breaking news
East Godavari District News
-
శాంతించిన వరద గోదావరి
● ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ● 9.44 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి శాంతించింది. ఉదయం 6గంటలకు 12.70 అడుగులు ఉన్న నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ మధ్యాహ్నం 3.47గంటలకు 11.70అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7గంటలకు 11.50 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 9,44,409 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుండగా మిగిలిన ప్రాంతాలలో స్వల్పంగా తగ్గుతున్నాయి. బుధవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.22 మీటర్లు, పేరూరులో 14.82 మీటర్లు, దుమ్ముగూడెంలో 15.15 మీటర్లు, భద్రాచలంలో 41.20 అడుగులు, కూనవరంలో 18.08 మీటర్లు, కుంటలో 10.45 మీటర్లు, పోలవరంలో 11.89 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
కేంద్ర కారాగారాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి ఎన్.శ్రీలక్ష్మి మంగళవారం సందర్శించారు. కేంద్ర కారాగారం, మహిళా జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహార ప్రమాణాలు, సదుపాయాలు పరిశీలించారు. ఖైదీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు వేయాలన్నా, పైకోర్టుల్లో అప్పీలు చేయాలన్నా, ఎటువంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. దీనికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు సమర్పించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలకు అందుబాటులో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలు ధవళేశ్వరం: సంప్రదాయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అత్యంత ప్రతిభతో పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి మంగళవారం ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కష్టతరమైన పాటలు కూడా ఎస్పీ బాలు అవలీలగా పాడారని, ఆయనను ఎవరూ అనుకరించలేరన్నారు. ఎంపీని సినీనటులు శుభలేఖ సుధాకర్, రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, జివి రమణ సత్కరించారు. ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి – కేంద్ర బృందం తనిఖీ పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. తనిఖీ అనంతరం ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి ఉన్నారు. ఉచిత బస్సుతో ఆటోడ్రైవర్ల ఉపాధికి గండిఅమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు
● పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి నేడు శ్రీకారం ● రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఫార్మా సంస్థ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మార్గంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులను గమనించిన అప్పటి ఈఓ చంద్రశేఖర అజాద్ 2023లో ఈ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహాన్ని కూల్చి, దాని స్థానంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2023 అక్టోబర్లో ఇక్కడ సత్రాన్ని కూల్చేశారు. అదే ఏడాది విజయదశమి నాడు భూమిపూజ జరిగింది. తర్వాత ఈఓ చంద్రశేఖర అజాద్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇక్కడ విశ్రాంతి షెడ్డు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో పలు కథనాలు వెలువడ్డాయి. స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు లారెస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున విశ్రాంతి షెడ్డు నిర్మించేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేసినట్టు దేవస్థానం ఈఈ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో 12 కౌంటర్లు, స్టెయిన్లెస్ స్టీల్ లైన్లు, మూడు హెలికాప్టర్ ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేయనున్నారు. ఈ ఖర్చంతా లారెస్ సంస్థ భరించనుందని ఈఈ తెలిపారు. రెండు నెలల్లో పూర్తి ● విశ్రాంతి షెడ్డు నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని లారెస్ సంస్థను కోరినట్టు ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. ● అక్టోబర్ 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతున్నందున అప్పటికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరామన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ రాజగోపురం వైపు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. -
సంక్షేమ సంతకం వైఎస్సార్
● జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ● సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు సాక్షి, రాజమహేంద్రవరం: సంక్షేమ సంతకం చేసి.. దార్శనికుడిగా పేరుగాంచి.. ఆరోగ్య ప్రదాతగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ మహనీయుడు చేసిన సేవలు, సంక్షేమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు కొనియాడారు. మహానేత వర్ధంతి సందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలురువు నేతలు మాట్లాడుతూ పేదల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పనిచేసిన మహానేత వైఎస్సార్ అని కొనిడాయారు. ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. అందుకే ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆ లోటు తీరనిది రాజమండ్రి రూరల్: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం వేమగిరి జంక్షన్, కొంతమూరు గ్రామాల్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు వైఎస్కు ఘన నివాళులు అర్పించారు. అంకితభావంతో రాజకీయాల్లో కొనసాగిన మహనీయుడు వైఎస్ అన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికి తీరనిదని, నేటికీ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. కోటగుమ్మం జంక్షన్లో.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి కోటగుమ్మం సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. కొవ్వూరులో అన్నదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్థంతిని కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో మెయిన్రోడ్డు, వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను, ఆయన చేపట్టిన సంక్షేమాన్ని స్మరించుకున్నారు. అనపర్తిలో.. నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి కెనాల్ రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్ అని కొనియాడారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రాంబాబు పాల్గొన్నారు. నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని మంగళవారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. గోపాలపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. గోపాలపురంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహానేత వైఎస్ఆర్ రాజానగరం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా రాజానగరం వైఎస్సార్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర రాజమండ్రి సిటీ: రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి రామచంద్రారెడ్డి, భరత్, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్ క్వారీ సెంటర్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు పవిత్రోత్సవాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పర్యవేక్షణలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయంలోని పురాతన కల్యాణ మండపంలో ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
వంటకు కొబ్బరి నూనె శ్రేష్ఠం
కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరిగి, చర్మానికి తేమ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హార్మోన్ల స్థాయిలను స్థిరంగా ఉంచి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను తలకు పట్టించి.. మర్దన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. -
వందే భారత్ ఢీకొని వృద్ధురాలి మృతి
నిడదవోలు: పట్టాలు దాటుతున్న వృద్ధురాలిని వందే భారత్ రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నిడదవోలు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం, తాడేపల్లిగూడెం మండలం తెలికిచర్ల గ్రామానికి చెందిన రేకపల్లి సీతమ్మ(65) నిడదవోలులోని కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు సోమవారం ఉదయం బయలుదేరింది. బసివిరెడ్డిపేట–ఇందిరానగర్ మధ్య రైలు పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే వందే భారత్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. -
స్వదేశానికి క్షేమంగా చేరిన మహిళ
మస్కట్ నుంచి రప్పించిన కోనసీమ మైగ్రేషన్ అధికారులు అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా స్వదేశానికి రప్పించారు. తమ తల్లిని స్వదేశానికి రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించింది. కేంద్రం ప్రతినిధులు స్పందించి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మన్యం నాగమణిని ఇండియాకు రప్పించినట్టు డీఆర్వో, కేంద్రం నోడల్ అధికారి కొత్త మాధవి సోమవారం తెలిపారు. ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య తల్లి నాగమణి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం మస్కట్ దేశానికి వెళ్లింది. కొంతకాలం నుంచిఆ ఆమె ఆరోగ్యం బాగోలేక, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెను ఇండియాకు రప్పించడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆమెను పంపించిన ఏజెంట్ను అడిగితే రూ.1.60 లక్షలు కడితే కానీ ఆమెను రప్పించలేమని స్పష్టం చేశాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, డబ్బు సర్దుబాటు కుదరలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ కలెక్టరేట్లో ప్రత్యేకించి వలసదారుల కోసం సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేశారని, విదేశాలకు వెళ్లే వారికి అండగా ఉంటోందని తెలుసుకుని ఈ కేంద్రాన్ని ఆశ్రయించారు. కేంద్రం అధికారులు సంబంధిత ఏజెంట్తో మాట్లాడి, సమస్యను పరిష్కరించి.. నాగమణిని క్షేమంగా మస్కట్ నుంచి రప్పించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నాగమణి హైదరాబాద్కు చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగ్రామానికి మృతదేహంఅంబాజీపేట: పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కాగిత అర్జమ్మ ఉపాధి కోసం బెహరాన్ దేశం వెళ్లి పదేళ్లుగా అక్కడే పని చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు రూ.3 లక్షల ఖర్చవుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) అండగా నిలిచింది. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్తో కలిసి ఈ సంస్థ ఖర్చులు భరించి, అర్జమ్మ మృతదేహాన్ని సోమవారం ఇంటి వద్ద బంధువులకు అప్పగించారు. ఇందుకు కృషి చేసిన ఆయా సంస్థల ప్రతినిధులకు మృతురాలి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాడైన పంటల పరిశీలన
పెరవలి: గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి చనిపోయిన విషయమై సాక్షిలో జల దిగ్బంధం శీర్షికన సోమవారం వెలువడిన కథనానికి ఉద్యానవన అధికారులు స్పందించారు. వివిధ ప్రాంతాల్లో పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి సుధీర్కుమార్ మాట్లాడుతూ, దిగువ లంకల్లో పంటలు పూర్తి పాడైపోయాయని, నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే వరద పూర్తిగా తగ్గాలన్నారు. ఆ తర్వాత పంటలు పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు మరో వారం ఆగాల్సి ఉంటుందన్నారు. సోమవారం కానూరు నుంచి కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం వరకు పంటలను పరిశీలించామన్నారు. వరద తగ్గాక అంచనాలు తయారు చేయాలని వీఆర్వోలు, ఉద్యానవన అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల రైతులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి కొయ్యలగూడెం: అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కన్నాపురం గ్రామ శివారున సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపుడి సత్యనారాయణ (60) ద్విచక్ర వాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కన్నాపురం శివారున వాహనంతో చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
కాయకల్ప తరువు
● ఆరోగ్య ప్రదాయిని.. కొబ్బరి ● నీటి నుంచి ఆయిల్ వరకు ప్రతిదీ ఔషధమే.. ● నీరు, ముక్క, పాలు, వెనిగర్ ఇలా ఎన్నెన్నో! ● అన్నింటా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు ● సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి ఒక్క ఉమ్మడి తూర్పులోనే 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే కొబ్బరి ఔషధాల గని. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉపాధి పొందుతుంటే.. ఆయా ఉత్పత్తుల ద్వారా సామాన్యులు సైతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఔషధాలను అందిస్తూ కొబ్బరి ఆరోగ్య వర ప్రదాయినిగా పేరొందింది. సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కొబ్బరి చెట్టును చూస్తే గోదారమ్మ ఒడిలో ఒదిగిన అందాల బిడ్డలా కనిపిస్తోంది. ప్రకృతి అందాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అదనపు అందాలు అద్దే కొబ్బరి చెట్టు చూసి ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తోటల్లో పంటగానే కాదు వరిచేలు.. చెరువులు.. రోడ్లు.. కాలువలు.. నదీపాయల వెంబడి.. ఇళ్ల చుట్టూ కనిపించే కొబ్బరి చెట్టు గోదావరి వాసుల నుదుటిన ప్రగతి తిలకం దిద్దుతూ ఇక్కడ వారి జీవనంలో పెనవేసుకుపోయింది. కన్న కొడుకుగా పిలుచుకుంటారంటే.. వారి జీవనంలో కొబ్బరి ఎంత ప్రాముఖ్యమో అవగతమవుతుంది. మధుమేహ రోగులకు కొబ్బరి కల్పరస కొబ్బరి జ్యూస్ (కల్లు–కల్పరసా) ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఫెర్మంటేషన్ ఆవకుండా ఉత్పత్తి చేసే కొబ్బరి జ్యూస్ (నీరా) నేరుగా తాగినా, దీనిని నుంచి ఉత్పత్తి చేసే పంచదార, బెల్లం, తేనెను ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో గైసమిక్ ఇండెక్స్ 25 శాతం మాత్రమే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని ఏఆర్టీ/ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎటువంటి చికిత్సా కేంద్రాలు నడపరాదన్నారు. నియామావళి ప్రకారమే సేవలు అందించాలన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంలో ఏఆర్టీ, ఐవీఎఫ్, సరోగసీ ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన, రిజిస్ట్రేషన్ కలిగిన ఆస్పత్రులు/కేంద్రాల్లోనే చికిత్స పొందాలన్నారు. అనుమతి లేని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలు ఆయా విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికార/నమోదు కాని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవద్దని సూచించారు. ఏఆర్టీ లేదా సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు దంపతుల చట్టబద్ధ సంతానం అవుతారని స్పష్టం చేశారు. వాణిజ్య సరోగసీ (డబ్బు కోసం) పూర్తిగా నిషేధించబడిందన్నారు. లింగ నిర్ధారణ, గర్భకణాల అమ్మకాలు కఠినంగా నిషేధించబడ్డాయని తెలిపారు. చట్ట ఉల్లంఘన చేసిన వారికి జైలుశిక్ష, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాల అమలుతో పారదర్శకత, న్యాయం, రక్షణ అన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా అవగాహనతో ఉండి, నిబంధనలు పాటించే కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇతర వివరాలకు 81255 67830 నంబరులో సంప్రదించాలన్నారు. -
పింఛను సొమ్ముతో వెటర్నరీ అసిస్టెంట్ పరారీ
రంగంపేట: లబ్ధిదారులకు అందించాల్సిన పింఛను సొ మ్ముతో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడు గ్రామ సచివాలయానికి సంబంధించి సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.14.03 లక్షలు విడుదలయ్యా యి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రంగంపేట ఆర్సీబీ బ్రాంచ్ నుంచి సంక్షేమ, విద్యా సహాయకుడు పూర్ణచంద్రరావు గత నెల 30న ఆ మొత్తాన్ని డ్రా చేసి, పెన్షన్ల పంపిణీకి బాధ్యులైన అధికారులకు అందజేయాల్సి ఉంది. అందులో రూ.2,13,500ను వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్కి అప్పగించి, అతడి వద్ద రసీదు తీసుకున్నారు. కానీ గణేష్ సోమవారం పింఛన్లు పంపిణీ చేయకుండా, విధులకూ హాజరు కాకుండా, ఫోన్ స్విచాఫ్ చేశాడు. అతడు అందుబాటులో లేకపోవడంతో పింఛనుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఎంపీడీవో వీరసాయిబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి బోనగిరి వెంకన్నబాబు రంగంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. ఎస్సై శివప్రసాద్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, గణేష్ ఇంతకు ముందు పనిచేసిన పెద పూడి మండలంలోనూ అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో గణేష్ పెదపూడి నుంచి రంగంపేట మండలం చండ్రేడు సచివాలయానికి వచ్చాడు. చండ్రేడులో పింఛన్ల పంపిణీకి అంతరాయం లేకుండా ఉండేందుకు కొత్త పీడీఓని నియమించినట్టు ఎంపీడీవో సాయిబాబు చెప్పారు. ఈ వ్యవహారాన్ని అధికారులు కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ను సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ● పోలీసు కేసు నమోదు ● కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ -
ఆనందమీనందమాయె..
● మనసు దోచుకుంటున్న అక్వేరియం కల్చర్ ● ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం ● వాస్తు నమ్మకాలూ ఓ కారణం రాయవరం: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు ఇంటి అలంకరణలో అక్వేరియంలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్లో భాగంగా అక్వేరియం ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవారు, వాస్తుపరమైన నమ్మకంతో తమ సంపాదనను వృద్ధి చేసుకునే వారు, సుఖ సంతోషాలను పొందాలని నమ్మేవారు ఇప్పుడు చేపలను గాజు తొట్టె (అక్వేరియమ్స్)లో ఉంచుతున్నారు. వ్యాపార సంస్థల్లోనూ.. అక్వేరియంలను ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారులు అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, ఇళ్లల్లో స్థలానికి అవసరమైన ప్రమాణంలో అక్వేరియంలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందంతో పాటు, ఆదాయం వృద్ధి చెందుతుందని, వాస్తు దోషాలకు విరుగుడుగా ఉంటుందని నమ్మే వారు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు నీటిలో తిరిగే చేపలను చూడడానికి ఇష్టపడతారు. ఇంట్లో చిన్నపిల్లల కోరికను తీర్చేందుకు కూడా వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఆసక్తి అక్వేరియం ఏర్పాటు వెనుక కొన్ని వాస్తు నమ్మకాలు దాగున్నాయి. చైనీస్ వాస్తు ప్రకారం చేపలు అదృష్టానికి, నీరు సంపదకు గుర్తుగా భావిస్తారు. ఈ రెంటినీ కలిపి ఒకే చోట (అక్వేరియంలో) ఉంచుకుని సంపద వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. చేపలు ఎప్పుడూ కళ్లు తెరిచే స్వభావాన్ని కలిగి ఉండడంతో మనకు జరగబోయే ఆటంకాలను ముందుగా గ్రహించి కదలికలతో సమాచారం అందిస్తాయనే నమ్మకం ఉంది. అధిక లాభాలను ఆర్జించవచ్చనే నమ్మకంతో వ్యాపార సంస్థలు సైతం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్వేరియంల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా స్వదేశీ, విదేశీ చేపలు నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. దేశంలోని చైన్నె, కోల్కతా తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల చేపలను కూడా వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. ఉపాధికి మార్గంగా... అక్వేరియంలో ఉంచేందుకు పలు రకాల చేపలను మా ర్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. స్కాట్ఫిష్, గోల్డ్ఫిష్, అరోవనా, రెడ్క్యాప్, గుప్పీస్, వైట్ ఏంజల్, బెలూన్ఫిష్, బ్లాక్గోల్డ్ఫిష్, బ్లాక్ షార్క్, ఫ్లోరాస్, క్రోకడైల్ ఫిష్ వంటి 40 రకాల చేపలు లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.20 వేల వరకు వివిధ ధరల్లో పలు రకాల చేపలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు పలు రకాల మోడళ్లలో అక్వేరియంలు కూడా లభ్యమవుతున్నాయి. -
డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాధవ్ రాష్ట్రంలో ‘సారథ్యం’ పేరుతో చేపడుతున్న యాత్ర సోమవారం రాజమండ్రి చేరింది. ఈ సందర్భంగా నగరంలో చాయ్ పే చర్చ, శోభాయాత్ర, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం పంతులుకు నివాళులర్పించారు. మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి నేరుగా నిధులు ఇస్తోందన్నారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ సర్వే తేల్చిందని, ఇప్పటికీ మోదీపై 58 శాతం ప్రజలు విశ్వాసం చూపుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుతంలో కొన్ని ఇబ్బందులు సహజమని, సర్దుకుని ముందుకు వెళ్లాలన్నారు. శోభాయాత్ర నగరంలో ‘సారథ్యం’ శోభాయాత్రను వై–జంక్షన్ వద్ద మాధవ్ ప్రారంభించారు. జానపద కళారూపాలతో యాత్ర కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చితికిన బతుకులకు మహానేత చేయూత
పేద, సామాన్య వర్గాలనే తేడా లేకుండా దుర్భర, దయనీయ పరిస్థితుల్లో ప్రజలు.. తమ జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం వారిలో పూర్తిగా సన్నగిల్లిన తరుణమది.. పాలకవర్గం దోపిడీ విధానాలకు బలైపోతూ.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ఇక భగవంతుడే దిక్కని ప్రజలంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న సమయాన.. ఆపద్బాంధవుడిలా అక్కున చేర్చుకున్నాడా మహానుభావుడు. నేనున్నా.. కష్టాలు తీరుస్తానంటూ భరోసా ఇచ్చారు. అనుకున్నదే తడవుగా దీన స్థితిలో ఉన్న ప్రజల తలరాతల్ని.. దిశానిర్దేశం లేని రాష్ట్ర రూపురేఖల్ని మార్చేశారు ఆ మహానేత, జన నాయకుడు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.సాక్షి, రాజమహేంద్రవరం: అభివృద్ధి ప్రదాత.. ప్రజల ఆత్మ బంధువు.. సంక్షేమ దార్శనికుడు.. మెట్ట రైతుల మహనీయుడిగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అక్కమ్మా.. చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయత పంచుకుని కుటుంబ సభ్యుడిగా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు మహానేత. తూర్పుగోదావరి జిల్లా సంక్షేమం, అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అనేక పథకాలకు శంకుస్థాపనలు చేశారు. వ్యవసాయ రంగాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు బడ్జెట్లో సింహభాగం రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి మెరుగైన వైద్యం అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఊపిరి పోశారు. విద్య, వైద్యం, పర్యాటకం, వ్యవసాయం తదితర రంగాల్లో సంపూర్ణ పురోగతి సాధించి, జిల్లా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో విన్న సమస్యలకు అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాల్చారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.రూ.800 కోట్లతో రాకపోకలకు మార్గం సుగమంవిజయవాడ–విశాఖపట్నం నగరాల మధ్య రాకపోకలు మరింత సౌకర్యవంతంగా చేసేందుకు వైఎస్సార్ రూ.800 కోట్లతో గామన్ బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టారు. 14 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగ్గా.. 4.5 కిలోమీటర్ల వరకు గోదావరి నదిపై వంతెన నిర్మించారు. 2008లో పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణంతో విశాఖ–విజయవాడకు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గింది.రైతు బాంధవుడిగా ఖ్యాతి● మహానేత వైఎస్సార్ రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారు. పావలా వడ్డీకే రుణాలు, రుణమాఫీతో వెన్నుదన్నుగా నిలిచారు.● బ్రాహ్మణగూడెంలో రూ.273.28 లక్షలు వెచ్చించి 1200 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా 600 ఎకరాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపారు. తాళ్లపూడి మండలంలో 4,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.8.59 కోట్లు వెచ్చించి పైడిమెట్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. రూ.360.06 లక్షల వ్యయంతో చాగల్లులో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.● తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లు వెచ్చించి 16 మండలాల్లో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. కొవ్వాడ కాలువ వరద ముంపు నివారణకు రూ.56 కోట్ల వ్యయంతో అవుట్ ఫాల్ స్లూయిజ్ నిర్మించారు. దీంతో కొవ్వూరు, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో 15 వేల ఎకరాలకు వరద ముంపు సమస్య తీరింది. వైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టులో ఎక్కువ పనులను పూర్తి చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చారు. కుడి, ఎడమల ప్రధాన కాలువలు తవ్వించారు.మెట్ట రైతుల మహనీయుడిగా..మెట్ట ప్రాంత రైతులకు మంచి చేయాలన్న తలంపుతో గోదావరి నదిపై తాడిపూడి సమీపంలో చింతపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించాలని ప్రయత్నించారు. ఆయన హయాంలో పనులు ప్రారంభించారు. రూ.15.26 కోట్లతో కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లోని 4,950 ఎకరాలకు సాగునీరు అందించే ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం కింద 90 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని రూ.1.75 కోట్లతో పునరుద్ధరించారు.అభాగ్యులకు కొండంత అండనిరాశా నిస్పృహల్లో ఉన్న అభాగ్యులకు మహానేత అండగా నిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చే రూ.75 పింఛను సొమ్మును రూ.200కు పెంచారు. వికలాంగ పింఛను రూ.500కు పెంచిన ఘనత దివంగత వైఎస్సార్కే దక్కుతుంది. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచకుండా సేవలందించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూశారు.పాదయాత్ర పదిలందివంగత మహానేత పాదయాత్ర దేశంలోనే ప్రత్యేకత చాటుకుంది. ప్రసిద్ధ రోడ్డు కం రైలు వంతెనపై ఆయన పాదయాత్ర సాగింది. ఆ సమయంలో కొంతమూరు వద్ద అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా అక్కడే అర గంట పాటు విశ్రాంతి తీసుకుని, తిరిగి యాత్ర కొనసాగించారు. అనంతరం మధురపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న తోటలో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని ప్రముఖ నాయకులతో ముచ్చటించారు. అనంతరం 2003లో బస్సు యాత్ర సైతం చేపట్టారు.నిడదవోలు అభివృద్ధికి అగ్రస్థానంఇలాఉండగా నిడదవోలులో 2005లో రాజీవ్ నగరబాట సందర్భంగా పట్టణంలో పర్యటించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాజీవ్ నగర బాటలో పట్టణానికి సుమారు రూ.కోటితో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, రూ.కోటితో సెంట్రల్ విద్యుత్ లైటింగ్, విద్యానగర్లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. బాలాజీనగర్లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కేఎల్ సామర్థం ఉన్న మంచినీటి రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. పేదలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకంలో భాగంగా 28వ వార్డు శివారున ప్రతిష్టాత్మకంగా గృహాలను నిర్మించిన ఘనత వైఎస్సార్కే దక్కింది. 832 మంది అబ్ధిదారులకు గృహాలను నిర్మించారు. రూ.70 లక్షలతో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మున్సిపల్ కార్యాలయంగా నామకరణం చేశారు.సేవా కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధందివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు, ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి గుర్తు చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సన్నద్ధమవుతున్నారు. పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ఘన నివాళులు అర్పించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై అలసత్వం తగదు
– జేసీ చిన్నరాముడు సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించరాదని, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జేసీ చిన్నరాముడు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్వో సీతారామమూర్తి, డీఎల్డీవో పి.వీణాదేవితో కలిసి ఆయన పీజీఆర్ఎస్లో అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో మొత్తం 159 అర్జీలు అందాయన్నారు. వీటిలో 150 అర్జీలను ఆఫ్లైన్లో, 9 ఆన్లైన్లో స్వీకరించామన్నారు. నిడదవోలు మండలం రావిమెట్ల గ్రామానికి చెందిన వీరమల్ల జోషికకు ఆయన వీల్చైర్ అందజేశారు. అలాగే హెచ్ఐవీ/ఎయిడ్స్పై సమాచారం కోసం జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1097 అందుబాటులో ఉందని జేసీ తెలిపారు. హెచ్ఐవీ నివారణకు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 60 రోజుల విస్త్రత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రచార కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు. ఉర్దూ టీచర్ల నియామకానికి చర్యలు మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు షరీఫ్ సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ప్రాధాన్యానికి అనుగుణంగా హైస్కూళ్లలో ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ వెల్లడించారు. సోమవారం స్థానిక లక్ష్మివారపుపేటలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్, కొంతమూరులోని జెడ్పీ హైస్కూళ్లను సందర్శించారు. అక్కడి ముస్లిం కుటుంబాలు, ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 12 ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించినట్టు చెప్పారు. పరిస్థితులను బట్టి ఇంగ్లిష్ మీడియం బోధనను కూడా అందుబాటులోకి తెచ్చి, ఎలిమెంటరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పెరగడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. తరగతిలో కనీసం 10 మంది, పాఠశాలలో 40 మందికి పైగా విద్యార్థులున్న చోట ప్రత్యేక ఉర్దూ ఉపాధ్యాయులను నియమించేలా చూస్తామన్నారు. ఆయన వెంట రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డీఈవో కె.వాసుదేవరావు, ఎంఈవో తులసీదాస్ తదితరులు ఉన్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ను కొనసాగించాలని వినతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుకు వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా, డీవైఎఫ్ఐ జిల్లా కో–కన్వీనర్ డి.అశోక్కుమార్ మాట్లాడుతూ, పొలిటికల్ సైన్స్ గ్రూపును యూనివర్సిటీ యాజమాన్యం ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు నిలిపివేయడం సరికాదన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఈ గ్రూపు లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించి, గ్రూపును యథావిధిగా కొనసాగించకపోతే ఆ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలతో ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
కొనసాగుతున్న వరద ఉధృతి
● బ్యారేజీ వద్ద నిలకడగా 13.10 అడుగుల నీటిమట్టం ● 11.79 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.10 అడుగులకు నీటి మట్టం చేరింది. అక్కడి నుంచి రాత్రి వరకు అదే స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఆ ప్రభావం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం కనిపించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి సోమవారం రాత్రి 11,79,236 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు సంబంధించి 13,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.64 మీటర్లు, పేరూరులో 14.16 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.49 మీటర్లు, భద్రాచలంలో 43.40 అడుగులు, కూనవరంలో 19.53 మీటర్లు, కుంటలో 10.77 మీటర్లు, పోలవరంలో 12.69 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.46 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఇరిగేషన్ ఎస్ఈ కూరెళ్ల గోపీనాథ్ తెలిపారు. వరద ఉధృతి ఈ నెల ఆరో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. గత నెల 30న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. నదీ పరీవాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గణేశ్ నిమజ్జనోత్సవాల సమయంలో నదిలోకి వెళ్లకుండా, ఒడ్డు నుంచే నిమజ్జనాలు చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద ఇరిగేషన్, ఇతర శాఖల ద్వారా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు మర పడవల్లో రేవులు దాటేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. అక్టోబర్ చివరి వరకు వరద సీజన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.కాటన్ బ్యారేజీ నుంచి విడిచిపెడుతున్న గోదావరి మిగులు జలాలు -
జల దిగ్బంధం
తుడిచిపెట్టుకు పోయాయి పంటలు బాగా పండి, మంచి గిట్టుబాటు ధర ఉన్న సమయంలో వరదలు వచ్చి పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎకరం అరటి తోట వేశాను. కలసి వస్తుందనుకున్న తరుణంలో వరద వల్ల మొత్తం పంట పోయింది, రూ.లక్ష అప్పు మిగిలింది. ఏం చేయాలో తెలియడం లేదు. – మెట్టె నాగరాజు, అరటి రైతు, ఖండవల్లి నష్టమే మిగిలింది ఈ ఏడాది గోదావరికి రెండు సార్లు వరద వచ్చింది. మొదటిసారి ముంపుతో ఎకరం పూల తోట పూర్తిగా పాడైపోయింది. ఎకరం అరటి తోట మిగులుతుందని అనుకున్నాను. రెండోసారి వచ్చిన వరదతో అరటితోటా పోయింది. ఈ ఏడాది అంతా నష్టమే మిగిలింది. – వేండ్ర నర్శింహారావు, పూల రైతు, కాకరపర్రు ఇదేనా రైతులపై ప్రేమ?గతంలో గోదావరికి వరద వస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు నష్ట పరిహారం ఇచ్చారు, ఇప్పుడు వరదల కారణంగా పంటలు నష్టపోయినా పంటనష్టం అంచనాలు వేయడానికి కూడా అధికారులు రాలేదు, ఇదేనా రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ? – కుసుమే సూరిబాబు, లంక రైతు, లంకమాలపల్లి ఖండవల్లిలో ముంపునకు గురైన కంద పంట ముక్కామలలో నీట మునిగి పాడైన బెండ తోట ముత్యాలవారిపాలెంలో కుళ్లిన దొండ పందిరి● గోదావరి కన్నెర్రకు లంక రైతుల విలవిల ● కర్షకుల నడ్డి విరుస్తున్న వరదలు, వర్షాలు ● జిల్లాలో 500 హెక్టార్లలో ఉద్యాన, 1,500 హెక్టార్లలో వరి, ఇతర పంటలకు నష్టం ● కుదేలైన 5,500 మంది రైతులు ● ఉపాధి కోల్పోయిన 30 వేల మంది కూలీలు ● పంట నష్టాన్ని పట్టించుకోని కూటమి సర్కార్ ● గత ప్రభుత్వంలో లంక రైతులకు రూ.24 కోట్ల పరిహారం పెరవలి: లంక రైతులపై గోదావరి కన్నెర్ర చేస్తోంది. అల్ప పీడనాలు, వాయుగుండాలు, కుంభవృష్టితో ఉప్పొంగిన వాగులు, వంకలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి వెరసి.. ఈ ఏడాది జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో అన్ని పంటలకూ ప్రకృతి శాపం తగిలిందా అన్నట్టుగా.. మెట్ట, పల్లం అనే తేడా లేకుండా మొత్తం పాడైపోయాయి. ఎటుచూసినా ఎండిన కంపలతో, కుళ్లిన నారుతో చేలు దర్శనమిస్తున్నాయి. భారీగా పంట నష్టం జిల్లాలో తాళ్లపూడి నుంచి పెరవలి మండలం వరకూ, అటువైపు సీతానగరం నుంచి కడియం వరకూ అరటి, కంద, పసుపు, కోకో, వరి, మొక్కజొన్న, జామ, బొప్పాయి, కూరగాయల పంటలు, పూల తోటలు.. ఇలా అన్నీ ప్రకృతి కన్నెర్రతో నాశనమయ్యాయి. జిల్లాలో దాదాపు 500 హెక్టార్లలో వాణిజ్య పంటలు, సుమారు 1,500 హెక్టార్లలో వరి, కూరగాయలు, పూల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సుమారు 5,500 మంది రైతులకు నష్టం వాటిల్లగా, వ్యవసాయ ఆధారిత కూలీలు 30 వేల మంది ఉపాధికి తీవ్ర విఘాతం కలిగింది. గత రెండు మాసాల్లో గోదావరికి వరదలు రెండు సార్లు సంభవించగా, మూడు అల్ప పీడనాలు, రెండు వాయుగుండాలతో భారీ వర్షాలు కురిశాయి. లెక్కల్లో లేని ‘సి–క్లాస్’ గోదావరి లంకల్లో జిరాయితీ భూములతో పాటు, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులున్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుంది. కానీ సి–క్లాస్ భూములున్న రైతులకు ఎటువంటి పరిహారమూ అందడం లేదు. ఉదాహరణకు, పెరవలి మండలంలో ఎక్కువ లంక భూములున్నాయి. ఇక్కడ జిరాయితీ భూములు సుమారు 1,400 ఎకరాలుంటే, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులకు 1,600 ఎకరాలు ఉన్నాయి. గోదావరి వరదల కారణంగా పంటలన్నీ నాశనమైనా, కేవలం జిరాయితీ భూములున్న వారికే పరిహారం దక్కుతుంది. ఇందులో 1,500 మంది రైతులుంటే, సి–క్లాస్ పట్టాలున్న వారు 998 మంది ఉన్నారు. ఇలా జిల్లాలోని లంకల్లో జిరాయితీ భూములకు కాకుండా, సి–క్లాస్ పట్టాలు పొందిన రైతులకూ పంటల నష్ట పరిహారం దక్కడం లేదు. రూ.కోట్లలో నష్టం గోదావరి లంకల్లో భూములు సారవంతమైనవి కావటంతో ఇక్కడ ఎక్కువగా వాణిజ్య పంటలైన కంద, అరటి, పసుపు సాగు చేస్తారు. వీటికి ఎకరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల పెట్టుబడి అవుతుంది. అన్నీ అనికూలిస్తేనే ఆయా పంటలకు ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మిగులుతుంది. అదే వరదల సమయాల్లో సర్వం కోల్పోక తప్పదు. వివిధ రకాల పంటల ఉత్పత్తులకు వరదల వల్ల ఏటా సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల నష్టం వాటిల్లుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులకు రూ.24 కోట్ల నష్ట పరిహారం ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం పంట నష్టం అంచనాలు కూడా వేయలేదంటున్నారు.ముక్కామల వద్ద గోదావరి వరదలో పాడైపోయిన లంక పంటలు గంట గంటకూ పెరుగుతూ.. వశిష్ఠ గోదావరికి ఈ నెలలో రెండోసారి వరద పోటెత్తటంతో దిగువ లంకలో పంటలన్నీ నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం క్రితం తీవ్ర నష్టాలు తెచ్చిన ఉగ్ర గోదావరి వరద ఇప్పుడు మరలా రావటంతో లబోదిబోమంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పెరవలి మండలంలో కానూరు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముత్యాలవారిపాలెం, ముక్కామల, లంకమాలపల్లి, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో 900 ఎకరాల్లో దిగువ లంకల్లోని పంటలు నీట మునిగాయి. ఇప్పటికే ఈ లంకల్లో వంగ, బెండ, బీర, ఆనప, చిక్కుడు, క్యాబేజీ, దొండ పందిర్లు, పచ్చిమిరప తోటలు, ఆకుకూరలైన గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర వంటివి మొత్తం చనిపోయాయి. మిగిలిన అరటి, కంద, పసుపు, పూల పంటలకూ నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా గోదావరి వరద నిలకడగా ఉన్నా, శనివారం రాత్రి నుంచి గంట గంటకూ పెరగటంతో లంక రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గతేడాది జూలైలో రెండు సార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పంటలు పూర్తిగా పాడైపోయాయి. అలాగే ఈ ఏడాదీ జరుగుతుందేమోనని రైతులు ముందు జాగ్రత్తలు తీసుకున్నా.. పంటలు దక్కే పరిస్థితి కానరావడం లేదు. -
వేదాలతో లోకం సుభిక్షం
అమలాపురం రూరల్: ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ వేదాలకు పుట్టినిల్లు కోనసీమ అని అన్నారు. ఇందుపల్లిలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ ఆధ్యర్యంలో ఏటా వార్షిక వేదశాస్త్ర మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, వడ్లమని సుబ్రహ్మణ్య ఘనపాఠి, దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు తదితరులు వేదాల గొప్పదనం గురించి వివరించారు. బాలభక్త గణపతి సేవా సంఘ అధ్యక్షుడు తాతకాశీ విశ్వనాథ్ స్వాగత ఉపన్యాసం చేశారు. వేద పండితులను పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ర సోమసుందరం (దత్తు), ముష్టి వెంకట రాజేశ్వరశర్మ సత్కరించారు. -
దేవాలయ భూముల్లో చెట్ల నరికివేత!
