్థ సెమినార్ హాలులో గురువారం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై ఏడాది పాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రతి రైతూ సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్, జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు ఎస్.జయరామలక్ష్మి తదితరులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేల పరీక్ష – పంట స్పందన ఆధారిత ఎరువుల సిఫారసు మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. దీని ద్వారా రైతులు తమ నేల పరీక్ష ఫలితాలు, లక్ష్య దిగుబడి ఆధారంగా వివిధ పంటలకు అవసరమైన శాసీ్త్రయ ఎరువుల మోతాదులను తక్షణమే తెలుసుకోవచ్చని, సమతుల ఎరువుల వినియోగాన్ని అమలు చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ‘నేల ఆరోగ్య నిర్వహణలో వినూత్న సాంకేతికతలు’ బులిటెన్ను కూడా ఆవిష్కరించారు. -
రాళ్లు కట్టి చెరువులో పడేసి..
ఫ ఆక్వా రైతు దారుణ హత్య ఫ కూలీలపైనే అనుమానం ఫ కోనసీమ జిల్లాలో కలకలం బయటి వ్యక్తులే అధికం ఈ హత్య ఘటన జిల్లాలో ఆక్వా రైతుల్లో కలవరం రేపింది. ఆక్వా చెరువుల వద్ద స్థానిక కూలీల కన్నా కాకినాడ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వారు, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థానికేతరులు అధికంగా ఉంటున్నారు. 90 శాతానికి పైగా వీరే కావడం గమనార్హం. గత ఏడాది నవంబరు 19న రావులపాలెంలో మావోయిస్టు సరోజ్ మడవి (మాడ్వీ హాంధా)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాకు అనుచరుడు. అదే సమయంలో మావోయిస్టుల కమ్యూనికేషన్ కమాండర్గా పనిచేశాడు. కోనసీమలో దాచుకోవడానికి వచ్చిన ఆయన సఖినేటిపల్లిలో ఆక్వా చెరువుల వద్ద సుమారు ఆరు నెలల పాటు పనిచేశాడు. అతని అరెస్టుతో అప్పట్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా కృష్ణంరాజు హత్యతో మరోసారి ఉలిక్కిపడ్డారు. స్థానిక కూలీల కంటే సగం ధరకే ఇతర ప్రాంతాల వాసులు చెరువుల వద్ద పనులకు రావడం, వారు 24/7 చెరువుల వద్దనే నివాసముండి పనిచేయడంతో ఆక్వా రైతులతో పాటు పీచు ఉత్పత్తిదారులు వీరిపైనా ఆధారపడుతున్నారు. అయితే పనులకు పెట్టుకుంటున్న వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డు లు చూడకుండా, కనీసం తెలుసున్న జట్టు మేస్త్రితో సంబంధం లేకుండా నేరుగా కూలీలను నియమిస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐ.పోలవరం: దాడి చేసి, ఆపై రాళ్లతో కట్టి చెరువులో ఓ ఆక్వా రైతును పడేసి దారుణంగా హత్య చేశారు. అక్కడ పనికి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మురమళ్లకు చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు అనే లొల్ల కృష్ణ (64) బుధవారం రాత్రి తన సొంత చెరువుల వద్ద హత్యకు గురయ్యాడు. కొత్త మురమళ్ల వద్ద ఉన్న తన సొంత ఆక్వా చెరువుల వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లాడు. ఎంత సేపటికీ రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అతని వెతికేందుకు ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. కాని రైతు కృష్ణంరాజు జాడ తెలియలేదు. ఇదే సమయంలో చెరువుల వద్ద పనిచేస్తున్న కూలీలు కనిపించలేదు. వారికి ఫోన్ చేయగా, రైతు కృష్ణంరాజు తమకు రూ.ఏడు వేల సొమ్ము ఇచ్చేశారని, ఇంటికి వెళ్లిపోతున్నామని, ఆయన గురించి తమకేమీ తెలియదని చెప్పారు. కృష్ణంరాజు మోటారు సైకిల్ మురమళ్ల ఇరిగేషన్ రెగ్యులేటర్ వద్ద కనిపించింది. ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారికి అనుమానం వచ్చి చెరువులో వెతుకులాట ప్రారంభించారు. చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. రాళ్లు కట్టి.. చెరువులో వదిలేసి కృష్ణంరాజు మృతదేహాన్ని చూస్తే కొట్టి చంపి, రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ పనికి వచ్చిన వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పది రోజుల క్రితమే ఆ కూలీలు ఇక్కడ పనిచేసేందుకు వచ్చినట్టు తెలిసింది. పైగా వీరికి గంజాయి తాగే అలవాటు ఉందని అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు నిర్ధారించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చెరువు వద్ద కృష్ణంరాజుకు పని చేసేందుకు వచ్చిన వారి మధ్య అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కృష్ణంరాజు హత్య ఘటనలో కూలీలపైనే బలమైన అనుమానం ఉందని జిల్లా డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఘటన అనంతరం పనివారు తమ నివాసాన్ని ఖాళీ చేసి పరారైనట్లు గుర్తించామన్నారు. వారిని పట్టుకునేందుకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని రప్పించామన్నారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు
● మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు మద్దతుగా వచ్చిన జనం ● అనుమతి లేకుండా నినాదాలు చేశారని 100 మందిపై కేసు దేవరపల్లి: స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాత జీఎన్టీ రోడ్డుపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆయన ఇద్దరు కుమారులు, సుమారు 100 మంది కలసి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా గుమిగూడారని, రోడ్డుపై నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారని చెప్పారు. మేకా శేషుబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేయడంతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని అన్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన చేపట్టి, ఫొటోలు, వీడియోలు, డ్రోన్ వీడియోల ద్వారా అందరినీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీఐ తెలిపారు. విచారణకు శేషుబాబు హాజరు దేవరపల్లి పోలీస్ స్టేషన్లోని సర్కిల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఆయనను సీఐ నాయక్ సుమారు 2 గంటల పాటు విచారించారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి ఈ నెల 29న మళ్లీ విచారణకు హాజరు కావాలని పంపించారు. విచారణ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, గౌడ సంఘాల నాయకులు శేషుబాబుకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శేషుబాబు మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కూటమి నాయకుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. అయినప్పటికీ అక్రమంగా కేసులు పెట్టి, విచారణకు పిలిచి అవమానిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్నామనే కక్షతో, రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్
14 బైక్ల స్వాధీనం అనపర్తి: వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ బాలుడితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. గురువారం అనపర్తి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం స్థానిక ఐఎల్టీడీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, అనపర్తితో పాటు పది చోట్ల ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారని అన్నారు. ఇందులో రాజమహేంద్రవరం రామదాసుపేటకు చెందిన దుప్పాడ అనిల్ కుమార్ (బూస్ట్), అనపర్తికి చెందిన బహదూర్ బబ్లు, మరో బాలుడు ఉన్నారన్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. అనిల్కుమార్పై ఇప్పటికే 16 చోరీ కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో ప్రధాన భూమిక పోషించిన అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై వినయ్ ప్రతాప్, సిబ్బంది శివ, త్రిమూర్తులును డీఎస్పీ అభినందించారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షల్లో ఫస్టియర్ 28.7, సెకండియర్ 46.9 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు ఎయిడెడ్ కళాశాలల నుంచి 31 మంది హాజరవగా ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ సంస్థల నుంచి 60 మంది పరీక్షలు రాయగా 23 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 673 మందికి 203 మంది, హైస్కూల్ ప్లస్ విభాగంలో 179 మందికి 33, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 1,967 మందికి 575 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎయిడెడ్ కళాశాలల నుంచి 33 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ నుంచి 32 మందికి 16 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 552కు 269, హైస్కూల్ ప్లస్ విభాగంలో 122కు 48, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 2,046 మందికి 967 మంది చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వారకా తిరుమల.. అ‘ద్వితీయం’ ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి. వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఈఓ తెలిపారు. -
ఉర్రూతలూగించిన నాటక ప్రదర్శనలు
