breaking news
East Godavari District News
-
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
అక్రమ కేసులు సిగ్గుచేటు ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్ నీచ సంస్కృతికి నాంది పలుకుతోంది. విలేకర్ల సమావేశంలో టీడీపీ నేతల అక్రమాల గురించి మాట్లాడితే.. పత్రిక పైన, సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ.. రాజ్యాంగ విలువలను కూటమి పాలకులు కాలరాస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను తెలుగు ప్రజలకు వివరించడమే విలేకర్లు చేసిన తప్పా? సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు తక్షణం ఎత్తివేయాలి. – చందన నాగేశ్వర్, మాజీ చైర్మన్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పోరేషన్ పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథిగా పని చేస్తున్న మీడియా రంగాన్ని అణచివేసేలా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరికాదు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. చేస్తున్న మోసాలను, వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తోందనే కక్షతో సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణం. ఈ అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. – ఆకుల వీర్రాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ 8 -
వాహన మిత్రఖేదం!
● రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం ● సాఫ్ట్వేర్ అప్డేట్ చేయక సమస్య ● అయోమయంలో ఆటో డ్రైవర్లు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందరికీ లబ్ధి ● చిత్తశుద్ధి లోపించిన కూటమి సర్కార్ కొత్తపేట: రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహన మిత్ర లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. వాహనాలు విక్రయించినప్పటికీ యజమాని పేరు ఆన్లైన్లో మారకపోవడం ఆ పథకానికి అనర్హులై ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేసి తమను ఆదుకుందని, ఈ కూటమి ప్రభుత్వం మెలిక పెట్టడం వల్లో, నిర్లక్ష్యం వల్లో తమకు ఆ లబ్ధి అందడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన మిత్ర పథకాన్ని 2018 మే 14న ఏలూరులో ప్రకటించారు. ఆ హామీ మేరకు 2019లో అధికారం చేపట్టి ఆ పథకాన్ని ప్రకటించిన ఏలూరులోనే అక్టోబర్ 4న ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్లు కలిగి ఉన్న స్వయం ఉపాధి డ్రైవర్ల వాహనాల నిర్వహణ, బీమా, ఇతర ఖర్చులకు రూ.10 వేలు సాయంగా దోహదపడింది. కూటమి పాలనలో వాహనాలకు బ్రేకులు కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి (ఉచిత బస్సు) పథకం ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు లేనిపోని నిబంధనలు అమలు చేస్తూ అర్హులను అనర్హులను చేస్తున్నారని పలువురు వాపోయారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారంతా విమర్శిస్తున్నారు. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన తమకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని డ్రైవర్లు పోతున్నారు. బుధవారం నుంచి వాహన మిత్ర పథకానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కాగా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వాహన యజమానులకు ఆయా గ్రామ సచివాలయాల్లో వారి వాహనం వేరొకరి పేరున చూపిస్తోందని అక్కడి సిబ్బంది చెప్పడంతో వారు అవాక్కవుతున్నారు. గత ప్రభుత్వంలో లబ్ధిదారుల జాబితానే రవాణాశాఖ యంత్రాంగం అప్లోడ్ చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్, ఆధార్ సీడింగ్ చేయించుకున్నప్పటికీ ఆ జాబితా అప్లోడ్ చేయకుండా తమ వాహనం వేరొకరు పేరున ఉన్నట్టు జాబితాలో చూపడంపై సదరు అధికారులు తీరును డ్రైవర్లు తప్పు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధి పొందిన సుమారు 28 వేల మంది జాబితాలో కొందరు వాహనాలను విక్రయించినా పాత జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు అందించడం వల్ల ఈ పథకానికి అర్హత కోల్పోయినట్టు వారంటున్నారు. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించి, 22 నుంచి పరిశీలన పూర్తిచేసి 24న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఆ మేరకు లబ్ధిదారులకు అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ గందరకోళ పరిస్థితుల్లో పథకం దరఖాస్తులకు గడువు పెంచి, తాజా జిబితాను రవాణా శాఖ నుంచి తెప్పించి గ్రామ, వార్డు సచివాలయాలకు అందజేయాలని కోరారు. యంత్రాంగం కసరత్తు ఓ పక్క రిజిస్ట్రేషన్లకు గడువు విధించడం, మరో పక్క పాత వాహన మిత్ర డేటాతో కొత్త వారికి రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై విజయవాడలోని రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడానికి తెగ కసరత్తు చేస్తున్నారు.తాజా రిజిస్ట్రేషన్లకే ఇబ్బంది అమలాపురం టౌన్: గత వాహన మిత్రలో లబ్ధి పొంది నేటికీ ఆటోల నిర్వహణ రంగంలో ఉన్న వారికి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కాగా, ఏడాదిన్నర కాలంలో కొత్తగా ఆటోలను కొనుక్కుని ఈ రంగంలోకి వచ్చిన వారి పేర్లు మాత్రం రిజిస్ట్రేషన్ కావడం లేదు. గతంలో వాహన మిత్ర పథకం కింద జిల్లాలో 4,500 మంది లబ్ధి పొందారు. ఇందులో దాదాపు 2 వేల మంది వరకూ ఈ రంగం నుంచి తప్పుకోవడంతో ఈ సమస్య అనివార్యమైంది. ఉదాహరణకు అమలాపురం మండలం పేరూరు గ్రామ సచివాలయానికి ఐదుగురు ఆటో డ్రైవర్లు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం వెళ్లారు. వారు గత ఏడాదిన్నర కాలంలో ఆటోల నిర్వహణ రంగంలోకి రావడంతో వారి పేర్లు డేటాలో కనిపించక కంగారు పడ్డారు. పరివాహన్ సాఫ్ట్వేర్ మార్చి డేటా అప్లోడ్ చేస్తేనే కానీ కొత్తవారికి రిజిస్టేషన్లు కావని సచివాలయాల సిబ్బంది చెప్పడంతో వారు అయోమయయానికి గురవుతున్నారు. జిల్లాలో తాజాగా నమోదైన ఆటో డ్రైవర్ల సంఖ్య దాదాపు 7,500 ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారందరికీ ప్రభు త్వం రూ.15 వేల వంతున ఇవ్వాల్సిందే.పరివాహన్ యాప్ తప్పులతడక ఇటీవల నేను ప్యాసింజర్ ఆటో కొనుగోలు చేసి, ఆధార్ సీడింగ్ చేసినప్పటికీ వాహనమిత్ర పథకానికి నా దరఖాస్తు చెల్లదని సచివాలయ సిబ్బంది తిరస్కరించారు. దీనికి రవాణా శాఖ అధికారులు పరివాహన్ యాప్ నుంచి పంపిన జాబితాయే కారణం. దానిని సరిచేసి, అర్హుల జాబితాను పంపించాలి. లేకుంటే నాలాంటి ఎందరో అర్హులకు అన్యాయం జరుగుతుంది. – మెర్ల వీరబాబు, ఆటో డ్రైవర్, మెర్లపాలెం, ఆత్రేయపురం మండలం -
సమర్థంగా తీవ్రవాదుల ఏరివేత
● ఓఎన్జీసీలో ‘ఆపరేషన్ పుష్కర్’ ● వివిధ శాఖల సమన్వయంతో మాక్డ్రిల్ రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ కార్యాలయాల సమీప ప్రాంతాల్లో భద్రతాపరంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓఎన్జీసీ భద్రతా విభాగం, స్థానిక పోలీసు అధికారులు, ఏపీఎస్పీఎఫ్, ఏపీ పోలీసుల ఆక్టోపస్ కమాండోల మధ్య ప్రతిస్పందన, సమన్వయాన్ని పెంచడానికి గురువారం ఓఎన్జీసీ గోదావరి భవన్లో ఈ మేరకు ‘ఆపరేషన్ పుష్కర్’ నిర్వహించారు. ఓఎన్జీసీ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కీలక సిబ్బందిని బందీలుగా తీసుకుపోయే సందర్భాన్ని ఈ మాక్ డ్రిల్లో నిర్వహించారు. వైద్య, రెవెన్యూ, అగ్నిమాపక, ఏపీఎస్పీఎఫ్, బొమ్మూరు పోలీస్ స్టేషన్, జిల్లా ఆర్మ్ రిజర్వ్ స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్ బృందం, డాగ్ స్క్వాడ్ వంటి వివిధ సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి. ఓఎన్జీసీ భద్రత, అగ్నిమాపక బృందాలు ఈ ఆపరేషన్లో భాగస్వాములయ్యాయి. మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించారు. బందీలుగా ఉన్న కీలక సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకుండా విడిపించారు. కమెండోలు గంటల తరబడి ఆపరేషన్ నిర్వహించి సమర్ధంగా కట్టడి చేశారు. రాష్ట్ర వైద్య బృందం, ఓఎన్జీసీ వైద్య విభాగం క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించారు. అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సత్వర చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. తరువాత, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి తనిఖీలు చేసింది. ఏఎస్పీ (ఏఆర్) చెంచురెడ్డి, డీఎస్పీలు జగ్గు నాయుడు, జి.విశ్వనాథం, విజయవాడలోని ఆక్టోపస్ స్పెషల్ ఫోర్స్కు చెందిన ఇన్స్పెక్టర్ ఆర్.రాంబాబు ఈ ఆపరేషన్లో బ్రీఫింగ్ చేశారు. ఇన్చార్జి సెక్యూరిటీ లెఫ్టినెంట్ కల్నల్ కెఎస్ గుసేన్, చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ) పి.శంకర్ ఓఎన్జీసి నుంచి నోడల్ అధికారులుగా వ్యవహరించారు. -
నర్సింగ్.. మరింత మెరుగ్గా..
● జీజీహెచ్లో సమూల మార్పులు ● ప్రత్యేక కార్యాచరణ అమలు ● సకాలంలో విధుల నిర్వహణ ● తొలగుతున్న వ్యత్యాసాలు కాకినాడ క్రైం: వైద్యులతో సమానంగా రోగులకు సేవలందించడంలో నర్స్ల పాత్ర కీలకం. నిస్సత్తువతో ప్రాణాలు కళ్లలో పెట్టుకుని బతుకీడుస్తున్న రోగుల హృదయాల్లో వారి స్థానం ఎంతో ఉన్నతం. కన్నతల్లిని, తోబుట్టువుని మరిపించే ఆత్మీయత వారి సొంతం. వారి సేవలు మరింత మెరుగుపడేలా కాకినాడ జీజీహెచ్లో అంకురార్పణ పడింది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షణలో నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన మౌళి ఆధ్వర్యంలో ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతి వార్డు పరిశీలన ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలిస్తూ నర్సింగ్ సూపరింటెండెంట్ సహా హెడ్ నర్స్లు వారికి అందుతున్న సేవలపై రోగులను ఆరా తీస్తున్నారు. నర్సులు, నర్సింగ్ విద్యార్థుల ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉంటున్నదీ లేనిదీ అడిగి తెలుసుకుంటున్నారు. తారతమ్యాలు రూపుమాపేలా... నర్సుల్లో రెగ్యులర్, కాంట్రాక్టు అనే భేదం లేకుండా చూస్తున్నారు. ఎవరెంత అనుకున్నా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంటుంది. తమ అదృష్టం పండి అర్హత తక్కువగా ఉండీ కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్న కొందరు నర్సులు, ఉన్నత చదువులు చదివి కాంట్రాక్టు నర్సులుగా పనిచేస్తున్న వారిపై అజమాయిషీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పని విషయంలోనూ కాంట్రాక్టు సిబ్బందిపై పని భారాన్ని మోపుతుంటారు. అలాగే ఆస్పత్రిలో ఉన్నతాధికారులతోనూ రెగ్యులర్ సిబ్బందే టచ్లో ఉంటారు. అధికారులు సైతం రెగ్యులర్, కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందిని సమానంగా చూడకపోవడం మరో సమస్య. నైట్ డ్యూటీ విషయంలోనూ ఇదే వ్యత్యాసం. కాగా నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన తాజా నిర్ణయంతో అసమానతలకు చెక్ పట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అందులో భాగంగా అందరికీ సమానంగా నైట్ డ్యూటీలు వేస్తున్నారు. రుబాబులకు కాలం చెల్లింది. ఏళ్లకు ఏళ్లు ఒకే వార్డులో కొనసాగుతున్న 49 మంది నర్సులకు స్థాన చలనం కల్పించారు. వివిధ సమస్యలతో పాటు అంతర్గత విభేదాలనూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. సమయ పాలన విషయంలోనూ నిర్థిష్ట సమయానికి పది నిమిషాలు గ్రేస్ పిరియడ్ ఇచ్చి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆహారంలోనూ జాగ్రత్తలు రోగులకు అందిస్తున్న ఆహారాన్ని అందరికీ అందజేయడంతో పాటు నాణ్యతను పరిశీలించి నర్సింగ్ సూపరింటెండెంట్కు నివేదించే ఏర్పాటు చేశారు. క్లీన్ చేశాక క్లిక్ తప్పనిసరి వార్డులు శుభ్ర పరిచాక స్టాఫ్ నర్సులు ఫొటోలు తీసి గ్రూప్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి. వార్డు పరిశుభ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. రోగి మంచంపై దుప్పట్లు మార్చడంలో నర్సులు సంబంధిత సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు. రోగికి అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తూ.. రోగులకు వడ్డిస్తున్న నర్సులు మంచి దిశగా అడుగులు రోగులకు మంచి జరిగేలా నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన మౌళి ఆధ్వర్యంలో నర్సింగ్ బృందం వారి సేవల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చారు. తాజా మార్పులను ఆహ్వానిస్తున్నాం. మంచి దిశగా అడుగులు పడే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు అండగా ఉంటాం. రోగుల సంరక్షణే పరమావధి. – డాక్టర్ లావణ్యకుమారి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ ఉత్తమ నర్సింగ్ సేవలే లక్ష్యం కాకినాడ జీజీహెచ్లో ఉత్తమ నర్సింగ్ సేవలే లక్ష్యంగా సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టాం. అమలు చేసే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. చేపట్టిన మార్పులు రోగులకు మంచి చేస్తుంటే తాము పడిన కష్టం మర్చిపోతున్నాం. నర్సులు ఎంతగానో సహకరిస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి సహకారంతో వార్డుల్లో నర్సింగ్ సేవలపై నిశిత పరిశీలన చేపట్టి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – టీఎన్ కల్పన మౌళి, గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ -
వివాహిత అనుమానాస్పద మృతి
నిడదవోలు: మండలంలోని శెట్టిపేట గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో వాటర్ట్యాంక్ ప్రాంతంలో గట్టున సత్యవతి (55) ఒంటరిగా నివసిస్తోంది. భర్త కోటయ్య గతంలో మృతిచెందారు. సత్యవతి చెల్లెలు కాకుమళ్ల దేవి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి పక్కన ఉంటున్న కూనపురెడ్డి గంగారత్నంకు ఫోన్ చేసి మా అక్కను చూడాలని కోరింది. గంగారత్నం ఇంటికి వెళ్లి చూడగా సత్యవతి బాత్రూరూంలో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా పట్టణ ఎస్సై జగన్మోహన్రావు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి చెల్లెలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమిశ్రగూడెంలో రెండు చోట్ల చోరీలు నిడదవోలు రూరల్: మండలంలోని సమిశ్రగూడెంలో గురువారం తెల్లవారు జామున రెండుచోట్ల జరిగిన దొంగతనాలపై కేసులు నమోదైనట్టు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు అన్నారు. సమిశ్రగూడెంలోని శ్రీనివాస మెడికల్ షాప్ వీధిలో దంగుల కొండమ్మ ఇంట్లో రూ.80 వేల నగదుతో పాటు 26 తులాల వెండీ, అరకాసు బంగారం, కాల్వగట్టుపై ఉన్న కొండేపూడి సుధీర్కు చెందిన టీ టైం షాపులో రూ.20 వేల నగదు, 6 గ్రాముల బంగారం, ఒక సెలఫోన్ అపహరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. చోరీ జరిగిన ప్రాంతాలను ఎస్సై బాలాజీ సుందరరావు పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. -
పాడి గేదెలకు తక్షణ వైద్య సేవలు
● కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశం ● పెద్దేవంలో పర్యటన ● చనిపోయిన గేదెలకు పరిహారం అందజేయాలని రైతుల విజ్ఞప్తి తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం గ్రామంలో పాడి, చూడి పశువులకు తక్షణం వైద్య సేవలు అందించాలని, వాటి ఆరోగ్య సమాచారం సేకరించి, డీవార్మింగ్ మందులు వేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన వాటికి చికిత్స చేయాలని సూచించారు. పెద్దేవం గ్రామంలో పాడి గేదెలు కొద్ది రోజులుగా వరుసగా అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ గురువారం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చెందిన జమ్ముల శ్రీను, గెడ్డం మణికంఠ తదితరుల గేదెలను పరిశీలించి పాడి రైతులు, గ్రామస్తులను కలిసి వివరాలను సేకరించారు. గేదెలు మృత్యువాత పడడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సుగంధి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, రోగవ్యాప్తి జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మృతి చెందిన గేదెల రైతుల ఇళ్ల పరిసరాలను పరిశీలించి, నీటి పరీక్షలు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గేదెల మృతితో ఆర్థికంగా నష్టపోయామని, ఒక్కో గేదె రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఉంటుందని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, ఉప సర్పంచ్ తోట రామకృష్ణ, పాడి రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కాలుష్య కాసారంలా మారిన సుగంధి చెరువును ప్రక్షాళన చేయించాలని పలువురు కోరారు. చెరువు చుట్టూ ఉన్న గేదెలకే అంతు చిక్కని వ్యాధి వచ్చినట్టు చెప్పారు. అయితే, కొందరు రైతులు ఇంటి వద్ద ఉన్న పాడి గేదెలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా పశు సంవర్ధక శాఖ, మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో గేదెల వరుస మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు గాను మరణించిన గేదెలకు గురువారం పోస్ట్మార్టం చేశారు. గేదెల కిడ్నీ, లివర్, గుండె పాడయ్యాయని, లివర్ లోపల, పొట్టలో నత్తలున్నాయని చెబుతున్నారు. వీటి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపుతున్నట్లు మండల పశువైద్యాధికారి వరలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా, కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామంలో కూడా గేదెలు మృత్యువాత పడుతున్నాయనే సమాచారంతో కలెక్టర్ కీర్తి ఆ గ్రామంలో కూడా పర్యటించారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.2.4 లక్షల విరాళాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లా చిన్న ముషిడివాడకు చెందిన సిరికి అప్పాజీరావు, శ్రీదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ 2,00,116, మండపేటకు చెందిన ఉంగరాల సీతరాంప్రసాద్, పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.40,116 విరాళంగా సమర్పించారు. వారు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. దాతలకు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. క్యాష్ కౌంటింగ్ మెషీన్ సమర్పణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే నగదు లెక్కింపు నిమిత్తం రావులపాలెం మండలం లక్ష్మీపోలవరంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తరఫున క్యాష్ కౌంటింగ్ మెషీన్ను బహూకరించారు. ఆ మేరకు గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దానిని బ్యాంకు ఆర్ఎం జీ శ్రీనివాసరావు డీసీ అండ్ ఈఓ చక్రధరరావుకు అందచేశారు. కార్యక్రమంలో బ్యాంకు ప్లానింగ్ హెడ్ ఎంకేఎస్ శంకర్, బీఎం డి.రాజేష్, సిబ్బంది డి.సూర్యగోపాల్, హేమలత తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణం
● మెడి‘కల’ను చిదిమేస్తారా!● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమ బాట ● నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన ‘చలో మెడికల్ కాలేజ్’ ● విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొనాలని పిలుపు సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను చిదిమేసే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు.. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో దశల వారీగా ప్రైవేటీకరించాలని ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయం వైద్య విద్య చదువుకోవాలనే పేద విద్యార్థులకు అశనిపాతమే అవుతోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వలన వైద్య విద్య తమకు భారంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలతో పాటు వైఎస్సార్ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణను ఆపేందుకు ఎంత వరకై నా వెళ్లేందుకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో యువత, విద్యార్థులతో పాటు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో సర్వాంగ సుందరంగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల శరవేగంగా రూపుదిద్దుకుంది. దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక కళాశాల నిర్మించారు. అకడమిక్ కార్యకలాపాలకు వీలుగా ప్రీ–ఇంజిజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మించారు. మరోవైపు 12 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత కళాశాల భవనాల నిర్మాణం సైతం శరవేగంగా చేపట్టారు. బోధన వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణ పనులను రూ.475 కోట్లతో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులు అప్పటికే సింహభాగం పూర్తయ్యాయి. కళాశాల టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్, మెడికో, నర్స్ హాస్టల్స్ తదితర భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వైద్యులు, సిబ్బంది నియామకం కళాశాలలో విధులు నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను సైతం గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఆస్పత్రిలో అంతకు ముందు పని చేస్తున్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి, కొత్త వారిని నియమించారు. కళాశాలకు ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్తో పాటు 120 మందికి పైగా సిబ్బందిని నియమించారు. 150 సీట్లతో అడ్మిషన్లు కొత్త వైద్య కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాల నిర్వహణకు అప్పటి వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటా 150 సీట్లతో కళాశాల నిర్వహణకు అనుమతులు వచ్చాయి. మొదటిసారి జరిగిన అడ్మిషన్లలో 120 మంది విద్యార్థులు కళాశాలలో చేరారు. ప్రస్తుతం మూడో సంవత్సరం నడుస్తోంది. కళాశాలలో విశాలమైన ఏసీ లెక్చర్ రూములతో పాటు సువిశాలమైన కారిడార్లు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన ల్యాబ్లకు కావాల్సిన పరికరాలను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించారు. హైజెనిక్ ఫుడ్ అందిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో లేని విధంగా క్లాస్ రూముల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, వైద్య విద్య బోధిస్తున్నారు. శాంతియుతంగా నిరసన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజ్’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటలకు జక్కంపూడి రాజా నివాసం నుంచి నేతలు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకుంటాం. అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. యువత, విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. – కంఠమని రమేష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు విద్యార్థులకు అన్యాయం కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారనే స్పష్టత లేదు. వైద్య విద్య అభ్యసించాలన్న కలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు మానుకోవాలి. విద్యార్థులకు అన్యాయం చేస్తే వైఎస్సార్ సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. – మానుకొండ చంద్రబాబు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించాలి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లోనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే నేపాల్ తరహా ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. ఇప్పటి వరకూ టీడీపీ, కూటమి ప్రభుత్వాలు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. 15 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ సీటు కూడా తీసుకు రాలేదు. అటువంటిది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాం. ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేస్తే.. మాజీ సీఎం జగన్కు పేరు వస్తుందనే దుగ్ధతోనే ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. మెడికల్ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించలేమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
జాతీయ యోగాలో దేవాన్ష్కు రజతం
తుని: స్థానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్న బండారు దేవాన్ష్ నాయుడు అండర్ 17 వ్యక్తిగత జాతీయ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుపొందినట్టు విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ గురువారం తెలిపారు. ఈ నెల 13 నుంచి 16 వరకు హర్యానా రాష్ట్రం కర్నాల్ పట్టణంలో జాతీయ స్థాయి యోగా పోటీలు జరిగాయన్నారు. తమ విద్యార్థి రజత పతకం సాధించడం గర్వకారణమన్నారు. జాతీయస్థాయిలో ప్రతిభకనబర్చిన దేవాన్ష్ నాయుడిని విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.అరుణ, యోగా గురువు సురేష్ అభినందించారు. -
పరమేశు బయోటెక్కు ఉత్తమ పురస్కారం
దేవరపల్లి: ఫుడ్ ప్రాసెసింగ్లో సంవత్సరపు ఉత్తమ కంపెనీగా ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు–2025ను స్థానిక పరమేశు బయోటెక్ పరిశ్రమ దిక్కించుకుంది. సంస్థ ఎండీ ఆదవాని ఆనంద్ స్వరూప్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మొక్కజొన్న ఆధారిత స్పెషాలిటీ ఉత్పత్తుల దిగ్గజ సంస్థకు బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఫుడ్ ప్రొసెసింగ్ పురస్కారం దక్కించుకున్నట్టు ఆనంద్ స్వరూప్ పేర్కొన్నారు. విశిష్ట వృద్ధి సాధిస్తూ నవకల్పనలతో గ్రామీణాభివృద్ధిలో కీలక సేవలు అందిస్తున్నందుకు తమ కంపెనీకి ఈ పురస్కారం దక్కిందని ఆయన అన్నారు. 2015లో 160 టీపీడీ సామర్ధ్యంతో రూ.10 కోట్ల టర్నోవర్ నుంచి 2025 నాటికి 900 టీపీడీ సామర్ధ్యం, రూ.770 కోట్ల టర్నోవర్కు ఎదిగినట్టు ఆయన చెప్పారు. కంపెనీ ప్రత్యక్షంగా 400 మంది సిబ్బందికి, పరోక్షంగా 500 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. లక్షకు పైగా రైతు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే వేస్ట్–టు–వెల్త్ మోడల్ను తమ సంస్థ అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 1200 టీపీడీ ప్లాంటును ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. రెట్టింపు స్థాయిలో ఉద్యోగాల కల్పనతో పాటు గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టిపెడుతున్నట్టు ఆయన చెప్పారు. -
ఆమె స్థానం గురుతరం
● డీఎస్సీ–2025లో వారిదే హవా ● 51.6 శాతం పోస్టులకు ఎంపిక రాయవరం: పరీక్షలు ఏవైనా ఫలితాల్లో చాలా వరకు బాలికలే ప్రతిభ కనబరచడం చూస్తుంటాం. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2025లో కూడా మహిళలు సత్తా చాటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 51.6 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. మొత్తం 1,352 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 1,349 మంది ఫైనల్ సెలక్షన్ జాబితాలో ఉన్నారు. నాలుగు పోస్టులకు వివిధ కారణాలతో అభ్యర్థులు లేక పోవడంతో అవి భర్తీ కాలేదు. ఫైనల్ సెలక్షన్ జాబితాకు ఎంపికై న 1,349 పోస్టుల్లో వారిదే అగ్రస్థానంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. తుది జాబితాకు ఎంపికై న ఉపాధ్యాయ అభ్యర్థుల్లో 653 (48.4శాతం) మంది పురుష ఉపాధ్యాయ అభ్యర్థులు ఉండగా, 696 (51.6శాతం) మంది మహిళా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. గణితం, పీఎస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిషు వంటి సబ్జెక్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా మిగిలిన సబ్జెక్టులు, ఎస్జీటీ పోస్టుల్లో మహిళా ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఎంపిక కావడం గమనార్హం. ప్రభుత్వ/జెడ్పీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి యాజమాన్యాలకు చెందిన ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలదే హవా కన్పించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులకు ఎంపికై న వారి వివరాలు ఇలా సబ్జెక్టు మేల్ ఫిమేల్ మొత్తంఎస్ఏ తెలుగు 23 35 58 ఎస్ఏ ఇంగ్లీషు 50 45 95 ఎస్ఏ హిందీ 12 66 78 సంస్కృతం 03 02 05 ఎస్ఏ బయాలజీ 45 62 107 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 55 19 74 ఎస్ఏ గణితం 44 20 64 ఎస్ఏ సోషల్ స్టడీస్ 84 48 132 ఎస్ఏ (పీఈ) 142 69 211 ఎస్జీటీ (మైదానం) 167 254 421 ఎస్జీటీ (ఏజెన్సీ) 28 76 104 మొత్తం 653 696 1,349 -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
పాత కక్షలతో వ్యక్తిపై ముగ్గురి దాడి
బాధితుడికి 8 చోట్ల కత్తెర పోట్లు అమలాపురం టౌన్: రెండు కుటుంబాలకు మధ్య నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో ఒకరిపై ముగ్గురు వ్యక్తులు కత్తెరతో 8 చోట్ల దాడి చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన ముమ్మిడివరపు రాంబాబుపై అదే కాలనీకి చెందిన తమ్ములపల్లి పవన్కుమార్, భవిరిశెట్టి ధనుష్ అనే అఖిల్, భవరిశెట్టి వెంకట నర్సమ్మ టైలరింగ్ కత్తెరతో దాడిచేసి గాయపరచినట్టు కేసు నమోదైంది. వీరు మున్సిపల్ కాలనీ సమపంలోని ఆమని ఆటో మొబైల్స్ షాపు ఎదరుగా రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి ఘర్షణ పడ్డారు. కోపాద్రిక్తులైన పవన్కుమార్, అఖిల్ కత్తెరతో రాంబాబు శరీరంపై విచక్షణా రహితంగా పొడిచారు. ఈ సమయంలో పవన్కుమార్, అఖిల్ను దాడికి పురిగొల్పిన భవిరిశెట్టి వెంకట నరసమ్మపై కూడా కేసు నమోదైంది. ఇదలా ఉంటే తొలుత ముమ్మిడివరపు రాంబాబే తమ్మలపల్లి పవన్కుమార్ను గాయపరిచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తమ్మలపల్లి పవన్కుమార్ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరపు రాంబాబుపై కౌంటర్ కేసు నమోదైంది. సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని యువకుడి మృతి ముమ్మిడివరం: మోటారు సైకిల్పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు రాజుపాలెం సెంటర్లో మోటారు సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్న గుబ్బల వపన్కుమార్ (27) మోటారు సైకిల్పై రాజుపాలెం ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ఈడ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్కుమార్ అవివాహితుడు. అతడికి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి, చెల్లి ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల చోరీ కేసులో ముగ్గురి అరెస్టు కె.గంగవరం: మండలంలో వాహన చోరీలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై జానీ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన పెమ్మిరెడ్డి బాల వెంకట్ ఈ చోరీలకు పాల్పడ్డాడని, ఆ వాహనాలను కోటిపల్లికి చెందిన కర్రి సత్యనారాయణ అలియాస్ నాని, కె.గంగవరం గ్రామానికి చెందిన పెంటపాటి వీరబాబులకు విక్రయించినట్లు తెలిపారు. ఈ ముగ్గురిని గురువారం అరెస్టు చేసి రామచంద్రపురం కోర్టుకు తరలించడగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. వీరి నుంచి 6 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించినట్టు తెలిపారు. కేసును సీఐ వెంకట నారాయణ పర్యవేక్షణలో ఛేదించినట్టు తెలిపారు. కాగా వీరబాబు దగ్గర మరో 20 వరకు చోరీ చేసిన బైకులు ఉన్నట్లు సమాచారం. అట్రాసిటీ కేసులో ఒకరి అరెస్ట్ కపిలేశ్వరపురం: మండపేట పోలీసు స్టేషన్లో 2019లో నమోదైన అట్రాసిటీ కేసులో నిందితుడు గాడు సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు సీఐ సురేష్ గురువారం తెలిపారు. ఈ కేసులో రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని, దాని అమలులో భాగంగా హైదరాబాద్లో ఉంటున్న సత్యనారాయణను అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ సురేష్ తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
అల్లవరం: కొమరగిరిపట్నం రెవెన్యూ సముద్ర తీరం వెంబడి సీఆర్జెడ్ పరిధిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేస్తూ రాత్రి వేళల్లో సాగుతున్న అక్రమ రవాణాను ఊటగుంట సావరం గ్రామస్తులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. స్థానిక ఎంపీటీసీ పెచ్చెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొంత మంది యువకులు ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. సీఆర్జెడ్ పరిధిలోని ఇసుకను తరలించడానికి వీల్లేదంటూ నిరసన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై ఎంపీటీసీ స్థానిక తహసీల్దార్ వీవీఎల్ నరసింహరావు దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళల్లో లారీల రాకపోకలతో నిద్ర కోల్పోతున్నారని వారు తహసీల్దార్, అల్లవరం పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇసుక రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు. -
నూతన కలెక్టర్ను కలిసిన ఎస్పీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని ఆమె కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జి ల్లా అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, సమన్వయంతో కలసి ముందుకు సాగి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం, పరిపాలనలో పారదర్శకత, శీఘ్ర స్పందన, ప్రజలతో నేరుగా మమేకమయ్యే విఽ దానాలు, జిల్లా అభివృద్ధి, ప్రాధాన్య అంశాలపై చర్చి ంచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.రాహుల్, కూడా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రుడా పరిధిలో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు, పరిపాలనాపరమైన అంశాలు, గోదావరి పుష్కరాలకు ప్రతిపాదించిన పనులపై చర్చించారు. -
ఉమ్మడి జిల్లా డీఐజీగా జానకీదేవి బాధ్యతల స్వీకరణ
కాకినాడ లీగల్: ప్రస్తుత రిజిస్ట్రేషన్ విధానంలో క్రయ విక్రయదారులకు ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్లో అక్రమాలు జరగవని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ శాఖ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా సీహెచ్ జానకీదేవి అన్నారు. డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపాలు వల ఇబ్బందులు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రయ విక్రయదారుల ఆధార్కు ఓటీపీ వచ్చిన తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎటువంటి తప్పులు జరగవన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఎటువంటి లోపాలు లేకుండా వేగవంతంగా క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డీఐజీగా జానకీదేవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణ, కోనసీమ రిజిస్ట్రార్ సీహెచ్ నాగలింగేశ్వరరావు తదితరులు కలిశారు. -
రాష్ట్ర స్థాయి హాకీ, జిమ్నాస్టిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు డీఎస్ఏలో జరుగుతున్న ఎస్జీఎఫ్ఐ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీలో ప్రతిభను కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 బాలికల విభాగంలో పి.సంజన, జె.జ్వాలరాజేశ్వరి, అండర్–14 బాలుర విభాగంలో బి.పవన్, సీహెచ్ రాజు, అండర్–17 బాలుర విభాగంలో గోపాల్సాయి, బాలికల విభాగంలో బి.కుసుమ, నాగ నందిని, అండర్–19 హాకీలో జి.స్వరూప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపికయ్యారన్నారు. బుధవారం పాఠశాలో జరిగిన కార్యక్రమంలో పీడీలు వర ప్రసాద్, బి.శ్రీను, ఎంపికై న క్రీడాకారులను ఉపాధ్యాయులు రత్నప్రసాద్, విద్యార్థులు అభినందించారు. మలికిపురం: ఈ నెల 16న కాకినాడ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో గుడిమెళ్లంక ఉన్నత పాఠశాల విద్యార్థి కోసెట్టి తనూజ్ విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అక్టోబర్లో కాకినాడ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున తనూజ్ పాల్గొంటాడని హెచ్ఎం కె.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా వెయిట్లిఫ్టర్లు కాకినాడ క్రైం: అండర్–19 రాష్ట్ర స్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 19 మంది వెయిట్లిఫ్టర్లు ఎంపికయ్యారు. కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో బుధవారం కోచ్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 60 మందిలో 19 మంది ఎంపికయ్యారు. జయసూర్య, ఎ.రాహుల్, ఐ.మణికంఠ, డి.కారుణ్యముఖేష్, బి.రిషబ్, కె.సాయిదుర్గాప్రసాద్, జి.సుబ్రహ్మణ్యం, ఎ.సహస్ర, బి.ఇందిరాప్రియాంక, హాసిని, మాధురి, సీహెచ్ శ్రీసాద్విక, ఎండీ రహం, నిషాతో పాటు అండర్–17లో ఎం.దుర్గాప్రసాద్, సీహెచ్ సంతోష్కుమార్, బి.గాయత్రి, ఎం.నవ్యశ్రీ ఉన్నారు. కాకినాడలో జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలు రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్, హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థులతో హెచ్ఎం మూర్తి తదితరులు -
ముగిసిన టీఓటీల శిక్షణ
సర్టిఫికెట్లు అందజేసిన వైస్ ప్రిన్సిపాల్ సామర్లకోట: పేదరికం నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చామని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని టీఓటీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నేర్చుకున్న అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ–జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం–పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా గ్రామాలకు కావసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సుశీల, కేఆర్ నీహారిక, ఎస్ఎస్ శర్మ, శ్రీనివాసరావు, ఎం.చక్రఫణిరావు పాల్గొన్నారు. -
నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఉదయం 8 గంటలకు రెండో విడత బార్లకు లాటరీ తీయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. జిల్లాలో మిగిలిన 16 బార్లకు గాను బుధవారం రాత్రి 9 గంటల వరకు 32 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగిందన్నారు. నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లకు మాత్రమే లాటరీ తీయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 8 బార్లకు మాత్రమే నాలుగు దరఖాస్తులు చొప్పున వచ్చాయన్నారు. అర్ధరాత్రి 11.59 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామదని ఆమె తెలిపారు. మొదటి విడతలో ఆరు ఓపెన్ కేటగిరీలో, రిజర్వ్ కేటగిరిలో మూడు బార్లకు లాటరీ తీసిన విషయం తెలిసిందే. -