కొత్తపల్లి: మండలంలోని గోర్స గ్రామానికి చెందిన పురాతన సీతారామస్వామి దేవాలయ భూముల గట్లపై ఉన్న చెట్ల నరికివేత చర్యలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ భూముల్లో ఎటువంటి వ్యవసాయ పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం, కొమరగిరి గ్రామంలో సర్వే నంబరు 121, 122లో గోర్స దేవాలయానికి సుమారు 20 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆక్రమణదారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. ఇలాఉంటే ఆక్రమణదారులు ఇందులో వ్యవసాయ పనులు చేపట్టేందు కు ఆదివారం సిద్ధమయ్యారు. గట్టుపై చెట్లను నరికించడంతో.. సర్పంచ్ రొంగల వీరబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకుని, తహసీల్దార్ చిన్నారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్వో కిషోర్ ఆక్రమణదారులు, చెట్లను నరికిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
3 నుంచి గురుకులం రజతోత్సవాలు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరు గ్రామంలోని శ్రీదత్తాత్రేయ వేదవిద్య గురుకులం రజతోత్సవాలు ఈ నెల మూడో తేదీ నుంచి మూడు రోజుల పాటు గురుకుల ప్రాంగణంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు వేదపరిరక్షణ–సర్వజగద్రక్షణం అనే అంశంపై సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలను అందిస్తారు. ఆయా కార్యక్రమాల్లో వేద శాస్త్రాభిమానులు పాల్గొనాలని గురుకులం ప్రతినిధి దత్తాత్రేయ శర్మ ఘనపాఠి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు ఏలేశ్వరం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఏలేరులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆదివారం ప్రాజెక్టులోకి 1.708 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1.050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 80.74 మీటర్లు, 24.11 టీఎంసీలకు 14.26 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1500, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. అన్నదానం, గో సంరక్షణకు రూ.2.5 లక్షల విరాళం అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేస్తున్న కర్రి సూర్యనారాయణ (నాని) తన కుమారుడు సత్యగౌరీ ఉదయ్ శర్మకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సత్యదేవుని నిత్యాన్నదాన పధకానికి రూ.లక్ష, గోసంరక్షణ ట్రస్ట్కు రూ.1.50 లక్షల విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఆదివారం అందజేశారు. ఏటా ఆషాఢ బహుళ ఏకాదశి నాడు, అన్నదానం, గోపూజ చేయాలని కోరారు. 7న అంతర్వేది ఆలయం మూసివేత సఖినేటిపల్లి: సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భాద్రపద పూర్ణిమ సందర్భంగా ఆ రోజు రాత్రి 9.50 గంటల నుంచి అర్ధరాత్రి 12.24 గంటల వరకూ చంద్రగ్రహణం ఉంటుందన్నారు. దీనితో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆలయాన్ని మూసివేస్తామని, మర్నాడు 8న ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 8వ తేదీ వేకువజామున నిర్వహించాల్సిన ఆర్జిత అభిషేకం రద్దు చేసినట్టు వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎస్సీ విభాగంలో శ్రీలక్ష్మి ప్రథమం రామచంద్రపురం రూరల్: ఉండూరు గ్రామానికి చెందిన వరసాల శ్రీలక్ష్మి డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టులో 78.45 మార్కులు సాధించి, తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ గ్రూపు–3లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో ఆమె స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలిగా నియామకం పొందనున్నారు. ఆమె భర్త కొల్లి రమేష్ 2012 డీఎస్సీలో ఎస్సీ విభాగంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం విశేషం. అదే రీతిలో ఇప్పుడు భార్య కూడా సాధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హసన్బాద జెడ్పీ హైస్కూల్లో శ్రీలక్ష్మి పదో తరగతి వరకూ చదువుకున్నారు. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా రమేష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రణాళికా బద్ధంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. -
విలక్షణానికి ప్రతీకలు మువ్వురు తల్లులు
● శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ ● సదనంలో సరస్వతీ సపర్యా మహోత్సవాలు సీటీఆర్ఐ: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు మూడు రకాల స్వభావాలకు ప్రతీకలుగా నిలుస్తారని శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అన్నారు. ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో జరుగుతున్న సరస్వతీ సపర్యా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు అయిన కౌసల్య, సుమిత్ర, కై కేయిలపై ప్రసంగించారు. వారి విలక్షణ స్వభావాలను వివరిస్తూ విశ్వనాథ అనేక విశేషణాలను వాడారని అన్నారు. కై కకు రాముడిపై అపరిమిత వాత్సల్యం ఉండేదని, రాముడికి బాల్యంలో విలువిద్య నేర్పింది కై కయేనన్నారు. తదనంతర కాలంలో రాముడి వనవాసాన్ని కోరిన కారణంగా పైకి మంథర దుర్బోధగా కనపడినా, అసలు కారణం దైవ ప్రేరణగా భావించాలని వివరించారు. నన్ను సవతి తల్లిని చేశావు.. అని రామునితో కైక అన్న మాటల్లో ఆమె క్రోధం కన్నా, బాధ ఎక్కువగా ధ్వనిస్తుందని విశదీకరించారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వలక్ష్య సంగ్రహం, వ్యాకరణ, ఛంద ప్రయోగాల్లో ఆయన వివిధ రకాల ప్రయోగాలను చేశారన్నారు. నా భక్తి రచనలు నావిగాన.. అని చెప్పుకొన్న ధీశాలి విశ్వనాథ అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.అన్నపూర్ణ మాట్లాడుతూ, ప్రాచీన కవుల మూల గ్రంథాలను అనువదించేటప్పుడు తర్వాత తరం కవులు స్వతంత్ర ధోరణులు అవలంబించడం, మూలంలోని అంశాలను విస్తరించడం, పరిహరించడం పరిపాటి అన్నారు. కళాశాల అధ్యాపకులు సత్యశిరీష, శ్రీదేవి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ బులుసు అపర్ణను ఘనంగా సత్కరించారు. సోమవారం అవధాన శేఖర రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రబంధ కవుల సరస్వతీసపర్య అనే అంశంపై ప్రసంగిస్తారు. -
ఉగ్ర గోదారి
రాజమహేంద్రవరం రోడ్ కం రైలు బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం11.35 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం నుంచి క్రమేపీ పెరుగుతూ.. రాత్రి ఏడు గంటలకు 12.80 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎప్పటికప్పుడు దిగువకు విడిచిపెడుతున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి, 11,35,249 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో నీటి ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. సోమవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండటంతో ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,700, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కులను వదిలారు. ఎగువ ప్రాంతాల్లో ఇలా.. కాగా ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.03 మీటర్లు, పేరూరులో 16.44 మీటర్లు, దుమ్ముగూడెంలో 12.95 మీటర్లు, భద్రాచలంలో 48.10 అడుగులు, కూనవరంలో 19.64 మీటర్లు, కుంటలో 10.84 మీటర్లు, పోలవరంలో 12.64 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 16.34 మీటర్లు వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
అత్యుత్సాహం.. కారాదు విషాదం
● వినాయక ఊరేగింపులు, నిమజ్జనంలో జాగ్రత్తలు తప్పనిసరి ● నిబంధనలు పాటిస్తే అంతా సవ్యమే రాయవరం/ అమలాపురం టౌన్: జై వినాయకా... బొజ్జ వినాయకా.. అంటూ స్వామివారిని కొలుస్తూ నిర్వహించే వేడుకల్లో మానవ తప్పిదాలతో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.. గణపతి నవరా త్ర ఉత్సవాలు ముగుస్తుండడంతో నిర్వహించే నిమజ్జనోత్సవాల్లో యువత అత్యుత్సాహం మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ సమయంలో గోదావరి పాయలు, సముద్ర తీరాలు, పంట కాలువలు, చెరువుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతా సవ్యమే. లేకుంటే ప్రమాదమే. సాధారణంగా వినాయక నిమజ్జనోత్సవాలు విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం 3, 5, 7, 9, 11వ రోజుల్లో చేస్తుంటారు. గత నెల 27న వినాయక ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహ నిమజ్జనాలు ప్రారంభమైనందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కోనసీమ జిల్లాలో వాడవాడలా వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్న 1,511 వినాయక మండపాలే కాకుండా చిన్నా చితికా మరో 500 మండపాలు పెట్టారు. వీటి నిర్వహణ కమిటీలు నవరాత్రులు ముగిశాక వినాయక విగ్రహాలను ఊరేగింపులతో నిమజ్జనాలు చేస్తాయి. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ సూచిస్తుంది. కాలువలు, నదులు, చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఈతరాని వారు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో జాగ్రత్తలు అవశ్యమని పోలీసు శాఖ చెబుతోంది. గతంలో ఎన్నో దుర్ఘటనలు గతేడాది వినాయక నిమజ్జనం సందర్భంగా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన ఎన్.లక్ష్మణబాబు ఏలేరు కాలువలో దిగి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు ఏడాది ఆలమూరు మండలం మడికిలో ఎ.రాజేష్ కాలువలో గల్లంతయ్యాడు. అదే ఏడాది బిక్కవోలు మండలం తొస్సిపూడిలో టీఎన్వీవీ రామారెడ్డి కాలువలో పడి మృత్యువాత పడ్డాడు. నిమజ్జన ఊరేగింపు అనంతరం తిరిగి వస్తున్న కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన కె.లోవరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలా అనేక ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ముఖ్యంగా నిమజ్జనం చేసే కాలువలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్సవ కమిటీలకు అవగాహన వినాయక విగ్రహ నిమజ్జనోత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోనసీమ ఎస్పీ బి.కృష్ణారావు జిల్లా పోలీసు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో మూడు పోలీస్ సబ్ డివిజన్ల డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్ (అమలాపురం), సుంకర మురళీమోహన్ (కొత్తపేట), రఘువీర్ (రామచంద్రపురం)లు తమ తమ డివిజన్లలో వినాయక చవితి ఉత్సవాల కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే సీఐలు, ఎస్సైలు తమ ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసిన కమిటీల వద్దకు వెళ్లి నిమజ్జన నిబంధనలు చెబుతున్నారు. ఆయా కమిటీలు నిమజ్జనాలు చేసే నదీపాయలు, సముద్ర తీరాలు, పంట కాలువలు, చెరువులను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించండి, అందరూ క్షేమంగా ఉండండి.. అంటూ పోలీసులు హితబోధ చేస్తున్నారు. ఇలా చేస్తే మంచిది నిమజ్జనోత్సవ ఊరేగింపుల్లో చిన్న పిల్లలు, మహిళలు పాల్గొన్నా, వారు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం తాగిన వారు ఉత్సవాల్లో పాల్గొనకుండా కమిటీలు బాధ్యత వహించాలి. పెద్ద విగ్రహాల ఊరేగింపుల్లో రోడ్డు వెంబడి విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ తీగలను తప్పించుకుంటూ వెళ్లాలి. లేదా విద్యుత్ కార్యాలయాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. నిమజ్జనాలు చేసే నదీ పాయలు, సముద్ర తీరాలు, పంట కాలువల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలి. విగ్రహ నిమజ్జన సమయంలో నీటిలోకి దిగేవారిని ముందే ఎంపిక చేసుకుని వారిని మాత్రమే నదీ పాయలు, సముద్రం, పంట కాలువలు, చెరువుల్లోకి దింపాలి. విగ్రహాన్ని వారే నెమ్మదిగా నీటిలోకి జార విడిచాలి. ఊరేగింపులు, నిమజ్జనం చేసే ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీజేలతో పెద్ద శబ్దాలకు చెక్ పెట్టాలి. ముఖ్యంగా నిమజ్జన ప్రాంతంలో అధిక శబ్ధం వల్ల ఒకరి మాట ఒకరికి వినిపించకపోవడంతో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది.కమిటీలదే బాధ్యత గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులకు అవగాహన కల్పించాం. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే అందుకు తగిన చర్యలను తీసుకోవడానికి వీలుంటుంది. నిమజ్జనోత్సవాల్లో ప్రాణాపాయం లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉత్సవ కమిటీలపై ఉంది. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం -
బైబై గణేశా
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందడి మొదలైంది. బొజ్జగణపయ్యను పూజించిన భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇళ్లలో, పందిళ్లలో ఉన్న గణపతిని భక్తితో మేళాలు, డీజేలు, డప్పులు వాయిద్యాలతో నగర వీధుల్లో ఊరేగించి రాజమహేంద్రవరం వాటర్ వర్క్స్ వద్ద గోదావరి రేవు వద్దకు తీసుకువస్తున్నారు. భక్తితో పూజించిన గణపతిని అంతే భక్తితో గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. రాజమహేంద్రవరంతో పాటు కాతేరు వద్ద గోదావరిలో కూడా గణపతి నిమజ్జనాలు జోరుగా సాగాయి. వాటర్ వర్క్స్రేవు వద్ద రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర ప్రాంతాల నుంచి రాత్రి 11.00 గంటలకు 198 విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీసుశాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించారు. గోదావరిలో నిమజ్జనం చేసేందుకు క్రేన్ సహాయంతో పంటుపై పెడుతున్న గణపతి విగ్రహం -
సుజల ప్రాప్తిరస్తు..
● వర్షపు నీటిని ఒడిసిపట్టి.. రీ సైక్లింగ్ ● తొలిసారిగా అన్నవరం దేవస్థానంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ● లక్ష లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మాణం ● సంతృప్తి వ్యక్తం చేసిన దేవదాయ శాఖ కమిషనర్ ● అన్ని దేవస్థానాల్లో నిర్మించాలని ఆదేశం అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సాంకేతిక పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, ట్యాంకులో నింపి, అదే నీటిని తిరిగి ఉపయోగించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్.. 2023–24 మధ్య అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసినప్పుడు ఈ మేరకు ప్రణాళిక రూపొందించగా.. ఇప్పుడది కార్యరూపం దాల్చుతోంది. అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై నిర్మించిన 135 గదుల శివసదన్ సత్రంపై శ్లాబు మీద కురిసిన వర్షపు నీటిని పైపుల ద్వారా సేకరిస్తారు. సత్రం దిగువన నిర్మించిన లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులోకి ఆ నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆ ట్యాంకులో వర్షపు నీరు ఎంత మేర ఉందో తెలిపే మీటరు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్(శుద్ధి) చేసే ప్రక్రియ కూడా ఈ ట్యాంకులో అమర్చారు. ఈ ట్యాంకు నిండినపుడు ఆ నీటిని మరలా శివసదన్ సత్రం పైన ఉన్న వాటర్ ట్యాంకుకు పంపించేలా మోటార్లు ఏర్పాటు చేశారు. సత్రం ఆవరణలో మొక్కల పెంపకానికీ ఈ నీటిని ఉపయోగించుకునే వీలుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్గా దీనిని పిలుస్తున్నారు. కమిషనర్ సంతృప్తి గత నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ట్యాంకును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ట్యాంకు నిర్మాణం, ఇతర వివరాలను అన్ని దేవస్థానాలకు పంపాలని ఆదేశించారు. దేవస్థానంలోని హరిహర సదన్, ప్రకాష్ సదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాల వద్ద కూడా ఇటువంటి వాటర్ ట్యాంకులు నిర్మించి, వర్షపు నీటిని పైపుల ద్వారా మళ్లించి, ఆ నీటిని ఫిల్టర్ చేసి వినియోగించుకునేలా చేయాలని కమిషనర్ నిర్దేశించినట్టు ఈఓ తెలిపారు. రూ.20 లక్షల ఖర్చు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో ఈ ట్యాంకు దాదాపుగా నిండిపోయింది. దీంతో ఈ నీటిని మరలా వాటర్ ట్యాంక్కు పంపడమో.. లేక మొక్కల పెంపకానికి ఉపయోగించడమో చేస్తామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఈ ట్యాంకు, పైపులైన్, ఇతర నిర్మాణాలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశామని వివరించారు. సాధారణంగా లక్ష లీటర్ల నీరు భూమి నుంచి సత్రం పైకి పంపించేందుకు చాలా విద్యుత్ అవసరమవుతుంది. సత్యగిరి కొండ ప్రదేశం కావడంతో బోర్లు వేసే అవకాశమూ తక్కువే. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎప్పటి కప్పుడు ఈ నీటిని తిరిగి వాటర్ ట్యాంక్కు పంపించడం ద్వారా నీటిని సద్వినియోగం చేయడంతోపాటు, విద్యుత్నూ ఆదా చేయవచ్చని తెలిపారు. రీ సైక్లింగ్కు ఏర్పాట్లు చేశాం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు శివసదన్ సత్రం టెర్రస్పై కురిసిన లక్ష లీటర్ల వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసే ట్యాంకు నిర్మించాం. ఇందులో నిల్వ అయ్యే నీటిని తిరిగి సత్రం అవసరాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. దేవదాయ శాఖలో ఈ విధమైన నీటి ట్యాంకు నిర్మించడం ఇదే ప్రఽథమం. అలాగే దేవస్థానంలో ఐదు చోట్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ఇంజెక్షన్ వెల్స్ నిర్మించాం. దీనివల్ల భూమిలోకి నీరు ఇంకి, సత్యగిరి, రత్నగిరిల్లో మొక్కలకు సమృద్ధిగా నీరు అందుతుంది. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
విద్యార్థిని అదృశ్యం
రంగంపేట: కళాశాలకంటూ వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై శివప్రససాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల నూతలపాటి షెలాశియా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం దివాన్చెరువులో ఆర్టీసీ బస్సు ఎక్కి, రంగంపేటలో దిగి కళాశాలకు వెళ్లింది. కళాశాల ముగిశాక సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన చోట్లా, బంధువుల ఇళ్ల వద్దా ఆచూకీ కోసం యత్నించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. శనివారం రాత్రి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు రంగంపేట పోలీస్ స్టేషన్కు, లేదా 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
సత్యదేవుని హుండీ నేడు లెక్కింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షిస్తారు. దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గత నెల 30న లెక్కించారు. మరలా 32 రోజుల తర్వాత సోమవారం లెక్కించనున్నారు. బాల్ బ్యాడ్మింటన్లో జాహ్మవి, శ్రీలక్ష్మికి తృతీయ స్థానంసీతానగరం: చినకొండేపూడికి చెందిన విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో తృతీయ స్థానం కై వసం చేసుకుంది. ఆదివారం ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన ఈ పోటీల్లో చినకొండేపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బచ్చు జాహ్నవి, సీనియర్స్ విభాగంలో జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఎం శ్రీలక్ష్మి తృతీయ స్థానం సాధించారు. వీరిని స్కూల్ హెచ్ఎం ఎస్ ఉషారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. హైవేపై లీకై న ఆయిల్ వాహన చోదకులకు ఇక్కట్లు రాజమహేంద్రవరం రూరల్: జాతీయ రహదారిపై హుకుంపేట జైహింద్నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. దీంతో పలువురు వాహనచోదకులు అదుపుతప్పి కిందపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఆయిల్ పడిన ప్రాంతంలో ఇసుక వేసి, దానిపై నుంచి వాహనాలు వెళ్లకుండా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయిల్పై వేసిన ఇసుకను, స్టాప్ బోర్డులను తీసేశారు. వాహనాలు రాకపోకలకు అనువుగా మారడంతో వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు. సూర్యదేవునికి ప్రత్యేక పూజలు పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన ఉషా, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యదేవుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, వ్రత పూజలు నిర్వహించారు. -
పెట్టుబడి పెన్షన్.. బతుకు టెన్షన్
● ‘ఉమ్మడి’లో 30 వేల సీపీఎస్ ఉద్యోగులు ● నేడు విజయవాడలో మహా సభ రాయవరం: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో చనిపోతే కుటుంబానికి తోడ్పాటు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగికి సామాజిక భద్రతగా పెన్షన్ ఉంటుందనేది ఒకప్పటి మాట. సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ మేరకు భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో.. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలనే డిమాండ్ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక(ఫ్యాఫ్టో) ఇప్పటికే మద్దతు పలికింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ ఉద్యోగులు కలిపి 30 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు. పదవీ విరమణ అనంతరం అందించే పింఛన్లు భారమవుతుందని భావించి 2003–04 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) విధానం అమలు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరుతో అమల్లోకి తీసుకొచ్చింది. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నారు. నేడు విజయవాడలో మహాసభ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్తో సీపీఎస్ ఉద్యోగులు సోమవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు వెళ్లే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఐదు వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాట నిలబెట్టుకోవాలి సీపీఎస్ ఉద్యోగుల పోరాటం ద్వారా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్ష న్ సాధించుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగి హక్కుగా ఉన్న సర్వీస్ పెన్షన్ సాధించుకోవడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకూ మా పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తాం. – చింతా నారాయణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీసీపీఎస్ఈఏ, కాకినాడ తీవ్రంగా నష్టపోతున్నాం సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగికి ప్రాథమిక హక్కులైన పెన్షన్, సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్ విధానం వల్ల రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. – గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీసీపీఎస్ఈ అసోసియేషన్, అంతర్వేది, సఖినేటిపల్లి మండలం -
బాలలతో భిక్షాటన చేయించడం నేరం
కాకినాడ రూరల్: బాలలతో భిక్షాటన చేయించడం నేరమని జిల్లా బాలల సంక్షేమాధికారి సీహెచ్ వెంకట్రావు అన్నారు. వీధి బాలల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట గ్రామ శివారు కొత్తూరు వద్ద నలుగురు వీధి బాలలను శనివారం సాయంత్రం గుర్తించారు. బాలల తల్లిదండ్రులు పల్నాడు జిల్లా వినుకొండగా గుర్తించారు. ప్లాస్టిక్ సామగ్రి ఏరుకుంటూ, గ్యాస్ స్టౌవ్ల రిపేరు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తల్లిదండ్రులు పిల్లలను భిక్షాటనకు ప్రోత్సహించడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఇద్దరు పిల్లలను అంగన్వాడీ సెంటరులో, ఒకరిని ఎంపీపీ స్కూల్, మరోకరిని జెడ్పీ స్కూల్లో చేర్చామన్నారు. ఐసీడీఎస్ సీడీ లక్ష్మి సహకారంతో వీధి బాలల గుర్తింపు కాకినాడ పరిసరాలలో చేపడుతున్నట్టు తెలిపారు. -
మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఐ.పోలవరం: గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యానాం – ఎదుర్లంక వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు యానాం గోపాల్నగర్కు చెందిన దుర్గ ఆదివారం ప్రయత్నించింది. అటుగా వెళ్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజు గమనించి ఆమెను నలుగురి సాయంతో రక్షించారు. వివరాలు అడిగి తెలుసుకుని.. భర్త, పిల్లలకు సమాచారం అందజేశారు. కాగా, దుర్గ యానాంలో ఇంటి పనులు చేస్తుండగా, భర్త ఆటోను నడుపుతున్నట్టు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదమే కారణమని తెలుసుకుని ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన నాగరాజును స్థానికులతో పాటు, పోలీసులు అభినందించారు. -
తల్లి ఆస్తి కాజేసిన కుమారుడికి గుణపాఠం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాక్షి సంతకం పేరుతో తల్లి ఆస్తి రాయించుకున్న కుమారుడికి అధికారులు గుణపాఠం చెప్పారు. ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తల్లి పేరు మీద రాయించి ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. గోకవరం మండలం అచ్చయ్యపేట గ్రామానికి చెందిన 72 ఏళ్ల రొబ్బి వెంకట సత్యవతికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమెకు ఆ గ్రామంలో నాలుగు వాటాల పెంకుటిల్లు వారసత్వంగా వచ్చింది. ఆమె మూడో కుమారుడు లక్ష్మీ మధుసూదనరావు ఆ ఆస్తిని కాజేయాలని పథకం వేశాడు. తల్లికి మాయమాటలు చెప్పి సాక్షి సంతకం పెట్టాలని నమ్మించి తన పేరు మీద 2017లో గిప్ట్డీడ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న సత్యవతి.. ఆర్డీఓ కృష్ణనాయక్ను ఆశ్రయించింది. దీంతో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007 ప్రకారం విచారణ జరిపి, ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తూ ఆర్టీవో ఉత్తర్వులు జారీ చేశారు. వాటిపై మధుసూదనరావు చేసుకున్న అప్పీల్ను కలెక్టర్ తిరస్కరించి, ఆర్డీఓ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. దీంతో కోరుకొండ రిజిస్ట్రార్ ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి, ఆస్తిని మళ్లీ సత్యవతి పేరున రిజిస్టర్ చేశారు. ఆ డాక్యుమెంట్లను శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సత్యవతికి ఆర్డీఓ కృష్ణనాయక్ అందజేశారు. -
దొంగల ముఠా అరెస్ట్
గండేపల్లి: ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం ఆ వివరాలు వెల్లడించారు. ధవళేశ్వరం సమీపంలోని రాజవోలుకు చెందిన బి రత్నరాజు, కడియం మండలం జేగురుపాడుకు చెందిన ఎం శ్రీను, పి.తరుణ్, ఎం.వినయ్ కుమార్ ట్రాక్టర్ (ఇంజిన్)ను తీసుకుని వచ్చి రైతుల పొలాల వద్ద ఉంచిన ట్రక్కులను దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాళ్లూరులో ట్రక్కును చోరీ చేస్తుండగా ఎస్సై యూవీ శివ నాగబాబు తన సిబ్బందితో దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరాలకు ఉపయోగించే ట్రాక్టర్ (ఇంజిన్), మోటార్ సైకిల్, రూ. 5 లక్షల విలువైన ట్రక్కులు, రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పెద్దాపురం కోర్టుకు తరలించగా సెప్టెంబర్ 12 వరకు రిమాండ్ విధించారన్నారు. గండేపల్లి మండలం తాళ్లూరు, మురారి, అనకాపల్లి జిల్లా నాతవరం, తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో ట్రక్కులను వీరు దొంగిలించారు. -
నీలపల్లి హత్య కేసులో నిందితుడికి రిమాండ్
తాళ్లరేవు: నీలపల్లిలో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నీలపల్లి పంచాయతీ మురళీనగర్లోని సిమెంట్ దుకాణం ఎదురుగా ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో హత్య జరిగింది. సెల్ఫోన్ విషయంలో వివాదం చెలరేగి, యానాం కాకివారి వీధికి చెందిన పాలెపు శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. అతడు స్నేహితుడైన యానాం కురసాంపేట గ్రామానికి చెందిన అంగాని రాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిని కాకినాడ రూరల్ సీఐ డి.చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ స్టేషన్ రైటర్ ఎన్వీ రమణ అరెస్ట్ చేశారు. కాగా.. అంగాని రాజుకు సుమారు 20 ఏళ్ల క్రితం పశువుల్లంక గ్రామానికి చెందిన మరియమ్మతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజుతో తగాదాపడి ఆమె ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కాట్రేనికోన పోలీస్స్టేషన్లో రాజుపై కేసు నమోదైంది. అనంతరం మరో వివాహం చేసుకున్నాడు. 2021లో కొట్లాట కేసు, 2022లో బండి దగ్థానికి సంబంధించి అతడిపై కేసులు ఉన్నాయి. -
శ్రీనివాసా.. గోవిందా..