ఫ వానపల్లిలో ప్రముఖ రంగస్థల నటుల సందడి ఫ వందలాదిగా తరలివచ్చిన కళాభిమానులు కొత్తపేట: మండలంలోని వానపల్లి శ్రీభద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పళ్లాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కామిశెట్టి అమ్మన్న నాయుడు, పద్మావతి దంపతులు సుమారు రూ.20 లక్షలతో రామాలయాన్ని పునర్నిర్మించారు. బుధవారం విగ్రహాల ప్రతిష్ఠను పురస్కరించుకుని పౌరాణిక నాటకాలను, ఆ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆలయ నిర్మాత అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ నటులను ఏరికోరి ఆయా పాత్రలకు కూర్చారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులుగా రాణిస్తున్న నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సన్నివేశం), రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారణాసి సన్నివేశం నుంచి ప్రస్తుత మూడో తరం నటుల్లో రంగస్థల రారాజుగా గుర్తింపు పొందిన జూనియర్ డీవీ సుబ్బారావు హరిశ్చంద్రునిగా, రంగస్థల కోకిలగా ఖ్యాతి పొందిన రత్నశ్రీ చంద్రమతిగా, నక్షత్రకునిగా లతాశ్రీ , వీరబాహుడిగా సత్యప్రసాద్ తదితరులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. యువకులు సైతం ఆ రాగాలాపనలో లీనమైపోయి ఈలలు, కేరింతలతో కళాకారులను ఉత్సాహపరిచారు. డీవీ సుబ్బారావు, రత్నశ్రీ ఉన్నత శృతిలో ఆలపించిన పద్యాలను గమనిస్తే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను తలపించాయి. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. పోటాపోటీగా తండ్రీ తనయులు రామాజంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుడి పాత్ర అంటే గుర్తువచ్చే పేరు పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగర్). నంది అవార్డు గ్రహీత, అభినవ ఆంజనేయునిగా పేరొందిన లక్ష్మణరావు తనయుడు రామాంజనేయులు రాముడిగా, మనుమడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా యుద్ధ సన్నివేశంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా నటించారు. పద్యాలు ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం వరకూ ఉండి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం రంగస్థల నటులను అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు ఘనంగా సత్కరించారు. బిళ్లకుర్రు మాజీ సర్పంచ్ నెల్లి లక్ష్మీపతిరావు, ట్రాన్స్కో డీఈఈ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, ప్రముఖ వ్యాపారవేత్తలు గొలకోటి సోమరాజు, సింగిరెడ్డి గోవిందస్వామి, చీకట్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం వల.. రూ.లక్షల్లో జెల్ల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగం పేరుతో ఎర వేశాడు.. ఆశ పడిన వారిపై వల విసిరాడు.. లక్షల రూపాయలు వసూలు చేశాడు.. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు.. చివరకు జాడ లేకుండా మాయమయ్యాడు.. ఆ మోసగాడు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ నకిలీదని తేలడంతో బాధితులు గొల్లుమంటున్నారు. వివరాలివీ.. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన కొచెర్ల వెంకటేశ్వరరావుకు సికింద్రాబాద్ చిరునామాతో ఉన్న ఓ కన్సల్టెన్సీ పేరిట 90309 12837 నంబర్ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించి వాట్సాప్ మెజేజ్లు వచ్చేవి. గత ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ మెసేజ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీలు భర్తీ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కొచెర్ల వెంకటేశ్వరరావుకు మెసేజ్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సింగ్ విభాగంలో పని చేస్తున్న తన తమ్ముడి భార్య లక్ష్మికి అతడు ఈ మెసేజ్ చూపించాడు. దీంతో, ఆశ కలిగి ఆ నంబరులో సంప్రదించారు. తన పేరు వెంకటేశ్వరావు అని, విజయవాడలో ఉంటామని అవతలి వ్యక్తి (నిందితుడు) చెప్పాడు. విశాఖపట్నంలో 2, రాజమహేంద్రవరంలో ఒకటి చొప్పున జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపాడు. జీతం నెలకు రూ.38 వేల నుంచి రూ.48 వేల వరకూ వస్తుందని ఎర వేశాడు. ఈ ఉద్యోగం కావాలంటే రూ.8 లక్షలు ఖర్చవుతుందని, తనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో కలవాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితులు ఈ నెల 9న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆ మోసగాడికి ఫోన్ చేశారు. దీంతో, మార్చురీ నుంచి ఒకరు, బ్లడ్ బ్యాంక్ నుంచి మరొకరు వచ్చి బాధితులను కలిశారు. అనంతరం, ప్రభుత్వ అఽధికారిక వెబ్సైట్ అయిన హెచ్ఎంఎఫ్డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్లో లక్ష్మి వివరాలు నమోదు చేసి, 4291 నంబర్తో ఎంప్లాయీ ఐడీ కూడా చూపించారు. రాజమహేంద్రవరంలో ఉద్యోగం వచ్చేసిందని చెప్పారు. ఆ మాటలు నమ్మిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు ఆ మోసగాడి చేతికి రూ.7.50 లక్షల నగదు ఇచ్చారు. నిందితుడి భార్య కురుకు సంతోషి పేరుతో ఉన్న నంబర్కు మరో రూ.50 వేలు ఫోన్పే చేశారు. డబ్బులు చెల్లించిన అనంతరం, ఉద్యోగం వస్తుందని నమ్మకమేమిటని ప్రశ్నించగా ఆ మోసగాడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరిట రూ.8 లక్షలకు కె.