స్వచ్ఛతాహీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం
రాజమహేంద్రవరం సిటీ: స్వచ్ఛతాహీ సేవ 2025 కార్యక్రమం అమలులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛతాహి సేవా పురస్కరించుకుని బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎంపీ పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, త్రిపుల్ ఆర్ (రెడ్యూస్డ్–రీయూజ్–రీసైకిల్), స్వచ్ఛ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లకార్డులను ప్రదర్శించారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఘనంగా ప్రారంభమై అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతితో ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్ఓ వినూత్న, సిటీ ప్లానర్ కోటయ్య, మేనేజర్ ఎండీ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మందకొడిగా ఈ–క్రాప్
● 1.61 లక్షల ఎకరాల్లో నమోదు ● మారిన నిబంధనలతో వీఏఏల అవస్థలు ● ఈ నెలాఖరు వరకు గడువు ● నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు కొత్తపేట: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు అవుతోంది. రైతులకు అన్ని విధాలా ఉపయోగకరమైన పంట నమోదు (ఈ–క్రాప్) మాత్రం అనుకున్నట్లు సాగడం లేదు. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నాటికి 50 శాతం కూడా పంట నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వీఏఏలపై ఒత్తిడి చేస్తున్నారు. వీఏఏలకు పని ఒత్తిడి, గ్రామాలకు కొత్తవారు కావడం, ఎరువుల పంపిణీతో పాటు కొన్ని నిబంధనలు మార్చడంతో అనుకున్నట్లుగా పంట నమోదు జరగడం లేదు. రైతుల మేలు కోసం గత ప్రభుత్వం ఈ–క్రాప్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. పంట నమోదు చేసుకున్న రైతులకు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ వర్తింపజేసింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3,90,708 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరితో పాటు ఉద్యానవన పంటలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ ఈ నెల 30వ తేదీ లోగా నమోదు చేయాలి. ఇంకా కేవలం 14 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోగా పూర్తి చేయాలని అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. సకాలంలో పంట నమోదు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. పంట నమోదు సక్రమంగా కాకపోతే పండిన ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వస్తాయి. ఎరువులు సక్రమంగా ఇవ్వకపోగా ధాన్యం విక్రయానికి కూడా ఇబ్బంది కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మారిన నిబంధనలతో అవస్థలు గత ఖరీఫ్ సీజన్తో పోలిస్తే ఈ–క్రాప్ నమోదులో ఈ ఏడాది కొన్ని నిబంధనలను ప్రభుత్వం మార్చింది. గతంలో 200 మీటర్ల దూరం నుంచి ఈ–క్రాప్ నమోదుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దీనిని 20 మీటర్లకు కుదించారు. విధిగా వీఏఏలు ప్రతి కమతం దగ్గరకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. 25 సెంట్ల లోపు ఉన్న కమతాల్లో ఈ–క్రాప్ నమోదు చేసేందుకు కమతం వద్దకు వెళ్లకపోయినా ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే అయిపోయేది. ఫొటో అప్లోడ్ తప్పనిసరిగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆప్షన్ తొలగించారు. మరోపక్క యూరియా పంపిణీలో వీఏఏలు బిజీగా ఉండటంతో. ఈ–క్రాప్ అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఈ–క్రాప్ నమోదు బాధ్యత మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ)దే. వారు వీఏఏలను సమన్వయం చేసుకుని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ప్రయోజనాలు D&{M>‹³ ¯]lÐðl*-§ýl$¯]l$ {糆 OÆð‡™èl* ^ólƇ$$…-^èl$MøÐé-Í. C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ, C¯ŒS-ç³#sŒæ çܼÞyîl, ç³…rÌS Ñ{MýS-Ķæ*-°MìS, A¯]l²-§é™èl çÜ$T-¿ýæÐ]l ç³£ýlM>°MìS D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ™èlç³µ-°çÜ-Ç. MúË$ OÆð‡™èl$-ÌSMýS$ {糿¶æ$™èlÓ ç³£ýl-M>Ë$ A…§éÌS¯é² ç³…r ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-Mø-Ðé-Í. hÌêÏÌZ° 22 Ð]l$…yýl-ÌêÌZÏ Ððl¬™èl¢… Ð]lÅÐ]lÝëĶæ$, E§éů]l ç³…rË$ 3,90,708 GMýSÆ>ÌS ÑïÜ¢Æý‡~…ÌZ ÝëVýS$ AÐ]l#™èl$…yýlV> D ¯ðlÌS 15Ð]l ™ól© ¯ésìæMìS 1,60,578 GMýS-Æ>ÌZÏ D&{M>‹³ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. త్వరితగతిన పూర్తి చేయాలి ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు మండల స్థాయి అధికారుల (ఏఓ) పర్యవేక్షణలో గ్రామ స్థాయిలో వీఏఏలు పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చాం. మారిన నిబంధనలకు అనుగుణంగా వీఏఏలు తమ పరిధిలోని అన్ని పంటలనూ నమోదు చేయాలి. మండల వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంట నమోదు ప్రక్రియపై సమీక్ష చేస్తుండాలి. – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట -
రిక్రూట్మెంట్ డ్రైవ్కు 86 మంది హాజరు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు డాక్టర్ రెడ్డీస్ బుధవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్కి 86 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష నిర్వహించిన 54 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇంటర్ూయ్వలు నిర్వహించిన అనంతరం వీరిలో సంస్థకు అవసరమైన వారిని ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. 2024–25లో బీఎస్సీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ పూర్తి చేసి, పదో తరగతి నుంచి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్కి హాజరయ్యారన్నారు. ఉద్యోగాలకు ఎంపికై తే బీఎస్సీ వారికి రూ.2.10 లక్షలు, ఎంఎస్సీ వారికి రూ.2.60 లక్షలు వార్షిక వేతనంగా చెల్లిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని హుండీలను 27 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,15,09,966, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.34,11,312తో మొత్తం రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అలాగే 28 గ్రాముల బంగారం, రెండు కేజీల 180 గ్రాముల వెండి, కానుకలుగా వచ్చాయన్నారు. నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవదాయశాఖ అధికారి, ఏసీ సత్యనారాయణ వ్యవహరించారు. దేవదాయ ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, వెలిచేరు గ్రూపు దేవాలయాల ఈఓ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 10 నుంచి బ్రహ్మోత్సవాలు కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వస్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుంచి జరగనున్నాయని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రం భక్తుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. -
శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో 54వ శరన్నవరాత్ర ఉత్సవాలకు రాట ముహూర్తపు పూజలు బుధవారం నిర్వహించారు. ఏటా పీఠంలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రులకు వేద పండితులు చీమలకొండ వీరావధాని ఆధ్వర్యంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) కుమార్తె గాదె సత్యవెంకటకామేశ్వరి, భాస్కరనారాయణ దంపతులు పూజలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9.46 గంటలకు వినాయకపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం తదితర పూజలు చేశారు. అనంతరం పందిరి రాట వేసి ఉత్సవ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా కళాశాల కరస్పాండెంట్ పెద్దపాటి సత్యకనకదుర్గ, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా టీటీ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటి): విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవరచుకుని క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ తెలిపారు. బుధవారం డీఎస్ఏ టీటీ(టేబుల్ టెన్నిస్) హాల్లో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల ప్రారంభ కార్యక్రమానికి ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి కె.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ టీటీ చాలా వేగవంతమైన క్రీడ అన్నారు. ఎంతో ఏకాగ్రత ఉంటేనే గాని టీటీలో రాణించలేమన్నారు. టీటీలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సమాఖ్య కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టీటీ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక చేస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 120 మంది బాలబాలికలు ఎంపికలకు హాజరయ్యారు. అనంతరం టీటీ ఆడి డీఎస్డీఓ శ్రీనివాస్కుమార్ ఎంపికలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ నిర్వహణ కార్యదర్శి రవిరాజు, పీడీలు పాల్గొన్నారు. ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 మహిళా కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో యూటీఎఫ్ నిర్వహిస్తున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. గోకవరంలో 300 మంది యూటీఎఫ్ కార్యకర్తలతో ప్రారంభమైన బైక్ జాతా రాజమహేంద్రవరం చేరింది. స్థానిక కోరుకొండ రోడ్డులోనున్న యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిటీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన సుమారు రూ.20 వేల కోట్ల బకాయిను వెంటనే చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్లైన్లో అప్లోడ్, గ్రీన్ పాస్పోర్ట్ మొదలైన బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రణభేరి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ఈ సమస్యలపై ఎలుగెత్తి చెబుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను కూడా చెల్లించాలన్నారు. ఈనెల 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశాల్లో ఈ సమస్యలపై చర్చిస్తానన్నారు. రాష్ట్ర కార్యదర్శిఎన్.అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సి వేయాలన్నారు. అలాగే మధ్యప్రతిని ప్రకటించాలన్నారు. బైక్ జాతా కడియం మీదుగా కోనసీమ జిల్లా మండపేటకు వెళ్లింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిలు జ్యోతిబసు, టి.చక్రవర్తి, వివిధ జిల్లాల కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసరావు, కే.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ గోపిమూర్తి ఫ 25న విజయవాడలో రణభేరి -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
మీడియాపై అక్రమ కేసులు పెట్టడం అంటే ఈ కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు బిగిస్తున్నట్లే. పోలీసుల పదోన్నతుల్లో జరుగుతున్న అన్యాయంపై ‘సాక్షి’లో కథనం రాస్తే పోలీసులు స్వాగతించాల్సింది పోయి, కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు కేసులు పెట్టడం దారుణం. రాసిన కథనాల్లో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే వివరణ ఇవ్వాలే తప్ప ఇలా అక్రమ కేసులు బనాయించి వేధించడం సరికాదు. – రేవు తిరపతిరావు, పీడీఎస్యూ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అమలాపురం కక్ష సాధింపు చర్యలు సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై వరుసగా పోలీసు కేసులు పెట్టిస్తూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ ఘటనలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షి పత్రికను టార్గెట్ చేసి, దాని ఎడిటర్ను వేధించడమంటే పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం హరిస్తున్నట్లే. – కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ, అమలాపురం -
రాజకీయ సంగ్రామం
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2026 జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 2026 ఏప్రిల్ నెలతో ముగియనుంది. ఇదిలా ఉంటే ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది. తమకు అభ్యర్థిత్వం ఖరారు చేయాలంటూ ఆయా పార్టీల నేతలను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు ఓటర్ల జాబితా రూపొందించడం, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ఖరారు లాంటి అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల కన్నా మించి ఉంటే పోటీకి అర్హులవుతారని, ఆ విధంగా చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై నేతల్లో అంతర్మథనం నెలకొంది. అదే జరిగితే తాము పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న మీమాంస నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో గరం గరం స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. ఏ గ్రామంలో చూసినా.. ఏ సెంటర్లో విన్నా ఎన్నికల చర్చే నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్సిక్స్ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల నుంచి ఛీత్కారాలు తప్పడం లేదు. సంపద సృష్టి పేరుతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు దిగడం, బెల్ట్ షాపులు నడపడంతో ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రైతులకు అత్యవసరమైన ఎరువులు, యూరియా అవసరమైన మేరకు అందించడంతో ఘోరంగా విఫలమైంది. వెరసి రైతులు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ ఆందోళనలు తీవ్రం చేయడం.. ప్రజల పక్షాన నిలబడటంతో ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ స్థానిక ఎన్నికల దృష్ట్యా వార్డు రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. తమ గ్రామాల్లో ఏ వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందో..? అన్న విషయమై పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా వస్తే ఓకే.. లేదంటే ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టాలి..? వారి గెలుపునకు ఎలా కృషి చేయాలన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పులో ఇలా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు 7, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయతీలు 1,012, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వున్నాయి. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్ తదితర ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి.. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వాయిదా వేసింది. 2021లో గ్రామ పంచాయతీలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటి కాల పరిమితి రెండు నెలలు అటు.. ఇటు.. 2026 ఏప్రిల్ నెలతో ముగియనుంది. షెడ్యూల్ ఇలా..రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులకు లేఖ పంపింది. లేఖ ప్రకారం షెడ్యూల్ పరిశీలిస్తే... అక్టోబర్ 15: వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15: వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన నవంబర్ 1 నుంచి 15: ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ నవంబర్ 16: పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు సిద్ధంగా ఉంచాలి డిసెంబర్ 15: వార్డులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు వెల్లడించాలి. డిసెంబర్ నెల చివరిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. 2026: జనవరి నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికలు నిర్వహించాలి. ఫలితాలు సైతం వెల్లడించాలి. ఫ స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఫ నిర్వహణకు సిద్ధం కావాలంటూ అధికారులకు ఆదేశాలు ఫ రిజర్వేషన్లపై మల్లగుల్లాలు ఫ గ్రామీణ ప్రాంతాల్లో వేడెక్కిన రాజకీయం ఫ అభ్యర్థుల సంతానం, అర్హతపై సందిగ్ధత ఫ నియోజకవర్గ ఇన్చార్జ్ల వద్దకు పరుగులు అర్హతపై ఆందోళన స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అర్హత విషయంలో గందరగోళం నెలకొంది. దేశంలో అధిక జనాభా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో శ్రీఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దుశ్రీ అనే నినాదం మారుమోగింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న చట్టం తీసుకొచ్చింది. మగవాళ్లకు వేసక్టమీ శస్త్రచికిత్సలను సైతం ప్రోత్సహించారు. ఇద్దరు పిల్లలుంటే మంచిదన్న ప్రచారం విస్తృతం చేశారు. దీంతో చాలా మంది ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకున్నారు. తాజా పరిణామాలు అందుకు భిన్నంగా మారుతున్నాయి. ప్రపంచ జనాభా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అధిక జనాభా దేశానికి శక్తి అంటూ సీఎం చంద్రబాబు నినాదంగా పెట్టుకున్నారు. ప్రతి సమావేశంలోనూ పిల్లలను కనండంటూ ప్రసంగాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండాలన్న నిబంధన తీసుకొస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే జరిగితే ఇద్దరు పిల్లలున్న వారంతా పోటీకి దూరమవుతారు. ఈ పరిణామం పోటీదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. -
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం సిటీ: 2027లో మహా గోదావరి పుష్కర పనులు, నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఆర్ఎంసీ పరిధిలో చేపడునున్న, ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి, తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై సమగ్రంగా చర్చించారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శాఖ ఆధ్వర్యంలో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి, పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా రూ.456 కోట్లతో రహదారులు, డ్రైన్ల పనులు చేపట్టనున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 పుష్కరాల దృష్ట్యా క్రౌడ్ మేనేజ్మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. సమావేశంలో ఆర్ఎంసీ అధికారులు, రుడా అధికారులు పాల్గొన్నారు. -
పని ఒత్తిడి తగ్గించాలంటూ నోటీసుల అందజేత
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించాలని, గతంలో వలంటీర్లు చేసిన విధుల నుంచి తమని తప్పించాలని డిమాండ్లతో సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఈ కార్యాచరణ కోసం బుధవారం సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరిని కలసి తమ కార్యాచరణ ముందస్తు నోటీసును అందజేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి అందజేశామని ఉభయగోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ కోఆర్డినేటర్ దడాల జగ్గారావు అన్నారు. కార్యక్రమంలో కొల్లి రాజేష్, కాశీ విశ్వనాథ్, నాయుడు, రామాంజనేయులు, రామదాసు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పని చేస్తున్న ఆర్వీఎస్ రామచంద్రరావు పదోన్నతిపై బుధవారం రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎం.లక్ష్మణాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.లక్ష్మీనారాయణ అభినందనలు తెలియజేశారు. కార్యాలయ సిబ్బంది వర్మ, ఆనంద్, పలువురు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీపీఎస్ కేసులపై అవగాహన అవసరం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): DVýSÌŒæ òÜ…sŒæ B‹œ GMŠSÞ-Ìñæ-¯ŒSÞÌZ ¿êVýS…V> hÌêÏÌZ° A°² ´ùÎ-‹Ü-õÜtçÙ¯]lÏ ´ùÎçÜ$Ë$, OÆð‡rÆý‡$Ï, AíÜòÜt…sŒæ OÆð‡rÆý‡$Ï, MýS…ç³NÅrÆŠ‡ Bç³-Æó‡r-Æý‡ÏMýS$Ï G¯ŒSyîl-ï³-G‹Ü MóSçÜ$ÌS ç³NÇ¢ C¯ðlÓ-íÜtVóSçÙ¯ŒS {´÷ïÜ-f-ÆŠ‡Oò³ hÌêÏ ´ùÎ‹Ü M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ º$«§ýl-ÐéÆý‡… AÐ]l-V>-çßæ¯]l M>Æý‡Å-{MýSÐ]l$… °Æý‡Óíßæ…^éÆý‡$. MóSçÜ$ÌZÏ çÜÐ]l*-^éÆý‡… Ð]l_a-¯]lç³µsìæ ¯]l$…_ ^éÆŠ‡jï-ÙsŒæ §éQË$ ^ólõÜ…™èl Ð]lÆý‡MýS$ çÜÐ]l*-^éÆý‡… H Ñ«§ýl…V> ÇM>Æý‡$z ^ólĶæ*-Í, {´ëç³È-t° H Ñ«§ýl…V> ïÜgŒæ ^ólĶæ*-Í, GÌê ïÜÌŒæ ^ólĶæ*-Í, Ðól$h-[õÜtsŒæ Ð]l§ýlª C¯ðlÓ…-rȰ çÜÇ-tOòœ ^ólƇ$$…^ól Ñ«§é¯]l… Ð]l…sìæ ç³Ë$ A…Ô>ÌSOò³ ç³NÇ¢ AÐ]lV>-çßæ¯]l MýSÍ-µ…-^éÆý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Ayìl-çÙ-¯]lÌŒæ GïܵË$ G…½-G¯ŒS Ð]l¬Æý‡-ä-MýS–çÙ~, HÒ çÜ$º¾-Æ>-k, Ķæ$ÌŒæ.-A-Æý‡$j-¯Œl, G‹Ü½ yîlGïܵ ¼.Æ>-Ð]l$MýS–çÙ~, C™èlÆý‡ A«¨M>-Æý‡$Ë$, DVýSÌŒæ íܺ¾…¨ ´ëÌŸY¯é²Æý‡$.˘ రత్నగిరిపై ఏకాదశి పూజలు అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన, అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ పూజలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం వైద్య విద్యను వ్యాపారంగా చేయాలని చూడటం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. వైద్య కళాశాలల్లో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ (ప్రైవేటీకరణ) విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజ్’ పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టామని ప్రకాశ్నగర్లోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కళాశాలలు వచ్చాయని, వాటిని కొనసాగిస్తే ఆ క్రెడిట్ గత సీఎం జగన్కు వెళ్తుందన్న ఉద్దేశంతో ప్రైవేటీకరణకు దిగడం దారుణమన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ వ్యక్తిగత ఈగోలు పక్కనపెట్టి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలని కోరారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని నేడు ఆస్తులు ప్రైవేటీకరిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 835 ఎకరాల భూసేకరణ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల కోసం 835 ఎకరాల భూ సేకరణ చేశామన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం ప్రాంతాల్లో కళాశాలల నిర్మాణం పూర్తయింది. 750 సీట్లతో తరగతులు ప్రారంభించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బకాయిలున్నాయని, అందుకే నిర్మాణాలు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెబుతోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎలాంటి బకాయిలు లేవన్నారు. రూ.8,840 కోట్లతో పరిపాలనా అనుమతులు తెచ్చినట్లు వివరించారు. నాబార్డు నిధులు సైతం మంజూరయ్యాయన్నారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికే కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక్క వైద్య కళాశాలైనా తెచ్చిందా అని ప్రశ్నించారు. వైద్య కళాశాలల్లో సౌకర్యాలు కల్పించలేమని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే కూటమి నేతలను, ఎమ్మెల్యేలను స్థానిక ప్రజలు తరిమికొడతారన్నారు. విద్య, వైద్యం, పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. ·˘Æó‡ç³# ^èlÌZ Ððl$yìlMýSÌŒæ M>ÌôægŒæ ·˘ MýS*rÑ$ {糿¶æ$™èlÓ ï³ï³ï³ విధానంపై వ్యతిరేక ఉద్యమం ·˘ïÜG… ^èl…{§ýl-»êº$, పవన్, లోకేష్ ఈగోలకు పోవద్దు ·˘ OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ Ä¶æ¬Ð]l-f¯]l Ñ¿êVýS… రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజం -
గౌరవ వేదన
బకాయిలు దారుణం ఇమామ్లు, మౌజన్లకు 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వ తీరుతో వారందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆదాయం లేని మసీదుల నిర్వహణ కష్టంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది లేదు. – మహ్మద్ ఆరీఫ్, వక్ఫ్బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు తక్షణమే మంజూరు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం కూటమి ప్రభుత్వం మసీదుల నిర్వహణకు రూ.5 వేలు చొప్పున తక్షణమే నిధులు విడుదల చేయాలి. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలను వెంటనే అందజేయాలి. 11 నెలలుగా వేతనాలు లేక వారందరూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – ఎస్కే ఇబ్రహీం బాషా, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరవలి: మైనార్టీల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలంబిస్తోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది. ముఖ్యంగా ఇమామ్, మౌజన్లకు దాదాపు 11 నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదు. మసీదు నిర్వహణ నిధుల మాటే మర్చిపోయింది. దీంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మసీదులకు సొంతంగా ఆదాయం ఉండదు. వాటిని నిర్వహించే ఇమామ్లు, మౌజన్లు ప్రతి నెలా ప్రభుత్వమిచ్చే గౌరవ వేతనాల పైనే ఆధారపడతారు. ఈ నేపథ్యంలో గౌరవ వేతనాలు విడుదల చేయాలంటూ మైనార్టీలు నేరుగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కూటమి కక్ష సాధింపు! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వరకూ ఇచ్చిన వేతనాన్ని రెట్టింపు చేసి, ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున ప్రతి నెలా పంపిణీ చేసేవారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. ముస్లింలపై నిర్లక్ష్య వైఖరిని అవలంబించే కూటమి నాయకులు.. 11 నెలలుగా గౌరవ వేతనం మంజూరు చేయడం లేదు. దీంతో వారందరూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. జగన్ ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది తలెత్తలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వారందరూ వాపోతున్నారు. రూ.1.95 కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంటే.. దాదాపు 11 నెలల నుంచి గౌరవ వేతనాలు బకాయిలు ఉన్నాయంటే మసీదుల విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. చిన్న కార్యక్రమాలకు కూడా రూ.కోట్ల ప్రజాధనంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరిగే కూటమి నాయకులకు.. మసీదు నిర్వహణ మాత్రం భారంగా మారడం దారుణం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వేతనం అందుకునే ఆదాయం లేని మసీదులు 118 ఉన్నాయి. వాటికి 11 నెలలుగా వేతన బకాయిలు అంటే ఒక్కొక్క మసీదుకు రూ.1.65 లక్షల చొప్పున రూ.1,94,70,00 అంటే.. సుమారు రూ.1.95 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కొక్క ఇమామ్కు నెలకు రూ.10 వేల చొప్పున రూ.1.10 లక్షలు, ఒక్కో మౌజన్కు నెలకు రూ.5 వేల చొప్పున రూ.55 వేల బకాయిలు ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఇమామ్లు, మౌజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ముస్లిం సంఘాలతో పాటు మేధావులు, మానవతావాదులను కలుపుకొని డిమాండ్ల సాధనకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మసీదుల నిర్వహణకు.. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ అధికారం చేపట్టాక ఆ విషయం మర్చిపోయారు. లెక్కల ప్రకారం.. కనీసం చిన్న మసీదుకు నెలకు రూ.5 వేల చొప్పున జిల్లాలోని 118 వాటికి నెలకు రూ.5.90 లక్షలు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు కాలానికి మొత్తం రూ.88.50 లక్షలు అవుతోంది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే షాదీ తోఫా పేరుతో రూ.లక్ష ఇస్తామన్న హామీని కూడా తుంగలో తొక్కారు. వైఎస్సార్ సీపీ హయాంలో.. వైఎస్సార్ సీపీ హయాంలో అన్ని వర్గాలతో పాటు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారు. తాను అధికారంలోకి రాగానే ఇమామ్లకు, మౌజన్లకు రెట్టింపు గౌరవ వేతనం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా అధికారం చేపట్టగానే ఇమామ్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, మౌజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనాలు చెల్లించారు. వారందరికీ జగనన్న కాలనీల్లో స్థలాలు, ఇళ్లు మంజూరు చేసి ఆదుకున్నారు. ముస్లింలపై కూటమి చిన్నచూపు ఇమామ్, మౌజన్లకు అందని గౌరవ వేతనాలు 11 నెలలుగా చెల్లించని సర్కారు జిల్లాలో 118 మసీదులు -
సుప్రీం ఆదేశాలు కూటమికి చెంపపెట్టు
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఆరీఫ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వివాదాస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు రాష్ట్రంలోని కూటమి పాలకుల ముస్లిం వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు వంటిదని వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఆరీఫ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ చట్టం సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు ముస్లిం సమాజానికి ఊరట కలిగించాయన్నారు. తుది తీర్పులో ముస్లింలకు శాశ్వత న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ వివాదాస్పద వక్ఫ్ చట్టానికి అనుకూలంగా పార్లమెంటులో తన ఎంపీలతో చంద్రబాబు ఓటు వేయించారన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ముస్లిం ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని మరోసారి నిరూపిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఆదేశాలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ముస్లిం సమాజం రుణపడి ఉంటుందన్నారు. టీడీపీ మద్దతుతో ఈ బిల్లు ఆమోదం పొందిందని, చంద్రబాబు నిర్ణయం వల్లే ముస్లిమేతరులు వక్ఫ్బోర్డులో సభ్యులుగా వచ్చారన్నారు. -
కొబ్బరి చెక్కల వేలం రూ.7.06 లక్షలకు ఖరారు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో (2025–26) ఏడాది కాలానికి కొబ్బరి చెక్కలు పోగుచేసుకునేందుకు రూ.7.06 లక్షలకు వేలం ఖరారైంది. అలాగే తలనీలాలు తీసుకునేందుకు రూ.71 వేలకు పాడుకున్నారు. ఆలయ ఆవరణలో అధికారుల సమక్షంలో మంగళవారం ఈ వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ మొదటి ఏడాది ఈ విధంగా ఉండగా, 2026 – 27లో ప్రస్తుతం పాడిన పాటపై 10 శాతం పెంచి సొమ్ములు కట్టించుకుంటామన్నారు. దీని ద్వారా వచ్చే ఏడాది రూ.7,76,600 వస్తుందన్నారు. ఈ వేలం పాటలో గత ఏడాది కంటే రూ.2,73,500 ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి జి.సత్యప్రసాద్ నేతృత్వంలో గ్రామ పెద్దలు రంగినీడి కట్లయ్య, బొలిశెట్టి ప్రసాద్ తదితరుల సమక్షంలో వేలం నిర్వహించారు. రూ.636.97 కోట్లతో డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళిక సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను 10,635 సంఘాలకు రూ.636.97 కోట్లతో డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూర్తి మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి ఇద్దరు మహిళా సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి రుణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్రసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతి పెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ వర్గీకరణతో వంద మందిలో నలుగురికే లబ్ధి చేకూరుతుందన్నారు. చంద్రబాబు, రేవంత్రెడ్డిలు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం అంటున్నారని, అయితే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవులను ఎస్సీలకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. వేతన బకాయిలు విడుదల చేయాలిరాజమహేంద్రవరం రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు (వీవోఏలు) మంగళవారం బొమ్మూరులోని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ 5జీ మొబైల్ ఇవ్వకుండా ఆన్లైన్ వర్కులు చేయలేదని వేధించడం తగదన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి స్వరూపారాణి, మహాలక్ష్మి మాట్లాడుతూ వీఓఏలపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని కోరారు. అనంతరం డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శిరీష, గణికమ్మ బేబీ, కుసుమకుమారి, సత్యవతి, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల ఉద్యమబాట
● నేటి నుంచి నిరసనలు ● జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ రాజమహేంద్రవరం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించిన వారందరూ బుధవారం నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆందోళన కార్యక్రమాలపై బొమ్మూరులోని 220 కేవీ సబ్స్టేషన్ ఏపీ ట్రాన్స్కో ఓఅండ్ఎం సర్కిల్ ఎస్ఈకి నోటీసు కూడా అందజేశారు. ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని ఏపీ ట్రాన్స్కో ఓఅండ్ఎం సర్కిల్ జేఏసీ చైర్మన్ జగతా అచ్యుత రామయ్య, కన్వీనర్ పి.రవికుమార్ వివరించారు. డిమాండ్లు ఇవే ● నగదు రహిత వైద్యం అందించాలి. ● 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి. ● దళారీ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. దీర్ఘకాలిక సర్వీసు గల వారందరినీ సంస్థలో విలీనం చేయాలి. ● పాత పద్ధతిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● జేఎల్ఎం గ్రేడ్–2లను జేఎల్ఎంలుగా పరిగణించాలి. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలి. ● ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన సబ్ ఇంజినీర్లకు ఏఈలుగా పదోన్నతిలో అవకాశం కల్పించాలి. ● అర్హులైన ఓఅండ్ఎం ఉద్యోగులను జూనియర్ సహాయకులు, సబ్ ఇంజినీర్ ఖాళీలలో నియమించాలి. ● ప్రమాదాలు జరిగినప్పుడు సాంకేతికపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలి. నల్లబ్యాడ్జీలతో నిరసన రాష్ట్ర పవర్ జేఏసీ పిలుపు మేరకు కాతేరు మల్లయ్యపేట 132 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు డేవిడ్ రాజు, అర్జున్, గంగరాజు, రెడ్డి, నాగులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సమస్యల పరిష్కారమయ్యే వరకూ ఆందోళనను విరమించేది లేదన్నారు. నిరసనల షెడ్యూల్ ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని సర్కిల్ ఆఫీసులు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయాల్లో ధర్నా 19, 20 తేదీల్లో అన్ని సర్కిల్ ఆఫీసులు, జనరేటింగ్ స్టేషన్ల ముందు రిలే నిరాహార దీక్షలు 22న జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించి, కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం -
అంతర్ జిల్లాల మోటార్సైకిళ్ల దొంగల అరెస్ట్
26 మోటార్ సైకిళ్లు స్వాధీనం పెరవలి: ఇళ్ల వద్ద ఉన్న మోటార్ సైకిళ్లను దొంగిలించడంలో ఆరితేరిన అంతర్ జిల్లాల నేరస్తులను పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. తూర్పు, పశ్చిమ, కాకినాడ, విశాఖ, కోనసీమ జిల్లాల్లో దొంగిలించిన 26 మోటార్ సైకిళ్లను దొంగల నుంచి పోలీసులు రికవరీ చేసి వారిని అరెస్ట్ చేశారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ పెరవలి పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లాల్లో 26 మోటార్ సైకిళ్లను దొంగిలించారని వీటి విలువ రూ.40 లక్షలని తెలిపారు. ఈ దొంగతనాలకు పాల్పడిన యువకులు పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన తుమ్మగంటి ధనుష్, నెక్కంటి యువరాజు, వనచర్ల రాజు, కూనపురెడ్డి వీరబాబు ఉండగా, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్, అబ్బిరెడ్డి పాపారావు ఉన్నారన్నారు. ఈ దొంగతనాల్లో ప్రధాన నిందితులు తుమ్మగంటి ధనుష్, విశ్వనాథుల దేవిశ్రీ ప్రసాద్లని తెలిపారు. ప్రస్తుతం ఐదుగురుని అదుపులోకి తీసుకున్నామని విశ్వనాధుల దేవిశ్రీప్రసాద్ పరారీలో ఉన్నాడని ఇతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్లు తిరుగుతున్నారని చెప్పారు. మోటార్ సైకిళ్ల చోరీ కేసులో పెరవలి, కొవ్వూరు, నిడదవోలు పోలీసులు ఎంతో చాకచక్యంగా నేరస్తులను పట్టుకుని వారి నుంచి 26 మోటార్సైకిళ్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకున్న పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, ట్రైనీ ఎస్సై కె.సౌజన్యను అభినందించారు. ఈ కేసును త్వరితగతని చేధించడానికి కారణమైన పోలీసు సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐ పీవీజీ తిలక్, సిబ్బంది పాల్గొన్నారు. మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్ కాకినాడ రూరల్: సర్పవరం పోలీసులకు మోటారు సైకిళ్ల దొంగ పట్టుబడ్డాడు. 20 ఏళ్ల వయసులోనే చాకచక్యంగా బైక్ల చోరీల్లో ఆరితేరాడు. సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన పెంకే తేజను సోమవారం నిందితుడిని సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్సై శ్రీనివాస్కుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. నిందితుడి నుంచి రూ.6.5 లక్షల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన క్రైమ్ సిబ్బంది హెచ్సీలు సత్తిబా బు, రాజు, గణేష్, పీసీలు రవి, శ్రీనివాస్, అనిల్, చి న్నబాబు, కిశోర్లను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
పంట కాలువలో గూడ్స్ వాహనం బోల్తా
ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు జట్టు కార్మికులు పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో మొండెపులంక గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జట్టు కార్మికులతో వెళ్తున్న గూడ్స్ వ్యాన్ అదుపుతప్పి పంట కాలువలో పడిపోయింది. ప్రమాదం నుంచి వ్యాన్లో ఉన్న ఐదుగురు జట్టు కార్మికులు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన జట్టు కార్మికులు మంగళవారం జగ్గన్నపేటలో ఇంటికి శ్లాబు వేశారు. శ్లాబు పనులు ముగిసిన అనంతరం సంబంధిత సామాన్లు, మిల్లర్తో సహా వ్యాన్లో పలివెల గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ మొండెపులంక వద్ద కుడివైపున ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వ్యాన్లో ఉన్న వారిని బయటకు తీసారు. వ్యాన్లో ఉన్న వైబ్రేటర్లు, ఇతర సామాన్లు నీట మునిగాయి. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్మికులకు స్థానికులు సహాయం అందించారు. రోడ్డుకు ఎడమవైపు ఉన్న ప్రధాన పంట కాలువలోకి వ్యాన్ పడిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు వివరించారు. -
కౌలుకోలేక..