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే రూ.66.21 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో మార్మోగింది. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో వేకువజాము నుంచే ఆలయంలో రద్దీ ఏర్పడింది. భక్తులు గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. వైద్యశిబిరాలు వాడపల్లి వెంకన్న క్షేత్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. పలువురు భక్తులు ఉపవాసాలతో నీరస పడి, స్వల్ప అస్వస్థతకు గురి కాగా డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వయంగా వైద్య సేవలను పర్యవేక్షించారు. వారు కోలుకునే వరకు తగిన మందులు, టానిక్లు, ఓఆర్ఎస్లు ఇప్పించారు. భారీగా ఆదాయం వాడపల్లి దేవస్థానంలో స్వామివారి విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, నిత్యాన్నదానం, శాశ్వత అన్నదానం, లడ్డూ ప్రసాదం విక్రయం తదితర సేవల ద్వారా రాత్రి 8 గంటలకు రూ.66,21,466 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ను నియంత్రించి, బందోబస్తును పర్యవేక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు తిరిగాయి. బ్యాటరీ కార్ల సౌకర్యం తిరుమల తరహాలో వాడపల్లి వెంకన్న క్షేత్రంలోనూ వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు బ్యాటరీ కార్ల సౌకర్యం కల్పించారు. భక్తులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు, తక్కువ సమయంలో దర్శనం కల్పించేందుకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కార్లను ప్రవేశపెట్టారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంకి చెందిన జేఎస్ఎన్ రాజు కనస్ట్రక్షన్ కంపెనీ వారు దేవస్థానానికి రూ. 12 లక్షల వ్యయంతో 2 బ్యాటరీ కార్లు సమర్పించిన విషయం తెలిసిందే. కొత్త పార్కింగ్ ప్రాంతం నుంచి ఆలయం వరకూ నడవలేని భక్తులను బ్యాటరీ కార్లలో తీసుకువెళ్లి, మళ్లీ పార్కింగ్ స్థలం వద్ద దించుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. -
పచ్చదనానికి పురస్కారం
● పాఠశాలలకు స్టార్ రేటింగ్ ● కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ● జిల్లా నుంచి 8 పాఠశాలలకు అవకాశం ● జాతీయస్థాయికి ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహకం రాయవరం: మానవాళి మనుగడ సాగించేందుకు పచ్చదనం, పరిశుభ్రత అనేవి చాలా అవసరం. వీటిని ఎవరికి వారు కాపాడుకుంటూ భావితరాలకు అందజేయాలి. పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. మొక్కలను పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అలాగే పరిశుభ్రత కారణంగా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చేయాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్య ఇచ్చే పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనుంది. మెరుగైన పనితీరు కనబరిచిన పాఠశాలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఐదు స్టార్ల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్లో మార్పులు చేసి ఇప్పుడు స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) 2025–26 పేరిట బడులకు రేటింగ్ ఇవ్వనుంది. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారంతో పాటు రూ.లక్ష ప్రోత్సాహకం అందించనుంది. మొత్తం ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించనున్నారు. ప్రతి జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఆరు అంశాలు.. 60 సూచికలు ఆరు అంశాల ఆధారంగా పాఠశాలలకు రేటింగ్ ఇస్తారు. పాఠశాలలో నీటి సదుపాయం, వాన నీటి సంరక్షణ, వినియోగం, మరుగుదొడ్డి సౌకర్యాలు, విద్యార్థులకు సబ్బుతో హ్యాండ్ వాష్, వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, విద్యుత్ సదుపాయం, బిహేవియర్ ఛేంజింగ్, కెపాసిటీ నిర్మాణం, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎన్హెచ్వీఆర్ యాప్లో ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్వచ్ఛ విద్యాలయ పురస్కార్కు ఆరు అంశాల ప్రాతిపదికగా దరఖాస్తు చేసుకోవాలి. స్వచ్ఛ విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. బీవీవీ సుబ్రహ్మణ్యం, సీఎంవో, సమగ్ర శిక్షా, అమలాపురం అవగాహన కల్పించాం స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్) 2025–26కు ప్రతి పాఠశాల అర్హత సాధించేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. దీనిపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించాం. మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షణ చేసి, ప్రతి పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జిల్లాలో 2,031 పాఠశాలలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో వివిధ కేటగిరిలకు చెందిన 2,031 పాఠశాలలున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు ఎస్హెచ్వీఆర్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెప్టెంబర్ 10వ తేదీ లోపు ఎస్హెచ్వీఆర్ పోర్టల్లో నమోదు చేయాలి. ప్రతి సూచికకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలి. పరిశీలకులు స్వయంగా పరిశీలించి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తారు. ఉత్తమ స్కోర్ సాధించిన బడులకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో గరిష్టంగా 20 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేస్తారు. సంబంధిత హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లకు దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. -
కళ్లలో కారం కొట్టి బంగారం గొలుసు చోరీ
ఐ.పోలవరం: ఇంట్లో టీవీ చూస్తున్న మహిళ కళ్లలో కారం కొట్టి, నాలుగు కాసుల బంగారం గొలుసు ను దొంగలు దోచుకుపోయారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.. ఐ. పోలవరం మండలం కేశనకుర్రుపాలేనికి చెందిన గాదిరాజు సత్యనారాయణ రాజు, కృష్ణవేణి భార్యాభర్తలు. శుక్రవారం రాత్రి సత్యనారాయణరాజు గదిలో నిద్రిస్తుండగా, ఆయన భార్య కృష్ణవేణి హాల్లో టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి.. కృష్ణవేణి కళ్లలో కారం కొట్టారు. ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారం గొలుసును లాక్కుని పోయారు. ఆమె తేరుకుని కేకలు వేసేటప్పటికే మోటారు బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయానికి వెళ్లి వస్తుండగా.. పెద్దాపురం: స్వయంభూ తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయానికి కాలినడకన వస్తున్న మహిళను బెదిరించి, ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారం గొలుసును దొంగ లాక్కుని పరారయ్యాడు. పెద్దాపురం మండలం చదలాడ–ఉలిమేశ్వరం గ్రామాల మధ్య శనివారం ఈ ఘటన జరిగింది. కాండ్రకోటకు చెందిన ఒబిలిశెట్టి అమ్మల అనే మహిళ వేకువ జామున కాలి నడకన స్వామివారి గుడికి వస్తోంది. మార్గంమధ్యలో ఉలిమేశ్వరం – చదలాడ గ్రామాల మధ్యలో ఉన్న పామాయిల్ తోట వద్ద గుర్తు తెలియని యువకుడు ఆమెను బెదిరించి, బంగారం గొలుసు లా క్కుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మౌనిక తెలిపారు. -
గాయకుడు ఎస్పీ బాలు సేవలు మరువలేనివి
ధవళేశ్వరం: సంగీత ప్రపంచానికి గాయకుడు ఎస్పీ బా ల సుబ్రహ్మణ్యం చేసిన సేవలు మరువలేనివని సినీ నటుడు శుభలేఖ సుధాకర్, గాయని ఎస్పీ శైలజ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే గోదావరి కల్చరల్ అసోసియేషన్, రాకా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని శనివారం సాయంత్రం వారు ఆవిష్కరించారు. తొలుత కాటన్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం రివర్ బండ్ వద్ద ఎస్పీ బాల సుబ్రహ్యణ్యం విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. విగ్రహ దాత గాలి సుబ్బరాజు, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ గోపీనాథ్లను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాకా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవి రమణ, కార్యాధ్యక్షుడు యర్రమోతు ధర్మరాజు, ఉపాధ్యక్షుడు జీవీఆర్ జగన్నాథం పాల్గొన్నారు. -
గోదావరి ఉరకలు
● ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురస్తున్న వర్షాలతో గోదావరి ఉప నదులైన మంజీర, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. ఆ ప్రభావంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం క్రమేపీ పెరిగింది. ఉదయం 10.30 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 8.35 గంటలకు 11.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఆదివారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో గోదావరిలో పడవల రాకపోకలను నిషేదించారు. శనివారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.80 అడుగులకు చేరింది. 10,01,410 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 11,700 క్యూసెక్కులు విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.56, పేరూరులో 16.76, దుమ్ముగూడెంలో 12.90, కూనవరంలో 18.97, కుంటలో 10.20, పోలవరంలో 12.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.85 మీటర్లు, భద్రాచలంలో 47.70 అడుగుల నీటి మట్టాలు కొనసాగుతన్నాయి. -
పాఠ్యాంశాలుగా మహిళల భద్రతా చట్టాలు
● వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి ● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, వాటిపై ప్రతి వారం విద్యార్థినులకు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సూచించారు. మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై రాజమహేంద్రవరంలోని ఐఎంఏ భవనంలో శనివారం జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని, ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ తో పాటు, 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలకు వసతి (షెల్టర్) కల్పించడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. సెల్ఫోన్ వినియోగంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళా కమిషన్ సభ్యురాలు కె.జయశ్రీ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి లింక్లను క్లిక్ చేయకున్నా ఫోన్కు మార్ఫింగ్ ఫొటోలు రావ డం వంటి కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. అదనపు ఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఏడు శక్తి టీమ్లు పనిచేస్తున్నాయని, కళాశాలల సమయాల్లో మఫ్టీలో విధులు నిర్వహిస్తూ ఆక తాయిల వేధింపులను అరికడుతున్నామన్నారు. సైబర్ నేరాల నివారణ కోసం 1930 కాల్ సెంటర్ ను, గంజాయి, మాదక ద్రవ్యాల సమస్యల పరిష్కారానికి 1972 నంబర్ను సంప్రదించాలని సూచించారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిశోర్, సైబర్ క్రైమ్ ఎస్సై అయ్యప్ప రెడ్డి, జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారి టి.శ్రీదేవి, సీఐ మంగాదేవి పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ అందించాలి
రాజమహేంద్రవరం సిటీ: వినియోగదారులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించేలా పనిచేయాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. ఆయన శనివారం రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో సమీక్షించారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్ స్టేషన్లు, కొత్త ఫీడర్ల ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఎస్ఈ కార్యాలయం నుంచి కోటిలింగాల ఘాట్ వరకు విద్యుత్ స్తంభాలను తొలగించి అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ కార్యాలయాన్ని దివాన్ చెరువులో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వేపకాయలదిబ్బ సబ్ స్టేషన్ను పరిశీలించారు. -
ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో విజేతలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోటీల్లో స్ట్రాంగ్ మెన్ విన్నర్గా కె.దుర్గా శివకుమార్ (కాకినాడ), రన్నర్గా కె.మోహన్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమెన్ విన్నర్గా డి.అఖిలదేవి (రామచంద్రపురం), రన్నర్గా వై.ఇందిర (అమలాపురం), స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్గా డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్గా బి.అప్పన్న (అమలాపురం) టైటిల్స్ను గెలుచుకున్నారు. అలాగే వుమెన్ విభాగంలో 66 కేజీల కేటగిరీలో ఎస్.స్పందన (రాజోలు), 74 కేజీల కేటగిరీలో పి.దీవెన (కాకినాడ), 83 కేజీలో కేటగిరీలో డి.అఖిలదేవి (రామచంద్రపురం), బాలుర సబ్ జూనియర్ విభాగంలో 53 కేజీల కేటగిరీలో పి.వీరేంద్ర (కాకినాడ), 59 కేజీల కేటగిరీలో జె.జితేంద్రదొర (అమలాపురం), 66 కేజీల కేటగిరీలో కె.సాయి మణికంఠ (కాకినాడ), 74 కేజీల కేటగిరీలో ఎంఎస్ విన్ (జగ్గంపేట), మెన్ విభాగంలో 59 కేజీల కేటగిరీలో వై.రాజు (రాజమహేంద్రవరం), 66 కేజీల కేటగిరీలో ఎం.రాహుల్ బాబు (అమలాపురం), 74 కేజీల కేటగిరీలో కె.దుర్గా సాయికుమార్ (కాకినాడ), 83 కేజీల కేటగిరీలో కె.మోహన్ (కాకినాడ), 93 కేజీల కేటగిరీలో కె.సుధీర్ (మలికిపురం), 105 కేజీల కేటగిరీలో బి.అనూష్బాబు (మురమళ్ల), మాస్టర్స్ విభాగంలో 83 కేజీల కేటగిరీలో డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), 93 కేజీల కేటగిరీలో బి.అప్పన్న (అమలాపురం) ప్రథమ స్థానాలు సాధించారు. విజేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, నగభేరి కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
గణపతికి 108 ప్రసాదాల నివేదన
తాళ్లపూడి: వినాయక చవితి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుదీరిన గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రక్కిలంక గ్రామంలోని కాపుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. అన్నవరప్పాడులో భక్తుల రద్దీ పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేల మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. దాతల ఆర్థిక సాయంతో 7,500 మందికి అన్నసమారాధన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని, అలాగే ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. న్యాయ సేవలు మరింత సులభతరం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పౌరులు న్యాయ సేవలను మరింత సులభంగా పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఈ– సేవ కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను సులభంగా పొందగలరని, న్యాయవాదులు తమ వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చన్నారు. దీని ద్వారా న్యాయవాదులు, కక్షిదారులు, పౌరులు తమ కేసుల స్థితి, తీర్పులు, ఆదేశాల కాపీలు, ఈ–ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం.మాధురి, ఎస్.ఉమా సునంద, ఎస్కే జానీబాషా, కె.ప్రకాష్బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బోధనాసుపత్రికి ముగ్గురు ప్రొఫెసర్ల నియామకం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం బోధనాసుపత్రికి ముగ్గురు ప్రొఫెసర్లను నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. ఆసుపత్రిలో ఆర్థో విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎస్.చంద్రశేఖర్ను ప్రొఫెసర్గా, అలాగే వైజాగ్కు చెందిన సైక్రియాటిస్ట్ ఎం.విజయలక్ష్మి, చర్మవ్యాధుల ప్రొఫెసర్గా ధన్యశ్రీ నియమితులయ్యారు. శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్చకుడు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా స్వామికి రూ.2,36,023 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. -
ఉత్తుత్తి విద్యుత్
సాక్షి, అమలాపురం: ఏదైనా ప్రజా ప్రయోజన కార్యక్రమం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. అవేమీ లేకుండా కేవలం ప్రచార యావతో చేస్తే క్షేత్ర స్థాయిలో ఫలితాలు వేరే విధంగా ఉంటాయనడానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు.. ప్రజాహిత కార్యక్రమాలే ఒక ఉదాహరణ. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. తీరా అమలు చేసే సమయానికి ఆంక్షలు వర్తిస్తాయని షరతులు పెట్టింది. జిల్లాలో వినాయక మండపాల ఏర్పాటుకు అను మతి కోరుతూ పోలీస్ శాఖకు ఆన్లైన్లో సుమారు 1,511 దరఖాస్తులు వచ్చాయి. అనుమతి లేకుండా రెండు, మూడు రెట్ల వినాయక మండపాలు ఏర్పాటు చేశారని అంచనా. ఆయా మండపాలను నిర్వాహకులు విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేశారు. చాలా మండపాలకు స్థానికంగా ఉన్న గృహ సముదాయాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు. గుళ్లు, గోపురాల వద్ద వాటికి ఉన్న సర్వీసుల నుంచి విద్యుత్ వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించింది. తీరా దీనిని అమలు చేసే సమయానికి ఆంక్షలు పెట్టింది. ఇంకా ఎవరికీ తెలియక.. వినాయక చవితి ఈ నెల 27న మొదలైతే అంతకు ముందు రోజు రాత్రి మాత్రమే మండపాలకు ఉచిత ఉత్తర్వులు ఇచ్చింది. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఉత్తర్వులు వచ్చిన విషయం మండపాల నిర్వాహకులకు ఇప్పటికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తెలిసిన వారు నిబంధనలకు భయపడి ముందుకు రావడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత వాసులకు దీనిపై పెద్దగా అవగాహన లేదు. ఈ కారణంగా ఇప్పటి వరకూ జిల్లాలో కేవలం 42 మండపాలకు మాత్రమే ఉచిత విద్యుత్ కల్పించారు. అమలాపురం పట్టణంలో సుమారు 75 వరకూ మండపాలు ఉండగా, శనివారానికి 12 పందిళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం తీసుకున్నారు. ఇక మండపేట నియోజకవర్గం పరిధిలో 186 వరకూ మండపాలు ఉండగా, కేవలం 14 మాత్రమే ఉచిత సర్వీసుకు దరఖాస్తు చేసుకున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొంతమంది మాత్రమే.. వినాయక చవితి ముందు రోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఏఈలు, లైన్మెన్ల ద్వారా జిల్లాలో అన్ని గణపతి మండపాల కమిటీలకు ఉచిత విద్యుత్ కోసం వివరించాం. అప్పటికే ఆలయాల నుంచి మండపాలకు విద్యుత్ తీసుకున్నారు. కొంత మంది మాత్రమే దరఖాస్తులు చేసుకుని వినియోగించుకున్నారు. దసరా వేడుకలకు ఎక్కువ మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారు. – బి.రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జిల్లాలో మూడు వేలకు పైగా వినాయక మండపాలు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ 42 చోట్ల మాత్రమే వినియోగం నిబంధనలకు భయపడుతున్న నిర్వాహకులు -
కూటమికే కిక్కు..
● బార్లు దక్కించుకున్న ఆ పార్టీల నాయకులు ● ఫలించిన సిండికేట్ కుయుక్తులు ● ఓపెన్ కేటగిరీల్లో ఆరు బార్లకే దరఖాస్తులు ● కల్లుగీత కార్మికులకు సంబంధించి మూడు ● మొత్తం తొమ్మిదింటిలోనూ వారిదే హవా రాజమహేంద్రవరం రూరల్: బార్లు దక్కించుకునేందుకు కూటమి నేతల సిండికేట్ చేసిన కుయుక్తులు ఫలించాయి. ఓపెన్ కేటగిరిలో 22 బార్లకు గాను రాజమహేంద్రవరంలో ఐదు, నిడదవోలులో ఒక బార్కు మాత్రమే నిబంధనలు మేరకు దరఖాస్తులు సమర్పించారు. అలాగే కల్లుగీత కార్మికులకు కేటాయించిన రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలులోని ఒక్కో బారుకు దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిది బార్లకు అధికారులు లాటరీ తీయగా, వాటినన్నింటినీ కూటమి సిండికేట్ నాయకులే దక్కించుకున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మద్యం దుకాణాలు కూటమి నేతల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు బార్ల ఏర్పాటులో కూడా వీరి హవా కొనసాగుతోంది. జిల్లాలో 25 బార్లు జిల్లాలో మొత్తం 25 బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. శుక్రవారం గడువు ముగిసే నాటికి ఓపెన్ కేటగిరిలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో 18 బార్లకు గాను ఐదింటికి మాత్రమే నిబంధనల మేరకు 20 దరఖాస్తులు వచ్చాయి. నిడదవోలు మున్సిపాలిటీలో రెండు బార్లకు గాను ఒక దానికి మాత్రమే నాలుగు దరఖాస్తులు అందాయి. కొవ్వూరు మున్సిపాలిటీలో ఒక బారుకు , కడియపులంకలో ఒక బారుకు దరఖాస్తులు రాలేదు. కల్లుగీత కార్మికుల కోటాలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో ఒక బారుకు నాలుగు, నిడదవోలు మున్సిపాలిటీలో ఒక బారుకు ఆరు, కొవ్వూరు మున్సిపాలిటీలో ఒక బారుకు తొమ్మిది దరఖాస్తులు అందాయి. లాటరీ ద్వారా కేటాయింపు రాజమహేంద్రవరంలోని ఆర్డీవో కార్యాలయంలో శనివారం లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. ఆర్డీవో కృష్ణ నాయక్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో 22 బార్లకు సంబంధించి ఒక్కో బారుకు రూ.75 లక్షల లైసెన్సు ఫీజు, రూ.5 లక్షల దరఖాస్తు ఫీజు కింద కట్టాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బారుకు లాటరీ తీయాలంటే కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టింది. ఇలా నాలుగు దరఖాస్తులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.20 లక్షల ఆదాయం రానుంది. కల్లుగీత కార్మికుల మూడు బార్లకు సంబంధించి ఒక్కో దానికి లైసెన్సు ఫీజు కింద రూ.37.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. మద్యం వ్యాపారుల సిండికేట్! బార్లలో ఆదాయం పెంచుకునేందుకు ఎత్తుగడ వేసిన కూటమి మద్యం వ్యాపారుల సిండికేట్ బార్లకు దరఖాస్తులు చేసేందుకు ముందుకు రాలేదు. వాస్తవానికి ఆగస్టు 18న ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని బార్లకు, 20న గీత కార్మికుల బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 26వ తేదీ గడువు ముగిసే నాటికి 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో 29వ తేదీ అర్ధరాత్రికి 22 బార్లకు 24 దరఖాస్తులు, మూడు కల్లుగీత కార్మికుల బార్లకు 19 దరఖాస్తులు వచ్చాయి. కూటమి మద్యం సిండికేట్ కావాలనే ఓపెన్ కేటగిరిలో కేవలం ఆరు బార్లకు మాత్రమే దరఖాస్తులు వేయించింది. కల్లుగీత కార్మికులు సైతం సిండికేట్గానే దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. లాటరీలో ఎవరికి బారు తగిలినా సిండికేట్గా నడుపుకొనేలా ముందస్తుగానే అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. లాటరీ విజేతలు వీరే.. జిల్లాలోని బార్లుకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో రాజమహేంద్రవరంలో గొర్రెల దుర్గాప్రసాద్, సానబోయిన సురేష్, మేకా మురళీకృష్ణ, మద్దుల జగదీశ్వర వేణుగోపాల అప్పారావు, ఆకుల శ్యామ్బాబు, నిడదవోలులో మన్యం పాండురంగప్రసాద్ లాటరీలో దక్కించుకున్నారు. కల్లుగీత కార్మికుల కేటగిరిలో రాజమహేంద్రవరంలో బారను సానబోయిన సత్యనారాయణ, కొవ్వూరు బారును వీరవల్లి వెంకట సత్యనారాయణ, నిడదవోలు బారను పాలా మణి కిరణ్ దక్కించుకున్నారు. 16 బార్లకు మళ్లీ నోటిఫికేషన్ జిల్లాలో ఓపెన్ కేటగిరిలో దరఖాస్తులు రాని రాజమహేంద్రవరంలోని 13, కొవ్వూరు, నిడదవోలు, కడియపులంకలోకి ఒక్కో బారుకు ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మద్యం వ్యాపారులు మాత్రం ఈ సారైనా ప్రభుత్వం లైసెన్సు ఫీజు తగ్గిస్తుందని, నిబంధనలను మార్పు చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. -
బాగానే బొక్కుతున్నారు!
● సముద్ర సంరక్షణికి ప్రాణ సంకటం ● అవగాహన లేమితో వేటాడుతున్న మత్స్యకారులు ● భారీ జలచరమే అయినా సాధుజీవి ● కోస్తా తీరం ప్రత్యుత్పత్తికి అనుకూలం ● వాటి సంరక్షణ మనిషి బాధ్యత ● నేడు ప్రపంచ బొక్కుసొర దినోత్సవం తాళ్లరేవు: సముద్ర సంరక్షణిగా పేరుగాంచిన అతిపెద్ద చేప బొక్కు సొర (రింకోడాన్ టైపస్) క్రమక్రమంగా కనుమరుగవుతోంది. సుమారు 65 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చేప అత్యంత శక్తివంతమైన సాధుజీవి. సముద్ర తీరం వెంబడి అభివృద్ధి చెందుతున్న ఏడు సెక్టార్ల కారణంగా ఈ గంభీరమైన చేప అంతరించిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. దీని పరిరక్షణకు భారత ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో విస్తరించి ఉన్న ఈ చేపను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమైన నేపథ్యంలో ఏటా ఆగస్టు 30వ తేదీన బొక్కుసొర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందమైన చర్మం కలిగిన ఈ చేప సుమారు 13 మీటర్లు (42 అడుగులు) పొడవు ఉండి, 20 నుంచి 25 మెట్రిక్ టన్నులకుపైగా బరువు పెరుగుతోంది. సముద్రంలో హానికర జలాలను తీసుకుని శుభ్రం చేయడంతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని కలుగజేస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకమైన మొప్పల ద్వారా నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలను, జీవులను వడకట్టి తింటాయి. సముద్రంలో 1500 మీటర్ల లోతుకు వెళ్లగలిగే ఈ చేప సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి 13 వేల కిలోమీటర్ల వరకు వలస వెళ్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోస్తాతీర ప్రాంతం ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండడంతో మన ప్రాంతానికి ఈ చేపలు వస్తుంటాయి. ఒక చేప 300 పిల్లలకు జన్మనిస్తుందని, వందకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుందని అంచనా. ఈ చేపల వల్ల మానవాళికి ఎటువంటి హాని ఉండకపోవడం విశేషం. బొక్కుసొర వాటి రెక్కలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైనవి కావడంతో వీటి వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. మత్స్యకారులకు సరైన అవగాహన లేక వీటిని పట్టుకోవడం వల్ల వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతోంది. అంతే కాకుండా తీరం వెంబడి విస్తరిస్తున్న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, టూరిజం, పోర్ట్ అండ్ షిప్పింగ్, ఉప్పు మడులు, ఫెర్టిలైజర్స్, ఆక్వా కల్చర్, మత్స్య పరిశ్రమల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో 1978లో వైల్డ్ లైఫ్ సాంక్చురీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం సముద్ర జలాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే బొక్కు సొరల సంరక్షణకు అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధానంగా ప్రపంచ బొక్కు సొర దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు బోటు యజమానులకు విద్యార్థిని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ ఎస్ఐఎఫ్టి (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ)లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అలాగే వారోత్సవాలు నిర్వహించి మత్స్యకార గ్రామాలతో పాటు ప్రధాన మార్కెట్ల వద్ద జాలర్లకు ప్రజలకు ఈ చేపపై అవగాహన కల్పించాం. ఈ చేప పట్ల మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వాటిని వేటాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ చేపలు వలలో పడినట్లయితే వలలను ధ్వంసం చేసి సముద్రంలో వదిలి పెట్టేలా అవగాహన కల్పిస్తున్నాం. ధ్వంసమైన వలలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపకరించే బొక్కు సొరలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్, కోరింగ అభయారణ్యం వాటిని వేటాడితే ఏడేళ్ల జైలు బొక్కుసొర సంరక్షణలో భాగంగా భారీ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారతదేశంలో బొక్కుసొర చేపలను పెద్ద పులలతో సమానంగా రక్షిస్తున్నారు. అక్రమంగా బొక్కుసొరను చంపినా, వాటి శరీర భాగాలను వ్యాపారం చేసినా 1972 వన్య సంరక్షణ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. చేపను కాపాడుదాం ఇలా... సముద్రంలో ఉన్న ఈ గంభీరమైన చేపను సంరక్షించేందుకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం పలు సూచనలు చేస్తోంది. చేపల వేటకు వెళ్లినపుడు మత్స్యకారులు సాధు స్వభావం గల బొక్కుసొరను పట్టడం లేదా వాటికి హానికలిగించడం చేయరాదని అవగాహన కలిగిస్తున్నారు. తూర్పుతీరం వెంబడి బొక్కుసొర తరచుగా వచ్చే ప్రదేశాలను మత్స్యకారులు, రక్షణాధికారులు అటవీశాఖ వారికి తెలియజేసి సంరక్షించాలని కోరుతున్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి ఎంతగానో సహకరించే అతిపెద్ద చేప మనుగడ కోసం అటవీశాఖ అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ప్రధానంగా మత్స్యకార గ్రామాలతో పాటు, జాలర్లు అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ల వద్ద ప్రజలకు అటవీ సిబ్బంది చేప నమూనాలతో పాటు పోస్టర్లతో అవగాహన కల్పిస్తున్నారు. -
పాఠశాలలో మత ప్రచారంపై ఆందోళన
● పాఠశాల పైఅంతస్తులో చర్చిని తొలగించాలని డిమాండ్ ● పోలీసుల హామీతో ఆందోళన విరమణ కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిస్థితిని సమీక్షించారు. సమస్య మూలాలపైనా, గ్రామంలోని శాంతి భద్రతలపైనా ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజులతో చర్చించారు. ఆందోళనకు కాకినాడకు చెందిన హైందవ పరిరక్షణ సమితి నాయకులు మద్దతు పలికారు. సమితి నాయకులు సీహెచ్ గవరయ్య, కె.తులసి మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానాన్ని పంచాల్సిన పాఠశాలలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాఠశాలపై అంతస్తులో చర్చి నిర్వహించడంపై పంచాయతీ, విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పాఠశాల నుంచి చర్చిని వేరు చేసే చర్యలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ చర్చి నిర్వహణకు ఉన్న పత్రాలతో వారం రోజుల్లో హాజరుకావాలంటూ నోటీసు జారీ చేస్తానని, ఆ లోగా సమాధానం రానిపక్షం ఉన్నతాధికారులకు సమస్యను నివేదిస్తానని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. అంగర ఎస్సై హరీష్కుమార్ బందోబస్తు నిర్వహించారు. -
బరువులెత్తారు...పతకాలు పట్టారు
అమలాపురం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో 4వ యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీఎస్ సురేష్కుమార్ను సత్కరించి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. సబ్ జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో 30 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలు, చాంపియన్ షిప్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. బెంచ్ ప్రెస్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కు అనుబంధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ఉత్కంఠగా జరిగాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి.సత్యనారాయణ, ఎంవీ సముద్రం, వి.నరేష్, డీఆర్కే నాగేశ్వరరావు, డి.గణేష్బాబు, బి.జోసఫ్, ఎస్కే వలీ సాహెబ్ వ్యవహరించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కల్వకొలను బాబు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సమావేశాలకు నిర్కా డైరెక్టర్ మాగంటి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ స్వీడన్ స్టాక్హోమ్లో పొగాకు ఉత్పత్తులపై జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ సమావేశాలలో ఐఎస్వో/టీసీ–126లో పాల్గొనే భారత బృందంలో ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పర్యటన ప్రధానం పొగాకు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణీకరణ ప్రక్రియలలో భారతదేశం క్రియాశీల పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతోందని ఆయన తెలిపారు. పొగాకులో పరీక్షా పద్ధతులు, భద్రతా ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి కొత్త అంతర్జాతీయ ప్రమాణాల అభవృద్ధి, సవరణపై ఆయన అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. పొగాకు ఉత్పత్తుల పరీక్షలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి శీల సమీక్షలో పాల్గొని, అభివృద్ధి చెందుతున్న భారత జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కృషి చేయనున్నారు. అదే విధంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రయాణీకరణ సంస్థ సమర్పించే సాంకేతిక నివేదికలు, స్థితిగతుల పత్రాలను సమీక్షించి, భారతదేశం గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో మాధవ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్వీడన్కు బయలుదేరనున్న ఆయనను నిర్కా శాస్త్రవేత్తల బృందం పుష్పగుచ్ఛంతో అభినందించింది. -
దయనీయ బాల్యంపై వాత్సల్యం
● మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకంతో ఆర్థిక సాయం ● బాలల భవిత, భద్రత, ఆరోగ్యం కోసం ● అనాథలు, దీన బాలలు అర్హులు ● కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ● దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ● అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోని వైనం కాకినాడ క్రైం: దయనీయ బాల్యంపై వాత్సల్యం కురిసింది. మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం దయనీయ స్థితిలో ఉన్న నిస్సహాయ బాలలకు చేయూతనిస్తోంది. వారిని బాధ్యతగా చూసుకుంటున్నవారికి తన వంతు సాయమందిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా వందలాది మంది బాలలు ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉన్నా, అవగాహన లేక పథక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఏంటీ పథకం... మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనుబంధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అర్హులైన బాలలకు ఈ పథక ప్రయోజనాలను అందిస్తోంది. బాలల భవిత, భద్రత, ఆరోగ్యంతో పాటు కుటుంబ అనుబంధాలన్నీ ఆఽస్వాదించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. తమ వారికి దూరం చేయకుండా అక్కడే ఉంచి సాయం అందిస్తున్నారు. బాలల పోషణ చూస్తున్న సహాయకులు, సంరక్షకులకు సాయమందిస్తూ బాలల ఉన్నతికి తోడ్పాటునివ్వడమే ఈ పథక ఉద్దేశం. కలెక్టర్ చైర్పర్సన్గా కమిటీ అర్హులైన బాలల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉంది. ఈ కమిటీని స్పాన్సర్షిప్ అండ్ ఫోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ (ఎస్ఎఫ్సీఏ) అంటారు. కలెక్టర్ చైర్పర్సన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, మెంబర్లుగా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) మెంబర్ లేదా చైర్పర్సన్, బాలల సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీవో ప్రతినిధి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి(డీసీపీవో), జిల్లా బాలల పరిరక్షణాధికారి(పీవో ఎన్ఐసీ), శిశుగృహ మేనేజర్ మెంబర్లుగా ఉంటారు. అర్హులైన బాలల్ని ఎంపిక చేయడంలో వీరిదే తుది నిర్ణయం. అర్హులెవరు తొలి ప్రాధాన్యత తల్లి, తండ్రిని కోల్పోయిన పూర్తి స్థాయి అనాథలకు ఇస్తారు. కోవిడ్ వేళ తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు, హెచ్ఐవీ బారిన పడిన బాలలు, తల్లిదండ్రులకు హెచ్ఐవీ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న పిల్లలు, పోక్సో బాధిత బాలలు, పాక్షిక అనాథలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలు స్పాన్సర్ షిప్ పథక ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. కేవలం మైనర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి నెలా రూ.4 వేలు స్పాన్సర్ షిప్ పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున పిల్లల ఖాతాలు లేదా వారి సంరక్షకులతో ఉమ్మడిగా ఉన్న జాయింట్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని వారి సంరక్షకులు... పిల్లల చదువు, ఆరోగ్యం అవసరాలకు, పిల్లల రోజు వారీ అవసరాల నిర్వహణకు తప్ప మరే రకంగానూ వెచ్చించకూడదు. అంగన్వాడీ వర్కర్లు, గ్రామ మహిళా పోలీసుల ద్వారా ఇటువంటి పిల్లల్ని గుర్తిస్తారు. బాలల వాస్తవ స్థితిని స్వయంగా ఇంటికి వెళ్లి నిర్దారిస్తారు. సంరక్షకులు లేదా తల్లి లేదా తండ్రి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను అంగన్వాడీ సూపర్వైజర్లు సీడీపీవోలకు అందిస్తారు. వీటిని నిర్ధారించి సీడీపీవోలు డీసీపీయూ విభాగానికి పంపిస్తారు. ఈ యావత్ ప్రక్రియ ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడం అంతా ఆఫ్లైన్ విధానంలోనే. కావలసిన ధ్రువీకరణలు బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, గ్రామాల్లో నివసిస్తే ఆదాయం ఏడాదికి రూ.72 వేలకు మించకూడదు. అర్బన్ అయితే రూ.96 వేల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు, తల్లిదండ్రులు ఇద్దరూ లేదా వారిలో ఒక్కరు మరణించినట్లయితే సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రాలు, బాలలు లేదా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ రిపోర్టులు, పోక్సో బాధితులు అయితే కేసు పత్రాలు, బాలుడు లేదా సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు, సంరక్షకులు మాత్రమే ఉంటే వారి ఆధార్ కార్డు, వారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.కాకినాడ జిల్లాలో గడచిన మూడేళ్లలో మొత్తం 1,626 మంది బాలలకు మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ప్రయోజనం అందింది. 2022–23 ఏడాదిలో 683 మంది, 2023–24లో 440 మంది, 2024–25 లో 503 మంది దీన బాలలకు నెలకు రూ.4 వేలు చొప్పున సహకారం అందింది.18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ పథకం జిల్లాలో డీసీపీ యూనిట్ పరిధిలో డీసీపీవో వెంకట్ పర్యవేక్షణలో పీవో ఎన్ఐసీ కె.విజయ ఆధ్వర్యంలో అమలవుతోంది. బాలలు ఏ వయసులో దరఖాస్తు చేసుకున్నా వారికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ ప్రయోజనం అందుతుంది. బాలలు కచ్చితంగా చదువుతుండాలి. హాస్టళ్లలో ఉంటే వర్తించదు. సింగిల్ పేరెంట్, అనాథ బాలలు, వ్యాధిగ్రస్త బాలలు, వ్యాధి ప్రభావిత పిల్లల్ని ఎవరినైనా చేరదీస్తే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు స్థానిక అంగన్వాడీ కార్యకర్తను సంప్రదించాలి. కుటుంబ జీవితానికి పిల్లల్ని దూరం చేయకుండా వారి భవితకు భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. – చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్ -
పీఠం ఎవరికి?
సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఉత్కంఠను రేపుతోంది. పదవి ఎవరిని వరిస్తుందా..? అన్న మీమాంస నేతల్లో నెలకొంది. ప్రధానంగా ముగ్గురు నేతల పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. వారిలో ఒకరికి ఖాయమన్న సంకేతాలు ఇప్పటికే పార్టీ శ్రేణులకు అందాయి. పదవి దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇందు కోసం మూడు వర్గాలుగా విడిపోయి మరీ అధిష్టానం, త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే చినబాబు లోకేష్ ఆశీస్సులు ఓ నేతకు ఉండటం, ఆయన ప్రకటన లాంఛనం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.జిల్లా అధ్యక్షుడి ఎంపికకు కసరత్తుతూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కేఎస్ జవహర్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. దీనికితోడు జిల్లా కమిటీల ఏర్పాటుకు టీడీపీ అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కమిటీల ఎంపిక కోసం ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని నేతలతో మాట్లాడి మెజారీటీ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పేర్లను అధిష్టానానికి అందిస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో పాటు నియోజకవర్గానికి చెందిన సుమారు 10 మంది ప్రత్యేక ఆహ్వానితుల అభిప్రాయాలు సేకరించారు. ప్రత్యేక గదిలో కూర్చుని అభిప్రాయాలను తీసుకున్నారు. ఇందులో ఎవరి అభిప్రాయాలు వారు త్రిసభ్య కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది.జిల్లా అధ్యక్షుడిగా వెంకటరమణ చౌదరి?జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం త్రిసభ్య కమిటీ సేకరించిన అభిప్రాయాల్లో అత్యధిక శాతం మంది రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. సింహభాగం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, ప్రత్యేక ఆహ్వానితులు సైతం వెంకటరమణ చౌదరి అభ్యర్థిత్వాన్నే బలపర్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికితోడు చినబాబు, మంత్రి లోకేష్ అండదండలు, ఆశీర్వాదం సైతం ఆయనకే ఉండటంతో అధ్యక్ష పదవి ఎంపిక లాంఛనం కానుందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.ఇదే విషయాన్ని త్రిసభ్య కమిటీ సభ్యులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.గన్నికి మళ్లీ భంగపాటు?టీడీపీ సీనియర్ నేత గన్నికృష్ణకు ఈ సారి కూడా భంగపాటు ఎదురుకానుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది పార్టీ శ్రేణుల నుంచి. ఇప్పటికే రాజమహేంద్రవం మేయర్ స్థానాన్ని గన్నికృష్ణ ఆశించారు. అయితే కార్పొరేషన్కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో మేయర్ స్థానం ఆశలు సైతం అడియాసలుగానే మిగిలిపోయాయి. ఈ విషయమై నేరుగా సీఎం చంద్రబాబుతోనే ఆ సీనియర్ నేత భేటీ అయ్యారని వినికిడి. అయినా లాభం లేకుండా పోయింది. కనీసం నామినేటెడ్ పదవైనా వరిస్తుందని అనుకున్నా.. అది కూడా దక్కలేదు. జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఆయన వర్గం నేతలు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ నేత కావడంతో పదవి దక్కుతుందన్న భావనలో ఆయన వర్గం నేతలు ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం వెంకటరమణ చౌదరి వైపు మొగ్గు చూపుతుండటంతో మళ్లీ నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది. సీనియర్ నేతను పక్కన పెడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.ముళ్లపూడి బాపిరాజుకూ అదే పరిస్థితా?టీడీపీలో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఒక వెలుగు వెలిగిన నేత అయినా టీడీపీలో ప్రాధాన్యం కరవైందన్న ఆరోపణలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పదవైనా దక్కుతుందని భావించారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆయనను మళ్లీ పక్కన పెడుతుండటంతో ఆయన వర్గీయులు అధిష్టానంపై లోలోపల మండిపడుతున్నట్లు తెలిసింది. దీనికితోడు బాపిరాజు గోపాలపురం నియోజకవర్గానికి చెందిన నేత కావడం, జిల్లాల పునర్విభజనలో గోపాలపురం నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి కలవనుండటంతో సైతం పదవికి అనర్హత సాధించినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
పొగాకు నారుమడికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
– బోర్డు అధికారి హేమస్మిత దేవరపల్లి: పొగాకు నారుమడులు కట్టే ముందు రైతులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సీహెచ్ హేమస్మిత రైతులకు సూచించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో కట్టిన పొగాకు నారుమడులను పరిశీలించి, రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఏడాది పొగాకు బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు క్షేత్రస్థాయి అధికారి కీర్తికుమార్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తుందన్నారు. నారుమడులను పరిశీలించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారని ఆమె చెప్పారు. బృందం శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పల్లంట్లలో యలమాటి సుధాకర్ పొగాకు నర్సరీలను తనిఖీ చేసినట్టు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా నారుమడులు కడితే చర్యలు తీసుకొంటామన్నారు. రిజిస్ట్రేషన్ గల నారుమడుల్లోనే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు కొనుగోలు చేసిన నారుమడి రైతు ఇచ్చిన రశీదును నాట్లు వేసే సమయంలో మొక్కఫారంతో పాటు జత చేసి వేలం కేంద్రంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని నారుమడుల నుంచి నారు కొనుగోలు చేస్తే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు.వేలం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 96 మంది రైతులు నారుమడులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. వీరంతా నారు వ్యాపారస్తులేనని చెప్పారు. -
గోదావరి పరవళ్లు
కాటన్ బ్యారేజీ నుంచి 7.88 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 10.30 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుంచి 7,88,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం స్వల్పంగా తగ్గి రాత్రి 10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ముందుగా ప్రకటించిన విధంగా నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరలేదు. అయితే శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండటంతో శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 6,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.33 మీటర్లు, పేరూరులో 16.65 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.63 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 17.01 మీటర్లు, కుంటలో 9.85 మీటర్లు, పోలవరంలో 11.31 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.40 మీటర్లు నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.కాటన్ బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి -
వేధిస్తున్న యూరియా కొరత
సీతానగరం: కూటమి ప్రభుత్వంలో మండలంలో రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. శుక్రవారం మండలంలోని చినకొండేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి కేవలం పది టన్నుల యూరియా (220 బస్తాలు మాత్రమే) వచ్చింది. సమాచారం అందుకున్న నాలుగు వందల మంది రైతులు పీ ఏసీఎస్కు తరలివచ్చారు. దానితో యూరియా బస్తాలు 220 ఉండటంతో నాగంపల్లి, చీపురుపల్లి రైతులకు 80 బస్తాలు, చినకొండేపూడి రైతులకు 140 బస్తాలు అందించడానికి సొసైటీ సీఈవొ సుబ్బారాజు సిద్ధం చేశారు. ఒక్క రైతు కు ఒక్క యూరియా బస్తా చొప్పున అందించారు. మిగిలిన రైతుల పేర్లు నమోదు చేసుకు ని వెనక్కి పంపించారు. యూరియా వచ్చిన తరువాత పేర్లు నమోదు చేసిన రైతులకు అందిస్తామని సీఈవో సుబ్బరాజు తెలిపారు -
దసరాలో మైసూర్ యాత్రకు ఆర్టీసీ ఏర్పాట్లు
రావులపాలెం: దసరాకు ప్రత్యేక మైసూర్ యాత్ర ఏర్పాటు చేసినట్టు స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎనిమిది రోజుల టూర్గా ఈ యాత్రను రూపొందించామన్నారు. సెప్టెంబర్ 24న బయలుదేరి మంత్రాలయం, హంపి, గోకర్ణం, మురుడేశ్వర్, మూకాంబిక, ఉడిపి, శృంగేరి, హార్నాడు, ధర్మస్థలం, కుక్కే సుబ్రహ్మణ్యం, శ్రీరంగపట్నం, మైసూర్ అరుణాచలం మీదుగా అక్టోబర్ ఒకటో తేదీన తిరిగి రావులపాలెం చేరుతుందన్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతోపాటు ఈ యాత్రకు ఒక టిక్కెట్ ధర రూ.8500 నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు అడ్వాన్స్ టికెట్లు, ఇతర వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ కార్యాలయంలో 73829 11871 నంబరును సంప్రదించాలన్నారు. -
ఆయువు తీసిన విద్యుత్ పాశాలు
● విధి నిర్వహణలో ఒకరు.. ● ఆట సరదాలో మరొకరు మృతి ● వేర్వేరు ఘటనలలో ఆరుగురికి గాయాలుపెద్దాపురం: విద్యుత్ స్తంభంపై మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఒక లైన్మన్ మృతి చెందగా, మరో లైన్మన్ తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం పట్టణంలో చోటు చేసుకున్న ఘటనపై సీఐ విజయశంకర్, ఎస్ఐ మౌనిక తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కొండయ్యపేటకు చెందిన ఆరిమిళ్లి రామకృష్ణ (35), స్థానిక శివాలయం వీధికి చెందిన యాళ్ల చిన్నిబాబు స్థానిక పాశిలివీధిలో విద్యుత్ లైన్కు మరమ్మతు చేస్తున్నారు. ఇంతలో విద్యుత్ షాక్ తగలడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగగా చిన్నిబాబు తీవ్ర గాయాల పాలయ్యారు. రామకృష్ణకు తండ్రి, తల్లితో పాటు సోదరి ఉన్నారు. చిన్నిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దాపురం నాలుగో సచివాలయ పరిఽధిలో జూనియర్ లైన్మన్లుగా వారు పనిచేస్తున్నారు. రామకృష్ణ మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చిన్నిబాబును ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం వల్లనే.. సంఘటన స్థలం వద్ద లైన్మెన్ రామచంద్రరావు, రామకృష్ణ, చిన్నిబాబు ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, అనంతరం జూనియర్ లైన్మన్లు పోల్ పైకి ఎక్కి పని చేస్తుండగా పైనున్న ఏ, బీ, సీ బ్లేడ్లలో ఏ బ్లేడ్ ఆఫ్ కాకపోవడంతో విద్యుత్ ప్రసరించి రామకృష్ణ మృతి చెందాడని ఏఈ వివరించారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన లైన్మన్ రామకృష్ణఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లైన్మన్ చిన్నిబాబు -
తొగరపాయలో వ్యక్తి గల్లంతు
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక శివారు వీధివారిలంకకు చెందిన పల్లి చిట్టియ్య (65) తొగరపాయలో గల్లంతయ్యాడు. తన నివాసం నుంచి గురువారం ఉదయం తాతపూడి లంక పొలానికి వెళ్లి వస్తుండగా ప్రవాహంలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆదేశాలపై ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, తహసీల్దార్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందం తొగరపాయ సమీపంలో పడవలతో గాలించినా ఫలితం లేకపోయింది. ఆచూకీ తెలిసిన వారు మండపేట సీఐకి 94407 96537, అంగర ఎస్సై హరీష్ కుమార్కు 94409 00770 నంబర్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
ప్రత్తిపాడు: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ప్రత్తిపాడు పోలీసులు గురువారం అరెస్టు చేసి సుమారు రూ.6.30 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని ధర్మవరం జగనన్న కాలనీలో నివసిస్తున్న గాలి తలుపులయ్య ఈనెల 21వ తేదీన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన ఇద్దరు ఆగంతకులు ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సీఐ బి.సూర్యఅప్పారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. స్థానిక జాతీయ రహదారిపై గల శ్రీపాదాలమ్మ అమ్మవారి ఆలయం సమీపాన సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం క్వారీపేటసెంటర్కు చెందిన కొవ్వూరి సునీల్, రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామానికి చెందిన బాలుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. నిందితుల నుంచి సుమారు రూ.6.30 లక్షల విలువైన 247 గ్రాముల బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు తదితరాలు, 90 గ్రాముల వెండి వస్తువులు, 3 గ్రాముల ప్లాటినం ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలుడిపై నాలుగు మోటారు బైక్ దొంగతనం కేసులున్నాయన్నారు. వీరు చోరీ చేసేందుకు రాజమహేంద్రవరంలో గంటకు రూ.200 వంతున యమహా ఆర్ఒన్ 5 బైక్ అద్దెకు తీసుకుని రూ.1,800 చెల్లించినట్టు పోలీసులు తెలిపారు. ఆ వాహనాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాల నేరస్తుడిని జూవైనల్ కోర్టులోనూ, నిందితుడిని ప్రత్తిపాడు కోర్టులోనూ హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు.సుమారు రూ.6.30 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం -
నలుతెరంగులా వ్యవహరిద్దాం!
భాషాభిమానంతోనే రోజుకో పద్యం ఆలమూరు బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రతి రోజు ఒక సామాజికాంశం, ఆయా రోజుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ప్రతి రోజు ‘గౌరీ మల్లిక్’ కలం పేరుతో ఒక పద్యం రాస్తాను. అక్షరధనంతోనే అజ్ఞానాన్ని పారదోలగలం. భాషతోనే కీర్తి, స్ఫూర్తి. మానవీయతకు అద్దం పట్టేందుకు కృషి చేస్తున్నా. – కామవరపు మల్లికార్జునరావు (మల్లిక్), తెలుగు పండిట్, జెడ్పీహెచ్ఎస్, కండ్రిగ, ఆలమూరు నైతిక విలువల బోధన తెలుగు భాషను మించిన భాష లేదు. మాతృభాష ద్వారానే విద్యార్థుల్లో నైతిక, సామాజిక విలువలను పెంపొందించే అవకాశం ఉంటుంది. పద్యధారణ ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో స్వామి వివేకానంద, శారదామాత, రామకృష్ణ పరమహంస, బాలల నాటికలు, చిన్నారి స్నేహితులు(గేయాలు), నేనొక ప్రేమ పిపాసిని (కవితలు) తదితర రచనలు చేశాను. – కూచిభొట్ల జనార్దనస్వామి, తెలుగు పండిట్, జెడ్పీహెచ్ఎస్, ద్రాక్షారామం రాయవరం: తెలుగు భాష తీయదనం.. తెలుగు భాష గొప్పదనం.. తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఓ మూలధనం.. అన్నాడో సినీ కవి. పంచదారకన్నా.. పాలమీగడ కన్నా, చెరకురసం కన్నా మధురమైనది మన తెలుగు భాష. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయులు ప్రవచిస్తే.. ప్రముఖ చరిత్రకారుడు ‘నికోలో డి కాంటీ’ తెలుగు భాషను శ్రీఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్శ్రీగా పేర్కొన్నాడు. తేనెలొలికే తెలుగుభాష గొప్పదనాన్ని మన కవులు శతాబ్దాల కిందటే విశ్వవ్యాపితం చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడుతున్నారు. దేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన 22 భాషల్లో తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ‘గిడుగు’ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర భాషగా ప్రభుత్వం ప్రకటించింది. మాతృభాషలో జ్ఞానాన్ని పొందకుంటే వ్యక్తిత్వ వికాసం.. మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. తెలుగు భాషలోని నుడికారాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు ఇలా వేటికవే ప్రత్యేకం. అమ్మ భాషలోనే మన భావోద్వేగాలను సులభంగా వెల్లడించగలుగుతాం. తెలుగు భాష ఉన్నతికి అవిరళ కృషి చేయడంతో పాటుగా, తెలుగుజాతి గొప్పదనాన్ని ఖండాతరాలకు చాటి చెప్పిన బహుభాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఏటా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. లోపిస్తున్న చిత్తశుద్ధి అతి ప్రాచీన భాషల్లో ఒకటిగా తెలుగును భారత ప్రభుత్వం 2008 అక్టోబర్ 31న చేర్చింది. ప్రాచీన హోదా కల్పించడంతో పాటు ప్రభుత్వం చట్టాన్ని చేసినప్పటికీ అది ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. తెలుగు భాషను ప్రభుత్వపరంగా ఆచరణలో పెట్టాలని భావించి 1958వ సంవత్సరంలో ఆదేశాలు జారీ చేశారు. అవి అమలు కాకపోవడంతో 1991వ సంవత్సరంలో తెలుగు భాషను ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అయినప్పటికీ అమలు విషయంలో చిత్తశుద్ధి లోపించింది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో నేటికీ తెలుగుకు సంబంధించిన నిబంధనలు అమలు కావడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మారిన కారణంగా సొంతగడ్డపైనే తెలుగు పరాయిభాషగా మారిపోయిందని తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిడుగు వారి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చినప్పటికీ పాలకుల నిర్వాకంతో అమ్మ భాష రోజురోజుకూ నిరాదరణకు గురవుతోందనే భావనను పలువురు కవులు చెబుతున్నారు. ‘తెలుగు భాషా దినోత్సవం’ రోజు మాత్రం హంగామా చేస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో మాతృ భాష అమలు ఊసే ఉండడం లేదు. శిష్ట వ్యవహారిక రూపశిల్పి ‘గిడుగు’ శిష్ట వ్యవహారికం పేరిట రామ్మూర్తి పంతులు వాడుక భాషలో బోధనకు పెద్దపీట వేశారు. అందుకే ఆయన జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలు మాత భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వ్యావహారిక భాషలో బోధనా ప్రచారం కోసం ఆయన ‘తెలుగు’ పత్రికను ప్రారంభించారు. ఆయనతో పాటుగా గురజాడ అప్పారావు, శ్రీనివాస అయ్యంగార్ వంటి వారి కృషి ఫలితంగా 1912–13లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్కూల్ ఫైనల్ పరీక్షను వ్యావహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు జారీచేసింది. సాహితీ ప్రక్రియలలో తెలుగుకు అగ్రస్థానం శతాబ్దాల క్రితమే విశ్వవ్యాపితం ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల మంది వినియోగం వ్యావహారిక భాషోద్యమానికి సారథ్యం వహించిన ‘గిడుగు’ నేడు తెలుగు భాషా దినోత్సవం -
భారత్, తైవాన్లది బలమైన బంధం
టీఈసీసీ డైరెక్టర్ స్టీఫెన్ షు–చిహ్ హ్సు రాజానగరం: భారత్, తైవాన్ దేశాలు ఆర్థిక, సాంకేతిక, రాజకీయ రంగాలలో బలమైన సంబంధాలను కలిగివుండటంతో ఇరు దేశాలు ఎగుమతి, దిగుమతులలో పురోగతిని సాధిస్తున్నాయని చైన్నెకు చెందిన టీఈసీసీ డైరెక్టర్ స్టీఫెన్ షు–చిహ్ హ్సు అన్నారు. స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో గ్రీన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీలలో కృత్రిమ మేధ (ఏఐ) అంశాలపై గురువారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. తైవాన్ నేషనల్ సన్ యాట్–సెన్ యూనివర్సిటీ, తైవాన్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సహకారంతో జరిగిన ఈ సదస్సుకు చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షత వహించారు. స్టీఫెన్ షు–చిహ్ హ్సు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో భారత్ నైపుణ్యం కలిగివుంటే, సెమీ కండక్టర్ తయారీలో తైవాన్ ప్రత్యేక అనుభవంతో ఉందన్నారు. ఈ రెండు కలిస్తే అభివృద్ధిలో కొత్త ఒరవడిని తీసుకురావొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ తయారీ హబ్కు ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. దీని అభివృద్ధికి తైవాన్ సహకరిస్తుందన్నారు. ఈ రంగంలో విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం.శేషుమాధవ్, ప్రొ చాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
● మహా గణపతిం..
జిల్లాలో వాడవాడలా బుధవారం గణపతి ఉత్సవాలు ప్రారంభమైయ్యాయి. చిట్టి వినాయక బొమ్మల నుంచి భారీ విగ్రహాలు మండపాలలో కొలువుదీరాయి. వివిధ ఆకారాలలో గణపతి విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల ఆలంకరణలతో మండపాలను కాంతివంతం చేశారు. రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 16వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా 18 అడుగులు ఎత్తైన శుభంకర మహా గణపతి వినాయకుడి విగ్రహాన్ని నూలు పోగులు, పసుపుతాడుతో రూపొందించారు. సీ్త్ర రూపంలో గణపతిని ప్రతిష్ట చేయడం ఇక్కడ విశేషం. ఇది శక్తి గణపతి అని, పురాణాలలో దీని ప్రస్తావన ఉందని నిర్వాహకురాలు, వైఎస్సార్ సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి తెలిపారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)రాజమహేంద్రవరం పుష్కరాల రేపు వద్ద శుభంకర మహా గణపతి -
వైఎస్సార్ సీపీ న్యాయ విభాగ జిల్లా అధ్యక్షుడిగా సీపీఆర్ రెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన సీపీఆర్ రెడ్డిని వైఎస్సార్ సీపీ న్యాయవిభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు వెలువరించింది. పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకు రమకాంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవికి ఎంపిక చేసిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. దేవీ నవరాత్ర మహోత్సవానికి పందిరి రాట సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్థానిక దేవీచౌక్లో వేంచేసియున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట ముహూర్తం గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ దేవీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజ రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావులతో ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు పందిరి రాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహింపజేశారు. దేవీచౌక్ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం గురువారం ఉదయం నిర్వహించిన రాట ముహూర్తం కార్యక్రమంలో మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మా ర్గాని భరత్రామ్ పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కూడా రాట ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఏపి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి శుక్రవారం పరిశీలించనున్నారు. ఆయన వెంట డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు ఉన్నారు. -
మళ్లీ పెరుగుతున్న గోదావరి ఉధృతి
● నేడు ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం: గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి పెరుగుతుండటంతో ఆ ప్రభావం ధవళేశ్వరం వద్ద శుక్రవారం ఉదయం నుంచి కనిపించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి గురువారం రాత్రి 5,15,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. గురువారం రాత్రి నీటి మట్టం 10.40 అడుగులకు చేరింది. స్థానికంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో డెల్టా కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 4,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 1,600, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.34 మీటర్లు, పేరూరులో 13.42 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.18 మీటర్లు, భద్రాచలంలో 38.60 అడుగులు, కూనవరంలో 16.73 మీటర్లు, కుంటలో 12.20 మీటర్లు, పోలవరంలో 10.90 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.94 మీటర్ల నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. -
క్రీడాకాశంలో తూరుపు మెరుపులు
కపిలేశ్వరపురం: ఆటలు మానసిక, శారీరక ఉల్లాసాన్నే కాకుండా దేశ కీర్తి ప్రపంచ వ్యాప్తం చేస్తాయి. సాధించిన ప్రగతి పది కాలాల పాటు దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది. క్షేత్ర స్థాయిలో పాఠశాల స్థాయి నుంచే ప్రభుత్వాలు క్రీడలకు సరైన సదుపాయాలు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జాతీయ క్రీడా దినోత్సవం నేపథ్యమిదీ... ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జన్మదినం ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను శ్రీమేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారంశ్రీగా నేటి మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదిలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఆ పురస్కారాన్ని అందుకోవడం ఉమ్మడి ‘తూర్పు’ జిల్లాకు గర్వకారణం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రీడలకు మహర్దశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023–28 క్రీడా పాలసీ ద్వారా ఆడుదాం ఆంధ్రా క్రీడల సంబరాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సచివాలయాల పరిధిలో మూడు లక్షల మ్యాచ్లను నిర్వహించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనంతగా విజేతలకు నగదు బహుమతులను అందజేసింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 9 క్రీడా అంశాలపై పోటీలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో ప్రగతి ఇదీ.. ● ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ జట్టు ప్రతిభ కనబరచగా, 15 మంది జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారే. ● ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్తాన్ అల్వార్లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్లో అంతర్జాతీయ అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. ● అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన గిరిజన క్రీడాకారిణి కుంజా రజిత మేలో ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్ పరుగు పోటీలో స్వర్ణం సాధించింది. ● ఈ ఏడాది జనవరి 6 నుంచి 9 వరకూ సింగపూర్లో నిర్వహించిన ఏషియన్ యోగా పోటీల్లో దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన ఇమ్మణి అర్మిత భవానీ చౌదరి ప్రతిభ కనబర్చింది. ● ఈ ఏడాది జూలైలో అమలాపురం మండలం సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఒపెన్ చెస్ చాంపియన్షిప్ గెలుచుకుని జాతీయ స్థాయికి ఎంపికై ంది. ● ఈ నెల 1 నుంచి 12 రోజుల పాటు కాకినాడ డీఎస్ఏ మైదానంలో 15వ జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్షిప్–2025 నిర్వహించారు. 2026–27 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు 30 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ● ఈ ఏడాది జనవరి 14 నుంచి 17 వరకూ రామచంద్రపురంలో నిర్వహించిన 14వ ఆలిండియా బాస్కెట్బాల్ టోర్నీ నిర్వహించారు. ● 2024 డిసెంబర్ 28న వైజాగ్ ఆర్కే బీచ్లో ప్రారంభమై సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ స్విమ్మర్ గోలి శ్యామల 2025 జనవరి 3 కాకినాడ బీచ్కు చేరుకుని అరుదైన రికార్డును సాధించారు. ● ఈ ఏడాది జూలైలో రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప, గుడాల దుర్గా శ్రీనివాస్ సురేష్కుమార్లు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఎంపికయ్యారు. ● ఈ ఏడాది మార్చి 23న చైన్నెలో కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స వెంకట సత్యనారాయణరాజు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ● అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన కొండా శివేంద్ర, పితాని రాఘవేంద్ర, సాధనాల శ్రీసంతోష్ చెస్లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారు. ● ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ మండల స్థాయిలోనూ 22 నుంచి 24 వరకూ అమలాపురంలో జిల్లా స్థాయిలోనూ కోనసీమ క్రీడోత్సవం పేరిట విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శివరాత్రి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించింది. న్యాయ నిర్ణేతలుగా.. ఈ ఏడాది జూలైలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ కమిషన్ సభ్యులుగా రాజమహేంద్రవారానికి చెందిన జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి యండమూరి లలితాదేవి ఎన్నికయ్యారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 9–13 మధ్య ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలకు న్యాయ నిర్ణేతగా కాకినాడ జిల్లాకు చెందిన నాగం సతీష్ నియమితులయ్యారు. ● ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వరకూ నిర్వహించిన నేషనల్ గేమ్స్లో బాల్ బ్యాడ్మింటన్ అంపైర్లుగా అమలాపురం మండలానికి చెందిన అడపా శ్రీనివాస్, గొల్లకోటి శ్రీనివాస్ నియమితులయ్యారు. దిగ్భ్రాంతి కలిగించిన ప్రముఖుల మృతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మృతి చెందారు. సాత్విక్ ఫిబ్రవరి 21న దిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకునే కార్యక్రమానికి బయలుదేరిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మే 1న దిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయ చేతులు మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోగా ఆ ఘట్టాన్ని తల్లి రంగనాయకి స్వయంగా వీక్షించారు. అమలాపురానికి చెందిన వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు బిళ్ళ వీర్రాజు (74) అనారోగ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆటల్లో మేటిగా గోదావరి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఉమ్మడి జిల్లా అదే స్థాయిలో పతకాల కై వసం నేడు జాతీయ క్రీడా దినోత్సవంకూటమి పాలనలో తూతూ మంత్రంగా .. సుమారు ఏడాదిన్నర కూటమి పాలనలో క్రీడలను విస్మరించారు. క్షేత్ర స్థాయిలో మైదానాలను మెరుగుపరచలేదు. 2024 నవంబర్ 20న నూతన క్రీడా విధానం– 2024ను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అథ్లెట్లు సాధన చేసేందుకు సింథటిక్ ట్రాక్, కోచ్ సదుపాయాలు లేకపోవడం ప్రోత్సాహలేమికి ఉదాహరణ. -
బార్లపై కూటమి.. సిండికేట్ కన్ను!
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, రాజమహేంద్రవరం: బార్లు దక్కించుకునేందుకు కూటమి సిండికేట్ కుయుక్తులు పన్నుతోందా.? ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు భారీగా తగ్గించుకునేందుకు కుట్రలు చేస్తోందా? ఇందులో భాగంగా మద్యం వ్యాపారులు ఒక్కటైపోయారా? ప్రభుత్వానికి చెల్లించాల్సిన బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించే వరకు దరఖాస్తులు చేయకూడదని నిర్ధారించుకున్నారా? ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉండగా జిల్లావ్యాప్తంగా 25 బార్లకు కేవలం 8 దరఖాస్తులే రావడం ఇందుకు బలం చేకూరుస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బార్ల లైసెన్సుల ఎంపికపై టీడీపీ, జనసేన, బీజేపీల సిండికేట్ కన్నేసింది. ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో బార్ ఫీజు ఏకంగా ఏడాదికి రూ.70 లక్షల నిర్ధారించడంపై గుర్రుగా ఉంది. ఎలాగైనా ఫీజు తగ్గించుకొని లాభం పొందేందుకు తెరవెనుక కుట్రలు ప్రారంభించింది. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో దరఖాస్తులు చేయకుండా మిన్నకుండి పోయినట్లు సమాచారం. దీంతో ఎకై ్సజ్ అధికారులు స్పందన రాలేదంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపితే.. ప్రభుత్వం దరఖాస్తులు రాలేదన్న నెపంతో ఫీజులు తగ్గించి కూటమినేతలకు లాభం చేసే ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడినా.. కూటమి సిండికేట్ మాత్రం కాసులు కొల్లగొట్టనుంది. లోలోపల ఈ కుట్రలకు తెర తీసిపైకి మాత్రం పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు అత్యధికంగా ఉండడంతో తాము వ్యాపారం చేయలేమంటూ కూటమి నేతలకు చెందిన సిండికేట్ కలరింగ్ ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 25 బార్లు జిల్లావ్యాప్తంగా మొత్తం 25 బార్లు ఉన్నాయి. వాటిలో 3 బార్లు కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయగా.. మిగిలినవి ఓపెన్ కేటగిరిలో కేటాయిస్తారు. ఇందులో రాజమహేంద్రవరంలో 19, కొవ్వూరు 2, నిడదవోలు 3 బార్లు ఉండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం టూరిజం ప్రదేశాల్లో బార్లకు అనుమతులు ఇస్తున్నారు. కడియపులంకలో ఒక బార్కు అనుమతులు ఇవ్వనున్నారు. దరఖాస్తుల ఆహ్వానానికి స్పందన కరవు జిల్లావ్యాప్తంగా 25 బార్లకు లైసెన్సు ఇచ్చేందుకు వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులు గడువు పెట్టారు. 25 బార్లకు గాను కేవలం ఎనిమిది దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అది కూడా.. 8 బార్లకు మాత్రం ఒక్కో బార్కు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు అందాయి. రాజమహేంద్రవరం నగరం నుంచి నాలుగు దరఖాస్తులు రాగా, మిగిలిన ప్రాంతాల నుంచి నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మిగిలిన వాటికి దరఖాస్తు చేసుకునే నాథుడే కరవయ్యాడు. దీంతో అవాకై ్కన ఎకై ్సజ్ అధికారులు తిరిగి నెల 29వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రతిపాదించిన మేరకు 25 బార్ల లైసెన్సులను రాబట్టాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారులకు టార్గెట్లు ఉండటంతో.. వీటిని పూర్తి చేసేందుకు వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మరోమారు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ వెల్లడించారు. ఆరోజు సాయంత్రం 6 గంటల లోపు వ్యాపారులు తమ దరఖాస్తులను నేరుగా కార్యాలయం వద్ద అందించాలని సూచించారు. రూ.కోట్లు పెట్టి నష్టపోతామన్న ఆందోళన బార్ ఏర్పాటుకు రూ.కోట్లల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కు 10 కిలోమీటర్ల లోపు బార్ ఏర్పాటు చేసుకునే వారికి ఒక్కో బార్కు ఏడాదికి రూ.70 లక్షల ఫీజు నిర్ధారించారు. నిడదవోలులో రూ.37.50 లక్షలుగా నిర్ణయించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించే షాపులకు ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తారు. నిర్దేశించిన ఫీజు ప్రభుత్వానికి చెల్లించాలి. బార్ నిర్వహణ కోసం భవనం అద్దె కనీసం రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు అందులో పనిచేసే సిబ్బందికి వేతనాలు, పోలీసు, ఎకై ్సజ్ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇలా అన్నీ లెక్క గడితే ఏడాదిలో రూ.కోట్లలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా ఆదాయం వస్తుందా..? రాదా..? అన్న మీమాంస వ్యాపారుల్లో నెలకొంది. దీనికితోడు ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయాన్ని అమలు చేస్తోంది. అమ్మకాల్లో ఇంత శాతం ప్రభుత్వానికి చెల్లించాలన్న నిబంధన వ్యాపారుల్లో మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు ఏడాదిలో రూ.కోటి రూపాయల విక్రయాలు జరిగితే.. అందులో రూ.10 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే.. కనీసం వడ్డీ డబ్బులైనా వస్తాయా? లేదా? అన్న ప్రశ్న వ్యాపారుల్లో ఉత్పన్నమవుతోంది. దీంతో మద్యం సిండికేట్ దరఖాస్తు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.సర్కారుపై ఒత్తిడి కోసమే.. కూటమి సర్కారు కాసుల కక్కుర్తితో ఇప్పటికే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చేసింది. బార్లను తలపించేలా అమ్మకాలు జరుగుతున్నాయి. మందుబాబులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నారు. దీనికితోడు జిల్లాలో ఎక్కడ చూసినా అనధికారిక బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మందు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా మందు విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మద్యం ఇలా ఏరులై పారుతుంటే.. బార్లకు వచ్చి పనిగట్టుకుని మద్యం సేవించే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బార్ లైసెన్సుల కోసం దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. దరఖాస్తుతో చెల్లించే రూ.5 లక్షలు వెనక్కు తిరిగి రావు. తిరిగిరాని దరఖాస్తు రుసుము కూడా అత్యధికంగా పెంచి కట్టించుకోవడం వ్యాపారులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే సిండికేట్గా ఏర్పడిన మద్యం వ్యాపారులు దరఖాస్తు ఫీజు తగ్గించేలా ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి ఎక్కువగా దరఖాస్తులు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్లీ గడువు పెంచి అవకాశం ఇచ్చినప్పటికీ, ఫీజులు తగ్గించకపోవడంతో మద్యం షాపుల నుంచి బార్ల ఏర్పాటుకు ఎంతమంది వ్యాపారులు ముందుకు వస్తారన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో తీవ్రమైన పోటీ బార్లంటే గతంలో పోటీ తీవ్రంగా ఉండేది. ఒక్కో బార్కు కనీసం 5 నుంచి పది మంది వ్యాపారులు పోటీ పడి మరీ దక్కించుకునే వారు. దరఖాస్తులు సైతం కుప్పలు తెప్పలుగా వచ్చేవి. వ్యాపారులు సిండికేట్ కావడంతో ఒక్కో బార్కు ఒకటి చొప్పున కూడా దరఖాస్తులు రాలేదు. దక్కించుకునేందుకు ఎత్తుగడలు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయంటూ పైకి కలరింగ్ అంతర్గతంగా మాత్రం సింహభాగం షాపులు కై వసం చేసుకునేందుకు పావులు లైసెన్సు ఫీజు తగ్గించుకొని బార్లు హస్తగతం చేసుకునేందుకు ఎత్తులు అందులో భాగంగానే బార్లకు దరఖాస్తు చేయకుండా కాలయాపన -
గ్యాస్ లీకేజీతో నాలుగు షాపులు దగ్ధం
ఐ.పోలవరం: జాతీయ రహదారిని ఆనుకుని మురమళ్లలో ఉన్న ఓ షాపులోని గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం, సోమవారం రాత్రి బజ్జీల దుకాణం నిర్వహిస్తున్న బొలిశెట్టి సత్యశ్రీనివాస్ షాపులో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. ఎగసిపడిన మంటలు పక్కనున్న దుకాణాలకూ వ్యాపించాయి. ఈ ఘటనలో వల్లిబోయిన మాధవ(కూల్డ్రింక్ షాపు), కొమానపల్లి సత్యనారాయణ(సెలూన్ షాపు), చుండ్రు సుందరరావు (పాదరక్షల షాపు) దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ముమ్మిడివరం ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.పెట్రోలు పోసి భర్తకు నిప్పంటించిన భార్యరావులపాలెం: వేధింపులు తాళలేక భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్టు రావులపాలెం టౌన్ సీఐ శేఖర్బాబు మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్(40), మట్టా ఏంజలీనా జెన్నీఫర్ థామస్ భార్యాభర్తలు. భర్త ప్రతిరోజు తాగి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో విసుగు చెందిన భార్య సోమవారం రాత్రి సుమారు మూడు గంటల సమయంలో నిద్ర లో ఉన్న శ్రీనివాస్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై కేవీ రమణారెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి వ్యాపారులపై ఉక్కుపాదం
● అక్రమ సంపాదన రూ.41 లక్షల ఆస్తి ఫ్రీజ్ ● జిల్లాలో మొట్టమొదటి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కేసుజగ్గంపేట: గంజాయి కేసుల్లో కొత్త కోణం ప్రస్ఫుటమైంది. బరితెగిస్తున్న గంజాయి వ్యాపారుల ఆట కట్టించేందుకు, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు.. గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది. గంజాయి వ్యాపారులపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, అక్రమ సంపాదన అని తేలిన ఆస్తులను జగ్గంపేట సర్కిల్ పరిధిలోని గండేపల్లి మండలంలో ఫ్రీజ్ చేశారు. దీని విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.41 లక్షలు ఉంటుందంటున్నారు. జిల్లాలో ఈ తరహా కేసు మొట్టమొదటిది కావడం విశేషం. కేసుకు సంబంధించి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఈ ఏడాది మార్చి 4న 492.08 కిలోల గంజాయిని జగ్గంపేట పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి వనపర్తి బాపిరాజు, మరో ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు. ఈ క్రమంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, నిందితులు గంజాయి వ్యాపారంలో సంపాఽందించిన ఆస్తులు ఉంటే సీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా జగ్గంపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది. బాపిరాజు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో గండేపల్లి మండలం ఉప్పలపాడులో కొనుగోలు చేసిన 0.84 ఎకరాల భూమిని ఫ్రీజ్ చేశారు. ఈ ఆర్డర్ను మంగళవారం కమిషనర్, కాంపిటెంట్ అథారిటీ, చెన్నె వారు ధ్రువీకరించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. దీని విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.11 లక్షలు కాగా, మార్కెట్ విలువ రూ.41 లక్షలుగా ఉందని వివరించారు. ప్రధానంగా గంజాయి కేసుల్లో అరెస్టు కావడం, కొంతకాలం తర్వాత బెయిల్పై వచ్చి మళ్లీ అక్రమ వ్యాపారం చేయడం, లేదా జైలు శిక్ష అనుభవించి గంజాయి వ్యాపారం కొనసాగించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఇకపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి, వారి అక్రమ సంపాదన స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. -
టైండర్ వచ్చేదెప్పుడో..?