సంతోషి సంతకంతో ఉన్న ఓ చెక్ కూడా వారికి ఇచ్చాడు. దీంతో, అతడిని వారు పూర్తిగా నమ్మారు. అనంతరం, వారిని ఆ మర్నాడు రమ్మని ఆ మోసగాడు చెప్పాడు. ఆ మేరకు అతడిని వారు ఆ మర్నాడు కలిశారు. సీఎం చంద్రబాబు ఫొటో, ప్రభుత్వ లోగోతో ఉన్న అపాయిట్మెంట్ లెటర్, సర్వీస్ రిజిస్టర్ను వారి చేతిలో ఆ మోసగాడు పెట్టాడు. అయితే, మొదట్లో జరిగిన చర్చల్లో తమకు విశాఖపట్నంలో పోస్టింగ్ కావాలని బాధితులు కోరారు. ఈ నేపథ్యంలో బాధితుడు మరో ఎత్తు వేసి, వారిని బురిడీ కొట్టించాడు. విశాఖపట్నంలో ఎంపికై న వారు జాయి్ అవడం లేదని, వెంటనే కేజీహెచ్కు వెళ్లాలని, తాను మధ్యలో కలుస్తానని లక్ష్మికి, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో, వారు ఆనందంగా విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో ఆ మోసగాడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో, అనుమానం వచ్చిన వారు రాజమహేంద్రవరంలోని వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో, ఆ ప్రబుద్ధుడు చేసిన మోసం బట్టబయలైంది. లక్ష్మికి అతడు ఇచ్చిన నియామక పత్రాన్ని, సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని నిర్ధారించారు. ఈ మేరకు బాధితులు గురువారం స్థానిక త్రీటౌన్ పోలీసులను ఫిర్యాదు చేశారు. సీఐ వి.అప్పారావు వారిచ్చిన ఫోన్ నంబర్ ప్రకారం వివరాలు సేకరించారు. అందులో నిందితులు అనంతపురానికి చెందిన వనం నాగరాజు, వనం రామానుజమ్మగా గుర్తించారు. జీఎన్ఎం పోస్టు ఇస్తామంటూ ఎర రూ.8 లక్షల వసూలు నకిలీ అపాయింట్మెంట్ లెటర్ అందజేత నిజం తెలిసి గొల్లుమంటున్న బాధితులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జరుగనున్న నీట్ రీ ఎగ్జామ్స్కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిపిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి బుధవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి పరీక్షా కేంద్రాలకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణం చేయవచ్చునన్నారు. బస్ స్టేషన్లో సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి పీఠంలో యథావిధిగా శ్రీచక్ర అర్చనలు రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం నుంచి యథావిధిగా శ్రీచక్ర అర్చనలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు బుధవారం విలేకరులకు తెలిపారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఈ నెల 5న విజయదుర్గాదేవి సాయుజ్యం పొందిన నేపథ్యంలో పీఠంలో అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు, అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తున్నా రు. శుక్రవారం ఉదయం 9.15 గంటల నుంచి పీఠంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నవరం.. తృతీయం ● ఐవీఆర్ఎస్ సర్వేలో దేవస్థానానికి మూడో స్థానం ● వెల్లడించిన ప్రభుత్వం అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన సర్వేలో 73 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అయితే 70.7 శాతంతో ఏకంగా ఐదో స్థానానికి పడిపోగా.. ఈసారి రెండు స్థానాలు అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. గత నెల కన్నా 2.3 శాతం ఎక్కువగా మాత్రమే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో 75 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి ఆ ర్యాంకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో 75.8 శాతం భక్తుల సంతృప్తితో శ్రీకాళహస్తి మొదటి, 74.2 శాతంతో ద్వారకా తిరుమల రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా తరువాతి స్థానాల్లో సింహాచలం, కాణిపాకం, విజయవాడ, శ్రీశ్రీలం దేవస్థానాలు నిలిచాయి. -
19న పీఎంవీబీఆర్వై నిర్వహణ
భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ (పీఎంవీబీఆర్వై) కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దివాన్చెరువులోని ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు కలువాయి అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి కల్పనకు ప్రోత్సాహం, యువతకు ఉద్యోగ అవకాశాల పెంపు, సామాజిక భద్రత పరిధి విస్తరణ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే అర్హులైన ఉద్యోగులకు ఒక నెల వేతనానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు. అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే యజమానులకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించే యజమానులకు ఈ ప్రయోజనాలు మరో రెండేళ్ల పాటు పొడిగిస్తారన్నారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు సృష్టించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. చికిత్స పొందుతూ యువతి మృతి మామిడికుదురు: సిలిండర్ ట్యూబ్ నుంచి గ్యాస్ లీకై వ్యాపించిన మంటల్లో తీవ్రంగా గాయపడిన ఈదరాడ కమ్మవారిలంకకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్టు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం తెలపారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమలాపురం ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న చంద్రప్రియ ఆదివారం సెలవు రోజు కావడంతో తండ్రి వెంకటేశ్వరరావు అమలాపురం నుంచి ఆమెను ఇంటికి తీసుకు వచ్చారు. ఆయనకు వంట చేసి పెట్టాక ఆమ్లెట్ వేసుకునేందుకు వంటింటిలోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు తొలుత ఆమెను రాజోలుకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె తల్లి సాయిజ్యోతి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. గొలుసు చోరీ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు రాయవరం: చైన్ స్నాచింగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో కోర్టు ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై డి.సురేష్బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు 2025లో మండలంలోని వెంటూరులో గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కువెళ్లినట్టు వచ్చిన ఫిర్యాదుపై నిందితుడు సాధనాల వెంకటేష్ను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న గొలుసును కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో అనపర్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.వంశీకృష్ణ వెంకటేష్కు ఆరు నెలల జైలు, రూ.50 జరిమానా విధించారు. ఈ కేసులో ఏపీపీ ఒ.మహాలక్ష్మి వాదనలు వినిపించినట్టు ఆయన తెలిపారు. కోర్టు కానిస్టేబుల్ సత్యకుమార్ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
● ఒకరి మృతదేహం లభ్యం ● కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ● మరొకరి కోసం గాలిస్తున్న సిబ్బంది పెరవలి (కొవ్వూరు): స్నేహితుల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. స్నానం కోసం వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లితండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక వద్ద బుధవారం ఇద్దరు యువకులు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన మురముళ్ల ప్రవచన కిషోర్, మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన పైడిమల్ల ప్రవీణ్ నిడదవోలుకు చెందిన మరో నలుగురు స్నేహితులు గోదావరిలో స్నానాలు చేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రవచన కిషోర్, పైడిమల్ల ప్రవీణ్ రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మద్దూరు లంక చేరుకున్నారు. నిడదవోలు నుంచి స్నేహితులు ఇంకా రావడం లేదని ఎండ వేడి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో వారిద్దరూ గోదావరిలో స్నానానికి దిగారు. స్నేహితులు వచ్చేటప్పటికి నదీ తీరంలో వారిద్దరి బట్టలు, షూష్ చూసి స్నేహితులు వచ్చి ఉంటారని ఆనందంతో ముందుకు వెళ్లారు. ఎంతసేపటికీ వారు కనపడకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రవచన కిశోర్ (21) మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఒడ్డుకి తీసుకురావటంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గల్లంతైన పైడిమల్ల ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. ప్రవీణ్ కోసం వారి తల్లితండ్రులు, బంధువులు తల్లిడిల్లిపోతున్నారు. కిశోర్ మృతదేహం వద్ద తండ్రి కన్నీరు పెట్టుకుంటూ లేవరా కిషోర్ ఎక్కడికి వెళ్లిపోయావురా, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోయావా అంటూ రోదిస్తుంటే చుట్టుపక్కల వాళ్లు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. -
హమ్మయ్య.. వానొచ్చింది!