ఫ నానాటికి దూసుకుపోతున్న పొగాకు ధరలు ఫ ఎకరాకు కౌలు రూ.80 వేలు ఫ బ్యారన్లదీ అదే పరిస్థితి ఫ లబోదిబో మంటున్న కౌలు రైతులు ఫ జీడిమామిడి, ఆయిల్పామ్ తోటల తొలగింపు దేవరపల్లి: రోజురోజుకూ పొగాకు ధరలు అంచనాలకు అందని రీతిలో పెరుగుతున్నాయి. రైతులు మునుపెన్నడూ ఊహించని విధంగా కిలోలకు గరిష్టంగా రూ.430 లభిస్తోంది. ఈ ధర ఇటు రైతులు.. అటు కౌలు రైతులకు కాసులు కురిపిస్తుండగా.. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు.. దీని ప్రభావం 2025–26 ఏడాది సాగుపై పడింది. భూముల కౌలు, బ్యారన్ల లీజులు, బ్యారన్ల లైసెన్సు ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో ౖపైపెకి ఎగసిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే భూముల కౌలు స్వల్పంగా పెరిగినప్పటికీ బ్యారన్ల లీజు, లైసెన్సు ధర పెరగడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. పొగాకు వ్యవసాయం చేసే రైతుల్లో 80 శాతం కౌలుదారులే ఉన్నారు. కౌలు భూములు, లీజు బ్యారన్లు కొరకు ఇప్పటి నుంచి కౌలు రైతులు హడావుడి పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు భూములను కౌలుకు, బ్యారన్లను లీజుకు తీసుకుని సిద్ధమవుతున్నారు. జీడిమామిడి, మామిడి, కొబ్బరి, ఆయిల్పామ్ తోటలను తొలగించి పొగాకు సాగు చేయడానికి భూములను సిద్ధం చేస్తున్నారు. ఎకరం కొబ్బరితోటపై ఆదాయం రూ.30 వేలు, జీడిమామిడి తోటపై రూ.20 వేలు, ఆయిల్పామ్ పంటపై రూ.50 వేలకు మించి ఆదాయం రావడం లేదని, భూములను కౌలుకు ఇస్తే శ్రమలేకుండా ఎకరాకు రూ.70 నుంచి 80 వేలు వస్తోందని రైతులు అంటున్నారు. పెద్ద రైతులంతా పొగాకు వ్యవసాయానికి స్వస్తి చెప్పి బ్యారన్లను లీజుకు ఇచ్చి భూముల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. గణనీయంగా పెరగనున్న పొగాకు సాగు విస్తీర్ణం 2025–26 సంవత్సరానికి జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 2024–25 పంట సీజన్లో రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో సుమారు 29 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 2023–24 ఏడాదిలో తూర్పు, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 27 వేల హెక్టార్లలో పంట సాగు చేసినట్టు అధికారులు తెలిపారు. బోర్డు అనుమతించిన దానికంటే అదనంగా సుమారు 20 నుంచి 25 వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. 2023–24 సీజన్లో 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 80 మిలియన్ల కిలోలు పండించారు. 2024–25 సీజన్లో 49 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా 67 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఎన్ని నిబంధనలు విధించినా వచ్చే ఏడాది 100 మిలియన్ల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. బ్యారన్ లైసెన్స్ ధర రూ.10.50 లక్షలు మార్కెట్లో పొగాకు ధర అనూహ్యంగా పెరగడంతో బ్యారన్ లైసెన్సు ధర రైతులకు అందుబాటులో లేకుండా పోయింది. 2022లో బ్యారన్ లైసెన్సు ధర రూ.2.60 లక్షలు, 2023లో రూ.4 లక్షలు ఉండగా, 2024–25లో రూ.10.50 లక్షలు, ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతుంది. గతంలో బ్యారన్లు అమ్ముకున్న రైతులు ప్రస్తుత ధరను చూసి లబోదిబో మంటున్నారు. గత ఏడాది బ్యారన్ లీజు రూ.60 నుంచి 70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.1.70 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.2.10 లక్షలు పలుకుతుందని రైతులు తెలిపారు. గత రెండేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు ప్రస్తుతం అద్దె పలుకుతుందని రైతులు తెలిపారు. రెట్టింపు పలుకుతున్న భూమి కౌలు సాగు భూమి కౌలు ధర రెట్టింపు పలుకుతుంది. గత ఏడాది ప్రాంతాన్ని బట్టి కౌలు ధర పలుకుతుంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల్లో ఎకరం కౌలు రూ.80 వేలు పలుకుతుండగా, దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెం, యర్నగూడెం గ్రామాల్లో రూ.75 వేలు, దేవరపల్లిలో రూ.70 వేలు కౌలు ధర పలుకుతుందని రైతులు తెలిపారు. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో నల్లరేగడి భూముల కౌలు రూ.70 వేలు పలుకుతున్నట్టు రైతులు తెలిపారు. 2022లో ఎకరా కౌలు రూ.25 వేల నుంచి 30 వేలు ఉండగా, 2023–24లో రూ.35 వేల నుంచి 42 వేలు పలికింది. 2024–25లో రూ.60 నుంచి 70 వేలు పలికిన కౌలు ప్రస్తుతం రూ.70 నుంచి 80 వేలు పలుకుతున్నాయని కౌలు రైతులు వాపోతున్నారు. -
గర్జించే సింహం కన్న, గాయపడ్డ సింహం ప్రమాదకరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహమే ప్రమాదకరమని చంద్రబాబు గుర్తించుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితో కాకాణి మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడుతూ నాలుగు ప్రధానమైన మూలస్తంభాల ఆధారంగా ప్రజాస్వామ్య సంరక్షణకు అంబేడ్కర్ రాజ్యాంగం రచిస్తే, చంద్రబాబు.. ఆయన తనయుడు నారా వారి రెడ్ బుక్తో నాలుగు వ్యవస్థలను ఏర్పరచుకుని రాష్ట్రాన్ని ఏలుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీలో ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎటువంటి కేసులు పెట్టాలి. జైల్లో పెట్టి ఎన్ని రోజులు ఉంచాలి, అనుకూల మీడియాతో ప్రజల్లోకి ఎలా తప్పుడు సంకేతాలు పంపాలనే నాలుగింటిపై పాలన జరుగుతోందన్నారు. మీరు చేస్తున్న ఈ పనుల వల్ల మీ శాడిజాన్ని తీర్చుకోగలరేమో కానీ మిథున్రెడ్డి వ్యక్తిత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి 86 రోజులు జైలులో పెట్టి నిర్బంధించిందన్నారు. జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు మమ్మల్ని ఆపలేరన్నారు. రెండో విడత జగనన్న 2.0 చూడబోతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతులు యూరియా, విత్తనాల కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితులు ఏర్పడ్డాయా అన్నారు. చంద్రబాబు తెచ్చిన లక్షల టన్నుల యూరియా రైతులకు అందకుండా ఏమైందన్నారు. యూరియా బ్లాక్ లో అమ్ముకోవడానికి రూ.250 కోట్లు చేతులు మారాయన్నారు. ఈ నెల 19వ తేదీ వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపుమేరకు రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీల వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కాటసాని రామ్గోపాల్రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగంలో ఏ నాయకుడి మీదైనా కేసు పెట్టొచ్చన్నారు. ఈ విధమైన పరిపాలన, పోలీసు వ్యవస్థలను తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నానన్నారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఆధారాలు లేని అభియోగాాలు మోపి జైల్లో పెట్టారని మిథున్రెడ్డి చెబుతున్నారన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ జగనన్న వేసిన పునాదిపై సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. -
13 రోజుల తరువాత మృతదేహం రాక
మలికిపురం: ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం గల్ఫ్ దేశమైన దుబాయికి వెళ్లిన రామరాజులంక గ్రామానికి చెందిన రాపాక విజయభారతి ఈ నెల 3న దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెందింది. 13 రోజుల తరువాత మంగళవారం ఆమె మృతదేహం స్వగ్రామానికి చేరింది. దుబాయ్లోని సమీప బంధువులు, అడ్వకేట్ నల్లి శంకర్ కృషితో తగిన విదేశీ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, నల్లి శివకుమార్ తదితరులు ఆమె మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్గా సాత్విక్
అమలాపురం టౌన్: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ స్థానం సాధించాడని జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీల్లో 140 మంది క్రీడాకారులు పాల్గొనగా సాత్విక్ బ్లిట్జ్ చెస్లో 7 రౌండ్లకు 6.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. త్వరలో త్రిపుర రాష్ట్రంలో జరగనున్న నేషనల్ బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో సాత్విక్ మన రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించనున్నాడు. నంద్యాలలో చాంపియన్ షిప్ నిర్వాహకుల నుంచి విజేత సాత్విక్ రాష్ట్ర బ్లిట్జ్ చెస్ చాంపియన్గా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. రాష్ట్ర విజేత సాత్విక్ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, జిల్లా అసోసియేషన్ సెక్రటరీ వెంకట సురేష్ అభినందించారు. -
కూటమిలో ఫ్లెక్సీల రగడ
● మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భగ్గుమన్న వర్గ విభేదాలు ● మాజీ టీడీపీ ఎమ్మెల్యే శేషారావు ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు నిడదవోలు : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంలో నిడదవోలు కూటమిలో సోమవారం ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు నిడదవోలు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినప్పటి నుంచి మొదలైన వైషమ్యాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దుర్గేష్ ఎమ్మెల్యేగా ఎన్నికై పర్యాటక శాఖ మంత్రి పదవి పొందినా అసమ్మతి జ్వాలలు మాత్రం ఆగడం లేదు. ఈ నెల 17న మంత్రి దుర్గేష్ జన్మదినం సందర్భంగా ఇటీవల జనసేనలో చేరిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మంత్రి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది భారీ పొక్లెయిన్ సాయంతో కడుతున్నారు. అయితే ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను తొలగించి మంత్రి దుర్గేష్ ఫ్లెక్సీలు కడుతుండడంతో వివాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరావు కార్యకర్తలతో కలిసి ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అప్పటికే బ్రిడ్జిపై ఉన్న 6 శేషారావు ఫ్లెక్సీలను తొలగించారు. టీడీపీ నాయకులు శేషారావు ఫ్లెక్సీల తొలగింపును అడ్డుకున్నారు. శేషారవు ఫ్లెక్సీలను తొలగించి కింద పడవేయడం ఎంతవరకు సమంజసం అంటూ మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. దీనిపై సిబ్బంది సమాధానం ఇస్తూ మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణవేణి ఆదేశాల మేరకే మంత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్ముని వెంకటేశ్వరరావు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో టీడీపీ నాయకులు ఓవర్ బ్రిడ్జిపై ఆందోళనకు దిగారు. శేషారావు చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీలను పట్టుకొని ర్యాలీ చేశారు. మున్సిపల్ సిబ్బంది తొలగించిన శేషారావు చిత్రపటాలను తీసుకుని వాటిని పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి పడేసి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల పక్షపాత ధోరణి డౌన్ డౌన్, శేషారావు జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు జనసేన నాయకుల కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులను ముందు పెట్టి జనసేన నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు. చివరకు శేషారావు ఫ్లెక్సీల తొలగింపు నిలిపివేసిన తర్వాత ఆందోళన విరమించారు. -
పాడైన పంటల పరిశీలన
పెరవలి: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు, గోదావరికి వరదల వల్ల లంక భూముల్లోని కూరగాయల పంటలు దెబ్బతినటం వాస్తమేనని అందుకే కూరగాయల ధరలు పెరిగాయని అధికారులు అన్నారు. సాక్షి దినపత్రిలో కూరగాయాలు అంటూ సోమవారం కథనం వచ్చిన నేపథ్యంలో ఉద్యాన అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. వారు ఖండవల్లి, కాకరపర్రు, ముక్కామల గ్రామాల్లో నష్ట పోయిన పంటల వివరాలు రైతుల నుంచి సేకరించారు. కొవ్వూరు ఉద్యాన అధికారి డి సుధీర్కుమార్ మాట్లాడుతూ గోదావరికి వరదల వలన లంకల్లో ఉండే సి క్లాస్ భూముల్లో కూరగాయల పంటలు నీటమునిగి పాడైపోయాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, అందుకే కూరగాయల ధరలు పెరిగాయన్నారు. రైతులు సంఘటితంగా ముందుకు వస్తే మార్కెటింగ్ శాఖ సహకారంతో రైతుబజార్లు ఏర్పాటు చేస్తామని, కూరగాయలు నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగులు నిర్మిస్తామని అన్నారు. పీజీఆర్ఎస్లో 152 అర్జీల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవనంలో సోమవారం ఇతర అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ప్రజల నుంచి 152 అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ అర్జీలను పలు మార్గాల్లో అందించవచ్చన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా, వాట్సాప్ గవర్నెన్స్కు 95523 00009 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. హౌసింగ్ పీడీగా బుజ్జి బాధ్యతల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాతి బుజ్జి సోమవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థలో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కేఆర్సీ (కోనేరు రంగారావు కమిటీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. -
డేంజర్లో ఓజోన్
రాయవరం: ఎండ, వాన నుంచి మనకు గొడుగు ఎలా రక్షణ ఇస్తుందో కంటికి కనిపించని ఓజోన్ పొర కూడా భూమిపై జీవరాశిని అలానే కంటికి రెప్పలా కాపాడుతోంది. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పోషిస్తుండడం వల్ల ఓజోన్ పొరకు నేడు ప్రమాదం ఏర్పడింది. తుపానులో సుడిగాలికి చేతిలోని గొడుగు అల్లాడినట్లు కాలుష్యం తాకిడికి ఓజోన్ రక్షణ ఛత్రం విలవిల్లాడుతుతోంది. ఇది చిల్లులు పడినా జల్లెడలా తయారైందంటే జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వనాలు పెంచి.. కాలుష్యాన్ని తుంచి ఓజోన్ పొరను రక్షించుకుంటేనే.. అది మనల్ని రక్షిస్తుంది. ఓజోన్ రక్షిత..రక్షితః అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబరు 16న ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు. దుష్ఫలితాలివీ.. ’ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరుతున్నాయి. ’ఫలితంగా మనుషుల్లో చర్మ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, కంటి సంబంధ వ్యాధులు, చర్మ, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంది. జంతువులపై ఇవి మరింత తీవ్ర పరిణామాలు చూపుతున్నాయి. ’మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గి మొక్కల ఆహార తయారీలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ’సముద్ర జీవజాలంపై పరోక్షంగా ఈ ప్రక్రియ ప్రభావితం చూపిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ’ఉష్ణోగ్రతలు పెరిగి, భూమి అగ్నిగోళంలా మారుతుందనే హెచ్చరికలు లేకపోలేదు. ఆకాశం నీలంగా కనిపించడానికి.. పగటి సమయంలో ఆకాశం నీలంగా కనిపించడానికి ప్రధాన కారణం ఓజోన్ పొర. సూర్యుని నుంచి బయలుదేరిన కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ సూర్య కిరణాల్లో జీవావరణానికి ఉపయోగపడే కిరణాలతో పాటు జీవరాశికి వినాశనం కలిగించే అతి నీలలోహిత (ఆల్ట్రా వయోలెట్) కిరణాలు కూడా ప్రసరిస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమికి చేరినట్లయితే దాని వల్ల జరిగే రసాయన చర్య వల్ల భూమండలం మొత్తం రేడియేషన్ వ్యాపిస్తుంది. తద్వారా జీవుల మనుగడ కష్టమవుతుంది. భూమి నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎటువంటి రంగు లేకుండా రక్షణ కవచంలా ఉన్న పొరనే ఓజోన్ పొర అంటారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను ఈ పొర అడ్డుకోవడం వల్ల మనకు పగటి సమయంలోనూ ఆకాశం నీలి రంగులో కన్పిస్తుంది. సూర్యుడు తొలగిన వెంటనే ఎటువంటి నీల లోహిత కిరణాలు ఈ పొరపై ఉండవు. కాబట్టి ఈ పొరగుండా మనం నక్షత్రాలను చూడగలుగుతున్నాం. అభివృద్ధి పేరిట వినాశనం అభివృద్ధి పేరిట ఈ భూమిపై మానవులు వినాశనం సృష్టిస్తున్నారు. కాలుష్యం మూలంగా ఈ ఓజోన్ పొర నెమ్మదిగా కరిగి రంధ్రాలు పడుతున్నట్లు పర్యావరణ నిపుణులు గుర్తిస్తున్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఈ ఓజోన్ పొరపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. ఆధునిక జీవనం పేరిట రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వాడకం పెరగడం కూడా పొరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి నుంచి వెలువడే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు పర్యావరణ వినాశనం కావున ఓజోన్ పొరకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇదీ ప్లాస్టిక్ వాడకం, వాయు కాలుష్య నివారణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడవులు పర్యావరణానికి ఎంతో రక్షణగా నిలుస్తాయి. ఉమ్మడి జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా, 336 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. జిల్లా విస్తీర్ణంలో 32 శాతం అడవులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణలో 7 టెర్రిటోరియల్ రేంజ్లు, 42 టెర్రిటోరియల్ సెక్షన్లు, 95 బీట్లు ఉన్నాయి. మానవ తప్పిదాలే అధికం మానవ తప్పిదాల వల్లే ఓజోన్ పొరకు చిల్లులు పడే ప్రమాదం కలిగింది. దీని నుంచి సమస్త జీవరాశి మనుగడ సాగించాలంటే ప్లాస్టిక్, విష వాయువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. – జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పశు పక్ష్యాదులపై దుష్ప్రభావం ఓజోన్ పొరను రక్షించుకోకుంటే ఆ ప్రభావం సమస్త మానవాళితో పాటు పశుపక్ష్యాదులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఓజోన్ పొరను కాపాడుకుంటే భూతాపాన్ని కాపాడుకోవచ్చు. – నల్లమిల్లి సురేష్రెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆలమూరు సమష్టి బాధ్యతగా చేపట్టాలి మొక్కలు నాటడంతోనే సరికాదు. వాటిని సంరంక్షించుకున్నప్పుడే అడవులు పెరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అనేది సమష్టి బాధ్యతగా చేపట్టాలి. అప్పుడే అడవుల విస్తీర్ణం పెరిగి, పర్యావరణ సమతుల్యత ఉంటుంది. – ఎంవీ ప్రసాదరావు, జిల్లా అటవీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యావరణ పరిరక్షణకు నిర్లక్ష్యమే కారణం దెబ్బతింటున్న వాతావరణ సమతుల్యత కాలుష్యంతో ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు ప్రపంచ ఓజోన్ దినోత్సవం -
గొడ్డు చాకిరీలు.. గొర్రె తోక జీతాలు!
● జిల్లాలో అక్టోబర్ 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట ● పనిభారం తగ్గించాలని డిమాండ్ ● ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవించండి ● వలంటీర్ల విధులు మాకొద్దు ● ఇది వరకే నోటీసులు జారీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తమపై మోపిన విధుల భారం తగ్గించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఉద్యమబాట పట్టేందుకు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. ఆక్టోబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలో 512 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా వాటిలో 3,988 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అన్ని భారాలు భరిస్తూ... కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను అచేతనావస్థలో ఉంచడంతో సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, ఒత్తిడి పెరిగిపోయింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ విధుల్లో ఉండి ప్రభుత్వం నిర్ధేశించిన సర్వేలు, కార్యక్రమాలను అమలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్లు నిర్వహించిన పనులు కూడా సచివాలయ ఉద్యోగులే చేయాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు చెందిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్ బయోమెట్రిక్ వివరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణతో భారం అధికమైంది. ఉద్యోగులు తమ శాఖకు చెందిన పనులనే కాకుండా శాఖకు సంబంధం లేని పనులను కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఉద్యోగులకు పని భారం తగ్గించాలని కోరడమే కాకుండా తమ డిమాండ్లను సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. వీటి సాధనే లక్ష్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ ప్రకటించా యి. సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు వారం రోజులుగా సమ్మె నోటీసులను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఇస్తున్నారు. ఈ నెల 30లోపు సమస్యలను పరిష్కరించకుంటే ఆక్టోబర్ ఒకటో తేదీ నుంచి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవీ డిమాండ్లు... ● ఆరేళ్లు ఒకే క్యాడర్లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషనరీ సమయంలో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్ టైమ్ నిర్ణయించాలి. ● వార్డు సచివాలయాల్లోని ఖాళీలను 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● సర్వేలను ఆయా శాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్ సీనియారిటీ అధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి. ● అన్ని విభాగాల వారికి ప్రమోషన్ చానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలను విడుదల చేయాలి ● విద్యార్హతల ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించాలి ● ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వే లు, ఇతర పనుల నుంచి తప్పించాలి. ● గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు అప్పగించాలి. ● సమయపాలన లేని ఒత్తిడితో కూడిన విధుల నుంచి విముక్తి కలిగించాలి. సెలవులు, ఆదివారాలు, పండగ సమయాల్లో పనులు చేయించరాదు. డిమాండ్ నోటీసులతో సచివాలయ ఉద్యోగులుక్రమ మండలం/ సచివా ఉద్యోగులు సంఖ్య యూఎల్బీ లయాలు 1 అనపర్తి 19 102 2 బిక్కవోలు 21 144 3 గోకవరం 20 167 4 కడియం 27 195 5 కోరుకొండ 24 182 6 రాజమహేంద్రవరం రూరల్ 35 265 7 రాజానగరం 34 249 8 రంగంపేట 19 139 9 సీతానగరం 20 130 10 చాగల్లు 18 161 11 దేవరపల్లి 21 206 12 గోపాలపురం 18 148 13 కొవ్వూరు 19 156 14 నల్లజర్ల 22 184 15 నిడదవోలు 22 174 16 పెరవలి 20 161 17 తాళ్లపూడి 15 112 18 ఉండ్రాజవరం 19 157 19 కొవ్వూరు(అర్బన్) 10 93 20 నిడదవోలు(అర్బన్) 13 110 21 రాజమహేంద్రవరం అర్బన్ 96 753 మొత్తం 512 3,988పది పనులను ఒక్కరే చేస్తున్నారు పదిమంది అధికారులు పదిరకాల పనులు చెబుతున్నారు. వాటిని పూర్తి చేయడానికి ఇక్కడ ఒక్కరు మాత్రమే పనిచేసేవారు ఉండటం దారుణం. ఇది పోయి ఒకే లైన్ డిపార్ట్మెంట్ ద్వారా పనిచేసే విధానం రావాలి. – దడాల జగ్జారావు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్.సచివాలయ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నారు, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ పే స్కేల్ లో పదవ తరగతి విద్యార్హత వారికి ఇచ్చే జీతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నారు. ఆ తక్కువ జీతానికి కూడా న్యాయంగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, డీఏ, ఎరియర్స్, స్పెషల్ ఇంక్రిమెంట్లు రావడం లేదు. మా ఉద్యోగాలు సంస్థాగతంగా వలంటీర్స్ వ్యవస్థను మిళితం చేస్తూ రూపొందించారు. కానీ ఆ వ్యవస్థను రద్దు చెయ్యడం వల్ల మాకు పని భారం బాగా పెరిగిపోయింది. అలాగే క్షేత్ర స్థాయిలో పై అధికారుల వద్ద తగిన గౌరవం లేదు. – కొల్లి రాజేష్, వార్డు పరిపాలన కార్యదర్శి, నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం మాతృశాఖలో విలీనం చేయాలి శానిటేషన్ సెక్రటరీలను మాతృ శాఖలో విలీనం చేసి, నిర్ధిష్టమైన ప్రమోషన్ చానల్, వర్క్ విధానం రూపొందించాలి. డిగ్రీ అర్హతతో రిక్రూట్ అయి, పదవ తరగతి అర్హత ఉన్న పోస్టుల ప్రమోషన్ చూపించడం జరిగింది. ఇది చాలా దారుణం. అర్హత ప్రకారం ప్రమోషన్స్ ఇవ్వాలి. – డీవీ సుబ్బారావు, మోటూరి, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ప్రమోషన్ చానల్ లేదు ఉద్యోగంలో చేరి 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ నిర్ధిష్టమైన ప్రమోషన్ చానల్ లేదు. జీఓ 523ని సవరించి ఎంఏ, యూడిలో ఉన్న వార్డు కార్యదర్శులకు అర్హతల ఆధారంగా ప్రమోషన్ కల్పించాలి. – సంజయ్ డేవిడ్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, రాజమహేంద్రవరం -
డీఎస్సీ తుది జాబితా విడుదల
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1349 పోస్టుల భర్తీ ● దసరా సెలవుల తర్వాత కొలువుదీరే అవకాశం ● ఈ నెల 22 నుంచి కొత్త టీచర్లకు 8 రోజుల శిక్షణ రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సోమవారం ఉదయం డీఎస్సీ–2025 తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. క్యాడర్ల వారీగా ఎంపికై న ఉపాధ్యాయుల జాబితాను ఆన్లైన్లో విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,349 పోస్టులకు టీచర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ స్టేట్ రీసోర్స్ పర్సన్స్(ఎస్ఆర్పీ)కు గుంటూరు జిల్లా పరిధిలోని విట్ యూనివర్శిటీ, ఎస్జీటీ ఎస్ఆర్పీలకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్లో శిక్షణ ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం కొత్త టీచర్లు కొలువు దీరే అవకాశముంది. ఐదు నెలల అనంతరం డీఎస్సీ–2025 ఫలితాలను సుమారు ఐదు నెలల అనంతరం విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,241 మైదాన (ప్లెయిన్ ఏరియా) పోస్టులకు, 112 ఏజెన్సీ ఏరియా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1,352 పోస్టులకు 63,004 మంది దరఖాస్తు చేయగా, జూన్ 6వ తేదీ నుంచి సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షలకు 38,617 మంది హాజరయ్యారు. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా, ఫైనల్ కీ జూలై 31న ఫైనల్ కీ విడుదల చేశారు. ఆగస్టు 23న మెరిట్ లిస్ట్ విడుదల చేయగా, ఆగస్టు 28న ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాలుగు విడతల్లో చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సోమవారం డీఎస్సీ–2025 రాష్ట్ర కన్వీనర్ తుది ఎంపిక జాబితాను వెబ్సైట్లో ఉంచారు. ఎంపికయిన పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 421 కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్ స్టడీస్, బయాలజీ పోస్టులు మూడంకెల సంఖ్యలో ఉండగా, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, పీఎస్ సబ్జెక్టులు రెండంకెల్లో ఉన్నాయి. సంస్కృతం కేవలం ఐదు పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 112 పోస్టులకు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎస్జీటీలు 104, ఫిజికల్ సైన్స్ మూడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి, బయోలాజికల్ సైన్స్ నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. ఎస్జీటీ విభాగంలో స్థానిక సంస్థల్లో ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కో పోస్టు వంతున భర్తీ కాలేదు. అలాగే సంస్కృతం విభాగంలో స్థానిక సంస్థల మేనేజ్మెంట్లో రెండు పోస్టులు భర్తీ కాలేదు. అర్హత ఉన్న అభ్యర్థులు లేక.. డీఎస్సీ–2025లో వివిధ క్యాటగిరీలకు చెందిన నాలుగు పోస్టులు అర్హత ఉన్న అభ్యర్థులు లేక భర్తీ కాలేదు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం పోస్టులు రెండు భర్తీ కాలేదు. గ్రీవెన్స్లో ఫిర్యాదుల స్వీకరణ డీఎస్సీ–2025 ఫైనల్ సెలక్షన్ జాబితాలో సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు తాము ఎందుకు అర్హత కోల్పోయామో తెలుసుకునేందుకు కాకినాడ డీఈవో కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు (ఫైల్)క్యాడర్లు, మేనేజ్మెంట్ వారీగా ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలు క్యాడర్ సబ్జెక్టు ఎంపికైన టీచర్ల సంఖ్య ఎస్ఏ ఇంగ్లీషు 95 ఎస్ఏ హిందీ 78 ఎస్ఏ సంస్కృతం 05 ఎస్ఏ తెలుగు 58 ఎస్ఏ బయాలజీ 103 ఎస్ఏ గణితం 64 ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 71 ఎస్ఏ సోషల్ స్టడీస్ 132 ఎస్జీటీ ఎస్జీటీ తెలుగు 421 -
ఆదిత్యలో అట్టహాసంగా వేద–2కే25
గండేపల్లి: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో పోటీతత్వాన్ని కొనసాగించడానికి ఉత్తమ సాధన, నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరమని కాకినాడ జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ విద్యార్థులనుద్దేశించి అన్నారు. మండలంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సోమవారం ఇంజినీరింగ్ డే సందర్భంగా వేద–2కే25 పేరిట జాతీయస్థాయి సాంకేతిక సింపోజియంకు మొదటిరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో భవిష్యత్కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డి మాట్లాడుతు జాతీయస్థాయిలో సాంకేతిక ప్రతిభ, ఆవిష్కరణలు పెంపొందించే వేదికగా వేద రూపుదిద్దుకుంటుందున్నారు. ఈ ఏడాది 14,340 మంది విద్యార్థులు సాంకేతిక పోటీలకు, ఈవెంట్లలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రో ఎంబీ శ్రీనివాస్, ప్రో వైస్ చాన్సలర్ ఎస్.రమాశ్రీ, ఆదిరెడ్డి రమేష్, రవి తంగజన్, వేద కన్వీనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎల్పీఓ కార్యాలయ ఏఓపై విచారణకు ఆదేశం
బోట్క్లబ్ (కాకినాడసిటీ): కాకినాడ డీఎల్పీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న సీహెచ్ వెంకటరెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై డీఆర్వో జె.వెంకట్రావు విచారణకు ఆదేశించారు. పలువురు ఎస్సీ, బీసీ ఉద్యోగులపై తప్పుడు గ్రీవెన్స్ ఫిర్యాదులు చేయిస్తూ ఆ ఫిర్యాదులు క్లోజ్ చేయడానికి సదరు ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై సోషల్ వేల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ శోభారాణిని విచారణ అధికారిగా నియమించారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ పి.చెంగల్రావు ఆధ్వర్యంలో పలు దళిత గిరిజన సంఘాల నాయకులు ఈ విషయంపై సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీఆర్వో విచారణ అధికారిని నియమించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సంబంధం లేని వ్యక్తులతో తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తిరిగి ఉద్యోగం ఇప్పించే విషయంలో, బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో మహిళలను కావాలనే ఉద్దేశపూర్వకంగా తన చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వెంకటరెడ్డి ఫోన్ కాల్ హిస్టరీని పరిశీలిస్తే నిజాలు బయటికి వస్తాయన్నారు. డీఆర్వోకు ఫిర్యాదు చేసిన వారిలో రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, జై భీమ్రావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, బహుజన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
శానిటరీ సిబ్బంది ఆకలి కేకలు
● 15వ తేదీ వచ్చినా అందని ఆగస్టు నెల జీతాలు ● 350 మంది సిబ్బందికి రూ.59 లక్షల బకాయిలు అన్నవరం: ఒక నెలలో వచ్చిన సమస్య మరుసటి నెల రాకుండా చూసుకోవడమే మంచి పరిపాలనకు నిదర్శనం. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మాత్రం అదే సమస్య ప్రతి నెలా పునరావృతమవుతోంది. ప్రతి నెలా రెండో వారం దాటినా శానిటరీ సిబ్బందికి జీతాలు రాని పరిస్థితి. మా జీతాలు ఎప్పుడిస్తారని ఆ సిబ్బంది ఎదురుచూడడంతోనే సరిపోతోంది. గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. దేవస్థానంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సెప్టెంబర్ 15వ తేదీ వచ్చినా ఆగస్టు నెల జీతం ఇంకా అందకపోవడంతో 350 మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నెలకు రూ.పది వేలు వచ్చే జీతం రెండు వారాలు గడచినా రాకపోతే వారి పరిస్థితి ఏంటనేది ఊహించొచ్చు. గత ఆరు నెలలుగా జీతాలు ఆలస్యం అవడం దేవస్థానంలో రివాజుగా మారిపోయింది. అయితే ఆగస్టు నెలకు సంబంధించి ఆగస్టు 25న 350 మంది సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ చెల్లించి ఆ చలానాలు ఈ నెల రెండో తేదీనే దేవస్థానానికి అందజేసినట్టు శానిటరీ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గా మేన్పవర్ సంస్థ ప్రతినిధి తెలిపారు. 16 మంది కొత్త సిబ్బంది విషయం పక్కన పెట్టి మా 350 మంది శానిటరీ సిబ్బంది జీతాలైనా వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఈవో వీర్ల సుబ్బారావును వివరణ కోరగా త్వరలోనే జీతాలు వారి అకౌంట్లలో పడేలా చూస్తామన్నారు. -
వక్ఫ్ చట్టంపై సుప్రీం స్టేను స్వాగతిస్తున్నాం
అమలాపురం టౌన్: వక్ఫ్ చట్టం–2025పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర తీర్పు(స్టే)ను ముస్లింలు స్వాగతిస్తున్నారని జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. ఈ వివాదాస్పద చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు, రాష్ట్రపతి నుంచి ఆమోదముద్ర పడినప్పటికీ ఈ చట్టానికి వ్యతిరేకంగా వందలకు పైగా కేసులు వేయడంతో సుప్రీంకోర్టు విచారణకు వచ్చిందని చెప్పారు. అమలాపురంలో ఖాదర్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివాదాస్పద చట్టం గురించి వివరించారు. కోర్టు ఇచ్చిన స్టేను అనుసరించి కింది స్థాయిలో అధికారాలను డీనోటిఫై చేసేందుకు అనుమతించలేదు. వక్ఫ్ ట్రిబ్యునల్ ద్వారానే జరగాలన్న నిబంధన విధించిందని చెప్పారు. అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించే అంశంపై కూడా కోర్డు స్టే ఇవ్వడంపై ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణలో అనేక లొసుగులు ఉన్నాయని ఆనాడే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు జగన్ పార్లమెంట్ ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలతో బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయించి ముస్లిం పక్షపాతిగా నిలబడ్డారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. ఇప్పటికై నా ముస్లిం సమాజం మైనార్టీల పట్ల ఏ పార్టీ ప్రేమాభిమానాలు చూపిస్తుందో గ్రహించాలని ఖాదర్ హితవు పలికారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక
అమలాపురం రూరల్: ప్రభుత్వం ఇటీవల కాకినాడలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్న కేదారి సాయిదుర్గ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. సోమవారం సాయిదుర్గను కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి సుబ్బరాజు, తాతా అవధాని, పరిపాలనాధికారి ఎ.వెంకటపతిరాజు, ప్రిన్సిపాల్ వడలి సుబ్బారావు, పీడీ సురేష్కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. సెపక్తక్రాలో నలుగురి ఎంపిక అల్లవరం: కోడూరుపాడు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు ఎంపికయ్యారని పీడీ బూల చిరంజీవి సోమవారం తెలిపారు. విజయవాడలో అక్టోబర్లో జరగనున్న రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. కొడమంచిలి షణ్ముఖ, పీడీవీ సత్యలావణ్య రెగ్యులర్ క్రీడాకారులుగా, సత్యశ్యామల, ఉమ్మడిశెట్టి రత్నకుమారి స్టాండ్ బైగా ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను సర్పంచ్ నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అభినందించి వారికి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏఎస్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ముమ్మడివరపు సుధీర్, పిల్లా ప్రసాద్ తదితరుల సహకారంతో క్రీడాకారులకు షూ అందజేశారు. -
నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలి
రాజానగరం: ఆదికవి నన్నయ అందించిన జ్ఞానం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన శ్రద్ధ నుంచి ప్రేరణ పొంది, నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో ‘అద్విక–25’ ఇంజినీరింగ్ ఫెస్ట్ని సోమవారం దీపారాధనతో ప్రారంభించారు. తొలుత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు భారతదేశంలో ఇంజినీరింగ్ నైపుణ్యానికి బంగారు బాటలు వేశాయన్నారు. ఇంజినీరింగ్ అంటే సమీకరణలు, గణనాలు కాదని, దృష్టి, సమగ్రత, పరివర్తన ప్రభావం గురించి అనే ఆలోచనలకు ఆయన జీవితం ఒక నిదర్శనమన్నారు. అద్విక–25లో విద్యార్థులకు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్ క్విజ్, ప్రాజెక్టు ఎక్సోపో, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, స్కిల్ హౌస్ వంటి సాంకేతిక పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వరరావు వ్యవహరించగా రూరల్ వాటర్ సప్లై విభాగం ఈఈ బి.వెంకటగిరి, డీఈఈ టి.శ్రీనివాసబాబు, ఏఈ వి.అవినాష్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్కుమార్, ఏపీ ట్రాన్స్కో ఈఈ రవికుమార్, ఐసీఐ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ కేవీ నరసింహారావు, ఓఎన్జీసీ రిటైర్డ్ ఈఈ జీఏవీ ప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు గురుకుల విద్యార్థినులు
తుని రూరల్: ఈనెల 27 నుంచి మూడు రోజులు ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల బాలికలు ఎంపికై నట్టు ఆ పాఠశాల వి.కొత్తూరు ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి సోమవారం తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలో జూనియర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో తమ విద్యార్థినులు ప్రతిభ ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నటుట్ట ఆమె పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో 100 మీటర్ల పరుగు, షాట్పుట్లో హర్షిణి ప్రథమస్థానాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 క్రీడా పోటీల్లో చదరంగంలో వైష్ణవి (ప్రథమ), మణి (6వ), యోగాలో పి.అనురాధ (ప్రథమ), కె.అక్షయ కీర్తి (ద్వితీయ), ఎస్.మేఘనశ్రీ (తృతీయ), ఎం.విజీన (నాలుగో) స్థానాల్లో నిలిచారన్నారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, పీడీ ఆర్.విజయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఆరు కొత్త ఫైర్స్టేషన్లకు ప్రతిపాదనలు
ఫ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.108 కోట్ల ఆస్తులను కాపాడాం ఫ అగ్నిమాపకశాఖ డీజీ పీవీ రమణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జోన్–2 పరిధిలో ఇప్పటివరకు 50 ఫైర్స్టేషన్లు, 2 ఔట్ పోస్టులున్నాయని, వీటితో పాటు కొత్తగా 6 ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపకశాఖ డీజీ పి.వెంకటరమణ తెలిపారు. జోన్ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఆయన ఆదివారం రాజమహేంద్రవరం వచ్చారు. విలేకరుల సమావేశంలో డీజీ మాట్లాడుతూ జోన్–2లో ఫైనాన్స్ కమిషన్ ద్వారా రెండు ఫైర్స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. మినీ రెస్క్యూ టెండర్లు, అడ్వానన్స్ వాటర్ టెండర్లు 50, 20 వాటర్ బ్రౌజర్లు, 40 కాన్వాయ్ వెహికల్స్, 46 ఇతర ఫైర్ వాహనాలు, మొత్తం161 వాహనాలకు టెండర్స్ పిలిచామన్నారు. త్వరలోనే వెహికల్స్ అన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరేళ్లనుంచి అసంపూర్ణంగా నిలిచిపోయిన 36 అగ్నిపక కేంద్రాల నూతన భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ పనులన్నీ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. జోన్–2లోని 7 జిల్లాల పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,498 అగ్నిమాపక సంఘటనలు జరిగాయన్నారు. వీటిలో రూ.108 కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కాపాడామని, అలాగే 51 మంది ప్రాణాలు రక్షించామన్నారు. అగ్నిమాపకశాఖ జారీ చేస్తున్న ఎన్ఓసీలకు సంబంధించి 2021, 2023 మధ్య జారీ చేసిన ఫైర్ ఎన్వోసీలు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999 నేషనల్ బిల్డింగ్ యాక్ట్ (ఎన్బీసీ) నిబంధనల ప్రకారం లేవని, మార్గదర్శకాలు పాటించలేదని గత ప్రభుత్వం ఐఏఎస్లతో హైపవర్ కమిటీ వేసిందన్నారు. దీనిపై మరింత సమాచారానికి 9441236448, కనెక్ట్ డీజీ ఫైర్ అనే మెయిల్లో సంప్రదించాలన్నారు. అనంతరం కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అగ్ని మాపక శాఖ పనితీరును సమీక్షించారు. జోన్–2లో గత సంవత్సరకాలంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలు, విపత్తు సంఘటనలు, జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న అగ్నిమాపక కేంద్రాలు, కొత్త అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, పాత, కొత్త అగ్నిమాపక కేంద్రాలకు నూతన భవన నిర్మాణాలు, సిబ్బంది లభ్యత, ఖాళీలు వంటి విషయాలను చర్చించారు. కార్యక్రమంలో నార్త్ అడిషనల్ డైరక్టర్ జి.శ్రీనువాసులు, జోన్ 2 రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఈ.స్వామి, జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూధర్కింగ్, ఫైర్ ఆపీసర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఉద్యోగి మృతి
దేవరపల్లి: మండలంలోని యర్నగూడెం బొల్లిన గంగరాజు జెడ్పీ హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం.వీరభద్రం(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. నల్లజర్ల మండలం దూబచర్లలో నివాసం ఉంటున్న వీరభద్రంకు ఛాతీలో నొప్పి రావడంతో కటుంబ సభ్యులు నల్లజర్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వీరభద్రం మృతి చెందినట్టు నిర్ధారించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు.. తొండంగి: మండలంలోని కృష్ణాపురం వెళ్లే రహదారిలో బైకు అదుపుతప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై జగన్మోహన్రావు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాపురం శివారులో అవంతి రొయ్యల పరిశ్రమలో విజయనగరం జిల్లా బోడంగి మండలం రాజేరు గ్రామానికి చెందిన పోతాబత్తుల చరణ్కుమార్ (20) డైలీ వర్కర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సెలవు పెట్టి బైకుపై కృష్ణాపురం వస్తుండగా ఓ ప్రైవేటు స్కూలు వద్దకు వచ్చే సరికి బైకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితికి చేరుకోవడంతో అంబులెన్స్లో తుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
స్మార్తమే అపర కర్మలకు మూలం
అపర విద్వత్సభలో ఘనపాఠీలు అమలాపురం టౌన్: స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు మాట్లాడుతూ వేదాల నుంచే స్మార్త, ఆగమ, అపర కర్మల విధానాలు జన్మించాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం విద్వాంసులు యీవని వెంకటరామచంద్ర సోమ యాజి మాట్లాడుతూ వేదాలకు మూలం స్మార్తం అయితే, ఆ స్మార్తమే అపర కర్మలకు మూలమని అన్నారు. వైఖాసన ఆగమ పండితుడు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకుడు వాడపల్లి శేషాచార్యులు అపర కర్మలు నిర్వహించే విధానాలను వివరించారు. కృష్ణ యజుర్వేద పరీక్షాధికారి, పిఠాపురానికి చెందిన మహంకాళి దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ కాలమాన పరిస్థితుల దృష్ట్యా షోడశ కర్మల నిర్వహణలో చిన్న చిన్న మార్పులు అనివార్యమైనా కర్మల ప్రాధాన్యం, విలువ ఏ మాత్రం తగ్గలేదన్నారు. యజుర్వేద, రుగ్వేద, అపర పండితులు భగవతి నారాయణశాస్త్రి, శైవాగమ పండితులు నవూలూరి దీక్షితులు, వాస్తు జ్యోతిష పండితులు గరిమెళ్ల భాస్కర గంగాధరశాస్త్రి మాట్లాడుతూ స్మార్త పండితులు పలు సందర్భాల్లో 16 కర్మలు నిర్వహిస్తున్నప్పుడు కర్మలు చేయించుకునే వారి సంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శ్రీకోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్వత్సభలో సభ ప్రతినిధులు యేడిది సుబ్రహ్మణ్యశర్మ, శిష్టా భాస్కర్, ఆదిరాజు భాస్కరశర్మలు స్మార్త పండితులకు సత్కార సేవలు అందించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హాజరైన 150 మంది స్మార్త, ఆగమ, అపర పండితులు పాల్గొని వేద ఘనపాఠీలు వివరించిన స్మార్త నిబంధనలు విన్నారు. సభ చివర్లో ఇటీవల రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆకెళ్ల వెంకట నారాయణ అవధానిని వేదశాస్త్ర సన్మాన సభ తరఫున ఘనంగా సత్కరించారు. వేదాభిమాని పుత్సా కృష్ణ కామేశ్వర్ తదితరులు సేవలు అందించారు. -
ఉధృతంగా ఎర్రకాలువ
ఫ కంసాలిపాలెం–మాధవరం మధ్య రాకపోకలు బంద్ ఫ నాలుగు గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు నిడదవోలు రూరల్: భారీ వర్షాలకు ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం–మాధవరం వంతెన వద్ద ఆదివారం ఉదయం నుంచి నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో వంతెనపై ప్రమాదకరస్థితిలో ఎర్రకాలువ నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. నిడదవోలు ఆర్వోబీ నిర్మాణ పనుల దృష్ట్యా అధికారులు నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు సింగవరం మీదుగా తాళ్లపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద నుంచి కార్లు, బైక్లు దారి మళ్లించారు. అయితే గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు తోడు ఎర్రకాలువ నీరు చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాదారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏటిగట్టు ప్రాంతాలను కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ వీఎస్వీఎల్ జగన్నాథరావు, సర్పంచ్ కొండపల్లి శ్రీనివాస్రావు పరిశీలించారు. ఎర్రకాలువ ప్రభావిత గ్రామాలైన కంసాలిపాలెంలో ఆహారం, తాగునీరు అందించడంతో పాటు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో చెప్పారు. తాళ్లపాలెం, రావిమెట్ల, సింగవరం, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎర్రకాలువ వంతెనల వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. -
సంరక్షణతో దినదినాభివృద్ధి
● చూడి కట్టే వరకూ జాగ్రత్తలే మేలు ● ఈతకు ఈతకు మధ్య వ్యవధి తగ్గించాలి ● ఆరోగ్యకరమైన దూడలతో అధిక పాల దిగుబడిఆలమూరు: పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సమతుల పోషకాహారాన్ని అందించడం, సమీకృత దాణాను అందుబాటులో ఉంచడం, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశుగణం దినదినాభివృద్ధి చెందుతుంది. పశువులకు దూడలు జన్మించిన నాటి నుంచి యుక్తవయసు వచ్చి సంపర్కం జరిగి చూడి కట్టే వరకూ పాడిరైతులు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈతకు ఈతకు మధ్య వ్యవధిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలతో పాటు అధిక పాల దిగుబడి ఆశించవచ్చు. సాధారణంగా ఉత్తమజాతి ఆవు కాని గేదె కాని 300 రోజుల పాటు ఏకధాటిగా పాలిస్తుంది. అనంతరం ఆ పశువు పాల ఉత్పత్తి కొంచెం కొంచెం మందగించి చివరకు వట్టిపోయే దశకు చేరుకుంటుంది. దీనివల్ల పాడి పశువులకు ఈత మధ్య ఎడం తగ్గించడం ద్వారా లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాడి పశువు వట్టిపోయే కాలం తగ్గిపోవడంతో పాడి రైతుకు కొంత ఉపశమనం కలుగుతుంది. సకాలంలో చూడి పరీక్షలు చేయించాలి గేదె ఈనిన మూడు నుంచి నాలుగు నెలల్లోపు చూడి కట్టించడం ద్వారా పశువు వట్టిపోయే లోపు మళ్లీ ఈతకు వచ్చి పాల దిగుబడినిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల పశువు వట్టిపోయే కాలం అసాధారణంగా తగ్గుతుంది. ఒక మేలుజాతి పశువు పాలిచ్చే సమయంలో ఆరోగ్యకరమైన దూడల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. చూడి పరీక్షలు సకాలంలో చేయించడం, సమీకృత దాణా గాని పచ్చగడ్డితో కాని పశువులను మేపడం ద్వారా ఈత వ్యవధి తక్కువైనా పశువుల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం పడే అవకాశం లేదు. పాడి పశువుల్లో జననేంద్రియ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది పునరుత్పత్తి జరపగలిగే విధంగా విడుదల చేసే అండాన్ని థను ప్యూబర్టీ (యుక్త వయసు) అంటారు. దేశవాళీ పశువుల కంటే సంకర జాతి పశువులు త్వరితగతిన యుక్తవయస్సుకు రావచ్చు. అలాగే యుక్త వయస్సుకు రాని పశువులను మేపుట వల్ల రైతుకు భారంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు పశువుల్లో యుక్త వయసుకు రాగానే చూడి కట్టించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతో ప్రతి పాడి పశువు ఏడాదికి ఒక దూడకు జన్మనివ్వడం సులభతరమవుతుంది. దీనిద్వారా పశువుల జీవితకాలంలో జన్మించే పశువుల సంఖ్య పెరగడం ద్వారా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చని ఆలమూరు పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు ఎల్.అనిత చెబుతున్నారు. పశువు వయసును బట్టి శరీర బరువు ఉండాలి యుక్త వయసును ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానంగా పశువు శరీర బరువు, పెయ్య దూడల పరిపక్వత వాటి వయసు కంటే కూడా శరీర బరువు మీద ఎక్కువశాతం ఆధారపడి ఉంటుంది. సహజంగా సరైన బరువు ఉన్న పశువులు లేదా తక్కువ బరువు కలిగిన పశువులు త్వరగా యుక్త వయసుకు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ ప్రభావం కీలకమే.. పశువుల్లో యుక్త వయసును ప్రభావితం చేసే కాలానుగుణ, ప్రకృతిపరమైన అంశాల్లో ఋతువు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పాడి పశువుల్లో శీతాకాలం లేదా శరదృతువు అనేది యుక్త వయసు ప్రారంభానికి అనుకూలంగా ఉంటుంది. వసంత ఋతువు లేదా వేసవిలో పుట్టిన పెయ్యల కంటే శీతాకాలంలో జన్మించిన పెయ్య దూడలు ఏడు నెలల వయసు వచ్చేటప్పటికి వేసవిలో సంభవించే ఉష్ణ్రోగ్రత వల్ల సూర్యకాంతి ప్రసరణ జరిగి కౌమారదశకు చేరుకున్న పశువులు ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. -
అన్నవరం దేవస్థానం సెక్యూరిటీ గార్డుల నిజాయితీ
అన్నవరం: అన్నవరం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఒక ప్రయాణికుడు మర్చిపోయిన రూ.పది లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాల బ్యాగ్ను పోలీసుల సమక్షంలో తిరిగి అతడికి అప్పగించి తమ నిజాయితీ చాటుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కాకినాడ నుంచి విశాఖపట్నం బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు కొంతమంది రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వెళ్లే మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ వద్ద బస్సులోంచి దిగారు. వారు తమ బ్యాగులతో పాటు మరో బ్యాగ్ కూడా తీసుకుని దిగిపోయారు. అయితే ఆ తరువాత ఆ బ్యాగ్ తమది కాదని గుర్తించి ఆ బ్యాగ్ను దేవస్థానం సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. దాంతో సెక్యూరిటీ గార్డులు ఆ బ్యాగ్ను తెరచి చూడగా అందులో సుమారు రూ.పది లక్షలు విలువ చేసే పది కాసుల బంగారు బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో ఆ సెక్యూరిటీ గార్డులు ఆ బ్యాగ్ గురించి దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ రావుకు తెలియజేశారు. దాంతో ఆయన ఆ బ్యాగ్ను అన్నవరం ఎస్సై శ్రీహరిబాబుకు అప్పగించారు. ఆ బ్యాగ్ గురించి ఆ బస్సులోని వారికి ఎస్సై సమాచారం ఇవ్వగా అందులో ప్రయాణిస్తున్న షేక్ ఖాజా మొహిద్దీన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఆ బ్యాగ్ తనదేనని తాను కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్నానని తెలిపారు. ఆ బ్యాగ్లో బంగారు వస్తువుల వివరాలు తెలిపి వాటిని కల్యాణ్ జ్యూయలర్స్లో కొన్నానని ఆ రశీదు కూడా చూపించడంతో అతని వివరాలు తెలుసుకుని నిజమని నిర్ధారించుకున్న తరువాత ఆ బ్యాగ్ను అతడికి అప్పగించారు. సెక్యూరిటీ గార్డులను ఎస్సై శ్రీహరిబాబు, దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ రావు అభినందించారు.ప్రయాణికుడు మరచిపోయిన ఆభరణాలు తిరిగి అప్పగింత -
బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా తూర్పుగోదావరి
బత్తలపల్లి: మండలంలోని రామాపురం జెడ్పీహెచ్ఎస్ మైదానం వేదికగా మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల 10వ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీ ఆదివారం ముగిసింది. అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ చాంపియన్షిప్ను బాలుర విభాగంలో తూర్పుగోదావరి జిల్లా, బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్లు దక్కించుకున్నాయి. కాగా, ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో రెండో స్థానంలో చిత్తూరు, మూడో స్థానంలో శ్రీకాకుళం, నాలుగో స్థానంలో ప్రకాశం జిల్లా జట్టు నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో రెండో స్థానంలో విశాఖపట్నం, మూడో స్థానంలో తూర్పుగోదావరి, నాలుగో స్థానంలో శ్రీకాకుళం జట్లు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ముఖ్యఅతిథులు అందించి, అభినందించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కోలాటంతో స్థానిక కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ తలారి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, రాష్ట్రబాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు విజయశంకర్రెడ్డి, చైర్మన్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ బాలాజీ, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు ధర్మవరం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ అయ్యప్పనాయుడు, చిలకం మధుసూదన్రెడ్డి, నారాయణరెడ్డి, ఆకులేటి వీరనారప్ప, పురంశెట్టి రవి, గ్రామ పెద్దలు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు -
న్యాయం కోసం మహిళ పోరాటం
సీతానగరం: మండలంలోని కూనవరంలో ఓ అమానుష ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రాపాకకు చెందిన జ్యోతికి కూనవరానికి చెందిన సుంకర వీరబాబుతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు చైతన్య ఉన్నాడు. గత ఐదేళ్ల క్రితం వీరబాబు కనిపించకుండా వెళ్లిపోవడంతో సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తనకు, తన కుమారుడికి పోషణ ఇవ్వాలని కోరుతూ జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కాగా గత నెల 28న అనకాపల్లి జిల్లా పరవాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు మృతి చెందాడు. వీరబాబు మృతి చెందాడన్న విషయం కోడలికి చెప్పకుండా అత్త గంగాభవాని మృతదేహాన్ని రాజమహేంద్రవరం కై లాసగిరికి తీసుకువచ్చింది. భర్త మరణించాడని, అంత్యక్రియలు జరుగుతున్నాయని స్థానికుల సమాచారంతో జ్యోతి తన తల్లిదండ్రుల సహకారంతో కుమారుడు చైతన్యను తీసుకుని రాజమహేంద్రవరం చేరుకుని కుమారుడితో అంత్యక్రియలు జరిపించి అత్తింటికి చేరుకుంది. శనివారం (ఈనెల 13) కుమారుడితో భర్త దిశదిన కర్మలు పూర్తి చేయించింది. పెద్ద కార్యం అనంతరం అత్త గంగాభవాని కోరుకొండలో ఉంటున్న కూతురు, అల్లుడితో కలసి కోడలు జ్యోతితో పాటు తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. జ్యోతి తల్లిదండ్రులు రాపాక చేరుకోగా, జ్యోతి తన అత్తింటి వద్ద ఆరుబయటే ఉండిపోయింది. ఆదివారం ఉదయం అత్త ఇంటికి తాళం వేసి కోరుకొండలోని కుమార్తె ఇంటికి వెళ్లిపోయింది. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీతానగరం పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్సై డి.రామ్కుమార్ తగు చర్యలు తీసుకుంటానని విలేకరులకు తెలిపారు. భర్త మరణం తెలుసుకుని కుమారుడితో అంత్యక్రియలు పెద్ద కార్యం అనంతరం ఇంటి నుంచి కోడలు గెంటివేత ఆదివారం పోలీసులకు ఫిర్యాదు -
ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్ మీట్
● ఈనెల 27 నుంచి ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక ● జిల్లాలో పలు పాఠశాలల నుంచి హాజరైన క్రీడాకారులుకాకినాడ రూరల్: విజయం కోసం పరుగు పడుతూ.. వారిలో ప్రతిభను బయటకు చాటారు. పరుగులోనే కాదు షాట్పుట్, లాంగ్ జంప్ ఇలా స్టోర్స్ ఏదైనా విజయం సాధించడమే లక్ష్యంగా తమలోని క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ విజయం సాధించారు. జిల్లాలోని పలు వివిధ మండలాల్లో పాఠశాల నుంచి వచ్చిన క్రీడాకారులు. కాకినాడ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక కోసం కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణం వేదికయింది. ఉత్సాహ భరిత వాతావరణంలో పరుగు పందెం, లాంగ్జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో వంటి పోటీలు జరిగాయి. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాల, బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి, పోటీలో విజయం సాధించిన వారిలో 67 మందిని జిల్లా నుంచి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారు. విజేతలకు ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నాగేంద్రరావు, అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంఈఓ రంగారావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు మెమెంటోలు అందజేసి, అభినందనలు తెలిపారు. కోచ్లు రెడ్డి, ప్రవీణ్కుమార్, భాను, గిరి, వీరబాబు, రాజేష్ఖన్నా, సంతోష్, రాజు, శివ, హరిబాబు, కిరణ్, దీపిక, అఖిల్ తదితరులు పోటీలు స్పోర్ట్స్ మీట్ను విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కబడ్డీ జట్లు ఇవే.. సామర్లకోట: రాష్ట్ర స్థాయి 51వ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా బాలికల, బాలుర జట్లను కాకినాడ పీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో ఎంపిక చేసిన్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంపిక అయిన జిల్లా జట్లు ఈనెల 22 నుంచి 25 వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన వలసి ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్ కోచ్ పోతుల సాయిప్రసాద్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి నిమ్మకాయల కిరణ్కుమార్, పీడీలు తాళ్లూరి వైకుంఠం, ఎం.శ్రీనివాసుకుమార్, శ్యామ్, శ్వేతల పర్యవేక్షణలో ఎంపిక జరిగిందన్నారు. బాలుర జట్టు కాకినాడ జిల్లా కబడ్డీ జట్టుకు ఎస్.అవినాష్, పి.హరీష్, ఎన్.వంశీ, కె.జాన్, పి.అనిల్కుమార్, కేఎస్ సాయి, ఆర్.సాయిరామ్, బి.ఎలీషా, యు.వీరచక్ర, ఈ.నరేంద్ర, పీఎల్ నారాయణ, జి.త్రిమూర్తులు, జి.నరేష్, బి.ఫణికుమార్ ఎంపికయ్యారని తెలిపారు. బాలికల జట్టు జి.పావనీ, ఎ.మౌనిక, బి.మంజులరాణి, కె.జీవనజ్యోతి, బీఎన్ పల్లవి, ఎం.మానస, కె.అరుణ, జె.లక్ష్మీదుర్గ, ఎంవీడీ మహాలక్ష్మి, వి.పాప, కె.గాయత్రి, జి.సత్యశ్రీవల్లి, పి.ఆదిలక్ష్మి, ఏజీ భవాని, పి.శ్రావణి ఎంపికయ్యారని వివరించారు. -
విద్యుత్ షాక్తో సివిల్ కాంట్రాక్టర్ మృతి
అల్లవరం: మండలంలోని డి.రావులపాలెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వంటెద్దు నాగబాబు తూర్పులంక రెవెన్యూ పరిధిలోని గుండెపూడి డ్రైన్ ఆనుకుని ఉన్న రొయ్యల చెరువులో ఆదివారం విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. డి.రావులపాలేనికి చెందిన నాగబాబు గత కొంత కాలంగా సివిల్ కాంట్రాక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఆక్వా సాగు చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం ఇటీవల లీజుకు తీసుకున్న చెరువులో రొయ్య పిల్ల వేయడానికి ఆదివారం ఉదయం డి.రావులపాలెంలో తన ఇంటి నుంచి బయలుదేరి గుండెపూడిలో లీజుకు తీసుకున్న రొయ్యల వద్దకు వెళ్లి చెరువులో కంప లాగుతున్న క్రమంలో ఏరియేటర్ వద్ద విద్యుత్ షాక్కు గురయ్యాడు. చెరువుల వద్ద సమయానికి ఎవరూ లేకపోవడంతో నాగబాబు అక్కడికక్కడే మృతి చెంది నీటిలో మునిగిపోయాడు. ఉదయం పది గంటల నుంచి మృతుడి భార్య పలుమార్లు భర్తకి ఫోన్ చేసింది. అయితే ఫోన్కు స్పందించకపోవడంతో కొమరగిరిపట్నంలోని తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. సతీష్ హుటాహుటినా వెళ్లి రొయ్యల చెరువు వద్దకు వచ్చి చూడగా నాగబాబు విగతజీవుడై చెరువులో కనిపించాడు. దీంతో మృతుడి అన్నదమ్ములకు నాగబాబు మరణవార్తని సతీష్ తెలిపాడు. మృతుడి అన్నలు చెరువు వద్దకు వచ్చి నీటిలో ఏరియేటర్ వద్ద మునిగి ఉన్న తమ్ముడి మృతదేహాన్ని సతీష్తో కలసి ఒడ్డుకి చేర్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు కుటుంబీకులు అల్లవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సంపత్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల వ్యవధిలో తల్లి, సోదరుడుని కోల్పోవడంతో అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రోజురోజుకూ పెరుగుతున్న భక్తులు
● రూ.80 లక్షలు దాటిన శనివారం ఆదాయం ● విస్తరిస్తున్న వెంకన్న ఖ్యాతికొత్తపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఖ్యాతి రోజురోజుకూ పెరిగిపోతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ముఖ్యంగా ప్రతి శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులతో ఈ క్షేత్రం నిండిపోతుంది. ఏడు శనివారాల వెంకన్న దర్శనం మొక్కుబడి భక్తుల్లో నమ్మకాన్ని పెంచింది. అలాగే ఈ ఆలయ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో భారీగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్లో ప్రతి శనివారం సుమారు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చేది. వారం వారం భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ నెలలో గత శనివారం రూ.65.44 లక్షల ఆదాయం రాగా ఈ శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దానికి అనుగుణంగానే ఆదాయం కూడా పెరిగింది. ఈ శనివారం స్వామివారి సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.81,54,392 ఆదాయం సమకూరింది. ఆ విధంగా గత వారం కంటే ఈ వారం సుమారు రూ.17.10 లక్షల ఆదాయం పెరిగింది. దేవదాయ–ధర్మదాయ శాఖ డీసీ, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో పెరిగిపోతున్న భక్తులకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజులన్నీ నిత్య కల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంది. శనివారం ఏడు ప్రదక్షిణలు చేయలేమని భావించిన భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక వారాన్ని నిర్ణయించుకుని ఆ ఏడు వారాల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటున్నారు. అలా శనివారం తరువాత ఆదివారం వాడపల్లి క్షేత్రానికి అత్యధికంగా భక్తులు తరలివస్తున్నారు. -
ఖతార్ నుంచి ఇంటికి చేరిన కనకమహాలక్ష్మి
కాట్రేనికోన/అమలాపురం రూరల్: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ మొక్కలతిప్ప జైభీమ్ నగర్కు చెందిన గోడి కనకమహాలక్ష్మి బతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లింది. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యం, పనిఒత్తిడి అధికంగా ఉందని, యజమానుల నుంచి వేధింపులు అధికంగా ఉన్నాయని కన్నీరు మున్నీరవుతూ కనకమహాలక్ష్మి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన కలెక్టర్ మహేష్ కుమార్ కనకమహాలక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోనసీమ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ (కేసీఎం) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కేసీఎం బృందం భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపి కనకమహాలక్ష్మిని స్వదేశానికి రప్పించినట్లు కేసీఎం నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఇంటి యజమానులు వేధింపులు అధికం కావడంతో ఇంటికి చేరుకుంటానని అనుకోలేదని, సురక్షితంగా ఇంటికి చేర్చిన జిల్లా కలెక్టర్, కేసీఎం బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ముగిసిన టెన్నికాయిట్ పోటీలుకపిలేశ్వరపురం (మండపేట): మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఏపీ టెన్నికాయిట్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన పి.మౌనిక ప్రఽథమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జి.హేమమాధురి ద్వితీయ, విజయనగరం జిల్లాకు చెందిన పి.రేణుక తృతీయ స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో కాకినాడ జిల్లాకు చెందిన పీజేఎండీ రామారావు ప్రథమ, వి.వినయ్కుమార్ ద్వితీయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ తృతీయ స్థానాల్లో నిలిచారు. వారిని అథిథులు సత్కరించారు. కార్యక్రమంలో 50 మంది కోచ్ కం మేనేజర్స్ టెక్నికల్ ఆఫీసర్లు పోటీల నిర్వహణలో కృషి చేశారు. వ్యక్తి అదృశ్యంరాజానగరం: మండలంలోని సూర్యారావుపేటలో నివాసం ఉంటున్న తన బావ షేక్ మంసూర్ బాషా ఆగస్టు 30 నుంచి కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలుసుకోవలసిందిగా సయ్యద్ అల్లా భకాష్ స్థానిక పోలీసులను ఆదివారం విజ్ఞప్తి చేశాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన తాము జీఎస్ఎల్ వైద్య కళాశాలలో టైల్స్ పనుల నిమిత్తం ఎనిమిది మంది ఇక్కడకు వచ్చి, సూర్యారావుపేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నామన్నాడు. అయితే ఆగస్టు 30న సాయంత్రం అక్కకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పిన తన బావ ఇంతవరకు ఇంటికి చేరలేదన్నాడు. స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. ఈ మేరకు కేసు =దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పీవీ నారాయణస్వామి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440796585, 7780681168 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాలని కోరారు. -
యాజమాన్య పద్ధతులు తప్పనిసరి
● పెయ్యదూడ వయసు నుంచే పోషణ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. దూడలకు ముర్రుపాలను పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ● కౌమారదశలో ఉన్న పశువులకు తప్పనిసరిగా సమతుల ఆహారాన్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో అందించాలి. ● పశువుల్లో తరచూ సంభవించే వ్యాధుల నివారణకు సకాలంలో సరైన మోతాదులో నట్టల నివారణ మందులు అందించాలి. ● వ్యాధి నిరోధక టీకాలను కాలానుగుణంగా సకాలంలో అందించాలి. ● పశువులను అధిక వేడి, వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి. ● యుక్త వయసుకు త్వరగా రాని పశువులను కొంత కాలం కోడె పశువులతో కలిపి ఉంచడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ● యాజమాన్య పద్ధతులు ఫలించక పోయినా రైతులు నిరుత్సాహపడకుండా తమ పశువులకు పశువైద్యుడితో పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. -
జీవనోపాధి కోల్పోయాం
ఆటో కార్మికుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయంతో ఆటో కార్మికుల పొట్టకొట్టారని కార్మికులు ధ్వజమెత్తుతున్నారు. రోజంతా కష్టపడి ఆటోను నడుపుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులు నేడు సీ్త్రశక్తి ఉచిత బస్సు పుణ్యాన అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఒకనాడు దర్జాగా నేను ఆటోవాలాను అని చెప్పుకునే దశ నుంచి నేడు అడుక్కుతినే పరిస్థితి వచ్చిన ఆటో కార్మికులను చూసి ప్రతి ఒక్కరూ జాలిపడుతున్నారు. దీనిపై కథనమిలా.. ఫ రోడ్డున పడిన ఆటోవాలాలు ఫ పడిపోయిన ఆదాయం ఫ రోజుకి రూ.500 కూడా రాని వైనం ఫ జిల్లాలో 21 వేల మందికి పైగా కార్మికులు ఫ ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం పెరవలి: ఆటో నడిస్తేనే జీవనచక్రం తిరిగే కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. ఫైనాన్స్ బకాయిలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక, అప్పులు చేయలేక, కడుపునిండా తిండి తినలేక విలవిల్లాడిపోతున్నారు. ఎంతో సాఫీగా సాగే ఆటోవాలాల జీవనం నేడు తెల్లవారితే చాలు ఎలా బతకాలో తెలియక నానా అగచాట్లు పడుతున్నారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం అష్టకష్టాలు చవిచూపిస్తుంది. కిరాయిలు లేక, ఆటో ఎక్కే వారు లేక ఏమి చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. పదులు, వందలు కాదు ఏకంగా జిల్లాలో 21 వేల మంది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్ణయంతో ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు కట్టలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో సీ్త్రశక్తి పేరుతో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సుతో తాము ఉపాధి కోల్పోతామని.. తమ బతుకులు వీధిన పడతాయి గత 6 నెలలుగా ఉద్యమాలు చేసి నిరసనలు తెల్పినా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తుతున్నారు. ప్రాంతాన్ని బట్టి రోజుకి 5 నుంచి 10 ట్రిప్పులు వేస్తూ రోజుకి చెల్లించవలసిన అద్దెలు కట్టి ఇంటికి రూ.500 నుంచి రూ.800 వరకు తీసుకెళ్లేవారమని నేడు రోజంతా కష్టపడి ఆటో తిప్పినా కనీసం రూ.500 కూడా రావడం లేదని దీనంగా చెబుతున్నారు. ఇంత దుర్భర పరిస్థితి వస్తుందని తాము ఏనాడు ఊహించలేదని వాపోతున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్లు తప్పుపడుతున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్పై ఆటోలు తీసుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టిన నాటి నుంచి మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారని దీంతో ఉపాధి పోయి ఉసూరుమంటూ రోడ్లపై కాలక్షేపం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, కడియం, గోకవరం, రంగంపేట, అనపర్తి, తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం, బిక్కవోలు, కోరుకొండ, దేవరపల్లి మండల కేంద్రాల్లో ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఉచిత బస్సు మూలంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తరువాత ఆటోయూనియన్లు బగ్గున లేచి ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం కనికరం లేకుండా అణచి వేసిందని అంటున్నారు. గత ప్రభుత్వం ఆదుకున్నట్టుగా ఎన్నికల్లో మాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఆర్థిక భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ పెద్దపీట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. కోవిడ్ లాంటి కష్ట సమయంలోనూ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. -