దేవస్థానంలో ఇబ్బందులుఅన్నవరం: గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏడు ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని నిర్ణయించి ఏడాదైంది. ఇంతవరకూ టెండర్లు ఖరారు కాలేదు. దీంతో అన్నవరం దేవస్థానంలో ఆరు నెలలుగా తాత్కాలికంగా ఓ సంస్థకు శానిటరీ కాంట్రాక్ట్ అప్పగించారు. ప్రతి నెలా ఏదో సమస్యతో శానిటరీ సిబ్బంది జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేయడంతో ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్తో సహా.. క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనుల నిర్వహణకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ ఖరారు కాకపోవడంతో.. అటు శానిటరీ సిబ్బందితో పాటు, దేవస్థానం ఉద్యోగులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడు దేవస్థానాల్లో.. ప్రముఖ దేవస్థానాలను ఒక యూనిట్గా శానిటరీ టెండర్లు పిలవాలని గతేడాది ఆగస్ట్ 27న కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్ల క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ఏప్రిల్లో తొలిసారిగా పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం దానిని రద్దు చేసింది. మరికొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు కొటేషన్లు దాఖలు చేయడానికి జూన్ 26 తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 23 టెండర్లు దాఖలయ్యాయి. జూలై మూడున టెక్నికల్ బిడ్లో చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి కాంట్రాక్టర్ను ఎంపిక చేయాల్సిన బాధ్యతను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత మంత్రికి అప్పగించినట్టు సమాచారం. సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఈ నెల తొలి వారంలో అన్నవరం దేవస్థానానికి వచ్చిన సందర్భంలో శానిటరీ టెండర్ విషయాన్ని ప్రస్తావించగా, మంత్రి పేషీలో ఉందని, వారం రోజుల్లో ఫైనల్ అవుతుందని చెప్పినట్టు అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటివరకూ టెండర్ ఖరారుపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.శానిటరీ కాంట్రాక్ట్ ఖరారు కాకపోవడం దేవస్థానం అధికారులకు శిరోభారంగా మారింది. ఇక్కడ శానిటరీ విధులు నిర్వహిస్తున్న కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గడువు గతేడాది నవంబర్తో ముగిసింది. దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. దీంతో శానిటరీ పనుల నిర్వహణను దేవస్థానంలోని గోశాల, గార్డెన్స్లో మేన్పవర్ సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్ దేవస్థానమే అందజేస్తోంది. ఆరు నెలలైనా టెండర్ ఖరారు కాకపోవడంతో దేవస్థానం అఽధికారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి నెలా రూ.59 లక్షల సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీనికితోడు సిబ్బంది ఈపీఎఫ్ చెల్లింపు కూడా వివాదాస్పదమైంది. జూన్, జూలై ఈపీఎఫ్ కూడా కనకదుర్గా సంస్థ చెల్లించడంతో.. తిరిగి ఆ సంస్థ ద్వారానే సిబ్బందికి జీతాలు చెల్లించారు. ఈ నెల జీతాలూ చెల్లించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం త్వరగా టెండర్ ఖరారు చేస్తే ఇబ్బందులు ఉండవని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. పెండింగ్లో దేవాలయాల శానిటరీ టెండర్ ఏప్రిల్లో ఏడు దేవస్థానాలకు నోటిఫికేషన్ వివిధ కారణాలతో రద్దు.. జూన్ 12న రీ టెండర్ టెక్నికల్ బిడ్లో రెండు సంస్థలు క్వాలిఫై రెండు నెలలు కావస్తున్నా ఖరారు కాని కాంట్రాక్ట్ -
ఆహార ఉత్పత్తులపై మిల్సి ఇండియా, ఐసీఏఆర్–నిర్కా ఒప్పందం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నూతన విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల అభివృద్ధి దిశగా జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా), హైదరాబాద్కు చెందిన మిల్సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం వెల్లడించారు. రైతు ఆదాయాన్ని పెంపొందించి, పంటలకు మెరుగైన ధరలు లభించాలంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో విలువ జోడింపు చాలా ముఖ్యమన్నారు. ఇందులో భాగంగానే ఐసీఏఆర్–నిర్కా, మిల్సి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఆయనతో పాటు, మిల్సి ఇండియా వ్యవస్థాపకుడు వజ్జరపు శ్యాంబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా పసుపు, మిర్చి, అశ్వగంధతో పాటు, చక్కెర, మైదా రహిత చిరుధాన్యాల ఆధారిత ఆహార పదార్థాలను శాసీ్త్రయంగా అభివృద్ధి చేసి, మరింత చేరువ చేయనున్నామని వారన్నారు. అధికంగా రిఫైన్ చేసిన మైదా, చక్కెరతో తయారయ్యే ఫాస్ట్ఫుడ్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు కానున్నాయన్నారు. ఈ ఒప్పందం పోషకవంతమైన, స్థిరమైన, మార్కెట్ కేంద్రిత ఉత్పత్తుల వైపు ప్రధాన ముందడుగుగా నిలిచి, రైతులు, వినియోగదారులకు లాభం చేకూరుస్తుందన్నారు. చిరుధాన్యాల ఆధారిత ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రామాణీకరించి, కో–బ్రాండింగ్ చేసి, వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి తెస్తామని డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నా మృతి
అంబాజీపేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ మేడిది రంగ జానకీప్రసాద్ (చిన్న)(55) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి ప్రధాన పంట కాలువలో మంగళవారం చిన్నా మృతదేహం తేలియాడుతుండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న స్థానిక కొర్లపాటివారిపాలెంలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి మోటార్ బైక్ అదుపుతప్పడంతో రాకుర్తివారిపాలెం వద్ద పంట కాలువలో పడి మృతిచెందినట్టు చెబుతున్నారు. తండ్రి కాలం నుంచి కొబ్బరి వ్యాపారం, టీడీపీలో క్రియాశీలక సభ్యుడిగా, స్థానికంగా ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా సేవలందించారు. వివాదరహితుడిగా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పనిచేసిన సమయంలో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షా యోజన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేరు పొందారు. కాగా చిన్నాకు భార్య పావనీరాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. చిన్నా మరణ వార్తతో కొర్లపాటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. పలువురు నాయకులు, కొబ్బరి వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు. -
పేలుడు ఘటనపై చర్యలు తీసుకోవాలి
తాళ్లరేవు: కోరింగా వన్యప్రాణి అభయారణ్యం రాతి కాలువ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ నెల 22వ తేదీన జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్లోబల్ ఫిషరీస్ రైట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు సంగాడి ధర్మారావు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో చేపలు చనిపోయాయన్నారు. చెరువులు, కాలువలు కలుషితమయ్యాయని, మడ అడవులు నాశనం కావడం వల్ల పక్షులు, ఆలివ్ రిడ్లే తాబేళ్లు వంటి అరుదైన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లుతుందన్నారు. అలాగే వేలాది మత్స్యకారుల జీవనాధారం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం పునరావృతమవుతుందని, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యవేక్షణలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మడ అడవుల పునరుద్ధరణ, సముద్ర జీవ వైవిధ్యం సంరక్షణతో సహా, 20 ఏళ్ల పర్యావరణ పర్యవేక్షణను ఓఎన్జీసీ వ్యయంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే మత్స్యకార ప్రతినిధులకు ప్రత్యక్ష వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఇది ప్రమాదం కాదని, పర్యావరణంపై జరుగుతున్న సామూహిక విధ్వంసమని వ్యాఖ్యానించారు. గోదావరి డెల్టా జీవనాధారమైన వేలాది మత్స్యకారుల భవిష్యత్తు, దేశ పర్యావరణ భద్రత అన్నీ ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత ఓఎన్జీసీ వహించాలన్నారు.గ్లోబల్ ఫిషరీస్ రైట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు ధర్మారావు -
హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
తాళ్లరేవు: మండలంలోని నీలపల్లిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానిక చెక్ పోస్టు సమీపంలోని మురళీనగర్లో పాలెపు శ్రీను(48) హత్య సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాళ్లతో కొట్టి, మట్టిలో పూడ్చి అతిదారుణంగా హతమార్చడంతో.. ప్రశాంతంగా ఉండే నీలపల్లి గ్రామంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, రెవెన్యూ సిబ్బంది సందర్శించారు. యానాం ప్రాంతానికి చెందిన మృతుడి ప్రాణ స్నేహితుడు.. సెల్ఫోన్ విషయమై శ్రీనుతో తగాదా పెట్టుకుని ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో వాస్తవాలు నిర్ధారించేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. మృతదేహానికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించినట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధనకు కృషి
రాజానగరం: నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు దృఢ సంకల్పంతో పాటు, ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అన్నారు. యూనివర్సిటీలో నిర్వహించిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సెల్ఫోన్లను విజ్ఞానాన్ని పెంపొందించడం కోసమే వాడటం శ్రేయస్కరమన్నారు. సమయ పాలన, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకుని, తల్లిదండ్రులు గర్వపడేలా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు. వీసీ డాక్టర్ యు.చలపతిరావు మాట్లాడుతూ, విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించేలా తోడ్పాటు అందించడానికి యూనివర్సిటీ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు, గైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ ఫలితాల్లో ‘శ్యామ్’కు రాష్ట్ర స్థాయి ర్యాంకులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఇటీవల వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, తమ వద్ద శిక్షణ పొందిన బి.హరీష్, బి.దిల్లేష్, వి.రమ్యశ్రీ, డి.బాలూ నాయక్, ఎం.డేనియల్కుమార్, సీహెచ్ భవాని వివిధ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. పోలీసు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న తమ సంస్థ.. డీఎస్సీ అభ్యర్థులకూ శిక్షణ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే రాష్ట్ర, జిల్లా ర్యాంకులతో అద్భుత ప్రతిభ కనబర్చిందన్నారు. స్కూలు అసిస్టెంట్(సోషల్) విభాగంలో పది మంది ఆయా జిల్లాల్లో ఫస్ట్ ర్యాంకులు, ఎస్జీటీలో 9 మంది ఆయా జిల్లాల ఫస్ట్ ర్యాంకులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇందుకు విశేష కృషి చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు సుమారు 260 మందిలో 63 మంది ఉద్యోగాలు సాధించడమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఎంపీడీఓలకు ముగిసిన శిక్షణ సామర్లకోట: క్షేత్ర స్థాయిలో ఉత్తమ సేవలు అందించడానికి ఎంపీడీఓలకు శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్ ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు నిర్వహించిన శిక్షణ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇకనుంచి ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా శిక్షణ ఉంటుందని చెప్పారు. మంగళవారం పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓలు పరిశీలించారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఎంపీడీఓలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు కె.సునీల, చక్రపాణిరావు, శర్మ, కేఆర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యసీతానగరం: పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరనే ఆందోళనతో సింగవరానికి చెందిన యువకుడు బిట్ర సూరిబాబు(24) సోమవారం కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతుడి తండ్రి బిట్ర శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ఆస్పత్రిలో సూరిబాబు వరి బీజం ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరన్న ఆందోళనతో మానసిక వేదనకు గురై, పామాయిల్ తోటకు వెళ్లి కలుపు మందు తాగిన విషయం తన పరిచయస్తులకు చెప్పాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సూరిబాబు కుటుంబ సభ్యులు అతడిని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్దనున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 5.30కు మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.రామ్కుమార్ తెలిపారు. -
● ●‘గణ’ స్వాగతానికి సిద్ధం
రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు సెంటర్లో భక్తుల రద్దీ గణపతి విగ్రహాలు పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా జరుపుకొనే వినాయక చవితికి సర్వం సిద్ధమైంది. ప్రజల పూజలందుకోవడానికి గణనాథుడు బుధవారం తరలి రానున్నాడు. ఆయనకు ఘనంగా స్వాగతంపలికేందుకు జిల్లా అంతటా ఏర్పాటు చేసిన చవితి మండపాలు కనువిందు చేస్తున్నాయి. ఆకట్టుకునే డిజైన్లు, మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో వాటిని అలంకరించారు. జిల్లాలోని గణపతి ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. పండగ సందర్భంగా మంగళవారం మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
పువ్వులు, పండ్ల ధరకు రెక్కలు
పెరవలి: వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో పూలు, పండ్ల ధరలకు రెక్కలు రావడంతో వినియోగదారులు హడలిపోతున్నారు. కాకరపర్రులోని హోల్సేల్ పూల మార్కెట్ మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులతో కళకళలాడింది. కిలో బంతి పూలు రూ.120 పలకగా చామంతి పూలు రకాన్ని బట్టి రూ.400 నుంచి రూ.600 వరకూ, కనకాంబరాలను రూ.600, మల్లెపూలు, సన్నజాజులను రూ.1500 విక్రయించారు. గులాబీలు ఒక్కొక్కటి రూ.5, చామంతి పువ్వు ఒక్కటి రూ.8 పలికింది. విడిగా మార్కెట్ మూర మల్లెపూలు, జాజులు రూ.100, కనకంబరాలు రూ.100 పలికాయి. చిల్లర వ్యాపారస్తులు ఈ ధరలను మరింత పెంచి అమ్మకాలు జరిపారు. ఇక పండ్ల రకాలలో ఆపిల్ ఒక్కటి రూ.30 నుంచి రూ.40, బత్తాయి రూ.20, నారింజ రూ.15, వెలగకాయ రూ.30, మారేడు రూ.20, మామిడి రూ.20, దానిమ్మ కాయలు రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు, పంపర పనస కాయ ఒకటి రూ.50 నుంచి రూ.80కు, కలువ పూలు రెండు రూ.10కు విక్రయించారు. పత్రి కట్ట రూ.25 నుంచి రూ.40 పలికింది. ఎగువ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి మట్టాలు ధవళేశ్వరం: ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు పెరుగుతూ ఉండడంతో బుధవారం ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 7.29 మీటర్లు, పేరూరులో 11.51, దుమ్ముగూడెంలో 8.16, కూనవరంలో 12.19, కుంటలో 5.12, పోలవరంలో 8.52, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.25 మీటర్లు, భద్రాచలంలో 26.60 అడుగుల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
వైరల్.. హడల్
సాక్షి, రాజమహేంద్రవరం: వైరల్ జ్వరాలతో ప్రజలు హడలి పోతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా విజృంభిస్తున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఎవరి గడప తొక్కినా జ్వర పీడితులు దర్శనమిస్తున్నారు. టైఫాయిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అత్యధికంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు దర్శనమిస్తున్నాయి. ప్లేట్లెట్లు పడిపోతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. తీవ్ర స్థాయిలో విష జ్వరాలు ప్రబలుతున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డెంగీ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్వహిస్తే మాత్రమే కచ్చితమైన ఫలితం అందుతుందని, ప్రైవేటుగా నిర్వహించే పరీక్షల్లో నిర్ధారణ అవుతున్న కేసుల్లో పారదర్శకత ఉండదని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి సీజనల్ జ్వరాల బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జిల్లా పరిధిలో 52 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 368 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 31 పీహెచ్సీలు, 1 సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జ్వరంతో బాధపడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ రెట్టింపవుతోంది. ప్రతి రోజూ 800 వందలకు పైగా ఓపీ నమోదవుతుంటే అందులో సింహభాగం జ్వరాల కేసులే ఉంటున్నాయి. వైద్య పరీక్షల పేరుతో.. నిడదవోలు, గోపాలపురం, సీతానగరం, కొంతమూరు, శాటిలైట్ సిటీ, కడియం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా బాధితులు వస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇవి కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, సీహెచ్సీలను వైద్యం కోసం ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన వారే కనిపిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వైద్యులు అందిన కాడికి దోచుకుంటున్నారు. వైద్య పరీక్షల పేరుతో పేదల రక్తాన్ని సైతం పిండేస్తున్నారు. గోకవరం, సీతానగరం ప్రాంతాల నుంచి మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జ్వర పీడితుల్లో అత్యధిక శాతం చిన్నారులే ఉంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలే ఉండడం బాధాకరం. ఉన్నట్లుండి ఒళ్లు వేడెక్కడం, నీరసం రావడంతో ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీలకు నిధుల కొరత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధిక శాతం గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. మంచినీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమవుతోంది. కాలం చెల్లిన పైపులైన్లనే ఇప్పటికీ వినియోగించడం, అవి కూడా పలు ప్రాంతాల్లో డ్రైనేజీల్లో ఉండటం నీటి కాలుష్యానికి కారణమవుతోంది. ఇప్పటికీ అనేక పల్లెల్లో బోర్లు, బావుల నీటినే తాగడానికి వినియోగిస్తున్నారు. ఆ నీటిని నేరుగా తాగడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. నివారణ చర్యలేవి? సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లెల్లో బావులు, బోర్లు, కుంటలు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూలనకు గంబూషియా చేపలను వదలాల్సి ఉన్నా ఎక్కడా అటువంటి దాఖలాలు లేవు. ప్రైవేటులో దోపిడీ జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు లేవు. ఈ వ్యాధిని ఎలీసా టెస్టు ద్వారానే గుర్తిస్తారు. మెడికల్ కళాశాల, జీజీహెచ్లో మాత్రమే ఈ ఎలీసా పరీక్షలు నిర్వహించేందుకు వీలుంది. కానీ ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రులు కిట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించి డెంగీ అని చెప్పి రోగుల నుంచి రూ.వేలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే వైద్యశాఖకు సమాచారం ఇవ్వాలి. వారు ఆ బాధితుడికి ఎలిసా పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తారు. కానీ ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఏ ఆస్పత్రిలో చూసినా డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారని ప్లేట్లెట్లు తగ్గాయని చెబుతూ ఫీజులు దండుకుంటున్నారు. విజృంభిస్తున్న విష జ్వరాలు రోగులతో నిండిపోతున్న ఆస్పత్రులు బాధితుల్లో చిన్నారులే అధికం గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ ప్రస్తుత సీజన్లో అత్యధిక శాతం చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు నీరసంగా, జ్వరం తగ్గినప్పుడు ఉత్సాహంగా ఉంటే వైరస్ ఫీవర్ అని గుర్తించి వైద్యులను సంప్రదించాలి. జ్వరం ఉంటే తక్షణ వైద్యంగా పారాసెట్మల్ టాబ్లెట్ మాత్రమే వాడాలి. యాంటీ బయోటిక్స్ జోలికి వెళ్లవద్దు. ద్రవ పదార్థాలు ఆహారంగా ఇవ్వాలి. కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. పతి సంవత్సరం ఫ్లూ టీకాలు వేయించాలి. – డాక్టర్ శివరామకృష్ణ, చిన్నపిల్లల వైద్య నిపుణులు మలేరియా కేసులే అధికం వాతావరణ మార్పులతో జ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జీజీహెచ్కు గోకవరం నుంచి జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారు. జ్వరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ పీవీవీ సత్యనారాయణ, జీజీహెచ్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ -
పోరాటం ఉధృతం
తక్షణం ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేయాలి. అలాగే ఐ.ఆర్ ప్రకటించి, కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల విషయంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ విషయంలో కలిసొచ్చే సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ చేపడతాం. –పి.సురేంద్రకుమార్, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ అభద్రతా భావం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి. పీఆర్సీ ఏర్పాటు, ఐ.ఆర్ ప్రకటన, డీఏల ప్రకటన విషయంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఎంతటి పోరాటానికై నా ఎస్టీయూఏసీ, ఫ్యాఫ్టో తరఫున సిద్ధంగా ఉన్నాం. –పోతంశెట్టి దొరబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, ప్రధాన కార్యదర్శి ఫ్యాఫ్టో మాట నిలుపుకోవాలి కూటమి నాయకులు ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీ నియమిస్తామని, ఐ.ఆర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ మాట ఎత్తకపోవడం బాధాకరం. దసరా కానుకగా కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. పీఆర్సీ కమిటీని నియమించి, జనవరి లోపు 12వ పీఆర్సీ అమలు చేయాలి. –పి.నరేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి బయట పడుతుంది. అది ఉద్యమ రూపం దాల్చక ముందే ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తక్షణం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి, డీఏలు ఇవ్వాలి. –ధీపాటి సురేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
భత్యం కరవు
● డీఏల ఊసెత్తని కూటమి సర్కార్ ● తీరని కలగా 12వ పీఆర్సీ ఏర్పాటు ● ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాయవరం: నేను మారిన మనిషిని.. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. వారి సంక్షేమం కోసం పాటుపడతాను.. ఈ మాటలను ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పట్టించుకోకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నిరాశ అలముకుంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తుంటే, ఉద్యోగులకు ప్రకటించాల్సిన కరవు భత్యం (డీఏ) విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినప్పటికీ కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్గా మన్మోహన్సింగ్ను నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పీఆర్సీని రద్దు చేసింది. ఆ స్థానంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా కొత్త వ్యక్తిని నియమించి, పీఆర్సీ ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయక పోవడం, ఐ.ఆర్ ప్రకటించక పోవడం, నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ ఏర్పాటు చేయాలని, ఐ.ఆర్ ప్రకటించాలని, తక్షణమే రెండు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలాగే గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించి అరియర్స్ కూడా చెల్లించాలి. సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు అనుకున్నా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 60 వేల మంది వరకూ సుమారు రూ.300 కోట్ల వరకూ డీఏ అరియర్ చెల్లించాలి. డీఏల మాటెత్తని సర్కార్ కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటించగానే అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దామాషా పద్ధతిలో ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ప్రకటించి, 2025 జూలై డీఏ ప్రకటించడానికి కేంద్ర క్యాబినెట్ మూడు శాతం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఉద్యోగులకు ప్రకటించలేదు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగు విడతలు డీఏలను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 33.67 శాతం డీఏ చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2025 జూలై డీఏతో కలిపి 58 శాతం డీఏ చేరుతుంది. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రకారంగా 12 శాతానికి 10.92 శాతం డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన డీఏల అరియర్స్ కూడా ఇవ్వాలి. 2024 మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం డీఏల ఊసెత్తడం లేదు. 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై డీఏలు ఇవ్వాలి. -
మరోసారి ఆగిన సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న నిర్మాణాల స్థల వివాదంపై మంగళవారం జిల్లా లాండ్ రికార్డులు, సర్వే శాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే మధ్యలో నిలిచిపోయింది. వివాద స్థలంలోకి దేవస్థానం ఈఓ, సిబ్బంది వెళ్లడానికి వీలు లేదని జూలై 31న పెద్దాపురం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చిందని ఆ స్థలంలో హోటల్, బోట్ షికారు నిర్వహిస్తున్న దాసరి హరగోపాల్ పెద్దాపురం ఆర్డీఓ కె.రమణికి తెలపడంతో ఆమె కోర్టు ఆర్డర్స్ ఒరిజినల్ కాపీ తమకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేను నిలిపివేశారు. ఈ స్థల వివాదంపై జాయింట్ సర్వే చేయడం ఇది ఐదోసారి. అయినా ఫలితం తేలకపోవడం విశేషం. దేవస్థానం, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ వద్దకు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కె. శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈఈ శేషగిరిరావు హాజరయ్యారు. సర్వే సగం పూర్తయ్యాక పెద్దాపురం ఆర్డీఓ కే రమణి వచ్చి సర్వేను పరిశీలించారు. అదే సమయంలో లీజుదారుడు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పడంతో సర్వే అర్ధంతరంగా నిలిపివేశారు. -
వ్యసనాలకు అలవాటు పడి చోరీలు
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ నిడదవోలు: వ్యసనాలకు అలవాటు పడిన యువకులు చోరీల బాట పట్టారు. చివరకు పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ కథనం ప్రకారం.. వివిధ జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నిడదవోలు పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన కోలా అభిషేక్ (నవీన్ కుమార్), అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన గుద్దటి రాజులను నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో సోమవారం సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు నిందితులు చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసై 2014 నుంచి మధురవాడ, వైజాగ్, పాడేరు, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవారు. మొదట తుని, కంచర్లపాలెం పోలీసులు జువైనల్ హోమ్కు పంపించారు. అనంతరం నిందితులు గణేష్, రఘు, రమణ, బాబు ద్వారా దొంగతనాలకు అలవాటు పడి మద్యానికి బానిసయ్యారు. ఇద్దరూ కలసి చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో చోరీలు చేసేవారు. తర్వాత వైన్ షాపుల తాళాలు బద్దలుకొట్టి లోపలకు చొరబడి డబ్బులు, మద్యం సీసాలు దొంగిలించేవారు. ఇవే కాకుండా ఆలయాల్లో రాత్రి సమయాల్లో తాళాలు బద్దలు కొట్టి డబ్బులు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించేవారు. వీరిపై వివిధ జిల్లాల్లో సుమారు 30 పైగా పాత కేసులు ఉన్నాయి. వివిధ కేసుల్లో అరెస్టయి మళ్లీ బయటకు వచ్చి ఈ మధ్యకాలంలో 7 దొంగతనాలకు పాల్పడ్డారు. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. పెందుర్తిలో 2, పాడేరు, వి.మాడుగుల, మండపేట, రాజానగరంలలో ఒక్కొక్కటి చొప్పున చోరీ కేసులు వీరిపై ఉన్నాయి. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ చెప్పారు. ఈ కేసులను ఛేదించిన సీఐ తిలక్, సమిశ్రగూడెం రూరల్ ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు, పట్టణ ఎస్సై జగన్మోహనరావు, సిబ్బంది జి.రామారావు, జె.రెహ్మన్, జి.సాంబయ్య, ఎన్వీ రామాంజనేయులను కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అభినందించారు. -
చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి
బిక్కవోలు: చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరొందిన బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. 1,100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో చవితి ఉత్సవాలకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీగణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున ఉంటుంది. స్వామివారికి తొండం కుడి వైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది. స్వామివారి చెవిలో తమ కోర్కెలు చెబితే తీరతాయనేది భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి దాటాక బుధవారం తెల్లవారు జామున 1.58 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.04 కలశ స్థాపన చేశారు. ఈ వచ్చే నెల 6న మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి. గతేడాది కంటే ఘనంగా.. ఆలయం చుట్టుపక్కల అంతా రేకుల షెడ్డు ఏర్పాటు చేశాం. గత ఏడాది కంటే ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ క్యూలైన్లు నిర్మించాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చవితి రోజు మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఉంటుంది. –ఎ.భాస్కర్, దేవదాయ శాఖ ఈఓ, బిక్కవోలు గ్రూప్ ఆలయాలు -
గొడవను అడ్డుకోబోతే గొంతు కోసేశాడు
రాజానగరం: ఇద్దరు వ్యక్తులు గొడవపడి, కొట్లాటకు దిగడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి ఉదంతమిది. రాజానగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ముత్యాలమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన గోళ్ల సాయి, అగత్తి సాయి అనే ఇద్దరు గొడవపడి, కొట్టుకున్నారు. గుడి వద్ద వినాయక చవితికి సంబంధించిన డెకరేషన్ పనులు చేస్తున్న నీలం లక్ష్మీప్రసాద్ దీనిని గమనించి, వారిద్దరినీ విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోళ్ల సాయి తన వద్ద ఉన్న చాకుతో అతని గొంతును కోశాడు. దీంతో రక్తపు మడుగులో పడిఉన్న లక్ష్మీప్రసాద్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై ఎస్.ప్రియకుమార్ తెలిపారు. మేల్ నర్సుపై సస్పెన్షన్ వేటు కాకినాడ క్రైం: ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న మేల్ నర్స్ మోకా సందీప్పై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సందీప్పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం సందీప్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విధులకు మద్యం తాగి రావడం, బాధ్యతాయుతమైన నర్సు విధుల్లో పనిచేస్తూ ఓ మహిళ నగ్న ఫొటోలు ఆమెకు తెలియకుండా తీయడం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, బాధితురాలిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడడం, ఆ ఫొటోలను ఆమె కుమారుడికి పంపడం తద్వారా ఆ బాలుడిని ఆత్మహత్యకు పురిగొల్పడం అంశాలు ఎఫ్ఐఆర్లో పొందుపరచడంతో అవే అంశాల ప్రాతిపదికన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడన్న సహ మేల్ నర్సుల ఫిర్యాదుతో అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఎక్కువ రోజులు సెలవులో ఉంటున్న సందీప్కు అసలు అన్నాళ్లు సెలవు ఎవరు ఇస్తున్నారు, అలాగే సందీప్కు సహాయకారిగా ఉంటూ అతడి సెలవు దరఖాస్తులను అధికారులకు ఎవరు అందిస్తున్నారనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
మోటారు సైక్లిస్ట్పైకి దూసుకెళ్లిన ఆబోతులు
చికిత్స పొందుతూ మృతి అల్లవరం: రెండు ఆబోతులు పొట్లాడుకుంటూ దారిని పోతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందిన సంఘటన అల్లవరం మండలం గుండెపూడిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గుండెపూడి పోతులవారిపేట గ్రామానికి చెందిన జంగా రామకృష్ణ (41) గురువారం రాత్రి దేవగుప్తం సెంటర్ నుంచి మోటారు సైకిల్పై పోతులవారిపేట వెళ్తుండగా గుండెపూడిలోని ఆంజనేయస్వామి వారి ఆలయాలకు సమీపంలో రోడ్డుపై రెండు ఆబోతులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో మోటారు సైకిల్పై వెళ్తున్న రామకృష్ణపైకి రెండు ఆబోతులు దూసుకువచ్చాయి. దీంతో రామకృష్ణ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. సయమానికి ఎవరూ లేకపోవడంతో రామకృష్ణపై ఆబోతులు వీరంగం సృష్టించి మరింత గాయాలు పాల్జేశాయి. కొద్ది సేపటికి రోడ్డుపై పడి ఉన్న రామకృష్ణను స్థానికులు గుర్తించి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. తీవ్ర గాయాలైన రామకృష్ణ తలకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆదివారం సాయంత్రం అతను మృతి చెందారు. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, బాబు, పాప ఉన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తుని: చోరీ కేసును తుని పోలీసులు చేధించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్ (అవంతికరెడ్డి) మూడేళ్ల కిందట తుని వచ్చి హిజ్రాలతో కలసి జీవిస్తున్నాడు. ఆడ లక్షణాలు కలిగిన సతీష్ మహిళ వేషధారణలో స్థానిక జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించేవాడు. పండగలు, జాతర్లలో నృత్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సతీష్కు ఇన్స్టాగామ్లో ప్రశాంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ తుని పట్టణం 10వ వార్డు నిమ్మకాయలవారి వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సతీష్ తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ను కోరాడు. ఆపరేషన్ చేయించుకుని పూర్తి హిజ్రాగా మారితేనే పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. దీంతో ఆపరేషన్కు రూ. 5 లక్షలు అవసరమని తెలుసుకున్న సతీష్, ప్రశాంత్లు చోరీకి వ్యూహరచన చేశారు. వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాలేపల్లి సత్యవతి అనే వృద్ధురాలిని టార్గెట్ చేశారు. ఈ నెల 20న ఆమె తన ఇంటి వెనుక భాగంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన సతీష్, ప్రశాంత్లు ఆమె కళ్లలో కారం కొట్టారు. వృద్ధురాలి మెడలో ఉన్న ఐదు గ్రాముల పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికున్న నాలుగున్నర తులాల బంగారు గాజులను తీసుకుని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ సీఐ గీతారామకృష్ణ సమగ్ర దర్యాప్తు జరిపి ఆదివారం స్థానిక రైల్వే గెస్ట్హౌస్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ గీతారామకృష్ణ, ఎస్సైలు విజయ్బాబు, పాపారావు, సిబ్బంది యాదవ్, శివయ్య, నాయుడులను డీఎస్పీ అభినందించారు. -
ఆదినాయకా... అందుకో మా పూజ
అయినవిల్లి: ఆదినాయకా.. అందుకో మా పూజ అంటూ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ముస్తాబవుతున్నాయి.. ఇప్పటికే ఉత్సవ మంటపాల ఏర్పాటుకు అన్నీ ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ప్రసిద్ధి చెందిన అయినవిల్లి సిద్ధి వినాయకుని ఆలయం చవితి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా సిద్ధమైంది. బుధవారం వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుని సన్నిధిలో వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గతేడాది కంటే అధికంగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వివిధ రంగులతో ఆలయ గోపురాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక పుష్పాలు, కొబ్బరి, అరటి ఆకులు, కూరగాయలు వంటి వాటితో ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయినవిల్లి ఎప్సై హరికోటి శాస్త్రి చెప్పారు. తొమ్మిది రోజులు.. ప్రత్యేక అభిషేకాలు వినాయక చవితి సందర్భంగా బత్తాయి, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, మామిడి వంటి వివిధ సీజనల్ పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు చేయనున్నారు. అనంతరం లక్ష గరిక పూజ, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, హారతులు తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ఉంటాయని ఏసీ వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ రోజుల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. చవితి రోజున సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల మండపంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆలయం తెరుస్తారు. మేలుకొలుపు సేవ తదితర పూజల ఆనంతరం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు నిత్య గణపతి హోమం, ఒంటి గంటకు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రసాద నివేదన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారిని మూషిక వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంచ హారతులు ఇస్తారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. అన్ని ఏర్పాట్లూ చేశాం.. అయినవిల్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. –అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ ఈఓ, అయినవిల్లి రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన ఆలయాలు, ఉత్సవ మంటపాలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకూ వేడుకలు -
కూటమిలో కుంపటి
రాజమహేంద్రవరం రూరల్: కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్న కూటమి పార్టీల డొల్లతనం బయటపడింది. పేరుకి స్నేహగీతం ఆలపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూటమి నాయకుల్లో అలుముకున్న అసంతృప్తి సహకార సొసైటీ త్రీమెన్న్కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా వెల్లడైంది. రూరల్ మండలంలో రెండురోజులుగా ఐదు సొసైటీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. వీటిని కూటమిలోని జనసేన, బీజేపీలు బహిష్కరించడం ద్వారా తమ అసంతృప్తిని వెల్లడించాయి. కడియం మండలంలో మాదిరిగానే పదవులు పొందిన కూటమిలోని నాయకులను ఆకట్టుకోవడం ద్వారా అసంతృప్తి బయట పడకుండా గట్టెక్కేద్దాం అనుకున్న టీడీపీ నాయకులకు ఇతర పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో కంగుతిన్నారు. రూరల్ మండలంలో ప్రకటించిన ఐదు సొసైటీల త్రీమెన్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవాలకు జనసేన, బీజేపీ కీలక నాయకులను ఆహ్వానించకుండా రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఒంటి చేత్తో కార్యక్రమాలను నిర్వహించేద్దాం అనుకున్నారు. కానీ బుచ్చయ్య మార్కు రాజకీయాన్ని గుర్తించిన రూరల్ జనసేన, బీజేపీ నాయకులు మొత్తం ఆ కార్యక్రమాలను బహిష్కరించి తమ పట్టుదలను ప్రదర్శించారు. తాజాగా సోమవారం జరిగిన హకుంపేట సొసైటీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కమిటీలో సభ్యుడైన జనసేనకు చెందిన సొము వినాయక్ డుమ్మా కొట్టారు. రూరల్ మండలంలో ఐదు సొసైటీల్లో తమ పార్టీ తరఫున కనీసం ఒక్క డైరెక్టర్ను నియమించకపోవడంతో బీజేపీ గోరంట్లపై తీవ్ర అసంతృప్తితో ఉంది. కూటమిగా కొనసాగుదామని నిర్ణయించుకున్నాక ప్రతి కార్యక్రమంలోను తమ నాయకులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు పట్టుబడుతున్నారు. అలా చేస్తే తన రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందన్న అనుమానంతో ఉన్న బుచ్చయ్యచౌదరి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. వాస్తవానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు తగినంత సమయం ఉన్నప్పటికీ వాళ్లను ఆహ్వానించకుండా తనదే పైచేయిగా వ్యవహరిస్తున్న బుచ్చయ్య ఒంటెత్తు పోకడలను భవిష్యత్తుల్లో సాగనీయబోమని కూటమి నేతలు అంటున్నారు. దీంతో భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఏ దిశగా సాగనున్నాయన్న చర్చ కూటమి నేతల మధ్య నడుస్తోంది. బుచ్చయ్య రాజకీయాన్ని తప్పుబడుతున్న నేతలు సొసైటీ త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించిన జనసేన, బీజేపీ -