రాజమహేంద్రవరం/మండపేట (కపిలేశ్వరపురం): దాదాపు మూడు నెలల నుంచి ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్న ప్రజలు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం, చల్లని గాలులకు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం నగరం, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కడియం మండలాన్ని వాన ముంచెత్తింది. కడియం, వేమగిరి, కడియపులంక, జేగురుపాడు, మురమండ, వీరవరం తదితర గ్రామాల్లో భారీ వర్షంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించి పోయింది. మెట్ట ప్రాంతంలో జోరు వాన కురిసింది. దేవరపల్లిలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉరుములు, మెరుపుల ధ్వనులతో ఆకాశం దద్ధరిల్లింది. ద్వారపూడి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకథాటిగా గంటపాటు వర్షం కురిసింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాడలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. -
ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
● అక్రమ కట్టడాలు, మైనింగ్పై చర్యలు తీసుకోవాలి ● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను ● కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేత చింతూరు: డివిజన్ పరిధిలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగుతున్న అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన చింతూరులో కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, భూములను రక్షించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు మండలం మోతుగూడెం, వీఆర్ పురం మండలం కొల్లూరులో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ రిసార్టులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డివిజన్లోని అటవీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా ఎలాంటి లీజులు, పర్యావరణ అనుమతులు లేకుండా విలువైన తెల్లరాయిని అక్రమంగా తవ్వేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారని, దీనివల్ల స్థానిక వాగులు, ధ్వంసమవుతున్నాయని ఆయన తెలిపారు. అడవులను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూర చిట్టి బాబు పాల్గొన్నారు. -
అన్నదాత గుండె చెరువు!
పెరవలి: ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తే తప్పితే సాధారణ ఫిర్యాదులకు అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ఇక్కడ ఒక సమస్య ఉంది.. పలానా వారు ఈ సమస్యకు కారణమని రుజువులు, సాక్ష్యాలు చూపి ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించకపోవడానికి అధికార మదం తలకెక్కిన పలువురు చోటా మోటా నాయకులేనని చెప్పక తప్పదు. వివరాల్లోకి వెళితే కానూరు అగ్రహారంలో కొంత కాలంగా పంట భూములను రొయ్యల చెరువులుగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట చెరువు తవ్వకాలు మొదలుపెట్టగా ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఆ తవ్వకాలను చూసి ప్రశ్నించగా ఎవరికివ్వాల్సిన మామూళ్లు వారికిచ్చాం.. దిక్కున్న చోట చెప్పుకోండని తవ్వకాలు జరుగుతున్న భూ యజమాని బదులిచ్చారు. దీంతో ఆ రైతులు గ్రామంలోకి వెళ్లి మరికొందరిని తీసుకువచ్చారు. వచ్చేటపుడు వారితో పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంకొక్క అంగుళం తవ్వినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక సదరు యజమాని తవ్వకాలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు కె.నిరంజన్ హుటాహుటిన క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీంతో రైతులు, మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పురుగుమందు డబ్బాలు చూపిస్తూ వెంటనే చెరువును పూడ్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆయన వెంటనే చెరువులను ధ్వంసంచేయాలని, రెవెన్యూ, వీఆర్వో, ఆర్ఐ అక్కడే ఉండి చెరువు పూడుస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తనకు పంపాలని ఆదేశించారు. ఎవరైనా అడ్డుకున్నా, ఎదురు తిరిగినా పొక్లెయిన్లను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పొక్లెయిన్ డ్రైవర్లు అక్కడి నుంచి జారుకోవడంతో అధికారులు వారికి ఫోన్ చేసి చెరువులను పూడుస్తారా.. పొక్లెయిన్లను సీజ్ చేయమంటారా అని హెచ్చరించారు. దీంతో చేసేది లేక వారు వచ్చి చెరువులను పూడ్చడం ప్రారంభించారు. పూడ్చివేత పనులు పూర్తయ్యే వరకు తాము వెళ్లేది లేదని రైతులు అక్కడే భీష్మించారు. కాగా ఇప్పటికే కానూరు అగ్రహారంలో సుమారు 15 ఎకరాల్లో రొయ్యల చెరువులను తవ్వినట్టు రైతులు తెలిపారు. ఈ చెరువులు తవ్వుతున్నవారు అధికార టీడీపీ వర్గీయులు కావడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల తవ్వకంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు పనులను అడ్డుకుంటున్నారు తప్ప పూడ్చివేత చర్యలు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలు చెరువుల తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. నాటి నుంచి 2024 వరకు ఒక్క చెరువు కూడా తవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఆ జీవోను రద్దు చేయలేదు కానీ రాజకీయ పలుకుబడితో గుట్టుగా చెరువు తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. 2025లో పెరవలి మండలం కానూరు అగ్రహారంలో అక్రమంగా రాత్రిళ్ళు తవ్వకాలు చేపడితే స్దానిక రైతులు అడ్డుకుని తవ్వకాలను నిలుపుదల చేసారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 ఎకరాలు చెరువులుగా మారిపోవడంతో సరిహద్దు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు పంట భూముల్లో చెరువుల తవ్వకానికి ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. కానూరు అగ్రహారంలో చెరువు తవ్వుతున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నాం. అంతే కాకుండా చెరువును పూడ్చాలని ఆదేశాలిచ్చాం. – కె.నిరంజన్, తహసీల్దార్, పెరవలి పంట భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువు తవ్వకాలు సరిహద్దు రైతుల ఫిర్యాదులకు స్పందించని అధికారులు ఆత్మహత్యలే శరణ్యమని పురుగు మందు డబ్బాలతో నిరసన ఆగమేఘాలపై వచ్చి పూడ్చివేతకు ఆదేశించిన తహసీల్దార్ వైఎస్సార్ సీపీ హయాంలో తవ్వకాలపై నిషేధాజ్ఞలు ఏడాది కూటమి పాలనలో యథేచ్ఛగా పంట భూముల ధ్వంసం -
కార్పొరేషన్ ఎన్నికలేనా?
● రాజమహేంద్రవరంలో వీడని ప్రతిష్టంభన ● 2027లో గోదావరి పుష్కరాలు ● అప్పటిలోగా ఎన్నికల నిర్వహణ అసాధ్యం ● ఎమ్మెల్యేల పంతంతో ముందుకు కదలని ప్రక్రియ సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కలగానే మిగలనున్నాయా? ఇందుకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఒక కారణంగా నిలుస్తోందా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీకే దిక్కులేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఎన్నికల నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో మేయర్ పీఠం ఆశిస్తున్న నేతల ఆశలు అడియాసలుగానే మిగలనున్నాయన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదీ సంగతి రాజమహేంద్రవరం కార్పొరేషన్కు 2012 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో కార్పొరేషన్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను నగరంలో విలీనం చేసే అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. రూరల్లోని గ్రామాలు విలీనం చేయకుండా ప్రస్తుతమున్న 50 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, విలీన గ్రామాలతో ఎన్నికలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పట్టుబడుతుండటంతో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. మంత్రి హామీకి దిక్కేది? గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పుష్కర పనులు, ఏర్పాట్లు, నిర్వహణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే జరగనుంది. పనులు సవ్యంగా జరగాలంటే కార్పొరేషన్కు పాలకవర్గం అవసరం. ఇందులో భాగంగానే ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రుడా) చైర్మన్ పోస్టును సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు సైతం నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ కాకినాడలో జరిగిన జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వివాదాలను పరిష్కరించి రెండు మాసాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి వ్యాఖ్యలతో గతేడాది డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. మంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదు. ఈ పరిణామం నగర వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది. పుష్కర పనుల పేరుతో హడావుడి 2027 పుష్కరాల నిర్వహణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు మంజూరు కాకపోయినా.. పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నెలలుగా పుష్కర ఏర్పాట్లు, నిధుల ప్రతిపాదనలపై తలమునకలవుతున్నారు. ఫలితంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తావనే లేకుండా పోయింది. గ్రామాల విలీనం అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో వార్డుల విభజన ప్రక్రియ సైతం చేపట్టిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో కార్పొరేషన్కు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రేటర్ హోదా దక్కేనా? కార్పొరేషన్కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇక పుష్కరాల తర్వాతైనా జరుగుతాయా? అన్న స్పష్టత కొరవడింది. గ్రామాల విలీనం అంశం కోర్టు పరిధిలో ఉండటంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్లో రూరల్లోని 25 గ్రామాల విలీనం జరిగి ‘గ్రేటర్ రాజమహేంద్రవరం’ హోదా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని సజావుగా జరిగితే గ్రేటర్ రాజమహేంద్రవరంగా ప్రాధాన్యం దక్కుతుంది. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. పుష్కర పనులపై మాటల యుద్ధం పుష్కరాల నిర్వహణ సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పుష్కర ఘాట్ ఆధునీకరణ పనుల్లో సైతం టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన మంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమిలో భాగమైనా పనుల్లో తమకు వాటాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతో రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు జనసేన మంత్రి కందుల దుర్గేష్పై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. విడుదల కాని నిధులు గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఆయా వార్డుల్లో ఎవరు నెగ్గితే వారి ఆధ్వర్యంలో నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా నెగ్గితే వారి పెత్తనం ఎక్కడ భరించాల్సి వస్తుందో..? పుష్కర నిధుల పనుల్లో వాళ్లకు సైతం పర్సంటేజీలు పంచాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదు. ఎన్నికలు జరిగితే టీడీపీతో పాటు కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ అభ్యర్థులకు కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. దీనికితోడు మేయర్ స్థానం తమదేనంటూ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం మెజార్జీ కార్పొరేటర్ స్థానాలు ఆశిస్తోంది. ఇలాంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగితే తాము పట్టుకోల్పోతామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎన్నికలకు మొగ్గు చూపడం లేదు. పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదు. -
చేయని పనికి ఉపాధి!
● పని చేసినది ఇరిగేషన్ అధికారులు ● బిల్లు పెట్టి స్వాహా చేసినది ఉపాధి విభాగం ● రూ.5.45 లక్షలకు బాధ్యులు ఎవరో మరి? ఆలమూరు: ఉపాధి పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. అధికార పార్టీ సానుభూతి పరులకు పని చేయకుండానే మస్తర్లు వేస్తూ ఉపాధి నిధులు కాజేస్తున్నారు. మండలంలోని మోదుకూరు వెంబడి ప్రవహిస్తున్న మైనర్ ఇరిగేషన్ కాలువ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆ గ్రామానికి చెందిన పలువురు ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో ఆ దోపిడీ ఆలస్యంగా వెలుగు చూసింది. మోదుకూరులోని ముత్యాల కృష్ణమూర్తి మకాం నుంచి గుమ్మిలేరులోని శ్రీశంఖేశ్వర పార్శ్వనాథ్ (బుద్ధుడు) ఆలయం వరకూ ఉన్న కాలువ పరిధిలో నీటిపారుదల శాఖ గడ్డి మందు చల్లి సంబంధిత బిల్లును ఆమోదం కోసం పంపింది. ఇదే క్రమంలో మండల ఉపాధి విభాగం ఇదే పనిని చేయకపోయినా నాలుగు వారాలు పాటు చేశామంటూ ప్రత్యేక ఐడీని రూపొందించి రూ.5,45,600 డ్రా చేయడం గమనార్హం. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా రెండో పంట పూర్తయిన తరువాత మొత్తం బిల్లులు పెడతామని వివరించారు. కాగా చేయని పనికి బిల్లు పెట్టడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం, గుడ్డిగా బిల్లులు మంజూరు చేయడంపై అధికారులు ఏం చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి మరి. -
స్వయం సహాయక సంఘాలకు రుణాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా రుణాలు పంపిణీ చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ నగేష్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. డీఆర్డీఏ ద్వారా బ్యాంకు అనుసంధానంతో 270 మంది లబ్ధిదారులకు రూ.3.95 కోట్ల రుణాలు మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల పురోగతికి బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి పథకాల కింద 2,534 సంఘాలకు చెందిన 16,386 మందికి రూ.252.14 కోట్లు రుణాలుగా మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