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వేలాది మంది భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శనివారం స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేయటంతో భక్తులు చూసి పరవశించారు. తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు రావడంతో భక్తులు క్యూలో ఆలయ ప్రాంగణం చుట్టూ నిలబడటంతో దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులందరికీ దాతల ఆర్థిక సాయంతో 7 వేల మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో ఉచిత అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం సీటీఆర్ఐ: స్థానిక దేవీచౌక్లో బాలాత్రిపుర సుందరీదేవి 92వ శరన్నవరాత్ర మహోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. శనివారం స్థానిక దేవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9.45 గంటలకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ, 22వ తేదీ ఉదయం 6.18 నిమిషాలకు కలశస్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజూ కుంకుమ పూజలు, ఉదయం, సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 28వ తేదీ ఆదివారం 108 దంపతుల పూజ ఉంటుందని, పూజలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజన ప్రసాదం అందిస్తామన్నారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజలు ఉంటాయన్నారు. రోజుకో అలంకారంతో అమ్మవారికి పూజలు, రాత్రివేళ నాటకాలు జరుగుతాయన్నారు. 22న స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 23న గాయత్రీ దేవిగా, 24న అన్నపూర్ణదేవిగా, 25న మహాలక్ష్మిగా, 26న బాలాత్రిపుర సుందరీదేవిగా, 27న శ్యామలాదేవిగా, 28న లలితాత్రిపుర సుందరీ దేవిగా, 29న సరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు ఒకటిన మహిషాసురమర్ధినిగా, రెండున విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా అలంకరించనున్నారు. అలాగే ప్రతిరోజూ వివిధ నాటకాలు ఉంటాయని ఉత్సవ కమిటీ తెలిపింది. 12వ తేదీ ఆదివారం అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమార రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మూడో స్థానం కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అప్పాలో నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. ఆ వివరాలను సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ శనివారం తెలిపారు. పురస్కారాన్ని ఆయన హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కల్పించడంతో ఈ స్థానం లభించింది. కేంద్ర కారాగారంలో పనిచేసిన సిబ్బంది సమష్టి కృషిని రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అభినందించారని రాహుల్ తెలిపారు. ఈ పురస్కారంతో రాష్ట్ర జైళ్ల శాఖకు గౌరవం చేకూరిందన్నారు. శృంగార వల్లభుని దర్శనానికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం: మండలంలోని స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలికలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
16 బార్లకు దరఖాస్తులు నిల్
ఫ దరఖాస్తు చేయకుండా తెరవెనుక కూటమి నేతల కుట్రలు ఫ మొత్తం 25 బార్లకు 9 బార్లకు పూర్తయిన డ్రా ఫ మిగిలిన వాటికి 17 వరకు గడువు పొడిగింపు రాజమహేంద్రవరం రూరల్: బార్ల విషయంలో అధికార కూటమి నేతలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార పార్టీ వారంతా సమావేశమై దరఖాస్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయినా అన్ని బార్లకు దరఖాస్తులు రాలేదు. జిల్లాలో కల్లుగీత కార్మికుల బార్లతో కలసి 25 బార్లకుగాను 9 బార్లకు మాత్రమే డ్రా తీశారు. ఇంకా మిగిలిన 16 బార్ల విషయంలో ఎకై ్సజ్శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. దరఖాస్తు గడువు ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినా ఒక్క దరఖాస్తు రాలేదు. అడ్డగోలు షరతులు విధించడంతో బార్లు ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఒక్క దరఖాస్తూ రాలేదు వాయిదాల మీద వాయిదాలు వేసి నోటిఫికేషన్లు మీద నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ జిల్లాలో మొత్తం బార్లకు దరఖాస్తులు రావడం గగనంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ కూటమి ప్రభుత్వం నూతన బార్ల పాలసీని ప్రకటించింది. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 22, రిజర్వ్ కేటగిరిలో 3 బార్లు మొత్తం కలుపుకుని 25 బార్లకు లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఒక్కో బార్కు నాలుగేసి దరఖాస్తులు వస్తేనే డ్రా తీయాలని, లేకపోతే రీనోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. మొదట ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆశించిన రీతిలో దరఖాస్తులు రాలేదు. దాంతో మరో రెండు రోజుల పాటు దరఖాస్తులకు గడువు పెంచింది. జిల్లాలో మద్యం దుకాణాలను బినామీల ద్వారా నిర్వహిస్తున్న కూటమి నేతల కుట్రలతోనే దరఖాస్తులు రాలేదని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో మొత్తం మీద ఓపెన్ కేటగిరీలో 24 దరఖాస్తులు, గీత కార్మికులకు కేటాయించిన బార్ల కు 19 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 30న ఓపెన్ కేటగిరిలో ఆరు, రిజర్వ్ కేటగిరిలో మూడు బార్లకు డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేశారు. మిగిలిన 16 బార్లు మిగిలిపోయాయి. రాజమహేంద్రవరం 13, కడియపులంక ఒకటి, కొవ్వూరు ఒకటి, నిడదవోలు ఒకటి బార్లు ఉన్నాయి. వాటి కోసం రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయినా ఒక్క దరఖాస్తు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎకై ్సజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్ కీర్తి చేకూరి సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ, ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి కనబరచాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు నిజ సమయంలో చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పీజీఆర్ఎస్కు సంబంధించి వాస్తవంగా డివిజన్, మండల స్థాయిలో సరైన పరిష్కారం, సరైన అవగాహన లేకే కలెక్టరేట్కి ఎక్కువ మంది వస్తున్నారన్నారు. మనందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో సమన్వయం, పరస్పర సహకారంతో కలసి పనిచేద్దామని కలెక్టర్ కోరారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలో జిల్లాకు చెందిన ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రావలసిన అనుమతులు, నిధుల మంజూరు తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించామని, ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి కలెక్టరేట్ ఏవో ఆలీ, ఆర్డీఓలు రాణీసుస్మిత, ఆర్.కృష్ణనాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు స్వాగతం పలికారు. -
నానా ఇబ్బందులు పడుతున్నాం
నేను అన్నవరప్పాడు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత పదేళ్లలో ఇంత దుర్భర పరిస్థితి ఏనాడూ ఎదురవలేదు. నేడు ఆటో నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఫైనాన్స్లో అప్పు తీసుకుని ఆటో కొనుగోలు చేసిన వారే నేడు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి రూ.1000 నుంచి నేడు రూ.500 కూడా మిగలడం లేదు. – వాసంశెట్టి రాము, ఆటోయూనియన్ ప్రెసిడెంట్, అన్నవరప్పాడు ఎలా పోషించాలో అర్థం కావడం లేదు నిడదవోలు–కానూరు, కానూరు–తణుకు రోజుకి 10 ట్రిప్పులు వేసేవాడిని. నేడు రెండు, మూడు ట్రిప్పులు కూడా వేయలేకపోతున్నాం. రోజుకి ఆదాయం రూ.800 నుంచి రూ.1200 వరకు ఉండేది. నేడు రూ.500 కూడా తోలడం లేదు. మిగులు ఎలా ఉన్నా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. – పంజా దుర్గారావు, ఆటో డ్రైవర్, కానూరు ఆర్థికంగా నలిగిపోతున్నాం కుటుంబాలను పోషించలేక ఆర్థి కంగా నలిగిపోతున్నాం, రోడ్డెక్కి నా కిరాయిలు ఉండటం లేదు. ఉచిత బస్సు పథకం మా ఉపాధికి గండికొట్టింది. గతంలో ఉద యం 6 గంటలకు ఆటో ఎక్కితే సాయంత్రం 6 గంటలకు డ్యూటీ దిగేవాడిని. కానీ నేడు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వేచి చూసినా రోజుకి రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాం. జీవితం భారంగా మారింది. –ఈతకోట నాగరాజు, ఆటో డ్రైవర్, లంకమాలపల్లి -
అంగన్వాడీల జిల్లా కమిటీ ఎన్నిక
సీటీఆర్ఐ: ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా రెండో మహాసభ స్థానిక విక్రమహాల్లో శనివారం జరిగింది. ఈ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తీర్మానాలను ఆమోదించారు. సీహెచ్ మాణిక్యాంబ అధ్యక్షురాలిగా, కె.బేబీరాణి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా బి.రామలక్ష్మి, గౌరవ అధ్యక్షుడిగా ఎస్ఎస్ మూర్తి, జిల్లా ఆఫీస్ బేరర్స్గా సీహెచ్ అన్నపూర్ణ, బి.మార్తమ్మ, 10 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో అంగన్వాడీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితులను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు టి.అరుణ్ వివరించారు. దేశభవిష్యత్తు అయిన బాలలను, గర్భిణీలు సంక్షేమం చూసే సేవా కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సభలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సాంకేతిక మయం
కూటమి పాలనలో తప్పులుకపిలేశ్వరపురం: ఆధునిక కాలమంతా సాంకేతికమయం. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైతం సాంకేతిక అంశాలతో నిండిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్య సంస్థలున్నాయి. ఇంజినీర్లను తయారు చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదన ఉంది. సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ కథనం.. జిల్లాలో సాంకేతిక విద్యాసంస్థలివే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 520, 29 ప్రైవేటు కళాశాలల్లో 16,800 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలో కాకినాడ జిల్లాలో 8,666 మంది పరీక్ష రాయగా 6,343 మంది అర్హత పొందారు. కోనసీమలో 3,891 మందికి 2,866 మంది, తూర్పుగోదావరిలో 7,416 మందికి 6,011 మంది మొత్తం 15,220 మంది అర్హత పొందారు. కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 644 సీట్లు, 12 ప్రైవేటు కళాశాలల్లో 1,400 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ, 44 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు మరో ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. రంపచోడవవరం, రాజమహేంద్రవరంలలో ఒక్కొక్కటి చొప్పున ప్రభుత్వ, ఐదు ప్రైవేటు, కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ఒకటి, కాకినాడలో రెండు ప్రభుత్వ, 9 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సాంకేతిక విద్యపై విద్యార్థుల ఆసక్తి జూలై 4న కాకినాడ జేఎన్టీయూకే విశ్వ విద్యాలయ 11వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 35 మందికి బంగారు, 99 మందికి పీహెచ్డీ పట్టాలు, 5 నగదు పతకాలు, అందజేశారు. సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ, సమగ్ర శిక్షా, ముస్కాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలై 28న పిఠాపురంలోనూ, 29న అమలాపురంలోనూ స్పేస్ ఎడ్యుకేషన్ క్యాంపులను నిర్వహించగా విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్శిటీ క్యాంపస్లో జూలై 14 నుంచి 19 వరకూ క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ– ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. జాతీయ స్థాయి పరీక్షల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విద్యలో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబులు అందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇచ్చారు. సాంకేతిక విద్యపై కూటమి నిర్లక్ష్యం డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు వేధిస్తున్నాయి. సుమారు రూ.15 వేలు చొప్పున నాలుగు నుంచి ఏడు క్వార్టర్ల వరకూ చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. వాటి భారాన్ని మోయలేక డీమ్డ్ యూనివర్శిటీలుగా మారేందుకు కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో ఈఏపీసెట్ ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.ఆధునిక సాంకేతికతను సామాన్యుల కోసం వినియోగించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఈ–కేవైసీ పేరుతో రేషన్ కార్డుల్లో కోత పెట్టిందన్న వాదన ఉంది. యాప్ల ద్వారా సర్వే పేరుతో దివ్యాంగులు తదితరుల పింఛన్లలో కోత పెట్టింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదల చేసినప్పటికీ నెలన్నర తర్వాత జూలైన 4నుంచి కానీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో డీఎస్సీ ఒకే రోజు ఒకే సమయానికి రెండు పరీక్షలకు హాజరు కావాలంటూ హాల్ టికెట్లు జారీ చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. సాంకేతికతతో నేరాలను అదుపు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ అందుకు భిన్నంగా ఏడాది కాలంలో కాకినాడ జిల్లాలో సుమారు వెయ్యికిపైగా ఆన్లైన్ మోసాల కేసులు నమోదయ్యాయి. పెరిగిన ఇంజినీర్ల ఆవశ్యకత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సద్వినియోగం ఇంజినీరింగ్ విద్యనందించడంలో ‘కూటమి’ నిర్లక్ష్యం సంక్షేమాన్ని ఎగ్గొట్టేందుకు సాంకేతికత వాడకం రేపు ఇంజినీర్స్ డే -
ఉమ్మడి జిల్లాలో 42 బెంచ్ల్లో లోక్ అదాలత్
● పరిష్కరించిన కేసులు 4,453 ● బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారంకంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రమాదవశాత్తూ మృతి చెందిన వారి కేసుల్లో రాజీ పడ్డ వారు నష్టపరిహారానికి ఎక్కువ కాలం వేచి ఉండనవసరం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ లబ్ధిదారుడు తన బ్యాంక్ అకౌంట్ తెలిపితే నెల రోజుల్లోనే లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తారని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్ఆర్ జిల్లాల్లో శనివారం 42 బెంచ్లలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. దీనిని జిల్లా కోర్టులో ఇన్చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో ఇరువర్గాల సమస్య రాజీతో కూడిన పరిష్కారం అవుతుందన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తూర్పు గోదావరి జిల్లా ముందంజలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 4453 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారాన్ని అందేలా చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.ఉమా సునంద, ఎల్.వెంకటేశ్వరరావు, ఎస్కే.జానీబాషా, బి.పద్మ, కె.ప్రకాష్బాబు, ఎన్.శ్రీలక్ష్మి, టి.రాఘవేంద్ర, జి.శ్రీనివాస్రెడ్డి, పి.బాబు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి పి.రమేష్ పాల్గొన్నారు. -
సెపక్తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
పి.గన్నవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈనెల 11న కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి సెపక్తక్రా సెలక్షన్స్లో పీఎంసీ పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం కోసూరి ఉమాదేవి తెలిపారు. అండర్–17 బాలికల విభాగంలో మట్టపర్తి అవంతి, అండర్–14 బాలికల విభాగంలో కడలి హిరణ్యవల్లి, అండర్–17 బాలుర విభాగంలో గుమ్మళ్ల నితీష్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె వివరించారు. వీరిని పేరెంట్స్ కమిటీ సభ్యులతో పాటు, వ్యాయామోపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు అభినందించారు. ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపికఅమలాపురం రూరల్: మలికిపురం మండలం మోరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్జీఎఫ్ ఫెన్సింగ్ జిల్లా ఎంపికల్లో అమలాపురం మండలం ఎ.వేమవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో డి.భార్గవ్, అండర్–14 విభాగంలో ఎ.నాగవరుణ్ ప్రతిభ కనబరచి రాష్ట్ర పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయిని కనకదుర్గ తెలిపారు. విద్యార్థులను సర్పంచ్ రావూరి వెంకటలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ దాసం విజయదుర్గ, వ్యాయామోపాధ్యాయుడు బీవీవీఎస్ఎన్ మూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు లింగోలు సత్యవతి, నాయకులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.మృతదేహం గుర్తింపుఏలేశ్వరం: పట్టణంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం మెట్లపై మృతదేహాన్ని గుర్తించారు. వయస్సు 50 ఉంటుందని భావిస్తున్నారు. శరీరంపై నిక్కరు మినహా ఏమీలేవు. బక్కపలుచగా ఉన్నాడు. మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
బ్యాంకు మేనేజర్ని బురిడీ కొట్టించిన మహిళ
నిడదవోలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని ఓ బ్యాంక్ మేనేజర్ను మాయమాటలతో నమ్మించి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్న మహిళపై నిడదవోలు పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిడదవోలు పట్టణ సీఐ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం. నిడదవోలు పట్టణంలో గతంలో పనిచేసిన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ వద్ద నుంచి పట్టణంలోని విద్యానగర్కు చెందిన అంబటి ఉమా (అలియాస్ శ్రావ్యారెడ్డి) దఫదఫాలుగా రూ.1.30 కోట్లు తీసుకుంది. నూజివీడు ఇతర ప్రాంతాల్లో పొలాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ను నమ్మించింది. ఈ క్రమంలో లోన్ వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భారీ మొత్తం కావాలంటూ పలుమార్లు బ్యాంకు మేనేజర్ వద్దకు వచ్చేది. ఇలా తరుచుగా వస్తూ పెద్ద మొత్తంలో నగదు తీసుకుంది. బ్యాంకు మేనేజర్ బంధువులు, తెలిసిన వారి వద్ద నుంచి సొమ్ములు తీసుకుని నిందితురాలు అంబటి ఉమకు ఇచ్చారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ బంగారం కూడా కొనుగోలు చేసింది. తీరా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా లేదని మోసపోయినట్లు బ్యాంకు మేనేజర్ గ్రహించారు. తీసుకున్న రూ.1.30 కోట్లు డబ్బులు ఇవ్వాలని ఆమెను బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ తరచూ అడిగేవారు. ఈ క్రమంలో డబ్బుల గురించి అడిగితే అత్యాచారం చేశావని, నన్ను వాడుకొని మోసం చేశావని కేసు పెడతానని నిందితురాలు మేనేజర్ను బెదిరించింది. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాసరావు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఆమైపె ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం విద్యానగర్లో నిందితురాలు అంబటి ఉమను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి రూ.4.93 లక్షల నగదు, 312.020 గ్రాముల బంగారు వస్తువులు, ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముద్దాయి అంబటి ఉమా వలలో పడి నిడదవోలు చుట్టుపక్కల మరి కొంతమంది కూడా మోసపోయినట్లు తెలిసింది. కేసును ఛేదించిన సీఐ పీవీ తిలక్, ఎస్సై జగన్మోహన్రావులను కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అభినందించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రూ. 1.30 కోట్లు తీసుకున్న మహి ళ సొమ్ము అడిగితే అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులు రూ.4.93 లక్షల నగదు, బంగారం రికవరీ -
జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలి
తుని: విద్యార్థులు జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలని భారతీయ వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం సూచించారు. స్థానిక స్పేసెస్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన యువ ప్రేరణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్ధుల ఆలోచనల్లో సృజనాత్మకత లేకపోతే యాంత్రికంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జీవిత లక్ష్యాల సాధనకు సమర్థ ప్రణాళికలు రచించాలన్నారు. సవాళ్లను అధిగమించి అవకాశాలను అందిపుచ్చుకునేలా సంసిద్ధులై ఉండాలని చెప్పారు. మరో అతిథి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించే మార్కులు వారి మేధస్సుకు కొలమానం కాదన్నారు. లక్ష్యసాధన వైపు అడుగులేయాలంటే కఠోరశ్రమ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్ అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. -
కృష్ణమోహన్కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): స్థానిక నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వరాహగిరి కృష్ణమోహన్ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం రాష్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయుడు 2025గా ఎంపిక ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ వివరాలను శనివారం ఆయన తెలిపారు. తొలిసారిగా ఇస్తున్న బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్ర స్థాయిలో 248 నామినేషన్లు వచ్చాయన్నారు. వాటిలో 53 మందిని ఎంపిక చేసి గుంటూరు బ్రాడీపేట బ్రాహ్మణ సేవాసమితి ఆఫీసులో ఈ నెల 14న అతిథుల చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
శానిటరీ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం
అన్నవరం: ఐదేళ్ల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ప్రవేట్ స్థలంగా నమ్మించి తన బంధువులకు విక్రయించి మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను, పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగలేదని మనస్థాపానికి గురైన అన్నవరం దేవస్థానం శానిటరీ ఇన్స్పెక్టర్ టి.వేంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో అతడిని తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పినట్టు ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు రాసిన లేఖలో వివరాల ప్రకారం.. ఆయన 2021లో మధ్యవర్తిగా ఉండి తన తోడల్లుడు తెడ్లాపు రవికుమార్, మరదలు వేంకట సత్యదీప్తి కోసం బెండపూడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 114–16ఎ, 114–17ఏ లో రియల్ ఎస్టేట్ వెంచర్లోని 33 నెంబర్ ప్లాట్ను రూ.25 లక్షలకు స్థానిక వ్రతపురోహితుడు నాగాభట్ల సీతారామం వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల అనంతరం ఈ ఏడాది ఆగష్టు 14న ఆ స్థలాన్ని ఎల్ఆర్ఎస్ నిమిత్తం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆఫీసులో సంప్రదించగా అది ప్రభుత్వ భూమి అని తేలిందని తెలిపారు. దాంతో ఆ భూమి విక్రయించిన నాగాభట్ల సీతారామంను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా తాను రియల్ ఎస్టేట్ వెంచర్లో దానిని కొన్నానని ఆ వెంచర్ వేసిన వారినే అడగాలని అంటున్నాడని అందులో పేర్కొన్నారు. దీనిపై తొండంగి పోలీసులను ఆశ్రయించినా, పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. దాంతో తనకు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేంకటేశ్వరరావును దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం పరామర్శించారు. వేంకటేశ్వరరావుకు స్థలం అమ్మిన నాగాభట్ల సీతారామంను ఈ వ్యవహారంపై ప్రశ్నించగా తాను ఇల్లు కట్టుకుందామని ఆ ప్లాట్ కొనుక్కున్నానని కాని తన తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో విక్రయించానని తెలిపారు. అది తన పూర్వార్జితం కాదని అది ప్రభుత్వ భూమి అన్న విషయం తనకు తెలియదని తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వారినే అడగాలని ఆయనకు చెప్పానని తెలిపారు. -
బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయండి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు దొమ్మేటి శంకరరావు, సత్యనారాయణ, బిల్డర్ చిన్నల ఆధ్వర్యంలో బీసీల శ్రీఐద్ఙు ప్రధాన డిమాండ్లపై శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీఓ కృష్ణనాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా శ్రీప్రత్యేక రక్షణ చట్టం్ఙ తెస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థల నామినేటెడ్ పదవులు, నామినేషన్ లలో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామన్న మరో వాగ్దానం ఇప్పటి దాకా అమలు కాలేదన్నారు. స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా, బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఏప్రిల్ తరువాత ఆరు నెలల లోపు కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిపే వీలున్నందున, ఈ లోపే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి, ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీలకు వారి జనాభా దామాషా మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. కార్యక్రమంలో నరవ గోపాలకృష్ణ మార్గాని సురేష్, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
చేనేత.. సమస్యల కలబోత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేనేత కుటుంబాలు బకాయిల గుదిబండతో చితికిపోతున్నాయి. గడచిన 10 నెలలుగా పైసా కూడా విదల్చక పోవడంతో చేనేత సహకార సంఘాలు మూత వేసుకునే దుస్థితి ఏర్పడింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అన్ని పథకాలు అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. సూపర్ సిక్స్ అమలుమాట దేవుడెరుగు కనీసం అప్పులు కూడా పుట్టక చేనేత రంగం కుదేలైందని చేనేత కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ గద్దె నెక్కి 14 నెలలు దాటిపోయినా బకాయిలు విడుదల చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చేనేతలు చేతిలో చిల్లిగవ్వ లేక నూటికి రూ.8ల వడ్డీతో అప్పుల కోసం రోడ్డెక్కే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సంప్రదాయంగా చేనేత ఉత్పత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముందుకు వెళదామంటే నుయ్యి, వెనక్కు వద్దామంటే గొయ్యి అన్న సామెత చందంగా నేతన్నల పరిస్థితి తయారైంది. అనేక చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచి పోరాడుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఈ ప్రాంతంలో చేనేతల జీవితం కష్టాలు, కన్నీళ్లు కలబోతగా మారింది. ఈ దుస్థితికి కూటమి ప్రభుత్వం నిర్వాకం కూడా కారణమని చేనేత సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఉత్తిమాట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 పైబడే చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో చేనేత కుటుంబాలు ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, అంగర, పులుగుర్త, వడిశలేరు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ముమ్మిడివరం, క్రాపచింతలపూడి శివారు కె జగన్నాథపురం, బండార్లంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల పరిధిలో జరిగే లావాదేవీలపై సుమారు 13వేల చేనేత కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉమ్మడి తూర్పున పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్లో సంఘాలు మనుగడ సాగిస్తాయనేది నిర్వివాదాంశంగా పేర్కొటున్నారు. గతంలో మాదిరిగా సంఘాలు ఇక ముందు కూడా సక్రమంగా నడవాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కలిసి సంఘాలకు రావాల్సిన రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటున్నారు. తనతోనే చేనేత రంగం ప్రగతిబాటలో పయనించిందని గొప్పలకు పోతోన్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బకాయిలు విడుదల చేసి మాట్లాడాలంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వినియోగం వరకు విద్యుత్ ఉచితమని చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నంగా 100 యూనిట్లకు పైబడి వినియోగించిన వారికి విద్యుత్ బిల్లులు సెప్టెంబర్ నెలలో చేతిలో పెట్టారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. పెట్టుబడులు పెట్టే స్తోమత లేక.. ఉమ్మడి జిల్లాలో ఒకో సంఘానికి తక్కువలో తక్కువ రూ.ఏడెనిమిది లక్షల నుంచి రూ.90 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని ఒక్క అంగర చేనేత సహకార సంఘానికే రూ.90 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు అవార్డు దక్కిన అంగర చేనేత సహకార సంఘం దుస్థితి ఇలా ఉంటే మిగిలిన సంఘాల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ సంఘాలలో సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి తమ పొట్టకొడుతోందని చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయక, పెట్టుబడులు పెట్టే స్థోమత లేక, బయట మార్కెట్లో రూ.8ల వడ్డీకి అప్పులు తెచ్చే సాహసం చేయలేక చివరకు సొసైటీలను మూసేసే దుస్థితి దాపురించిందని నేతన్నలు అంటున్నారు. ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్. గద్దె నెక్కి 14 నెలలు దాటినా అమలు చేయకుండా సర్కారు దగా చేసింది. సాధారణ మగ్గాలపై ఉచిత విద్యుత్ను మరో 100 యూనిట్లకు పెంచుతున్నామని చెప్పారే తప్ప ఆచరణలో అమలుకునోచుకోలేదు. కానీ గత నెల7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా సెప్టెంబర్ నెలలో 100 యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లులు చేతిలో పెట్టి ఉచిత విద్యుత్ అమలుచేయకుండా కూటమి సర్కార్ మోసం చేస్తోందని నేతన్నలు విమర్శిస్తున్నారు. ఈ పథకం అమలుచేయకపోవడంతో ఏడాదిగా సుమారు రూ.4కోట్ల రాయితీ ఎగ్గొట్టేసిందని చేనేత ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ముడినూలు కొనుగోలు సమయంలో చేనేత కార్మికులు 5శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఈ కారణంగా చీరల ధరలు పెంచడంతో మార్కెట్లో విక్రయాలు మందగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమే 5శాతం జీఎస్టీ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా సర్కార్ నమ్మించి మోసగించిందని, జీఎస్టీ చెల్లించలేదంటున్నారు. ఇందుకు తోడు త్రిఫ్ట్ ఫండ్ మాటే వినిపించడం లేదంటున్నారు. సహకార సంఘాల్లో నేత కార్మికుల ఆదాయంలో 8శాతం మినహాయించి సొసైటీలో జమ చేస్తుంటారు. ఆ మొత్తానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వం త్రిఫ్ట్ఫండ్ జతచేసి మూడు నెలలకు ఒకసారి కార్మికుల ఖాతాలకు జమ చేస్తుంటుంది. ఈ త్రిఫ్ట్ ఫండ్ రూ.5 కోట్లు విడుదల చేశామని సంబంధిత మంత్రి సవిత ఆరు నెలల క్రితం ప్రకటించడమే తప్ప ఆ సొమ్ము ఎక్కడా తమ ఖాతాల్లో జమ కాలేదని సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఒక విడత నేతన్న నేస్తం రూ.24వేలు జమ అయ్యేదంటున్నారు. చేనేతను ఆదుకోవడం సామాజిక బాధ్యత చేనేత వృత్తి పరిరక్షణ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా పరిగణించాలి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర అంగర చేనేత సహకార సంఘం సొంతం. అటువంటి సొసైటీకి ఆప్కో నుంచి రూ.కోటి పైగానే బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము విడుదల కాకుంటే సంఘం మూతపడే ప్రమాదం ఉంది. – గుడిమెట్ల శివరామకృష్ణ, మాజీ చైర్మన్, శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం, అంగర బకాయిలు విడుదల చేయాలి బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీ మూతే వేసే పరిస్థితి. సొసైటీలు మనుగడ సాగించేందుకు 11 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ప్రొక్యూర్మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదు. – ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు, ఆదివారపుపేట, రామచంద్రపురం మండలం ఎన్నికల హామీలు అమలు చేయాలి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలి. సంఘాలకు ఎన్నికలు జరపాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7కోట్లు ఆప్కో ద్వారా సహకార సంఘాలకు బకాయిలను చెల్లించింది. – జాన జగదీష్ చంద్ర గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, కోనసీమ జిల్లా మూసివేత దిశగా సొసైటీలు ‘బాబు’ బకాయి రూ.7 కోట్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఊసే లేదు అమలు కాని ఉచిత విద్యుత్ హామీ -
వరిదొడుకులు తప్పేనా?