పోలీస్ పీజీఆర్ఎస్కు 28 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 28 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆయనకు నేరుగా తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఎస్పీ నరసింహకిశోర్ అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి అర్జీలను పరిశీలించి సంబంధిత స్టేషన్ ఇన్స్పెక్టర్లతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరిధిలో వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ఉత్వర్వులిచ్చారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు ఉన్నాయి. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు పాల్గొన్నారు. యూరియా కోసం రైతుల అగచాట్లుదేవరపల్లి: ఖరీఫ్లో వరి పంటకు ప్రధానంగా వాడుతున్న యూరియా ఎరువు కొరత ఏర్పడింది. దేవరపల్లి మండలంలోని త్యాజంపూడి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు రెండు రోజులుగా పడిగాపులు పడుతున్నారు. ఆదివారం గ్రామంలోని రైతులంతా సొసైటీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో రైతుల మధ్య తోపులాటలు, నెట్టుకోవడం, కొట్లాటకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ సానుభూతి పరులు, అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఎక్కువ బస్తాలు ఇస్తున్నారని, చిన్న, సన్న కారు రైతులకు ఇవ్వడంలేదని రైతులు ఆరోపించారు. రైతులు ఆందోళనకు దిగడంతో యూరియా పంపిణీ నిలిపివేశారు. రైతుకు అరబస్తా చొప్పున సోమవారం పంపిణీ ప్రారంభించారు. యర్నగూడెం, త్యాజంపూడి సొసైటీలో అరబస్తా చొప్పున యూరియా పంపిణీ చేస్తున్నారు. త్యాజంపూడి సొసైటీలో 12.5 మెట్రిక్ టన్నులు, యర్నగూడెం సొసైటీలో 12.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు ఎకరాకు అరబస్తా చొప్పున పంపిణీ చేస్తున్నామని మండల వ్యవసాయాధికారి కె.కమల్రాజ్ తెలిపారు. రెండు రోజుల్లో మరొక 50 టన్నుల యూరియా వస్తుందన్నారు. మోతాదుకు మించి యూరియా వాడడం వల్ల కొరత ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ అధికారుల సిఫారసు ప్రకారం ఎకరాకు మొదటి దఫాగా అర బస్తా యూరియా వేయవలసి ఉంది. పొట్టదశలో రెండవ దఫాగా అర బస్తా ఎరువు వేయాలి. అక్టోబర్ 7న తెలుగు సాహిత్య సదస్సు రాజానగరం: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని వైఎన్ కళాశాలలో అక్టోబర్ 7న శ్రీతెలుగు సాహిత్యం – భాషా బోధన మనోవికాసంశ్రీ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగనుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ని సోమవారం విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్రయుగ సాహిత్యం, శతక సాహిత్యం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, జానపద, గిరిజన విజ్ఞానం, ప్రాథమిక, ఉన్నత విద్య, మాతృ భాష బోధన అంశాల పై పరిశోధన పత్రాలను సెప్టెంబర్ 25లోపు పంపించాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ పిట్టా శాంతి పాల్గొన్నారు. -
ఆసరాకు ఎసరు
చిత్రంలోని మానసిక దివ్యాంగ చిన్నారి పేరు గండ్రేటి చంద్రిక. వయసు 12 ఏళ్లు. రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నారు. మానసిక వైకల్యం 90 శాతం ఉన్నట్లు వైద్యులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. పింఛను రూ.6 వేలు అందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీ వెరిఫికేషన్లో 100 శాతం వైకల్యం ఉన్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం పింఛను ఆపేయడంతో చిన్నారి తల్లి ఆవేదన చెందుతోంది. ఒక్కసారిగా పింఛను ఎందుకు ఆపేశారంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తమకున్న ఆర్థిక భరోసా తీసేశారంటూ వాపోతోంది. ఎవరూ పని ఇవ్వడం లేదు రాజమహేంద్రవరం నగరం 17వ వార్డుకు చెందిన లద్దిక సునీత దివ్యాంగురాలు. భర్త మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో ముఖం కింది భాగం పూర్తిగా కాలిపోయింది. 2010లో 65 శాతం వైకల్యంతో పింఛను మంజూరు చేశారు. అప్పటి నుంచి పింఛను డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రస్తుతం రీ వెరిఫికేషన్లో వైకల్య శాతం 40కు తగ్గించారు. దీంతో పింఛను పోయింది. తన ఆకారాన్ని చూసి ఎవరూ పని ఇవ్వడం లేదని, వచ్చే పింఛను డబ్బుతో బతికేదాన్నని.. అది కూడా లేకుండా చేశారంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పుడు తాను ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది. -
దివ్యాంగులపై నిర్దయ
● అనర్హత పేరుతో నోటికాడ కూడును లాగేస్తున్న కూటమి సర్కారు ● వైకల్యం శాతం తగ్గించి మరీ కుట్ర ● నిర్దాక్షిణ్యంగా పింఛన్ల తొలగింపు ● తామేం తప్పు చేశామంటూ కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల నిరసన ● తమ జీవితాలపై ప్రభుత్వం దెబ్బ కొట్టిందంటూ మండిపాటు సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్ఐ: దివ్యాంగులపై కూటమి సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. వారికి ఆర్థిక ఆసరాను అందకుండా చేస్తోంది. పూర్తిగా మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. నాడు ఉన్న అర్హత నేడు ఎక్కడికి వెళ్లిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఏ ఆధారం లేని తమకు ఆర్థిక ఆధారం లేకుండా చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా ఏవైనా ఉంటే వాళ్లతో తేల్చుకోవాలే తప్ప.. దివ్యాంగులను టార్గెట్ చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని, వైకల్యం తక్కువగా ఉందన్న నోటీసులు వెనక్కు తీసుకోవాలని దివ్యాంగులు కోరుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ సీతారామమూర్తికి అందించారు. దివ్యాంగుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, రూరల్ మండల అధ్యక్షుడు చాపల రాజా మద్దతు తెలిపారు. జిల్లాలో 3,211 పింఛన్ల తొలగింపు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల మేరకు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైలక్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అంటించారు. దివ్యాంగులపై ఇంత దారుణమా? కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై ఇంత కక్ష గడుతుందని అనుకోలేదు. పింఛన్లు తగ్గించుకునేందుకు ఏ ఆధారంలేని దివ్యాంగులపై కుట్ర చేయడం దారుణం. అంగ వైకల్య శాతం తగ్గించి మరీ పింఛన్లు తీసేయడాన్ని బట్టిచూస్తే దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది. అంగ వైకల్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ.. ఇప్పుడు తగ్గిపోయిందని అనడం దారుణం. ఉన్న ఆర్థిక ఆసరాను లాగేస్తే తామెలా బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. – సబ్బెళ్ల దుర్గావిజయరెడ్డి, వికలాంగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పింఛన్లు తగ్గించేందుకు కుట్ర కూటమి ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామంటున్న ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణం. 4 లక్షల పింఛన్లకు కోత వేసేందుకు దివ్యాంగులపై ప్రతాపం చూపుతున్నారు. వాళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరని వారిని టార్గెట్ చేశారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలి. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
కదం తొక్కిన విద్యార్థులు
● గెంటివేసిన పోలీసులు ● సమస్యల పరిష్కారం కోసం వస్తే గెంటేస్తారా అని ఆందోళన ● ప్రభుత్వ తీరుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): విద్యార్థులు సమస్యలు చెప్పుకుందామని కలెక్టరేట్కు వస్తే పోలీసులు అడుగడుగునా జులుం చూపించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్ ప్రాంగణం బయట తమ డిమాండ్లను నేరవేర్చాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అక్కడ ఉన్న విద్యార్థులను గెంటివేశారు. విద్యార్థులకు, పోలీసులకు మధ్య కొంత ఘర్ణణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులను పక్కకు లాగివేయడంతో విద్యార్ధులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకపక్క విద్యార్ధులు, మరో వైపు పోలీసుల అరుపులు, కేకలతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సుమారు 1,000 మంది విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. న్యాయమైన తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం వస్తే పోలీసులతో నెట్టివేయడం ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ఆవేదన చెందారు. విద్యార్థి సంఘ నాయకులను చొక్కా పట్టుకొని లాగడమే కాకుండా దూరంగా లాక్కెళ్లిపోయారు. ప్రభుత్వ కళాశాలలో ఫీజులు చెల్లించాలని హకుం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండానే ముందస్తుగానే ఫీజులు కట్టమని వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందారు. ప్రభుత్వం ఫీజు సొమ్ము తమ బ్యాంకు ఖాతాలకు వేయకుండానే ముందస్తుగా ప్రభుత్వ కళాశాలలో కట్టమని చెప్పటం దారుణమని వాపోయారు. తక్షణమే ముందస్తుగా ఫీజు కట్టించుకోవటం ఆపాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలి కూటమి పాలనలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కలెక్టరేట్ వధ్ద విద్యార్థులు నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు జమ అయ్యేదని, దానితో వారి చదువులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాయన్నారు. కాని నేడు కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లపైకి రావాలసి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి తక్షణం విద్యార్థుల డిమాండ్లను నేరవేర్చాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు పాల్గొన్నారు. పరిష్కారానికి డీఆర్ఓ హామీ డీఆర్ఓ సీతారామమూర్తి విద్యార్థుల దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రశాంతికి తెలియజేస్తామని, కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు కె.జ్యోతిర్మయి, కనక, వాసు, సాహితి, నాగ చైతన్య, సురేష్ పాల్గొన్నారు. డిమాండ్లు ఇవీ.. పెండింగులో ఉన్న 6,400 కోట్ల ఫీజురీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టల్స్కి సొంత భవనాలు నిర్మించాలని, హాస్టల్ మరమ్మతులకు నిధులు కేటాయించాలని, మెస్ చార్జీలు రూ.3,000కి పెంచాలని, జీ.ఓ నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగంపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కొవ్వూరు డిగ్రీ కళాశాలకు నిధులు కేటాయించాలని, ఆదికవి నన్నయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్సు డిపార్ట్మెంట్లో అధ్యాపకులు లేరని, తక్షణం వారిని నియమించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.భాస్కర్, ఎన్.రాజా డిమాండ్ చేశారు. -
పరీక్ష నిర్వహించకుండానే వైకల్య శాతం తగ్గింపు
ధవళేశ్వరం గ్రామానికి చెందిన యాదంరెడ్డి కొండలరావు మానసిక దివ్యాంగుడు. 2007 సంవత్సరంలో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో 50 శాతం మానసిక వైకల్యంతో ఉన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి దివ్యాంగుల కోటాలో పింఛను పొందుతున్నారు. టీడీపీ గత ప్రభుత్వంలో పదేళ్లు ఇదే వైకల్య శాతంతో పింఛను వచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సైతం పింఛను అందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రీ వెరిఫికేషన్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే 25 శాతం వైకల్యం ఉన్నట్లు రాసేశారని ఆయన బంధువు ఆవేదన చెందుతున్నారు. ఏ ఆర్థిక ఆధారం లేని తమకు తిరిగి పింఛను పునరుద్ధరించాలని కోరింది. -
ఆనంద తాండ్రవం
● ఏడాది పొడవునా తాండ్ర తయారీ ● జిల్లాలో 17 పరిశ్రమల్లో కూలీలకు ఉపాధి ● వివిధ జిల్లాలకు సరకు ఎగుమతి కాకినాడ రూరల్: తాండ్ర తినవయ్యా... ఆనందించవయ్యా అన్నట్లు మామిడి తాండ్రకు కాకినాడ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా తాండ్రను తయారు చేయడం విశేషం. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకూ లొట్టలేసుకుని తింటుంటారు. మామిడి కాయలుగా ఉన్నప్పుడు ఆవకాయ, ఊరగాయగా.. పండ్ల రసంతో తాండ్ర రుచిని ఏడాది పొడవునా ఆస్వాదిస్తున్నారు. తియ్యదనాన్ని పంచే తాండ్ర తయారీలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి తాండ్రను ఇతర రాష్ట్రాల ప్రజలు లొట్టలేసుకుని తినేలా ప్రాచుర్యం పొందింది. స్థానికంగా పండే మామిడితో పాటు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ఎండల వేళ పనులు లేని సమయంలో కుటీర పరిశ్రమగా నిలుస్తున్న ఈ తయారీ ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో పండూరు, సర్పవరం, తమ్మవరం గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. సర్పవరంలో సుమారు ఎనిమిది దశాబ్దాల కిందట ప్రారంభమైన దినదిన ప్రవర్థమానంగా మారింది. కాకినాడ రూరల్తో పాటు చేబ్రోలు, చిన్నయ్యపాలెం, ధర్మవరం, జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిసాల తదితర గ్రామాలకూ ఈ వ్యాపారం విస్తరించింది. జిల్లా సుమారు 17 చోట్ల ఏడాది పొడవునా తాండ్ర తయారు చేస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్లో తయారీ ఉంది. వేసవిలో మొదలై ఏడాది పొడవునా కూలీలకు పనులు కల్పిస్తున్నారు. మన ప్రాంతంలో పండే మామిడి కాయలతో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, ఖమ్మం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లారీల్లో భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా సీజనల్గా జిల్లాకు 80 వేల టన్నులకు పైబడి మామిడి దిగుమతి అవుతుందని అంచనా. వేసవిలోనే తాండ్ర తయారీతో సరిపెట్టుకోకుండా, ఏడాదికి సరిపడే మామిడి జ్యూస్ను తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా డిమాండ్కు అనుగుణంగా తాండ్ర తయారు చేస్తున్నారు. వేసవిలో ఏటా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ సీజనల్లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ తయారయ్యే తాండ్రను ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఏటా సుమారు 50 వేల నుంచి 70 వేల టన్నుల వరకూ ఎగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన ధరలతో జోష్ ఈ ఏడాది వేసవిలో మామిడి ధరలు తగ్గాయి. తాండ్ర తయారీలో కలెక్టర్ రకం మామిడిని వినియోగిస్తారు. గత ఏడాది టన్ను ధర రూ.20 వేల వరకూ పలకగా ఈ ఏడాది అఽత్యధికంగా రూ.13 వేలు పలికింది. సీజన్ ముగింపు దశలో ఽమామిడి ధరలు పతనమవ్వడంతో టన్ను కాయలు రూ.6 వేలకు రావడంతో తాండ్ర తయారీదారులు జ్యూస్ నిల్వలు పెంచుకోగలిగారు. అందుకే ఈ ఏడాది వ్యాపారం బాగుందని అంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు సీజనల్గా లభ్యమయ్యే మామిడి పండ్ల రసంతో తయారు చేసే తాండ్ర ఏడాది పొడవునా లభ్యమవుతోంది. దాదాపు 20 గ్రాముల తాండ్రలో 67 కేలరీలు పోషకాలు, 0.3 గ్రాముల ప్రోటీన్లు, 0.1 గ్రాముల కొవ్వు, 17.5 గ్రాముల కార్బో హైడ్రైట్లు ఉంటాయి. ఇందులో ఉన్న విజమిన్– ఏ శరీర ఆరోగ్యంతో పాటు కంటిచూపునకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. విటమిన్ – సీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, వ్యాధుల నుంచి రక్షణకు దోహదపడుతుంది. తాండ్రలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో శరీర కణాలకు మేలు చేయడమే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీజు పదార్థాలు పేగుల కదలికల క్రమబ ద్ధీకరణకు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ తీసుకోవడమే మేలు. అధికంగా తింటే దంత క్షయం, ఊబకాయం సమస్యలు రావొచ్చు. -
ఎందరికో ఉపాధి
ఏటా సీజనల్గా లభ్యమయ్యే మామిడి కాయలను కొనుగోలు చేసి తాండ్ర తయారీకి వినియోగిస్తున్నాం. ఏడాదికి సరిపడేలా జ్యూస్ నిల్వ ఉంచుకుంటున్నాం. ఒక్కో పరిశ్రమలో వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.900 వరకు, ఆడవారికి రూ.600 వరకూ కూలి ఇస్తున్నాం. తాండ్ర ధర ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.100 వరకూ ఉంది. తాండ్ర తయారీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – వలవల వెంకటేశ్వరరావు, తాండ్ర తయారీదారుడు, పండూరు -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కోరుకొండ: కాపవరంలోని ఓ ఇంట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కోరుకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపవరంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు. అక్కడ ఆసియా–బెల్జియం క్రికెట్ లీగ్ మ్యాచ్కు బెట్టింగ్ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు నిర్ధారించారు. ఇందులో నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ. 8.40 లక్షలు, 8 మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో కోరుకొండకు చెందిన గోసంశెట్టి వీరప్రసాద్, కావరానికి చెందిన జాజుల బాలచక్రం, గోవరం మండలం అచ్యుతాపురానికి చెందిన నల్లాల లక్ష్మీనరసయ్య, గుమ్మళ్లదొడ్డికి చెందిన కొణతాల నానాజీలను అరెస్ట్ చేశామని అన్నారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన రాకేశ్తో పాటు మరో ఏడుగురు నిందితులను అరెస్టు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్టు పేర్కొన్నారు. అపరిచితులకు ఇళ్లు అద్దెకివ్వొద్దని, వారి ద్వారా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని హెచ్చరించారు. బెట్టింగ్లు, పేకాట, అసాంఘిక కార్యకలాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన కోరుకొండ సీఐ సత్యకిషోర్, పోలీస్ స్టేషన్ ఎస్సై కేవీ నాగార్జున, రైటర్ వాసంశెట్టి శ్రీను, కానిస్టేబుల్ వరప్రసాద్, సీతానగరం కానిస్టేబుల్ రమేష్, సీఐ కార్యాలయ కానిస్టేబుల్ గోవిందు, గోకవరం పోలీస్ స్టేషన్ హోంగార్డు సతీష్లను అభినందించారు. ఎస్సైలు డి.రామ్కుమార్, బి.అంజలి పాల్గొన్నారు. నీట్లో మెరిసిన ముత్యం తొలి ప్రయత్నంలోనే యామిని ప్రతిభ పెద్దాపురం: నీట్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన మాసా యామిని సౌమ్యశ్రీ ప్రతిభ చాటింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ప్రయత్నంలోనే ఆమెకు సీటు దక్కింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఆదివారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఈ మేరకు ఆమె ఉచిత సీటును దక్కించుకుంది. యామిని డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్య కొనసాగించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఐఐటీ నీట్ అకాడమీలో ఆమె ఇంటర్తో పాటు ప్రత్యేక శిక్షణ పొందింది. తండ్రి మాసా చంద్రరావు పారా లీగల్ అడ్వయిజర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. యామిని తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.● రూ.8.40 లక్షల స్వాధీనం ● నిందితుల అరెస్ట్ -
రక్తం చిందిన రహదారులు
● వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి ● ఆయా గ్రామాల్లో విషాదం గోపాలపురం / రాజానగరం/ ఉప్పలగుప్తం/ శంఖవరం: రహదారులు రక్తమోడాయి.. అనుకోని ప్రమాదాలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం మండలం సాగిపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామానికి చెందిన ముప్పిడి నరేష్ (26) బైక్పై అతని స్నేహితుడు నున్న బాలుతో గోపాలపురం మండలం గుడ్డిగూడెం తన చెల్లి ఇంటికి వచ్చి వేరే పనిపై సాగిపాడు వెళ్లారు. తిరిగి వస్తుండగా సాగిపాడు మలుపు వద్ద గోపాలపురం నుంచి సాగిపాడు వెళుతున్న వ్యాన్ బలంగా ఢీకొంది. దీంతో ముప్పిడి నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన నున్న బాలును 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. రాజానగరంలో మహిళ.. జాతీయ రహదారిపై రాజానగరం వైఎస్సార్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన అనిశెట్టి లత (39) మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్ సమీపంలో నివాసం ఉంటున్న లత రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చింది. పై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బైకు ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త అనిశెట్టి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రొయ్యల వ్యాన్ ఢీకొని.. రొయ్యల వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వానపల్లిపాలేనికి చెందిన కోలా వీర రాఘవులు (75) ఉప్పలగుప్తం నుంచి వానపల్లిపాలెం సైకిల్పై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యల వ్యాన్ వానపల్లిపాలెం వైపు వెళ్తూ వీర రాఘవులకు తగిలింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై వివరించారు. కత్తిపూడిలో మరొకరు.. కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన మోతే సూరిబాబు (40) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. తాటిపర్తి నుంచి పాట్నా బొగ్గు లోడు లారీలో క్లీనర్గా వెళ్తుండగా కత్తిపూడి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద పని నిమిత్తం సూరిబాబు లారీ దిగాడు. పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం అడిషినల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
అల్లవరం: బోడసకుర్రు బ్రిడ్జి వద్ద్ద దారి తెలియకుండా ఇబ్బంది పడుతున్న పదేళ్ల బాలుడు మల్లిపూడి చిరును వారి తల్లిదండ్రులకు ఆదివారం సాయంత్రం అప్పగించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న మల్లిపూడి ఏసులక్ష్మి పాలకొల్లు వెళ్లింది. తల్లి పాలకొల్లు వెళ్లిన తర్వాత చిరు, తల్లి వద్దకు పాలుకొల్లు వెళ్లాలని బయలుదేరి కొమానపల్లి నుంచి బోడసకుర్రు వరకూ తన సైకిల్పై వచ్చాడు. బోడసకుర్రు బ్రిడ్జి వరకూ వచ్చే సరికి దారి తెలియక ఇబ్బంది పడుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో అల్లవరం పోలీసులు స్పందించి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. బాలుడి నుంచి మరింత సమాచారం సేకరించిన పోలీసులు ముమ్మిడివరంలోని చిరు తల్లిదండ్రులు ఏసులక్ష్మి, సతీష్లకు సమాచారం అందించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత చిరుని అప్పగించామని అన్నారు. -
బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం రూరల్: కాకినాడలో జరిగిన ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అండర్– 19 అమరావతి చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి బ్యాడ్మింటన్ బాలుర సింగిల్స్ విభాగంలో విన్నర్గా మలికిపురానికి చెందిన నందకిశోర్, రన్నర్గా కృష్ణకార్తీక్, డబుల్స్ బాలుర విభాగంలో విన్నర్గా అమలాపురానికి చెందిన బి.ఆదిత్యరామ్, రన్నర్గా మలికిపురానికి చెందిన వై.గౌతమ్కుమార్, బాలికల డబుల్స్ విభాగంలో రన్నర్గా ఎం.రమ్య, రిత్విక నిలిచారు. డబుల్స్ విభాగంలో విజేతలు ఆదిత్యరామ్, గౌతమ్కుమార్లు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కాకినాడ డీఎస్ఓ శ్రీనివాస్, జాతీయ అంపైర్ పాయసం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బీవీవీఎస్ఎన్ మూర్తి ఆదివారం అభినందించారు. -
మరిడమ్మ ఆలయానికి భక్తుల రద్దీ
పెద్దాపురం: కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గత నెల ఆషాఢ మాస జాతర ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. మళ్లీ దాతల సహకారంతో ఈ వారం నుంచి అన్నదానం ప్రారంభించామన్నారు. వకుళమాత అన్నదాన భవనానికి విరాళాలుకొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఆదివారం ఏలూరుకు చెందిన ఇరగవరపు వీఎంఆర్టీ రాజు, వెంకటసుష్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,10,116, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన డేగల రాంబాబు, కోమల దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116 అందజేశారు. దాతలకు దేవస్థానం సిబ్బంది స్వామివారి చిత్రపటాలను అందజేశారు. -
సైక్లింగ్తో ఆరోగ్యం
కాకినాడ రూరల్: పోలీసులు ఆరోగ్యంగా ఉండేందుకు సైక్లింగ్తో పాటు యోగా, స్కిప్పింగ్, జుంబ డ్యాన్స్ వంటివి చేయాలని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు అన్నారు. బెటాలియన్ సిబ్బందితో కలసి సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమం ఆదివారం ఉదయం చేపట్టారు. బెటాలియన్ నుంచి మొదలుకుని సర్పవరం జంక్షన్ వరకూ సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు బెటాలియన్ సిబ్బందితో కలసి సైక్లింగ్ నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో ఒత్తిడిని నివారించేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఆదివారం సైక్లింగ్, యోగా కార్యక్రమాలు చేపడతామన్నారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మోహనరావు, ఆర్ఐలు అజయ్కుమార్, విఠలేశ్వరరావు, మురళీమోహన్, రాము, మరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ల నిరసన
గోపాలపురం: ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టారంటూ గోపాలపురం ఫ్రెండ్స్ ఆటో యూనియన్ సభ్యులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత లేదా అని యూనియన్ అధ్యక్షుడు కోయ సురేష్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజులుగా ఆటోలు కదలక నానా అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా రూ.15 వేలు అందించి ఆటో డ్రైవర్లను ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాహనమిత్ర నగదు జమ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టడం ఎంత వరకూ సమంజసం అని అన్నారు. ఇప్పటికై నా ఆటో డ్రైవర్ల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆదుకోకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని నాలుగు ఆటో యూనియన్ల సభ్యులు పాల్గొన్నారు. -
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
● అందుబాటులో లేని యూరియా ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణు రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అవసరమైన యూరియా అందుబాటులో లేకుండా చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు హామీలు ఆకాశమే హద్దుగా ఇస్తారని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు మొదటి సంవత్సరం ఎత్తివేసి రెండో సంవత్సరం నుంచి ఇస్తున్నారని, 18 సంవత్సరాల నుంచి 59సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని, దానిని పీ 4పథకంలో కలిపామని చెబుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పెద్ద మోసమన్నారు. పెద్దాపురం సభలో చంద్రబాబు రైతుల గురించి ఏమైనా మాట్లాడతారని అనుకుంటే వారి ఊసేలేదన్నారు. రైతు ప్రీమి యం కట్టకుండానే క్రాఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత మాజీ సీఎం జగన్ది అన్నారు. కూటమి ఎమ్మెల్యేల ఆగడాలు, మంత్రి రాసలీలల గురించి, వారి అవినీతి అక్రమాలు, ఇసుక, మట్టి మాఫియాలపై టీడీపీ నాయకులే టీవీ చర్చల్లో బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు. కూటమి నాయకుల అఘాయిత్యాలు చూసి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ప్రభు త్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించడంతో పాటు, ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుకున్న వారికి వైఎస్సార్ ఆసరా కింద ఖర్చులకు నగదు ఇచ్చేవారన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సె ప్స్ తీసుకువచ్చి వైఎస్ జగన్ ప్రజలందరికి వైద్యసేవలందించారని చెప్పారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలన్నీ చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. దేశంలో అత్యధిక ధనవంతుడైన, అత్యధిక క్రిమినల్ కేసుల్లో ఉన్న రాజకీయ నాయకుడు చంద్రబాబు అని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని చెప్పిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇప్పుడు కేంద్రప్రభుత్వంతో ఎందుకు లాలూచీ పడ్డారన్నారు. అంటే అధికారంలో వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాలు, తాకట్టు పెట్టి మీరు ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. చంద్రబాబు శ్రీసన్శ్రీక్షేమం కోసమే పాకులాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలను గాలికొదిలేశారని వేణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన రూ.రెండు లక్షల కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చే యాల ని డిమాండ్ చేశారు. ఋషికొండలో రూ.400 కోట్లతో అత్యాధునిక భవనాలు నిర్మిస్తే వాటిపై దుష్ప్రచారం చేశారని అన్నారు. ల్యాండ్టైటిల్ యాక్ట్పై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఆ యాక్ట్ను అమలు చేసిన రెవెన్యూ అధికారులు అవార్డులు తీసుకుంటున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు(బాబు), పార్టీ దివ్యాంగులసెల్ జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, జిల్లా కార్యదర్శి ముద్దాల అను, పార్టీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు కొత్తపల్లి శివాజీ, పార్టీ నగర కార్యదర్శి పడమటి కామరాజు పాల్గొన్నారు. -
కార్పొరేటుకు సలామ్
● పుట్టుగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు ● అనుమతులు పదుల్లో.. నిర్వహణ వందల్లో ● ఇదే బాటలో ప్రైమరీ, హైస్కూళ్ల నిర్వహణ ● నోటీసులు జారీకే విద్యాశాఖ పరిమితం ● ఆమ్యామ్యాలతో చర్యలు తీసుకోని అధికారులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే రీతిలో వ్యవహరిస్తూ తల్లిదండ్రుల ఆశలను చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. జిల్లాలో కిండర్ గార్డెన్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి ఫీజులను అమాంతంగా పెంచేసి దోచుకుంటున్నారు. అనుమతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా వీరు చెలరేగిపోతున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ప్రభుత్వ 1285, ప్రైవేట్ పాఠశాలలు 573 ఉన్నాయి. ఇందులో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిని నర్సరీ నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మరోవైపు కిండర్ గార్డెన్ పేరుతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నిర్వహిస్తున్న స్కూళ్లు ప్రభుత్వ అనుమతిని విధిగా పొందాల్సి ఉంది. అయితే ఎలాంటి పర్మిషన్లను పొందకుండానే జిల్లాలో 200 వరకూ ఉండగా ఒక్క కాకినాడ నగరంలోనే 50 స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పేరెంట్స్ అసోసియేషన్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రయోజనం లేదు కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనుమతులు పొందాల్సిందే.. నగరంలో అనుమతుల్లేకుండా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలకు నోటీసులను జారీ చేస్తున్నాం. నూతన విద్యా పాలసీ ప్రకారం కిండర్ గార్డెన్కు అనుమతులు పొందాల్సిందే. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ జిల్లా పట్టని విద్యాశాఖాధికారులు అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు చేపట్టకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి, అర్బన్ అధికారులు కనీసం ఏక్కడా తనిఖీ చేపట్టిన సందర్భాలు లేవని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అనుమతి లేని పాఠశాలలపై కలెక్టర్ ఉక్కు పాదం మోపాలని పలువురు కోరుతున్నారు. -
మౌలిక సదుపాయాలపై దృష్టి
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్లో రుడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు. 3,156 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ప్లాన్రూపొందించవలసి ఉండగా ప్రస్తుతం 1,005 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. పుష్కర యాత్రికుల కోసం రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ఘాట్ల అభివృద్ధి, రహదారులు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రుడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, సెక్రటరీ ఎం.వి.ఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా రాయవరం: 2025 డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం నిర్వహించేందుకు గొల్లప్రోలు మండలం ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికోసం 25 టీమ్లకు శిక్షణ ఇచ్చింది. ఆదివారం రాత్రి వరకూ అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్కు సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన సమాచారం వస్తుందని ఎదురు చూశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడినట్లు విద్యాశాఖ అధికారుల నుంచి సమాచారం వచ్చింది. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ పి.గన్నవరం: అపర అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ వారి జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ తీస్తున్నట్టు గౌరీ బ్రదర్స్ మీడియా బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఎల్.గన్నవరంలో ఆదివారం షూటింగ్ జరిపారు. రెండు రోజులపాటు ఎల్.గన్నవరం, అయోధ్యలంక ల్లో షూటింగ్ జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. ఈ డాక్యుమెంటరీకి శ్రీఅన్నపూర్ణ తల్లి బువ్వమ్మశ్రీగా నామకరణం చేసినట్టు వారు వివరించా రు. ఈ డాక్యుమెంటరీకి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా సిరాజ్, ఖాదర్, నటీనటులుగా సముద్ర, సిలికా తనేజా, ఆదిల్, రమేష్, కు సుమ, కెమెరా ఆర్యసాయి కృష్ణ, సంగీతం సాకేత్వేణి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా పి.శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిఽధిలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకస్వాములు పూజలు చేసి రథ సేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
శాంతించినది
● ధవళేశ్వరం వద్ద మరింత తగ్గిన నీటి ఉధృతి ● ఈ వరదల సీజన్లో ఇప్పటివరకు 1,547 టీఎంసీల మిగులు జలాలు కడలి పాలు ధవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చి ఉరకలెత్తిన గోదారమ్మ శాంతించింది. ఆదివారం నీటి ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం నీటి మట్టం 8.90 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 4,75,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు సంబంధించి 14,100 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,600, మధ్య డెల్టాకు 2,500, పశ్చిమ డెల్టాకు 7,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లోనూ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో సోమవారం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 7.72 మీటర్లు, పేరూరులో 12.44 మీటర్లు, దుమ్ముగూడెంలో 9.35 మీటర్లు, భద్రాచలంలో 32.30 అడుగులు, కూనవరంలో 14.58 మీటర్లు, కుంటలో 6మీటర్లు, పోలవరంలో 10.41 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.80 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. 1,547 టీఎంసీల మిగులు జలాలు కడలి పాలు ఈ ఏడాది వరదల సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఆదివారం వరకు 1,547టీఎంసీల మిగులు జలాలు కడలి పాలయ్యాయి. ఈ నెల 21వ తేదీన కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి గోదావరి ప్రవాహం చేరింది. దీంతో ఈ నెల 21న మొదటి ప్రమాద హెచ్చరికను, 22వ తేదీన రెండవ ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లాయి. దీంతో కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మూడు రోజులపాటు గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహించింది. ఈ నెల 22వ తేదీన 117 టీఎంసీల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఈ సీజన్లో ఇదే అత్యధికం. డెల్టా కాలువలకు మినహాయించి ఇప్పటివరకు 1,547 టీఎంసీల నీరు కడలిలో కలిసింది. సెప్టెంబర్ నెలలో కూడా గోదావరికి వరదలు సంభవించే అవకాశం ఉన్న దృష్ట్యా మిగులు జలాలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
వేద సారమే రామ నామం
● శ్రీమద్రామాయణ పారిజాత ప్రసూనాలు పుస్తకావిష్కరణ ● అర్ష విజ్ఞాన పరిషత్తు నగర శాఖ ప్రారంభం సీటీఆర్ఐ: వేద సారమే రామ నామమని సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణమూర్తి అన్నారు. వారణాసి సుబ్రహ్మణ్యం రచించిన శ్రీశ్రీమద్రామాయణ పారిజాత ప్రసూనాలుశ్రీ పుస్తకావిష్కరణ సభ స్థానిక కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల స్వాతంత్య్ర సమరయోధుల పార్కు భవనంలో ఆదివారం ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పలువురు సాహితీ ప్రియులు విచ్చేసిన ఈ సభకు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి స్వాగత వచనాలు పలికారు. సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణమూర్తి గ్రంథాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతి దేశిరెడ్డి బలరామనాయుడు కొనుగోలు చేశారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బులుసు వేంకట సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ వేద విద్య చేత తెలుసుకోతగిన పరమ పురుషుడే శ్రీరాముడన్నారు. వేదాలు అందరికీ గ్రాహ్యం కావని, రామాయణం ద్వారా వేద ధర్మాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చునని అన్నారు. కుటుంబంలో కొడుకుగా, భర్తగ, భార్యగా, తండ్రిగా, తల్లిగా, సోదరుడిగా ఎలా ఉండాలో రామాయణం మనకు చెబుతుందన్నారు. పద్యకవి, తెలుగు పండితుడు డాక్టర్ డి.నీలకంఠరావు పుస్తక సమీక్ష చేస్తూ మానవుడికి దిశా నిర్దేశం చేసే కరదీపికగా, వ్యక్తిత్వ వికాసం బోధించేదిగా ఈ పుస్తకాన్ని అభివర్ణించారు. విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ టి.జయప్రద స్పందన తెలియజేస్తూ, విలువలు పడిపోతున్న నేటి సమాజానికి ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతో ఉందన్నారు. ఎస్కేవీటీ కాలేజీ లెక్చరర్ విశాలాక్షి మాట్లాడుతూ రామాయణం అంటే రాముడి ప్రయాణం అన్నారు. ప్రతి ఇంట్లో తమ పిల్లలకు రామాయణ, మహాభారతాల కథలను తల్లిదండ్రులు విధిగా చెప్పాలన్నారు. రచయిత వారణాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రామాయణం ఎంత ప్రాచీనమో అంత ఆధునికమన్నారు. వర్తమాన సమాజంలోని అనేక సమస్యలకు సమాధానాలు రామాయణంలోలభిస్తాయని అన్నారు. నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, ధర్మసూరి మాట్లాడారు. వారణాసి సుబ్రహ్మణ్యంను పలువురు సత్కరించారు. ఆర్షవిజ్ఞాన పరిషత్తు నగర శాఖను సంస్థ ప్రతినిధి ధర్మసూరి ఏర్పాటు చేశారు. -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: శ్రావణ మాసంలోని ఆఖరి శనివారం కావడంతో అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అనేక మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 8,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. టంగుటూరి పోరాటం అందరికీ ఆదర్శం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం, ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం టంగుటూరి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ టంగుటూరి నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ.. నేటి తరానికి మార్గదర్శకమన్నారు. మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ అధికారులను ఎదిరించి, తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, ఏఓ అలీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ యువతకు డ్రైవింగ్ శిక్షణ రాజానగరం: భారీ వాహనాల డ్రైవింగ్పై షెడ్యూల్ కులాల యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ జేఏ ఝాన్సీ అన్నారు. అభ్యర్థులకు 20 ఏళ్లు పైబడి వయసు, లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. జిల్లాలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి, వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. దీని కోసం ఈ నెల 27వ తేదీ లోపు ఎస్సీ కార్పొరేషన్, కాకినాడకు దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 76719 49476 నంబర్ను సంప్రదించాలని కోరారు. జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులు అనపర్తి: జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులను సర్వే ద్వారా గుర్తించినట్లు జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకట్రావురెడ్డి తెలిపారు. అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మండ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం వలంటీర్లకు అక్షరాస్యతపై శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా వెంకట్రావురెడ్డి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో 79,528 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్య లు చేపట్టామన్నారు. ఇందుకోసం 7,950 మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న తరగతులు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అప్పటి నుంచి 2026 మార్చి వరకు 100 గంటల పాటు నిరక్షరాస్యుల ఖాళీ సమయాన్ని బట్టి తరగతులు నిర్వహిస్తామన్నారు. -
నిలకడగా గోదావరి
ధవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చి నాలుగు రోజులుగా పరవళ్లు తొక్కిన గోదారమ్మ శాంతించింది. శనివారం తెల్లవారుజామున కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7 గంటలకు 11.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 8 గంటలకు 11.50 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుంచి 9,83,312 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13,400 క్యూసెక్కులు వదిలారు. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి మట్టాలు మరింత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదివారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. -
ఎవరో అతగాడు!
● కలకలం రేపిన సీఐ వ్యవహారం ● ఎక్కడ చూసినా ఇదే చర్చ ● ఇప్పటికే ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు నివేదికలు ● సీఐకి అండగా ఇద్దరు ఉన్నతాధికారులు ● బయటకు వస్తున్న అవినీతి కథలు సాక్షి, టాస్క్పోర్స్: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో పని చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్రమ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఆ సీఐ అడ్డగోలు తీరుపై ఇటీవల సాక్షి పత్రికలో శ్రీఆ సర్కిల్ సెపరేటుశ్రీ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. పోలీసు శాఖలో ఎవరి నోట విన్నా.. ఎవరా సీఐ ? అంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా, సదరు వ్యక్తిపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న పోలీసు శాఖలో ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. అతడు పనిచేసిన ప్రతి చోటా అవినీతి పనులు చేస్తూనే ఉంటాడని, అందుకు జిల్లాలో బలమైన ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించి, తను పనులను యథేచ్ఛగా చేసుకుంటాడని చెబుతున్నారు. ఆ సీఐపై వచ్చిన కథనం నిజమని ఇప్పటికే ఇంటిలిజెన్స్, ఎస్బీ అధికారులు నివేదికలు సమర్పించారని చెప్పుకుంటున్నారు. సిబ్బందికి ఇబ్బందులు ఆయన ఇలాకాలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా పోలీస్ స్టేషన్లో ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి, ఎవరు రైటర్గా ఉండాలి, ఎక్కడ పనిచేయాలని, ఎవరికి డ్యూటీ వేయాలనేది స్థానిక ఎస్సై చూసుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకూ అన్ని డ్యూటీలను ఈ సీఐ వేస్తారు. ఇప్పటికే ఈయన పనితీరు నచ్చక ముగ్గురు ఎస్సైలు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లిపోయారు. అనేక అక్రమాలు సీఐ అవినీతి బాగోతం బయట పడిన తర్వాత అనేక కొత్త అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిని హైదరాబాద్లో అరెస్టు చేసి, అతడి వద్ద లక్షల్లో సొమ్ములు బలవంతంగా దండుకున్నారని ఆరోపణ వచ్చింది. ఇటీవల ఒక మండలంలో భారీగా బంగారం చోరీ జరిగితే, రికవరీ కేసులో అన్ని తానై నడిపించి, బంగారం సైడ్ చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై బాధితుడు ఒక ప్రజాప్రతినిధితో సీఐకి ఫోన్ చేయించినా పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. రిసార్టుల్లోనే కాకుండా అన్ని మండలాల్లోని లాడ్జిల్లో గదులు వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. ఇటువంటి అవినీతి అధికారికి రాజకీయంగా, శాఖాపరంగా అండదండలు ఉన్నాయని గుసగుసలాడుకుంటున్నారు. -
బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలి
● కూటమి మోసాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు రాజమహేంద్రవరం రూరల్: అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. ఆయన శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శులకు పలు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించినా, పార్టీ సదరు వ్యక్తులతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కనీసం రైతులకు యూరియా సరఫరా కూడా చేసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తాడాల విష్ణుచక్రవర్తి, దాసి వెంకట్రావు, కందుల శ్రీనాథ్, పటాన్ ఆన్సర్ బాషా, జుట్టా ఏడుకొండలు, కోర్ల ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
కర్యాట్ టైమ్
మూషికాల బెడదను నివారిస్తాం ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి పంట పొలాల్లో ఎలుకల బెడద అధికంగా ఉందని గుర్తించాం. అందులో భాగంగా మూషికాల బెడదను నివారించి రైతులకు స్వాంతన చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలుకల ఉధృతిని నివారించేందుకు బ్రోమోడయోలిన్ మందును రైతులకు సరఫరా చేయబోతున్నాం. అలాగే ఎలుకల నిర్మూలనకు పూర్వ సంప్రదాయ రీతికి అనుగుణంగా ఎలుకల కన్నాల్లో పొగను నింపి నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయ సహాయ సంచాలకుడు, ఆలమూరు ఆలమూరు: ఎలక చిన్నదే.. సాగులో తెచ్చే నష్టం మాత్రం పెద్దది. అసలే ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ సమస్య ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరి పంటపై మూషికాల దాడి అధికమైంది. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క ప్రతికూల పరిస్థితులు, ఇంకోపక్క ముషికాల బెడద కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే పంట చేతి కొచ్చే సమయానికి మరింత నష్టాన్ని చేకూర్చుతాయని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంకా బ్రోమోడయోలిన్ మందును పంపిణీ చేయకపోవడంతో రైతులను మనోవేదనకు గురిచేస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.40 లక్షల మంది రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. అందులో సుమారు 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టగా, మిగిలిన పొలాల్లో సాధారణ పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో రైతులు అధిక విస్తీర్ణంలో స్వర్ణ (ఎంటీయూ 1318), తక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 7,029, విత్తనాల కోసం బొండాలు (ఎంటీయూ 3,626), పీఆర్ 126, ఎంటీయూ 1121 రకాన్ని సాగు చేస్తున్నారు. ఇంకా స్పందించక.. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఏటా బ్రోమోడయోలిన్్ మందును నూకలు, నూనె మిశ్రమంతో కలిపి రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పంట పొలాల్లో మూషికాల బెడద ఎక్కువై పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంట పొలాల్లో ఎలుకలు తినేదాని కన్నా దాదాపు పది రెట్లు పంటను పాడుచేసే అవకాశం ఉంది. దీంతో పిలుక దశలోనే ఎలుకలను నిర్మూలిస్తే చిరు పొట్ట దశకు చేరుకునే సరికి వరి పంటకు సంబంధించి నష్ట నివారణకు దోహదపడుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ స్పందించి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందును త్వరితగతిన పంపిణీ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదో అదనపు ఖర్చు పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకలను సంప్రదాయ పద్ధతిలో పట్టించేందుకు అఽధిక ఖర్చు అవుతుంది. చిలుకలు పండ్లను కొరికి పడేసినట్టు ఎలుకలు వరి దుబ్బులను కొరకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వరి పంటను పూర్తి స్థాయిలో రక్షించాలనుకునేందుకు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బుట్టల సహాయంతో, పొగపెట్టే విధానంతో ఎలుకలను మట్టుబెట్టే చర్యలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరం భూమిలో సరాసరి సుమారు 50 ఎలుకలకు పైగా పట్టివేత జరుగుతుండగా, ఒక్కొక్క ఎలుకకు కార్మికులు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు ఎలుకల నివారణకే రూ.మూడు వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టేవారికి అదే స్థాయిలో డిమాండ్ కూడా ఉంది. సామూహిక నివారణ సాధ్యమేనా! వ్యవసాయ శాఖ ఏటా పంపిణీ చేసే బ్రోమోడయోలిన్ మందు సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టడం ద్వారా పంట పొలాల్లో అధిక భాగం ఎలుకలను నిర్మూలించేందుకు అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యవసాయ శాఽఖ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే బ్రోమోడయోలిన్ మందును ఇంకా పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో సామూహిక ఎలుకల నివారణ సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫ పంటలపై ఎలక్కొట్టుడు ఫ పిలక దశలో పంట ధ్వంసం ఫ నివారణకు అధికారుల చర్యలు శూన్యం ఫ ఆందోళనలో అన్నదాతలు -
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. అంటూ ముందుకు సాగారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. వివిధ సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ సేవల ద్వారా ఈ ఒక్కరోజు సాయంత్రం 4 గంటల వరకూ దేవస్థానానికి రూ.55,60,552 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది.ఫ మార్మోగిన వాడపల్లి క్షేత్రం ఫ ఒక్కరోజే రూ.55.60 లక్షల ఆదాయం -
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కూచిపూడి బుల్లారావు(71) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకోవడానికి బైక్పై వెళ్తున్న సర్పంచ్ కూచిపూడి బుల్లారావును ఎదురుగా వస్తున్న క్వారీ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. బుల్లారావు తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సర్పంచ్ బుల్లారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సమగ్ర మార్పులతో కొత్త బార్ విధానం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా కొత్త బార్ విధానం తీసుకు వచ్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్శర్మ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కొత్త బార్ పాలసీ, నవోదయం 2.0 పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవ్శర్మ మాట్లాడుతూ ఈ పాలసీ బార్ లైసెన్సుల మంజూరులో ఆన్లైన్ విధానం, ఎంపిక ప్రక్రియలో సమానత్వం పాటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా, దీనిలో ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇందులో భాగంగా 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని అన్నారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ఇక ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి బార్లు కేటాయిస్తారని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా సారా వ్యాపారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మూడు కన్నా ఎక్కువ సారా కేసుల్లో ఉన్నవారిపై పీడీ యాక్ట్ విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎకై ్సజ్ అధికారులు తమ తమ కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సీనియర్ అధికారులతో రాత్రిపూట గస్తీ చేయాలని ఆదేశించారు. సారా వినియోగంతో అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాల్లో విస్తృత దాడులు చేపట్టి సారా రహిత జిల్లాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళీ, అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ జిల్లా అధికారులు చింతాడ లావణ్య, ఎస్కేవీడీ ప్రసాద్, ఏఈఎస్లు నాగరాహుల్, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి పాత గుడితో పాటు కొత్త గుడి వద్ద సందడి నెలకొంది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ,భూ సమేత బాలబాలాజీ స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,18,346 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. నిత్య అన్నదానానికి రూ.58,120 విరాళాలు అందించారన్నారు. స్వామివారిని 1,500 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. వెయ్యి మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. వరద నీటిలో వ్యక్తి మృతదేహం రాజోలు: స్థానిక వశిష్టా నదీ తీరానికి వరద నీటిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం (60) కొట్టుకువచ్చింది. ఇక్కడి కాటన్ పార్కు వద్ద చెట్ల పొదల్లో చిక్కుకుంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరివేసుకుని యువకుడి మృతి పెరవలి: ఉసులుమర్రులో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెరవలి ఎస్ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. నరసాపురం గ్రామానికి చెందిన బొర్రా తరుణ్ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, అమ్మమ్మ ఊరైన ఉసులమర్రుకు ఈ నెల 21న వచ్చాడు. ఏమైందో ఏమో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరివేసుకున్నాడని, పోస్టుమా ర్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. అతని మేనమామ బొరుసు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. గ్రామీణ క్రీడా పోటీలు కాకినాడ క్రైం: కాకినాడలోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరం ఆరంభమైంది. ఐడియల్ కళాఽశాల మైదానంలో ఈషా గ్రామోత్సవంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. 120 మందితో కూడిన 20 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. హోరాహోరీ పోరులో నాలుగు జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. పోటీలు ఆదివారంతో ఫైనల్స్కు చేరుకుంటాయి. ఆదివారం మహిళల త్రోబాల్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
నిరాశతో వెను తిరిగిన భక్తులు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రద్దు చేసిన విషయం తెలియక ఆలయానికి వచ్చిన అనేకమంది మహిళా భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మినహా మిగిలిన అన్ని శుక్రవారాలలోను 15 ఏళ్లుగా పంచారామ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాల్గవ శుక్రవారాల్లో మాత్రమే పంచారామ క్షేత్రం సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని అనేకమంది మహిళలు చివరి వారంలోను సామూహిక వ్రతాలు జరుగుతాయని భావించి ఆలయానికి తరలి వచ్చారు. వ్రతాలు నిర్వహించడం లేదని తెలిసి మహిళలు నిరాశతో వెనుతిరిగి వెళ్లి పొయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రైవేటుగా వ్రతాలను నిర్వహించుకున్నారు. -
వరలక్ష్మీ నమోస్తుతే..
● రత్నగిరిపై ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ● పాల్గొన్న 9,680 మంది మహి ళ లుఅన్నవరం : నిత్యం సత్యదేవుని నామజపంతో మార్మోగే రత్నగిరి శ్రావణమాసం ఐదో శుక్రవారం మాత్రం వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామ జపంతో మార్మోగింది. దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంతో బాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలు, వాయవ్య, నైరుతి వ్రత మండపాలలో ఈ వ్రతాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బ్యాచ్లలో 9,680 మంది మహిళలు ఈ వ్రతాలు ఆచరించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిట లాడింది. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వేదిక మీద ప్రతిష్ఠించిన వరలక్ష్మీ అమ్మవారికి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజలు చేసి హారతి ఇచ్చారు. కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మీ వ్రతకథను పాలంకి పట్టాభిరామ్మూర్తి చదివి వినిపించారు. హాజరైన మహిళలకు ఉచితంగా జాకెట్టుముక్క, సత్యదేవుని ప్రసాదం, అమ్మవారి రాగిరూపు, చేతికి కట్టుకునే తోరం అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో వీరికి భోజన సౌకర్యం కలుగజేశారు. మహిళలు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సి వచ్చింది. దాంతో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని వ్రతాల ఆఫీసులోకి తరలించి తోటి మహిళలు సపర్యలు చేశారు. అధికారులు రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించి ఉంటే గంటల తరబడి మహిళలు వేచియుండే అవసరం ఉండేది.ప్రత్యేక అలంకరణలో వరలక్ష్మీ అమ్మవారు -
క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య
● ఐదుగురు యువకుల ఘాతుకం ● వీడిన కేసు మిస్టరీ ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని కై లాసభూమి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ధవళేశ్వరానికి చెందిన సతీష్ కుమార్ది హత్యగా తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సతీష్ కుమార్ క్షమాపణలు చెప్పలేదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేపాడి సతీష్ కుమార్ (22) రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో మూడేళ్లుగా సమోసాలు అమ్ముతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో టీవీ ఎక్కువగా సౌండ్ పెట్టుకుని చూస్తుండగా తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ నెల 15న కై లాస భూమి వెనుక శవమై కనిపించాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ శివ గణేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిందిలా.. వేపాడి సతీష్ కుమార్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున తోటి స్నేహితులైన ఆల్కాట్ గార్డెన్స్కు చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీ పేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్య తేజతో కలిసి మద్యం తాగడానికి గోదావరి గట్టు దిగువనున్న కై లాస భూమి శ్మశానం లోపలకు వెళ్లాడు. వారిలో భాగ్ రాధాకాంత్ భార్యపై ముందు రోజు రాత్రి వారు కలిసిన సమయంలో సతీష్ కుమార్ చులకనగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్ను వారందరూ అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో పాటు మళ్లీ ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం తాగి ఉన్న ఐదుగురూ కోపంతో సతీష్ కుమార్పై దాడి చేశారు. నమ్మి సూర్యతేజ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సతీష్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భాగ్ రాధాకాంత్ ఆ తర్వాత అతడి పీక మీద కాలు వేసి.. మృతి చెందే వరకు గట్టిగా తొక్కాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి గోడ అవతల పారవేసి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి టీషర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే ● అమల్లోకి పాస్ విధానం ● రూ.3 వేలతో పొందే అవకాశం ● ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఐ.పోలవరం: జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ (చార్జీ) చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు, ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోల్ కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్నిచోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ట్రిప్పుకు (టోల్గేటు) ఇరువైపులా కలిపి రూ.90 నుంచి 200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాస్ విధానం తీసువచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి, తిరిగి వెనక్కి వస్తే ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క. దేశవ్యాప్తంగా 1,150 టోల్ గేట్లు గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా, ఆ తరువాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకూ తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 1,150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద, 216 ఏ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్గేట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఎన్హెచ్ 216పై గొల్లప్రోలు వద్ద, ఎన్హెచ్ 16పై కృష్ణవరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు, నల్లజర్ల వద్ద టోల్గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా, వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీప్లకు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. అయితే ఉత్తరాదిన కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలపై కూడా ఇది వర్తించదని తాజాగా ఎన్హెచ్ ప్రకటించింది. డిజిటల్ రూపంలోనూ.. ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.మూడు వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ.3 వేలు చెల్లించిన తర్వాత, ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్కు లింక్ అవుతుంది. ఈ పాస్ ఒక ఏడాది కాలం, లేదా 200 ట్రిప్పులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దేని గడువు ముందు అయినా ఇక పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.ఉపయోగాలు ఇవే కేంద్ర రవాణా, ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్ గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడ, రావులపాలెం మీదుగా సొంత కారులో వెళ్లి వస్తే, ఇప్పుడున్న టోల్ చార్జీలను బట్టి నాలుగు టోల్ గేట్ల వద్ద దాదాపు రూ.565 వరకు చెల్లించాలి. కానీ వార్షిక ఫాస్టాగ్ కొన్నవారికి కేవలం రూ.120 మాత్రమే అవుతుంది. అదే అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు కాకినాడ, కత్తిపూడి మీదుగా వెళ్లేవారు రూ.500 వరకూ చార్జి కట్టాలి. ఇక నుంచి అది రూ.120కి తగ్గిపోతుంది. ఏడాది ఫాస్టాగ్ వల్ల సొంత కార్లు, వ్యాన్లు, జీపులు ఉన్న వారికి టోల్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుంది. -
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ఎస్పీ నరసింహకిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వినాయక చవితి వేడుకలపై పోలీసుశాఖ షరతులతో కూడిన నిబంధనలు జారీ చేసింది. మండపంలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన నాటి నుంచి నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలివీ... ● గణేష్ మండపాలు, పందిర్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా అనుమతి పొందాలి. పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు, పందిరి, మండపాలు ఏర్పాట్లు చేయరాదు. ● విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టంలను ఉపయోగించరాదు. ● సాధారణ సౌండ్ బాక్స్లు మాత్రమే అనుమతించబడతాయి. మైక్ పర్మిషన్కు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. విగ్రహాల ఎత్తు 5 అడుగులు మించరాదు. ● ఈనెల 23వ తేదీలోగా మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసువాలి. ● 27వ తేదీలోగా వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలి. 11 రోజుల తరువాత నిమజ్జనాలు అనుమతించరు. ● పబ్లిక్ ప్రదేశాలలో మండపం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు స్థలం యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్కి, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకూడదు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు ఎలక్ట్రికల్ షాక్ లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి ఈ విధంగా పొందాలి నిర్వాహకులు గణేష్ఉత్సవ్.నెట్ వెబ్సైట్లోకి వెళ్లి న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. వెరికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా , కమిటీ పేరు, గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు. ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. గణేష్ నిమజ్జనం తేది, సమయం, వాహన వివరాలు ఎంటర్ చేయాలి. దీని ఆధారంగా పోలీసులు వచ్చి మండపం ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తారు. అనుమతి వచ్చిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను మండపంలో ప్రదర్శించాలి. తనిఖీ అధికారులు వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ను పరిశీలిస్తారు. -
ముగిసిన గిరిజన ప్రాచీన విజ్ఞాన సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ – భవిషత్ తరాలకు చేర్చడం’ అనే అంశం పై రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. ఇథోఫియా, ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధకులతోపాటు వివిధ అంశాలపై 65 మంది పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. వీటి నుంచి ఉత్తమ పరిశోధనలుగా ఎంపిక చేసిన 40 పరిశోధన పత్రాలతో ఒక పుస్తకాన్ని ముద్రించదలచామన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో కన్వీనర్లు డాక్టర్ ఎం. గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు పాల్గొన్నారు. -
మునిసిపాలిటీలలో పనితీరు మెరుగుపరచాలి
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రధాన పనితీరు సూచికల అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగర పాలక కార్యాలయంలో కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ పి. ప్రశాంతి సమక్షంలో అధికారులతో కేపీఐ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతీ ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ సహాయంతో భక్తుల రద్దీని పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందని, అందుకే గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేసేలా ప్రతిపాదనలు, డీపీఆర్ అందచేయాలన్నారు. నగరంలో ఉన్న 1.12 లక్షల గృహాలకు అసెస్మెంట్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. మెరుగైన విధానంలో నీటి సరఫరా వినియోగం ఉందని, నీటి కనెక్షన్లు 100శాతం ఆన్లైన్లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ 99.42 శాతం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం పెంచాలని, టాక్స్ కలెక్షన్, ఆటో మ్యూటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ పాల్గొన్నారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ -
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● గుడ్డిగూడెంలో ఘటన గోపాలపురం: ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే. గుడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు శుక్రవారం వరినాట్లకు వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్పై వస్తుండగా గుడ్డిగూడెం వద్ద గల కొవ్వాడ కాలువలోకి ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుగ్గనబోయిన పద్మ (42) అక్కడికక్కడే మృతి చెందగా, సుగ్గనబోయిన తాయారు, కత్తవ నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. స్వల్ప గాయాలైన అడ్డ పోశమ్మ, అడబాల వెంకటలక్ష్మి, సిరిగినీడి రామలక్ష్మి, కత్తవ అచ్చమ్మలకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు. సంఘటనా స్థలాన్ని దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల (హెచ్డబ్ల్యూఓ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూవోల పనితీరును మెరుగుపరుచుకునేందుకు నూతన విధానం తీసుకువచ్చిందన్నారు. విధి నిర్వహణలను విభజించి ప్రతి దానికి కొన్ని మార్కులు కేటాయించిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాల్లో 244 మంది నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచా లకులు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డీసీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్
కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి, ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్, నగర నాయకులు సత్యం, ఆదర్శ్ కార్త్తిక్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా నల్ల బెల్లం స్వాధీనం
● ఇద్దరిపై కేసు నమోదు ● వ్యాన్ డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులుప్రత్తిపాడు: అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్లబెల్లాన్ని జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద గురువారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వ్యాన్ డ్రైవర్ను అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి వివరాల మేరకు, ఏలేశ్వరం మండలం యర్రవరం వద్ద జాతీయ రహదారిపై ఎకై ్సజ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి నల్లబెల్లం లోడుతో యర్రవరం వస్తున్న వ్యాన్ను తనిఖీ చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా నల్లబెల్లం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మనం నాగరాజును అరెస్టు చేసి, వ్యాన్తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి శిలపరశెట్టి వెంకటరమణ అలియాస్ వెంకన్నబాబుపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్, ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నోోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాశాలల్లో గతేడాది సుమారు 32 వేల సీట్లు భర్తీ అయ్యాయి. కోనసీమ జిల్లా విషయానికొస్తే.. రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఆలమూరుల్లో డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒకేషనల్ కోర్సుల్లో సుమారు 2,800 వరకు సీట్ల భర్తీకి అవకాశముంది. షెడ్యూల్ విద్యార్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్/సీఏసీ/ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టవిటీస్/ఎన్సీసీ/గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్లు ఆయా యూనివర్సిటీల్లో ప్రాంతాల వారీగా నిర్వహిస్తారు. కోర్సులను ఎంపిక చేసుకోవడం కోసం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్ల మార్పునకు ఈ నెల 29న అవకాశం కల్పించారు. ఈ నెల 31న సీట్ల అలాట్మెంట్, వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడే డిగ్రీ కోర్సులు జాతీయ విద్యా విధానం–2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి 2023 నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక కళాశాలల్లోనే నాలుగేళ్ల డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. మెజార్టీ కళాశాలల్లో మాత్రం మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. నాలుగేళ్ల కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే ఉంటుంది. దీనిని సింగిల్ మేజర్ డిగ్రీ కోర్సులుగా పిలుస్తారు. ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్ సబ్జెక్టుగా ఎంచుకుంటాడు. ఇంటర్లో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా, ఏ సబ్జెక్టునైనా మైనర్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. డిగ్రీ ఫస్టియర్ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్ కోర్సు అని ధ్రువపత్రం ఇస్తారు. రెండేళ్లయితే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్లయితే డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్ సర్టిఫికెట్ను అందజేస్తారు. డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా మధ్యలో చదువు మానేసే వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు అందజేస్తారు. ఫస్టియర్ నుంచి నాలుగేళ్ల లోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్ల లోపు తిరిగి ప్రవేశం పొంది, విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్ మేజర్ ఆనర్స్ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతుంది. డిగ్రీ కళాశాలలుజిల్లా ప్రభుత్వ ప్రైవేట్ అటానమస్ కోనసీమ 07 45 01 తూర్పుగోదావరి 06 40 01 కాకినాడ 05 46 03 సీట్ల కేటాయింపు ఇలా.. గతంలో డిగ్రీ అడ్మిషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వారీగా నిర్వహించే వారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్మీడియెట్లో కామర్స్ ఓ సబ్జెక్టుగా చదివిన వారికి మొత్తం బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. అలాగే ఆర్ట్స్, హ్యుమానిటీస్లో ఇంటర్ పూర్తి చేసిన వారికి మొత్తం బీఏ సీట్లలో 50 శాతం, తక్కిన 50 శాతం ఇంటర్లో సైన్స్ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ(అక్ను) పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ సాధారణ కోర్సులతో పాటు, కంప్యూటర్, మార్కెట్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు aprche.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకు, కంప్యూటర్ కోర్సులకు రూ.8–రూ.10 వేల వరకు ఫీజు ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో, అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకునే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యధికంగా ఎంపికవుతున్నారు. – డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం అత్యున్నత ప్రమాణాలతో.. నాడు–నేడు పథకం ద్వారా డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలల్లో తరగతి విద్యా బోధన జరుగుతుంది. అన్ని కళాశాలల్లో జవహర్ నాలెడ్జ్ సెంటర్, ప్లేస్మెంట్ సెల్స్ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కేపీ రాజు, ప్రిన్సిపాల్, వీకేవీ డిగ్రీ కళాశాల, కొత్తపేట, కోనసీమ జిల్లా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వారీగా సీట్ల కేటాయింపు ఆన్లైన్లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్కు 26వ తేదీ తుది గడువు వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం -
క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించాలి
అమలాపురం టౌన్: క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి నిర్థారణ, నివారణ సామర్థ్యాలు బలోపేతమవుతాయని డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర అన్నారు. జిల్లావ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్వో మాట్లాడారు. గురువారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ అసంక్రిత వ్యాధుల (ఎన్సీడీ) గుర్తింపుపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతుల నోడల్ ఆఫీసర్ తిరుమలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమలత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ అనూష శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించారు. కాన్సర్ కారకాలు, ప్రాథమిక దశ లో గుర్తించడం వంటి అంశాలను వివరించారు. -
సత్యదేవుని దర్శించిన మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
అన్నవరం: వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కుటుంబ సమేతంగా గురువారం రత్నగిరిలో సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. తొలుత రోజా దంపతులు, కల్యాణి దంపతులు సత్యదేవుని వ్రతాలాచరించారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలో దర్శించి, పూజలు చేశారు. వారికి వేద పండితులు వేదాశీస్సులు అందజేయగా, సత్యదేవుని ప్రసాదాలను ప్రొటోకాల్ గుమస్తా గణపతి అందజేశారు. వారి వెంట పార్టీ నాయకుడు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వాసిరెడ్డి జగన్నాథం(జమీలు) ఉన్నారు. కాగా, స్వామివారి ఆలయానికి దర్శనం కోసం వచ్చినందున మీడియాతో మాట్లాడేందుకు రోజా, కల్యాణి ఇష్టపడలేదు. -
గిరిజన విజ్ఞాన పరిరక్షణ అవసరం
● నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆచార్య ప్రసన్నశ్రీ సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు రాజానగరం: భావితరాలకు గిరిజన విజ్ఞానాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ, భవిషత్ తరాలకు చేర్చడం అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. గతాన్ని కాపాడుకోవడం ద్వారా భవిషత్తును శక్తిమంతంగా మార్చుకోవచ్చన్నారు. సమకాలీన సమాజంలో గిరిజన విజ్ఞాన వ్యవస్థలపై దృష్టి సారించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. శతాబ్దాలుగా సంస్కృతి, భాష, జ్ఞానాన్ని కలిగి ఉన్న గోదావరి తీరాన నిర్వహిస్తున్న ఈ సదస్సు గిరిజన నాగరికత గుర్తింపునకు పునాదిగా తోడ్పడుతుందన్నారు. గిరిజన సంస్కృతి, విజ్ఞాన సంపదను డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (న్యూఢిల్లీ) ముద్రించిన గిరిజన సమరయోధులు, గిరిజన హక్కుల చిత్రపటాలను ఆంధ్ర వనవాసి కల్యాణాశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వీసీ ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు, కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో–కన్వీనర్లు డాక్టర్ ఎం.గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకృష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు, కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు కపిలేశ్వరపురం (మండపేట): ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు హెచ్చరించారు. మండపేటలో గురువారం ఆలమూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు కేవీఎస్ చౌదరి, మండల వ్యవసాయాధికారి కె.ప్రభాకర్తో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. మండపేటలోని లక్ష్మీఅపూర్వ ఏజెన్సీస్ గౌడౌన్లోని నిల్వలు, రికార్డులను తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. షాపుల ద్వారా ప్రతి బస్తాను ఈ–పాస్ ద్వారా విక్రయించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన రైతుకు కచ్చితంగా బిల్లు అందజేయాలన్నారు. ఎరువు విక్రయించిన సమయానికి, బిల్లు అందజేసిన సమయానికి పొంతన లేని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల విస్తరణాధికారి బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఉన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
తొట్టెలో కూర్చున్న కూలీ మృతి గోకవరం: తిరుమలాయపాలెం–రంపయర్రంపాలెం గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పవన్కుమార్ వివరాల మేరకు, తిరుమలాయపాలెంలో ఇటుకల లోడు దింపిన ట్రాక్టర్ ఐదుగురు కూలీలతో రంపయర్రంపాలెం వైపు బయలుదేరింది. డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్తంభం విరిగి ట్రాక్టర్ తొట్టైపె పడటంతో, తొట్టెలో ఉన్న కూలీ కోరుకొండ మండలం కాపవరానికి చెందిన కొట్టాల శివ(36) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పవన్కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కళాకారుడి మృతి అన్నవరం: జాతీయ రహదారిపై స్థానిక మండపం జంక్షన్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దాపురానికి చెందిన సంగీత కళాకారుడు ఎన్.ఆదినారాయణ(60) మృతి చెందారు. తేటగుంట తిమ్మాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో మోటార్ బైక్పై పెద్దాపురం వెళుతున్నారు. మండపం సెంటర్ వద్ద వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు
కోరుకొండ: వినాయక చవితి ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ చెంచురెడ్డి అన్నారు. కోరుకొండలోని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కార్యాలయంలో గురువారం కోరుకొండ, రాజానగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఉత్సవాలు నిర్వహించకూడదన్నారు. వివాదాస్పద ప్రాంతాలు, వివాదాలకు కారకులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్సవ కమిటీల్లో డీజేలు నిర్వహించే వారిని బైండోవర్ చేయాలన్నారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేయనున్న కోరుకొండ దేవుని కోనేరు, శ్రీరంగపట్నంలోని చెరువులను పరిశీలించారు. సీఐ సత్య కిశోర్ మాట్లాడుతూ విగ్రహాలకు అనుమతులు తీసుకున్న తర్వాత మండలాల్లోని అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రాజానగరం సీఐ ప్రసన్న వీరగౌడ, కోరుకొండ ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించి, మొదటి నెలలో 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో గల నన్నయ సంచార భవనం కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తక్కువ రీచార్జి ప్లాన్లతో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీలో కూడా టవర్స్ అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామన్నారు. సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ, శైలజ, ఏజీఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ పాల్గొన్నారు. వరి పొలాల్లో డ్రోన్తో కషాయాల పిచికారీ పెరవలి: ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను ఆశించే తెగుళ్లను అరికట్టడానికి డ్రోన్ సాయంతో కషాయాలను పిచికారీ చేయిస్తున్నామని జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం పెరవలిలో వరిచేలపై డ్రోన్తో కషాయాల పిచికారీని అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 45 వేల ఎకరాల్లో, పెరవలి మండలంలో 800 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకోసం 30 డ్రోన్లను వినియోగిస్తామని, ఒక ఎకరానికి పిచికారీ చేసినందుకు రూ.300, కషాయాలకు రూ.200 చొప్పున రూ.500 తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ప్రతి వరిదుబ్బుపై మందు పిచికారీ జరుగుతుందన్నారు. వేపగింజల పొడి, ఇంగువ, చేపబెల్లం ద్రావణాన్ని పిచికారీ చేయటం వలన కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చన్నారు. బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వావిలాల కషాయాలను జీవామృతంతో కలిపి చల్లడం వల్ల ఎటువంటి తెగుళ్లనైనా అరికట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మోడల్ మేకర్ ఉమా మహేశ్వరరావు, స్వాతిముత్యం, దీప్తి, మనోరంజని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి
● అన్ని వర్గాల ప్రజలకూ అవస్థలే ● తల్లికి వందనంలో కోత, నాడు–నేడు పనుల నిలిపివేత ● శాసనమండలి విపక్ష నేత బొత్స ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, పరిపాలనను పూర్తిగా విస్మరించిందని శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉంటోందన్నారు. తమది మంచి ప్రభుత్వమని అధికార పార్టీ పెద్దలు, నేతలు అనుకోవడం తప్ప, రాష్ట్రంలో సంతృప్తికరమైన పాలన అందడం లేదన్నారు. రైతులను మోసం చేసిన కూటమి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో రైతు భరోసా తీసుకున్న రైతుల సంఖ్యను ఇప్పుడు సుమారు 80 వేల మందికి తగ్గించారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందలేదన్నారు. మరో 8 లక్షల మందికి ‘తల్లికి వందనం’ పథకం నిధులు అరకొరగా అందించారన్నారు. అదేమని ప్రశ్నిస్తే కేంద్రం నుంచి డబ్బులు రావాలని చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.1.50 లక్షల కోట్ల అప్పు నుంచి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ పథకంలో దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు వారాలవుతున్నా కూలీల వేతనాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చారన్న కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు–నేడు పనులు, ఇంగ్లిష్ మీడియం చదువును నిలిపివేశారన్నారు. రేషన్ బియ్యంపై చర్యలేవీ? పీడీఎస్ బియ్యం విషయంలో ఎవరి మీదనైనా చర్యలు తీసుకున్నారా అని బొత్స ప్రశ్నించారు. విశాఖపట్నం వెళ్లి గోదాములు సీజ్ చేయాలని మంత్రి ప్రకటిస్తారని, రెండు రోజుల తర్వాత కాదంటారన్నారు. సింగపూర్కు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని, అక్కడున్న కంపెనీలతోనే ఒప్పందం కోసమన్నారు. అమరావతి వర్షాలకు మునిగిపోయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే జనసేన మహాసభలో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అధికార ప్రతినిధి మార్గాని భరత్, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు, యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జ్ సాదిక్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కార్యదర్శి ముద్దాల అను, నాయకులు చెల్లుబోయిన నరేన్ పాల్గొన్నారు. -
బాబూయ్ రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు. అది ప్రజలైనా, పార్టీ కోసం పనిచేసే నాయకులైనా, అందరినీ ఒకే గాటన కడతారు. ఎన్నికల్లో సేవలను వినియోగించుకుని గద్దెనెక్కాక కాలదన్నేయడంలో బాబును మించిన నాయకుడు లేడంటారు. అది అక్షరాలా నిజమని కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) తాజా ఎపిసోడ్తో స్పష్టమైంది. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు వర్గం కాలా శ్రీనివాస్ను, వైరి వర్గం నుంచి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్(బాబి) వర్గం కాకరపల్లి చలపతిరావును తెరమీదకు తీసుకు రావడంతో బుధవారం పార్టీ పరిశీలకులు నల్లమిల్లి వీర్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి సమక్షంలోనే కుమ్ములాడుకున్నాయి. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నిక చివరకు రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీ మండల కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం కటకంశెట్టి బాబి వర్గం సీల్డ్ కవర్ రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని సత్తిబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్ అయిన తనను, తన భార్యను ఇంతలా అవమానించడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో సత్తిబాబు పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తమకు, అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం దెబ్బతిని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా గౌరవం దక్కకపోవడంతో పదవిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సత్తిబాబు వెల్లడించారు. సత్తిబాబును బుజ్జగించేందుకు పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తోట నవీన్ వంటి నాయకులు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా చేసేశారు. ఇక చేసేదేమీ లేక వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ముక్తాయించారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల నుంచి సత్తిబాబు అధిష్టానంపై అసహనంతోనే ఉన్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగం చేసిన పాపానికి సత్తిబాబుకు అతన్నే నమ్ముకుని టీడీపీ వెన్నంటే నిలిచిన అనుచర వర్గానికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై గడచిన 14 నెలల కాలంలో అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించే నేతల వరకూ అందరి వద్ద నాలుగైదు పర్యాయాలు సాగిలపడినా అవమానాలే తప్ప ఆశాజనకమైన ప్రతి స్పందన కనిపించక పోవడాన్ని సత్తిబాబు వర్గం సీరియస్గా తీసుకుంది. ఉదయం అక్కడ.. సాయంత్రం ఇక్కడ అవమానాలపై సత్తిబాబు వర్గం ఉదయం ఆరోపణలకు దిగితే సాయంత్రానికి వైరి వర్గంగా ఉన్న కటకంశెట్టి బాబి అనుచరులు సత్తిబాబుపై ఎదురుదాడికి దిగడంతో టీడీపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రూరల్ మండల అధ్యక్ష పదవికి బాబి వర్గం ప్రతిపాదించిన కాకరపల్లి చలపతి సహా కముజు నెహ్రూ, గీశాల శ్రీనివాస్, గుడాల లోవరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, తుమ్మల వెంకన్న తదితరులు మీడియా సమావేశంలో సత్తిబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టలేదా అని వారు నిలదీశారు. కార్పొరేషన్ డైరెక్టర్గా పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా చేయడంపై కేసు నమోదు, తరచూ పార్టీపై అలక వహించడం, ఆనక ఇంట్లో కూర్చోవడం సత్తిబాబుకు ఆనవాయితీగా వస్తున్నదేనంటూ వారు తాజా ఎపిసోడ్ను కొట్టిపారేస్తున్నారు. సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల మధ్య రాద్ధాంతం రావణకాష్టాన్ని తలపిస్తోంది.పిల్లి సత్తిబాబు కటకంశెట్టి బాబిఒక్క పదవీ దక్కలేదని..ఎన్నికలై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా తమ నాయకుడికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదని సత్తిబాబు అనుచరులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. పేరుకే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ అయినా ఆ స్థాయిలో అటు పార్టీలోనూ, ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రాతినిధ్యం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పైనుంచి కింది వరకూ పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. లేదంటే పార్టీ కోఆర్డినేటర్గా నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బూత్ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి రూరల్ మండల అధ్యక్షుడి నియామకానికి అడ్డుతగలడం ఏంటని సత్తిబాబు సహా ఆ వర్గం మండిపడుతోంది. రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కూడా సత్తిబాబు పనిలో పనిగా పలు విమర్శలు సంధించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక కనీసం పనుల్లో కూడా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా 50 శాతం పదవులు, పనులు తమ పార్టీ నేతలకు దక్కాల్సిందేనని అన్నారు. ఎన్నికల్లో తమ సేవలను వినియోగించుకుని అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారా అని సత్తిబాబు వర్గం నిలదీస్తోంది. జరుగుతున్న అవమానాలను చంద్రబాబు సహా జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుల వరకూ తీసుకువెళ్లినా బీసీ సామాజిక వర్గానికి చెందడంతో తొక్కేస్తున్నారనే ఆవేదనతో ఆ వర్గం కుతకుతలాడుతోంది. ఫ టీడీపీలో ఆధిపత్య పోరు ఫ రోడ్డెక్కిన నాయకుల కుమ్ములాట ఫ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా ఫ ఇది మామూలే అంటున్న బాబీ వర్గం -
ఉగ్ర గోదావరి
రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిసాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద నీటి ఉధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 7 గంటల సమయానికి అక్కడ 52.10 అడుగులకు నీటిమట్టం చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. రాత్రికి మరింత ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నారు. పుష్కర ఘాట్, గౌతమీ ఘాట్ వద్ద వరద నీటి ఉధృతి అధికంగా ఉంది. కాటన్ బ్యారేజీకి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో గురువారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.90 అడుగులకు చేరింది. 11,51,758 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరో 9,100 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. వరద ఉధృతి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్రమత్తమైన యంత్రాంగం గోదావరి వరదతో లంక గ్రామాలు నీటిలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే సీతానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, కడియం ప్రాంతాల్లోని లంక భూములు నీట మునిగాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను, లంకల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కల్యాణ మంటపంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కేతావారిలంక నుంచి 68 మందిని, వెదుర్లమ్మ లంక నుంచి 126 మందిని, గోదావరి గట్టు కింద నుంచి ఏడుగురిని, గౌతమీ ఘాట్ నుంచి 45 మందిని, బ్రిడ్జి లంక నుంచి 48 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ముంపు సమస్య రాజానగరం నియోజకవర్గానికి చెందిన 18 గ్రామాల ప్రజలు కలుషిత నీరు తాగాల్సి వస్తోంది. కోరుకొండ మండలం బుచ్చెంపేట, జగన్నాథపురం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల నివా స స్థలాలకు ముంపు సమస్య ఎదురైంది. బూరుగుపూడి, కాపవరం, కోటి, మునగాల, శ్రీరంగపట్నం, రాఘవపురం తదితర గ్రామాల్లోని పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. సీతానగరం మండలంలోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. కోరుకొండ మండలంలో బురద కాలువ ఉగ్రరూపం దాల్చుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరద కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక అమలు రాత్రికి మరింత పెరిగే అవకాశం కంట్రోల్ రూమ్లు -
వర్షాలకు ఆందోళన వద్దు
రాజమహేంద్రవరం రూరల్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. ఆయన గురువారం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి తొర్రేడు, వెంకటనగరం, కోలమూరు గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జల్ల కాలువ కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరి ముంపునకు గురైందని, తొందరలోనే అదనపు నీరు బయటకు పోతుందన్నారు. ఈ వర్షాలు పంట ఎదుగుదలకు దోహదం చేయడమే కాక, ఆకుముడత, ఆకునల్లి పురుగులు నీటిలో కొట్టుకుపోతాయన్నారు. ఒకవేళ పంట ముంపునకు గురైతే ఈ క్రింది యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుంచి పిలకలు దశలో నీట ముంపునకు గురి కావడం జరిగిందన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, ఎంటీయూ 1262, స్వర్ణ, సంపద స్వర్ణ, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయన్నారు. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బెన్డిజిమ్ లేదా 2 గ్రాము కార్బెన్డిజిమ్, మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత త్వరగా నీటిని తీసివేయాలన్నారు. -
ఆర్టీసీ బస్సు వద్ద మహిళల తోపులాట
అనపర్తి : ప్రచార ఆర్భాటంతో అరకొర బస్సులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సీ్త్ర శక్తి (సీ్త్రలకు ఉచిత బస్సు) పథకం ప్రారంభించి నాలుగు రోజులు గడవకుండానే మహిళల సహనానికి పరీక్షగా నిలిచింది. మంగళవారం అనపర్తి బస్టాండ్లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో కళాశాలల నుంచి, వ్యాపార, షాపింగ్ తదితర పనులు ముగించుకుని వారి గమ్యస్థానాలకు బయలుదేరిన మహిళలు పెద్ద ఎత్తున అనపర్తి బస్టాండ్లో వేచి ఉన్నారు. ఇంతలో ఒక బస్సు వచ్చి బస్టాండ్లో నిలిచింది. దీంతో మహిళలంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నెట్టుకుంటూ బస్సు ఎక్కడానికి చేసిన ప్రయత్నం రణరంగాన్ని తలపించింది. జనం ఎక్కువగా ఉండడంతో ముందుగా బస్సు ఎక్కాలన్న ఆతృతలో బస్సు ఆగకుండానే ఎక్కడానికి ప్రయత్నించిన ఒక మహిళ జారి పడి బస్సు కిందదికి వెళ్లిపోవడంతో ప్రయాణికులు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే సీ్త్ర శక్తి పథకాన్నైతే ఆడంబరంగా ప్రకటించారు కాని అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ సమయంలో చక్కగా ప్రయాణాలు సాగేవని ఈ పథకం ప్రవేశపెట్టాక సమయానికి బస్సులు రాక, పనులు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనపర్తిలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఉచిత బస్సు ప్రయాణం -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతిధవళేశ్వరం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి వేగంగా పెరుగుతుంది. మరోపక్క గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 175 క్రస్ట్గేట్లను పూర్తిగా పైకిలేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. 8,28,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు సంబంధించి 4,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. నేడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి.. కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తూ 11.75 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను ,17.75 అడుగులకు నీటి మట్టం చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ఇలా... ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 47.40 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. కాళేశ్వరంలో 12.83 మీటర్లు, పేరూరులో 17.48మీటర్లు ,దుమ్ముగూడెంలో 13.07మీటర్లు, కూనవరంలో 18.14మీటర్లు, కుంటలో 9.75మీటర్లు, పోలవరంలో 13.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.55 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం కాటన్ బ్యారేజీ నుంచి 8.28లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల -
లంకలను ముంచెత్తిన వరద
● 198 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు ● జలదిగ్బంధంలో కేతావారి లంక, వెదుర్లంక, బ్రిడ్జి లంక ● సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు. మగవారు పడవలకి కాపలా... మహిళలు, పిల్లలు, వృద్ధులు పునరావాస కేంద్రాలకు తరలిరాగా మగవారు మాత్రం పడవలకు కాపలాగా లంకల్లోనే ఉంటారు. పడవలు వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా వాటిని కాపాడుతారు. కొంతమంది మగవాళ్లు పునరావస కేంద్రానికి వచ్చి భోజనం చేసి తిరిగి లంకల్లోకి చేరుకుంటారు. అప్పుడు మిగిలిన వాళ్లు పునరావాస కేంద్రానికి వచ్చి భోజనాలు చేస్తారు. పునరావాస కేంద్రానికి తరలింపు గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముందుస్తు చర్యలుగా నదీ పరివాహక ప్రాంతంలోని మూడు లంకల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వారిని అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. మంగళవారం మత్స్య, అగ్నిమాపక, రెవెన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలించారు. మానవ, పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా వారిని సురక్షితంగా పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. ఆల్కట్ గార్డెన్, మునిసిపల్ కల్యాణ మండపంలో వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. బ్రిడ్జి లంక, ఎదుర్లమ్మలంక, కేతవారిలంక కు చెందిన సుమారు ఇప్పటి వరకు 198 మందికి పునరావాస కేంద్రంలో చేర్చారు. -
తాత్కాలిక ధ్రువపత్రం ఉన్నవారి పెన్షన్ల ఆపలేదు
రాజమహేంద్రవరం సిటీ: మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేసిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ జిల్లాలో 4,328 మంది ఈ రెండు కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారన్నారు. వారిలో 1,402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 477 మందికి నోటీసులు జారీ చేశారన్నారు. ఎమ్ఆర్ కేటగిరీలో 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 256 మందికి తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేశామన్నారు. ఎమ్ఐ కేటగిరీలో 1,157 మందిలో 429 మందికి పరీక్షలు జరగగా, అందులో పెన్షన్ నిలిపివేసిన 206 మందిలో 204 మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారన్నారు. వారికి తాత్కాలిక ధ్రువపత్రం జారీ చేశామని వివరించారు.ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంరాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ ఫెయిలైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐలలో 2025–26 సంవత్సరానికి మూడవ విడత అడ్మిషన్స్కు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ సీహెచ్ సునీల్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ఐటిఐ.ఏపీ.జివోవి.ఐన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్ కాపీలతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు 79813 08986, 78010 95303 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతంఅన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
దివ్యాంగులను ఏడిపింఛెన్..!
● అనర్హత పేరుతో దివ్యాంగుల పెన్షన్లకు భారీగా కోత ● వైకల్య ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని వెల్లడి ● అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయని సదరం క్యాంపులు ● తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 33,688 మందికి పెన్షన్లు ● 19,928 మంది వైకల్య శాతం తిరిగి పరిశీలన ● గగ్గోలు పెడుతున్న దివ్యాంగులు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలపైనే కాదు.. దివ్యాంగులపై కూడా కూటమి ప్రభుత్వానికి కనికరం కరువైంది. అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. ఉన్న ఆసరాను దూరం చేస్తోంది. కేవలం మంచానికే పరిమితమైనా.. అనర్హత కారణంగా చూపి వారి నోటికాడ కూడును లాగేస్తోంది. సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి పింఛన్లలో కొర్రీలు పెడుతోంది. మీ వైకల్య అర్హతను నిరూపించుకోవాలని మరి కొంతమందికి నోటీసులు అందిస్తోంది. రూ.15 వేలు పొందుతున్న పింఛను రూ.6 వేలకు తగ్గిస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న ఆర్థిక ఆసరాను లాగేస్తే తామెలా బతకాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు భారీగా తగ్గించుకునేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 3,211 పింఛన్లు తొలగింపు తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల మేరకు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైలక్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు. పింఛను సొమ్ము తగ్గింపు కూటమి ప్రభుత్వం ఆదాయ ఆర్జనలో భాగంగా పింఛను సొమ్మును సైతం తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే రూ.15 వేలు పింఛను పొందుతున్న 398 మందిని వివిధ కారణాలతో దివ్యాంగ పింఛన్ల (రూ.6 వేల)కు మార్చింది. తొమ్మిది మందిని వృద్ధాప్య పింఛన్ల (రూ.4 వేలు)కు కుదించారు. రూ.6 వేలు దివ్యాంగ పింఛన్లు పొందుతున్న కోటాలో 18,609 మందికి రీ వెరిఫికేషన్ చేపట్టారు. 405 మందికి వృద్ధాప్య పింఛన్లుగా మార్చారు. 3,211 మందిని అనర్హులుగా గుర్తించి వారికి పింఛన్లు తీసేశారు. తొలగిస్తున్నారిలా.. దివ్యాంగ పింఛనుకు మీరు అనర్హులంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో ప్రారంభమైంది. ఆ సమయంలో 100 శాతం వికలత్వం ఉంటే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రీ–వెరిఫికేషన్లో 40 శాతానికి తగ్గిపోతోంది. అదెలా తగ్గుతోందో అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. ఫలితంగా దివ్యాంగులు పింఛను కోల్పోతున్నారు. గతంలో వెరిఫై చేసి వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చింది వైద్యులే. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే.. ఇప్పుడు 40 శాతం లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు వాపోతున్నారు. చాపకింద నీరులా తొలగింపు ప్రక్రియ దివ్యాంగ పింఛన్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా సాగుతోంది. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ శాతం మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలుతోంది. తమ పింఛను పోతుందని భావిస్తున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్, ఎంపీడీఓల వద్దకు పరుగులు తీస్తున్నారు. అనధికార సమాచారం మేరకు జిల్లాలో ఎనిమిది వేలకు పైగా పింఛన్లు తొలగించినట్లు తెలిసింది. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు. తొలగింపులు కుట్రలో భాగమే..! సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలన్న తలంపుతో చంద్రబాబు సంక్షేమ పథకాలు, పింఛన్లపై అమలుకు సాధ్యంకాని ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక కోతలు ప్రారంభించారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా పింఛన్ల తొలగింపులకు నాంది పలికారు. ఇదంతా పింఛన్లు తగ్గించుకునేందుకు ఆడుతున్న నాటకంలో భాగమే అన్న ఆరోపణలున్నాయి. సిఫారసులకే అందలందివ్యాంగుల పింఛన్ల తొలగింపులు, సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల జారీలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫారుసులకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్న వారికే ఇస్తున్నారు. వైకల్యం లేకపోయినా.. ఉన్నట్లు ధ్రువీకరిస్తూ పింఛన్లు కొనసాగిస్తున్నారు. సిఫారసు లేనివారికి మాత్రం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. సిఫారసులు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్లు వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మాత్రం తొలగించేస్తున్నారు. మరి కొంత మంది సదరం క్యాంపులో మామూళ్లు ముట్టజెప్పి వైకల్య శాతం నమోదు చేయించుకుంటున్నారు. పైసలు ఇవ్వలేని వాళ్లు మాత్రం ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.చిత్రంలో మంచానికే పరిమితమైన వ్యక్తి పేరు పేకేటి సత్యనారాయణ. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో నివాసముంటున్నారు. ఈయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నారు. ఏ పనీ చేసుకోలేని పరిస్థితి. కేవలం మంచానికే పరిమితమయ్యారు. భార్య సహాయం చేస్తే తప్ప తనపని తాను చేసుకోలేని దుస్థితి. అలాంటి వ్యక్తిపై సైతం కూటమి ప్రభుత్వం కనికరం చూపడం లేదు. 85 శాతం వైకల్యం ఉండాలని.. రీ వెరిఫికేషన్లో 59 శాతం వైకల్యం మాత్రమే ఉందని నోటీసు ఇచ్చారు. అనర్హత పేరుతో పింఛను పీకేశారు. కళ్లముందు వ్యక్తి మంచంపై ఉంటే.. వైకల్యం లేదనడం ఎంతవరకూ సమంజసం. దీంతో ఆ దివ్యాంగుడు లబోదిబో మంటున్నారు. తాను, భార్య ఉంటున్నామని, తన కుటుంబానికి ఆసరాగా ఉన్న పింఛన్ తొలిగిస్తే కుటుంబ పోషణ ఎలాగంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం ఇతనొక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగుల పరిస్థితి ఇలాగే ఉంది. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,58,204, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 22,58,603 వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే బంగారం 23 గ్రాములు, వెండి 670 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 46 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా ఏసీ అండ్ జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ టీవీఎస్ సార్ ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు డి.సతీష్ కుమా ర్, గోపాలపురం గ్రూపు దేవాలయాల ఈవో బి కిరణ్, దేవస్థానం సిబ్బంది అర్చకులు, శ్రీవారి సేవకులు పోలీసులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
సెంట్రల్ జైలులో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారంలో ఆపరేషన్ మహా సురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ వివరాలను జైలు సూపరిడెంట్ ఎస్.రాహుల్ బుధవారం తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్లు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జైలులో అత్యవసర పరిస్థితులు ఎదురై, అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాద చర్యలు, ప్రమాదకర ఘటనలు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం మాక్ డ్రిల్ ముఖ్యోద్దేశం. రక్షణ వ్యవస్థలను సమర్థంగా వినియోగించి ప్రతిస్పందించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించారు. అత్యవసర పరిస్థితులలో సురక్షిత చర్యలు చేపట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జైలు అధికారులకు, సిబ్బందికి ఆక్టోపస్ బృందం వివరించింది. మాక్ డ్రిల్లో ఆక్టోపస్ అధికారులు, డీఎస్పీలు బి.కృష్ణ, కె.శంకరయ్య, ఇన్స్పెక్టర్ బి.మురళీ, ఆక్టోపస్ సిబ్బంది, జైలర్లు, డిప్యూటీ జైలరు పాల్గొన్నారు. -
విజ్ఞానపదం
కపిలేశ్వరపురం: సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడంలో జానపద కళలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. మన పూర్వీకుల ఆచారాలు, పద్ధతులు, ఆనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. వీటిలో గీతాలు, నృత్యాలు, నాటకాలు, శిల్పాలు, వాయిద్యాలు.. ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జానపద కళారూపాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఆగస్టు 22) అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వాటిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 55 వేల మంది జానపద కళాకారులు ఉన్నారు. గరగ నృత్యం, డప్పు వాయిద్యం, కోలాటం తదితర ఆధ్యాత్మిక కళాకారులు దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తారు. పెద్దాపురం, కాకినాడలో తప్పెటగుళ్లు కళాకారులు, మాధవపట్నం, కొత్తపేటల్లో తోలుబొమ్మల కళాకారులు, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంతాల్లో సాము గారడి, ఏజెన్సీ ప్రాంతాల్లో థింసా నృత్య కళాకారులు ఎంతో ప్రసిద్ధి చెందారు. జిల్లా వ్యాప్తంగా దళిత సామాజిక వర్గీయులు గారడీ నృత్యకళను తమ భుజాలపై వేసుకుని పోషిస్తున్నారు. రామచంద్రపురం ప్రాంతంలో బుర్రకథ, కపిలేశ్వరపురం మండలంలో గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పలు ప్రదర్శనలు ● రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యాన ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదివాసీ కళాకారులు నిర్వహించిన జానపద, లంబాడీ, థింసా, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ● ఈ ఏడాది ఏప్రిల్లో రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యాన మూడు రోజుల పాటు 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఆర్సీ కృషిని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతం రాజు అభినందించారు. స్వేచ్ఛ, బ్రహ్మ స్వరూపం, జనరల్ బోగీలు అనే నాటకాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● రాజమహేంద్రవరం సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీత్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆగస్టు 3న జరిగిన అన్నమయ్య కీర్తనలకు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యులు నర్తించిన తీరు ఆకట్టుకుంది. ● రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఈ ఏడాది జూన్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 43వ అంతర్జాతీయ సంగీత నృత్య ఫెస్ట్ – 2025 అలరించింది. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యాన నిర్వహించిన ఫెస్ట్లో మలేషియా బృందం, 13 రాష్ట్రాల నుంచి 550 మంది కళాకారులు సంగీతం, నృత్య, జానపద కళారూపాలను ప్రదర్శించారు. ● పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో స్నేహ ఆర్ట్స్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యాన ఈ ఏడాది జనవరి 24న నాటక పోటీలు నిర్వహించారు. ● బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన సీనియర్ రంగస్థల దర్శకుడు, నటుడు తాడి సూర్యనారాయణరెడ్డి (78) ఈ ఏడాది జూన్ 25న కన్నుమూయడం కళాకారులకు తీరని లోటు. ఆయన వెంకట రమణ ఆర్ట్స్ సంస్థకు ఆస్థాన దర్శకుడిగా ఉంటూ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావుతో కలిసి పనిచేశారు. కళాకారులకు పురస్కారాలు ● విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన నటి సరోజకు మంత్రి కందుల దుర్గేష్ చేతులు మీదుగా పురస్కారం అందజేశారు. ● సాతులూరులో ఈ ఏడాది మే 28న నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీల వేదికపై ప్రత్తిపాడుకు చెందిన రంగస్థల మేకప్ కళాకారుడు కాతేటి నూకరాజు (థామస్)కు నటరత్న ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. ● న్యూఢిల్లీలో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవంలో కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన గరగ నృత్య కళాకారుడు కొరివి కల్యాణ్, కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ తమ కళను ప్రదర్శించారు. మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ స్థాయి డాక్యుమెంటరీగా రూపొందించగా, వీరి కళా ప్రదర్శనకు అందులో స్థానం లభించింది. వీరిలో కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్కు ఈ ఏడాది ఏప్రిల్ 13న విశాఖపట్నం మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కళాజ్యోతి పురస్కారం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోని బృందం ఒడిసా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్లో కళా ప్రదర్శనను ఇచ్చారు. ● కాకినాడలో ఈ ఏడాది జూలైలో జరిగిన అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ రజతోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహించారు. శిక్షణ శిబిరం జానపద కళ పాతకాలం నాటిదే అయినా ఆధునిక కాలానికి అనుగుణంగా కళాకారులు ఎప్పటి కప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది జూన్ 6న అమలాపురంలో ప్రజానాట్యమండలి కళాకారుడు శామ్యూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. పెద్దాపురం కళాకారుడు యాసలపు సూర్యారావు స్మారక భవన్లో ఈ ఏడాది జూన్ 21న కళాకారుల శిక్షణ శిబిరం నిర్వహించారు.జగన్ ప్రభుత్వం చేయూత గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజాము ఆరు గంటలకే వలంటీర్లు.. కళాకారులకు ఇంటికెళ్లి పింఛన్ సొమ్ములు అందించేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ కళాకారుల పింఛను చెల్లింపును కొనసాగించారు. రంగస్థల సమాజాలు, పరిషత్లకు రూ.5 లక్షలతో వైఎస్సార్ రంగస్థల పురస్కారాలను ఇచ్చేందుకు కృషి జరిగింది. అప్పటి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అభ్యర్థనపై కందుకూరి వీరేశలింగం జయంతి అయిన ఏప్రిల్ 16ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక రంగ దినోత్సవంగా ప్రకటించారు. జానపద కళలకు ఎంతో చరిత్ర ఆనాటి సంప్రదాయాలకు ప్రతీక నేటికీ కొనసాగుతున్న వైనం ఉమ్మడి జిల్లాలో అనేక మంది కళాకారులు రేపు అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంకళాకారుల వినతులు జానపద కళా పోషణ భారాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాలని కళాకారులు కోరుతున్నారు. కళనే నమ్ముకున్న తమకు పింఛన్ ఇవ్వాలని, కళా వేదికలను ప్రభుత్వమే అన్వేషించి ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. తుని మండలం కొత్తూరులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యాన ఈ నెల 1న నిర్వహించిన డప్పు కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డప్పు, చర్మకారుల సంక్షేమం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళా ప్రదర్శనకు మూడు ఎకరాల భూమి, రూ.ఏడు వేల పింఛన్, ఉచితంగా డప్పు, గజ్జెలు, దుస్తులను మాదిగ కార్పొరేషన్ ద్వారా సమకూర్చాలని డిమాండ్ చేశారు. -
బస్సు చక్రాలు ఎక్కడంతో మహిళకు తీవ్ర గాయాలు
జగ్గంపేట: బంధువును బస్సు ఎక్కించడానికి వచ్చిన మహిళ ప్రమాదం బారిన పడింది. బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవి. గోకవరం గ్రామానికి చెందిన రేవాడి రాజేశ్వరి (29) ఇంటికి ఆమె అక్క కుమార్తె అశ్విని తన చంటి పిల్లతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. తిరిగి తన సొంత ఊరు తుని వెళ్లడానికి బుధవారం సిద్ధమైంది. అయితే అశ్వినిని జగ్గంపేటలో బస్సు ఎక్కించటానికి రాజేశ్వరి కూడా ప్రయాణమైంది. జగ్గంపేట బస్టాండ్లో తుని వెళ్లడానికి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన బస్సులో అశ్వినిని ఎక్కించి, లగేజీ సర్దిపెట్టింది. ఆ సమయంలో బస్సు కదలడంతో దిగిపోయే ప్రయత్నంలో బస్సు నుంచి కిందకు పడిపోయింది. దీంతో బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో రాజేశ్వరి కుడి కాలు నుజ్జునుజ్జయ్యింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమెను దగ్గరకు ఎవ్వరూ రాలేదు. స్థానిక శెట్టిబలిజిపేటకు చెందిన శివభక్తుడు పాలిక అప్పారావు ఆమెకు అండగా నిలిచాడు. అలాగే ప్రమాదాన్ని చూసిన అశ్విని వెంటనే బస్సు దిగిపోయింది.ఎంతకీ రాని అంబులెన్స్తీవ్రగాయాలతో రోదిస్తున్న రాజేశ్వరిని చూసి బస్టాండ్లో ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. కానీ ఎంత సేపటికీ అంబులెన్స్ రాలేదు. దీంతో సుమారు 45 నిమిషాల తర్వాత ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి స్ట్రెచర్ తీసుకువచ్చి చికిత్స కోసం తీసుకువెళ్లసాగారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ వ్యాన్లో రాజేశ్వరిని ఎక్కించి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రాజమహేంద్రవరానికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబ సభ్యులను ఏలేశ్వరం ఆర్టీసీ డీఎం జీవీ సత్యనారాయణ కలిసి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందిన తరువాత కేసు నమోదు చేస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్ దగ్ధం
నిడదవోలు: స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న న్యూ మంజునాథ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీలోని విద్యుత్ స్మార్ట్ మీటర్ బుధవారం దగ్ధమైంది. బేకరి యజమానికి ఇష్టం లేకపోయినా విద్యుత్ సిబ్బంది వచ్చి రెండు నెలల క్రితం ఈ మీటర్ను బిగించారు. అయితే నాసిరకం మీటర్ ఏర్పాటు చేయడంతో ఈ విధంగా జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిట్టీల సొమ్ము రూ.2 కోట్లతో వ్యక్తి పరార్తాళ్లపూడి: చిట్టీల సొమ్ము రూ.2 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన సంఘటన తిరుగుడుమెట్టలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో కిరాణా వ్యాపారం చేసే బెల్లంకొండ సత్యనారాయణ చిట్టీలు వేస్తుంటాడు. అతడి వద్ద గ్రామస్తులు చాలామంది చిట్టీలు కట్టారు. అయితే భార్యతో కలసి సత్యనారాయణ గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు బుధవారం అతడి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ సత్యనారాయణ కొన్నేళ్లుగా చిట్టీలు కట్టించుకుంటున్నాడని, అతడి వద్ద పెద్ద మొత్తంలో వాటిని వేసినట్టు తెలిపారు. చిట్టీ పాట సొమ్మును కూడా తన వద్దే ఉంచుకుని, వడ్డీ ఇస్తానని నమ్మించేవాడన్నారు. అలాగే చాలామంది అతడికి అప్పులు కూడా ఇచ్చామన్నారు. ఇలా సుమారు రూ. 2 కోట్ల వరకూ వసూలు చేశాడన్నారు. కాగా.. బాకీల వాళ్లు వేధిస్తున్నారని, ఆ భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నట్టు సత్యనారాయణ ఉత్తరం రాసి ఉంచినట్టు సమాచారం. అతడి ఇద్దరు కుమారుల్లో ఒకరు లండన్, మరొకరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెబుతున్నారు. -
సీతారామ సత్రాన్ని కూల్చివేయండి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానంలో శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని కూల్చివేయాలని జేఎన్టీయూకే ప్రొఫెసర్లు బృందం స్పష్టం చేసింది. ఆ సత్రానికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని తెలిపింది. ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం ఈ నెల 13వ తేదీన సీతారామ సత్రం లోని గదులు, శ్లాబ్, గోడలను పరిశీలించింది. అనంతరం తమ నివేదికను బుధవారం దేవస్థానానికి అందజేసింది. కాగా.. ఆర్బీఐ అధికారుల నివేదికను అనుసరించి ఈ సత్రాన్ని కూల్చివేయాలని గతంలోనే నిర్ణయించారు. 2024 మేలో దీన్ని కూల్చివేసి, నూతన సత్రం నిర్మించేందుకు రూ.11.40 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా 16 శాతం తక్కువకు ఖరారు చేశారు. అదే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని పరిశీలించిన దేవదాయశాఖ సలహాదారు కొండలరావు దీనికి మరమ్మత్తులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేయడంపై గందరగోళం నెలకొంది. దీంతో ఈ సత్రం మరమ్మత్తులు చేయడానికి సుమారు రూ. రెండు కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనిపై జూన్ 26న సాక్షి పత్రికలో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన వార్త ప్రచురితమైంది. ఆ వార్తపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈ సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయూ ప్రొఫెసర్లను కోరారు. నివేదిక ఇచ్చిన జేఎన్టీయూకే ప్రొఫెసర్లు ‘సాక్షి’ కథనానికి స్పందన -
కక్ష కట్టి.. కడతేర్చి..
నల్లజర్ల: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తమామలపై కక్ష కట్టిన అల్లుడు.. చాకుతో వారిద్దరినీ దారుణంగా పొడిచి చంపాడు. మండలంలోని ఘంటావారిగూడెంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన ఏకుల బాబూరావు కొన్నేళ్ల కిందట ఘంటావారిగూడేనికి మకాం వచ్చాడు. ఆయనకు భార్య శారద, కుమారుడు అప్పారావు, కుమార్తె నాగేశ్వరి ఉన్నారు. అప్పారావు ఉద్యోగ రీత్యా విశాఖపట్న ంలో ఉంటున్నాడు. దెందులూరు మండలం గంగన్నగూడేనికి చెందిన మరీదు కోటేశ్వరరావుతో నాగేశ్వరికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బాబూరావు, శారద ఘంటావారిగూడెంలో ప్రధాన రహదారి పక్క చిన్న టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. భర్త వేధింపులు భరించలేక ఏడాది క్రితం నాగేశ్వరి తన ఇద్దరు కుమారులు గిరిష్, లోకేష్లతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. పిల్లలిద్దరినీ స్థానికంగా ఉన్న పాఠశాలలో చదివించుకుంటోంది. తరచూ గొడవలు కోటేశ్వరరావు తరచూ ఘంటావారిగూడెం వచ్చి భార్యను కాపురానికి పంపాలని అత్తమామలపై ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఈ గొడవపై రెండు, మూడుసార్లు పెద్దల సమక్షంలో తగవులు జరిగాయి. అయితే మద్యం తాగి వచ్చి విపరీతంగా కొట్టే భర్త దగ్గరకు కాపురానికి వెళ్లడానికి నాగేశ్వరి నిరాకరించింది. నెల రోజుల క్రితం కోటేశ్వరరావు ఘంటావారిగూడెం వచ్చి బాబూరావుతో ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో మామ పీక నులుముతుండగా స్థానికులు వచ్చి విడదీశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ పని ముగించుకొని బాబూరావు, శారద, నాగేశ్వరి ఇంటికి వచ్చారు. అదే సమయంలో కోటేశ్వరరావు బైక్పై వచ్చి ఆ వీధిలో రెండుసార్లు రౌండ్లు కొట్టాడు. అనంతరం ఇంటి వద్ద ఆగి, మొక్కలను శుభ్రం చేస్తున్న అత్త శారద(48)ను చాకుతో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వస్తున్న మామ బాబూరావు(58)ను హతమార్చాడు. ఇది చూసిన నాగేశ్వరి ఇంట్లోకి వెళ్లి దాక్కుని ప్రాణాలు కాపాడుకుంది. అనంతరం కొటేశ్వరరావు బయటకు వస్తూ.. కొంచెం కదులుతున్న శారదను మరోసారి పొడిచాడు. చాకును సంఘటన స్థలంలోనే పాడేసి, తీరుగ్గా సిగరెట్ కాల్చుకుంటూ తన తల్లికి ఫోన్ చేశాడు. అత్తమామలు ఇద్దరినీ చంపేసాను, జైల్లో ఉంటానని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకు అతడు అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న సీఐ బాలశౌరి తమ సిబ్బందితో వచ్చి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే డీఎస్పీ దేవకుమార్ మాత్రం నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, కేసు నమోదు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్తమామలను హత్య చేసిన అల్లుడు భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహం ఘంటావారిగూడెంలో కలకలం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350