పెరవలి: ఖరీఫ్లో ధాన్యాన్ని సేకరించటానికి అధికారులు సిద్ధమవుతుండగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగులో అధికారులు వేసిన అంచనాలు తప్పటంతో ధాన్యం కొనుగోలు కూడా ఇలాగే ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్లో పడినపాట్లు మరువక ముందే నేడు ఖరీఫ్ సాగు పంట అందుబాటులోకి రానుండటంతో అధికారులు ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో ఽవరిసాగు 76,941 హెక్టార్లలో చేపడతారని అంచనాలు వేసినా 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఈ నెల 11న జరిగిన జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో 5,31,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఎంతమేర కొనుగోలు చేస్తారనేది అధికారులు చెప్పలేదు. దీంతో రైతులు గందరగోళంలో పడ్డారు. గత ఏడాది రబీ సీజన్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయటంతో రైతులు నానా పాట్లూ పడ్డారు. సాగు తగ్గడానికి కారణాలు ఖరీఫ్లో వరి సాగు తగ్గింది. జిల్లాలో 21,920 హెక్టార్లలో అసలు నాట్లే పడలేదు. రైతులు వరి సాగు చేపట్టకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో సేకరించక దళారీలకు అమ్ముకోవలసి వస్తోంది. మెట్టలో ముందస్తుగా ఽవరి కోతలు పూర్తి అవుతుండగా డెల్టా ప్రాంతంలో చేలు నవంబర్లో కానీ కోతలకు రావటం లేదు. దీంతో ముందుగా కోతలు కోసిన చేల నుంచి ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేసి టార్గెట్ పూర్తి అయ్యిందని చెప్పటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత రబీ సీజన్లో ఇలాగే జరగటంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అధికారులు, మిల్లర్లు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధాన్యం అమ్ముకోలేక ఽఅయిన కాడికి దళారీలకు విక్రయించుకున్నారు. ఈ సార్వా సీజన్లో యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాకు సరిపడా యూరియా వచ్చిందని, గతంలో కంటే ఎక్కువ యూరియా సరఫరా చేశామని చెబుతున్నారు. కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వీలు లేనప్పుడు అసలు పంటే వేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నామని, అందుకే సాగు చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. లక్ష్యాన్ని చేరుతుందా.. ఖరీఫ్ సాగులోనైనా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రబీలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఈసారైనా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. పంట దిగుబడి అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా కొనుగోలు కూడా చేపడితేనే రైతుల కష్టాలు గట్టెక్కుతాయి. ఇబ్బంది లేకుండా చూడాలి రబీ సీజన్లో ధాన్యం అమ్మిన సొమ్ము ఆలస్యంగా రావడంతో నానా పాట్లూ పడ్డాం. ఈ ఏడాదైనా సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. –చిట్టీడి వెంకట సత్యనారాయణ, రైతు, పెరవలి డెల్టాను దృష్టిలో ఉంచుకోవాలి ఈ ఖరీఫ్లో నాట్లు వేసే దశ నుంచీ ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే రెండు సార్లు వర్షాలకు నారు పోయింది. డెల్టాలో వరి కోతలు నవంబర్ నెలలో ప్రారంభం అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు ధాన్యం కొనుగోలు చేయాలి. – అధికారి పల్లపురాజు, రైతు, కానూరు అగ్రహారం జిల్లాలో ఇలా.. మండలం వరి సాగు (హెక్టార్లలో) రాజమహేంద్రవరం రూరల్ 1,191 కడియం 2,100 రాజానగరం 2,791 అనపర్తి 3,310 బిక్కవోలు 5,265 కోరుకొండ 1,052 గోకవరం 1,114 సీతానగరం 4,632 రంగంౖపేట 1,160 చాగల్లు 3,110 దేవరపల్లి 2,818 గోపాలపురం 1,400 కొవ్వూరు 4,316 నిడదవోలు 6,600 పెరవలి 2,325 తాళ్ళపూడి 2,395 ఉండ్రాజవరం 4,792 నల్లజర్ల 4,650 ఖరీఫ్ ధాన్యం సక్రమంగా కొనుగోలు చేస్తారా? జిల్లాలో 55,021 హెక్టార్లలో సాగు 5,31,616 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అంచనా రబీలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా కొనుగోలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పుడు అలాగే ఉంటుందా అని రైతులకు అనుమానాలు ఊహించని విధంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం -
జిల్లా పేరే మార్చేశారు.. స్మార్ట్గా!
అమలాపురం టౌన్: అత్యంత ఆధునిక, సాంకేతిక, పారదర్శకతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకులను పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం వాటి ముద్రణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విస్మరించింది. జిల్లాలో పంపిణీకి సిద్ధమైన 5,31,926 స్మార్ట్ కార్డుల్లో కొన్నింటిపై జిల్లా పేరు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్డులపై ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మరీ ఈ తప్పిదానికి పాల్పడడం శోచనీయం. జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇప్పటికి మూడేళ్లు దాటినా జిల్లా పేరుకున్న గౌరవాన్ని తగ్గించేలా ఇంకా తూర్పుగోదావరి జిల్లాగా వాటిపై ముద్రించడం శోచనీయం. ఇప్పటికే ఈ కార్డుల పంపిణీ మొదలైంది. వాటిపై జిల్లా పేరు తప్పుగా పడడం వల్ల తమకు రేషన్ ఇస్తారో లేదోనని లబ్ధిదారులు కంగారు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడం ఇష్టం లేక తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారా అని జిల్లాకు చెందిన కొందరు ఎస్సీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే కార్డులపై తమ జిల్లా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే సమయంలో ఆధార్ ఆధారంగా ఓటీపీ లేదా బయోమెట్రిక్తో పొందే వీలుంటుదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.దయ భాస్కర్ చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన కొన్ని కార్డుల్లో మాత్రమే తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారని, ఈ తప్పిదాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. దీనివల్ల స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.రేషన్ కార్డుల్లో పేరు మార్పుపై లబ్ధిదారుల ఆందోళన -
మీకు నచ్చని వార్తలు వస్తే కేసులు పెడతారా?
పత్రికల్లో మీకు నచ్చని వార్తలు, విమర్శలు వస్తే కేసులు పెడతారా? ఇదేం పద్ధతి? ఇంత దారుణంగా పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ మీద కూటమి ప్రభుత్వం దాడులు చేయడం దుర్మార్గం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ అసమర్థత, ఇతర వైఫల్యాలను ప్రజల పక్షాన, ప్రజాగొంతుగా వినిపిస్తుంటే తట్టుకోలేక దాడులకు దిగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం చర్యలను యావత్ ప్రజానీకం గమనిస్తోంది. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం ప్రజాస్వామ్యానికి విరుద్ధం ˘ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే పత్రికల మీద దాడులు చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ప్రతికా స్వేచ్ఛను అడ్డుకోవటమే. జర్నలిస్టులు వెతికి తీసిన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలే తప్ప వారిపై కేసులు పెట్టడం అమానుషం. ప్రభుత్వం వెంటనే సాక్షి ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు -
పట్టాలెక్కిన ప్రసాద్ నిర్మాణాలు
అన్నవరం: రత్నగిరిపై ప్రసాద్ పథకం నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం కింద కేటాయించిన రూ.25.32 కోట్లలో రూ.18.98 కోట్లతో చేపట్టనున్న పనులకు గత మే నెలలో టెండర్లు ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా పనులు చేపట్టనున్న స్థలాలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. అతి త్వరలో ప్రతిపాదించిన నిర్మాణాలు ప్రారంభిస్తామని, వచ్చే ఆగస్టు నాలుగో తేదీకి వాటిని పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయని వివరించారు. ఆయన వెంట ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, టూరిజం ఈఈ విజయ భాస్కరరెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రసాద్ నిధులతో అన్నదాన భవనం నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న టూరిజం సీఈ వెంకట రమణ, ఇతర అధికారులు -
సర్వేజనా ఆరోగ్యమస్తు..
● జిల్లాలో ఎన్సీడీ 4.0 సర్వేకు చర్యలు ● ఆరోగ్య సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ● ముందస్తు గుర్తింపుతో సరైన వైద్యానికి అవకాశం రాయవరం: క్యాన్సర్.. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మారి. చాలా మందికి ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మృత్యువు సింహద్వారం వద్ద నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముుందుగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఏటా జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) ప్రోగ్రామ్ను చేపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధులను నాన్ కమ్యూనికల్ డిసీజెస్గా పిలుస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ, గుండె తదితర జబ్బులను ముందుగానే పసిగట్టడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎన్సీడీ 4.0 సర్వేకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. నాలుగేళ్ల నుంచి.. 2021 అక్టోబరులో తొలిసారిగా ఎన్సీడీ సర్వే చేపట్టింది. రెండో విడత 2022 అక్టోబర్ 2 నుంచి, మూడో విడత 2024 నవంబరులో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. మూడో విడతలో.. గతేడాది జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 14,68,723 మందిలో 11,29,412(77శాతం) మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,06,666 మందికి బీపీ (18.30 శాతం), చక్కెర వ్యాధిగ్రస్థులు 1,41,508 (12.53 శాతం) మంది ఉన్నట్టు గుర్తించారు. నోటి సంబంధ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గతంలో 215 మంది ఉండగా ఈ సర్వేలో 4,172 అనుమానిత కేసులు గుర్తించారు. అలాగే గతంలో 466 మంది రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ సర్వేలో 2,090 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్యాన్సర్ నిర్థారణ అయ్యింది. సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్కు గురైన వారు గతంలోనే 283 మంది ఉండగా, 1,894 మంది అనుమానిత కేసులు గుర్తించారు. నాలుగో సర్వేకు ఏర్పాట్లు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్సీడీ నాలుగో సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నిర్వహించే సర్వేలో క్యాన్సర్పై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. నోటి సంబంధిత, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రధానంగా సర్వే ఉంటుంది. సర్వేలో 110 మంది వైద్యులు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 527 మంది మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఆగస్టు 25న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 18వ తేదీతో పూర్తికానుంది. పరీక్షలు ఇలా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల నిండిన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి వివరాలు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు నమోదు చేయడం ద్వారా క్యాన్సర్ దశను ప్రాథమిక అంచనా వేస్తారు. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆరోగ్యశ్రీ కింద ఇతర నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఇక బీపీ, షుగర్ తదితర వ్యాధులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెలుగు చూస్తున్న వ్యాధులు ఈ పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యల్లో బీపీ ముందు వరుసలో, తర్వాత స్థానంలో మధుమేహం ఉంటోంది. అనుమానిత జాబితాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము, నోటి క్యాన్సర్ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోకుంటే శరీరంలో ప్రధాన భాగాలైన కళ్లు, కిడ్నీ, గుండె, నరాలు తదితర భాగాలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం, పొగతాగడం, గుట్కాలు తదితర వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ను గుర్తించేందుకు నాలుగో విడత సర్వే ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. మూడో విడత సర్వే మాదిరిగానే నాల్గవ విడత సర్వేకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సుమలత, ఎన్సీడీ జిల్లా నోడల్ అధికారి, కోనసీమ జిల్లా ముందుగా గుర్తిస్తే నయం మారిన జీవనశైలి, ధూమ, మద్యపానాలు, పొగాకు సేవనంతో పాటుగా వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి నయం చేసే అవకాశం ఉంది. సర్వే చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.– డాక్టర్ దుర్గారావు దొర, డీఎంహెచ్ఓ, కోనసీమ జిల్లా -
దేవస్థానానికి చెరువుల స్వాధీనం
కాజులూరు: ఆర్యావటంలో అనధికారికంగా కొనుగోలు చేసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం భూమిని కోర్టు ఉత్వర్వుల మేరకు శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దేవస్థానం అధికారులకు అప్పగించారు. వివరాల్లోనికి వెళ్లితే ఆర్యావటంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సీతారామస్వామి దేవస్థానానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం కేటాయించిన నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని వంశపారంపర్య అర్చకుడు 1999వ సంవత్సరంలో అనధికారికంగా ఆరుగురు వ్యక్తులకు విక్రయించారు. ఆ విక్రయాలు చెల్లవని దేవస్థానం అధికారులు కోర్టుని ఆశ్రయించగా 2006లో జిల్లా కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించగా వాదోపవాదానల అనంతరం హైకోర్టు గత మార్చి నెలలో సదరు భూమి దేవస్థానానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీనిపై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్, రెవెన్యూ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో పోలేకుర్రు పంచాయతీ సుంకటరేవులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగబత్తుల షడ్రక్కు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామానికి చెందిన షడ్రక్ ద్విచక్రవాహనంపై కాకినాడ వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో షడ్రక్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనధికార క్వారీల్లో తనిఖీలు
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల సర్వే నెంబరు 15లో అనధికారికంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి చేపట్టిన ఈ తనిఖీలో రెండు చోట్ల అనధికార క్వారీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు క్వారీల్లో పనిచేస్తున్న రెండు జేసీబీలు, ఒక లారీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనధికారికంగా నల్లరాయి క్వారీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్రలు పాల్గొన్నారు. -
బాలల కళా కౌశలం!
● నాటక, దృశ్య కళల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలు ● ఆకట్టుకున్న కళా ఉత్సవ్ 2025 ● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 80 మంది హాజరు ● ఘనంగా ముగిసిన ఉత్సవాలు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో కళా ఉత్సవ్ 2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఐదు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటక, దృశ్య కళలు, వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం డీఎంహెచ్ స్కూల్ 9వ తరగతి దివ్యాంగ విద్యార్థి మహబూబ్ కిజర్ మహమ్మద్ మాస్టర్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో పోటీలలో విజేతలకు డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకులు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా పీపీఎస్ జోగన్న శాస్త్రి, ఎం.శ్రీనివాస్, పుప్పాల బాపిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోప్యాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు నాటక కళల బృంద విభాగంలో కె.విమల, సీహెచ్ కళ్యాణి, జి.చరణ్ తేజ, జి.అజయ్ కుమార్ (ఎంఎస్ఎన్సీ ఎయిడెడ్ హైస్కూల్, కాకినాడ), దృశ్య కళల (2డి) వ్యక్తిగత విభాగంలో ఏ.ప్రియదర్శిని, (నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం), శిల్ప కళ (3డి) వ్యక్తిగత విభాగంలో డి.దుర్గా జగదీష్, (జెడ్పీహెచ్ఎస్, రావులపాలెం), దృశ్యకళల బృంద విభాగంలో కేఆర్ఏ కుమారి (పీఎస్సీఎం జడ్పీహెచ్ఎస్, మండపేట). సంప్రదాయ కథా కథనంలో బి.పరిమళ (విజ్ఞాన్ జూనియర్ కళాశాల, రాయవరం) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
కళకాలం నిలిచేలా..
● డైట్లో కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 మంది విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: ఎప్పుడూ పుస్తకాల్లోని పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో సత్తా చాటి శభాష్ అనిపించుకున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణసంస్థ (డైట్)లో గురువారం కళా ఉత్సవ్ 2025 పేరిట జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యం అంశాల్లో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు జరిగాయి. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 35 పాఠశాలల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. సృజనాత్మకతకు వేదిక ప్రారంభోత్సవంలో డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచి వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వతకు, మనో వికాసానికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. శుక్రవారం సోలో(2డి), సోలో(3డి), గ్రూపు (2డి/3డి), థియేటర్ ఆర్ట్స్, సంప్రదాయ కథనాలకు సంబంధించి గ్రూపు విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. బహుమతుల ప్రదానం తొలిరోజు జరిగిన పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్ ఆర్జేడి రాజు చేతులమీదుగా సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. వీరందరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా కేటీ సుబ్బరాయన్, ఎం.నాగేశ్వరరావు, డి. రవి కిరణ్ వ్యవహరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● గాత్రం వ్యక్తిగత విభాగంలో కె.షర్మిల, బృంద విభాగంలో ఎన్.సుమశ్రీ, ఆర్.భారతి, ఈ.నాగజ్యోతి, కె.శిరీష (అంబేడ్కర్ గురుకులం, ఏలేశ్వరం) ● వాయిద్యం వ్యక్తిగత విభాగానికి సంబంధించి స్ట్రింగ్లో టీవీకే దేవీ ప్రియాంక (భాష్యం స్కూల్, కాకినాడ), పెర్కషన్లో కె.కార్తికేయ హిమాన్షు (కలాం జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం). ● నృత్యం వ్యక్తిగత విభాగంలో సీహెచ్ హేమసత్య (చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాల), బృంద విభాగంలో సీహెచ్ త్రిలోచన, పి.జ్యోతి లహరి, జి.చరణ్ సాత్విక్, ఎం.పవన్ కుమార్ (గాంధీపురం మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం). -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తాళ్లరేవు: జాతీయ రహదారిపై మట్లపాలెం వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిపూడి గోవరాజు (41) మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పటవల పంచాయతీ కొత్తూరుకు చెందిన గోవరాజు రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా యానాం వైపు నుంచి కాకినాడ వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవరాజు తలకు తీవ్ర గాయమైంది. అతడిని స్థానికులు హుటాహుటీన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోవరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శతాధిక వృద్ధుడి మృతిఅల్లవరం: కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గుర్రం గంగాధర్ (బాబ్జి) తండ్రి కొండలరావు (100) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు సందర్శించి, శద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ప్లీనరీ సెషన్లో ‘ఆదిత్య’ సతీష్ రెడ్డి
గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్మెంట్ కన్వెన్షన్లో నిర్వహించిన ప్లీనరీ సెషన్లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్మెంట్, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్ ఆట్రోలే (చీఫ్ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్ కుమార్ సింగ్ (డైరెక్టర్, స్ట్రాటజీ, ఎక్స్టర్నల్ రిలేషన్స్, జిందాల్ స్టీల్ లిమిటెడ్), సంజయ్ నారాయణ్ (చీఫ్ జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు. తిరుమల విద్యాసంస్థల సిబ్బంది రక్తదానం రాజమహేంద్రవరం రూరల్: తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు జన్మదినం సందర్భంగా గురువారం తిరుమల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కాతేరులోని సంస్థ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు, డాక్టర్ వైఎస్సార్ అండ్ జక్కంపూడి రామ్మోహనరావు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాలలో సుమారు 265 మంది తిరుమల సిబ్బంది రక్తదానం చేశారు. వారికి నున్న తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రక్తాన్ని డబ్బుతో కొనలేమని, వెల కట్టలేనిదన్నారు. ప్రపంచంలో మనిషి నుంచి మాత్రమే రక్తం లభిస్తుందన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో తిరుమలరావు సోదరులు నున్న కృష్ణ, నున్న సురేష్, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ బాలిక మృతి అల్లవరం: దేవగుప్తం పంచాయతీ నల్లగుంటకు చెందిన బాలిక ఈ నెల ఒకటో తేదీన పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికి బాలిక పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. -
ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ అకాడమీలో గురువారం జిల్లా స్థాయిలో చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు ఉత్కంఠగా జరిగింది. ఈ జిల్లా చెస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి ర్యాపిడ్ విభాగంలో బండారు నానిబాబు ప్రథమ, ద్రాక్షారపు సాత్విక్ ద్వితీయ స్థానాలు, బ్లిట్జ్ విభాగంలో ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ, పనిశెట్టి సాయి అవినాష్ ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ మాట్లాడుతూ విజేతలు ఈ నెల 13 నుంచి నంద్యాలలో జరిగే రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఇద్దరి ఎంపిక రావులపాలెం: రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ అండర్–19 విభాగానికి డాన్ బాస్కో హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆర్.పవన్ కుమార్, ఎ.వినయ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జె.విద్యాసాగర్ గురువారం తెలిపారు. కర్నూలులో ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 10న జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర విభాగంలో జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపారన్నారు. జూదరులకు జరిమానా కిర్లంపూడి: పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వారిని గురువార ంప్రత్తిపాడు కోర్టుకు హాజరు పర్చామన్నారు. ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున జరిమానా విధించారన్నారు. మరోసారి పేకాట ఆడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పనితీరుతో ఉద్యోగులకు గుర్తింపు
● పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు ● ఈటీసీలో ఎంపీడీఓల శిక్షణ పరిశీలన సామర్లకోట: ఉద్యోగులు మంచి పనితీరుతో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరావు అన్నారు. సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రానికి (ఈటీసీ) గురువారం ఆయన విచ్చేశారు. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల్లోని ఎంపీడీఓలకు జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రతిచోటా ఎదురయ్యే సమస్యలను నైపుణ్యంతో సమర్థంగా అధిగమించాలన్నారు. అంతకు ముందు జరిగిన ఈటీసీ నిర్వహణ కమిటీ సమావేశానికి కమిషనర్ ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. ఈటీసీలో జరుగుతున్న శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కావాల్సిన అవసరాలపై ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. జీఎస్డబ్ల్యూ, వైద్యం, విద్య, ఇంజినీరింగ్ వంటి ఇతర శాఖల శిక్షణలు కూడా ఈటీసీలో జరిగేలా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం విస్తరణ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, డీడీఓలు శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు. -
22 నుంచి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు
శరన్నవరాత్ర ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పీఠాధిపతి గాడ్ తదితరులు రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయదుర్గా పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 8.19 గంటలకు గురుహోరలో కలశస్థాపన జరుగుతుందన్నారు. పీఠంలోని కొలువైన విజయదుర్గా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారు దర్శనమిస్తారిలా.. ఈ నెల 22న బాలాత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న రజిత కవచ అలంకృత విజయదుర్గాదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న విజయదుర్గాదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్దని, 2న రాజరాజేశ్వరి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ పీఠాధిపతి గాడ్ సమక్షంలో అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబి తదితరులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. -
మూతపడే దుస్థితికి చేనేత సంఘాలు
రామచంద్రపురం రూరల్: చేనేత సహకార సంఘాల నిధులన్నీ ఆప్కో బకాయిల రూపంలో స్తంభించిన కారణంగా సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితికి సంఘాలు చేరుకున్నాయని లివరీ ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హసన్బాద చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లివరీ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సత్య ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలలుగా బకాయిలు పేరుకు పోయాయన్నారు. బ్యాంకుల నుంచి మంజూరు కాబడిన నిధులు పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో సంఘాల బ్యాంకు ఖాతాలన్నీ ఎన్పీఏలోకి వెళుతున్నాయన్నారు. కొన్ని సంఘాలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆప్కోకు ఎన్నికలు నిర్వహించి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హసన్బాద, ఆదివారపుపేట, శివల, అద్దంపల్లి, నేలటూరు, ముమ్మిడివరం, తమ్మవరం, మురారి, నల్లూరు తదితర చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అయోధ్యకు తరలిన విల్లు, బాణం
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలో నిర్మిస్తున్న కల్యాణ రాముని ఆలయానికి సమర్పించేందుకు దాత విల్లు, బాణం తయారీకి మండపేటలో ఆర్డర్ చేశారు. మండపేటలోని రామకృష్ణా బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ నిర్వాహకుడు, శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ గోల్డ్ కోటింగ్తో వీటిని రూపొందించారు. అయోధ్యకు చెందిన వంశవృక్షం అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ శాస్త్రి, గాయత్రి దంపతులు రూ.1.80 లక్షలతో తయారు చేయించారు. వాటిని గురువారం చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య నుంచి మండపేటకు వచ్చి తీసుకెళ్లారు. కళాకారుడు వాసా శ్రీనివాస్ నైపుణ్యాన్ని ఆయన ప్రసంశించారు. -
లక్ష్మీనరసింహస్వామికి రూ.35,62 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ.35,62,444 ఆదాయం సమ కూరింది. ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 11 వరకూ 83 రోజులకు గాను ఈ మొత్తం సమకూరింది. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,07,678, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.14,679, అన్నదానం హుండీల ద్వారా రూ.40,087 లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అలాగే 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి లభించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్ బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వినాయకునికి వెండి పళ్లెం సమర్పణఅయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి విశాఖపట్నం తగరపువలసకు చెందిన కటకం అవినాష్, సాహిత్య శృతి దంపతులు గురువారం వెండి పళ్లెం సమర్పించారు. 1050 గ్రాములు బరువైన ఈ పళ్లెం విలువ రూ.1,35,000 ఉంటుంది. దాతలు దీన్ని ఆలయ అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తికి అందజేశారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు, వేద పండితులు సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో ఉన్న పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది. సాక్షిలో నిజాలను నిర్భయంగా రాస్తే కేసులు పెడతారా? ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ను పత్రికలో పబ్లిష్ చేస్తే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ప్రచురించిన వార్తలో అభ్యంతరాలు ఉంటే ఖండన లేదా వివరణ ఇవ్వాలి కాని ఎడిటర్, ఎడిషన్ ఇన్చార్జిలు, పత్రిక ప్రతినిధులపై కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం హక్కు లేదా?– తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రిసాక్షి ఎడిటర్పై కేసు సరి కాదురాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదు. పత్రికలో వచ్చిన వార్తపై అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా ఖండన ఇవ్వొచ్చు. కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, తూర్పుగోదావరి -
జీపీఎస్ ఉన్న వాహనాలతోనే ధాన్యం తరలింపు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అక్టోబర్ రెండో వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 2025– 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. గత సీజన్తో పోలిస్తే కనీస మద్దతు ధర రూ.69 పెరిగిందన్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్లో 5,31,616 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం సేకరణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని, అవసరమైతే నియామకం చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పంట, ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. మిల్లులు సిద్ధంగా ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. మిల్లుల టాగింగ్, తనిఖీపై దృష్టి సారించాలన్నారు. ధాన్యం తరలించే వాహనాలన్నిటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గోతాముల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గత సీజన్లో మిల్లులకు 3,54,903 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, 2,28,806 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వారి నుంచి వచ్చిందని, ఇంకా 10,781 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని దీనిని త్వరితగతిన రికవరీ చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
– పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్పై వెళ్లిన ఎంపీ మిథున్రెడ్డి తిరిగి గురువారం మధ్యాహ్నం 4.35 గంటలకు సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం వచ్చారు. తొలుత వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయాన్ని సందర్శించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆయన వెంట వచ్చారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు పూలు జల్లి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మంజీర హోటల్కు చేరుకుని అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, జి.శ్రీనివాసులనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ ఎంపీ వంగా గీత, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిలు జి.శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎంపీ మిథున్రెడ్డికి నేతలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
భ్రాంతిభద్రతలు భేష్!
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టుతప్పుతున్నాయా? రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు సాగుతున్నాయా? గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోందా? యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఏడాదిగా జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలే తార్కాణం. వాటి వివరాలు ఇలా.. ● దివాన్చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ● ఇటీవల రాజమహేంద్రవరం తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసులం అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు. ● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బు లాక్కొని పరాయయ్యాడు. ● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్కు సంబంధించిన రిసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది. రాజమహేంద్రవరంలో బరి తెగింపు ప్రశాంతంగా ఉండే చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్, మందు బ్యాచ్, గంజాయి బ్యాచ్లుగా ప్రతి రోజూ రాత్రిళ్లు హల్చల్ చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. రాత్రివేళ్లల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవలు చేస్తున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరి తెగిస్తున్న రౌడీషీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెర పోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీషీటర్ల చేతిలో తన్నులు తింటున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పోలీసులపైనే దాడులు రాజమహేంద్రవరంలో ఇటీవల ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ నాగబాబు, హోమ్ గార్డ్ కాళీలు.. రోడ్డుపై హల్చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కుని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఘటనను సీరియస్గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. ఏది ఏమైనా పోలీసులపైనే తిరగబడ్డారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. జిల్లాలో కట్టు తప్పుతున్న శాంతిభద్రతలు పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న రౌడీషీటర్లు రాత్రిళ్లు తప్పతాగి గొడవలు, దోపిడీలు శ్రుతిమించుతున్న ఆగడాలు చారిత్రక రాజమహేంద్రిలో అసాంఘిక ఘటనలు అశ్లీల నృత్యాలు, యథేచ్ఛగా మద్యం, పేకాట కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గంజాయి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. రెండు రోజుల్లో బహిరంగంగా మద్యం తాగే వారిని గుర్తించి 300 కేసులు నమోదు చేశాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, రాత్రి సమయాల్లో తాగి రోడ్లపై తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా గణపతి నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాం. – డి.నరసింహ కిషోర్, ఎస్పీ, తూర్పుగోదావరి తెలియకుండా మరికొన్ని... రాజమహేంద్రవరం నగరంలో తెలిసినది ఈ ఘటన అయితే పోలీసుల దృష్టికి రాకుండా మరెన్నో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గంజాయి, మద్యానికి బానిసలైన ఆకతాయి యువకులకు కొందరు రౌడీషీటర్లు ఆశ్రయం ఇస్తున్నారు. వారిని అక్రమ వ్యవహారాలు, వివాదాలు, సెటిల్మెంట్లకు వాడుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొందరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని జంక్షన్లు, నగర శివారు ప్రాంతాలను తమ అడ్డాలుగా చేసుకుని మద్యం బాటిల్స్తో రోడ్లపైనే హల్చల్ చేస్తున్నారు. కొందరైతే దారిన పోయే వారితో గొడవలకు దిగుతున్నారు. వారి నుంచి విలువైన వస్తువులు దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఫిర్యాదు చేస్తే.. ఎక్కడ తమపై దాడి చేస్తారో అన్న భయంతో అనేకమంది పోలీస్ స్టేషన్ గడప తొక్కడం లేదన్న విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ ఏదీ? గతంలో ప్రతి నెలా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. పోలీసుల దెబ్బకు అణిగిమణిగి ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు లేవు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పైరవీలకు తలొగ్గి కేసులు కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పనులకు కదలిక
● వీరేశ్వరస్వామి ఆలయం పరిశీలన ● పునర్నిర్మాణానికి సూచనలుఐ.పోలవరం: వర్షం వస్తే నీటి వెతలు.. ఆపై మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కానరాని చర్యలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రూ.నాలుగు కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినా పనులు ప్రారంభించకపోవడం, ఆపై వర్షం వస్తే ఆలయంలో ముంపు సమస్యలపై ‘స్వామీ.. నీ చెంత నీరేమీ’ అనే శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ స్థపతి, అసిస్టెంట్ స్థపతి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలసి బుధవారం ఆలయాన్ని పరిశీలించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, గాలి గోపురం, చండీశ్వరస్వామి, నవగ్రహ మండపాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి చేసిన ప్లాన్ను వారు పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. -
ట్యాబ్.. స్విచ్చాఫ్
● బోధనకు కూటమి మంగళం ● గత ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ ● పట్టించుకోని ప్రస్తుత పాలకులుపునరుద్ధరించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్యాబ్ విద్యాబోధనను కొనసాగించాలి. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ప్రస్తుతం అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇచ్చిందన్న కారణంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఈ విధానం సరైంది కాదు. ట్యాబ్ విద్యాబోధనను వెంటనే పునరుద్ధరించాలి. – నేరేడుమిల్లి నరేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కొత్తపేట మండల అధ్యక్షుడు, గంటి నెరవేరని లక్ష్యం గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. దేశంలో మరెక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వాటిని సాంకేతికతతో రూపొందించారు. 2023–24లో ట్యాబ్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. అయితే వారి వద్ద ఉన్న ట్యాబ్లు పనిచేయక గత ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది. – కేపీసీహెచ్ సూర్యారావు, యూటీఎఫ్ కొత్తపేట మండల అధ్యక్షుడు కొత్తపేట: ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. దానిలో భాగంగానే ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యావ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ముఖ్యంగా సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా పథకాలు అమలు చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వాటి ద్వారా విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాబ్లతో విద్యాబోధనకు మంగళం పాడింది. జగన్ ముద్ర కనిపించకుండా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను గమనిస్తే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి, వాటి ముద్ర కనిపించకుండా చేసే లక్ష్యంతోనే పరిపాలన సాగిస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజన పథకాలను కొనసాగించి, హుందాగా వ్యవహరించడానికి బదులు రాజకీయాలకు పాల్పడుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళుతోందన్నారు. పేద విద్యార్థులపై చిన్నచూపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022–23 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ ప్రారంభించింది. రెండేళ్ల పాటు అందజేసింది. ఉపాధ్యాయులు ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో పాఠ్యాంశాలు బోధించేవారు. వాటితో విద్యార్థులు చక్కగా చదువుకునేవారు. ట్యాబ్ల వినియోగం కోసం పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం, బైజూస్ ఒప్పందం ముగియడం, మళ్లీ రెన్యువల్ చేసుకోకపోవడం ద్వారా ట్యాబ్ విద్యాబోధనను నిర్వీర్యం చేసింది. ఫలితంగా అవి మూలనపడ్డాయి. ఒక్కో ట్యాబ్కు రూ.32 వేల ఖర్చు గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందజేశారు. వాటిలో బైజూస్ కంటెంట్తో కూడిన వీడియోలు పొందుపరిచారు. ఇవి పదో తరగతి వరకూ ఉపయోగపడేలా రూపొందించారు. దీని కోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.32 వేలు ఖర్చు చేశారు. 2023–24లో ట్యాబ్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.కోనసీమ జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,266 ప్రాథమికోన్నత పాఠశాలలు 45 ఉన్నత పాఠశాలలు 252 మొత్తం పాఠశాలలు 1,563 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 89,672 రెండేళ్లలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు 30,379 ట్యాబ్లకు ఖర్చు చేసిన మొత్తం రూ.97.21 కోట్లు -
నాణ్యమైన సరకులే సరఫరా చేయాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నాణ్యమైన బియ్యం, పప్పులు, ఇతర దినుసులను సరఫరా చేయాలని టెండర్ దారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ సూచించారు. ఇటీవల దేవస్థానానికి బియ్యం, పప్పులు, ఇతర దినుసులు సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయగా సుమారు పది మంది టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లు తెరవడానికి ముందు దేవస్థానంలో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ మాట్లాడుతూ సరఫరాదారులు పంపించిన సరకుల్లో నాణ్యమైనవని తమ పరీక్షల్లో తేలితేనే, వాటిని దేవస్థానంలో ఉపయోగించేందుకు అనుమతిస్తామన్నారు. లేకపోతే వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.కేశవ్ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
కాకినాడ లీగల్: న్యాయవాదులు వృత్తిలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. కోర్టు ఆవరణలో రూ.3 లక్షలతో నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వాటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రికెట్ నెట్ ద్వారా న్యాయవాదులు తమ క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ బౌలింగ్ చేయగా, జడ్జి ఆనంది బ్యాటింగ్ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, చెక్కపల్లి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్, తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) నిర్వహణ కమిటీ సమావేశం పంచాయతీరాజ్ కమిషనర్ రేవు ముత్యాలరావు అధ్యక్షతన గురువారం జరుగుతుందని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సీఈఓలు, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 కొత్త జిల్లాల్లోని డీపీఓలు, ఎన్ఐఆర్డీ రాష్ట్ర సమన్వయకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి ఈటీసీ ప్రిన్సిపాల్ కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణలు, అభివృద్ధి పనులను సమీక్షించడం, వార్షిక శిక్షణ ప్రణాళికను ఆమోదించడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారన్నారు. 13న కాకినాడ జిల్లా కబడ్డీ జట్ల ఎంపికసామర్లకోట: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కాకినాడ జిల్లా జట్లను ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కళాశాల ఇండోర్ కబడ్డీ కోర్టులో జూనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. దీనికి హాజరయ్యే క్రీడాకారులు 2006 డిసెంబర్ 31 తర్వాత పుట్టిన వారై ఉండి, బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై నవారు ఈ నెల 22 నుంచి 25 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితాతో రావాలని కోరారు. తాటాకిల్లు దగ్ధంకొత్తపల్లి: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి తాటాకిల్లు దగ్ధమైన సంఘటన కొండెవరంలో జరిగింది. బాధితుడు పెంకే సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తిబాబు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో వారందరూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో తాటాకిల్లు, దానిలోని గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పిఠాపురం ఇన్చార్జి అగ్నిమాపక అధికారి పి.హరిప్రసాద్, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పేకాట శిబిరంపై దాడిబిక్కవోలు: పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశామని అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపారు. కొమరిపాలెంలోని ఒక చావిడిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో బుధవారం తెల్లవారుజామున బిక్కవోలు ఎస్సై రవిచంద్ర, సిబ్బందితో దాడి చేశామన్నారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురితో పాటు, చావిడి యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, రూ.34,790 స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. హోటల్లో తనిఖీలుగండేపల్లి: జిల్లా గూడ్స్, సర్వీస్ టాక్స్ జిల్లా ఇంటిలిజెన్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక హోటల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మల్లేపల్లి శివారు రాయుడు గారి మిలటరీ హోటల్లో (ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్) అధికారులు సుమారు ఉదయం 11.45 నుంచి తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలకు వచ్చిన అధికారులే స్వ యంగా వినియోగదారుల నుంచి బిల్లులు తీసుకున్నా రు. తనిఖీ జరుగుతున్నంతసేపు మీడియాను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు తనిఖీ చేసిన అధికారు లు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత గోప్యత ప్రదర్శించి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కాగా వారంతా జీఎస్టీ వివరాలు తని ఖీ చేసేందుకు వచ్చినట్టు స్థానికంగా భావిస్తున్నారు. -
మీడియాపై అక్రమ కేసులు సరికాదు
మీడియాపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. ‘సాక్షి’ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేసి ఎడిటర్, రిపోర్టర్లపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాసిన కథనాల్లో పొరపాట్లు ఉంటే వివరణ ఇవ్వాలని న్యాయపరంగా వెళ్లాలి. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – మండెల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే, తూర్పుగోదావరి ● -
కక్ష సాధింపు చర్యలు దారుణం
‘సాక్షి’ ఎడిటర్పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ పత్రికా ప్రధాన కార్యాలయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు కల్పించలేదనే విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో పోలీసులు ఆ కార్యాలయంలో అర్ధరాత్రి హడావుడి చేయడం తగదు. తగిన ఆధారాలు, వాస్తవాలు ఉంటే కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరసగా కేసులు నమోదు చేసి వేధించడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్టే. – ఎమ్మెన్వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అమలాపురం ● -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాజమహేంద్రవరం రూరల్: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం గామన్ బ్రిడ్జి నుంచి వెంకట నగరం మధ్య గల ఆర్అండ్బీ రోడ్డు డివైడర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, భూమిపై పచ్చదనం పెరగాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజనీదేవి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటుగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలతో మొక్కలు నాటించామన్నారు. అనంతరం తిరుమలరావు, సరోజనీదేవి, వారి కుమార్తె రష్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ నిర్మూలన ఉద్యమకారిణి, ఆంధ్ర రాష్ట్ర స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీత జి.వనజ, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ● కాకినాడలో స్థాయీ సంఘ సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడసిటీ): క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు చైర్మన్ వేణుగోపాలరావు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి. వీటికి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు చేశాయి. తొలుత రామచంద్రపురం మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు ఆగస్టులో మృతి చెందిన నేపథ్యంలో సభలో మౌనం పాటించారు. ● అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ పోశయ్యలతో కలిసి గౌరవ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్లకు కాలువల ద్వారా నీరు సక్రమంగా పంట పొలాలకు అందేలా చూడడంతో పాటు అకాల వర్షాల వల్ల పొలాలు ముంపునకు గురి కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని గౌరవ సభ్యులు అధికారులను కోరారు. ● వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్య అధికారులు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు. ● రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అధికారులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారని, ఈ అంశంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ● అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉండేలా శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఏమైందో ఏమో!
● పెద్దేవంలో గేదెల మృత్యువాత ● 15 రోజుల్లో 25 మరణించిన వైనం ● ఆందోళనలో పాడి రైతులుతాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో పాడి పశువులు (గేదెలు) వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో సుమారు 25 వరకూ గేదెలు మరణించాయి. ఆకస్మాత్తుగా నీరసపడి, రెండు రోజులకే అవి మేత మేయక చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సాయిబాబా, ఇతర ఆలయాల సమీపంలో సుగంది చెరువు ఉంది. దీని నీటిని పశువులు తాగుతాయి. అయితే చెరువు నీరు కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్లే చనిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో తాగునీటికి ఉపయోగించిన ఈ చెరువు నేడు గుర్రపు డెక్క పేరుకుపోయి అధ్వానంగా మారింది. దానిలో మలమూత్ర విసర్జనలు, మృత కళేబరాలను వేస్తున్నారు. కాగా.. తమ గ్రామంలో పశువులు ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదని రైతులు జమ్ముల శ్రీను, బెల్లంకొండ సోమన్న, యాండపల్లి లక్ష్మణరావు, నామన సుబ్బారావు తదితరులు ఆందోళన చెందుతున్నారు. నమూనాల సేకరణ పశుసంవర్ధకశాఖ మండల అధికారి బాలాజీ బుధవారం పెద్దేవంలో పర్యటించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు వచ్చిన రోగ లక్షణాలు కొత్తగా ఉన్నాయని, కిడ్నీ, లివర్ దెబ్బతింటున్నాయన్నారు. తీసుకునే ఆహారం కానీ, తాగే నీరు కానీ కలుషితమై ఉండచ్చన్నారు. గడ్డి, నీరు, రక్త నమూనాలను పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చాక విషయం తెలుస్తుందన్నారు. -
‘నిర్కా’కు సీఎస్ఆర్ ప్రాజెక్టు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని ఐకార్ – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా)కు న్యూఢిల్లీకి చెందిన ఎం/ఎస్ ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి మొదటి సీఎస్ఆర్ ప్రాజెక్టు లభించింది. ఈ విషయాన్ని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మా గంటి శేషుమాధవ్ బుధవారం ప్రకటనలో తెలి పారు. ఈ ప్రాజెక్టును తాను, క్రాప్ మేనేజ్మెంట్ డివిజన్ హెడ్ డాక్టర్ కొరడ రాజశేఖరరావు, బహుశాఖ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ముందుకు తీసుకువెళతామన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద ఉన్న ఐకార్–నిర్కా ప్రాంతీయ కేంద్రంలోని పది ఎకరాల పొలంలో సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 500 మంది రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. సెన్సార్లు, డ్రోన్లు రెండు మార్గాల సమాచార వ్యవస్థల ద్వారా పంట, పురుగుల వాతావరణాన్ని పర్యవేక్షించి రైతులకు తక్షణ సలహాలు అందించడం లక్ష్యమన్నారు. దీని ఫలితంగా నీటి వినియోగం 40–50 శాతం తగ్గడం, ఎనర్జీ వ్యయం 30–40 శాతం తగ్గడం, ఎరువుల సామర్థ్యం పెరగడం, ఉత్పాదకత మెరుగుపడడం, డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన పెరుగుతుందన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలలో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా పడాల వీర రాఘవరెడ్డి (రాజమహేంద్రవరం రూరల్), రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా యాళ్ల బాబూరావు (కొవ్వూరు), రాష్ట్ర వీవర్స్ వింగ్ సెక్రటరీగా దొంతంశెట్టి వీరభద్రయ్య (రాజమహేంద్రవరం రూరల్), స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా గుడా విజయరాజ్ (కొవ్వూరు), రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా యార్లగడ్డ జోషి బాబు (కొవ్వూరు), రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా సీహెచ్ సూర్యనారాయణరెడ్డి అలియాస్ సునీల్ రెడ్డి (అనపర్తి), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా సుంకర సత్యనారాయణ ( కొవ్వూరు) నియమితులయ్యారు. -
వైఎస్ జగన్తో గూడూరి భేటీ
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయన వెంట పార్టీ ప్రచార విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు తోట రామకృష్ణ ఉన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకుంటే ఒప్పందం రద్దు రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని అధికారులకు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహారం సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండాలని, ఇప్పుడు కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఉత్సాహంగా పనిచేసే వారినే నియమించాలని, ప్రతి రోజూ హాజరు పరిశీలన (రోల్ కాల్) తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. -
జిల్లాలో 10 వేలకు పైగా హెచ్ఐవీ కేసులు
● నియంత్రణ బాధ్యత అందరిదీ ● మారథాన్ 5 కె రెడ్ రన్లో కలెక్టర్ ప్రశాంతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో 10 వేలకు పైగా హెచ్ఐవీ కేసులు ఉన్నాయని, అవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఎయిడ్స్పై అవగాహనకు డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రేటజీ ఫర్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో బుధవారం మారథాన్ 5 కె రెడ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా హెచ్ఐవీ పరీక్షలకు సంచార సమీకృత సలహా, పరీక్ష కేంద్రాన్ని (మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్) ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. దీనిపై యువతకు అవగాహన కల్పించడానికి, ఎయిడ్స్ బాధితులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5 కె రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు, వివక్ష తగదన్నారు. జిల్లాలో హెచ్ఐవీ కౌన్సెలింగ్, పరీక్షలకు ఐదు ఎస్ఏ, ఐసీటీసీ కేంద్రాలు, 38 పీహెచ్సీ ఎఫ్ఐ ఐసీటీసీ కేంద్రాలు, 14 యూపీహెచ్సీ కేంద్రాలున్నాయన్నారు. విజేతలకు బహుమతులు జిల్లా ఎయిడ్స్, కుష్ఠు, క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవీపై పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి రూ.10 వేలు, రూ.7 వేలు చొప్పున అందించినట్టు తెలిపారు. ఈ విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రన్లో పాల్గొంటారన్నారు. అక్కడ విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయి రన్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఐవీ సంబంధిత సమాచారానికి జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1097ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి, ఆర్ట్స్ కళాశాల రెడ్ రిబ్బన్ కో ఆర్డినేటర్ రవితేజ, వీటీ కళాశాల ప్రతినిధి జేజే.విజయ్ ప్రకాష్, దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, జిల్లా సూపర్ వైజర్ హరినాథ్ కుమార్, నగర ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్ల అప్లోడ్ తప్పనిసరి రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సర్కులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు తదితర డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఈపీటీఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్యుమెంట్ల అప్లోడ్ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఈపీటీఎస్ 67,398 డాక్యుమెంట్లు అప్లోడ్ కాగా, గురువారం ఉదయం నాటికి లక్ష రికార్డులు పూర్తి చేయాలన్నారు. -
జీవితాలతో ఆటోలాడొద్దు
సాక్షి, అమలాపురం: జీవితాలతో ఆటలాడుతున్నారు.. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి బ్రేక్లు వేశారు.. ఆటో కార్మికుల జీవితాలను కుదిపేశారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, రోజువారీ ఆదాయానికి గండి పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీ్త్ర శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రోడ్డున పడ్డామని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం సగానికి పడిపోవడంతో పాటు పెరిగిపోతున్న ఫైనాన్స్ భారాన్ని మోయలేక రోడ్డెక్కారు. దశల వారీగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆటో కార్మికుల ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకు వచ్చిన తరువాత కార్మికుల రోజువారీ ఆదాయానికి భారీగా గండి పడింది. గతంలో రోజుకు రూ.వెయ్యి వరకూ ఆదాయం చూసిన కార్మికులకు ఇప్పుడు రూ.300 నుంచి రూ.500 కూడా రావడం లేదు. దీనితో జిల్లాలో సుమారు 25 వేలకు మందికి పైగా ఉన్న కార్మికుల జీవనోపాధికి గండి పడినట్టయ్యింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కొంత వరకూ సర్వీసు ఉంది. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు వెళ్లని గ్రామాలకు వెళ్లే ఆటో కార్మికులకు వచ్చే ఆదాయం పెద్దగా తగ్గలేదు. ఉదాహరణకు అమలాపురం నుంచి ఉప్పలగుప్తం మీదుగా ఎన్.కొత్తపల్లి, కూనవరం, అమలాపురం మండలం సాకుర్రు, అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, ఐ.పోలవరం మండల కేంద్రానికి, మురమళ్ల నుంచి టి.కొత్తపల్లి, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేల్లంక, మలికిపురం మండలం అప్పనరామునిలంక, గుడిమెల్లంక వంటి బస్సు సర్వీసులు లేనిచోట ఆటో కార్మికులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఒకటి, రెండు బస్సు సర్వీసులు ఉన్నచోట కొంత వరకూ ఆదాయం తగ్గగా, అధిక సర్వీసులు తిరిగే అమలాపురం నుంచి రావులపాలెం, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక, వాడపల్లి, రాజోలు నుంచి అమలాపురం, రాజోలు నుంచి పి.గన్నవరం మీదుగా రావులపాలెం, అమలాపురం నుంచి ముమ్మిడివరం, మురమళ్ల మీదుగా యానాం, అమలాపురం నుంచి ముక్తేశ్వరం, అమలాపురం నుంచి కాట్రేనికోన, అమలాపురం నుంచి అల్లవరం, యానాం నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా రావులపాలెం వంటి బస్సులు అధికంగా తిరిగే రూట్లలో ఆటో కార్మికుల ఉపాధి మూడొంతులు పడిపోయింది. అమలాపురం బస్టాండ్ నుంచి రావులపాలెం బస్టాండ్కు వెళ్లేందుకు ఆటో సర్వీసులు దాదాపు నిలిపివేశామని కార్మికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తనిఖీలు, ఫిట్నెస్, పొల్యూషన్ పేరుతో ఎడాపెడా ఫైన్లు రాస్తుండడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. దీనిని అమలాపురం మండలం ఎ.వేమవరంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇదొక్కటే కావడంతో రామచంద్రపురం, మండపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి వంటి సుదూర మండలాల నుంచి ఇక్కడకు వచ్చి సర్టిఫికెట్ పొందడం కూడా వారికి భారంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోక.. ప్రధాన మార్గాల్లో ఆదాయం కోల్పోవడం ఆటో కార్మికుల రోజువారీ జీవనానికి సైతం కష్టాలు వచ్చాయి. ఇతర మార్గాల్లో ఆటోలు తిప్పుతుంటే ఇతర కార్మికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. నిత్యం సర్వీసులు తిరిగే మార్గాల్లో ఆదాయం లేకుండా పోయింది. అన్ని ఖర్చులూ పోను రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేచోట ఇప్పుడు రూ.మూడు వందలు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనితో వారు నిరసన బాట పట్టారు. ఇప్పటికే జిల్లాలో దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టారు. ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. మండలాల వారీగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆటోలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనందున ఈ నెల 12, 13వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. హామీ.. పట్టదేమీ! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేది. దీనివల్ల జిల్లాలో వేలాది మంది కార్మికులు రూ.కోట్ల మేర లబ్ధి పొందారు. ఆటో మరమ్మతులు, రోడ్ ట్యాక్స్, ఇతర అవసరాల కోసం వినియోగించుకునేవారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికునికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో తాము ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తడం లేదు. ఈ ఏడాదితో కలిపి ఒక్క ఆటో కార్మికునికి రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. అదీ ఇవ్వక, వచ్చే ఆదాయ మార్గం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీ్త్ర శక్తి పథకంతో రోడ్డున పడిన కార్మికులు నిరసిస్తూ రేపు, ఎల్లుండి ఆటోల బంద్ ఎన్నికల హామీని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు ఎప్పటికి ఇస్తారో! -
గురువులపై బరువు
● అసెస్మెంట్ బుక్లెట్ల విధానానికి కూటమి శ్రీకారం ● ఉపాధ్యాయులకు పెరిగిన పని ఒత్తిడి ● బోధనకు సమయం లేక అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం: దేశ అభ్యున్నతికి, సమాజ ప్రగతికి విద్య ఎంతో అవసరం. దాన్ని పిల్లలకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో పిల్లలకు విద్యాబోధన చేయడానికి వారికి తగినంత సమయం కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం గురువులపై బరువు మోపుతోంది. బోధనేతర పనులను అప్పగిస్తూ, పాఠాలు చెప్పడానికి సమయం లేకుండా చేస్తోంది. నూతన సంస్కరణల పేరుతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలకు అసెస్మెంట్ బుక్లెట్ విధానం తీసుకువచ్చింది. దానిలో వివరాల నమోదు చాలా ఎక్కువ సమయం పడుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులకు భారం మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్లెట్ విధానం ఉపాధ్యాయులకు భారంగా మారుతోంది. బోధనతో పాటు అసెస్మెంట్ చేపట్టాలంటే కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. పరీక్షల జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్మెంట్ బుక్లెట్లో నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మార్కులను దానిలో నింపాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి దాదాపు వంద జవాబు పత్రాలను ఉపాధ్యాయులు దిద్దాల్సి ఉంది. అస్తవ్యస్తం సంక్షేమ పథకాల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. పాలనలో తన మార్కును చూపించుకునేందుకు తహతహలాడుతోంది. అందులో భాగంగా సజావుగా నడుస్తున్న వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్తో ఉద్యోగుల్లో ఆందోళన నింపింది. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి బకాయిలు చెల్లించకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. తాజాగా విద్యాశాఖపై వికృత బుద్ధి ప్రదర్శిస్తోంది. హేతుబద్ధీకరణ పేరుతో స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు పాఠశాలల విలీన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అందులో విలీనం చేసే ప్రక్రియకు నాంది పలికింది. తాజాగా అసెస్మెంట్ బుక్లెట్ల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి గురువులపై బరువు మోపే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 985 పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 985 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రైమరీ 711, అప్పర్ ప్రైమరీ 72, హైస్కూళ్లు 183, హైస్కూల్ ప్లస్ 15 ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 587, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1.76 లక్షలు, ప్రైవేటు పాఠశాలల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మెటివ్లు, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్ను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తీసుకురావాల్సి ఉంది. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో నమోదు చేసేవారు. అనంతరం వాటిని జిల్లా అధికారులు స్కాన్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనం ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేసేవారు. తర్వాత పాఠ్యాంశాల బోధనకు ఎక్కువ సమయం ఉండేది. నూతన సంస్కరణలు కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలకు నాంది పలికింది. అసెస్మెంట్ బుక్లెట్ను తీసుకురావడంతో పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను ఇందులో పొందుపర్చాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు బుక్లెట్ను ఇచ్చి, దానిలో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్లో నమోదు చేయాలి. అంతేగాక వాటిని స్కానింగ్ సైతం ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్లెట్లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ అయ్యవార్లే నమోదు చేయాలి. ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7వ తరగతులకు 36, అలాగే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓఎమ్మార్ షీట్లుంటాయి. విద్యా సంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను బుక్లెట్లోనే నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు. దీంతో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోందని, పాఠ్యాంశాల బోధన ఇబ్బందిగా మారుతోందని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోధనేతర పనులు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం మోపుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మెగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం బస్తాలపై క్యూర్ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంది. అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇలా అన్ని పనులూ ఉపాధ్యాయులతోనే చేయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. -
విద్యుత్ షాక్తో సెంట్రింగ్ కూలీ మృతి
కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కూలి వాసంశెట్టి శ్రీనివాస్ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్ సెంట్రింగ్ పనికి వెళ్లాడు. శ్రీనివాస్ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్కుమార్ తెలిపారు. మోటారు సైకిల్ ఢీకొని మహిళ.. పెరవలి: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకాయమ్మ (68) మంగళవారం ఉదయం రావులపాలెంలో ఆటో ఎక్కి పెరవలి మండలం కడింపాడు సెంటర్లో దిగింది. అక్కడ రోడ్డు దాటుతున్న ఆమెను తణుకు నుంచి రావులపాలెం వైపు వెళుతున్న మోటారు సైకిల్ వేగంగా ఢీకొంది. దీంతో వెంకాయమ్మ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మైరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది. మృతురాలి కుమారుడు కొప్పిశెట్టి వీరభద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వ్యాన్ కింద పడి.. ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు బస్సు ఢీకొని.. గండేపల్లి: మల్లేపల్లికి చెందిన మడపాటి సూరిబాబు (34) తాళ్లూరు సమీపంలోని సామిల్లు వద్ద తాపీపనికి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన నిలుచున్న అతడిని విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.15 లక్షల ఎరువుల సీజ్అంబాజీపేట: నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన రూ.1.15 లక్షల విలువైన 5.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎస్.తాతారావు, మండల వ్యవసాయ అధికారి కె.ధర్మప్రసాద్ తెలిపారు. మాచవరంలోని సుభూషణ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.1,15,370 విలువైన ఎరువులను సీజ్ చేశారు. తనిఖీలో డీసీటీవో ఎ.నవీన్ కుమార్, కానిస్టేబుల్ శివకుమార్, ఏఈఓ జాజెబ్ శాస్త్రి పాల్గొన్నారు. -
పోలీసులపై దాడి చేసిన యువకులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం తాగి పోలీసులపై దాడి చేసిన ముగ్గురు యువకులు జైలు పాలయ్యారు. టూటౌన్ పోలీసుల విధులకు ఆటకం కలిగించడమే కాక, వారిపై చేతివాటం చూపించిన వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ ముగ్గురు యువకులను జైలుకు పంపారు. ఆ వివరాలను సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిశోర్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి రెండో పట్టణ పోలీసులు నాగబాబు, కాళి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్ (రౌడీ షీటర్), రాజమహేంద్రవరం రూరల్ రాజవోలుకు చెందిన కర్రి దుర్గా సూర్య ప్రసన్నకుమార్, ధవళేశ్వరానికి చెందిన ములపర్తి వినోద్కుమార్లు మద్యం తాగి గొడవ పడుతున్నారు. దీన్ని చూసిన నైట్బీట్ పోలీసులు నాగరాజు, కాళి వారి వద్దకు వెళ్లి ఆపతుండగా వారు పోలీసులపై దాడి చేశారు. దీంతో వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, పోలీసులు బృందం యువకుల కోసం గాలించారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద వారు ఉన్నారని సమాచారం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. -
టెన్నికాయిట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక
దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళల జట్టుకు గెడల హేమమాధురి, రాపాక సంస్కృతి, రాపాక సౌరిక, ఎస్కే లతిఫా, మిరియాల ప్రియదర్శిణి ఎంపికై నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల జట్టుకు బోయిన చంటిబాబు, గంగుల చంద్ర మహేష్, రాపాక నవీన్, మద్దాల అజయ్, గారపాటి బాబీలను ఎంపిక చేశామన్నారు. వీరు మండపేటలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న జట్లకు రెండు రోజుల పాటు స్థానిక జెడ్పీ హైస్కూల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. క్రీడాకారులకు టెన్నీకాయిట్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గన్నమని హరికృష్ణ, వైస్ చైర్మన్ ఉప్పులూరి రాంబాబు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, దాపర్తి వెంకటేశ్వరరావు, 20 మంది పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. పింక్ మూన్తో ‘నన్నయ’ ఒప్పందంరాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు. వివాహిత అదృశ్యంపెరవలి: ఖండవల్లి గ్రామానికి చెందిన వనచెర్ల రాంబాబు, లక్ష్మి దంపతుల కుమార్తె పెచ్చెట్టి జ్యోత్స్న (19) అదృశ్యమైంది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్నకు ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహం జరిగింది. వినాయక చవితి పండగకు పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 8న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి, ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇంట్లో జ్యోత్స్న కనిపించలేదు. బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఆచూకీ తెలిసే 94407 96642కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
రామచంద్రపురం: కె.గంగవరం మండలం అద్దంపల్లి సమీపంలో ఈనెల 3న దారి దోపీడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఎం.వెంకట నారాయణ వెల్లడించారు. పట్టణంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్రాక్షారామకు చెందిన యండమూరి శ్రీనివాస్ ఈ నెల 3న తాను పనిచేస్తున్న నగల దుకాణాన్ని మూసివేసి సుమారు రాత్రి 11 సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అద్దంపల్లి గ్రామం దేవాంగుల శ్మశాన వాటిక సమీపానికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని ఇనుప పైపుతో కొట్టి కళ్లలో కారం చల్లారు. సుమారుగా 10 గ్రాముల పాతబంగారం, సెల్ఫోన్ రూ.5 వేలు, షాపునకు సంబంధించిన రశీదులు, స్కూటర్తో పాటు సుమారు రూ.78 వేలు విలువైన వస్తువులు దోచుకుపోయారు. దొంగలకు మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ మేరకు ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం ఏరియా బైపాస్ రోడ్డులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తాళ్లరేవు మండలం గాడిమెగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు, సంగాడి రాజు, పత్తిగొంది గ్రామానికి చెందిన కళ్లేపల్లి ప్రసాద్గా గుర్తించారు. -
క్లోరిన్ గ్యాస్ లీకై పలువురికి అస్వస్థత
యానాం: కనకాలపేట రక్షిత తాగునీటి పథకం ట్రీట్మెంట్ ప్లాంట్లో మంగళవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ఆధ్యర్యంలో కనకాలపేటలోని ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందిస్తుంటారు. ఈ నీటిని శుభ్రపరిచేందుకు సుమారు 900 కేజీల క్లోరిన్ గ్యాస్ సిలిండర్ను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మార్చాలి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది సిలండర్ను మార్చతుండగా ఒక్కసారిగా దానిలోంచి గ్యాస్ లీకై బయటకు వ్యాపించింది. దీంతో అక్కడే ఉన్న సుమారు తొమ్మిది మంది సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కనకాలపేటలోని కోనవారివీధి, పాతబడివీధి, జమ్ముబాడువ తదితర గ్రామాల్లోకి గ్యాస్ వ్యాపించడంతో దాని వాసనకు పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీడబ్ల్యూడీ ఈఈ నాగరాజు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం నాగరాజు, జేఈ పెదపాటి సంతోష్, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు వచ్చిన ఫైర్మన్ కోన కృష్ణారావు (బాబీ) తదితర తొమ్మిది మంది సిబ్బందితో పాటు 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అశోక్, ఆర్ఏవో అంకిత్ కుమార్ పరామర్శించారు. గ్యాస్లీక్ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అభివృద్ధికి బ్రేక్.. స్థానికులకు షాక్..
● రాజోలు దీవిలో వంద ఆయిల్, గ్యాస్ బావులు ● ఉత్పత్తులను తరలిస్తున్న ఆయిల్ కంపెనీలు ● స్థానికులకు ప్రాధాన్యం కరువు ● బయటి వారికే పెద్దపీట ● యువతకు కొరవడిన ఉపాధి మలికిపురం: రాజోలు దీవి నుంచి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలను తరలించుకు పోతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగం తాండవం చేస్తోందన్నారు. నిక్షేపాలు అధికంగా ఉన్న చోట అభివృద్ధిని సాధించాల్సింది పోయి, యువత ఉపాధి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని సుమారు 100 బావుల ద్వారా ప్రతి రోజూ 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, అదే స్థాయిలో చమురు నిక్షేపాలను ఓఎన్జీసీ, గెయిల్ తరలించుకుపోతున్నాయి. కానీ ఈ సంస్థలు ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి చూపడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇక్కడి వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పరిశ్రమలకు దక్కని ప్రాధాన్యం రాజోలు దీవిలో గతంలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో తూర్పుపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, అలాగే తూర్పుపాలెంతో పాటు కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వాటికి లోప్రెజర్ గ్యాస్ను తక్కువగా అందించేవారు. భవిష్యత్తులో గ్యాస్ మరింత అందిస్తారని, రాయితీ కూడా వస్తుందని నిర్వాహకులు ఆశించారు. అయితే రానురాను పరిస్థితి దిగజారింది. గ్యాస్ సరఫరాను పెంచలేదు, రాయితీ ఇవ్వలేదు సరికదా, అప్పటి వరకూ సరఫరా చేసిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశాయి. దీంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా పరిశ్రమలను యజమానులు మూసివేశారు. తూర్పుపాలెం ఐస్ ఫ్యాక్టరీతో పాటు, విద్యుత్, స్టీల్ పరిశ్రమలు, కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ మూతబడ్డాయి. దీంతో నిర్వాహకులు రూ.కోట్లు నష్టపోయారు. స్థానిక యువత ఉపాధి లేక సతమతమవుతున్నారు. స్థానిక పరిశ్రమలకు రాయితీలు, గ్యాస్ సరఫరా చేయని ఆయా సంస్థలు.. ఇతర చోట్ల పరిశ్రమలకు ఇవ్వడం దారుణమైన అంశమని స్థానికులు మండిపడుతున్నారు. లోప్రెజర్ గ్యాస్ను తక్కువ ధరకు నియోజకవర్గంలో పరిశ్రమలకు అందించని ఒక సంస్థ.. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి శివకోడులోని ఓ బావిని ధారాదత్తం చేయడం గమనించదగ్గ విషయం. వరస లీకేజీలు రాజోలు దీవిలో వారానికోసారి గ్యాస్, ఆయిల్ బావులు లీకవుతాయి. ప్రజలు బెంబేలెత్తి, తీవ్ర భయాందోళనలు చెందుతారు. కానీ ఆయా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాయి. శిథిలమైన పైపులైన్లు, బావుల పరికరాలకు మరమ్మ తులు చేయపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కనీసం ఓఎన్జీసీ కార్యకలాపాల పనులు, కాంట్రాక్టులు కూడా ఆయా సంస్థలో పరిచయం, పలుకుబ డి ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల సంస్థలు, వ్యక్తులకే ఇస్తున్నారనే వాదన ఇక్కడ బలంగా ఉంది. అనేక నష్టాలు రాజోలు దీవిలో గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం గుల్లవుతోంది. ఇక్కడి భూసారంతో పాటు పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. అలాగే గ్యాస్ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ పైపులైన్ల లీకేజీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయిల్ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. -
ఉద్యమంపై ఉక్రోషం!
● రైతులకు అండగా ఆందోళన చేస్తున్న ● వైఎస్సార్ సీపీ శ్రేణులపై పోలీసుల జులుం ● యూరియా, ఎరువుల కొరతపై అధికారులకు విన్నవించేందుకు నేతల సమాయత్తం ● ముందుకు కదలకుండా అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ● సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా నిలువరించిన వైనం ● నిరసనగా రోడ్డుపై బైఠాయించి రెండు గంటలు ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ నేతలు ● కొవ్వూరులో ఆంక్షలను అధిగమించి ఆర్డీఓ ● కార్యాలయానికి చేరుకున్న పార్టీ నేతలు ● డిమాండ్లపై ఆర్డీఓకు వినతి పత్రం సాక్షి, రాజమహేంద్రవరం: అన్నదాతలకు అండగా చేపడుతున్న ఉద్యమంపై కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు ఉక్రోషం ప్రదర్శించారు. కర్షకుడి కష్టాలు కూటమి పాలకులు, అధికారుల కళ్లకు కట్టేందుకు సమాయత్తమవుతున్న ఉద్యమకారుల గొంతు నొక్కారు. యూరియా, ఎరువుల కొరత అరికట్టాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులపై ఆంక్షలు విధించారు. కార్యాలయం వద్దకు వెళ్లేందుకు వీలులేదంటూ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నేతల ఇళ్లవద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బయటకు రాకుండా నిలువరించారు. కొందరు పోలీసులైతే అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసన కార్యక్రమానికి వెళ్లవద్దంటూ ముందురోజు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు ఎవరూ రాకుండా నిలువరించారు. కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించలేదంటే రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తోందో అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజాస్వామ్యం బతికుందా? అన్న అనుమానం కలుగుతోందని ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తం యూరియా, ఎరువుల కొరతను తక్షణం నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూరియా, ఎరువుల కొరతపై సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు సమాయాత్తమయ్యారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని జక్కంపూడి రాజా గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, నాయకులను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని వారించారు. అక్కడికి వెళ్లనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అక్కడి నుంచి కదలకుండా అష్టదిగ్బంధనం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎంత సర్దిచెప్పినా వినకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా వినకుండా పోలీసులు నేతలు, రైతులను అక్కడే నిలువరించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, అనపర్తి ఇన్చార్జి సత్తిసూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) చందన నాగేశ్వర్, గుబ్బల తులసీకుమార్, నక్కా నగేష్, రైతులు అక్కడే బైఠాయించారు. ఎర్రటి ఎండలో సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కూటమి వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణం రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రిష్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయసారథి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దిగ్బంధంవైఎస్సార్ సీపీ శ్రేణులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకున్నారు. ఎవరూ రాకుండాకార్యాలయం నలువైపులా అష్ట దిగ్బంధం చేశారు. నాలుగు వైపులా రహదారులను బంధించారు. కొవ్వూరులో సక్సెస్కొవ్వూరు డివిజన్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీఅన్నదాత పోరుశ్రీ కార్యక్రమం విజయవంతమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, తక్కువ మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలిచ్చినా, వాటిని లెక్క చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నాయకులు, కార్యకర్తలు కొవ్వూరు మెరకవీధి వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాస్ నాయుడుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ బస్టాండ్ సెంటర్, విజయవిహార్ సెంటర్, ఎల్ఐసీ ఆఫీస్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అందరికీ అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 50 మంది ఆర్డీఓ కార్యాలయంలోకి అనుమతిస్తామని పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ పంపించాలని ఎంత వాదించినా ససేమిరా అనడంతో వైఎస్సార్ సీపీ నేతలు మిన్నకుండిపోయారు. అనంతరం రైతుల సమ స్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్, మాజీ ఏమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, ఎంపీపీ లు, మండలం అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువకులను శిక్షించాలి
గోకవరం: బాలికపై అత్యాచారం చేసిన యువకులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ విజృంభణ ఆధ్వర్యంలో మంగళవారం గోకవరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన మాగాపు గాంధీ, టీడీపీ నాయకుడి అన్నయ్య కుమారుడు గునిపే కిరణ్ ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేశారన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంతో, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాలిక, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాలికకు న్యాయం జరగకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బాలికపై అత్యాచారం చేసిన -
మార్కెట్లోకి హోండా షైన్ 100 డీఎక్స్
కంబాలచెరువు: రాజమహేంద్రవరం మై హోండా షోరూమ్లో హోండా షైన్ 100 డీఎక్స్ కొత్త బైక్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ వాహనం అందుబాటులోకి వచ్చిందని హోండా కంపెనీ స్టేట్ హెడ్ శరద్ఉండ్రే, ఏరియా సేల్స్ మేనేజర్ రక్షిత్, షోరూమ్ జీఎం ఎం.కోటేశ్వరరావు తెలిపారు. హోండా షైన్ 100 డీఎక్స్ అత్యధిక మైలేజీ ఇచ్చే విధంగా తయారైందన్నారు. దీనితో పాటు వాహనానికి డిజిటల్ మీటర్, ట్యూబ్ లెస్ టైర్, హెన్హేస్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ వంటివి ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చి వాహనం టెస్ట్ డ్రైవ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. -
కొత్త కోటపాడులో డయేరియా
రంగంపేట: మండలంలోని కొత్త కోటపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పలువురు మంచాన పడ్డారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో నమోదైన డయారియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్త కోటపాడులో ప్రత్యేక వైద్య బృందంతో శిబిరం నిర్వహించి, బాధితులకు చికిత్స అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో పారిశుధ్య చర్యలు చేపట్టగా, నీటిలో క్లోరినేషన్ పనులు చేయించారు. కొత్త కోటపాడులో 234 ఇళ్లలో 973 జనాభా ఉండగా, నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి నియంత్రణలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా వచ్చి ఉండవచ్చని చెప్పారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
కాకినాడ క్రైం: కాకినాడలోని నూకాలమ్మ గుడి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్వో డాక్టర్ నరసింహ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేసి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు, ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో సీజ్ చేశామని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఓ మహిళ ఫిర్యాదుతో డీఐఓ డాక్టర్ సుబ్బరాజు బృందం తనిఖీలు చేపట్టిందన్నారు. చట్టం ఉల్లంఘించిన నేపథ్యంలో వివరణ కోరగా సమాధానం సంతృప్తికరంగా లేదని వెల్లడించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని డీఎంహెచ్ఓ తెలిపారు. మభ్యపెట్టి.. చోరీ చేసి ఫ ఇద్దరు నిందితుల అరెస్ట్ ఫ రూ.రెండు లక్షలు, బంగారం స్వాధీనం అన్నవరం: కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, ఆటోలే వారి లక్ష్యం.. అందుకే సాటి ప్రయాణికుల్లా వెళ్తారు.. అందికాడకు దోచుకుంటారు.. ప్రయాణికులను మభ్యపెట్టి వారి బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అన్నవరం పోలీసులు సోమవారం ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అన్నవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 13న కత్తిపూడిలో ఆటోలో వెళ్తున్న ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె బ్యాగ్ నుంచి రూ. రెండు లక్షలు అపహరించినట్టు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే విధంగా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళల నుంచి బంగారం దొంగిలించినట్లు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం ఉదయం కత్తిపూడి ఫ్లైఓవర్ దిగువన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు ఆ నేరాలు చేసినట్టు అంగీకరించారని సీఐ తెలిపారు. నిందుతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని డ్రైవర్స్ కాలనీ తారకనగరానికి చెందిన తొండ శాంతి, అదే ప్రాంతానికి చెందిన ఆవుల భూలక్ష్మిగా గుర్తించారు. వీరి నుంచి రూ.రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ప్రత్తిపాడు కోర్టులో హాజరు పర్చనున్నారు. సందట్లో సడేమియా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో హడావుడిలో ఉండగా, కొందరు చేతివాటం ప్రదర్శించి ఆభరణాలు, నగదు అపహరించే వీలుందని సీఐ తెలిపారు. అందువల్ల ప్రయాణ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు, క్రైమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమణ, శ్రీనివాస్, హోంగార్డు అన్నపూర్ణలను అభినందించారు. -
వరద ముంచేను
ఫ గోదావరి తగ్గడంతో కోలుకుంటున్న లంకలు ఫ పంటల సంరక్షణకు జాగ్రత్తలు అవసరం ఆలమూరు: వరద వచ్చింది.. నిండా ముంచేసింది.. లంకలను అతలాకుతలం చేసింది.. చివరికి వెనక్కి తగ్గినా బురదే మిగిల్చింది.. ఈ ఏడాది గోదావరికి మూడు సార్లు వరద వచ్చింది.. లంకల్లో వందల ఎకరాల పంటలను నీట నాన్చింది. చాలాచోట్ల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. మిగిలిన పంటలను రక్షించుకునేందుకు ఉద్యాన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గోదారమ్మ శాంతించడంతో ఇప్పుడిప్పుడే లంక భూములు కోలుకుంటున్నాయి. వరద తాకిడికి గురైన ఉద్యాన పంటలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నష్టం తప్పదు. ఒక్కోసారి వివిధ రకాల తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన పంటను ఏవిధంగా సంరక్షించుకోవాలో వివరిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూర ల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల కూరగాయల పంటలు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పంట భూముల్లో వరద నీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడంతో జింక్, పొటాష్, నత్రజని పోషకాలతో పాటు ఇనుము ధాతు లోపం ఏర్పడుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉద్యాన పంటలను కాపాడుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి పీవీ రమణ వివరించారు. ● ఆకుముడత: వరదల వల్ల కూరగాయ మొక్కల ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే చీడపీడలు ఆశించినప్పుడు కూడా ఈ తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ● చీడపీడలు: వరదల వల్ల పొలాల్లో తేమ పెరిగి చీడపీడలు పెరిగి పంటలు నాశనమవుతాయి. ● వేరుకుళ్లు: వరద నీరు రోజుల తరబడి పొలాల్లో ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిలీంధ్ర తెగులు వస్తుంది. కరవు సంభవించిన సమయంలో కూడా ఈ తెగులు ప్రభావం ఉంటుంది. ● కాండం కుళ్లు: స్ల్కీ రోషియం ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల కూరగాయల మొక్క కాండం కుళ్లిపోయి పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ● కీటకాల వృద్ధి: వరదలు సంభవించిన తరువాత ఉద్యాన పంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పాటు అగ్ని చీమలు, దోమలు, బొద్దింకలు వృద్ధి చెందుతున్నాయి. ఈ కీటకాలు మొక్కల ఆకులను తినేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. నివారణ చర్యలు ఫ లంక భూమి వాలును అనుసరించి పొలాల్లోంచి వరద నీరు పోయే విధంగా అరడుగు వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఫ నీరు ఇంకిపోయిన తరువాత వీలైనంత మేర నేలను ఆరనివ్వాలి. ఫ జింక్ లోప నివారణకు 0.2 శాతం జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. నత్రజని లోప నివారణకు ఒక గ్రాము కార్బన్డైజమ్ లేదా రెండు గ్రాముల కార్బన్డైజమ్తో పాటు మాంకోవెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఫ ఇనుము ధాతులోపం నివారణకు 0.2 శాతం పెర్రస్ సల్ఫేట్ను వేయాలి. ఫ పొటాష్, నత్రజని లోపాల నివారణకు పంట దశను అనుసరించి 0.5 శాతం నుంచి 1.0 శాతం పొటాష్ నైట్రేట్ను పిచికారీ చేయవచ్చు. దొండ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వరదల సమయంలో దొండ సాగు పట్ల ఉద్యాన రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా వరద నీరు నిల్వ ఉండటం వల్ల దొండ పాదుల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా బూజు, బూడిద తెగులు ఆశించే ప్రమాదముంది. బూజు తెగులు నివారణకు మాంకోజెల్ లేదా మెటాలాక్సిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ట్రైడీమార్ఫ్ లేదా డైనోకాప్ ఒక మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి వేయాలి. సోకే తెగుళ్లువరద నీటిలో చిక్కుకున్న కూరగాయ పంటలకు సాధారణంగా ఆకుముడత, చీడపీడలు, వేరుకుళ్లు, కాండం కుళ్లు తదితర తెగుళ్లు సంభవించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలను సస్యరక్షణ చర్యల ద్వారా కాపాడుకోవచ్చు. -
ఆటోవాలాలను రోడ్డుకీడ్చారు..
విశాఖ నుంచి అమరావతికి డ్రైవర్ పాదయాత్ర తొండంగి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆటోవాలాలను రోడ్డుకీడ్చిందని విశాఖ కంచరపాలేనికి చెందిన ఆటోవాలా చింతకాయల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర సాగిస్తున్నాడు. అతని పాదయాత్ర సోమవారం తొండంగి మండలం జాతీయ రహదారి నుంచి సాగింది. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత పథకాలతో పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించిన కూటమి నేతలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి ఆటోవాలాల జోవనోపాధిపై దెబ్బకొట్టారన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు, మధ్య వయస్కులు ఎందరో ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్లు, బీమా, అప్పుడప్పుడు ఫైన్లు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ప్రస్తుతం ఆటోవాలాలంతా రోడ్డున పడ్డారన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించానని, తమ మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతానని వివరించారు. -
ఎంపీడీఓలు జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీలను సొంత వనరులతో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఎంపీడీఓలకు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన 50 మందికి రెండో బ్యాచ్లో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలను వైస్ ప్రిన్సిపాల్ పరిచయం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత వనరుల సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పనులు నిర్వహించే సమయంలో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదన్నారు. ఎంపీడీఓలు విధుల నిర్వహణలో మండల పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తొలిరోజు ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, డి.శ్రీనివాసరావు, కె.సుశీల శిక్షణ ఇచ్చారు. -
వీధి ఆవుకు అత్యవసర శస్త్రచికిత్స
ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు అమలాపురం టౌన్: అమలాపురంలో ఓ వీధి ఆవుకు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి సోమవారం అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. స్థానిక ఫైర్స్టేషన్ వద్ద ఓ వీధి ఆవు కదలేని పరిస్థితుల్లో ఉండి నోరు, ముక్కు వెంబడి తిన్న ఆహారం బయటకు వచ్చేస్తుందని గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు డాక్టర్ విజయరెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే ఆయన పశువుల అంబులెన్స్–1992 వాహనంలో తన సిబ్బందితో వీధి ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ విజయరెడ్డి తక్షణమే ఆవు కడుపు భాగంలో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గో ప్రేమికులు స్వామి, పుల్లయ్య, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, యశ్వంత్ తదితరులు సహకారం అందించారు. -
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టు తరఫున గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ ఛత్తీస్ఘడ్, నారాయణపూర్లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కె.ప్రభాకరరావు, హెచ్ఎం పి.షాలిని సౌజన్య, ఉపాధ్యాయులు, పీఈటీ సయ్యద్ షఫీ ప్రోత్సాహమే తన విజయానికి కారణమని లక్ష్మీశ్రీసాయి తెలిపింది. సోమవారం పాఠశాల క్రీడా సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెను మెమెంటోతో సత్కరించారు. -
గౌరవ వేతనం ఆపడం సరి కాదు
● ఇమామ్లు, మౌజన్లకు 11 నెలలుగా వేతనాలు లేవు ● జేసీకి వినతి పత్రం అందచేసిన మైనార్టీ నాయకులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఇమామ్లు, మౌజన్లకు గౌర వవేతనం ఆపడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు అన్నారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ నాయకులతో వేణు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ మేఘా స్వరూప్కి వినతి పత్రం అందచేశారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లనే ఇమామ్లు, మౌజన్లు జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహిస్తున్నారన్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విన్నవించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ నెలా బకాయి లేకుండా గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనాలను పెంచి మసీదులకు అందించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గం అన్ని రంగాలలోనూ వివక్షకు గురై తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 118 మసీదుల నిర్వహణ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపై ఆధారపడి జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మసీదులకు బకాయి ఉన్న రూ.1,94,70,000 గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ఆదాయ మార్గాలు లేని మసీదులకు అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది వేలు అందిస్తుంటే గత ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్రెడ్డి దానిని రెట్టింపు చేసి ప్రతి నెల రూ.15 వేలులు అందజేసేవారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు మైనార్టీలకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గతం నుంచి అందిస్తున్న సంక్షేమాన్ని సైతం ఇలా వివక్షా పూరితంగా అడ్డుకోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తక్షణమే గౌరవ వేతనాలు విడుదల చేయని పక్షంలో అన్ని మసీదు కమిటీలతో పాటు ముస్లిం సంఘాలను, మానవతావాదులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఆరిపుల్ల ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, షేక్ చానా, షేక్ మస్తాన్, మదీనా భాష, ప్రింటు భాయ్, పలు మసీదుల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బాబూ.. లోడెత్తాల !
బాబూ.. లోడెత్తాల !● యూరియా కోసం రైతుల అగచాట్లు ● లోడు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ● అవసరమైన మేరకు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వచ్చిన యూరియాను తన్నుకుపోతున్న కూటమి నేతలు ● తమ అనుయాయులకు అందజేస్తున్న వైనం ● పీఏసీఎస్ల వద్ద అన్నదాతల పడిగాపులు ● వచ్చినా.. బస్తా యూరియాకు తప్పని కుస్తీ సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కర్షకులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. పంటల సాగుకు కీలకమైన దశలో యూరియా, ఎరువులు అందించడంతో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అరకొరగా అందుబాటులో ఉంచుతూ ఆందోళనకు గురి చేస్తోంది. వెరసి రైతు సేవా కేంద్రాలు, సొసైటీ కార్యాలయాల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. అమావాస్యకో.. పున్నానికో వస్తున్న వాటిని సైతం కూటమి నేతలు తన్నుకుపోతున్నారు. ముందుగానే పసిగట్టి గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవేమీ తెలియని రైతులకు మాత్రం సొసైటీ కార్యాలయాల వద్ద నిరీక్షణ తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. రైతులు అంత ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం తనకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. అవసరం కొండంత.. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు, యూరియా సరఫరా కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లలో సాగు చేశారు. 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారు. ప్రస్తుతం పంటలు కీలక దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల వ్యవధిలో ఎరువులు, యూరియా అవసరం ఉంది. కానీ డిమాండ్ తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో రైతుల్లో కలవరం నెలకొంది. ఈ ప్రభావం పంటల దిగుబడిపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో 61,692 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ నేటికి 16,659 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎరువుల కొరత ఎలా ఉందో అర్థం అవుతోంది. డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువుల వినియోగం పెరిగిపోయింది. సకాలంలో ఎరువులు లేకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యూరియాకు అత్యధిక డిమాండ్ ప్రస్తుతం వివిధ పంటల దశలను బట్టి చూస్తే యూరియా అవసరం అధికంగా ఉంది. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్లు, ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో బస్తా యూరియా కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్కు 26,465 మెట్రిక్ టన్నుల యూరియా ఆవస్యకత ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 13,195 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర ఎరువుల అవసరం ఉంటే.. కేవలం 1,456 మెట్రిక్ టన్నులు మాత్రమే కూటమి ప్రభుత్వం అందించింది. అందులో యూరియాను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ మాసానికి మాత్రం 5,890 మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 950 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన స్టాక్ ఎప్పుడొస్తుందన్న మీమాంస నెలకొంది. బ్లాక్ మార్కెట్కు తరలింపు జిల్లాకు వారంలో ఒకటి, రెండుసార్లు యూరియా సరఫరా అవుతోంది. యూరియా వస్తుందన్న సమాచారం ముందస్తుగా ఆయా పీఏసీఎస్ల పరిధిలోని కొందరు అధికారులు కూటమి నేతలకు సమాచారం అందిస్తున్నారు. ఇదే అదనుగా రంగంలోకి దిగుతున్న కూటమి నేతలు యూరియాను తన్నుకుపోతున్నారు. తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. కొందరు అవసరం కంటే ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంటే.. మరి కొందరేమో బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వెరసి రైతులకు మద్దతు ధరతో యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంటోంది. టీడీపీ మద్దతు దారులు దర్జాగా ఎరువులు పక్కదారి పట్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయం యూరియా కొరతను సాకుగా తీసుకుంటున్న ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సగటున ఒక్కో మండలంలో ఏడాదిలో 4,500 టన్నుల నుంచి 15 వేల టన్నుల వరకు ఎరువులు వినియోగిస్తున్నారు. టన్నుపై రూ.4 వేల వరకు ఎరువుల భారం రైతులపై పడుతోంది. ఈ ప్రభావం చిన్న, సన్నకారు రైతులపై పడుతోంది. యూరియా 45 కేజీల బస్తా ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం రూ.266.70 చేసి విక్రయించాల్సి ఉంది. కానీ ప్రైవేట్ దుకాణాల దారులు డీలర్లు బస్తాను రూ.330 నుంచి రూ.390 చేసి విక్రయిస్తున్నారు. ఆర్ఎస్కే, పీఏసీఎస్ల వద్ద యూరియా అమ్మకాలకు ఆధార్ లింక్ చేయడం, ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తామనే నిబంధనలతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా కోసం యుద్ధం ● యూరియా కోసం రైతులు యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో అధికారులు ప్రకటిస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. ● కొవ్వూరు నియోజకవర్గం గజ్జరం, అన్నదేవరపేట, మలకపల్లి, రాగోలపల్లి సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు తరచూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. ఎంత యూరియా వచ్చింది, ఎంతమంది రైతులకు సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలియడం లేదు. రైతుకు 10 ఎకరాలు లేదా ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, ఇలా అయితే ఎలా సరిపోతుందని అంటున్నారు. ఆధార్ కార్డుపై యురియా సరఫరా చేయడం సరైన విధానం కాదని, కౌలు కార్డులు, పాస్బుక్ల అధారంగా యూరియా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ● సీతానగరం మండలంలో నిత్యం యూరియా కోసం యుద్ధాలు తప్పడం లేదు. వస్తున్న సరకు ఏ మవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. లారీ యూరియా వస్తే.. నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతోంది. రైతులు మాత్రం క్యూలో అలా నిల్చోవాల్సిన పరిస్థితి దర్శనమిస్తోంది. ● కోరుకొండలో ఇటీవల యూరియా పంపిణీలో వివాదం చోటు చేసుకుంది. లారీ యూరియా వచ్చినా.. అక్కడున్న రైతులకు మాత్రం అందలేదు. వచ్చిన సరకంతా ఏమైందంటూ రైతులు అధికారులను ప్రశ్నించడం, అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, రైతులు ఒక్కసారిగా పీఏసీఎస్ కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ● గాదరాడ వద్ద అధికారులు తమకు కావాల్సిన ఒక్కో రైతుకు 5 నుంచి 10 బస్తాల యూరియా ఇచ్చేస్తున్నారు. ఆకస్మిక పర్యటనకు వెళ్లిన కలెక్టర్ పి.ప్రశాంతి దృష్టికి సమస్య రావడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువగా ఎందుకిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఎక్కువగా ఇచ్చిన బస్తాలను రికవరీ చేయా లంటూ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ● రంగంపేట మండలం వడిశలేరు సొసైటీ వద్ద ఇటీవల ఎరువుల కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచే రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. కేవలం ఈ గ్రామాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలే దర్శనమిస్తున్నాయి.జిల్లాలో ఎరువుల వివరాలు ఇలా (మెట్రిక్ టన్నుల్లో)... ఎరువులు ఖరీఫ్లో సెప్టెంబర్ ఇప్పటి వరకు ఆవశ్యకత నెల అవసరం సరఫరా యూరియా 26,465 5,890 950 డీఏపీ 6,420 736 0 ఎంఓపీ 4,806 1,795 267 ఎన్పీకేఎస్ 18,607 3,564 203 ఎస్ఎస్పీ 5,394 1,210 36‘అన్నదాత పోరు’ను జయప్రదం చేయండి యూరియా, ఎరువుల కొరత నివారించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ పేరుతో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్ని నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్లు, పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తుతాం. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల శ్రేణులు రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల శ్రేణులు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతాం. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఆటిజం.. అవగాహనతో దూరం
● బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ● ప్రతి వంద మందిలో ఇద్దరికి వచ్చే అవకాశం ● జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు రాయవరం: పేరు పెట్టి పిలిచినా పలకక పోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వైపు చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, మిగిలిన చిన్నారులతో కలవక పోవడం వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాలతో మన దేశంలో ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరు ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆటిజం లక్షణాలు ఉన్న చిన్నారులు అధికమయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాల ఆధ్వర్యంలో ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాలో 22 మండలాల్లో ఇప్పటికే 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. వారిలోనూ నైపుణ్యాలు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలా ఉండమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్నవారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఈ చిన్నారుల్లో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. భవిత కేంద్రాల తరహాలో.. జిల్లా పరిధిలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపట్టారు. ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రాల్లో తరహాలోనే ఈ కేంద్రాల్లో ఆటిజం బాధితులకు సేవలు అందిస్తారు. బాధిత చిన్నారులను పూర్వపు స్థితికి తీసుకువచ్చి అందరిలో కలిసేలా చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే వీటికి ప్రత్యేక భవనాలు నిర్మించడంతో పాటు సిబ్బందిని నియమించే అవకాశముంది. ఒక్కో భవనానికి రూ.27.75 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నిధులతో రెండు గదులు నిర్మిస్తారు. ఫిజియోథెరపీ, ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం(బస్టాండ్) ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మానసిక పరిస్థితి మెరుగు ప్రస్తుతం భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడే చిన్నారులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు, ఆటిజం బాధితులకు ఒకేచోట సేవలు అందించడం ఇబ్బందిగా మారడంతో ఆటిజంకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీచ్ లాంగ్వేజ్, వ్యక్తిగత ప్రవర్తన, ఆక్యుపేషనల్, మ్యూజిక్ థెరపీ శాసీ్త్రయంగా సాధన చేయించనున్నారు. ప్రాథమిక దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఏర్పాటు చేస్తాం.. జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే చిన్నారులకు అనువుగా సెంటర్లను ఎంపిక చేయనున్నాం. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షాభియాన్ -
సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని పాలన సాగించాలని, చిన్న చిన్న కారణాలతో సిబ్బందితో ఘర్షణ పడవద్దని ఈఓ వీర్ల సుబ్బారావును దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ సోమవారం ఆదేశించారు. దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం, సిబ్బందిని అవమానించేలా ఈఓ మాట్లాడడం వంటి వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో కొందరు సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్ఎస్ తీసుకునేందుకు నిర్ణయించడం వంటివి జరిగాయి. ఆ సందర్భంగా గత ఏప్రిల్ 16వ తేదీన సాక్షి దినపత్రికలో ‘చినబాబొచ్చారు బహుపరాక్’ శీర్షికన, అదే నెల 18వ తేదీన ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తలకు స్పందించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈఓ వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్ ఎస్.చంద్రకుమార్ను ఆదేశించారు. ఆయన ఏప్రిల్ 27న విచారణ జరిపి తన నివేదికను కమిషనర్కు సమర్పించారు. విచారణలో ఈఓ వ్యవహార శైలిపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమేనని తేలిందని కమిషనర్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. దేవస్థానంలో సిబ్బంది తో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బంది కలుగకుండా సేవలందించడం ఈఓ ప్రథమ కర్తవ్యమని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. సిబ్బందితో వివాదాలు లేకుండా పరిపాలన సాగించాలని ఈఓను ఆదేశించారు. -
కదలిన ఉద్యాన అధికారులు
పెరవలి: జిల్లాలో కంద రైతులు పడుతున్న పాట్ల గురించి ‘చేతికందని కష్టం’ శీర్షికన సాక్షి దినపత్రిలో ఈ నెల 7వ తేదీన కథనం వెలువడటంతో జిల్లా ఉద్యానవన ఽఅధికారులు స్పందించి పొలం బాట పట్టారు. మార్కెట్లో కంద పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటం వలన ఎకరానికి రూ.2.25 లక్షలు నష్టపోవటంతో కంద రైతులు కంటిమీద కునుకులేకుండా ఉంటున్నారు. జిల్లా ఉద్యానవన పీడీ ఏ దుర్గేష్ పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామం వచ్చి కంద రైతు బొలిశెట్టి వెంకటేశ్వరరావుని కలసి కంద చేనుకు పెట్టుబడి, దిగుబడి, మార్కెట్టులో లభిస్తున్న ధరల గురించి ఆరా తీశారు. రైతుల సమస్యలు మార్కెటింగ్ శాఖకు వివరిస్తామని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెప్పారు. కందరైతులు ఇప్పటికే చాలా నష్టపోయామని అఽధికారులు పట్టించుకోకపోతే తీవ్ర నష్టాలు పాలవుతామని చెప్పారు. ఉద్యానవన అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ను ముట్టడించిన ఆందోళనకారులు అనపర్తి : మహిళలపై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించకుండా అదుపులోకి తీసుకుని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ ఊలపల్లి గ్రామానికి చెందిన బాధిత వర్గానికి చెందిన వారు సోమవారం సాయంత్రం భారీగా తరలివచ్చి బిక్కవోలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ నెల 6న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మరో వర్గానికి చెందిన వారిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా నిందితులపై చర్య లు తీసుకోకపోవడంతో పాటు వారిని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ బాధిత వర్గం వారు స్టేష న్ వద్దకు భారీగా చేరుకుని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక పోలీసులతో ఆందోళనకారుల ను కట్టడి చేశారు. అనపర్తి సీఐ సుమంత్ ఆందోళ నకారులతో చర్చలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. రుడా వైస్ చైర్మన్గా జేసీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు. -
షోడశ సంస్కారాలతో మానవ జన్మ పరిపూర్ణం
అమలాపురం టౌన్: సనాతన భారతీయ విధానంలో షోడశ సంస్కారాలు మానవ జీవనంలో ప్రధానంగా నిలిచాయని విజయనగరం శ్రీవిద్యా పీఠం అధ్యక్షుడు యనమండ్ర సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. ఆదివారం అమలాపురం ఆపస్తంబ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్తాపర విద్వత్సభ స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో జరిగింది. పరిషత్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్వత్సభ రజతోత్సవ సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన వేద పండితుడు యీవని రామచంద్ర సోమయాజి ఘనపాఠి అధ్యక్షతన జరిగిన ఆపస్తంబ పురోహిత సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 150 మందికి పైగా పురోహితులు హాజరయ్యారు. 16 విధాలైన షోడశ సంస్కారాల ద్వారా మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని సుబ్రహ్మణ్యశర్మ స్పష్టం చేశారు. అలాంటి ప్రధాన సంస్కారాలను నిర్వహిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే వారే పురోహితులన్నారు. పురోహిత్యం అనేది నిబద్ధత, త్రికరణశుద్ధితో నిర్వహించాల్సిన వృత్తి అని పేర్కొన్నారు. సంస్కారాలు చేయించుకునే యజమాని క్షేమం కోరుతూ కర్మలు చేయాలని పురోహితులకు వేద ఘనపాఠీలు సూచించారు. పురోహితులు సమాజంలో మనుషులకు నిర్వహించే సంస్కారాలు, కర్మ కాండల సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. జ్యోతిష పండితుడు చింతామణి సిద్ధాంతి మాట్లాడుతూ జ్యోతిషపరమైన విశేష అంశాలను వివరించి ముహూర్తం విలువ, విశిష్టతను తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 14 మంది విద్యార్థులకు స్మార్త పరీక్షలను ప్రథమ, ద్వితీయ కక్ష్యలతో నిర్వహించారు. పరీక్షాధికారులుగా స్మార్త పండితులు రాళ్లపల్లి సూర్య సుబ్రహ్మణ్యశర్మ, మంగిపూడి చైతన్యశర్మ వ్యవహరించారు. సభకు హాజరైన ప్రతి పురోహితునికి 10 గ్రాముల వెండి ప్రతిమను అందించారు. ఆపస్తంబ పురోహిత పరిషత్ వ్యవస్థాపకులు తోపెల్ల రామం, శ్రీపాద కరుణేందు మౌళి చిత్రపటాలకు, ఆపస్తంబ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. పరిషత్ కార్యదర్శి ఆకొండి పవన్కుమార్, కోశాధికారి ఆకెళ్ల రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పరిషత్ సభ్యులు మరువాడ వెంకన్న, తోపెల్ల చంటి, కర్రా శివయ్య, మూల పళ్లయ్య, పెద్దింటి కృష్ణ, కప్పగంతులు రాము, అనుపిండి మూర్తి, తోపెల్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చివరిగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పురోహితులను ఘనంగా సత్కరించారు. -
గడ్డి మందు తాగి ఆత్మహత్య
అంబాజీపేట: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి సోదరుడు వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కె.పెదపూడికి చెందిన దంగేటి సోమేశ్వరరావు అనే సోమేష్ (44) పాత్రికేయుడిగా ఉన్నారు. అతను స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలో గడ్డి మందు తాగి ఉండటాన్ని స్థానికులు, బంధువులు గుర్తించారు. వెంటనే సోమేష్ను అతని కుటుంబ సభ్యులు అంబాజీపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై కె.చిరంజీవి వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతిపిఠాపురం: చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన బొమ్మిడి వెంకటేష్ (25)కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అతను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం దుర్గాడ కొత్త చెరువులో వెంకటేష్ మృతదేహం కనిపించింది. బహిర్భూమికి వెళ్లినప్పుడు కాలుజారి చెరువులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల దాతృత్వం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ బ్రాంచ్ విద్యార్థుల కోసం రూ.2.5 లక్షల విలువైన హైడ్రాలిక్ ల్యాబ్కు సంబంధించిన 5 మెషీన్లను పూర్వ విద్యార్థులు బహూకరించారు. ఆదివారం హైడ్రాలిక్ ల్యాబ్ను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి ప్రారంభించగా ఆయనకు మెషీన్లు అందజేశారు. ముందుగా పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్తో పాటు కంప్యూటర్, మెకానికల్, ఎలక్ట్రానిక్ బ్రాంచ్ హెడ్లను కలసి కళాశాల అభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బోరుగడ్డ జోసఫ్, కోశాధికారి కొంబత్తుల శ్రీనివాస్, సెక్రటరీ మేరుగ రత్నకిశోర్ మాట్లాడుతూ 2015లో రూ.2 లక్షలతో ఆర్వో ప్లాంట్, 2022లో ఎలక్ట్రానిక్స్ లాబ్స్కు వాటర్ లీకేజీ రాకుండా రూ. 3 లక్షలతో రూఫ్ టాపింగ్ చేశామని, నాలుగు నెలల క్రితం హాస్టల్ విద్యార్థుల కోసం చపాతీ/పూరీ మేకర్ ఇచ్చామన్నారు. పూర్వ విద్యార్థులు రాజకుమార్, కృపారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్వామీ.. నీ చెంత నీరేమీ!
● ముంపు నీట మురమళ్ల వీరేశ్వరుని ఆలయం ● ముందుకు కదలని ఆలయ పునర్నిర్మాణ పనులు ● రూ.4.50 కోట్లు మంజూరైనా మొదలు కాని వైనం ఐ.పోలవరం: ప్రసిద్ధి చెందిన మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వర్షం వస్తే ముంపునీటి వెతలు ఎదుర్కొంటుంది.. శతాబ్దాల కిందట నిర్మించిన ఈ ఆలయం కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనా గ్రహణం వీడడం లేదు. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని భక్తులు ఎదురు చూస్తున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు కల్యాణాలకు, దర్శనాలకు వచ్చే వస్తుంటారు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక భక్తజన కోలాహలమే. ఇక్కడి సమస్యలపై పాలకులు, అధికారులు స్పందిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. వృద్ధ గౌతమీ గోదావరి నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందింది. పెళ్లికాని వారు ఇక్కడ కల్యాణం చేయించుకుంటే వివాహం జరుగుతోందని నమ్మకం. దీంతో ప్రతి రోజూ ఇక్కడ 116 కల్యాణాల వరకూ జరుగుతున్నాయి. ఇది కాకుండా మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్ష పూజలకు 20 వేల మంది నుంచి 30 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారు. ఇక పుష్కరాల సమయంలో భక్తుల తాకిడి అధికం. సమీపంలోని వృద్ధ గౌతమీ నదీపాయలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. పనులు ఎప్పుడో..! ఇంతటి ప్రాముఖ్యం ఉన్న స్వామి ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడో అర్థం కావడం లేదు. కొద్దిపాటి వర్షానికి ఇప్పుడున్న ఆలయం జలాశయాన్ని తలపిస్తోంది. ఆలయం చుట్టూ మోకాలు లోతు నీరు రావడంతో పాటు గర్భ గుడిలోకి సైతం నీరు చేరుతోంది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి సైతం వర్షాలకు మునుగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ నైరుతి సీజన్లో చెప్పుకొనే స్థాయిలో వర్షాలు లేవు. అడపాదడపా మాత్రమే ఒక మోస్తరు నుంచి భారీ కురుస్తోంది. ఈ వర్షానికి రోడ్డు నీట మునిగి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల దర్శనానికి వీలుగా ద్వారాలు వెడల్పు చేయాల్సి ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ.4.50 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నిధులతో ఇప్పుడున్న ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయాన్ని నిర్మించాల్సి ఉంది. ఇటీవల ఈ పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా పనులు మొదలు కాలేదు. ఇప్పుడే పనులు మొదలు పెట్టకుంటే పుష్కర సమయానికి పూర్తమవుతోందనే నమ్మకం లేదు. వెంటనే పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. -
కొత్త కార్యవర్గం ఎన్నిక
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఎన్జీఓ హోమ్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. మూడేళ్ల కాల పరిమితికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీగా కర్రి లక్ష్మీనరసింహరెడ్డి (కేఎల్ఎన్ రెడ్డి), కోశాధికారిగా పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎండీ అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ జార్జిలతో కూడిన కార్యవర్గం ఎన్నికై ంది. వీరితో పాటు జిల్లాలోని వివిధ యూనిట్ల నుంచి ఎన్నికై న ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
అద్దేపల్లి సాహిత్యం అందరికీ ఆదర్శం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్యం అందరికీ ఆదర్శనీయమని పలువురు వక్తలు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో ఆదివారం రాత్రి ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్య పురస్కారం 2025ను రాజమహేంద్రవరానికి చెందిన రెంటాల శ్రీవెంకటేశ్వరరావుకు ప్రదానం చేశారు. వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ సాహిత్యంలో ప్రోత్సహించిన గొప్ప సాహితీవేత్త అద్దేపల్లి అని రాజమహేంద్రవరానికి చెందిన ఎస్ఆర్ పృథ్వీ అన్నారు. మధునాపంతుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ తన సాహిత్యంలో ప్రతిధ్వనింపజేశారన్నారు. పురస్కార గ్రహీత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ గజల్స్ను అర్థవంతంగా పాడి కొత్త ఒరవడికి అద్దేపల్లి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా శ్రీవెంకటేశ్వరరావు దంపతులకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా వచన కవిత పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అద్దేపల్లి ప్రభు, అద్దేపల్లి రాధాకృష్ణ, వాడ్రేపు వీరలక్ష్మి, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు.