breaking news
East Godavari District News
-
తైక్వాండో క్రీడాకారులకు అభినందన
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తాడిపత్రిలో ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఆదివారం కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో జరిగింది. దీనికి డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి, కోచ్ బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో 11వ సారి ఓవరాల్ చాంపియన్ షిప్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు సాధించారన్నారు. హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. తైక్వాండో కోచ్ అర్జునరావు మాట్లాడుతూ స్టేట్ మీట్లో 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు తూర్పు క్రీడాకారులు కై వసం చేసుకున్నారని తెలిపారు. జీజీహెచ్ వైద్యులు ప్రవీణ, అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, తులసి, రత్నం, అఖిల, కేవీ సత్యనారాయణ, తేజ, అరుణ, ప్రసన్న పాల్గొన్నారు. కామనగరువులో అగ్ని ప్రమాదంఅమలాపురం రూరల్: కామనగరువు గ్రామ పరిధి జంగంపాలెంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. తొలిత వాసంశెట్టి మంగతాయారు ఇంటి నుంచి రేగిన నిప్పు రవ్వల కారణంగా దొంగ నాగలక్ష్మి, కుంచే వెంకటేశ్వరరావు, కుంచే శాంతమ్మ కుటుంబాలకు చెందిన తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి ఎం.రాజా అధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వివిధ ధ్రువీకరణ పత్రాలు, వడ్రంగికి సంబంధించిన ఫర్నీచర్, నగదు, 30 కొబ్బరి చెట్లు, వివిధ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ దంపతులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా బియ్యం, పంచదార అందజేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతితుని: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రేగుపాలెం – నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టలు దాటుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని తుని మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 94906 19020 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఎస్సై తెలిపారు. -
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం, ఆదివారం సందర్భంగా రద్దీగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 119 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇద్దరు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి హోమంలో 37 జంటలు, స్వామివారికి 17 మంది భక్తులు ఉండాళ్ల పూజ, ఏడుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, పది మంది చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 29 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,689 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఆలయానికి రూ.4,49,089 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. -
వెజిట్రబుల్స్
ఆలమూరు: ఏం కొంటాం.. ఏం తింటాం.. అనేట్టుంది కూరగాయల పరిస్థితి. వీటి ధర అంతకంతకూ పెరుగుతోంది. ఉల్లిని కొంటేనే కన్నీరు వస్తోంది. పచ్చిమిర్చికి ఘాటు ఎక్కువైంది. వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో కూరగాయల ధర రోజురోజుకూ పెరిగిపోతుంది.ఽ బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ సరైన ధర లేక ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక దిగాలు చెందుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గత నెలతో పోలిస్తే ఈ వారంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గోదావరిలో వరద ఉధృతి పెరిగినా, వర్షాలు కురిసినా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిలకడగా ఉన్న నాణ్యమైన ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.40కు చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల దిగుబడి క్రమేపీ తగ్గిపోయినందువల్లే ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పంట తుది దశకు చేరుకోవడంతో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాగల్నాడు, మెట్ట, లంక పరివాహక ప్రాంతాల్లో సుమారు 38 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల నుంచి కూరగాయల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఉద్యాన రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో టమోటా, కొత్తిమీర, వంకాయ, దొండకాయ ధరలు కిలో రూ.పదికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే కూరగాయల సాగు ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో దిగుబడులు తగ్గిపోతుండటంతో డిమాండ్ పెరిగి, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని మడికి, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర హోల్సేల్ మార్కెట్లకు గత వారం రోజుల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వరద పెరిగినా.. వర్షం పడినా.. గోదావరికి ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో వరదల వచ్చే అవకాశం ఉంది. దీంతో లంకల్లో సాగు చేసే పంట పూర్తిగా తగ్గిపోతుంది. అదే క్రమంలో వర్షాలతో మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని పంట దిగుబడి అరకొరగా ఉండే అవకాశం ఉంది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమైతే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. లంక పరివాహక ప్రాంత రైతులు మళ్లీ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నెల తరువాత గాని కూరగాయల సాగు చేపట్టే అవకాశం లేదు. దిగుబడి కోసం మరో మూడు నెలల వేచి ఉండాలి. దీంతో పెరుగుతున్న కూరగాయల ధరలు రాబోయే సంక్రాంతి వరకూ ఆకాశానికి ఎగబాకి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ కిలో రూ.10 నుంచి రూ.20 వరకూ పలికిన పలు కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.50కి దాటాయి. అలాగే చిక్కుళ్లు, ఆకాకర, అల్లం ధరలు కిలో రూ.100కు పైగా వరకూ విక్రయిస్తున్నారు. కొత్తిమీర సాగు పూర్తి కావడంతో బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కిలో రూ.150 పలుకుతుంది. దీంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలకు డిమాండ్ పెరగడంతో, వాటి ధరలు పెరుగుతున్నాయి.కూరగాయలు గతం ప్రస్తుతం కిలో రూ. ధర ఉల్లి 25 50 పచ్చిమిర్చి 20 70 అల్లం 70 120 బంగాళదుంప 20 35 వంకాయలు 20 60 బెండకాయలు 20 50 బీట్రూట్ 30 50 క్యాబేజీ 20 50 చిక్కుడు 80 120 అరటికాయ 05 10 కాలీఫ్లవర్ 25 50 దొండకాయలు 25 40 టమోటా 25 60 బీరకాయ 30 60 గోరుచిక్కుళ్లు 25 40 ఆనబకాయ 10 20 కాకరకాయ 25 60 కంద దుంప 40 60 పెండలం దుంప 35 50 బీన్స్ 60 80 కొత్తిమీర 70 150 క్యాప్సికం 40 60 ఆకాకర 70 120ఒక్కసారిగా పెరగడంతో... కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటి వరకూ బహిరంగ మార్కెట్లో స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరుగుపోతుండడంతో ఆ ప్రభావం రిటైల్ వ్యాపారంపై పడింది. పెరుగుతున్న ధరలతో కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు. – చిన్నం రాజు, రిటైల్ కూరగాయల వ్యాపారి, ఆలమూరు సరకు కొరత ఏర్పడింది లంక, మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఒకేసారి తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా సరకు కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్కు సరఫరాలో భారీ వ్యత్యాసం ఉండడంతో కూరగాయల ధరల పెరుగుదలకు కారణమైంది. – చెల్లుబోయిన సింహాచలం, హోల్సేల్ కూరగాయల వ్యాపారి, మడికి కొనుగోలు చేయలేకపోతున్నాం.. పెరిగిన ధరలతో కూరగాయలను కొనుగోలు చేయలేకపోతున్నాం. వర్షాలతో కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే రైతు బజార్లలో కూడా అన్ని కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు. – కె.నాగమణి, గృహిణి, పెదపళ్ల వంటింట్లో ధరల మంట పంట దిగుబడి తగ్గడమే కారణం వినియోగదారులపై పెను భారం -
లాలిస్తూ.. బుజ్జగిస్తూ..
పెంచిన బంధం పెనవేసుకుంది.. పెంపుడు జంతువులంటే ఎనలేని ప్రేమ కనిపించింది.. లాలిస్తూ, బుజ్జగిస్తూ వాటికి యజమానులు టీకాలు వేయించారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఆదివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ తమ పెంపుడు శునకాలు, పిల్లులు, కోళ్లకు యజమానులు దగ్గరుండి మరీ టీకాలు వేయించారు. అలాగే ఇక్కడకు పాములను సైతం తీసుకురావడం గమనార్హం. శునకాలను అల్లారు ముద్దుగా చూసుకున్నారు. అవి సైతం యజమానులపై ఎంతో ప్రేమ చూపుతూ.. విధేయతతో మెలిగాయి. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్)/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
మధ్యాహ్న భోజనంలో బల్లి
గండేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో పర్యవేక్షణ పక్కదారి పడుతోంది. రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయడంలో అలసత్వం ఆవరిస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో వండిన కూరలో బల్లి అవశేషాలు ఉండడం, అది విద్యార్థుల కంచాల్లో వేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన మల్లేపల్లి జెడ్పీ స్కూల్లో జరిగింది. ఇక్కడ సుబ్బయమ్మపేట, ఉప్పలపాడు, మల్లేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది చదువుతున్నారు. గత నెల 23న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండిన కూరలో బల్లి పడిన విషయాన్ని గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయులు, నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో ఆ కూరను ఉపయోగించకుండా మరో కూరను వండి వడ్డించినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అప్పటికే విద్యార్థులకు అన్నం, కూర వడ్డించిన కంచాల్లో బల్లి అవశేషాలు కనిపించడంతో తినకుండా నిలుపుదల చేసినప్పటికీ కొందరు రెండు, మూడు ముద్దలు తిన్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఉడకని అన్నం, పప్పు, నీళ్లను తలపించే విధంగా సాంబారును వడ్డిస్తున్నారని, తమకు పెట్టాల్సిన కోడిగుడ్లను పెట్టడం లేదని వాపోతున్నారు. భోజనంలో నాణ్యత లేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. బల్లి పడిన కూరను తింటే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లగా బల్లి పడిన వెంటనే తీయించేశామని చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గోప్యంగా ఉంచిన నిర్వాహకులు -
పిచ్చికుక్కల స్వైరవిహారం
కాట్రేనికోన/ అమలాపురం టౌన్: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనిపించిన వారిపై దాడికి దిగాయి. ఈ ఘటనలు అమలాపురం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఆదివారం పల్లం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయడంతో సుమారు 18 మంది గాయపడ్డారు. అక్కడ చేపల మార్కెట్ జరుగుతున్న సమయంలో మహిళలతో పాటు అధిక సంఖ్యలో వ్యాపారులు ఉండటంతో బెంబేలెత్తిపోయారు. బాధితులకు కాట్రేనికోన పీహెచ్సీ వైద్యురాలు నీలిమ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే అమలాపురం కంసానికాలనీలో అదే ప్రాంతానికి చెందిన కుంచే శాన్విశ్రీ (9)పై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలికతో పాటు మరో వ్యక్తిని ఆ కుక్క కరిచింది. ఈ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. శాన్విశ్రీ కాళ్లు, నడుం, చేతులపై కుక్క కరవడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 19 మందికి గాయాలు అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయాడని ఆందోళన
ఐ.పోలవరం: వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డను కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదమడి గ్రామానికి చెందిన గర్భిణి ధరణికి పురిటి నొప్పులు రావడంతో శనివారం టి.కొత్తపల్లి సీహెచ్సీలో చేర్చించారు. ఆదివారం ఉదయం ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం బిడ్డకు అనారోగ్యంగా ఉందని బంధువులు గుర్తించడంతో బిడ్డ పరిస్థితిపై వైద్యులను నిలదీశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ బిడ్డకు మెరుగైన వైద్యం చేయించాలని సూచించగా, అమలాపురం కిమ్స్కు తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మార్గ మధ్యంలో శిశువు మృతి చెందడంతో స్థానిక వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయినట్లు, తమకు న్యాయం చేయాలని జనం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళకారులతో చర్చలు జరిపారు. దీనిపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి కాకినాడ రూరల్: కాకినాడ జీజీహెచ్లో గుర్తుతెలియని వృద్ధుడు (75) మృతి చెందాడు. గత నెల 30న మధ్యాహ్నం కాకినాడ ఆర్టీఓ ఆఫీసు రోడ్డులో కోటయ్య కన్వెన్షన్ వద్ద మాటలేకుండా పడిపోయి ఉండడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జీజీహెచ్కు తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీలో భద్రపరిచారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తిస్తే సర్పవరం పోలీసు స్టేషన్ నంబర్ 0884 2379284, సెల్ నంబర్ 94407 96554కు సమాచారం ఇవ్వాలని సీఐ పెద్దిరాజు కోరారు. -
మడిలో.. సందడి
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వివరాలు (హెక్టార్లలో) సాధారణ సాగు విస్తీర్ణం 76,941నారుమడుల లక్ష్యం 3,847ఇప్పటి వరకూ వేసిన నారుమడులు 2,122ఇంకా వేయాల్సిన విస్తీర్ణం 1,725నాట్లు వేసిన విస్తీర్ణం 1,339 ● జోరందుకుంటున్న ఖరీఫ్ సాగు ● నారుమడులు, నాట్లలో రైతులు బిజీ దేవరపల్లి: చాలా మంది రైతులకు ప్రభుత్వం రబీ ధాన్యం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించలేదు. ఈవిధంగా పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతున్నా.. పుడమిని పిండి పసిడి గింజలు పండించడం తప్ప మరో పని తెలియని అన్నదాతలు.. అప్పోసొప్పో చేసి మరీ ‘సాగు’దారిలోనే ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కాలువలకూ నీరు విడుదలైంది. దీంతో, జిల్లావ్యాప్తంగా రైతన్నలు మడిలో హడావుడి పడుతున్నారు. ఫలితంగా ఖరీఫ్ సాగు పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. పుష్కలంగా నీరు లభిస్తున్న మడుల్లోను, చెరువుల కింద ఆకుమడులు వేస్తున్నారు. దమ్ములు చేస్తున్న రైతులు భూసారం పెంచేందుకు ఇప్పటికే వేసిన జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నుతున్నారు. బోర్ల కింద ముందస్తుగా ఆకుమడులు వేసిన కొంత మంది ఇరవై రోజులుగా వరి నాట్లు కూడా ప్రారంభించారు. వర్షాలకు చెరువుల్లో నీరు చేరడంతో చెరువుల కింద భూముల్లోని రైతులు దంప ఆకుమడులు, నారు సిద్ధంగా వారు నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ 356 హెక్టార్లలో నేరుగా పంట వేయగా, 966 హెక్టార్లలో దమ్ము చేసి నాట్లు వేశారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 43 వేల మంది రైతులతో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మరికొంత మంది రైతులు వంగ, బెండ, టమాటా, మిర్చి, సొర, దోస వంటి కూరగాయ పంటల సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 3,200 హెక్లార్లలో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. బెంగాలీ కూలీల సందడి ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో పలు ప్రాంతాల్లోని పొలాల్లో బెంగాలీ కూలీలు సందడి చేస్తున్నారు. వారు ఒక క్రమ పద్ధతిలో నాట్లు వేయడం వలన దుబ్బు బాగుంటుందని, పంట బాగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయని రైతులు అంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సుమారు 2 వేల మంది బెంగాలీ కూలీలు వచ్చినట్లు చెబుతున్నారు. వీరితో ఎకరం పొలంలో నాట్లు వేయడానికి రూ.3,500 వరకూ ఖర్చవుతుందని రైతులు తెలిపారు. ప్రారంభమైన వరి నాట్లు జిల్లాలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత బోర్ల కింద ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువలు, చెరువుల కింద ఆకుమడులు వేసి, నాట్లకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నాట్లు ఈ నెలాఖరుకు ఊపందుకోనున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరుకు దాదాపు పూర్తవుతాయి. ఖరీఫ్లో 3,847 హెక్టార్లలో వరి ఆకుమడులు అవసరం కాగా, ఇప్పటి వరకూ 2,122 హెక్టార్లలో వేశారు. మిగిలినవి చెరువుల కింద వేయాల్సి ఉంది. వేసిన ఆకుమడులు ఆరోగ్యకరంగా ఉన్నాయి. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆసక్తి సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడంతో పాటు పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. వరితో పాటు కొబ్బరి, ఆయిల్పామ్, పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహిస్తున్నాం. – బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయం విభాగం, రాజమహేంద్రవరం -
మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి
పెద్దాపురం: ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ చ్చిన భక్తులు అమ్మవా రి దర్శనానికి భారీగా బారులు తీరారు. సుమారు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. లోవకు పోటెత్తిన భక్తులు ● భక్త జనసంద్రమైన దేవస్థానం ● తలుపులమ్మ తల్లిని దర్శించిన 33 వేల మంది ● తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజతుని: ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఏకాదశి పర్వదినం కావడంతో లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 33 వేల మంది తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్కు పండితులు లక్ష తులసి పూజ నిర్వహించారు. పంచలోహ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ పూజను భక్తులు తిలకించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,12,930, పూజా టికెట్లకు రూ.3,07,630, కేశఖండన టికెట్లకు రూ.22,440, వాహన పూజ టికెట్లకు రూ.6,560, కాటేజీలకు రూ.86,722, విరాళాలు రూ.1,19,911 కలిపి దేవస్థానానికి మొత్తం రూ.8,50,543 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి డ్రోన్తో ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న తలుపులమ్మ అమ్మవారికి 3 టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
● పుడమితల్లికి పచ్చబొట్లు
తనను ఒకరు పొగడాలనే ఆశతో మేఘం వర్షించదు.. వర్షించడం తన ధర్మం కాబట్టి నెరవేరుస్తుంది. తన పైకి రాళ్లు విసిరిన వారికి, కత్తి దూసిన వారికి సైతం చెట్టు నీడనిస్తుంది. అన్నదాత తీరు కూడా అంతే. ‘పొలంబాట’లో కష్టాల కంటకాలు గుచ్చుకున్నా.. నష్టాల సుడిగుండాల్లో నిండా మునిగిపోతున్నా.. ఎదురీదుతూ.. సమస్త ప్రజానీకానికీ తిండిగింజలు పండిస్తూనే ఉంటాడు. కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తూండటంతో రైతన్నలు సేద్య యజ్ఞానికి ఉపక్రమించారు. మడులను సిద్ధం చేస్తున్నారు. నారు, నాట్లతో పుడమి తల్లికి ‘ఆకుపచ్చ’ బొట్లు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకున్నా.. ఆదుకోకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. ఈ మహాయజ్ఞం ఆగదంటూ ముందుకు సాగుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల చిత్రాలివి. – పెరవలి -
కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ నుంచి 2,18,257 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గాను 172 గేట్లను పైకి లేపి మిగులు జలాలు విడిచిపెడుతున్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 5,800 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులుగా నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటి ఉధృతి పెరిగిందని, సోమవారం నాటికి తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 12 వరకూ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా రేబిస్ వ్యాధి నివారణకు ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించే ముందస్తు వ్యాక్సినేషన్ డ్రైవ్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతువుల నుంచి, ప్రధానంగా కుక్కల నుంచి వ్యాపించే ప్రాణాంతక వ్యాధి రేబిస్ అని అన్నారు. ఇది నరాల వ్యవస్థను దెబ్బ తీసి మరణానికి దారి తీయవచ్చన్నారు. దీనిని యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చన్నారు. అందుకే, జంతువులతో క్రమం తప్పకుండా మసలే వ్యక్తు లు, పశు వైద్యులు, పారిశుధ్య కార్మికులు ముందస్తుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో ఈ నెల 12వ తేదీ వరకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సుధీర్బాబు పాల్గొన్నారు. ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీరాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సూపర్ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.మాధవ్ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు. -
కలల తీరం చేరాలిలా..
ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు కాకినాడ 6,343 కోనసీమ 2,868 తూర్పు గోదావరి 6,011 మొత్తం 15,222 బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులోకి కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రొబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇలా.. ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్సైట్లో అడ్మిషన్పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి. స్వయంగా చూసుకోవడం మేలు వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనో ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకోవాలి విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యము కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. – డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ కాకినాడలో 2 హెల్ప్ లైన్ కేంద్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలు -
ఆశ్చర్య‘పోక’ తప్పదు
కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతో పాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత. ‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా. -
అభినందన సీమ
ఉద్యాన పంటలు భేష్ ● అరుదైన ఎర్ర చక్కెరకేళీ సాగులో అగ్రస్థానం ● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు ● కేరళను మించిన ‘వక్క’ ● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత ● గూడపల్లి మామిడికి యమ క్రేజ్సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటల సాగులో కోనసీమ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఇక్కడి ఉత్పత్తుల కొనుగోలుకు ఉత్తరాది వ్యాపారులు ఎంతో ఆసక్తి చూపుతారు. సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, రుచిలోనూ చవులూరించడమే దీనికి కారణం. ఆను‘పాను’ తెలుసు కోనసీమ నుంచి వెళ్తున్న తమలపాకును ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆనుపానులు తెలుసుకుని ఇక్కడి రైతులు పండించే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు చెబుతారు. జిల్లాలోని పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి మండలాల్లో సుమారు 240 ఎకరాల్లో ఈ పంట పండుతోందని అంచనా. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ వరకు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
● గోదారి.. ఎర్రబారి..
గోదావరి పరవళ్లుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు పోలవరం నుంచి విడుదలవుతున్న నీటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగింది. బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం 1,89,129 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గానూ 157 గేట్లను 0.40 మీటర్ల మేర పైకి లేపి మిగులు జలాలను వదులున్నారు. ధవళేశ్వరం ఆర్మ్లో 66, ర్యాలీ ఆర్మ్లో 42, మద్దూరు ఆర్మ్లో 20, విజ్జేశ్వరం ఆర్మ్లో 29 గేట్లను పైకి లేపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.80 అడుగులుగా నమోదైంది.రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఎర్రబారిన గోదావరినిన్నటి వరకూ నీలి రంగు జలాలతో కనువిందు చేసిన గోదావరి.. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఎర్రబారింది. గోదావరికి ఏటా జూన్లో వరద రావడం.. నీరు అరుణవర్ణం దాల్చడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది వరద నీరు రావడం ఆలస్యమైంది. వరద నీటితో కొత్తందాలను సంతరించుకున్న గోదావరిని చూసేందుకు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్కు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: దశమి శనివారం కలసి రావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే ఆలయానికి తరలివచ్చి, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారికి అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్నసమారాధన నిర్వహించామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఇసుక లోడు పరిమితికి మించితే కఠిన చర్యలు రాజమహేంద్రవరం సిటీ: పరిమితికి మించి ఇసుక లోడు చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఆ వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఇసుక అంశంపై తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురాల్లో పూడికతీత చేసే రీచ్ల వద్ద వాహనాల్లో ఇసుకను అధికంగా లోడు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని పూడికతీత రీచ్ల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. వాహనాల లోడింగ్, రహదారిపై పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఆయా ఏజెన్సీలదేనని, వీటి పర్యవేక్షణ బాధ్యతను ఆయా మండల స్థాయి అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. రహదారిపై పడిన ఇసుకను అదే రోజు సాయంత్రంలోగా సంబంధిత ఏజెన్సీ తొలగించాలన్నారు. ఇసుక తొలగింపునకు ముందు, తర్వాత తీసిన ఫొటోలను ఆయా ఏజెన్సీలు జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు పాటించని ఏజెన్సీల ఆథరైజేషన్ను ఎటువంటి ముందస్తు నోటీసూ లేకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇసుక తవ్వకాలపై అక్టోబర్ 15 వరకూ నిషేధం ఉందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి ఎం.ఫణిభూషణ్రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
కందిపప్పు.. ఉడకట్లే..
సాక్షి, రాజమహేంద్రవరం: రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందా.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు క్రమంగా తగ్గిస్తూ వస్తోందా.. అందుకే అధికారం చేపట్టినప్పటి నుంచీ చౌక దుకాణాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రేషన్ కార్డుదారుల నుంచి. లబ్ధిదారులకు నిరాశే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు నిత్యావసరాలైన కందిపప్పు, బియ్యం, చక్కెర, పామాయిల్ను సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలం నుంచి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ రేషన్ సరకులు అందించే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లను (ఎండీయూ) తొలగించింది. పది నెలలుగా అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. దీంతో, ప్రతి నెలా కార్డుదారులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నెల కూడా కందిపప్పు రాలేదని రేషన్ డీలర్లు చెబుతూండటంతో చేసేది లేక ఇచ్చిన సరకులే తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. ఈ నెలలో ఒక్క కేజీ కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని మాసాల పాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులేత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీకే మంగళం పాడేసింది. అప్పుడు మొదలైన అరకొర సరఫరా నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం.. కనీసం ధర దిగివచ్చినప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం లేదు. రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు రూ.67కే అందించాలి. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో హోల్సేల్లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా సర్కారు మిన్నకుండిపోతోంది. పేదలపై భారం జిల్లావ్యాప్తంగా 5 (మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఒక్క ఎంఎల్ఎస్ పాయింటులోనూ కందిపప్పు కిలో కూడా నిల్వ లేకపోవడం గమనార్హం. రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో కందిపప్పు నిల్వలు నిండుకోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది. జిల్లాలో ఇలా.. రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లాకు 564.9 టన్నుల కందిపప్పు అవసరం కాగా, వంద, 150 టన్నులు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో, కార్డుదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందడం లేదు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో వారు పూర్తి స్థాయిలో డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు అడుగుతూంటే.. తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూంటే రేషన్ షాపుల నుంచి కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పది నెలలుగా సక్రమంగా జరగని సరఫరా ఈ నెల పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం కార్డుదారులకు అవస్థలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక గగ్గోలుజిల్లాలో రేషన్ షాపులు కార్డుల వివరాలు మండలం రేషన్ రేషన్ షాపులు కార్డులు అనపర్తి 39 22,488 బిక్కవోలు 40 22,480 చాగల్లు 36 21,072 దేవరపల్లి 34 25,416 గోకవరం 36 22,644 గోపాలపురం 43 21,128 కడియం 45 29,138 కోరుకొండ 43 26,991 కొవ్వూరు 55 33,320 నల్లజర్ల 42 27,554 నిడదవోలు 51 34,483 పెరవలి 43 23,233 రాజమహేంద్రవరం రూరల్ 59 50,511 రాజమహేంద్రవరం అర్బన్ 105 83,403 రాజానగరం 48 36,324 రంగంపేట 30 19,778 సీతానగరం 44 24,085 తాళ్లపూడి 34 16,811 ఉండ్రాజవరం 44 24,135 జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డులు 5,64,000 కార్డుల్లోని సభ్యులు 15,77,393 వీరికి అవసరమైన కందిపప్పు 564.9 టన్నులు అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేసినది 25 టన్నులు -
పనస.. ‘ఫల’ప్రదం
పనస సాగుకూ కోనసీమ పెట్టింది పేరు. మార్చి నుంచి జూలై వరకూ పనస సీజన్. ఒక్కో చెట్టుకు 50 నుంచి 100కు పైగా కాయలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా కొబ్బరిలో అంతర పంటగా సుమారు 100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అంబాజీపేట కేంద్రంగా ఏటా రూ.కోటి విలువైన పనస కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.ఏ దిల్ ‘మ్యాంగో’మోర్కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పండే బంగినపల్లి కాయకు యమ క్రేజ్ ఉంది. ఈ సీజన్లో ఇక్కడ పండే బంగినపల్లికి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు చైన్నె, బెంగళూరులో కూడా డిమాండ్ ఉంది. గూడపల్లితో పాటు చుట్టుపక్కల సుమారు 2 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. -
సమస్యల పరిష్కారానికి కృషి
● ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు ● నూతన కార్యవర్గం ఎన్నిక ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి ఏఈఓ సంఘం కృషి చేస్తోందని అధ్యక్షుడు డి.వేణుమాధవరావు అన్నారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శనివారం విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారుల రాష్ట్ర సంఘ సమావేశం నిర్వహించారు. మాధవరావు మాట్లాడుతూ విశ్రాంత అధికారుల వైద్య బిల్లులు, తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎస్.పాపినాయుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా జి.మార్టిన్ శాంతకుమార్, సహధ్యక్షుడిగా ప్రగడ సంజీవరావు, ఉపాధ్యక్షులుగా జి.సింహాచలం, బి.సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సి.ఓంకారయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎస్వీ శ్రీనివాస్, వి.నాగసత్య శ్రీనివాస్, కోశాధికారిగా కె.నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా కె.ఫ్రాన్సిస్, డి.సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేజీకే మూర్తి, నగర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షుడు మీసాల మాధవరావు, ఉమ్మడి జిల్లా ఏఈఓ సంఘ కార్యదర్శి సతీష్, కోశాధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కూటమిలో మట్టి పంచాయతీ!
మర్లావ, ఆర్బీ పట్టణాల్లో జనసేన వెర్సస్ టీడీపీ పెద్దాపురం: గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. మండలంలోని మర్లావ గ్రామంలో టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ జేసీబీతో ఏలేరు కాలువ మట్టిని తరలించుకుపోవడాన్ని జనసేన నాయకులు గవరసాని దివాకర్ వర్గీయులు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే మండలంలోని దివిలి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ తమకు చెప్పకుండానే చేస్తున్నారని నీటి సంఘం ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు జట్లా విజయ్బాబు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే విధంగా మండలంలోని ఆర్బీ పట్నంలో చెరువు మట్టి తవ్వకాల విషయంలోనూ జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య పోరు సాగుతోంది. అధికారులు ఇరువర్గాలకు చెప్పలేక మౌనం దాల్చడంతో ఆధిపత్యపోరులో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. 18 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టివేత ● కేసు నమోదు చేసిన అధికారులు ● రూ.8.28 లక్షల సరకు స్వాధీనం దేవరపల్లి: నల్లజర్లలోని ఓ బియ్యం మిల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు లారీలో తరలిస్తున్న 400 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండలంలోని యర్నగూడెం–పోతవరం రోడ్డులో పట్టుకున్న బస్తాల్లో సుమారు రూ.8.28 లక్షల విలువైన 18 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్టు మండల పౌరసరఫరాల అధికారి ఎ.సత్యనారాయణ తెలిపారు. కాగా అధికారులు నిర్వహించిన వేలంలో ఈ బియ్యాన్ని పాడుకుని తరలిస్తున్నట్టు మిల్లు యజమాని చూపిన పత్రాలు కాల పరిమితి ముగిసినవని గుర్తించినట్టు అధికారులు గుర్తించారు. లారీని, అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని డీటీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎస్. తాతారావు, సీఐ మధుబాబు, ఏఎస్ఓ నాగాంజనేయులు, వీఆర్వో ఎస్కే బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!
జిల్లాలో జంతువులు వివరాలు ఇలా... పెంపుడు కుక్కలు 11,159 ఆవులు 70,846 గేదెలు 1,67,106 గొర్రెలు 1,67,052 మేకలు 72,076 పందులు 1,207 పౌల్ట్రీ 1,77,86,778 ● మూగజీవాల పెంపకంపై అవగాహన అవసరం ● వాటిపై ప్రేమ మాటున పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ● అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ జునోసిస్ డే రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: సమాజంలో జంతు ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో వాటి వల్ల వచ్చే వ్యాధులపై వాటిని పెంచుకునేవారికి లేదనేది వాస్తవం. వైద్య పరిశోధన ప్రకారం జంతువల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సుమారు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. జూనిటిక్ వ్యాధులను వైరస్ బ్యాక్టీరియల్, పారసైటిక్ వ్యాధులుగా విభజించారు. వైరస్ వలన సంక్రమించే వ్యాధులలో రేబిస్, మెదడువాపు వ్యాధి, బర్డ్ఫ్లూ వంటివి ముఖ్యమైనవి. బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధుల్లో బ్రూసెల్లా, సాల్మోనెల్లా, లెప్టోసైరోసిస్ మొదలైనవి ఉన్నాయి. కుక్కకాటుతో రేబీస్, పందుల వల్ల మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. జునోసిస్ ఎలా వచ్చిందంటే... పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీపాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ రోజుకు గుర్తుగా ఏటా ప్రపంచ జునోటిక్ డే నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎంతో అవసరం పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని, సమయం లేక అశ్రద్ధ చేస్తుంటారు. దీని వల్ల అవి కరిచిన, రక్కిన సందర్భాలలో ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. అందువల్ల వాటికి వ్యాక్సినేషన్ చేయించడం ఎంతో అవసరమని గుర్తించాలి. జాగ్రత్తలివీ ● పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలి. ● టీకాల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలి. ● పెంపుడు జంతువులను, వాటి ఆహారాన్ని లేదా వ్యర్థాలను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. లిట్టర్ బాక్సులు, పంజరాలను తరచుగా శుభ్రం చేయాలి. ● బయట తిరిగే జంతువులకు క్రమం తప్పకుండా క్రిములను తొలగించాలి. ● పెంపుడు జంతువులు అడవి జంతువులతో కలవకుండా చూడటంతో పాటు, సరైన రక్షణ లేకుండా గాయపడిన అడవి జంతువులను రక్షించడానికి ప్రయత్నించకూడదు. ● జంతువుల అనారోగ్య లక్షణాలను గమనించాలి. ప్రవర్తన, ఆకలి, లేదా ఏవైనా మార్పులను గమనించడం, ఏదైనా ఆసాధారణమైనది గమనిసై వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. పాడి రైతులకు ఇలా.. ● బలమైన జీవభద్రతా చర్యలను అమలు చేయాలి. ● పశువుల దగ్గరకు అవసరమైన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ● జంతు సమూహాల మధ్య కదిలేటప్పడు పాద రక్షలు, రక్షిత దుస్తులను ఉపయోగించాలి. ● పశుశాలలు, పాలు పిండే ప్రదేశాలు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ● క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ● అనారోగ్యంతో ఉన్న జంతువులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. కోళ్ల రైతులకు జాగ్రత్తలివీ ● ఒకే వయస్సు ఉన్న పక్షులను కలిపి పెంచాలి. ● గుంపుల మధ్య పూర్తిగా శుభ్రపరిచి, ఆ ప్రాంతంలో క్రిమి సంహార మందులు చల్లాలి. ● అడవి పక్షులతో సంపర్కాన్ని నివారించడానికి వలలు లేదా మూసిన గూళ్లను ఉపయోగించాలి. ● ఆహారం తీసుకోవడంలో లేదా గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల వంటి ఆనారోగ్య లక్షణాలను గమనించడంతో పాటు, అసాధారణ మరణాలు లేదా లక్షణాలను వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి. అవగాహన పెంచుకోవాలి ● జూనోటిక్ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటి కప్పడు తెలుసుకోవాలి. ● జంతు ఆరోగ్యం, జూనోసిస్పై వర్క్షాప్లు లేదా సెమినార్లకు హాజరుకావాలి. ● అనుమానిత జూనోటిక్ వ్యాధులను గుర్తిస్తే పశువైద్యులు, అధికారులకు తెలియజేయాలి. వైద్యుల సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజెస్ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, మెదడువాపు వంటివి ఈ రకమైనవే. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్యుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో కుక్కలను పెంచేవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయించకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. ఆదివారం రాజమ హేంద్రవరం ఏరియా పశువైద్యశాలలు, అనపర్తి, బి క్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు వేస్తున్నాం. జునోసిస్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు. అలాగే పెంపుడు జంతువులకు, వాటితో దగ్గరగా మెలిగే యజ మానులకు, పశుసంవర్ధకశాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లుకు, జంతువధశాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశువైద్యాధికారి, తూర్పుగోదావరి ముందుస్తు నివారణ మేలు జునోసిస్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనుషులకు, అటు జంతువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాణాంతక జోనోసిస్ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే చాలా వరకు వీటిని ఆరికట్టవచ్చు. జునోసిస్ వ్యాధుల సంక్రమణ, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ ఏడీ, అనపర్తి ప్రేమ ఒక మత్తు. అది మనుషుల మీదైనా.. మూగ జీవాల మీదైనా. వీటి ప్రేమ అన్కండీషనల్. చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు.. ఏళ్ల తరబడి ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకి పడిపోని మనిషుండడు. అవి ఏ స్థితిలో ఉన్నా దానిని ముద్దుచేస్తూ.. దాని నోటిలో చేతులు పెడుతూ.. దగ్గరకు తీసుకుని గాఢాలింగనాలు చేసుకుంటూ ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. పాముకు పాలు పోసి పెంచినా దాని సహజ లక్షణం కాటు వేయడం. అలాగే కుక్కలు.. పిల్లులు.. కోతులు.. కుందేళ్ల వంటి మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచినా స్వాభావికంగా చర్మం.. విసర్జకాలు.. వెంట్రుకలు.. చొంగ తదితరాలు ఎప్పటికీ ప్రమాద హేతువులే. వీటి నుంచి వచ్చే ఉపద్రవాలను గుర్తెరిగి తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటికి సంక్రమించి పలు రకాల వ్యాధులు మానవులకు హానికరం కాకుండా చూసుకుంటూ వాటికి సకాలంలో ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే వాటిని పెంచుకునేవారికి ఆ దుష్ప్రభావాలు సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూగజీవాలు.. వాటి వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జునోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
ఢిల్లీ ఎయిమ్స్లో జాన్వికి సీటు
చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (ఎయిమ్స్)లో సీటు సాధించింది. ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల (కేజీహెచ్)లో ఎంబీబీఎస్ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. -
రాజీ మార్గం రాజ మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 85 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవని పేర్కొన్నారు. వీటిలో తాము 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసు లు, మొత్తం 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగినద న్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీమార్గంలో పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాదిలో చేపట్టిన నాలుగు లోక్ అదాలత్లలో రూ.167 వందల కోట్లు కక్షి దారులకు నష్టపరిహారంగా అందజేసినట్టు తెలిపారు. తాజాగా పీడీజే కోర్టులోని 01/2025 కేసుకు బాధితుల కుటుంబానికి రూ.1.15 కోట్లు, 379/2023 కేసులో రూ.80 లక్షలు, 135/2025 కేసులో రూ.38.5 లక్షల చెక్కులను అంద చేశామన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు. మొత్తం బెంచీలు 47 కాగా 6179 కేసులకు అవార్డులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల వరకు 473 సివిల్ కేసులు, 5514 క్రిమినల్ కేసులు, 192 పీఎల్సీ కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇంకా కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు. -
అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్
కాకినాడ రూరల్: రూరల్ మండలం వాకలపూడి గ్రామ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్న అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలుపై శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలశాఖ అధికారుల పర్యవేక్షణలో సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరావు, ఇన్స్పెక్టర్ రాంబాబు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. -
760 టన్నుల ఇసుక అక్రమ నిల్వ స్వాధీనం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు, బీజాపురి టౌన్షిప్లో రోడ్లపై అక్రమంగా నిల్వ చేసిన గోదావరి ఇసుకను వాహనాలతో సహా టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు మనీషా, శైలజ, ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేసి రెండు చోట్ల నిల్వ చేసిన 760 టన్నుల ఇసుకను, అదే సమయంలో అక్కడకు అర టన్నులోడుతో వచ్చిన లారీని సీజ్ చేశారు. కాగా ఇసుక రవాణా బిల్లు ఉదయం తీసుకున్నప్పటికీ దానితోనే రోజంతా వీలైనన్ని ట్రిప్పులు వేస్తున్నట్టు గుర్తించారు. ఇసుక అక్రమ నిల్వలపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి డి. ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. -
సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
అన్నవరం: పల్నాడు జిల్లా రెంటపాడులో పరామర్శకు వెడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో సత్తెనపల్లి వద్ద ప్రమాదవశాత్తూ కారు కింద పడి మృతిచెందిన సింగయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుక్కపిల్లతో పోల్చడం దారుణమని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. దళితుడిని అవమానించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరుతూ పార్టీ జిల్లా శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు సరమర్ల మధుబాబు ఆధ్వర్వంలో పార్టీ నాయకులు అన్నవరం పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్రెడ్డి కాన్వాయ్లో కారు సింగయ్యను ఢీకొట్టలేదని వేరే కారు ఢీ కొట్టిందని మొదట ప్రకటించిన జిల్లా ఎస్పీ నాలుగు రోజుల తరువాత సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కారు ఢీ కొట్టిందని చెప్పడం వెనుక కుట్ర దాగుందన్నారు. సింగయ్య భార్య లూర్తు మేరీ మాట్లాడుతూ కారు ఢీ కొట్టి పడిపోయినపుడు పెద్దగా గాయాలు లేవని, అంబులెన్స్లో ఎక్కించాక మృతి చెందడం వెనుక కుట్ర దాగుందని పేర్కొన్నారని తెలిపారు. దీనిని కప్పిపుచ్చడానికి గాను సింగయ్యను కుక్కపిల్లలా పక్కన పడేశారని సీఎం వ్యాఖ్యానించడం దళితులను అవమానించడమే అన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని వారు అన్నవరం పోలీస్స్టేషన్ హెచ్సీ ప్రభాకరావుకు ఫిర్యాదు అందజేశారు. పార్టీ నాయకులు ఆశిన శ్రీనివాస్, సింగంపల్లి రాము, కొండి సతీష్, కొండి సూరిబాబు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లేనని బాలిక కుటుంబీకుల ఆందోళన ● న్యాయం చేయాలని డిమాండ్ తాళ్లపూడి(కొవ్వూరు): విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కొవ్వూరు మండలం ధర్మవరంలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన జొన్నకూటి సౌమ్య (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద దుస్తులు ఆరేసే తీగపై విద్యుత్ లైన్ తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు విద్యుదాఘాతంతో విలవిలలాడుతున్న ఆమెను కాపాడటానికి తన అన్నయ్య, ఓ స్నేహితుడు చేసిన ప్రయత్నంలో వారు సైతం స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తమ కుటుంబాలకు తగిన న్యాయం వెంటనే చేయాలని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి పంచనామా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ ధర్మవరం గ్రామంలో సర్వీస్ వైరు కిందకి ఉందని పదే పదే చెబుతున్నా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని వారు ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి తగిన న్యాయం జరగాలని, గ్రామంలో విద్యుత్ స్తంభాలన్నీ వెంటనే మార్చి మరో ప్రాణం పోకుండా చూసుకోవాలని కోరారు. పోలీసులు సద్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై కొవ్వూరు రూరల్ పోలీసులు, ఎస్సై శ్రీహరి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాదరాడలో యువకుడు.. కోరుకొండ: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన సేనాపతి శ్రీను (34) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. వ్యవసాయకూలీగా జీవించే శ్రీను గురువారం తన ఇంటి వద్ద మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలింది. అతడిని కాపాడబోయిన తల్లి మోటార్ను ఆపే క్రమంలో తానూ షాక్కు గురైనా విద్యుత్ సరఫరాను ఆపగలిగింది. దీంతో కింద పడిపోయిన శ్రీనును స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే అతడు మృతి చెందాడు. శ్రీనుకు భార్య ఉంది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు కేసు నమోదు చేసి శుక్రవారం రాజమహేంద్రవరం జీహెచ్లో శవపంచనామా నిర్వహించారు. -
నాట్ల మాటున కాట్ల బెడద
రాయవరం: తొలకరి పలకరించడంతో రైతులు పొలంబాట పడుతున్నారు. వాతావరణం చల్లబడడంతో పంట పొలాల్లోని బొరియల్లో ఉన్న విష పురుగులు, పాములు బయటకు వస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యే రైతులు పాము కాటుకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.పాముకాటుకు గురైన సందర్భాలలో సకాలంలో వైద్యం అందక పోతే మత్యువాత పడుతుంటారు. పాము కాటుకు గురికాకుండా ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాథమిక చికిత్సపై అవగాహన అందరికీ అవసరం.ప్రాణసంకటమే..రబీ ముగిశాక వేసవిలో రైతులు పొలాల వద్దకు తక్కువుగా వెళ్తుంటారు. సుమారు రెండు నెలల పాటు పొలాల్లో అంతగా అలికిడి ఉండక పోవడంతో అక్కడికి పాములు చేరతాయి. తిరిగి ఖరీఫ్ పనులు మొదలుపెట్టే సందర్భంలో పాములు బయటకు వచ్చి కాటు వేస్తుంటాయి. ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్ల పక్కన నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువుగా పాముకాటు మరణాలు సంభవిస్తుంటాయి.అప్రమత్తంగా ఉండాలి● రైతులు చేల గట్లపై నడిచే సమయంలో పాదరక్షలు ధరించాలి.● కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు వెళ్లిపోతాయి.● ధాన్యపు గాదెలు, గడ్డివాములు, తడిగా ఉండే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి.● దుంగలు, కట్టెల్లో పాములు ఎక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది.● రైతులు ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే పిడకలు, డొక్కల గూళ్ల మధ్య విష కీటకాలు ఉండే అవకాశం ఉంది.● రాత్రి పూట మోటార్ వేయడానికి, పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి.● మోటార్ షెడ్లో స్టార్టర్ వద్ద కూడా పాములు ఉండే అవకాశం ఉంటుంది.● ఇళ్ల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి చెత్తాచెదారం, ముళ్ల పొదలు ఉండకూడదు.● గోడల వారన పాములు నక్కే అవకాశం ఉన్నందున కట్టెల వంటివి ఉంటే వాటిని తొలగించాలి.రెండు గాట్లు పడితేసాధారణ విష సర్పం కాటు వేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కన్పించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం వల్ల నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారడంతో పాటు కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. రెండు గాట్లు పడితే విషపూరితమైన పాము అని గుర్తించాలి. తాచు పాము కంటే కట్లపాము ప్రమాదకరం. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తుంది. రక్తపింజర కాటేస్తే విషం రక్తంలో చేరుతుంది. నోరు, ముక్కు ద్వారా రక్తం బయటకు వస్తుంది. వెంటనే బాధితులను ఆస్పత్రికి చేర్పించాలి. తాచుపాము కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది.ధైర్యం చెప్పాలి● పాము విషం కన్నా చాలా మంది షాక్తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి.● చాలా పాములకు విషం ఉండదు. తాచుపాము, కట్లపాము, రక్తపింజరి, పొడపాము వంటి 15శాతం సర్పజాతులు ప్రమాదరకమైనవి.● నాటు వైద్యం, మంత్ర తంత్రాలు అని ఆలస్యం చెయ్యకుండా సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ఆస్పత్రికి రోగిని తీసుకెళ్లాలి. రోగిని ఎట్టి పరిస్థితుల్లో నడిపించకూడదు.● సాధ్యమైనంత వరకు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాలి. పాము కాటు వేసిన ప్రదేశం పైభాగంలో రక్త ప్రసరణ జరగకుండా బలంగా కట్టుకట్టాలి.ఆధునిక చికిత్సతో లాభాలు● విషం విరుగుడు ఇంజెక్షన్ రూపంలో త్వరగా పనిచేస్తుంది.● బాధితునికి ఆందోళన, షాక్ వల్ల తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారించవచ్చు.● సైలెన్ రూపంలో చికిత్సను మెరుగ్గా అందించే వీలుంటుంది.● చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం నుంచి పరిహారం పొందవచ్చు.జిల్లాలో పరిస్థితి ఇదీకోనసీమ జిల్లాలో 2014 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ 27వ తేదీ వరకు 72 మంది పాముకాట్లకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ప్రస్తుతం 1,724 యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పీహెచ్సీలోనూ 20 వరకు యాంటీ వీనమ్ వైల్స్ అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.ఇంజెక్షన్ల కొరతలేదుప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున విషసర్పాల సంచా రం అధికమవుతుంది. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాము కాటు బాధితులు ఆస్పత్రికి చేరేలోగా ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. యాంటీ వీనమ్ ఇంజెక్షన్లకు కొరతలేదు. – దుర్గారావు దొర, జిల్లా వైద్యాధికారి,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్లక్ష్యం చేయకూడదుఎటువంటి పాముకాట్లకు గురైన వారైనా ముందుగా ఆస్పత్రికి చేర్చితే ప్రాథమిక చికిత్స చేసి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ చేస్తారు. పాముకాటుకు గురైన వారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా చూసుకోవాలి. పాము కరిచిన వ్యక్తికి చుట్టుపక్కల వారు ధైర్యం చెప్పాలి. పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి.– వి.అనిరుధ్, ప్రాథమిక వైద్యాధికారి, పీహెచ్సీ, రాయవరం. -
అట్టహాసంగా పట్టాల పండగ
●● ఘనంగా జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం ● కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ● బంగారు పతకాలు, పట్టాల ప్రదానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూకేలో శుక్రవారం 11వ స్నాతకోత్సవం వర్సిటీ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్సిటీ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. 2023 మే 31న 9వ స్నాతకోత్సవం, 2024 జనవరి 30వ తేదీ వర్సిటీ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు వరుసగా మూడవ సారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు పొందేవారు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు(సుబుకోటా)కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు మధ్య 40మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్స్ అవార్డ్స్ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెల్ఫీలతో సందడి చేశారు. పరిమితంగా అనుమతి ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. షెడ్యూల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని సమాచారం ఇవ్వగా ఆయన వేడుకలకు హాజరుకాలేదు. ముఖ్యఅతిథి శ్రీ కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట)మాట్లాడుతూ సాంకేతిక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాల్టీల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు స్టార్టప్ల కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషనన్ సెల్స్ విశిష్టతను తెలిపారు. రేపటి యూనికార్న్లుగా మారేందుకు సొంత స్టార్టప్లను ప్రారంభించాలనుకునే జేఎన్టీయూకే విద్యార్థులను ఆయన అభినందించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపడుతున్న పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దాలని, మార్పులు చేయడంలో ధైర్యం, ధృడ నిశ్చయం, పెద్ద కలలు కనే సాహసం, సాంకేతిక కార్యకలాపాలలో లోతైన పరివర్తనకు ధైర్యం అవసరమని పట్టభద్రులకు సూచించారు. పరిశోధన కోసం నూతన కోణాలను అవలంబించాలని, సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్ట్లను చేపట్టాలని కోరారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలు, పరిశ్రమలలో పరిశోధనలను జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జాతీయ క్వాంటమ్ మిషన్లో పాల్గొని సమాజ ప్రయోజనం కోసం అధునాతన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. అమృత్ కాల్కు సంబంధించి స్పష్టమైన విజన్ను రూపొందించడానికి, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. అధిక కొవ్వు గల పదార్థాలను తీసుకోరాదని, పొగ తాగడం, మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, దీనికి ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం ఉప కులపతి ప్రొ.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. ఈ స్నాతకోత్సవంలో 99 మంది రీసెర్చ్ స్కాలర్స్కు పీహెచ్డీ అవార్డులు అందజేశారు. కలెక్టర్ శ్రీ ఎస్.షణ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్రనాఽథ్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కొప్పిరెడ్డి పద్మరాజు, శ్రీనివాసకుమార్, కే.మురళీకృష్ణ, శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
కూటమి మోసాలపై ప్రజల్లో ప్రచారం
అనపర్తి : కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోని క్యూఆర్ కోడ్ ద్వారా చేరువ చేయాలని ఆయన సూచించారు. గురువారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర యుజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా పార్టీ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను వారికి వివరించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సంసిద్ధంగా ఉండి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నేతలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. -
పీపీపీ విధానంతో ఎంబీబీఎస్కు దూరం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్ కాకినాడ రూరల్: వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పాట పాడడంతో కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లోని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను 100 శాతం ప్రభుత్వపరంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పడు దానిని విస్మరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు దోచి పెట్టేందుకు పీపీపీ విధానం తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫలితంగా వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ కలగా మారుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ ప్రభుత్వ సంస్థలను తమ వారికి కారు చౌకగా అమ్మేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. ఈ కుట్రలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు భాగస్వాములని, 50 ఎకరాల భూమిని కేవలం రూ.5వేలకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో పలు వైద్య కళాశాలల్లో 750 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా వాటిని రద్దు చేయమని నేషనల్ మెడికల్ కమిషన్కు కూటమి ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమకు మెడికల్ సీట్లు కేటాయించాలని కోరుతుందని, కానీ ఏపీలో మాత్రం సీట్లను రద్దు చేయాలని కోరడం సిగ్గు చేటు అన్నారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కుతంత్రాలకు తక్షణం స్వస్తి పలకాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, రాష్ట్ర కార్యదర్శి కరణం భాను నాయుడు, పార్టీ నాయకుడు రాయి సూరిబాబు పాల్గొన్నారు. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ ప్రశాంతి కొనియాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128 జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆంధ్రులకు గర్వకారణంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న పుట్టి, యువకుడిగా స్వాతంత్య్ర పోరాటంలో అడుగు పెట్టారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడిగా పేరుగాంచారన్నారు. ఆయన జీవితం, పోరాటాలు ఈ తరం ప్రజలకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసీల హక్కుల కోసం, బ్రి టిష్ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా, అత్యంత ధైర్యంతో గళమెత్తిన తొలి పోరాట యోధుడున్నారు. ఆయన చూపిన త్యాగం, ధైర్యం, నాయకత్వ గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చిన్నరాముడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలి రాజానగరం: చదువుతోపాటు క్రీడలలోనూ ప్రతిభను కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీతో శుక్రవారం సమావేశమై, ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతి కళాశాలలోను క్రీడా మైదానాలను సద్వినియోగపర్చేలా క్రీడలపై విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి పాల్గొన్నారు. పంటల బీమా వినియోగించుకోవాలి రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పున సంస్థాపిత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్ 2025లో రైతులు బీమా చెల్లించాలని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పంటల బీమాకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ వరి పంటకు బీమా ఎకరానికి 570 రూపాయలు ఆగస్టు 15 లోపల చెల్లించాలని, మినుముకు ఎకరానికి 300 రూపాయలు ఈ నెల 15 లోపు చెల్లించాలని, అరటి పంటకు ఎకరానికి మూడు వేల రూపాయలు చెల్లించాలన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ శనివారం ఉదయం 9.45 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరవుతారు. కక్షిదారులు కేసులను ఆయా కోర్టుల్లో పరిష్కరిస్తారు. జాతీయ లోక్అదాలత్ రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టుల్లోను, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన కోర్టుల్లోను జరుగనుంది. -
గంజాయి కోసం బైక్ చోరీలు
● ముగ్గురి అరెస్టు, మరొకరు పరారీ ● 14 కిలోల గంజాయి, 14 బైక్ల స్వాధీనం గోకవరం: గంజాయికి అలవాటు పడిన యువకులు చోరీల బాట పట్టారు. బైక్లను చోరీ చేస్తూ వాటిని గంజాయి ముఠాకి అప్పగించి వారి వద్ద నుంచి గంజాయి తెచ్చుకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా బైక్లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని 14 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన పాశం కొండలరావు అలియాస్ నాని అలియాస్ కళ్యాణ్, వాకాడ పవన్కుమార్ అలియాస్ ముక్కా పవన్, కాకర్ల వెంకటకుమార్ అలియాస్ వెంకట్, గోకవరానికి చెందిన ఆవుల వంశీ వ్యసనాలకు బానిసలయ్యారు. వీరు మరికొంత మందితో కలిసి గంజాయి కోసం ఇళ్ల బయట నిలిపిఉంచిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్లను దొంగతనాలు చేసి ఏజెన్సీలోని గంజాయికి మారకం చేసి ఆ మత్తును సేవిస్తున్నారు. శుక్రవారం గోకవరం శివారు కొత్తపల్లికి వెళ్లే మార్గంలో బాపనమ్మ ఆలయం వద్ద ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై వస్తున్న వీరిని పోలీసులు గుర్తించి నిలువరించగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని చాకచక్యంగా పట్టించుకునే ప్రయత్నంలో వంశీ తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నుంచి 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని విచారించారు. ఈ సందర్భంగా బైక్ల చోరీ గురించి వెల్లడించారు. ఈ సమాచారంతో కామరాజుపేట శివారున ఫారెస్టు చెక్పోస్టు సమీపంలోని పైపులైన్ బ్రిడ్జి కింద దాచి ఉంచిన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం తరలించనున్నామనని, తప్పించుకున్న మరో యువకుడిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. మండలంలో గంజాయి రవాణా, విక్రయాల సమాచారం ఉంటే తమకు చెప్పాలని ఆయన కోరారు. కోరుకొండ సీఐ సత్యకిశోర్, ఎస్సై పవన్కుమార్, ఇతర సిబ్బంది ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. -
మహిళను హత్య చేసిన ముగ్గురికి జీవిత ఖైదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళను హత్య చేసి బంగారం, నగదు దోచుకువెళ్లిన కేసులో ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ 10వ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ కోర్టు కమ్ ఎస్సీఅండ్ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎస్.ఉమసునంద శుక్రవారం తీర్పునిచ్చారు. రాజమహేంద్రవరం జాంపేట వద్ద పుచ్చల నాగభారతి హోటల్ నిర్వాహకురాలు. లలితానగర్కు చెందిన దేవబత్తుల నాగమహేష్, దేవబత్తుల లక్ష్మణరావు ఆమె హోటల్కు సమోసాలు సరఫరా చేసేవారు. ఈ నేపధ్యంలో నాగభారతి ఇంటిలో ఓ ఫంక్షన్కు సమోసాలు ఆర్డర్ ఇచ్చింది. వారు సమోసాలు తీసుకువచ్చిన సమయంలో భారతి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉండడంతో వాటిని దోచుకోవాలని భావించారు. ముందస్తు పధకం ప్రకారం అన్నపూర్ణమ్మపేటకు చెందిన నక్క చందు అనే వ్యక్తిని తీసుకుని నాగమహేష్, లక్ష్మీనారాయణ 2013 డిసెంబర్ 2న మధ్యాహ్నం నాగభారతి ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటిపై బంగారు నగలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హతమార్చి ఆభరణాలు తీసుకుని పారిపోయారు. నాగభారతి భర్త ప్రసాదరావు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఎం.రమేష్, ఎస్.గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలను అదుపులోకి తీసుకుని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ పీపీలు ఎ.రాధాకృష్ణరాజు, డి.శ్రీవాణిబాయి వాదనలు వినిపించారు. నిజనిర్ధారణ కావడంతో నిందితులకు జీవిత కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడడంలో కేసును పర్యవేక్షించిన ప్రస్తుత సీఐ అప్పారావు, కోర్టు ఏఎస్సై జి.వెంకటేశ్వర్లును ఎస్పీ డి.నరసింహకిశోర్ ప్రత్యేకంగా అభినందించినారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎడ్ల పందేలు
జగ్గంపేట: మండలంలోని మామిడాడలో కోటాలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని గ్రామ కమిటీ ఽఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల పందేలు శుక్రవారం నిర్వహించారు. సీనియిర్స్ విభాగంలో గుమ్మిలేరు, జూనియిర్స్ విభాగంలో దుళ్ల ఎద్దులు ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తోట నరసింహం, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ బహుమతులు, జ్ఞాపికలు అందచేసారు. సీనియిర్స్ విభాగంలో ప్రధమ స్థానంలో కూర వీరవెంకట సత్యవేణి (గుమ్ములేరు), ద్వితీయ స్థానంలో వల్లూరి లత (మండపేట) తృతీయస్థానంలో కానుమల్లి జైవర్దన (ఏడిద) గెలుపొందారు. అలాగే జూనియిర్స్ విభాగంలో తూము శ్రీను (దుళ్ల), బొజ్జ నారాయణరావు(పిఠాపురం), బండారు శ్రీను మెమోరియిల్(కొప్పవరం)ప్ర ధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందారు. -
తలుపులమ్మకు చీర, సారె
వైభవంగా సామూహిక కుంకుమ పూజ, హోమం తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలను పురష్కరించుకుని తలుపులమ్మ అమ్మవారికి తుని వాసవీ కన్యకా పరమేశ్వరి మహిళా భక్త సమాజం, వివిధ గ్రామాల మహిళలు చీరసారెలను సమర్పించారు. శుక్రవారం చీరసారెలతో వచ్చిన మహిళలకు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీరసారె సమర్పించిన తర్వాత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవస్థానం తరఫున భక్తులందరికీ పసుపు, కుంకుమ, రవిక, గాజులు, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ నెల 24న సప్తనదీ జలాలతో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఈఓ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
9 నుంచి ‘నన్నయ’లో సెమినార్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 9,10 తేదీలలో ఇంటర్నేషనల్ సెమినార్ జరుగనుంది. తాడేపల్లిగూడెం క్యాంపస్లోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ అనలిటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరిగే ఈ సెమినార్కి సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం విడుదల చేశారు. ఈ సెమినార్లో స్పీకర్స్గా ప్రొఫెసర్ కేవీ రామానుజాచారి (యుఎస్ఏ), సైంటిస్టు డాక్టర్ ఎన్.నాగన్న (చైనా), ప్రొఫెసర్ పి.నాగేశ్వరరావు (వరంగల్), డాక్టర్ రాంబాబురెడ్డి (ఐఐటీ – ఖరగ్పూర్) పాల్గొంటారన్నారు. దీనికి కన్వీనర్గా డాక్టర్ బి. జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తారు. -
నిలువ నీడేదీ!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి 2023లో విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చింది. రత్నగిరి రామాలయం పక్కన రేకులతో వేసిన విశ్రాంతి షెడ్డు లాగే ఇక్కడ కూడా నిర్మించాలని నిర్ణయించారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. ఆ తర్వాత కొత్త ఈఓ రావడంతో ఆ ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. దీంతో ఆ నిధులను సంస్థ మరో కార్యక్రమానికి వినియోగించింది. అనంతరం ఇక్కడ రేకుల షెడ్డు కాకుండా, ప్లాస్టిక్ క్లాత్లా టెన్సిల్ రూఫ్ షెడ్డు వేయాలని దేవస్థానం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచన చేస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో నీడ లేక, చలువ పందిరిలో వర్షానికి తడిసి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీడ లేక అవస్థలు పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గతంలో 60 గదులతో సత్యదేవ అతిథి గృహం (సత్రం) ఉండేది. భక్తుల కోసం (గ్యాలోరిమ్ టైల్స్ రూఫ్ షెడ్) విశ్రాంతి షెడ్డు నిర్మించాలనే ఆలోచనతో ఆ సత్రాన్ని 2023 అక్టోబర్లో తొలగించారు. అక్కడ విశాల షెడ్డు నిర్మించాలని అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ప్రణాళిక రూపొందించారు. విశాఖపట్నానికి చెందిన లారెస్ సంస్థ రూ.1.99 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆ ఏడాది కార్తిక మాసం ప్రారంభం కావడంతో తాత్కాలిక షెడ్డు నిర్మించారు. కార్తిక మాసం అనంతరం షెడ్డు నిర్మించడానికి ఆ సంస్థ మెటీరియల్ కూడా సిద్ధం చేసింది. ఈఓ బదిలీతో.. కాగా, ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆయన స్థానంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. రేకుల షెడ్డు నిర్మిస్తే రాజగోపురం కనిపించదని ఆయన ఆ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలోనే లారెస్ సంస్థ ఆ నిధులను వేరే పనులకు వినియోగించింది. పార్కింగ్గా షెడ్డు స్థలం పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్రం కూల్చివేయడంతో, ఆ ప్రదేశం పార్కింగ్ స్థలంగా మారింది. దేవస్థానం బస్సులు కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ నుంచి సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. వేసవిలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేస్తున్నారు. ఈ ఏడాదీ అలాగే చేశారు. వర్షం పడితే చలువ పందిళ్ల నుంచి నీరు కారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం వారు కనీసం షెడ్డు వేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు గత ఫిబ్రవరిలో లారెస్ సంస్థ ప్రతినిధులను షెడ్డు నిర్మించాలని కోరారు. నాలుగు నెలలైనా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ సంస్థ ముందుకు రాకపోతే దేవస్థానం నిధులైనా వెచ్చించి, షెడ్డు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. శ్రావణ మాసంలో రద్దీ ప్రస్తుతం ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా.. జూలై 25 నుంచి శ్రావణ మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వివాహాల సీజన్ కావడంతో రాత్రి వేళల్లో కూడా పెద్ద సంఖ్యలో పెళ్లి బృందాలు వస్తాయి. అదే సమయంలో వర్షాలు కూడా అధికమవుతాయి. దీంతో భక్తుల అవస్థలు చెప్పనలవి కాదు. అధికారులు ఏమన్నారంటే.. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో నిధులు లేవని తెలిపింది. చిన్న షెడ్డు నిర్మిస్తామని చెప్పింది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు. వారు అంగీకారం తెలిపిన వెంటనే దేవస్థానం చైర్మన్, ఈఓల అనుమతి తీసుకుని షెడ్డు నిర్మిస్తామన్నారు. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణమెప్పుడో? ఫ 2023లో 60 గదుల సత్యదేవ సత్రం కూల్చివేత ఫ రూ.1.99 కోట్లతో షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా సంసిద్ధత ఫ ఆ నిధులను మరో కార్యక్రమానికి వెచ్చించిన సంస్థ ఫ నీడ లేక సత్యదేవుని భక్తులకు ఇక్కట్లు -
ఎయిర్ వాల్వ్లో పడిన కారు
తప్పిన ప్రమాదంపి.గన్నవరం: స్థానిక ఏజీ రోడ్డులో వెళ్తున్న ఒక కారు రోడ్డు మార్జిన్లో ఉన్న మంచినీటి పైపులైన్ ఎయిర్ వాల్వ్ గోతిలో పడటంతో ముందు చక్రం విరిగిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పి.గన్నవరం ప్రధాన పంట కాలువ నుంచి ముంగండ మంచినీటి ప్రాజక్టుకు వెళ్లే పైపులైన్లు గతంలో రోడ్డు మార్జిన్లో ఉండేవి. అయితే ఇటీవల రోడ్డును వెడల్పు చేశారు. దీంతో మూడుచోట్ల పైపు లైన్ల ఎయిర్ వాల్వ్లు సీసీ రోడ్డులోకి వచ్చాయి. దీంతో అక్కడ రంధ్రాలు ఏర్పడటంతో సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. ఆ వరలు విరిగిపోవడంతో గోతులు ఏర్పడ్డాయి. వీటిని గమనించని వాహన చోదకులు వాటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు ద్విచక్ర వాహన చోదకులు ఆ గోతుల్లో పడి గాయాల పాలయ్యారు. తక్షణమే ఎయిర్ వాల్వ్లు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడే పట్టాభిషేకం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి గుర్తింపుగా యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి వర్సిటీ ఆహ్వానాలు పంపింది. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పట్టా (ఒరిజనల్ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకు పంపించారు. గత ఏడాది డిసెంబర్లో స్నాతకోత్సవం నోటిఫికేషన్ జారీ చేసి గవర్నర్ అనుమతితో శుక్రవారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 11వ స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా 2023–24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్ విభాగంలో 41,258, బిఫార్మశీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1115, ఎంఫార్మశీ 458, బీబీఏ 115, ఫార్మడీ 274, బీఆర్క్ 83 ఓడీ (ఒరిజనల్ డిగ్రీ)లు విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు 40మందికి, పీహెచ్డీలు 99 మందికి అందజేయనున్నట్టు వర్సిటీ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్.. స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థి, అమెరికా బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన జేఎన్టీయూ కాకినాడ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1986లో అమెరికాలో బోస్టన్ గ్రూప్ స్థాపించి సుమారు 2,500 మందికి యూఎస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి మలేషియా, ఇండోనేషియా, ఫిలిఫిన్స్ వంటి దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించే విధంగా జేఎన్టీయూకేలో సుబుకోటా ఫౌండేషన్ స్థాపించి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు పోటీలు నిర్వహిహించి నగదు బహుమతితో ప్రొత్సహిస్తున్నారు. జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం వర్సిటీ కులపతి, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు -
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రైతును కదిలించినా ధాన్యం సొమ్ము రాలేదంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. గొప్ప చెప్పి.. చిప్ప చూపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. అప్పు పుట్టక.. కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి మార్కెట్లో నగదు చలామణీ భారీగా పడిపోయింది. దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు. జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు కాకినాడ రూ.80 కోట్లు కోనసీమ రూ.189 కోట్లు తూర్పు గోదావరి రూ.130 కోట్లు మొత్తం రూ.399 కోట్లు నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు ధాన్యం సొమ్ము ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్న అప్పులతోనే ఖరీఫ్ సాగు అట్లపాడులో 9.2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఎకరాకు రూ.45 వేల వరకూ పెట్టుబడి పెట్టి రబీ సాగు చేశాను. ఎకరాకు 49 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్ 27న రైస్మిల్లుకు తోలాను. రూ.7.60 లక్షల వరకూ రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినా ప్రభుత్వం ఇంకా మా డబ్బులు జమ చేయలేదు. దీంతో, మళ్లీ అప్పులు చేసి ఖరీఫ్ సాగు చేపట్టాను. – కొత్తపల్లి సత్యనారాయణ, కౌలు రైతు, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం -
కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు
● సంక్షేమం మరచి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుచాగల్లు: దళితుడైన చీలి సింగయ్య మృతిలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఇది కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. చాగల్లు మండలం నందిగంపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగయ్య మృతిపై అక్రమ కేసులు పెట్టి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు కింద పడి, మరణించినట్లు చూపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే 37 సెకెన్ల నిడివితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారని, దాని ఆధారంగా అక్రమ కేసులు కట్టారని ఆరోపించారు. ఈ కేసులపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, కోర్టుకు ప్రభుత్వం ఇప్పటికీ ఆధారాలు చూపించలేక వాయిదాలు అడుగుతోందని అన్నారు. నిజంగా 4 టన్నుల బరువున్న జగన్ కారు కింద పడి చనిపోయి ఉంటే సింగయ్య తల నుజ్జునుజ్జు కాకుండా ఎలా ఉందో చంద్రబాబే చెప్పాలని ప్రశ్నించారు. కారు చక్రం ఎక్కి ఉంటే దాని తరువాత వీడియో కానీ, కారు కింద నుంచి సింగయ్యను బయటకు తీసిన వీడియో కానీ ప్రభుత్వం వద్ద ఎందుకు లేవని నిలదీశారు. వీడియోతో ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ప్రమాదాలు జరిగితే వాహనం డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టిన చరిత్ర ఎక్కడా ఎప్పుడూ లేదని, తొలిసారి కూటమి ప్రభుత్వమే ఆ రికార్డు కూడా నమోదు చేసుకుందని విమర్శించారు. బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అందులోని ప్రయాణికులదరిపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. సింగయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపి, దీని వెనుక ఉన్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కేవలం జగన్ను కేసులో ఇరికించే దురుద్దేశంతో కూటమి నాయకులు ఒక నిండు ప్రాణం బలిగొన్నారని అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలు తీశారని, ఈ ఘటనలో మొదటి ముద్దాయి ఆయనేనని వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి ఎనిమిది మంది మరణానికి, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో ఆరుగురు భక్తుల మృతికి కారకులయ్యారని, వీటన్నింటికీ సంబంధించి చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలవుతున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వెంకట్రావు దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులతో నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్య జయసుధపై అక్రమ కేసులు పెట్టి అరెస్టుకు ప్రయత్నించారన్నారు. అసలు జరగని లిక్కర్ స్కామ్ను జరిగినట్లు చూపించి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని చెప్పారు. ఐపీఎస్ అధికారులు, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి జర్నలిస్టులను సైతం కేసులు, అరెస్టులతో కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు వైఎస్సార్ సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు 240 మందిని జైళ్లకు పంపించారని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని వెంకట్రావు అన్నారు. -
ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
వంట నూనెల కొరత దృష్ట్యా ఆయిల్పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కనీస ప్రోత్సాహక ధరగా రూ.25 వేలు చెల్లించాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. వైట్ ఫ్లై (తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు. నూనె శాతాన్ని నిర్ణయించే పెదవేగి ఆయిల్పామ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదు. – పెండ్యాల బుజ్జిబాబు, తూర్పు గోదావరి జిల్లా ఆయిల్పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, రంగంపేట -
సమర్థవంతంగా నేరాల కట్టడి
● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్ ● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి ● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు కంట చెమ్మ
● పతనమైన నిమ్మ ధర ● కిలో రూ.7 ● కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన ● అంతంత మాత్రంగా ఎగుమతులుదేవరపల్లి: నిమ్మకాయల ధర పతనమవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో నిమ్మకాయలకు రూ.7 నుంచి రూ.10 మధ్య మాత్రమే రైతులకు దక్కుతోంది. అదే వినియోగదారుల వద్దకు వచ్చేసరికి కిలో రూ.50 నుంచి రూ.55 వరకూ పలుకుతోంది. సైజును బట్టి ఒక్కో నిమ్మకాయ ధర రూ.2 నుంచి రూ.5 వరకూ కూడా చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధర భారీగా ఉన్నప్పటికీ తమకు మాత్రం దక్కుతున్నది చాలా స్వల్పంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని, కోత కూలి డబ్బులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూండటంతో కాయల కోతలు జరగడం లేదు. నిమ్మకాయలు చెట్ల కింద రాలిపోయి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో వినియోగం తక్కువగా ఉండటంతో, ఎగుమతులు నిలిచి, నిమ్మకాయలకు ధర కూడా తక్కువగా పలుకుతుంది. ఇదే సమయంలో తోటల నుంచి లేత కాపులు ఒకేసారి అందుకోవడంతో మార్కెట్కు కాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, టెక్కలి, నర్సన్నపేట ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎక్కువగా మెట్ట నిమ్మకాయల దిగుబడి వస్తుంది. ఇవి అక్కడి మార్కెట్లను ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు ఉండవు. దిగుబడి ఎక్కువగా ఉండడటం, డిమాండ్ లేక ఎగుమతులు తగ్గడంతో తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, ప్రస్తుతం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో గిరాకీ ఈ ఏడాది వేసవిలో నిమ్మకాయలకు మంచి గిరాకీ ఏర్పడింది. కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకూ రైతుకు దక్కింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా వచ్చాయి. రైతులు పెట్టుబడులు, కౌలు డబ్బులు దక్క డంతో ఒడ్కెక్కారు. సాధారణంగా ఎండల తీవ్రత అ ధికంగా ఉండే ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ మార్కె ట్లో నిమ్మకాయలకు గిరాకీ ఉంటుంది. జూలై నుంచి జనవరి వరకూ గిరాకీ అంతంత మాత్రంగానే ఉంటుంది. దేవరపల్లి మండలంలోని యాదవోలు మార్కె ట్ నుంచి ప్రతి రోజూ వివిధ ప్రాంతాలకు నిమ్మకాయ ల రవాణా జరుగుతుంది. ఇక్కడ రైతులే వ్యాపారు లుగా తయారై ఇతర రైతుల నుంచి ఎటువంటి కమీషన్ లేకుండా నిమ్మకాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఉన్న యాద వోలు నిమ్మ మార్కెట్కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. సీజన్లో ఇక్కడి నుంచి రోజుకు సుమారు 100 టన్నుల నిమ్మకాయలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కొద్ది రోజుల కిందట 35 నుంచి 40 టన్నుల కాయలు మార్కెట్కు వచ్చేవి. ఇటీవలి వర్షాలకు రోజుకు 10 నుంచి 12 టన్నులు మాత్రమే వస్తున్నాయి. అయినప్పటికీ, డిమాండ్ లేకపోవడంతో రైతుకు ధర రావడం లేదు. మంగు తెగులు నిమ్మకాయలకు మంగు తెగులు, కాయ అడుగు భాగం మచ్చ (డాట్) వచ్చాయి. ప్రస్తుత వాతావరణానికి మంగు తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. కాయలకు కోత కూలి డబ్బులు కూడా రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ధర పతనమైంది. మే 1 నుంచి 10వ తేదీ వరకూ కిలో రూ.35 నుంచి రూ.42 మధ్య పలికిన ధర అనంతరం రూ.20కి తగ్గింది. ఈ ధర గత నెలలో రూ.7 నుంచి రూ.10 మధ్యకు పడిపోయింది. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. – అనిశెట్టి సూర్యచంద్రరావు, రైతు, యాదవోలు -
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
రావులపాలెం: కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్ను దాటి అవతల దారిలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. రావులపాలెం మండలంలో ఈతకోట టోల్ ప్లాజా సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన బొండాల నరసింహ గుప్తా (55) మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన గుప్తా భార్య వీర వెంకట లక్ష్మీదేవితో కలిసి రాజమహేంద్రవరం బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈతకోట టోల్ ప్లాజా దాటాక కొంతదూరంలో కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కేవీఎస్ఎస్ రామారెడ్డి, దివ్య పద్మజ్యోతి దంపతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. వీరు రాజమహేంద్రవరం నుంచి పాలకొల్లు బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుప్తా, అతని భార్య వీర వెంకట లక్ష్మీదేవి, మరో కారులో ఉన్న జ్యోతి గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్లో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో గుప్తా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిని రావులపాలెం పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హైవే టోల్ ప్లాజా సిబ్బంది క్రేన్ సాయంతో కార్లను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టిన వైనం ఇద్దరికి గాయాలు -
‘ఫోర్జరీ పోలీస్’ సస్పెన్షన్
కాకినాడ క్రైం: రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసిన హెడ్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం జీఆర్పీ స్పెషల్ బ్రాంచ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు ఏకంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎస్ఐని అని ఓ నకిలీ ఐడీ కార్డును తన పేరుతో తయారు చేసుకున్నాడు. ఈ కార్డుని వాడుతూ, పలుచోట్ల బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ తరహాలోనే కాకినాడలోని రైల్వే గెస్ట్ హౌస్లో ఓ కుటుంబ వివాదంలో విచారణ పేరుతో కామేశ్వరరావు జోక్యం చేసుకున్నాడు. విచారణ సమయంలో ఓ మహిళను తాను ఎస్ఐని అని చెబుతూ నకిలీ ఐడీ కార్డు చూపించి మరీ బెదిరించారు. అయితే, అప్పటికే కామేశ్వరరావుది హెడ్ కానిస్టేబుల్ హోదా అని తెలుసుకున్న మహిళ నకిలీ ఐడీ కార్డు వ్యవహారాన్ని కాకినాడ జిల్లా ఎస్పీబిందుమాధవ్, ఇంటెలిజెన్స్ అధికారులకు వెల్లడించి, కాకినాడ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ మొదలు కాగా, ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా రాజమహేంద్రవరం జీఆర్పీ నుంచి అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖకు కామేశ్వరరావును పంపారు. లోతైన విచారణ అనంతరం ఆరోపణలన్నీ వాస్తవాలని తేలడంతో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా కామేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు సిఫారసు చేశారు. కాకినాడలోని రైల్వే గెస్ట్ హౌస్ వద్ద మహిళను నకిలీ ఎస్ఐ ఐడీ కార్డుతో బెదిరించిన నేరంలో కామేశ్వరరావుకి సహకరించిన ఓ మహిళా కానిస్టేబుల్ పైనా చర్యలు తీసుకోవాలని, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖకు వెళుతున్న నేపథ్యంలో అక్కడి పోలీసులకు అనకాపల్లి ఎస్పీ సిఫారసు చేశారు. -
సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులపై దాడి దారుణం
సీటీఆర్ఐ: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు, అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామగ్రి, బంగారం, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినాపురపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి, వి.సీతామహలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరొందిన అది ప్రైవేటు ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవల భారీగా తరలివస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని తమ చేతిలో పెట్టుకోవాలనే దురుద్దేశంతో ఏప్రిల్ 23వ తేదీ రాత్రి వట్టికూటి వీర రాఘవమ్మ, పసుపులేటి సింగారలక్ష్మిపై దాడి చేసి గృహలను, షాపులను కూల్చి వేశారని, సుమారు రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దోచుకుని పోయారని అన్నారు. గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. తాము హైకోర్టులో జూన్న్20న రిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. బాధితులు మే 26న జిల్లా కలెక్టర్కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. 1880 నాటి కాలంలో వారి ముత్తాత పసుపులేటి వెంకన్న, పసుపులేటి వీరరాఘవమ్మ దంపతులు చింతచెట్టు కింద వెలసిన సింగారమ్మ తల్లికి సుమారు 5 ఎకరాల అడవిని చదును చేసి ఆలయ ప్రాంగణంగా రూపొందించారన్నారు. వంశ పారంపర్యంగా ఆలయం వద్దనే నివాసాలు ఏర్పర్చుకుని పూజారులుగా, ట్రస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి గుడిని రక్షించాలని కోరుతున్నామన్నారు. వట్టికూటి దుర్గాప్రసాద్, వట్టికూటి జనార్ధనరావు, సీతామహలక్ష్మి, ఆలమూరు ధనలక్ష్మి, పసుపులేటి శ్రీ వెంకట సూర్య చక్ర ధనుష్కుమార్ పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ -
పంట కాల్వలు కలుషితం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట కాల్వల ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు మానవ తప్పిదాలతో కలుషిత అవుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మానవ నిర్లక్ష్యం, తప్పిదాలపై తాను హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. కాల్వల ద్వారా ప్రవహించే గోదావరి జలాలతో పంటల సాగే కాకుండా పలు గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్ట్లు నిర్వహిస్తున్నారని వివరించారు. కొందరు తమ ఇళ్ల మరుగుదొడ్ల గొట్టాలు కాల్వల్లోకి అమర్చుకొని కలుషితం చేస్తున్నారని, తద్వారా పంట కాల్వలు మానవ మల మూత్రాలతో ప్రవహిస్తున్నాయని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీరు కోసం కాటన్ దొర పంట కాల్వల వ్యవస్థను తీసుకుని వస్తే స్వార్థుపరులు, కాల్వలను పర్యవేక్షించాల్సి అధికారుల నిర్లక్ష్యం వల్ల కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. కాల్వలను కలుషితం చేయవద్దని, వ్యర్థాలను వదల వద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నాయని గుర్తు చేశారు. కాల్వలను కలుషిత చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అన్నదాత ఇంట.. సిరుల పంట
ఆలమూరు: వ్యవసాయంలో అధిక పెట్టుబడిని, కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు అనేక అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వరి సాగులో ఏటా అనేక మార్పులు సంభవిస్తూ, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక, పురాతన సంప్రదాయాలతో వ్యవసాయం చేపట్టడం ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్లో ధాన్యం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోయినా, అన్నదాత సుఖీభవ అమలు చేయకపోయినా రైతులు మాత్రం ఖరీఫ్ సీజన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడిని తగ్గించుకునేందుకు ఈసారి అధికంగా రైతులు వినూత్న రీతిలో వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల ఎకరాల్లో 1.06 లక్షల మంది రైతులు వ రిసాగు చేపట్టారు. స్వర్ణ (7029)కు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ కొత్త వంగడాల వల్ల నారుమడులు సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, చీడపీడలు నివారించి నష్ట నివారణను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. స్వర్ణ (7029)కే రైతుల మొగ్గు రైతులు మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సీజన్లో 70 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా, మిగతా ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు ఆర్ఎస్కేలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగును ఎంచుకోగా, మిగిలిన రైతులు వరినాట్ల పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈ నెల 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని సూచించడంతో, రైతులు పనులను వేగవంతం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెదజల్లు వల్ల లాభాలపై అవగాహన కల్పించడంతో రైతులు ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో, సమయానికి ముందే రైతులు సాగు చేపట్టారు. డ్రమ్ సీడర్ వినియోగంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. కలుపు యాజమాన్య పద్ధతి పంట తొలి దశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మి.లీ లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలచగా, నీరు పెట్టి కలుపు మందును పిచికారీ చేయాలి. తర్వాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మధ్ద తొక్కడం ద్వారా ఎరువుగా మలచుకోవచ్చు. నీటి యాజమాన్యం విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పిలకలకు అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూడాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలచటి నీటి పొర ఉండేలా చూసుకుని, మండి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపి, డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ. దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి, విత్తు సక్రమంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వెదజల్లుపై రైతుల ఆసక్తి పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు కీలకం వెదజల్లు సాగు విధానంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు చెబుతున్నారు. వెదజల్లు విధానంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసి, నీటిని బయటకు పంపాలి. వారం తర్వాత ఒకసారి పంటకు నీరును అందజేసి, మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడుదిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చూడాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల ముందు ఒకసారి దమ్ము చేయాలి. నాలుగు రోజుల ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. వెదజల్లుతో ప్రయోజనాలు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, కూలీల కొరతను అధిగమించవచ్చు. సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చు. పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతమవుతుంది. మొక్కలో సాంద్రత పెరిగి, పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు ఎకరం పొలంలో నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరం. వెదజల్లులో కేవలం 12 నుంచి 18 కేజీలు చాలు. కలుపు మొక్కలను సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని, వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. పెట్టుబడి పరంగా రూ.మూడు వేల వరకూ ఆదా అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా, నీరు అందుబాటులో ఉన్నప్పుడే సాగుకు అవకాశం ఉంటుంది. -
పేపర్మిల్లో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి ఆంధ్రపేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. పేపర్ మిల్లు నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. గత నెల 29వ తేదీన బరోడా నుంచి రాజమండ్రి పేపర్ మిల్కు హైడ్రోజన్ పెరాకై ్సడ్ లోడులో ఓ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని గ్యాస్ను వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో, ట్యాంకర్ అలాగే ఉండిపోయింది. నాలుగు రోజులుగా పేపర్ మిల్ నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక దళ వాహనాలు గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఘటన స్థలానికి పక్కనే పెట్రోల్ బంక్, పేపర్ మిల్ టింబర్ డిపో ఉన్నాయి. దీంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లారు. వ్యూహాత్మకంగా నియంత్రణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉదయం 9.15 నిమిషాలు.. రాజమహేంద్రవరం ఫైర్ ఆఫీసుకు ఫోన్ వచ్చింది. పేపర్ మిల్కు వచ్చిన తన లారీ ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీక్ అవుతుందని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆర్యాపురం ఫైర్ ఆఫీసు నుంచి ఫైరింజిన్ బయలుదేరింది. ట్యాంకర్ నుంచి లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ అధిక మొత్తంలో వ్యాపిస్తే, దానిని పీల్చిన వారి ఊపిరితిత్తులు పాడైపోతాయి. శరీరంపై పడితే పెద్ద బొబ్బలు ఏర్పడుతాయి. అప్రమత్తమైన అగ్నిమాపక బృందాలు జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్కింగ్ నేతృత్వంలో సంఘటన స్థలంలో నియంత్రణ చర్యలు చేపట్టాయి. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఫైర్ ఆఫీసు నుంచి మరో రెండు, కొవ్వూరు నుంచి ఒక ఫైరింజిన్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టెండర్ వాహనాన్నీ రప్పించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీకేజీతో ప్రజలకు ఏం కాకుండా పోలీసుల సహకారంతో పేపర్ మిల్ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ట్యాంకర్లోని హైడ్రోజన్ పెరాకై ్సడ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా అగ్నిమాపక అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక కెమికల్ సూట్లు, సెపరేట్ డ్రెస్ను ధరించారు. ట్యాంకర్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ వాటర్, వాయువులను చిమ్మారు. ఆపరేషన్ ప్రారంభించిన ఉదయం 9.30కు 47 డిగ్రీలున్న ఉష్ణోగ్రతను, మధ్యాహ్నం 12 గంటలకు 26 డిగ్రీలకు తగ్గించగలిగారు. లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్పై నీటిని చల్లి, భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన ఫైరాఫీసర్ శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బందిని అందరూ అభినందించారు. 4 గంటలు శ్రమించి నియంత్రించిన అగ్నిమాపక యంత్రాంగం భీతిల్లిన పరిసర ప్రాంతాల ప్రజలు -
డ్రెయిన్లో పడి యువకుడి మృతి
కాజులూరు: మోటార్ బైక్ అదుపు తప్పడంతో స్థానిక టేకి డ్రెయిన్లో పడి దాకమూరి నాగరాజు (22) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన దాకమూరి నాగరాజు హైదరాబాద్లో ర్యాపిడో సర్వీసులో పనిచేస్తున్నాడు. ఇటీవల గ్రామంలో అమ్మవారి జాతరకు వచ్చాడు. సోమవారం రాత్రి కోలంక నుంచి ద్రాక్షారామ వెళుతుండగా, ఉప్పుమిల్లి శివారు గొప్పిరేవు వద్ద మోటార్ బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నాగరాజు శిథిలమైన రెయిలింగ్ నుంచి టేకి డ్రెయిన్లో పడిపోయాడు. మృతదేహం కొట్టుకుపోయి, తాళ్లరేవులో లభ్యమైంది. కాగా, నాగరాజుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. కోలంకలో మృతుని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు గొల్లపాలెం పోలీసులు తెలిపారు. ఎస్సై మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వద్దు
రికార్డుల నిర్వహణపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల అసంతృప్తి కరప: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అలసత్వం వహించవద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్, ఈ.లక్ష్మీరెడ్డి నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. కోడిగుడ్లు ఎక్కువ నిల్వ ఉండటం, విద్యార్ధులకు దొడ్డుబియ్యంతో భోజనం పెట్టడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం వారు మండల అధికారులతో కలసి కరప మండలంలో అంగన్వాడీ కేంద్రాలను, హైస్కూలు, రేషన్ షాపులను, ఎంఎల్సీ పాయింట్ను తనిఖీ చేశారు. కొరిపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 3వ, 4వ ఫేజ్లో వచ్చిన 140 కోడిగుడ్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించారు. అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసు జారీచేయాలని సీడీపీఓ వై.లక్ష్మిని ఆదేశించారు. కూరాడ జెడ్పీ హైస్కూల్లో దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టటం ఏమిటని హెచ్ఎం ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణిని ఆదేశించారు. -
కారు ఢీకొని వ్యాపారి మృతి
ఏలేశ్వరం: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, పట్టణానికి చెందిన గూడపాటి నాగసత్య చంద్రశేఖర్(44) పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. షాపు వద్దే అతడి ఇల్లు కూడా ఉంది. షాపు వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లరాయి చిప్స్ లారీ వస్తుందని సమాచారం రావడంతో, మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. గొడుగు వేసుకుని.. షాపు ఎదురుగా రోడ్డు దాటుతుండగా, యర్రవరం రోడ్డులో ఏలేశ్వరం వైపు అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని షాపులో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద సంఘటన రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నవ్వుతూ ఉండే.. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే చంద్రశేఖర్.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని అతడి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. -
అనధికార మద్యం అపాయకరం
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి లావణ్య రాజమహేంద్రవరం రూరల్: లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అనధికార (లైసెన్స్ లేని) వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయడం చాలా అపాయకరమన్నారు. అటువంటి మద్యం నకిలీది కావచ్చన్నారు. వివాహాలు, పార్టీలు లేదా ఇతర సామూహిక వేడుకల సందర్భాల్లో మద్యాన్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తామంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. వారు సరఫరా చేసే నకిలీ మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చన్నారు. అటువంటి అనుమానిత వ్యక్తుల వివరాలను వెంటనే ఎకై ్సజ్ శాఖకు తెలియజేయాలన్నారు. ట్రోల్ ఫ్రీ నంబరు 14405కి కానీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి 96767 14547 నంబర్కు కానీ తెలపాలని కోరారు. -
రైతు సమస్యలపై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్ డ్రైన్లు పట్టించుకోకుండా ఖరీఫ్ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నీటి తీరువా వసూలుపై ఆగ్రహం కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కల్పించుకుని సర్చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట పీడీఎస్ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్ గోడౌన్లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఖరీఫ్ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్పర్సన్ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజి వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు ? మెట్టకు సాగునీరు మాటేమిటి ? జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు -
నేడు వ్యూహలక్ష్మికి మహాభిషేకం
సీటీఆర్ఐ: వ్యూహలక్ష్మి అమ్మవారికి గురువారం మహాభిషేకం జరుగుతుందని శ్రీమాన్ చిన్నవెంకన్నబాబు స్వామి అన్నారు. బుధవారం స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గాడాల శ్రీమహాలక్ష్మీ సమేత చిన్న వేంకటేశ్వరస్వామి పీఠంలో ప్రతి ఏడాది ఆషాఢ మాస రెండో గురువారం శ్రీవ్యూహలక్ష్మి అమ్మవారికి ఈ ఒక్కరోజు మాత్రమే విశేష మహా భిషేకం జరుగుతుందన్నారు. భక్తులంతా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా గురువారం వ్యూహలక్ష్మికి మహాభిషేకం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఆటంకాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని అనుగ్రహ ప్రద ఫౌండేషన్ అంతర్జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్ తెలిపారు. మనగుడి– మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల రమేష్ మాట్లాడుతూ గత సంవత్సరం గుప్త నవరాత్రులకు ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. కార్యక్రమంలో పీఠం వైస్ చైర్మన్ దుర్గా వెంకట హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి: మార్కెట్లో పొగాకు ధర పెరిగింది. ధర రోజురోజుకు పెరుగుతోంది. జూన్ 24 వరకు కిలో గరిష్ఠ ధర రూ. 290 ఉండగా, అనంతరం ఈ ధర రోజు రోజుకు పెరుగుతూ రైతుల్లో ఆశలు కల్పిస్తోంది. ముందు ముందు ధర మరింత పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. మార్చి 24న పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించింది. కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, అప్పటి నుంచి జూన్ 24 వరకు అదే ధర కొనసాగింది. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు ఆందోళన చెందారు. ఈ నెల 25 నుంచి మార్కెట్లో ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. జూన్ 24న కిలో గరిష్ఠ ధర రూ. 290 పలకగా, 26న రూ. 291, 26న రూ. 293, 27న రూ. 296, 28న రూ.299, 30న 300, జూలై 1న కిలో గరిష్ఠ ధర రూ.300 పలకగా బుధవారం మార్కెట్లో కిలోకు గరిష్ఠ ధర రూ. 10 పెరిగి రూ.310 చేరుకుకుంది. ఒక్కరోజునే కిలోకు రూ.10 పెరగడంతో రైతులకు ఊరట లభించినట్లయింది. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ.410 పలికింది. మార్కెట్లో ధర పెరుగుతుండడంతో వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య పెరుగుతోంది. గురువారం వేలానికి ఐదు వేలం కేంద్రాల నుంచి 5,171 బేళ్లు విక్రయానికి రాగా, 3,758 బేళ్లు కొనుగోలు చేశారు. 1,413 బేళ్లు అమ్ముడు పోలేదు. 4.76 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగినట్టు బోర్డు అధికారులు తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.310, కనిష్ఠ ధర రూ.200, సగటు ధర రూ.275.10 లభించింది. ఇప్పటి వరకు 80 రోజులు వేలం జరిగింది. 16 కంపెనీలు వేలంలో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.310 ఒక్కరోజులో పెరిగిన ధర రూ.10 -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే అన్ని కేటగిరిలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 కు దరఖాస్తు చేసుకునే పక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. ప్రతిపాదనలు నేషనల్ అవార్ట్స్ టు టీచర్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్/లాగిన్.ఎస్పీఎక్స్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలన్నారు. గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకానికి ఆమోదం రాజమహేంద్రవరం రూరల్: భారత ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం(ఈఎల్ఐ) పథకానికి ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) రీజనల్ పీఎఫ్ కమిషనర్–2 కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన పీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థిరమైన ఉపాధి కల్పన, ఆర్థిక చేయూతను ప్రోత్సహించేందుకు ఈఎల్ఐ పథకం రూపొందించారన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 2027 జూలై 31మధ్య సృష్టించిన ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. యజమానుల ప్రోత్సాహక చెల్లింపులు పాన్–లింక్డ్ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు. భీమేశ్వరాలయం నుంచి తలుపులమ్మకు సారె రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ అమ్మవారికి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆషాఢం సారెను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని బుధవారం సమర్పించారు. లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమేశ్వరాలయ అర్చకుడు మద్దిరాల రాజ్కుమార్శర్మ, చండీ పారాయణదారులు జుత్తుక చిన్న, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. -
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
ఏడు బైక్లు స్వాధీనం కాకినాడ రూరల్: వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో కాకినాడ అర్బన్ కామేశ్వరినగర్ రామకృష్ణారావుపేటకు చెందిన యువకుడు కడియాల ప్రేమ్కుమార్ అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ జిజ్జును సర్పవరం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల మేరకు, నిందితుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా ఉంచి, అరెస్టు చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్కుమార్తో పాటు, ఏఎస్సైలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, హెచ్సీలు సత్తిబాబు, రాజు, ప్రసాద్, పీసీలు అనిల్, కిశోర్ను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కాకినాడ సిటీ: కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవానికి శుక్రవారం విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్ కాకినాడ పర్యటన సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సంబంధిత అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జేఎ న్టీయూ అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు సెమినార్ హాల్లో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు. -
14 నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఉంటుందని శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులకు సామర్లకోట ఈటీసీలోనే శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈటీసీ సిబ్బంది ఆయా జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు మంగళవారం శిక్షణ ప్రారంభించినట్టు వివరించారు. కోర్సు డైరెక్టర్గా కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు వి.జగన్నాథం, ఖాజా మొహీద్దీన్ శిక్షణ ఇస్తారన్నారు. రెండో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రాంగణంలో, ఎనిమిదో తేదీ నుంచి విశాఖపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పీ మీటింగ్ హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులు సెక్షన్–30 అమలు అమలాపురం టౌన్: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లో నెల రోజుల పాటు సెక్షన్–30 అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ నెల 31 వరకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెప్పారు. ఈ నేప థ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలు జరపడానికి ముందుగా తన అనుమతి పొందాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
లారీని ఢీకొన్న గూడ్స్ ఆటో
జొన్నాడకు చెందిన డ్రైవర్ మృతి కిర్లంపూడి: ఆగి ఉన్న లారీని గూడ్స్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద చోటుచేసుకుంది. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీధర్(43) గూడ్స్ఆటోలో విశాఖపట్నానికి పువ్వుల లోడుతో కిరాయికి వెళ్లాడు. అక్కడి నుంచి న్యూస్ పేపర్ల లోడును వేసుకుని రాజమండ్రికి తిరిగొస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మరణించాడు. అతడి సోదరుడు సూరిశెట్టి గంగాజలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో సూరిశెట్టి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీధర్ 12 ఏళ్లుగా జొన్నాడలో నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమాని శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఇక తమకు దిక్కెవరంటూ మృతదేహం వద్ద కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు. -
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి. పెదలంక వద్ద వంతెన అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు. -
700 లీటర్ల డీజిల్ పట్టివేత
తాళ్లరేవు: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 700 లీటర్ల డీజిల్ను పట్టుకున్నట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీజిల్ను అక్రమంగా తరలిస్తున్న పాలకొల్లుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ట్రాక్టర్తో పాటు, 700 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. ఐదుగురు జూదరుల అరెస్టు జగ్గంపేట: జగ్గంపేట శివారు గుర్రంపాలెం రోడ్డులో పోలవరం కాలువ వద్ద పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎస్సై రఘునాథరావు, సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. -
రెండు పొక్లెయిన్లు సీజ్
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లిలంకలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు పొక్లెయిన్లను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ మంగళవారం సీజ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, పెదకందాలపాలెం, మానేపల్లిలంకలో ర్యాంపులను తహసీల్దార్ పి.శ్రీపల్లవితో కలిసి ఆర్డీఓ పరిశీలించారు. మానేపల్లిలంకలో ఉన్న పొక్లెయిన్లను సీజ్ చేసి మైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 15 వరకూ జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు జరపరాదని కలెక్టర్ ఆదేశించారన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లకుండా బాటలను కట్ చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో డ్రోన్ల ద్వారా సర్వే చేయించి, సంబంధిత వ్యక్తులకు డిమాండ్ నోటీసులు పంపిస్తామని ఆర్డీఓ చెప్పారు. -
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్ కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు. ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్ గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా.. అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు. పెరగనున్న కాంట్రాక్ట్..? గత నవంబర్తో ముగిసిన కేఎల్టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ దానిని రద్దు చేసి మళ్లీ జూన్ 12న రీటెండర్ కొత్త షరతుల ప్రకారం రూ.80 లక్షలకు పెరిగే అవకాశం -
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వాహనాల ఫిట్నెస్ టెస్టులు ప్రైవేటు పరం చేయొద్దు
ఫ నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉధృతం ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజానగరం: రవాణా వాహనాల ఫిట్నెస్ (బ్రేక్) టెస్టులను రాష్ట్ర రవాణా శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ల ఆధ్వర్యాన స్థానిక ఫిట్నెస్ టెస్టింగ్ పాయింట్ వద్ద మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్ షెల్టర్ నుంచి నిరసనకారులు ఆటోల్లో ఊరేగింపుగా ఇక్కడకు చేరుకుని, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రవాణా శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా, వివిధ రకాల పన్నులతో ఆర్థిక భారం మోపుతోందన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు అనుసరించడమే కాకుండా, స్వార్థ రాజకీయాలతో ప్రతిపక్షాలపై పోలీసు జులుం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు నెలకు రూ.600 నుంచి రూ.700 వస్తే, కూటమి సర్కారులో రూ.1,500 నుంచి రూ.3 వేలు వస్తోందని, ప్రజలపై పడుతున్న ఆర్థిక భారానికి ఇది ఒక ఉదాహరణని చెప్పారు. అన్నదాతల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందన్నారు. అలాగే, ఆటో, వ్యాన్, కారు, లారీ నడుపుతూ, రోజువారీ సంపాదనతో జీవనం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఎటువంటి సాయమూ చేయడం లేదని, పైగా ఆయా వాహనాల ఫిట్నెస్ ప్రక్రియను పరుల పరం చేసి, ఫీజుల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా, తక్కువ మందితోనే నిరసన తెలపాలంటూ ప్రజాస్వేచ్ఛను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలోనే ఇంతటి దారుణ పరిస్థితులుంటే మిగిలిన నాలుగేళ్లలో ఎంతటి ఘోరాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమేదో ప్రజలే తెలుసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరత్రామ్ చెప్పారు. -
సాగు చేయాలంటే భయంగా ఉంది
ఖరీఫ్ పంట సాగు చేయాలంటే భయం వేస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రబీలో ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి సొమ్ము చెల్లించేంత వరకూ ఏదీ సక్రమంగా చేయలేదు. దీంతో రోడ్డెక్కాం. గతంలో ఇలా ఎన్నడూ చూడలేదు. – చిట్టీడి వీర వెంకట సత్యనారాయణ, పెరవలిమండలాలవారీగా ఆకుమడుల వివరాలు (హెక్టార్లలో) మండలం సాగు ఆకుమడుల వేసిన విస్తీర్ణం లక్ష్యం ఆకుమడులు రాజమహేంద్ర 1,460 73 8 వరం రూరల్ కడియం 2,137 107 8 రాజానగరం 4,687 234 15 అనపర్తి 3,739 187 100 బిక్కవోలు 6,113 306 200 కోరుకొండ 5,755 288 30 గోకవరం 5,195 260 25 సీతానగరం 5,710 286 150 రంగంపేట 2,815 141 25 చాగల్లు 3,421 171 160 దేవరపల్లి 3,657 183 100 గోపాలపురం 4,216 211 101 కొవ్వూరు 4,507 255 200 నిడదవోలు 7,253 363 300 పెరవలి 3,319 166 130 తాళ్ళపూడి 3,787 189 100 ఉండ్రాజవరం 4,923 246 130 నల్లజర్ల 4,247 212 35 -
కుమార సుబ్రహ్మణేశ్వరునికి అభిషేకాలు
బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వరుని ఆలయంలో స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, షష్ఠి కలసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అభిషేకాల అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నసమారధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఈఓ రామలింగ భాస్కర్ ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
25 నాటికి 80 శాతం నాట్లు
ఈ ఏడాది అధిక ఎండల కారణంగా జూన్ 15కి పూర్తి కావాల్సిన ఆకుమడులు జూలైలో వేయాల్సి వచ్చింది. ఈ నెల 25వ తేదీ నాటికి 80 శాతం వరి నాట్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం. బెంగాలీ కూలీల ఊడ్పుల వలన నారు 25 రోజుల అవసరం ఉండదు. కేవలం 14 రోజుల వయస్సు నారుతోనే నాట్లు వేస్తా రు. దీనివలన సమయం ఆదా కావడంతో పాటు మంచి దిగుబడులు వస్తాయి. జూలైలో నాట్లు పడితే నవంబర్ నెలాఖరుకు కో తలు పూర్తవుతాయి. లేకపోతే డిసెంబర్లో కోతలకు వస్తే ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బందులు వస్తాయి. – మాధవరావు జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం -
నత్తనడకన సా..గుతూ..
ఫ ఖరీఫ్ వ్యవసాయంలో ఎడతెగని జాప్యం ఫ వరి సాగు లక్ష్యం 76,941 హెక్టార్లు ఫ ఆకుమడుల అంచనా 3,847 హెక్టార్లు ఫ ఇప్పటి వరకూ పూర్తయినవి 1,857 హెక్టార్లు ఫ ఇంకా పడాల్సినవి 1,990 హెక్టార్లు ఫ కాలువలకు నీళ్లు వదలడంతో సరిపెట్టిన సర్కారు ఫ పెట్టుబడి కోసం అన్నదాతల ఇక్కట్లు పెరవలి: ఖరీఫ్ సీజన్ జూన్ ఒకటిన ప్రారంభమవుతుంది. జూలై వచ్చేసరికి వరి ఆకుమడులు పూర్తయి, నాట్లు పడే దశ ప్రారంభం కావాలి. కానీ, జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ వరి సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాధారణంగా రైతులు మే నెలలో దుక్కులు దున్ని పొలాలను ఖరీఫ్ సాగుకు సిద్ధం చేసుకుంటారు. జూన్ మొదటి వారంలో కాలువలకు నీరు వదిలిన వెంటనే వరి ఆకుమడులు వేస్తారు. అనంతరం దమ్ములు చేసి, మడులు కట్టి, నాట్లు ప్రారంభిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అయితే జూలై రెండో వారం పూర్తయ్యేసరికే నాట్లు ముగిసేవి. కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో దుక్కులు చేసి, జూలై నెలలో ఆకుమడులు వేస్తున్నారు. దీనికి కారణాలు కోకొల్లలు. అందరి వేళ్లూ ప్రభుత్వం వైపే.. సాగు జాప్యానికి సంబంధించి అందరి వేళ్లూ ప్రభు త్వం వైపే చూపిస్తున్నాయి. రైతులు ముందస్తు సాగు ప్రారంభించాలనే పేరుతో ప్రభుత్వం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు కేవలం నీరు విడుదల చేసి ఊరుకుంది. కానీ, గత రబీలో ధాన్యం అమ్మిన చాలా మంది రైతులకు డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతోంది. మరోవైపు అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న డబ్బులూ ఇవ్వ డం లేదు. ఈ పరిస్థితుల్లో అటు ఆరుగాలం పడిన కష్టానికి ప్రతిఫలం రాక.. ఇటు అప్పులు పుట్టక రైతు లు పెట్టుబడి కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వం బదిలీల ప్రక్రియ కూడా చేపట్టింది. దీంతో, కోరుకున్న చోటు కోసం అధికారులు, సిబ్బంది అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో బిజీ అయిపోయారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులను పక్కన పెట్టేశారు. ఒకవేళ ఎవరైనా వెళ్దామనుకున్నా రైతులు ఎక్కడ ధాన్యం డబ్బులు అడుగుతారోననే భయంతో వెనుకంజ వేశారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు కూడా పూర్తి స్థాయిలో అందించలేదు. అలాగే, విత్తనాలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో కావలసినంతగా లభ్యం కావడం లేదని రైతులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓవైపు సమయం మించిపోతున్న తరుణంలో చేతికి అంది వచ్చే దశలో పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ● పెట్టుబడి ఎలా..? ఏటా ఖరీఫ్ ఆకుమడులు జూన్ నెలలో వేసేవాళ్లం. కానీ, ఈ ఏడాది పెట్టుబడికి సొమ్ము లేదు. గత్యంతరం లేక అప్పులు చేసి ఆకుమడులు వేస్తున్నాం. పంట సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకుని రావాలో తెలియడం లేదు. – వలవల బాలాజీ, వరి రైతు, ముక్కామల సగం కూడా పడని ఆకుమడులు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు 76,941 హెక్టార్లలో జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. దీనికి 3,847 హెక్టార్ల మేర ఆకుమడులు అవసరం. ఇందులో ఇప్పటి వరకూ 1,857 హెక్టార్లలో (సుమారు 48 శాతం) మాత్రమే రైతులు ఆకుమడులు వేశారు. ఇంకా 1,990 హెక్టార్లలో నారు పోయాల్సి ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో పదెకరాల్లో కూడా ఆకుమడులు పడలేదు. ఉదాహరణకు కడియం మండలంలో 107 హెక్టార్ల ఆకుమడులు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 8 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో సకాలంలో పంట పూర్తయి, సజావుగా చేతికొస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
శృంగార వల్లభునికి రూ.31.66 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.31,66,081 ఆదాయం సమకూరింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.నాగేశ్వరరావు, డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్ర కుమార్, సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 104 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.23,89,935, అన్నదానం హుండీ ద్వారా రూ.7,76,146 మేర ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను విజయవంతం చేయాలి ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పిలుపు అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమలాపురం మండలం ఇందుపల్లిలోని ఎ–కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో బుధవారం సాయంత్రం జరగనున్న బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరవుతున్న ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పార్టీ శ్రేణులు భారీఎత్తున స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. -
పోలవరంపై సీఎం పచ్చి అబద్ధాలు
ఫ డయాఫ్రం వాల్ నాశనానికి చంద్రబాబే కారణం ఫ జగన్ హయాంలో గేట్లు సహా అత్యధిక శాతం పనులు పూర్తి ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తాళ్లపూడి (కొవ్వూరు): పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మండిపడ్డారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం జరిగిన పర్యటన సందర్భంగా సీఎం చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. అనంతరం 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం ఒక గేటు పెట్టి, ప్రాజెక్టును చూడటానికి జనాన్ని బస్సుల్లో తరలించి, వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృథా చేశారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు అన్ని గేట్లూ పెట్టారని, ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకూ పూర్తి చేశారని చెప్పారు. దీనిని కావాలనే విస్మరించి, జగన్ హయాంలో కేవలం 4 శాతం పనులే జరిగాయని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో 6 శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, అదే సమయంలో ప్రాజెక్టు 82 శాతం పూర్తయ్యిందంటున్నారని, అటువంటప్పుడు ఇదంతా ఎవరి హయాంలో జరిగినట్లని వెంకట్రావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నాశనమవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినప్పటికీ చంద్రబాబు ఒక్కటి మాత్రమే నిర్మించారని విమర్శించారు. అది కూడా ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు. డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని, చేసిన తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాల్సింది పోయి, ఆ తప్పును జగన్పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల పంపిణీకి రూ.కోట్లు దుర్వినియోగం గత ప్రభుత్వంలో ప్రతి నెలా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తే.. నేడు ప్రతి నెలా చంద్రబాబు తన ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండానే అమలు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కొత్త పథకాలు ప్రారంభించడానికి మాత్రమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలు పెట్టేవారని, కానీ నేడు ప్రతి దానినీ చంద్రబాబు ప్రచారార్భాటానికి వాడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో రౌడీలు ఉన్నారంటున్నారని, ఆయన పార్టీలో ఎంత మంది రౌడీలున్నారని ప్రశ్నించారు. పైగా ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని దోచుకుంటున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై దాడులు చేసి కేసులు పెడుతున్నది ఈ ప్రభుత్వం కాదా అని వెంకట్రావు నిలదీశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పైగా పూర్తి చేశామని 2024 జూన్లో చెప్పారు. పోలవరం అంచనా రూ.55,549 కోట్లు అయినప్పుడు రూ.13,683 కోట్లు అంటే 24 శాతం ఖర్చు చేసి 72 శాతం పూర్తి చేశానని ఎలా అన్నారు? అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జనాన్ని నమ్మించడానికే ఈ కట్టు కథలు చెబుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పచ్చిరొట్టతో పచ్చధనం
జిల్లాలో పంట వివరాలు పచ్చిరొట్ట సాగు భూములు: 40 వేల ఎకరాలు పంపిణీ చేసిన విత్తనాలు: 400 టన్నులు సాగు చేసిన రైతులు: 56 వేల మంది దిగుబడికి వచ్చిన పశుగ్రాసం: 60 వేల టన్నులు వచ్చిన ఆదాయం: సుమారు రూ.6 కోట్లు ఫ మంచి ఫలితాలిస్తున్న సాగు ఫ రైతుకు అదనపు ఆదాయం ఫ ఎకరాకు 20 టన్నుల పశుగ్రాసం ఫ బహుళ ప్రయోజనాలతో ఆనందం పిఠాపురం: అవగాహన ఉంటే సాగులో సిరుల పంటే... కాలానుగుణంగా పంటలు వేస్తే అదనపు ఆదాయమే.. ఒకప్పుడు పచ్చిరొట్ట పంట అంటే ఏముందిలే అనుకునే వారు, ఇప్పుడు అదే అదనపు ఆదాయం తెచ్చే వనరు అయ్యింది. ఏటా రబీ పంట తర్వాత మండు వేసవిలో పొలాలను ఖాళీగా ఉంచేవారు. కానీ ప్రకృతి వ్యవసాయం పెరగడంతో ఎక్కడ చూసినా మండుటెండల్లో కూడా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. వేసవిలోనూ రైతులకు అదనపు ఆదాయం తెచ్చేలా, పశువులకు మేతగా, భూమికి పోషకాలు అందించే పచ్చిరొట్ట సాగుపై అవగాహన పెరిగింది. బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)– పచ్చిరొట్ట పంటలు సాగు చేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏటా రబీ పూర్తయిన తర్వాత మే నెల 15 నుంచి జూన్ 30 లోపు ఈ పంటను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పంట కాలం 45 రోజులు. ఈ ఏడాది పిఠాపురం వ్యవసాయ డివిజన్ పరిధిలో సుమారు 400 ఎకరాల్లో పచ్చిరొట్ట చేశారు. దీని కోసం ఎకరానికి 10 కిలోల చొప్పున ప్రకృతి వ్యవసాయ శాఖ రైతులకు నవధాన్యాల విత్తనాలను అందించింది. ఇటీవల దీనిని రైతులు సాగు చేశారు. మొత్తం 400 ఎకరాల్లో పీఎండీఎస్ విత్తనాలు మరింత సారవంతంగా మొక్కలు రావడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. అమ్మకం... ఆదాయం పచ్చిరొట్ట పంట ఏపుగా పెరగడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. పంట బాగా రావడంతో ఎకరానికి సుమారు 20 టన్నుల వరకూ పోషక విలువలున్న పశుగ్రాసం లభ్యమైంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. వివిధ మిల్క్ డెయిరీలకు చెందిన యజమానులు పచ్చిరొట్ట పశుగ్రాసం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా రోజూ 200 టన్నులకు పైగా పశుగ్రాసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకపక్క భూమి సారవంతం కావడంతో పాటు మరోపక్క రైతుకు అదనపు ఆదాయం వస్తుండడంతో పచ్చిరొట్ట సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సాగు.. లాభాలు బాగు పచ్చిరొట్ట సాగు చేసిన పంట పొలాల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. భూసారం పెరగడంతో పాటు రైతుకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. వీటి సాగుతో కలుపు నివారణ జరుగుతుంది. భూసారం పెరుగుతుంది, భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం అధికమవుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణ, రైతు మిత్రులు వానపాముల వృద్ధి జరిగి మిత్ర పురుగుల శాతం పెరుగుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. భూమి కోతకు గురి కాకుండా కాపాడుతూ పంట దిగుబడి బాగుంటుంది. భూతాపం తగ్గి విపత్తులను తట్టుకునే శక్తి వస్తుంది. నేల సేంద్రియ కర్భనం రెండు శాతం వరకూ పెరిగి సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగి అనేక పోషకాలు పైరుకు అందుతాయి. బీడు భూములు సారవంతమవుతాయి. వేసవిలో పశువులకు గ్రాసం అందుతుంది. పంట వేరు వ్యవస్థ పటిష్టంగా పెరిగి, పంట వాతావరణ ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది. పంట ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు పెరిగి రైతుకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. 365 రోజులు భూమి కప్పబడి ఉండి సకాల వర్షాలకు దోపదపడుతుంది. ఈ గ్రాసం తీసుకున్న పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం అధికమవుతుంది. ఈ విధంగా ఇప్పటికే ఫలితాలు సాధించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాగా ఏపుగా పెరిగి.. నా పొలంలో రబీ అనంతరం పచ్చిరొట్ట సాగు చేశాను. మా పశువులకు మేత అయినా ఉంటుందిలే అనుకున్నాను. తీరా చూస్తే అది బాగా ఏపుగా పెరిగి మంచి పశుగ్రాసం తయారైంది. ఇలా పశువులకు బాగా మేత దొరికింది. ఇంతలో మిల్ డెయిరీల వారు వచ్చి మేత కొనుగోలు చేస్తామన్నారు. నా పొలంలో ఎకరానికి సుమారు 20 టన్నుల మేత వచ్చింది. వారు రూ.20 వేలకు ఎకరం పొలంలో ఉన్న పశుగ్రాసం తీసుకోవడానికి అంగీకరించి తీసుకెళుతున్నారు. –తుమ్మలపల్లి వెంకటరమణ, రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు పచ్చిరొట్ట సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి పరిణామం. అయితే రైతులు పచ్చిరొట్ట పంటను భూమిలో కలియదున్నకుండా ముందుగా పశుగ్రాసం తీసుకుని మిగిలిన వ్యర్థాలను కలియ దున్నుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. మంచి ఫలితాలు భూమికి అందుతాయి. పచ్చిరొట్ట సాగుతో జిల్లాలో పశుగ్రాసం ఒక్కసారిగా పెరిగింది. ఇది పాడి పరిశ్రమకు మంచిది. –ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ -
మత్తులో చెలరేగిపోయారు!
ఫ యువత ఒకరిపై ఒకరు దాడులు ఫ జాతరలో అశ్లీల నృత్యాలు ఫ పెద్దాపురం పట్టణంలో ఘటన పెద్దాపురం: మద్యం, గంజాయి మత్తులో చెలరేగిపోయారు.. రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.. కూటమి ప్రభుత్వంలో కొందరి అండతో ఈ తంతు యథేచ్ఛగా సాగిందనడానికి ఆదివారం అర్ధరాత్రి పెద్దాపురం పట్టణంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంతో భక్తిభావంతో పెద్దాపురం మరిడమ్మ వారి ఆషాఢమాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీధి సంబరాలు జరుగుతుండడం ఆనవాయితీ వస్తోంది. ఇందులో భాగంగా తొలి ఆదివారం స్థానిక దర్గా సెంటర్ చేపల వీధి సంబరం జరిగింది. ఇక్కడ యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఇది పోలీసుల ముందే జరగడం విశేషం. డీజే పేరిట డ్యాన్స్లతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే ఇక్కడ మద్యం, గంజాయి తాగిన కొందరు యువకులు పరస్పర దాడులకు దిగి భయంకర వాతావరణాన్ని సృష్టించారు. ఆ యువకులు సుమారు మూడు చోట్ల స్టేజీ సమీపంలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టుకోవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ మౌనిక, తన సిబ్బంది వచ్చి వారిని తరిమేయడంతో యువత చెల్లాచెదురయ్యారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న చోటే మళ్లీ రక్తం చిందేలా కొట్టుకున్నారు. పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనల్లో సుమారు 15 మందికి గాయాలు కాగా, మూడు ఘటనలకు సంబంధించి ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అశ్లీల నృత్యాల నిర్వహణకు స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లే కారణమని, అందుకే పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎటువంటి కేసూ నమోదు కాకపోవడం గమనార్హం. మద్యం మత్తులోనే ఘర్షణ స్థానిక చేపల వీధి సంబరంలో తగదా పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. సంబరాన్ని తిలకించేందుకు వచ్చిన ఇరువురు యువకుల మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఇరువురూ మద్యం మత్తులో ఉన్నారని, సోషల్ మీడియాలో వాటిని వక్రీకరిస్తూ గంజాయి మత్తు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, కేవలం మద్యం మత్తులో మాత్రమే ఆ యువకులు తీవ్రంగా గాయపర్చుకున్నారన్నారు. పెద్దాపురానికి చెందిన బాలుడు, రాజమహేంద్రవరం సీతంపేట ఎన్టీఆర్ కాలనీకి చెందిన చుక్కా దుర్గారావును అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీధి సంబరాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణంలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో సీఐ విజయశంకర్, ఎస్ఐ మౌనిక పాల్గొన్నారు. -
యుద్ధ ట్యాంకర్.. అదుర్స్
కొత్తపల్లి: ఈ చిత్రం చూశారా.. యుద్ధ ట్యాంకర్ ఇలా పల్లెల్లోకి వచ్చిందనుకుంటున్నారా..! అవును నిజమేనండి. కానీ డమ్మీ యుద్ధ ట్యాంకర్. ఓ యువకుడి నైపుణ్యం నుంచి ఇలా రూపుదిద్దుకుంది. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే దృఢసంకల్పం ఇలా ఆర్మీ పరికరాలను తయారు చేసేలా మార్చింది. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయపురానికి చెందిన పంపన నాగేంద్ర ఈ డమ్మీ యుద్ధ ట్యాంకర్ రూపశిల్పి. ఇతను ఐటీఐ ఫిట్టర్ చదివాడు. ప్రస్తుతం కాకినాడలోనే డ్రైవర్గా పని చేస్తున్నాడు. దేశానికి రక్షణ కవచంలా ఉన్న ఆర్మీలో చేరడం అంటే ఇతనికి ఎంతో ఇష్టం. వారు ఉపయోగించే పరికరాలంటే ఎంతో మక్కువ. అదే ఈ ట్యాంకర్ తయారీకి ఉపయోగపడింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ డమ్మీ ట్యాంకర్ను తయారు చేసినట్లు నాగేంద్ర చెబుతున్నాడు. దీనికి సుమారు రూ.1.80 లక్షల ఖర్చు అయ్యిందని చెప్పాడు. ట్రాక్టర్, ఆటో, మోటారు సైకిళ్లలోని పలు పరికరాలు, ఇనుప రేకులు, సీలింగ్ తయారు చేసే షీట్లు, విద్యుత్ పరికరాలు ఉపయోగించినట్లు వివరించాడు. సుమారు 45 రోజులు శ్రమించి ఈ ట్యాంకర్ను తయారు చేసినట్లు చెబుతున్నాడు. దీని నుంచి ప్రతి 5 సెకన్లకు ఒక తూటా పేలుతుంది. ఇలా ఆరు తూటాలు వస్తాయి. తూటా సుమారు 600 మీటర్ల వరకూ వెళుతుంది. ఈ తూటాలు పేలేందుకు మందుగుండు సామగ్రిని ఉపయోగించాడు. ఆర్మీలో చేరి పరికరాలు తయారు చేయాలన్నదే తన లక్ష్యమని నాగేంద్ర వివరించాడు. ఇప్పటికే ఆర్మీలో ఉపయోగించే ఏకే 47 గన్తో పాటు పలు గన్లు, మినీ యుద్ధ ట్యాంకులు, పలు కాలేజీల నమూనాలు తయారు చేశానన్నారు. ఈ డమ్మీ యుద్ధ ట్యాంకును కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ప్రదర్శనకు ఉంచామన్నారు. ఫ తయారు చేసిన గ్రామీణ యువకుడు ఫ ఆర్మీపై ఉన్న ఆసక్తితో రూపకల్పన -
● అలా... ఎగసిపడుతూ...
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో రక్షణ గోడను దాటి వస్తున్న అలలు అలలు ఎగసి పడుతున్నాయి. ఇవి రెండు రోజుల నుంచి ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డును తాకుతున్నాయి. కడలి కల్లోలంగా మారడంతో కెరటాలు ముందుకు దూసుకొస్తున్నాయి. కెరటాల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురైంది. ఈ రోడ్డులో రక్షణగా వేసిన బండరాళ్ల గోడను సైతం కెరటాలు ఢీకొడుతున్నాయి. దీంతో రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. ఆ దారిలో వెళ్లే వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సందర్శకులు సముద్ర తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. కొత్తపల్లి : -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
తాళ్లపూడి: అన్నదేవపేట పంచాయతీ పరిధి సూరయ్యపేట వైఎస్సార్ కొత్త కాలనీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు, చెవులు, ముక్కు వద్ద పగుల గొట్టారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని తాళ్లపూడి పోలీసులకు, తహసీల్దార్కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఎలిపే రాజు, నూతంగి సురేష్ అన్నారు. దీనిని ఆ పార్టీ నాయకులు పిట్టా శ్రీనివాస్, పోశిన శ్రీకృష్ణదేవరాయులు, కందికొండ సత్యనారాయణ, ఊటాల నంద, గర్భాపు ఈశ్వరరావు, గొరిపర్తి రాజు, పూరూరి హరి తదితరులు తీవ్రంగా ఖండించారు.సముద్రంలో బోటు బోల్తా మత్స్యకారులు సురక్షితంకొత్తపల్లి: సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు కెరటాల ఉధృతికి బోల్తా పడింది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పాడకు చెందిన బొందు మసేను బోటుపై అదే గ్రామానికి చెందిన చేపల అప్పారావు, శ్రీహరిలు సోమవారం తెల్లవారు జామున ఉప్పాడలో నిర్మిస్తున్న మేజర్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లారు. బయలుదేరిన కొద్ది సేపటికే కెరటాల ఉధృతి కారణంగా బోటు బోల్తా పడింది. ఆ ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. హార్బర్ గట్టుకు బోటు ఢీకొనడంతో ధ్వంసమైంది. సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. -
రూ.1,100 కోట్లు వెంటనే విడుదల చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గ్రామ పంచాయతీలకు, మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,100 కోట్లు వెంటనే విడుదల చేయాలని జిల్లా ఎంపీపీల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ సీతారామ్మూర్తికి సోమవారం వారు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం అందజేశామని చెప్పారు. సర్పంచులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం, ఉపాధి హామీ పనుల్లో అవినీతి తదితర అంశాలపై వినతిపత్రం అందజేశామని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీటీసీ సభ్యులు గుర్రాల జ్యోత్స్న (సీతానగరం), మందారపు సీతారత్నం (రాజానగరం), జొన్నకూటి పోసిరాజు (తాళ్లపూడి), సుంకర శ్రీవల్లి (గోకవరం), కార్చెర్ల ప్రసాద్ (పెరవలి), ఉల్లి సూర్యకుమారి (కోరుకొండ), మట్టా వీరాస్వామి (చాగల్లు), ఉండవల్లి సత్యనారాయణ (గోపాలపురం), పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శులు సుంకర వీరబాబు, మందారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రైవేటు’లో నిలువుదోపిడీ
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మరీ ఇష్టానుసారం ఫీజుల దోపిడీ సాగిస్తున్నాయి. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు యూనిఫాం, ఇతర వస్తువులు అంటూ మోత మోగించేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులను ఫీజుల రూపంలో నిలువుదోపిడీ చేస్తున్నాయి. – ఎస్.కిరణ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ ● ఇతర దేవతా విగ్రహాలు కూడా.. ● తరలిరానున్న ప్రముఖులు నాయనార్లు ఎవరంటే.. తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికేయ శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. విజయవంతం చేయాలి ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి. – స్వామి రామానంద, శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి -
విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం
తాళ్లపూడి: మలకపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రతి రోజూ ఇలాగే ఉంటుందా’ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించగా విద్యార్థులు ఉత్సాహంతో సమాధానం చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు సీహెచ్ బాలమణి, సీహెచ్ నెహ్రూజీ, హెచ్ఎం వాసవి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. వైద్యం ప్రారంభించే సమయంలోనే రోగి లేదా వారి బంధువులకు సేవల వివరాలు, ధరలను స్పష్టంగా వివరించాలన్నారు. ఈ సూచనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీజీఆర్ఎస్కు 187 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జిల్లా స్థాయి కార్యక్రమంలో 187 అర్జీలు స్వీకరించినట్లు డీఆర్ఓ సీతారామ్మూర్తి తెలిపారు. జిల్లా అధికారులతో కలసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా మీకోసం కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయవచ్చని, అర్జీ స్థితిగతులు తెలుసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా కూడా పౌర సేవలు పొందవచ్చన్నారు. సత్యదేవునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునితో పాటు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించారు. వెయ్యి వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. -
ధాన్యం బకాయిలపై జవాబు చెప్పండి బాబూ!
● రైతులకు రూ.250 కోట్లు వెంటనే చెల్లించాలి ● వైఎస్సార్ సీపీ నేత చెల్లుబోయిన వేణు డిమాండ్ రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ధాన్యం అమ్మిన రైతులకు 55 రోజులుగా డబ్బులు చెల్లించడం లేదని, జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పార్టీ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వరి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. అలాగే, పొగాకు రైతులు సైతం గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఆక్వా, కోకో, వరి, పొగాకు, మిర్చి, మామిడి ఇలా ఏ రైతూ సంతోషంగా లేరని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విచ్చలవిడిగా ఇసుక దోపిడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక అంటూ ఆర్భాటంగా ప్రచారం చేశారని వేణు అన్నారు. కానీ, కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు నిబంధనలకు విరుద్ధంగా నదీగర్భంలో ఇసుక డ్రెడ్జింగ్ చేసి, కొండల్లా నిల్వలు చేశారని చెప్పారు. ఒక్కో ఇసుక లారీ వద్ద రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ అడ్డంగా దోచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ డ్రెడ్జింగ్లో పట్టుకున్న ఇసుకను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని మత్తులో ముంచుతున్నారు డ్రగ్స్ రహిత రాష్ట్రమంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, కానీ, ప్రజల్ని మత్తులో ముంచుతున్నారని వేణు ఆరోపించారు. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం పాలసీ పుణ్యమా అని 24 గంటలూ లభిస్తున్న మద్యం మద్యం మత్తులో కొంతమంది చేస్తున్న ఆగడాలకు రాష్ట్రంలో ఆడపిల్లలు అఘాయిత్యాలు, హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఒక ఉద్యోగమని చెప్పి, ఇప్పుడు ఇంటికో తాగుబోతును తయారు చేస్తున్నట్టుగా పరిస్థితిని దిగజార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలున్నాయా.. పోలీసు వ్యవస్థ సక్రమంగా పని చేస్తోందా.. కేవలం ప్రతిపక్షాలను నియంత్రించడానికే ఉందా.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి ఉందా అనే అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి అన్నారు. అబద్ధాలతో పాలన శాసన సభ్యులు మారాలని సీఎం చంద్రబాబు అంటున్నారని, కానీ మారాల్సింది ఆయనేనని వేణు అన్నారు. రోజూ అబద్ధాలతో పాలన సాగించడమేమిటని, ప్రజల అవసరాలు తీర్చలేరా అని ప్రశ్నించారు. ‘ప్రతి నెలా పింఛన్లు పంచడమే ముఖ్యమంత్రి కార్యక్రమమా? దీనివల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది’ అని వేణు విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు. -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
కాకినాడ సిటీ: దాళ్వా పంటలో సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మే నెల నుంచి రూ.110 కోట్లు బకాయి పెట్టడంతో జిల్లాలోని రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళనకారులు వివరించారు. ఒక్క తాళ్లరేవు మండలంలోనే 300 మంది రైతులకు రూ.5 కోట్లు, కాజులూరు మండలంలో 400 మందికి రూ.6 కోట్లు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ మొదలైందని, ఇటు పెట్టుబడికి డబ్బులు లేక, అటు పాత బకాయిలు తీర్చలేక నానా ఇక్కట్లూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు కూడా వేయలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు, పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కాజులూరు, ఇంజరం వంతెనలు తక్షణం నిర్మించాలని కోరారు. ఈ సంఘం జిల్లా నాయకులు వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరరావు, దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మరిడమ్మ దర్శనానికి భక్తుల బారులు
పెద్దాపురం: ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే మరిడమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా తొలి ఆదివారం మరిడమ్మ తల్లి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి భక్తులకు సౌకర్యాలు చేపట్టారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు ఎస్ఐ మౌనిక ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం పులిహోర అందజేశారు. ఏటా నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సంస్థలు యాత్రికులకు ఉచితంగా పులిహోర పంపిణీ చేశారు. ఘనంగా చేపల వీధి సంబంరం స్థానిక చేపల వీధి సంబరం అంబరాన్నంటింది. భారీ సంఖ్యలో భక్తులు వీధి సంబంరంలో పాల్గొని సందడి చేశారు. కోలాటం, మ్యూజికల్ నైట్, కాళికావేషాలు, దేవతామూర్తుల వేషధారణలు, భారీ విద్యుద్దీలంకరణల మధ్య వైభవంగా నిర్వహించారు. -
దీనజనోద్దరణలో జీజీహెచ్..
కాకినాడ క్రైం: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎందరో అనాథలు, అభాగ్యులు మన కంట పడతారు. వయసుతో తారతమ్యం లేకుండా అనారోగ్యంతోనో.. కదల్లేని అచేతన స్థితిలోనో కొందరుంటే, మానసిక ఆరోగ్యం క్షీణించి ఒంటిపై ఆచ్ఛాదన కూడా లేని దీనావస్థలో ఇంకొందరు తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని చూసి అయ్యో అనుకుంటాం. వారి దయనీయతని చూసి జాలిపడతాం. చేసేదేం లేక పండో, పదో చేతిలో పెట్టి నిట్టూరుస్తాం. చలించిపోయిన మనసుకి సర్దిచెప్పుకొని బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి బయల్దేరతాం. ఓ మారు వారినీ చూడు దేవుడా.. అంటూ మనసులో స్మరిస్తూ ఇంకెవరితోనో ఆ విషయాన్ని పంచుకొని దిగులు చెందుతాం. ఎక్కడ పుట్టారో.. ఎలా పెరిగారో.. ఎలా జీవించారో.. ఎంత ఉన్నతులో.. ఎంత పేదవారో.. ఎవరి ఆదరణకు నోచుకోక రోడ్డున పడ్డారో ఏవీ తెలియని ఎందరో ప్రాణాలు అసంపూర్తిగా తెల్లారిపోతుంటాయి.మనసులో తడి ఉన్న వారికి సమాజంలో కొదవు లేదు. అభాగ్యులై రోడ్ల వెంట అగమ్యగోచరంగా తిరిగే వారిని చూసి అయ్యో అని వదిలేయకుండా ఏదో చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆర్థిక, కుటుంబ, సామాజిక పరిస్థితుల రీత్యా ఏమీ చేయలేని అసమర్ధత. సామాజిక బాధ్యతగా భావించి ఏదో ఒకటి చేయాలనే వారికోసం కాకినాడ ధర్మాస్పత్రి బాసటగా నిలుస్తోంది. వారు ఎవరినైనా అభాగ్యులను తీసుకువస్తే చేర్చుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఐడీ (ఇన్ఫెక్ట్యయస్ డిసీజెస్) వార్డుగా నామకరణం చేసింది.జీజీహెచ్లో ఐసోలేషన్ వార్డుజీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఈ వార్డునే ఐసోలేషన్ వార్డు లేదా అనాథల వార్డు అని పిలుస్తారు. ఇక్కడ ఎనిమిది పడకలు, గాలి కోసం ఆరు ఫ్యాన్లు ఉంటాయి. పారిశుద్ధ్య సిబ్బంది, ఓ ఎంఎన్వో, ఓ ఎఫ్ఎన్వో రోగులను సంరక్షిస్తుంటారు. ఇద్దరు నర్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. తరచుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రతి రోజు పీజీ వైద్యులు వార్డుకు వచ్చి రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు.మానవత్వం చాలుఅనాథ, శారీరక, మానసిక అనారోగ్య బాధితులు, కుటుంబ సభ్యులు వదిలేసిన దీనులు, రోడ్లపై గాయాలు, పుండ్లతో ఉన్న ఒంటర్లు, గర్భం దాల్చి రోడ్లపై సంచరిస్తున్న అనాథ మహిళలు. బిడ్డలు వదిలేయగా ఇంట్లో మగ్గిపోతున్న అనారోగ్య బాధిత వృద్ధులు. తీవ్ర అనారోగ్యాలతో భిక్షాటన చేస్తున్న వారు, ఇలా ఎవరూ లేని, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు ఎవరినైనా ఐడీ వార్డులో చేర్చవచ్చు. వీరిని చేర్చేందుకు సామాజిక బాధ్యత, మానవత్వం ఉంటే చాలు. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఆరోగ్య శ్రీ కార్డులే కాదు, కనీసం ఆధార్ కార్డుతో కూడా పనిలేదు. ప్రాంతం, కులం, ఆర్థిక స్థితిగతులను తెలిపే ఎటువంటి పత్రాలు అవసరం లేదు. ఆ మాటకొస్తే కనీసం బాధితుడి పేరు తెలియక పోయినా ఈ వార్డులో చేర్చుకుంటారు. చికిత్సలో ఉన్నంత వరకు వీరి సంరక్షణను ఆస్పత్రి చూసుకుంటుంది.అద్దంలా ఐడీ వార్డుఅభాగ్యుల వార్డు కదా.. అధ్వానంగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ వార్డు నిర్వహణ గమనిస్తే ఫ్లోర్లు కూడా అద్దంలా మెరిసిపోతుంటాయి. నిత్యం మూడు పూటలా ముగ్గురు సిబ్బంది ఐడీ వార్డును శుభ్రపరుస్తారు. ఫినాయిల్, సోప్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్లు, టస్కీ స్ప్రేలు, లెమన్ గ్రాస్ ఆయిల్ను ఇందుకు వాడతారు. దోమల నివారణకు మలాథియాన్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. కిటికీలన్నీ మెష్లతో మూసి ఉంచుతారు. ప్రతి వారం బూజులు దులుపుతారు. మేన్మేడ్ ఫ్లోర్ స్క్రబ్బింగ్ డ్రై అండ్ వెట్ మాబ్ యంత్రంతో వార్డును శుభ్రంగా ఉంచుతారు.దాతలూ.. దయ చూపండిఅనారోగ్యాలతో బతుకీడుస్తున్న అనాథల కోసం దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ రోగులకు పండ్లు, వస్త్రాలు సమకూర్చాలనుకునే వారు జీజీహెచ్ సీఎస్ఆర్ఎంవోను 89192 61612 నంబరులో సంప్రదించవచ్చు. తాము చేయాలనుకున్న సేవా కార్యక్రమాన్ని నివేదించి అనుమతులు పొంది అనారోగ్య పీడిత అనాథల సేవలో తరించవచ్చు.సిబ్బంది కాదు.. సేవకులురోగులను ఆప్యాయంగా చూసుకునే సొంతిల్లు వంటిది ఐడీ వార్డు. అక్కడి సిబ్బంది సేవా దృక్పథంతో రోగులను కంటికి రెప్పలా చూసుకుంటారు. మూడు పూటలా రోగులకు పోషకాహారం అందిస్తున్నాం. పారిశుధ్య నిర్వహణ, వార్డులను పరిశుభ్రంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వైద్య సేవల అనంతరం కోలుకున్న వారిని అనాథాశ్రమాలు, ప్రభుత్వ సామాజిక వసతి గృహాలకు సిఫార్సు చేస్తాం. అనారోగ్యంతో ఉన్న అనాథ రోగుల పట్ల ప్రజలు మానవత్వంతో వ్యవహరించి కాకినాడ జీజీహెచ్కు తీసుకురావాలి. అత్యవసర విభాగంలో చేర్చి వైద్యుల సిఫార్సు మేరకు, ఐడీ వార్డు సహాయం కోసం అక్కడ నర్సులను సంప్రదించాలి.– డాక్టర్ లావణ్యకుమారి,సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడఅమ్మలా నర్సుఐడీ వార్డులో అనాథ రోగులు చిన్నపిల్లల్ని మించి యాతన పెడుతుంటారు. సేవలు అందించే వారికి చుక్కలు చూపిస్తారు. వైద్యానికి ఏ మాత్రం సహకరించరు. అటువంటి స్థితిలో ఉన్నవారికి వడ్డి ఇమ్మి అనే స్టాఫ్ నర్సు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. అక్కడి రోగులందరూ ఆమెను సొంత మనిషిలా భావిస్తారు. నిస్సత్తువ ఆవహించి తడబడిన మాటలతో వారు పిలిచే అమ్మా అనే పిలుపు ఆమెకు వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆమె సేవలను అక్కడి వైద్య, వైద్యేతర సిబ్బందితో పాటు వార్డును సందర్శించే అధికారులు, స్వచ్ఛంద సేవకులు ఎంతగానో గొప్పగా చెప్తుంటారు. కటకం నాగమణి అనే మరో నర్సు ఆమె అందిస్తున్న సేవల్లో పాలుపంచుకుని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.కన్నబిడ్డల్లా సాకుతున్నారుఐడీ వార్డులో రోగులు మలమూత్రాలన్నీ మంచం మీదే. అటువంటి వారి పక్కనూ.. వారినీ శుభ్రం చేస్తూ తన కన్న బిడ్డల్లా చూసుకుంటున్న పారిశుధ్య కార్మికుడు మీసాల ప్రభాకర్. కదల్లేని వారికి మంచం మీద.. నడవగలిగే వారిని మరుగుదొడ్లకు తీసుకువెళ్లి శుభ్రం చేసి తీసుకువస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. శరీరం నిండా పుండ్లు, నిస్సత్తువతో ఉండే రోగుల ఆరోగ్య స్థితి మెరుగయ్యేందుకు నిత్యం రెండు సార్లు స్నానం చేయించి సపర్యలు చేస్తున్న ఎంఎన్వో చింతపల్లి వీరబాబు సేవలు సైతం చెప్పుకోదగ్గవే. -
ఆయురారోగ్యాల్లో మునగంగా!
● ఆషాఢంలో మునగ వంటకాలకు ప్రాధాన్యం ● ఎన్నో విశిష్టతల మహోన్నత మాసం ఆలమూరు: తొలకరి జల్లులతో ప్రకృతి శోభను తీసుకువచ్చే ఆషాఢ మాసానికి చారిత్రాత్మకమైన ప్రత్యేకత ఉంది. శుభప్రదమైన ఈ మాసంలో శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికతతో కూడిన సందడి ఉంటుంది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు ఈ మాసం ప్రతీకగా నిలుస్తోంది. గ్రామీణులకు ఆరాధ్యులైన గ్రామ దేవతలకు జాతరలు, నైవేద్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆకాశంలో మేఘావృతమయ్యే మబ్బులు, పిడుగు పాటు శబ్దాలు, చిరుజల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మాసం సొంతం. ఆషాఢమాసంలో లభించే నేరేడు పండ్లు, తాటికాయలు తదితర పోషక పదార్థాలు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రకృతి సిద్ధంగా లభించే లేత మునగాకుతో తయారు చేసే ప్రత్యేక వంటకాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మాసంలో ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో మునగాకు పప్పు లేదా తెలగపిండి మునగాకు కూర చేసుకుని తినడం రివాజుగా మారిపోయింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకం ఇటువంటి సంప్రదాయాలు నేటికీ కొనసాగిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆషాఢ మాసం అందరికీ ఇష్టమైనప్పటికీ నవ దంపతులకు మాత్రం ఈనెల రోజులు ఎడబాటుకు కారణమవుతుంది. నాటి సంప్రదాయాలతో పాటు భావి తరాలు, ఆరోగ్య పరిరక్షణ కోసం శాసీ్త్రయ దృక్పథంతో పాటు ఆధ్యాత్మికతతో ఆరోగ్య సూత్రాలను మిళితం చేసి ఆహార నియమాలను ఏర్పాటు చేశారని పండితులు చెబుతుంటారు. ఆఫర్ల హంగామా కూడా ఈ నెలలోనే ఆషాఢం వస్తోందంటే కార్పొరేట్ స్థాయికి చెందిన ప్రముఖ వస్త్రాలయాలు, జ్యూయలరీ సంస్థలు ఇచ్చే ఆఫర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. నేటి యువతరం ఆషాఢ మాసంలో వచ్చే ఆఫర్ల గురించి తెలిసినంతగా ఈ నెల విశిష్టత గురించి తెలుసుకోకపోవడం శోచనీయమని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాకు వంటకాలు తప్పసరి ఆషాఢ మాసంలో మునగాకును తప్పనిసరిగా తినడతం వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలా ఆషాడంలో మునగాతో కలిపిన కూరలు తినడం వల్ల ఒంటికి వేడి చేసి వర్షాకాలంలో కురిసే వర్షాలకు చలువ చేసే ఒంటిని సమ శీతోష్ణ స్థితిలో ఉంచుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వర్షాకాలంలో మునగాకు లేతగా దొరకతుండటంతో తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల ఒంటికి ఎన్నో పోషక విలువలు అందుతాయి. అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను కూడా నివారిస్తుంది. అలాగే మునగాకు బాలింతలకు, గర్భిణులకు అవసరమయ్యే విటమిన్ ఎ అందించి కంటి సమస్యలను నివారిస్తుందని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ మునగాకు కొంచెం చేదు, వగరు రుచుల కలగలిపి ఉండటంతో మహిళలు ఎక్కువగా కందిపప్పు, పెసరపప్పు తదితర వాటితో వంటకాలు చేసి వాడుతుంటారు. మరి కొంతమంది శ్రేష్టమైన నువ్వులతో తయారైన తెలగపిండితో మునగాకును కలిపి కూర చేసుకుని తింటారు. -
సృజనాత్మక ఆవిష్కరణలు చేయాలి
రాజానగరం: విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలని, తద్వారా అనేక మార్పులను సాధించవచ్చని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్శర్మ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో రెండు రోజులపాటు జరిగిన జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి 58 మంది మేథావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొని సమకాలీన అంశాలపై చర్చించారు. భూమిపై పరిమితంగా ఉన్న వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ముంబైకి చెందిన ప్రొఫెసర్ చేతన్ సోలంకి ‘పర్యావరణ మార్పుల’ పై, రసాయనశాస్త్ర ఇంజినీర్ ఆచార్య జీడీ యాదవ్ ‘గ్రీన్ హైడ్రోజన్’ పై అవగాహన కలిగించారు. చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ప్రొ చాన్సెలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ● విద్యార్థులకు ప్రభుత్వ మాజీ సీఎస్ సమీర్శర్మ పిలుపు ● జీజీయూలో ముగిసిన జాతీయ సదస్సు -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
కాట్రేనికోన: మండలం గచ్చకాయలపోరకు చెందిన మత్స్యకారుడు మూదే సుబ్బారావు (55) ఆదివారం రాత్రి అల్లిపర్రకు వెళ్లే వరి కాలువలో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రాత్రి వేళ అల్లిపర్ర భూమికి చేపల వేటకు వెళ్లిన సుబ్బారావు ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. అల్లిపర్రకు వెళ్లే వరి కాలువలో అతడి మృతదేహం కనపడడంతో వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహంపై చేపల కోసం వేసిన వల, చేపలతో ఉన్న సంచి మొలకు ఉన్నాయి. సుబ్బారావుకు భార్య లక్ష్మి, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు ఉన్నాయి. గ్రామ పెద్దల సహకారంతో కుటుంబ సభ్యులు పోలీసులకు, తహసీల్దార్కు, మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వీఆర్ఓ శవ పంచనామ జరిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అవినాష్ తెలిపారు. కొనసాగుతున్న దర్యాప్తు కడియం: మండలంలోని కడియపులంకలో సుమారు 320 కేజీల గంజాయిని వైజాగ్ నార్కోటిక్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కేసు మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు రెండో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. ఇక్కడి నుంచి లారీని కిరాయికి మాట్లాడుకున్న వ్యక్తితో పాటు, భోపాల్లో మొక్కలు దిగుమతి చేసుకునే రైతు, లారీ యజమాని తదితరులను ఇక్కడికి రప్పించి, వారి నుంచి వివరాలు సేకరించే పనిలో నార్కోటిక్స్ బృందం నిమగ్నమైంది. కాగా రాజస్థాన్కు చెందిన లారీ డ్రైవర్పై గంజాయి, ఓపియం రవాణాకు సంబంధించి రెండు కేసులు ఉన్నట్లు, అలాగే తన సొంత ప్రాంతంలో గలాటా కేసు కూడా నమోదైనట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ప్రస్తుత కేసుకు సంబంధించిన అందరి కాల్డేటాను సేకరించి, భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసును మొత్తం నార్కోటిక్స్ బృందమే పర్యవేక్షిస్తోంది. ఇక్కడి పోలీస్లను బందోబస్తు వరకు మాత్రమే పరిమితం చేసినట్లుగా చెబుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మా పంట పండింది
గతంలో ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదు. వ్యాపారులు చేల వద్దకే వచ్చి దింపు తీసుకుని, వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.13 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్ ఏర్పడటంతో మా పంట పండింది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు వ్యాపారులే వస్తున్నారు గతంలో వ్యాపారుల చుట్టూ మేం తిరిగే వాళ్లం. అటువంటిది నేడు వ్యాపారులే మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర ఎప్పుడూ చూడలేదు. దిగుబడి బాగుంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది. – నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు వచ్చింది వచ్చినట్టు.. కొబ్బరికి డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాయల దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ఈ ధరలున్నాయి. ఇలా ఎంత కాలం ఉంటాయో తెలీదు. అందుకే కొబ్బరి కాయలు నిల్వలు వేయటం లేదు. వచ్చింది వచ్చినట్టు మార్కెట్కు తరలిస్తున్నాం. – అడబాల బ్రహ్మయ్య, కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు -
చిగురిస్తున్న ఆశలు
కదలని లో గ్రేడ్ పొగాకు బేళ్లు లో గ్రేడ్ పొగాకు అడిగే నాథుడు లేక రైతుల ఇళ్ల వద్ద నిల్వలు కదలని పరిస్థితి కనిపిస్తోంది. ఏటా 15 నుంచి 20 శాతం లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి అవుతుంది. ఈ రకానికి గత రెండేళ్లూ మార్కెట్లో డిమాండ్ ఏర్పడి, ట్రేడర్లు అధిక ధరకు కొనుగోలు చేశారు. గత ఏడాది మార్కెట్లో లో గ్రేడ్ పొగాకు కిలో రూ.270 పలికింది. ఈ ఏడాది ఇంత వరకూ లో గ్రేడ్ పొగాకును ట్రేడర్లు కొనుగోలు చేయలేదు. గత ఏడాది కొనుగోలు చేసిన లో గ్రేడ్ పొగాకు నిల్వలు సుమారు 10 మిలియన్ల కిలోలు ఇంకా ఆయా కంపెనీల వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రకం పొగాకును కొన్ని కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. ఈ ఏడాది 10 నుంచి 15 శాతం లో గ్రేడ్ పొగాకు పండినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. ఫ మరింత పెరిగిన పొగాకు ధర ఫ కిలోకు గరిష్టంగా రూ.300కు చేరిక ఫ ఇప్పటి వరకూ రూ.642.93 కోట్ల పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: వారం రోజులుగా ధర స్వల్పంగా పెరుగుతూండటంతో పొగాకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 22 వరకూ కిలో గరిష్ట ధర రూ.290 ఉండగా, 24న రూ.290, 25న రూ.291, 26న రూ.293, 27న రూ.296 వరకూ పెరిగి, శనివారం ఏకంగా రూ.300కు చేరింది. సగటు ధర కూడా స్వల్పంగా పెరగడంతో మార్కెట్పై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేలం కేంద్రాలకు బేళ్లు తక్కువగా తెస్తున్నారు. వేలానికి రోజుకు 5 వేల నుంచి 6,400 వరకూ బేళ్లు రాగా, రెండు రోజుల నుంచి ఆ సంఖ్య తగ్గింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలకు శనివారం 4,396 బేళ్లు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 2,616 బేళ్లు కొనుగోలు చేయగా, 1780 బేళ్లు అమ్ముడుపోలేదని వివరించారు. ఒకవేళ ముందుముందు ధర పెరిగితే ఇప్పుడు అమ్ముకుంటే నష్టపోతామని రైతులు అంటున్నారు. ఏటా ముందుగా అమ్ముకుంటున్న రైతులు నష్టపోతూండగా, చివరిలో అమ్ముకుంటున్న వారు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 23.53 మిలియన్ల కిలోల కొనుగోలు రాజమహేంద్రవరం రీజియన్లోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి 77 రోజుల పాటు వేలం నిర్వహించారు. ఇప్పటి వరకూ రూ.642.93 కోట్ల విలువైన 23.53 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దీనిలో ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) పొగాకు 22.48 మిలియన్ల కిలోలు, బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు 10,45,242 కిలోలు ఉందని బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ పొగాకు కిలోకు రూ.275.03, బీఎస్ పొగాకుకు రూ.236.95 చొప్పున సగటు ధర లభించింది. శనివారం నాటికి ఐదు వేలం కేంద్రాల్లో మొత్తం 1,82,703 బేళ్లు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎల్ఎస్ పొగాకు 1,75,025 బేళ్లు, బ్లాక్ సాయిల్ బేళ్లు 7,678 ఉన్నాయి. కిలోకు గరిష్టంగా రూ.300, కనిష్టంగా రూ.220, సగటున రూ.273.24 చొప్పున ధర లభించినట్టు ప్రసాద్ వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 7.31 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 7.87, జంగారెడ్డిగూడెం–2లో 7.42, కొయ్యలగూడెంలో 6.64, గోపాలపురం వేలం కేంద్రంలో 7.76 మిలియన్ల కిలోల చొప్పున విక్రయాలు జరిగాయని తెలిపారు. -
కొబ్బరి ధరహాసం
ఫ వెయ్యి కాయలకు రూ.21 వేలకు పెరిగిన రేటు ఫ కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో తగ్గిన దిగుబడులు ఫ మన కొబ్బరికి డిమాండ్ పెరవలి: కొబ్బరి కాయలకు మంచి ధర లభిస్తూండటంతో రైతులు, వ్యాపారులు ఖుషీగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట జరిగిన ప్రయాగరాజ్ కుంభమేళాతో మొదలైన కొబ్బరి ధరల పెరుగుదల నేటికీ కొనసాగుతూనే ఉంది. గతంలో నాణ్యతను బట్టి వెయ్యి కాయలకు రూ.5,500 నుంచి రూ.6,500 చెల్లించేవారు. అటువంటిది కుంభమేళా దగ్గర నుంచి కొబ్బరి ధర క్రమంగా పెరుగుతూ నేడు రూ.21 వేలకు పెరిగింది. కోనసీమ జిల్లాలోని అంబాజీపేట మార్కెట్లో ఏకంగా రూ.22 వేలకు కూడా ధర ఎగబాకింది. దీంతో, ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దండిగా దిగుబడిమన జిల్లాలో 8,979 హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు చేలు, పుంత, చెరువు గట్లు, లంక భూముల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. పెరవలి మండలంలోని కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి గ్రామాల్లో 400 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గతంలో ఎకరానికి ప్రతి దింపునకు 600 నుంచి 800 కాయలు వచ్చేవి. ప్రస్తుతం తోటలు ఆరోగ్యంగా ఉండటంతో 1,200 నుంచి 1,500 కాయల దిగుబడి వస్తోంది. గతంలో ధర ఉంటే దిగుబడి ఉండేది కారు. ప్రస్తుతం దిగుబడితో పాటు మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో గిట్టుబాటు ధర కూడా లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన కొబ్బరికి డిమాండ్ వచ్చిందిలా.. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా పడిపోయాయి. దీంతో, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని కొబ్బరికి డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల వరకూ కొబ్బరికాయల ఎగుమతులు జరుగుతున్నాయి. గతంలో కొబ్బరి దింపు తీయండంటూ వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగేవారు. నేడు రైతుల చుట్టూ వ్యాపారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 40 రోజులకు ఒక దింపు తీసేవారు. అటువంటిది ఇప్పుడు వ్యాపారులు రైతులకు ముందుగానే సొమ్ము చెల్లించి మరీ 30 రోజులకే కాయలు దింపుతున్నారంటే కొబ్బరికి ఏవిధంగా డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
మోసం.. చంద్రబాబు నైజం
తాళ్లపూడి (కొవ్వూరు): మోసం చేయడం చంద్రబాబు నైజమని, మోసగాడిని జనం నమ్మరని తెలిసి, వేషగాడు పవన్ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చి, ప్రజలను మళ్లీ మోసం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కొవ్వూరు లిటరరీ క్లబ్ వద్ద బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేణు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకుడు గొందే శ్రీనివాసరెడ్డి ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎల్ఈడీ తెరపై చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూపించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, ఇసుక, మట్టి, మద్యం, మైనింగ్ ఇలా అన్నింటిలోనూ దోపిడీ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యేలపై చంద్రబాబు కోప్పడ్డారంటూ పెద్ద కథనాలు ఇస్తారని అన్నారు. ప్రజల పట్ల వైఎస్సార్ సీపీకి బాధ్యత ఉందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, చంద్రబాబు మోసాలను జనంలోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ, ఇచ్చిన మాట అమలు చేయకుండా మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. 2019లో కూడా ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు తూతూమంత్రంగా పథకాలు అమలు చేసి, చేతులు దులుపుకొన్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని గుర్తు చేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఏడాది పాలన పూర్తయినా ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయని విషయాన్ని ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే 2029లో అధికారం మనదేనని అన్నారు. ఆఖరి ఆరు నెలల్లో ఏమీ చేయలేమని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. మనం చేసిన మంచి, కూటమి నేతలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పథకాలు అమలు చేయలేదని అడిగితే నాలుక మందమని చంద్రబాబు అంటున్నారని, ఎవరి నాలుక మందమో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫ జనం నమ్మరని తెలిసి వేషగాడి సాయంతో అధికారం ఫ వైఎస్సార్ సీపీ నేత చెల్లుబోయిన వేణు విమర్శ ఫ కొవ్వూరులో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం -
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. – కె.గంగమణి, విద్యార్థిని సాగు విధానాలు తెలుస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది. – పి.ఝాన్సీ, విద్యార్థిని క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. – ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా -
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని బెదిరించి దోచుకోవడంతో కేసు ● పోలీసుల అదుపులో నలుగురు ● పరారీలో ఇద్దరు రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారని సీఐ వివరించారు. -
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి
అమలాపురం రూరల్: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కొత్తపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త కాలాడి అచ్చిబాబు, అతని కుటుంబ సభ్యులు మొల్లేటిమొగ గ్రామంలో తమపై దాడి చేసి తాటాకు ఇంటిని కూల్చేసి డబ్బు, బంగారం దోచుకున్నారని బాధితులు కాలాడి రామలక్ష్మి, సూరిబాబు దంపతులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నకళ్లను శనివారం స్థానిక విలేకరులకు వారు అందజేశారు. గత నెల 26న తన భర్త చేపల చెరువు పట్టుబడికి వెళ్లిన సమయంలో అచ్చిబాబు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు 30 మంది వచ్చి తమపై దాడిచేసి ఇంటి కూల్చేసి తమను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తమ పాకను కూల్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మించారని, కుమార్తె పెళ్లి కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.6.5 లక్షలు, ఐదు కాసులు బంగారాన్ని దోచుకున్నారని రామలక్ష్మి తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. మొల్లేటిమోగలో 30 ఏళ్లుగా ఉంటున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ లేక సామాన్లు రోడ్డుపై ఉన్నాయని, కొన్ని సామాన్లు కాలువలో పడేశారని, తానూ, తమ కుమార్తెలు బట్టలు మార్చుకునే స్థలం లేకుండా చేశారని రామలక్ష్మి అవేదన వ్యక్తం చేశారు. గుడిసె కూల్చి నిరాశ్రయులను చేశారు బంగారం, రూ.6.5 లక్షలు దోచేశారు కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు -
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు ● రైతుల ద్వారా సాగుపై అవగాహన ● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు అంకితమయ్యేలా శిక్షణ ● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం అంటున్న అధికారులు పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు. -
సిటీ కేబుల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల ఆస్తి నష్టం అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్టాప్ బాక్స్లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన యంత్ర పరికరాలు -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు ● రూ.65 లక్షల విలువైన బంగారం స్వాధీనం కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
320 కేజీల గంజాయి స్వాధీనం
దర్యాప్తు చేస్తున్న విశాఖ నార్కోటిక్స్ సిబ్బంది కడియం: మండలంలోని కడియపులంక వద్ద లారీలో సుమారు 320 కేజీల గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్స్ బృందం స్వాధీనం చేసుకుంది. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్, క్లీనర్లను పోలీస్స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖకు చెందిన నార్కోటిక్స్ సూపరింటెండెంట్ రాజన్కుమార్, ఐదుగురు సిబ్బంది శుక్రవారం రాత్రి కడియపులంక వే బ్రిడ్జి వద్ద ఒక లారీని నిలిపివేసి పోలీసు స్టేషన్కు తరలించారు. లారీని క్షుణ్ణంగా పరిశీలించగా, డ్రైవర్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేబిన్లో ప్యాకెట్ల రూపంలో ఉన్న గంజాయిని గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నుంచి నార్కోటిక్స్ బృందం సంబంధిత వ్యక్తులను దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి కడియంలో ఉంటూ తన రాష్ట్రంలోని రైతులకు మొక్కలను సరఫరా చేస్తుంటాడు. పదేళ్లుగా ఇతను ఈ వ్యాపారంలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ట్రాన్స్పోర్టు కంపెనీ ద్వారా ఒక లారీని కిరాయికి మాట్లాడుకుని మొక్కలు లోడు చేసి పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే సదరు లారీ గోధుల లోడు తీసుకు వచ్చి ఈనెల 25న హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న మిల్లులో దిగుమతి చేశాడు. అక్కడి నుంచి గోకవరం వెళ్లి గంజాయిని లోడు చేసుకుని, తిరిగి వెనక్కి వచ్చి మొక్కలు లోడు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న నార్కోటిక్స్ బృందం శుక్రవారం లారీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తరం..దక్షిణ ఉంటేనే..
● బదిలీల సిఫార్సుకోరుకున్న చోటు ఇష్టారాజ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ కూడా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,271 ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా.. ఐదేళ్లు పూర్తయి బదిలీకి అర్హత పొందిన వారు 1,113. వీటిలో 904 రిక్వెస్ట్లు ఉన్నాయి. వీరి బదిలీలు అంతర్ జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నా కౌన్సెలింగ్ మాత్రం ఆయా జిల్లాల పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి చెందిన ఇద్దరు గిరిజన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సొంత ప్రాంతాలైన ఏజెన్సీకి బదిలీ కోరుకున్నారు. అసలు ఏజెన్సీకి వెళ్లడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితులున్నా.. వీరికి అవకాశం ఇవ్వకుండా సిఫారసు లేఖ తప్పనిసరి అని చెప్పారు. దీంతో, వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్పై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మెరిట్కు పాతరేస్తున్నారు. కూటమి నేతల సిఫారసు లేఖలకే పెద్దపీట వేస్తున్నారు. ఎవరైనా కోరుకున్న చోటు దక్కించుకోవాలనుకుంటే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి ఎడాపెడా లేఖలు ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నేతల సిఫారసులు ఆధారంగా బదిలీలకు తెర తీయడంతో సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో జరిగిన బదిలీని కూటమి నేతల సిఫారసుతో నిలుపు చేయించుకున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ బాగోతం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను కూడా స్వయంగా కూటమి నేతలనే ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితిలోకి ఆయన జారిపోయారు. బదిలీకి అర్హులు 616 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్, ఇంజినీరింగ్ తదితర అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై, ఆదివారం వరకూ జరగనుంది. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించిన విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల బదిలీలకు కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చైర్మన్గా ఉన్న కమిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 684 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో ఐదేళ్లు పూర్తి చేసిన 616 మంది బదిలీలకు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం 1 నుంచి 205 వరకూ సీరియల్ నంబర్లు ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం 206 నుంచి 410 నంబర్ వరకూ, ఆదివారం 411 నుంచి 616 నంబర్ వరకూ బదిలీలు చేపట్టాలి. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలున్న వారికే బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల జాబితా ప్రకారమే.. ఏజెన్సీలో సర్వీసు, దివ్యాంగులు, భార్యాభర్తల వంటి అంశాలకు బదిలీల కౌన్సెలింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలను బుట్టదాఖలు చేసి, నేతల సిఫారసు లేఖలున్న వారికి మాత్రమే కోరుకున్న చోటు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు పంపించిన సిఫారసు లేఖల్లో పేర్కొన్న జాబితాను అనుసరించే బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఏ సచివాలయంలో ఏ పోస్టుకు ఎవరిని బదిలీ చేయాలో ముందుగానే జాబితా రూపొందించి, సిఫారసు లేఖలు జత చేసి మరీ పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితా ప్రామాణికంగానే బదిలీలు చేస్తున్నారని కౌన్సెలింగ్లో పాల్గొని బయటకు వస్తున్న అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ జాబితాలో ఉన్నవారు 1, 2, 3 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని హోల్డ్లో పెడుతున్నట్లు చెబుతున్నారు. మెరిట్ జాబితా టాప్–10లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనబెడుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు విలేజ్ అసిస్టెంట్లు సిద్ధపడుతున్నారు. సొమ్ములిస్తేనే సిఫారసు లేఖలు కోరుకున్న సచివాలయానికి బదిలీ కావలంటే మొదట గ్రామ టీడీపీ కమిటీ సభ్యుల ఆశీస్సులుండాలి. వారు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ఈవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు నిర్ణయించి, కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈవిధంగా వీలునుబట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ముడుపులు గుంజారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం; కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్; తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతలు వసూళ్ల పర్వాన్ని అడ్డగోలుగా కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.35 వేల జీతంతో పని చేసే చిరుద్యోగులని కూడా చూడకుండా ముక్కుపిండి మరీ వసూలు చేశారని అంటున్నారు. కూటమి ఏలుబడిలో బది‘లీలలు’ మెరిట్కు పాతర సిఫారసు లేఖకు రేటు ఫిక్స్ చేసిన ప్రజాప్రతినిధులు ఆ తరువాతే కావాల్సిన చోటుకు బదిలీ కౌన్సెలింగ్లో అధికారులు లేఖలు అడుగుతున్నారని సచివాలయ అసిస్టెంట్ల ఆరోపణ ఇవిగో ఉదాహరణలు కోనసీమ జిల్లా రాజోలు దీవికి చెందిన మెరిట్ ఉన్న ఒక అసిస్టెంట్ శుక్రవారం నాటి కౌన్సెలింగ్లో తాను కోరుకున్న మండలం కోసం అభ్యర్థించగా.. అక్కడి ప్రజాప్రతినిధి లేఖ ఉందా అని కౌన్సెలింగ్లోనే నేరుగా అడగడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి రాజోలు సబ్ డివిజన్లో 9, పి.గన్నవరం సబ్ డివిజన్లో 20 పోస్టులు ఉన్నాయి. మెరిట్లో ముందు వరుసలో ఉన్నా సిఫారసు లేఖ అవసరమేమిటని ప్రశ్నించిన పాపానికి ఆ పోస్టును హోల్డ్లో పెట్టేశారు. పైగా, అతడిని ఏజెన్సీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా అని అడిగారంటున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి స్పౌజ్ కోటాలో భార్యాభర్తలు స్థానికంగా ఏదైనా మండలంలో అవకాశం ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకున్నారు. వారిలో భర్తకు స్థానికంగా అవకాశం కల్పించి, భార్యను మాత్రం దూరంగా వేరే మండలానికి ఖాయం చేశారని తెలియవచ్చింది. 80 శాతం దివ్యాంగుడైన ఒక అసిస్టెంట్ను కూడా సిఫారసు లేఖ లేకుండా ఏమీ చేయలేమని చెప్పారంటే కౌన్సెలింగ్ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలున్నారు.. స్థానికంగా అవకాశం కల్పించాలని, పిల్లలకు స్కూళ్లలో ఫీజులు చెల్లించేశామని రాజోలు ప్రాంతంలో ఆప్షన్ పెట్టుకున్న వారికి ఎక్కడో దూరంగా ఉన్న ఐ.పోలవరం మండలం వెళ్లాల్సిందిగా సూచించారని తెలియవచ్చింది. రంపచోడవరం ఏజెన్సీలో మూడేళ్లు దాటి పని చేస్తున్న ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్కు కాకినాడ జిల్లా శంఖవరం లేదా రౌతులపూడి మండలాల్లో ఆప్షన్ ఇచ్చారు. అయితే అక్కడకు నేతలు వేరే వారికి సిఫారసు చేయడంతో ఈయనను హోల్డ్లో పెట్టారని అంటున్నారు. ఏజెన్సీలో అంత కాలం పని చేసినా సిఫారసు లేఖ లేదనే కాారణంతో అవకాశం కల్పించకుంటే ఇక కౌన్సెలింగ్కు అర్థమేముంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తొండంగి మండలంలో ఆప్షన్ పెట్టుకున్న మరో అసిస్టెంట్ను కూడా నేతల సిఫారసు లేఖ లేదనే కారణంతో పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. కాకినాడకు చెందిన ఒక మహిళా అగ్రికల్చరల్ అసిస్టెంట్ దగ్గర్లో ఉన్న కాకినాడ రూరల్ లేదా కరప మండలాలకు ఆప్షన్ పెట్టుకున్నారు. కాకినాడ రూరల్ నుంచి సిఫారసు లేఖ లేదనే కారణంతో తుని నియోజకవర్గానికి పంపించేశారు. -
కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకూ అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో చెప్పి చంద్రబాబు మోసం చేశారని, గత ఎన్నికల్లో ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ’ అని హామీ ఇచ్చి ఎవ్వరికీ గ్యారంటీ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రవాణా వాహనాల ఫిట్నెస్ను రవాణా శాఖ నుంచి ప్రైవేటు సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించిన నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలను వివరించేందుకు వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధులు, కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన శనివారం నగరంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘వాహన మిత్ర’ పేరిట నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 వేల చొప్పున అందించారని, కూటమి ప్రభుత్వం ఆవిధంగా ఇవ్వడం లేదని అన్నారు. రెక్కాడితేనే కానీ డొక్కాడని కార్మికులపై ప్రైవేటు సంస్థల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానం అమలు చేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో వచ్చే నెల 1న తలపెట్టిన చలో రాజానగరం నిరసన కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములవుతామని భరత్రామ్ ప్రకటించారు. ఇప్పటికై నా ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను రత్ ప్రస్తావించారు. దీనిపై తాము పోరాడామని గుర్తు చేశారు. అలాగే ఒక దళిత బాలికను మోసం చేసి, బలవంతపు అబార్షన్ చేయించి, పసి బిడ్డ మరణానికి కారకులైన ఘటనను కూడా ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆరు నెలలుగా తిరుగుతూంటే, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పావన గోదావరిలో మురుగు నీరు కలుస్తూంటే పట్టించుకోకపోవడం శోచనీయమని భరత్ విమర్శించారు. తాను ఎంపీగా ఉండగా కేంద్రం నుంచి రూ.88 కోట్లు మంజూరు చేయించి, మురుగునీటి శుద్ధికి 40 ఎంఎల్డీ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా దీనిని ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు. దీంతో, మురుగునీరు కలసి గోదావరి కలుషితమవుతోందన్నారు. గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేసి, అక్రమంగా దోచుకుంటున్నారని, దీంతో, ఉచిత ఇసుక అనేది ఎక్కడా అమలు కావడం లేదని భరత్రామ్ పేర్కొన్నారు. -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రారంభమైంది. భక్తులు క్యూ లైన్లలో ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం, విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామివారికి వందలాది మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. సుమారు 5 వేల మందికి అన్నసమారాధన నిర్వహించినట్లు ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. నూతన ఆలయ నిర్మాణానికి కృషి పెరవలి: జీర్ణోద్ధరణకు వచ్చిన అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆలయ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఇ.సుబ్బా రావు శనివారం పరిశీలించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు పరిశీలనకు వచ్చానని, గతంలో ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలు వాస్తవమేనని గుర్తించామని చెప్పారు. ఈఓ మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత ఆలయాన్ని 50 ఏళ్ల క్రితం నిర్మించారని, ప్రస్తుతం జీర్ణోద్ధరణకు వచ్చిందని తెలిపారు. అంతే కాకుండా జాతీయ రహదారి విస్తరణ పనులతో రోడ్డు ఎత్తు పెరిగి, గుడి ఐదడుగుల పల్లంలో ఉందని, దీని వలన వర్షాలు కురిసినప్పుడు ఆలయంలోకి నీరు వస్తోందని వివరించారు. ఆలయ శ్లాబ్ కూడా పాడైపోయి, వానలు కురిసినప్పుడు శ్లాబ్ నుంచి నీరు కారిపోతోందని చెప్పారు. అక్కడక్కడ శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నూతన ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని సుబ్బారావు తెలిపారు. -
బాబు మేనిఫెస్టో మోసాలనుప్రజల్లోకి తీసుకువెళ్తాం
● జిల్లా వ్యాప్తంగా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టో పేరిట చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, వారు కూటమి నాయకులను నిలదీసేలా చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ఇస్తానంటూ నోటికి వచ్చి అబద్ధాలు చెప్పి, నమ్మిన ప్రజలను చంద్రబాబు మోసగించారని, ఇదే ఆయన నైజమని విమర్శించారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చవా బాబూ! అధికారంలోకి రాగానే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తానన్నావ్. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావ్. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నావు. మహిళలకు ఉచిత బస్సు అన్నావు.. లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తానని ఇలా వందల అబద్ధపు హామీలు గుప్పించి ప్రజలను మోసగించావ్’ అని దుయ్యబట్టారు. కేవలం కొంత మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు వేసి, లక్షల మందిని వంచించారని అన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలంతా ఇప్పటికే గ్రహిస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు ఉచిత ఇసుక పేరుతో అడ్డంగా దోచుకుంటున్నారని వేణు ఆరోపించారు. లారీ ఇసుకకు కూటమి ఎమ్మెల్యేలు రూ.2 వేల నుంచి రూ.2,500 వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య ఇసుక దోచుకున్నారని, 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీని నియంత్రించి ప్రభుత్వానికి ఏడాదికి రూ.700 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,500 కోట్ల ఆదాయం సమకూర్చారని అన్నారు. గ్రామగ్రామాన విచ్చలవిడిగా బెల్టుషాపులు తెరిచారన్నారు. ఎటువంటి అనుమతులూ లేకుండానే అదనపు గదులతో మద్య షాపులు బార్లలా మారిపోయాయన్నారు. దీనివలన అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ను విమర్శించడానికే రాష్ట్ర హోం మంత్రి పని చేస్తున్నట్లున్నారని వేణు విమర్శించారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు, నేరాలపై దృష్టి సారించిన దాఖలాలు లేవన్నారు. ఏడాది పాలనలో చేయనిది.. 100 రోజుల్లో గంజాయిని నిర్మూలించేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ఆలోచన చేయాలని వేణు కోరారు. ఈ అంశాలన్నింటినీ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిశీలకులు వీరే.. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆదివారం నుంచి నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తామని వేణు చెప్పారు. అనంతరం, మండల, గ్రామ స్థాయిల్లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులను నియమించామని తెలిపారు. రాజమండ్రి సిటీకి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాజమండ్రి రూరల్కు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాజానగరానికి పార్టీ నేత మేడా గురుదత్ ప్రసాద్, అనపర్తికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కొవ్వూరుకు ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి, గోపాలపురానికి ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, నిడదవోలుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు(బాబు)లను నియమించామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో విజయవంతం చేయాలని వేణు కోరారు. -
వంచనపై.. జనం బాట
● చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం ● హామీలు నెరవేర్చే వరకూ వారి పక్షాన పోరాటం ● ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు ● కూటమి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు ● ఏదైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం ● 3 దశల్లో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ ● జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: ‘సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోంది. చంద్రబాబు చేస్తున్న దగాను క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటం చేద్దాం’ అంటూ వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు, అభిమానులనుద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన బొత్స ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే బాధ్యత తీసుకుని పోరాడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ కూడా సక్రమంగా అమలు చేయకపోయినా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నారని జనంలోకి వెళ్లి అడుగుతామన్నారు. ఇందులో భాగంగానే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మూడంచెల్లో జరుగుతుందని, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ డాక్యుమెంట్ చూపించారు. చంద్రబాబు ఇచ్చిన బాండ్లు, మాజీ సీఎం జగన్ ఇచ్చిన పథకాలను కూటమి సర్కారు ఎలా ఎగ్గొడుతోంది, చంద్రబాబు మోసాలతో ప్రజలకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు), వైఎస్సార్ సీపీ నేత మేడా గురుదత్ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర తెలుకుల, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ తదితరులు పాల్గొన్నారు. -
పేద పిల్లల చదువుకు.. ఆర్టీసీ తోడు
● బస్ పాస్ల జారీకి శ్రీకారం ● 12 ఏళ్లలోపు విద్యార్థులు, 18 ఏళ్ల లోపు విద్యార్థినులకు, దివ్యాంగులకు ఉచితం ● ఇతర ప్రయాణికులకు రాయితీ సౌకర్యంరాజమహేంద్రవరం సిటీ: పేద పిల్లల చదువులకు ప్రభుత్వ రంగంలోని ఏపీఎస్ ఆర్టీసీ తోడుగా నిలుస్తోంది. అర్హత ఉన్న వారికి ఉచితంగా, మిగిలిన వారికి రాయితీపై పాస్లు జారీ చేస్తోంది. వివిధ కేటగిరీల విద్యార్థులతో పాటు నిత్యం ప్రయాణించే వారికి కూడా రాయితీపై మంత్లీ సీజనల్ టికెట్లు (ఎంఎస్టీ) అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ఇప్పటికే ఈ ఉచిత బస్ పాస్లు జారీ చేస్తోంది. దీని కోసం జిల్లాలోని రాజమహేంద్రవరం, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉచితంతో పాటు రాయితీ, దివ్యాంగుల (పీహెచ్) పాస్లు కూడా జారీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో 2024–25 సంవత్సరంలో వివిధ రకాల పాసులు మొత్తం 75,606 అందించారు. ఉచిత పాస్లు ఇలా.. పన్నెండేళ్ల లోపు విద్యార్థులు, 18 ఏళ్ల లోపు విద్యార్థినులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు పాస్లు మంజూరు చేస్తున్నారు. కావలసిన వారు విద్యార్థి ఫొటో, స్కూల్ యాజమాన్యం నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించి ఈ పాస్ పొందవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని కౌంటర్ వద్దకు వెళ్తే వెంటనే ఉచిత పాస్ పొందవచ్చు. పాస్ పొందిన విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాల లేదా కళాశాలకు 20 కిలోమీటర్ల దూరం వరకూ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులకూ ఉచితం దివ్యాంగులకు మూడేళ్ల వ్యవధితో ఉచిత పాస్లు అందిస్తున్నారు. ఈ పాస్ పొందడానికి సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అన్ ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ సమర్పించాలి. రాయితీపై.. నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో రాయితీ బస్ పాస్లు మంజూరు చేస్తారు. కావాల్సిన వారు పాస్ ధరతో పాటు నెలవారీ గుర్తింపు కార్డుకు రూ.50, సర్వీస్ చార్జీ రూ.40 అదనంగా చెల్లించాలి. రాయితీతో పాటు సంవత్సరం గుర్తింపు కార్డు కావాల్సిన వారు రూ.100 చెల్లించాలి. గడువు ముగిశాక రెన్యువల్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్/హెచ్ఎం సంతకం చేయించుకుని తిరిగి పొందాలి. సాధారణ విద్యార్థులకు జూన్ నుంచి ఏప్రిల్ వరకూ, ఐటీఐ, పారా మెడికల్ వంటి కోర్సులు చదివే వారికి మే నెల వరకూ పాస్లు మంజూరు చేస్తారు. ప్రత్యేక కౌంటర్లు కళాశాలలు, స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త బస్ పాస్ల జారీకి చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మంజూరు చేస్తున్నాం. కొత్త పాస్ల మంజూరు, పాతవి రెన్యువల్ చేసి, విద్యార్థులకు వేగంగా అందించేందుకు జిల్లాలోని నాలుగు బస్టాండ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. – వై.సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రజా రవాణా అధికారి, రాజమహేంద్రవరం జిల్లాలో డిపోల వారీగా ఏపీఎస్ ఆర్టీసీ రెండేళ్లుగా జారీ చేస్తున్న బస్పాస్ల వివరాలు డిపో 2023–24 2024–25 ఉచిత రాయితీ దివ్యాంగ ఎంఎస్టీ ఉచిత రాయితీ దివ్యాంగ ఎంఎస్టీ గోకవరం 797 7,423 415 1,318 1,963 7,492 311 1,486 కొవ్వూరు 389 5,333 199 957 368 4,766 144 800 నిడదవోలు 235 3,899 285 1,396 313 3,240 243 1,213 రాజమహేంద్రవరం 2,508 41,187 1,322 8,895 582 41,317 863 8,477 -
రోడ్డు ప్రమాదంలో ర్యాలి వాసి మృతి
● కశింకోటలో ఘోర రోడ్డు ప్రమాదం ● ముందున్న లారీని ఢీకొట్టి ఘటన ● వ్యాన్ డ్రైవర్ సహా మహిళ దుర్మరణం ● మరో మహిళకు గాయాలు కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం జమాదులపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కోల్కతాకు వెళ్తున్న కంటైనర్ను బొలేరో వ్యాన్ ఢీకొంది. దాంతో వ్యాన్ డ్రైవర్ సహా ఒక మహిళ దుర్మరణం పాలయ్యారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన పూల వ్యాపారి కన్నూరు లక్ష్మి(40)తో పాటు మరో మహిళ తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద పూలు కొనుగోలు చేసి గాజువాకలో విక్రయానికి వ్యాన్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న ఈ వ్యాన్ అదే మార్గంలో ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీని బలంగా ఢీకొంది. దీంతో కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పి.సత్యనారాయణ (25), పూల వ్యాపారి లక్ష్మి(40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి మండలం కోడూరుకు చెందిన పూల వ్యాపారి ఎన్.వరలక్ష్మి తీవ్రంగా గాయపడింది. వెంటనే సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావులతోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వరలక్ష్మిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సలహాపై విశాఖ కేజీహెచ్కు తరలించారు. కేబిన్లో ఇరుక్కున్న మృతదేహాలు.. ఈ ఘటనలో వ్యాన్ క్యాబిన్ నుజ్జవడంతో అందులో డ్రైవర్, పక్క సీటులో కూర్చున్న లక్ష్మి మృత్యువాత పడ్డారు. పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు తీసి అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. -
ఆ సొమ్ము ఏ మూలకు?
● హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధికి గతంలోనే రూ.400 కోట్లతో అంచనాలు ● ఇప్పుడు కేవలం రూ.94 కోట్లు తెచ్చి హడావుడా? ● అందులోనూ జీఎస్టీ పోనూ మిగిలేది రూ.77 కోట్లే ● ఆ డబ్బుతో ఏం చేస్తారు? ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శ రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ కూటమి నాయకులు నానా హంగామా చేస్తున్నారని మాజీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మారినా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగడం సహజమని, అయితే ఎవరు కృషి చేశారో కూడా గుర్తించాలని అన్నారు. ‘దాదాపు 2.3 కిలోమీటర్ల పొడవైన హేవలాక్ వంతెన అభివృద్ధికి కనీసం రూ.400 కోట్లు ఖర్చవుతుందని గతంలోనే అంచనా వేయించాం. అటువంటిది ఇప్పుడు కేవలం రూ.94 కోట్లు తెచ్చి ఆ వంతెనకు రోడ్డు వేస్తామని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూటమి నాయకులు చెప్పడం వింతగా ఉంది. ఇందులో 18 శాతం జీఎస్టీ పోనూ రూ.77 కోట్ల వరకూ మాత్రమే మిగులుతుంది. ఆ డబ్బు ఏ మూలకు సరిపోతుంది?’ అని భరత్రామ్ ప్రశ్నించారు. హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధికి తన హయాంలో కృషి చేశానన్నారు. శివలింగం పక్కన, ఇటువైపు రైల్వే స్థలం కావడంతో ప్రత్యామ్నాయంగా 2,583.33 చదరపు మీటర్ల భూమిని వీఎల్ పురం లారీ స్టాండ్ వద్ద బదలాయించడానికి ఉత్తర్వులు తెచ్చామని గుర్తు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఐఎల్టీడీ జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణలో రైల్వే స్థలం పోతున్నందున ప్రత్యామ్నాయంగా వీఎల్ పురంలోనే స్థలం ఇచ్చామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్కు 2015లోనే రూ.35 కోట్లు తెచ్చి ఏం చేశారో, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీకుండా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ లో కూటమి నాయకులు చెప్పేవన్నీ చేయాలంటే రూ.700 కోట్లు అవుతుందన్నారు. గజేంద్రసింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండగా తన కృషి ఫలితంగా నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి రూ.88 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో మురుగు నీటిని మళ్లించే కార్యక్రమం చేపట్టకుండా సోకులు చేస్తే ప్రయోజనముండదని భరత్రామ్ హితవు పలికారు. రివర్ ఫ్రంట్కు రూ.22 కోట్లు కేటాయిస్తే, ఇప్పుడు రూ.8 కోట్లకు కుదించడం వింతగా ఉందన్నారు. తాను ఎంపీగా ఉండగా చేసిన కృషి ఫలితంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉప ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని మంజూరు చేసిందని, ఆవిధంగా బొమ్మూరులో సైన్స్ సెంటర్ నిర్మాణానికి రూ.15.20 కోట్లు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో పూర్తయిన మోరంపూడి ఫ్లైఓవర్, సైన్స్ సెంటర్ను కూట మి నాయకులు ప్రారంభించడం తప్పు కాదని, అయి తే, దాని కోసం కృషి చేసిన వారిని కూడా గుర్తిస్తే గౌర వప్రదంగా ఉండేదని అన్నారు. తాను ఎంపీ లాడ్స్ నిధులు తీసుకొచ్చి గోదావరి గట్టున ఫూలే – అంబేడ్క ర్ భవన్ నిర్మిస్తే, కూటమి నాయకులు హడావుడి చేస్తున్నారని అన్నారు. ‘గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరం మీద ప్రేమతో రూ.125 కోట్ల స్పెషల్ గ్రాంటు ఇచ్చారు. ఆ నిధులతో హ్యాపీ స్ట్రీట్, గోదావరి స్టేషన్ ఎకై ్సజ్ కార్యాలయం వద్ద పుష్కర్ ప్లాజా, సుబ్రహ్మణ్య మైదానంలో ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ నిర్మాణాలతో పాటు కంబాల చెరువు సుందరీకరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం’ అని భరత్రామ్ గుర్తు చేశారు. అలాగే, నగరంలోని రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం అభివృద్ధికి నిధులు తెచ్చి, చేపట్టిన కొత్త భవనం నిర్మాణం తుది దశకు చేరిందని చెప్పారు. -
వందనానికి వంకలా!
● అంగన్వాడీల పిల్లలకు అందని పథకం ● ప్రభుత్వోద్యోగులుగా భావిస్తే ఆ ప్రయోజనాలన్నీ తమకూ కల్పించాలి ● యాప్ల యాతనతో పనిభారం పెంచారు ● 42 రోజుల సమ్మె డిమాండ్ల హామీల విస్మరణ ● కూటమి ప్రభుత్వంపై ఆ వర్గం నిప్పులు కపిలేశ్వరపురం: ప్రభుత్వమంటే ప్రజలకు మేలు చేసేదయ్యుండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అమలు చేయాలి. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే అందులో సామాజిక పింఛన్లు తప్ప మిగిలినవేవీ అమలుకు నోచుకోలేదు. ప్రజల ఒత్తిడి నేపథ్యంలో తల్లికి వందనం ప్రారంభించినప్పటికీ అనేక మంది అర్హులు సాయం అందక గగ్గోలు పెడుతున్నారు. అంగన్వాడీ, ఆశ వర్కర్ల వంటి వారిని విధానపరంగా సంక్షేమ పథకాలకు దూరం పెట్టడంతో చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు అన్యాయం చేయడానికి తామేం పాపం చేశామంటూ ఆందోళన చెందుతున్నారు. సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు సైతం అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్పై ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. సాంకేతికత పేరుతో పనిభారం అనేక విభాగాల వారికి చేదోడువాదోడుగా ఉండే పనులకు వినియోగించుకోవాల్సిన అంగన్వాడీలపై సాంకేతికత పేరుతో కూటమి ప్రభుత్వం భారం మోపుతుంది. పోషకాహారాన్ని అందుకునే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను ఫేస్ యాప్లో నమోదు చేయాల్సి రావడం భారంగా ఉందని, యాప్ యాతనను తొలగించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి పోషణ ట్రాకర్ యాప్, బాల సంజీవిని యాప్లను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 6 నెలలు నుంచి మూడేళ్లలోపు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా టేక్ హోమ్ రేషన్ (టీహెచ్ఆర్) అందిస్తున్నారు. ఆ రెండు యాప్లలో లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటితో పాటు అధికారులు మరో 12 రకాల రికార్డులు రాయిస్తున్నారు. ఏడు నెలల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారుల తల్లిదండ్రులు, సంరక్షకుల ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ అప్డేట్ కాకపోయినా, ఈకేవైసీ కాకపోయినా, ఆధార్ కార్డులో లబ్ధిదారుని ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోయినా వివరాలు యాప్లో నమోదు కావడంలేదు. అప్డేట్ వ్యవహారాలు సచివాలయానికి వెళ్లి సరిచేసుకోవాలని లబ్ధిదారులకు చెప్తున్నప్పటికీ వారు ఖాతరు చేయడంలేదు. దీంతో చేసేది లేక లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అంగన్వాడీలు పోషకాహారాన్ని అందించాల్సి వస్తోంది. ఉద్యమాలపై ఉక్కుపాదం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నేతలు అప్పట్లో హామీ ఇచ్చారు. ఏడాది పాలనాకాలం గడిచినా హామీలో ప్రధానమైనదైన రూ.26 వేలకు జీతాలను పెంచాలన్న డిమాండ్ను పక్కన పెట్టారు. ఒక్క రూపాయి కూడా వేతనాన్ని పెంచలేదు. అంగన్వాడీ కార్యకర్త చనిపోయినప్పుడు రూ. 20 వేలు మట్టి ఖర్చులు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో రూ.15 వేలు చెల్లించాలంటూ జీఓ జారీ చేశారు. రాష్ట్రంలోని 6,830 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలన్న డిమాండ్పైనా ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. 2024 జూలై 10న కూటమి ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 10న ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫిబ్రవరి 17న ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాని ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మార్చి 11న నిర్వహించిన చలో విజయవాడ ఆందోళనలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు పెద్ద ఎత్తున బయలుదేరారు. 10న సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లు, పలు బస్ స్టేషన్ల వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈనెల 23న ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించిన ధర్నాను నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ప్రయత్నం చేసి విఫలమైంది. సంక్షేమ పథకాలకు దూరం చేయొద్దు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు చెప్పిన విధంగా కనీస వేతనాలను చెల్లించకుండా అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలకు అంగన్వాడీలను దూరం చేస్తోంది. అదే నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేయదలిస్తే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ప్రతి సదుపాయాన్ని కల్పించడంతో పాటు వేతనాలను పెంచాలి. ఆందోళనలు చేస్తున్నప్పుడు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే సహించేది లేదు. – జి.బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, కాకినాడ ఉమ్మడిజిల్లాలో అంగన్వాడీలు ఇలా... కాకినాడ జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,986 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 1,05,996 మంది ప్రీస్కూల్ పిల్లలు, 11,610 మంది బాలింతలు, 10,573 మంది గర్భిణులకు అంగన్వాడీలు విశేష సేవలందిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలుండగా 86,296 మంది చిన్నారులు, 15,743 మంది గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్, 26 మినీ మొత్తం 1,562 అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులు సేవలందుకుంటున్నారు. -
బాబు వచ్చినా జాబు వచ్చిందా?
జాబు రావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో ఊదరగొట్టారు. బాబు వచ్చినా జాబు మాత్రం రాలేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఏ ఒక్కరికీ ఒక్క జాబూ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అని మరోసారి నిరూపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించారు. బాబు మోసాలపై ప్రతి ఇంటికీ వెళ్లి వివరిద్దాం. 2029లో మళ్లీ జగన్ను సీఎంను చేద్దాం. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ను విమర్శించే స్థాయి ఉందా? సరిగ్గా కాలు కూడా కదపలేని కూటమి నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్ను ఏదో చేస్తానని అంటున్నాడు. వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడాలి. ముందు నుంచీ చంద్రబాబు మోసమే. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండుసార్లు ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్ సీపీలో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా జక్కంపూడి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వైఎస్ జగన్ దేవుడిచ్చిన బిడ్డ. ఆ తర్వాతే రాజా, గణేష్. – జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు మాట మీద నిలబడే వ్యక్తి జగన్ ప్రజలకు మాటిస్తే నిలబడే వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివి సైతం అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తిరిగి జగన్ సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు మోసపోయారు. చంద్రబాబు మోసాలను కార్యకర్తలు సమష్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. – తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు రానున్నది కార్యకర్తల ప్రభుత్వం 2029లో రానున్నది వైఎస్సార్ సీపీ కార్యకర్తల ప్రభుత్వం. కార్యకర్తల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కార్యకర్తలకు గ్రూప్ ఇన్సూరెన్స్, శిక్షణ తరగతులు, సభ్యత్వ నమోదు చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజల్లో కార్యకర్తలు మమేకం కావాలి. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రబాబు అంతా మోసం అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలనూ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో డీబీటీ ద్వారా రూ.4,65,000 కోట్లు ప్రజలకు అందించారు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాబు మాట నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఏడాదైనా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు. మరుపు మానవ సహజం. మర్చిపోతున్న చంద్రబాబుకు హామీలు అమలు చేయమని గుర్తు చేయాలి. అందుకు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి ఇంటికీ చంద్రబాబు మోసాలను తీసుకెళ్లాలి. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి వెన్నుపోటు దినం ఫలితమే తల్లికి వందనం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం ఆందోళన ఫలితంగానే తల్లికి వందనం పథకం అమలు చేశారు. ప్రతి పథకంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు విధించింది. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ఏడు స్థానాలూ గెలిచి తీరుతాం. – జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు -
షణ్ముఖ వ్యూహం విఫలం
మాజీ సీఎం వైఎస్ జగన్ను ఓడించలేమనే భయంతోనే చంద్రబాబు కూటమి కట్టారు. అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. షణ్ముఖ వ్యూహం పేరుతో కూటమి పార్టీలు హామీలిచ్చాయి. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పింఛను వంటి నోటికొచ్చిన హామీలు గుప్పించారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే ఇవ్వడం లేదు. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నారు. అందుకే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాం. బాబు హామీలపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. అమలు చేసే వరకూ పోరాటాలు ఉధృతం చేస్తాం. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ మోసం చేసి అధికారం ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎండగడతాం. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి, కూటమి అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలనలోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బాబు మోసాలను జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తాం. ఇందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలి. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అన్ని వర్గాలకూ వెన్నుపోటు సూపర్ సిక్స్ పేరిట అడ్డగోలు హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు జిల్లా రాజకీయాలపై అవగాహన ఉంది. ఆయన రాకతో ప్రతి సామాన్య కార్యకర్తకూ ధైర్యం వచ్చింది. ఆయన చూపిన మార్గంలో చంద్రబాబు మోసాలను గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ తీసుకెళ్తాం. ప్రజలకు బాబు చేస్తున్న దగాను వివరిస్తాం. – జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీబీఎన్ అంటే చీటింగ్ చంద్రబాబు నాయుడు (సీబీఎస్) అంటే చీటింగ్, బాదు డు, నేరాలు. అబద్ధపు హామీలతో ప్రజలను చీట్ చేశారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ఽనిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలతో నేరాలు పెరిగిపోయాయి. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఇచ్చేశామనగానే ప్రజలంతా అవాక్కయ్యారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా చైతన్యమవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. – తానేటి వనిత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ -
నన్నయలో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసేందుకు అసక్తి, అర్హత ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీపీజీ సెట్లో అర్హత పొందిన వారికి మాత్రమే ఈ అవకాశమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి బ్రోచర్ని ఆమె విడుదల చేశారు. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్లలో అర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలలో పీజీ కోర్సులు అందిస్తున్నామంటూ కోర్సుల వివరాలను తెలియజేశారు. ఇతర వివరాలకు 70930 08477 నంబర్కు ఫోన్ చేయడం, లేదా యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించాలన్నారు. -
జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దు
సింగరాజుపాలెం ప్రజల అభ్యంతరం దేవరపల్లి: జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ప్రజలు అభ్యంతరం తెలిపారు. టవర్ నిర్మిస్తున్న స్థలం వద్ద పలువురు గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ నిర్మాణం వల్ల ప్రమాదాలతో పాటు అనారోగ్యాలకు గురవుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ శివారున టవర్ నిర్మిస్తే ఇబ్బంది లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలు నివశిస్తున్న కాలనీలో ఓ వ్యక్తికి చెందిన స్థలంలో గురువారం అర్ధరాత్రి టవర్ నిర్మాణానికి గోతులు తవ్వడం ప్రారంభించారని, ఈ విషయం తెలుసుకున్న పలువురు అక్కడకు చేరుకుని పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 2018లో ఇదే ప్రాంతంలో సెల్టవర్ నిర్మాణ పనులు చేపట్టగా అప్పటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నిలుపుదల చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా మళ్లీ అర్ధరాత్రి పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటి శేషు, గద్దే శ్రీనివాస్, వామిశెట్టి వెంకటేశ్వరరావు, అయినపర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రోబోరోర్ మలేషియా–25 వెఫా రోబోటిక్ నిర్వహించిన ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ లక్ష్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. స్మోర్పీ ఇమాజినరీలో ప్రథమ, తృతీయ స్థానాలు, స్మోర్పీ పైలట్ విభాగంలో రెండు రజత పతకాలు, కాంస్య పతకం సాధించారు. స్మోర్పీ స్క్వేర్ అటానమస్ విభాగంలో రెండు స్వర్ణం, రజక పతకం సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారు. టీమ్ వన్లో రిహాన్సనా, లలిత్ కుమార్వర్మ, సాజిత్, ఆదిత్య ఆనంద్, ఎ.వీనిత్లు పాల్గొనగా టీమ్–2లో డి.మనోహర్రెడ్డి, దుర్గాఆదిత్య శశాంక్, ముకుంద, నాగసాయి అభినవ్, ఎన్.అర్జున్ పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రోబోటిక్స్ ఒక ప్రత్యేక సబ్జెక్టుగా నేర్పిస్తున్నామన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ పలు దేశాలు పాల్గొన్న పోటీల్లో ఇండియా నుంచి తమ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల బృందాన్ని ప్రిన్సిపాల్ వందనబోహ్రా, ఉపాధ్యాయులు అభినందించారు. -
అడుగుకో గుండం!
మామిడికుదురు: ప్రతిపక్షంలో ఉండగా కూటమి నేతలు రోడ్ల అధ్వాన స్థితిపై ఎన్నో విమర్శలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి నిరసనలు తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏమాత్రం మార్పు లేదని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంఅప్పనపల్లి ఆర్ అండ్ బీ రహదారి దుస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాశర్లపూడి కరకట్ట దిగువ నుంచి అప్పనపల్లి వైపు కొంత భాగం, అక్కడి నుంచి బి.దొడ్డవరం, పెదపట్నంలంక వరకు ఉన్న ఆర్ అండ్ బీ రహదారిపై ప్రయాణించడం పాదచారులు, వాహన చోదకులకు సవాలుగా మారింది. వర్షాకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయమని వాపోతున్నారు. కనీస మరమ్మతులు కూడా చేపట్టకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడుతున్నారు. -
శుభకార్యాలకు శూన్యం!
కొత్తపేట: తెలుగు మాసాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్నది ఆషాడం. హిందూ పురాణాల ప్రకారం ఈ మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 24తో ఈ నెల ముగుస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. వివాహాది శుభకార్యాలు ఏమీ ఈ నెలలో తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలున్నాయి. ఆషాడ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధనలకు ముఖ్యమైంది. దీనినే తొలి ఏకాదశి అని అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలోనే గురు పూర్ణిమ, దేవశయన ఏకాదశి, వారాహి నవరాత్రి పూజలు ఈ మాసం తొలిరోజు నుంచే ప్రారంభమవుతాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు, ఒడిశా రాష్ట్రం పూరీలో జగన్నాథుని రథయాత్ర వంటి ముఖ్యమైన కార్యక్రమాలు, ఉపవాస పండుగలు నిర్వహిస్తారు. చాతుర్మాసోత్సవాలు సైతం ఈ నెలలోనే ప్రారంభమౌతాయి. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని, అందుకే ఈ కాలంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారని చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దుర్గామాత ఆరాధన శక్తినిస్తుందని చెబుతారు. ఈ మాసంలో దుర్గాదేవిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దానధర్మాలకు ప్రాధాన్యం గల మాసమని, దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందంటారు. ఆషాఢ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించడం ద్వారా వారి అనుగ్రహం లభిస్తుందంటారు. గోరింటాకు ప్రత్యేకం ఈ కాలంలో గ్రామీణులు గోరింటాకు పెట్టుకుంటారు. దీనితో సైన్స్ ముడిపడి ఉంది. వర్షాలు కురవడం వల్ల క్రిమికీటకాలు పెరిగి అంటువ్యాధులు ప్రబలుతాయి. చర్మవ్యాధుల నివారణకు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలు ఎక్కువగా గోరింటాకు అలంకరణగా భావిస్తారు. పెళ్లి ఈడుకొచ్చిన యువతులకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని అంటారు. వధూవరులకు తప్పని విరహం ముఖ్యంగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చేది కొత్తగా పెళ్లెన దంపతులు కలవకూడదనే ఆచారం. ఇది పూర్వం నుంచీ వస్తోంది. దీనిలో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. దీని వెనుక శాసీ్త్రయ కారణాలు ఉన్నాయని పెద్దలు, పండితులు చెబుతారు. అత్త, మామలు దాటిన గుమ్మం అల్లుడు దాటకూడదని, అత్తా, కోడలు ఒక ఇంటిలో ఉండకూడదని రకరకాల కధనాలతో పాటు ఈ మాసం నుంచే వర్షాకాలం ప్రారంభమౌతుంది. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభిస్తారు. కొత్తగా పెళ్లైన యువకుడు వ్యవసాయ పనులకు డుమ్మా కొట్టి అత్తవారింట్లోనే గడుపుతాడు.. ఇక్కడ పనులు సాగవనే కారణంతో ఈ నెల రోజులు నూతన దంపతులు కలవకూడదనే నియమం పెట్టారంటారు. ఆషాఢానికి ఎన్నో ప్రత్యేకతలు వర్షాలతో సాగుపనులకు శ్రీకారం వైష్ణవ ఆరాధనలకు ప్రాశస్త్యం -
అడ్మిషన్లు లేని కళాశాలలకు నోటీసులు
రాజానగరం: గత మూడు సంవత్సరాలుగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లతో నడుస్తున్న డిగ్రీ కళాశాలలను గుర్తించి, వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ఉప కులపతులు, రిజిస్ట్రార్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్లో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ కాన్ఫరెన్స్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి కూడా పాల్గొన్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై ఈ కాన్ఫెరెన్స్లో చర్చించారు. కళాశాలల యాజమాన్యాలు అనుబంధ యూనివర్సిటీలకు చెల్లించే కామన్ సర్వీసు ఫీజుల గురించి ఆరా తీశారు. అపార్ ఐడీలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. 2024–25, 2025–26 సంవత్సరాలలో ఏపీ రీసెర్చ్ సెట్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారని వీసీ ప్రసన్నశ్రీ తెలిపారు. 25 శాతం కంటే తక్కువ ఉంటే చర్యలు వీడియో కాన్ఫెరెన్స్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి ఆదేశం -
విధి నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు/కోదాడ రూరల్: కర్తవ్య నిర్వహణే ప్రథమ ధర్మం అంటారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆ ఉద్యోగులు శాశ్వత విశ్రాంతిని పొందారు. మాదక ద్రవ్యాల (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఓ ఎస్సై, ఓ కానిస్టేబుల్ అసువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాక్ను సొంతం చేసుకున్న ఎస్సై అశోక్ బుధవారం రాత్రి పది గంటలకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామితో కలిసి నిందితున్ని అరెస్ట్ చేసేందుకు డ్రైవర్ జి.రమేష్ను వెంటబెట్టుకుని ఎర్టిగా కారులో హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తనకు నిద్రవస్తోందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు. బయల్దేరిన 10 నిమిషాలకే.. కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామి తీవ్ర గాయాలతో బయట పడ్డారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా, అక్రమార్కులకు సింహస్వప్నంగా, రక్షణ కోసం వచ్చిన వారికి ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ మృతితో అంతటా విషాదం అలముకుంది. కారులో ఇరుక్కుపోయిన ఎస్ఐ మృతదేహం లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోనసీమ ఏఎస్పీ, కోదాడ డీఎస్పీ నివాళులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. పదోన్నతి వస్తుందనుకునే లోపే.. ఎస్సై అశోక్కు ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరసాపురంలోని అశోక్ నివాసంలో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బ్లెసన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన -
ప్రేయసి లేని జీవితం వద్దని!
పిఠాపురం: ప్రేమించిన యువతి చనిపోయింది. ఆమె లేని జీవితం వద్దనుకుని ఆ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన కథనం మేరకు మండలంలోని దుర్గాడ జగనన్న కాలనీకి చెందిన ములగపాటి నాగమణికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు సురేష్ అరబిందో కంపెనీలో టాంకర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు విజయ్ కుమార్ (24) కాకినాడ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిపై డ్రైవర్గా పనిచేసి, మానేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నాడు. తాను ప్రేమించిన యువతి చనిపోయిందని తానూ చనిపోవాలనుకుంటున్నట్టు కొంతకాలంగా విజయ్కుమార్ తల్లితో చెప్పేవాడు. ఎవరి కోసమో నువ్వెందుకు చనిపోవడం మేమందరం ఉన్నాం కదా అని తల్లి ధైర్యం చెప్పేది. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ సాయంత్రం విజయ్ కుమార్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడు వాంతులు చేసుకోవడం చూసిన స్థానికులు అతని అన్న సురేష్కు సమాచారం ఇచ్చారు. అతడు వెంటనే వచ్చి అంబులెన్స్లో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేసున్నారు. పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేట వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు అన్నదేవరపేటకు చెందిన కొయ్య ముత్యాలు (38) ఠాగూర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎస్కే సుధీర్ తాళ్లపూడి నుంచి అన్నదేవరపేట వస్తూ అన్నదేవరపేట సొసైటీ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ముత్యాలు తీవ్రంగా గాయపడి సంఘటనా ప్రదేశంలో మృతి చెందాడు. గాయాలపాలైన సుధీర్ను 108లో గోపాలపురం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. యువకుడికి నివాళి ముత్యాలు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, నాయకులు పిట్టా శ్రీనివాస్ పరామర్శించారు. సంతాపం తెలియజేశారు. -
పుంజుకుంటున్న పొగాకు మార్కెట్
● కాస్త పెరిగిన ధర ● కిలోకు గరిష్టంగా రూ.296 ● కనిష్టంగా రూ.220దేవరపల్లి: పొగాకు మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటోంది. మూడు రోజులుగా ధర స్వల్పంగా పెరుగుతూండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతర్జాతీయంగా మన పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఖరారు కావడంతో మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ ఏర్పడినట్టు సమాచారం. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు మూడు నెలలు కాగా, 75 రోజుల పాటు వేలం జరిగింది. దాదాపు 72 రోజుల పాటు ధరలు నిలకడగా కొనసాగడంతో రైతులు దిగులు చెందారు. ముఖ్యంగా కౌలు రైతులు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో మూడు రోజులుగా మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23న కిలో గరిష్ట ధర రూ.290 ఉండగా, 24న రూ.291, 25న రూ.293కు పెరిగి, గురువారం రూ.296కు చేరింది. దీంతో పాటు కొనుగోళ్లలో పురోగతి కనిపించడంతో ముందు ముందు మార్కెట్ ఆశాజనకంగా ఉండవచ్చునని రైతులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో కిలోకు గరిష్టంగా రూ.6 పెరుగుదల కనిపించింది. ఎక్స్ గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు పోటీ పడటంతో ధరలో పెరుగుదల వచ్చిందని అధికారులు అంటున్నారు. లో గ్రేడ్, మీడియం గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో ఆయా గ్రేడ్ల పొగాకు నిల్వలు రైతుల వద్దనే ఉన్నాయి. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల నుంచి గురువారం 3,983 బేళ్లు వేలానికి రాగా, ట్రేడర్లు 2,681 బేళ్లు కొనుగోలు చేశారు. 1,302 బేళ్లను తిరస్కరించారు. 3,40,934 కిలోల పొగాకు విక్రయం జరిగింది. ధర స్వల్పంగా పెరిగినప్పటికీ వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లు తక్కువగానే ఉన్నాయి. మంగళవారం 6,560, బుధవారం 5,516 చొప్పున బేళ్లు వేలానికి వచ్చాయి. గురువారం ఆ సంఖ్య 3,983గా ఉందని అధికారులు తెలిపారు. వేలానికి వస్తున్న బేళ్లలో 40 శాతం అమ్ముడవక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రేడర్లు కొనుగోలు చేయకపోవడంతో తీసుకు వచ్చిన బేళ్లు తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి నానా అవస్థలూ పడుతున్నారు. బేలుకు దూరాన్ని బట్టి సుమారు రూ.200 నుంచి రూ.300 వరకూ రవాణా ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ధర స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని బేళ్లకు మాత్రమే ఈ రేటు వస్తోందని రైతులు తెలిపారు. వేలం కేంద్రాల వారీగా కిలో పొగాకు ధరలు (రూ.) వేలం కేంద్రం గరిష్ట సగటు దేవరపల్లి 295.00 250.00 జంగారెడ్డిగూడెం–1 295.00 281.00 జంగారెడ్డిగూడెం–2 296.00 273.00 కొయ్యలగూడెం 296.00 268.00 గోపాలపురం 294.00 268.00 -
కనీస మరమ్మతులు లేవు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇప్పటి వరకూ ప్రధాన రహదారులకు కనీస మరమ్మతులు కూడా లేవు. గోపాలపురం నియోజకవర్గంలోని రహదారులు మరీ దారుణంగా ఉన్నాయి. యర్నగూడెం – పొంగుటూరు రోడ్డుపై పడిన గోతులు చెరువులను తలపిస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. – గడా జగదీష్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రోడ్లపై వెళ్లాలంటే భయమేస్తోంది మెట్ట ప్రాంతంలోని రోడ్లపై వెళ్లాలంటే భయమేస్తోంది. ఏ రోడ్డు చూసినా గోతుల మయంగా ఉన్నాయి. వర్షాలకు మరింత అధ్వానంగా ఉన్నాయి. పొంగుటూరు – యాదవోలు మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తింది. ఈ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంది. దీని నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలి. – ఎలికే నాగ శ్రీనివాస్, యాదవోలు, దేవరపల్లి మండలం -
దేవుని భూములపై స్కెచ్!
● టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరుడికే దక్కేలా ప్లాన్ ● వేలంలో చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు రాజమహేంద్రవరం రూరల్: అధికారం అండతో టీడీపీ నాయకులు ఏకంగా దేవుడి ఆదాయానికే టెండర్ పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి, శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి బొమ్మూరులోని సర్వే నంబర్ ఎల్పీ నంబర్–65లో 6.15 ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగెకరాలను కమర్షియల్ విధానంలో నాలుగు బిట్లుగా విభజించి బహిరంగ వేలం వేస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు బొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావు, డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు, అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు సమక్షంలో గురువారం వేలం నిర్వహించారు. ముందుగా డీడీలు తీసిన వారే వేలంలో పాల్గొనాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి చేరువన ఉన్న ఈ భూమిపై కన్ను వేసిన అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. తమ వారి పేర్లతోనే నాలుగు టెండర్లు దాఖలు చేశారు. వాస్తవానికి నాలుగు బిట్లుగా వేలం ప్రక్రియ చేపట్టడంతో ప్రతి బిట్కు ప్రత్యేకంగా డీడీ తీయాల్సి ఉంటుంది. కానీ, అధికార పార్టీ కనుసన్నల్లో ఈ వేలం జరగడంతో కేవలం ఒకే ఒక్క డీడీతో నాలుగు బిట్లకు పాల్గొనే వెసులుబాటు కల్పించారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు స్వయంగా ఈ వేలంలో పాల్గొనడంతో ఇతరులెవ్వరూ పాల్గొనకుండా కట్టడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు బిట్లకు నెలకు రూ.3,24,000, జీఎస్టీతో కలిపి రూ.3,82,320 చొప్పున చెల్లించే విధంగా పాట దక్కించుకున్నారు. పదకొండేళ్ల లీజు కాలానికి గాను ప్రతి నెలా రూ.3,82,320తో పాటు మూడేళ్లకోసారి 30 శాతం పెంచే విధంగా ఒప్పందం జరిగింది. ఈ భూములను దేనికి వినియోగించాలనేది అధికారులు చెప్పలేదు. జాతీయ రహదారి సమీపాన ప్రత్యేకమైన రోడ్డు కలిగిన ఈ భూముల్లో షెడ్లు నిర్మించి, ఉల్లిపాయలు నిల్వ చేసుకునేందుకు నిర్ణయించారని సమాచారం. అయితే, విస్తృత ప్రచారం చేసి, ఈ భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తే దేవదాయ శాఖకు మరింత ఆదాయం చేకూరేదని పలువురు అంటున్నారు. -
ఖరీఫ్ ముగిశాకే..
అన్నవరం: పంపా రిజర్వాయర్కు కొత్త గేట్ల ఏర్పాటు పనులు మరింత జాప్యం కానున్నాయి. ఇప్పటికే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా పలు కారణాలతో ఆలస్యం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని 12,500 ఎకరాలకు పంపా రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందిస్తారు. దీంతో పాటు అన్నవరం దేవస్థానానికి, గ్రామానికి కూడా నీరు అందిస్తారు. పంపా జలాశయం గేట్ల నిర్వహణ చాలా కాలం నుంచే ఇబ్బందికరంగా మారింది. వరద నీరు సముద్రంలోకి వదిలే సమయంలో గేట్లు ఎత్తేందుకు, నీటిమట్టం తగ్గినపుడు ఎత్తిన గేట్లు దించేందుకు చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్త గేట్లు అమర్చాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలైలో రూ.3.36 కోట్లతో అంచనాలు రూపొందించి, నిధులు కేటాయించారు. గత ఏడాది మార్చి నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిధులు విడుదల కాలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో నిధులు విడుదల చేసింది. కొత్త గేట్ల ఏర్పాటుకు మూడుసార్లు టెండర్లు పిలిచారు. కానీ, ఎవ్వరూ రాలేదు. చివరిగా ఏప్రిల్లో షార్ట్ టెండర్ పిలవగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన గోపాలకృష్ణ ఏజెన్సీ 4.75 శాతం ఎక్కువకు టెండర్ దక్కించుకుంది. ఇదే సమయంలో వర్షాలు మొదలైపోవడంతో పనుల్లో మళ్లీ జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్కు ఉన్న ఐదు గేట్లలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 4వ నంబర్ గేటుకు మాత్రమే ప్రస్తుతం మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన నాలుగు గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. ఖరీఫ్ అనంతరం ఐదు గేట్లు కొత్తవి అమర్చుతారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంపా జలాశయంలోకి పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గురువారం సాయంత్రానికి 87.5 అడుగులకు చేరింది. ఇంకా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లోగా 4వ నంబర్ గేటు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. గేట్లకు మరమ్మతులు, కొత్త గేట్ల ఏర్పాటుపై పది రోజుల క్రితమే అధికారులతో కలిసి నిపుణుడు సారథి పరిశీలించారు. అలాగే, ఈఈ శేషగిరిరావు, ఇతర అధికారులు, గేట్ల మరమ్మతులు చేసే కాంట్రాక్టర్ సిబ్బంది బుధవారం పరిశీలన జరిపారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటులో జాప్యం ప్రస్తుతం 4వ నంబర్ గేటుకు తాత్కాలిక మరమ్మతులు 87.5 అడుగులకు చేరిన నీటిమట్టం -
రుడా వైస్ చైర్మన్గా జేసీకి అదనపు బాధ్యతలు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ (జేసీ) ఎస్.చిన్నరాముడు గురువారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ రుడా వైస్ చైర్మన్గా పనిచేసిన కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. బాధ్యతలు చేపట్టిన అనంతరం చిన్నరాముడు రుడా చేపట్టిన అభివృద్ధి అంశాలపై సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ అధికారి జీవీఎస్ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.నాగేశ్వరి, ఇతర అధికారులతో చర్చించారు. తల్లీబిడ్డల మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం గోపాలపురం: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి, గర్భంలోని బిడ్డ మృతి చెందిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తీవ్రంగా పరిగణించారు. దీనిపై గురువారం విచారణకు ఆదేశించారు. గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన వారా లక్ష్మికి నెలలు నిండటంతో కుటుంబ సభ్యులు సీహెచ్సీలో చేర్పించారు. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి తల్లి, బిడ్డ మృతి చెందారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో రాజమహేంద్రవరం జీజీహెచ్ గైనకాలజిస్ట్ కె.రూబినా, ఎనస్తీషియన్ బి.రాణి, అక్కమాంబ, డాక్టర్ అరుణతో కూడిన బృందం గోపాలపురం సీహెచ్సీలో విచారణ చేపట్టారు. నివేదికను కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. ఆగస్టులో పలు రైళ్ల రద్దు రాజమహేంద్రవరం సిటీ: విశాఖపట్నం డివిజన్ దువ్వాడ – తాడి సెక్షన్లో ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఆగస్టు 26, 28, 30 తేదీల్లో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల ముందుగానే ఈ విషయం ప్రకటిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం – విశాఖపట్నం (67285), కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268), గుంటూరు – విశాఖపట్నం (22876), విశాఖపట్నం – గుంటూరు (22875), విజయవాడ – విశాఖపట్నం (12718), విశాఖపట్నం – విజయవాడ (12717) రైళ్లను ఆ తేదీల్లో రద్దు చేశామని వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 186 మంది హాజరు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు 186 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేశామన్నారు. శుక్రవారం 1,04,001 నుంచి 1,20,000 వరకు ర్యాంకు కలిగిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పరిశీలన జరుగుతుందన్నారు. అలాగే 50,001 నుంచి 90 వేల ర్యాంకు వచ్చిన అభ్యర్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. 3 నుంచి రైల్వే గేటు మూసివేతసామర్లకోట: రైల్వే ట్రాక్కు అత్యవసర మరమ్మతులు చేపట్టనున్న దృష్ట్యా కడియం – ద్వారపూడి మధ్య 407 రైల్వే గేటును వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకూ మూసివేస్తున్నారు. సామర్లకోట సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రామసుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ మేరకు ద్వారపూడి పోలీసు స్టేషన్, పంచాయతీ కార్యాలయం, కేశవరం పంచాయతీ కార్యాలయం, కేశవరం కోకాకోలా కంపెనీకి, మండపేట రెవెన్యూ అధికారికి, ద్వారపూడి, కేశవరం, లారీ ఓనర్స్ అసోసియేషన్కు, ద్వారపూడి ఆటో అసోసియేషన్కు సమాచారం ఇచ్చామని వివరించారు. ఆ రోజుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని కోరారు. -
రోడ్డు.. బ్యాడ్..
● యమపురికి దారుల్లా..దేవరపల్లి/పెరవలి: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చాలా గొప్పగా ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేస్తామన్నారు. రోడ్లు అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎక్కడైనా ఒక రోడ్డుకు చిన్నపాటి మరమ్మతులు చేయగానే.. ‘అద్దంలా రోడ్లు.. నాడు నరకం – నేడు స్వర్గం అనే రీతిలో ‘పచ్చ’ మీడియా డప్పేసి చాటింది. సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది వెళ్లిపోయింది.. కాలం గడుస్తూనే ఉంది. ఇప్పుడు కూటమి వారి ఏలికలో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. నిలువునా ఛిద్రమై.. అడుగడుగునా గుంతలు పడి.. చిన్నపాటి వర్షాలకే చెరువుల్లా మారిన రోడ్లపై వెళ్తూంటే నడుములు విరిగిపోతున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. గ్రామీణ, ఆర్అండ్బీ, హైవే అనే తేడా లేకుండా జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులు దారుణంగా కనిపిస్తున్నాయి. ● నిడదవోలు – పొంగుటూరు ఆర్అండ్బీ రోడ్డు యర్నగూడెం – పొంగుటూరు మధ్య పరమ అధ్వానంగా ఉంది. దీనిని 2016–17లో సుమారు రూ.15 కోట్లతో విస్తరించారు. తరువాత జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి రోడ్డు పూర్తిగా దెబ్బ తిడంతో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే భారీ వాహనాలను పొంగుటూరు నుంచి యర్నగూడెం వైపు మళ్లించారు. దీంతో, ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. యాదవోలు – పొంగుటూరు మధ్య వాన నీటితో చెరువులను తలపిస్తోంది. ● తల్లాడ – దేవరపల్లి రహదారి గోపాలపురం వద్ద పెద్దపెద్ద గుంతలు పడి ధ్వంసమైంది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ రోడ్డును రెండు లేన్లుగా అభివృద్ధి చేశారు. ● గుండుగొలను – కొవ్వూరు హైవే నుంచి బుచ్చియపాలెం వెళ్లే రోడ్డు దారుణంగా మారింది. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ తారు రోడ్డు ప్రస్తుతం మట్టి రోడ్డులా మారింది. పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. బుచ్చియపాలెం, అచ్చియపాలెం, కోమటికుంట మీదుగా ఈ రోడ్డు గోపాలపురం వెళుతుంది. ● దేవరపల్లి – దుద్దుకూరు మధ్య పెట్రోలు బంకు వద్ద పాత జాతీయ రహదారి పూర్తిగా గుంతలు పడి బురదమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు బురద చిమ్మటంతో రోడ్డుపై వెళుతున్న వారు అసహనానికి గురవుతున్నారు. ● దుద్దుకూరు – పంగిడి మధ్య రోడ్డు పూర్తిగా బురద మయంగా మారింది. ఈ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. దీంతో క్వారీల్లోని మట్టి లారీల టైర్ల ద్వారా రహదారిని కప్పేస్తోంది. చినుకు పడితే చాలు.. ఈ రోడ్డుపై ప్రయాణం సాహసోపేతంగా ఉంటోంది. బైక్లు బురద మట్టిలో జర్రున జారి పడిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ● ఏలూరు – గుండుగొలను – కొవ్వూరు (ఈజీకే) రోడ్డు నుంచి లక్ష్మీపురం ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. సుమారు 50 టన్నుల బరువైన క్వారీ లారీలు తిరగడంతో ఈ రహదారి పూర్తిగా దెబ్బ తింది. ● పెరవలి మండలం కానూరు – నడుపల్లి మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్డు ప్రస్తుతం అడుగో గొయ్యి – గజానికో నుయ్యి అన్న చందంగా మారింది. చినుకు పడితే చాలు.. ఈ రోడ్డులో ఏర్పడిన గోతులు మడుగుల్లా మారిపోతున్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణసంకటంలా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ మార్గంలో నిత్యం ఎవరో ఒకరు పడిపోయి గాయపడటం పరిపాటిగా మారింది. కానూరు వద్ద కల్వర్టు నిర్మించకపోవడంతో నిడదవోలు – నరసాపురం ఆర్అండ్బీ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాలను కానూరు – నడుపల్లి మీదుగా మళ్లించారు. ఫలితంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బ తింది. అయినప్పటికీ, ప్రభుత్వం అటు కల్వర్టు నిర్మాణాన్ని, ఇటు రోడ్డు అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. పగటి వేళ గోతులు కనిపిస్తున్నా రాత్రి సమయాల్లో ఈ రోడ్డులో రావాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. ధ్వంసమైన రహదారులు అడుగడుగునా గుంతలు చెరువులను తలపించేలా ఛిద్రం బెంబేలెత్తుతున్న ప్రయాణికులు పట్టించుకోని సర్కారు -
● బుడిబుడి నడక్లు
తొలకరి వర్షాలు మొదలు కావడంతో ఖరీఫ్ పనులు ప్రారంభం కానున్నాయి. రబీ అనంతరం ఖాళీగా ఉన్న పొలాల్లో సాగు పనులకు రైతులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు, నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బాతులను వాటి కాపరులు మన ప్రాంతానికి తీసుకువచ్చారు. పొలాల్లోని ధాన్యం గింజలు, పురుగులు తదితర వాటిని బాతులు ఆహారంగా తీసుకుంటాయి. అలాగే వాటి రెట్ట పొలానికి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. రాయవరం – సోమేశ్వరం గ్రామాల మధ్య పొలాలకు మేతకు వెళుతున్న బాతుల గుంపు కనిపించింది. – రాయవరం -
ముక్తేశ్వరస్వామి ఆలయంలో చోరీ
పెదపూడి: సంపర గ్రామ శివారున గల వీక్షణ ముక్తేశ్వరస్వామి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. స్వామివారి వెండి కిరీటాన్ని, అమ్మవారి బంగారు మంగళ సూత్రాన్ని దొంగలు అపహరించారు. ఎస్సై ఎస్.తులసీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు ముందుగా ఆలయంలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. ఆలయం బయట తలుపులు పగలగొట్టి, గర్భగుడి తలుపులను ధ్వంసం చేశారు. అనంతరం స్వామివారి 1,330 గ్రాముల వెండి కీరిటం, పూజా సామగ్రి, అమ్మవారికి చెందిన ఒక గ్రామున్నర బంగారం మంగళ సూత్రాన్ని అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం అర్చకుడు ఆలయానికి వచ్చేసరికీ తలుపులు ధ్వంసం చేసి, లైట్లు వేసి, పరిసరాలు చిందరవందరగా ఉన్నాయి. ఆయన వెంటనే ఆలయ ఈఓ వడ్డాది సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. ఈఓ ఫిర్యాదు మేరకు కాకినాడ నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, ఇతర వివరాలు సేకరించాయి. ఎస్సై తులసిరామ్ సంఘటన స్థలంలో స్థానికులు, ఆలయ అర్చకుడు, ఈఓతో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సత్యదేవా... చూడవయ్యా..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రూపాయినీ ఆచితూచి ఖర్చు చేయాలి. అయితే శిథిలావస్థకు చేరడంతో కూల్చివేయాలని గతంలో నిర్ణయించిన ఓ భవనానికి మరమ్మతులు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని మరమ్మతులకు సుమారు రూ.రెండు కోట్లు వ్యయమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వివరాలు ఇవీ.. రత్నగిరిపై గల సీతారామ సత్రాన్ని 94 గదులతో 1990లో నిర్మించారు. ఈ సత్రం ఆవరణలో వివాహాలు కూడా పెద్ద సంఖ్యలో జరిగేవి. అయితే ఈ సత్రం శిథిలావస్థకు చేరడంతో దానిలో బస చేసేందుకు భక్తులు భయపడేవారు. దీంతో దాన్ని కూల్చివేసి, అక్కడ నూతన సత్రాన్ని నిర్మించేందుకు పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను 2024లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కోరారు. ఆర్అండ్బీ అధికారులు ఆ సత్రాన్ని పరిశీలించి, దాని పిల్లర్లు, కాలమ్స్ బలహీనపడ్డాయని, శ్లాబ్ పెచ్చులుగా ఊడిపోతోందని, కాబట్టి కూల్చివేయాలని నివేదిక సమర్పించారు. నూతన సత్రానికి టెండర్ ఆ నివేదిక ఆధారంగా నూతన సత్రం నిర్మించాలని అప్పటి ఈఓ నిర్ణయించారు. రూ.11.40 కోట్లతో తొలి దశలో నాలుగు అంతస్తులతో 105 గదులతో సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవగా దాదాపు 16 శాతం లెస్కు టెండర్లు ఖరారయ్యాయి. జీ ప్లస్ త్రీఫ్లోర్లతో ఈ నిర్మాణం సాగనుంది. గ్రౌండ్ ఫ్లోర్ను వాహనాల పార్కింగ్కు వదిలేస్తారు. మొదటి, రెండు, మూడు ఫ్లోర్లలో ఫ్లోర్కు 35 గదుల చొప్పున 105 గదులు నిర్మించాలని నిర్ణయించారు. మరమ్మతులకు సూచన దేవదాయశాఖ సలహాదారు, విశ్రాంతి ఇంజినీర్ సుబ్బారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేయిస్తే మరో ఐదేళ్లు పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. అదే విషయాన్ని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కు నివేదించారు. దీంతో ఆయన నూతన సత్రం నిర్మించడానికి మరో స్థలం చూడాలని ఆదేశించారు. దీంతో సత్యగిరిపై విష్ణుసదన్ పక్కనే నూతన సత్రం నిర్మించాలని ప్రతిపాదించారు. మరమ్మతులకు రూ.2 కోట్లు సీతారామ సత్రం మరమ్మతులకు దాదాపు రూ.రెండు కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. సత్రం అన్ని గదులు పరిశీలించిన తర్వాత పూర్తి అంచనాలు రూపొందిస్తే ఇంకా వ్యయం పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. మరమ్మతుల అనంతరం ఆ సత్రం ఎంత కాలం ఉంటుందోనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రం కూల్చివేయాలని గతంలోనే నిర్ణయం తాజాగా మరమ్మతులు చేయాలని ప్రతిపాదన రూ.2 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ని ప్రారంభించేందుకు వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ పాల్గొంటారన్నారు. కావున ఈ సమావేశానికి పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో నియామకాలు రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులను రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ బుధవారం కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా అంగాడ సత్యప్రియ (రాజమహేంద్రవరం రూరల్), రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీలుగా పరిమి సోమరాజు ( కొవ్వూరు), నరహరశెట్టి రాజేంద్ర బాబు (గోపాలపురం), నాగమళ్ల వీరభద్రరావు (అనపర్తి), రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా గెడ రాంబాబు (గోపాలపురం), స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా దొడ్డ సత్తిబాబు (నిడదవోలు) లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్టిఫికెట్ల పరిశీలనకు 183 మంది హాజరు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం బుధవారం సర్టిఫికెట్లు పరిశీలనకు 183 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు తెలిపారు. పరిశీలన అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్టు ఆయన తెలిపారు. గురువారం 86,001 నుంచి 1,04,000 వరకు వరకూ అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే ఒకటి నుంచి 50,000 ర్యాంకు వరకు అభ్యర్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలి పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం కాకినాడ క్రైం: పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, అందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలలపై చోటు చేసుకుంటున్న నేరాలను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కుటుంబ కలహాల్లో పరస్పర దాడులు జరగకుండా చూడాలన్నారు. ఆస్తుల చోరీల్లో రికవరీలు పెంచాలన్నారు. డ్రోన్ల సాయంతో శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా పెంచాలని సూచించారు. గంజాయి నిందితులను గుర్తించి నేరాల బాట పట్టకుండా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఏలూరు ఐజీపీ జీవీజీ అశోక్కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రేపు జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధికల్పనాధికారి జి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మెడ్ప్లస్, జేవీఎస్ టెక్నాలజీ, శ్రీభవానీ కాస్టింగ్, ఇన్నోసోర్స్ సర్వీస్ లిమిటెడ్, పేటీఏం సంస్థలు 615 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హతల గల అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదింవచ్చన్నారు. -
సత్యదేవునికి సిరుల వృష్టి
అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి. 602 గ్రాముల బంగారం.. హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు. పోటెత్తిన భక్తులు సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడంతో భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు అధికారులు చెప్తున్నారు. భారీగా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్ 55, సింగపూర్ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్ రియల్స్ ఒకటి, యూఏఈ దీరామ్స్ 40, యూరోలు 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 600 లభించాయి. హుండీ లెక్కింపులో ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం 35 రోజులకు రూ.2.12 కోట్ల నగదు 602 గ్రాముల బంగారం సమర్పణ -
సా..గుతున్న ఖరీఫ్!
జిల్లాలో నారుమళ్ల వివరాలు.. మండలం ఆవశ్యకత పూర్తయినవి నాట్లు (హెక్టార్లలో) (హెక్టార్లలో) (హెశ్రీశ్రీ)రాజమండ్రి రూరల్ 73 8 16 కడియం 107 8 – రాజానగరం 234 55 10 కోరుకొండ 288 30 25 గోకవరం 260 25 90 సీతానగరం 286 150 40 రంగంపేట 141 25 15 చాగల్లు 171 160 50 గోపాలపురం 211 101 – నల్లజెర్ల 212 35 – ఉండ్రాజవరం 246 130 – నిడదవోలు 363 300 10సాక్షి, రాజమహేంద్రవరం: రబీ వరి ధాన్యం డబ్బులు విడుదలలో జాప్యం.. అందని అన్నదాత సుఖీభవ నిధులు.. ఆపై కరుణించని వరుణుడు.. కాలువల ఆధునీకరణలో నిర్లక్ష్యం.. డెల్టా కాలువలకు సకాలంలో నీరు వదిలినా పొలాలకు చేరడంలో ఆలస్యం వెరసి ఖరీఫ్ సాగు నత్తలా సాగుతోంది. ఈ సమయానికే నారుమడులు పూర్తి కావాల్సి ఉన్నా.. 60 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. రుతుపవనాల కదలికతో.. ఖరీఫ్కు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే వాటి కదలిక నెమ్మదించడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,800 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశం ఉండగా.. సోమవారం నాటికి రెండు వేల హెక్టార్లలో నారుమళ్లు వేశారు. 7 మండలాలు మినహా.. మిగిలిన చోట్ల వరి నాట్లు వేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వంద శాతం నారుమళ్లు పూర్తవ్వాల్సి ఉందని రైతులు అంటున్నారు. అధ్వానంగా కాలువల ఆధునీకరణ గోదావరి డెల్టా పరిధిలోని కాలువలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సాగునీరు విడుదల చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.8 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. డెల్టాలోని పంట పొలాలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కాలువల నిర్వహణ (క్లోజర్) పనులపై ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 18 నియోజకవర్గాల పరిఽధిలో 972 పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. తిరిగి కాలువలకు నీరు వదిలేలోగా కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. డెల్టా ప్రధాన కాలువలకు ఈనెల ఒకటో తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకా పనులు చేస్తూనే జరుగుతూనే ఉన్నారు. నీరు వదిలి 25 రోజులు గడుస్తున్నా కాలువల్లో పూడికతీత, గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఇలా పనులు సాగుతుంటే నీరు ఎప్పటికి పొలాలకు చేరుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పొలాలకు సాగునీరు అందక సాగు నారుమళ్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులకు పాట్లు ధాన్యం విక్రయించిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వలేదు. గత నెల 24వ తేదీ నాటికి 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడులకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వచ్చింది. అందని ‘అన్నదాత సుఖీభవ’ సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద ఏటా రూ.13,500 పెట్టుబడి నిధి కింద అందజేసేది. ఎవరి దగ్గర అప్పులు చేయకుండా పంట సాగు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు అప్పులు చేయాల్సి పరిస్థితి తలెత్తింది. నారుమళ్లు ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 74 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. ఇందుకు 3,800 హెక్టార్లలో నారుమళ్ల అవసరం ఉండగా.. ఈనెల 23వ తేదీ నాటికి వ్యవసాయ శాఖ ఇచ్చిన గణాంకాల మేరకు రెండు వేల హెక్టార్లలో మాత్రమే పూర్తయ్యాయి. 305 హెక్టార్లలో నాట్లు వేసినట్లు వెల్లడించారు. 7 మండలాల్లో తప్ప మిగిలిన అన్ని మండలాల్లో వరి నాట్ల ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. చాగల్లు, గోకవరం, సీతానగరం దేవరపల్లి, కొవ్వూరు నిడదవోలు రాజమండ్రి, రాజానగరం, అనపర్తి, బిక్కవోలు మండలాల్లో నాట్లు ముమ్మరం చేసినట్లు వెల్లడిస్తోంది. వెదజల్లు పద్ధతిలో సాగు చేశారు. పూర్తికాని క్లోజర్ పనులు పొలాలకు చేరని నీరు జిల్లాలో ఆలస్యంగా నారుమళ్లు నారుమళ్లు వేగవంతం సార్వా సీజన్లో వరి ప్రాధానమైన పంట. నారుమళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. రైతులకు అవగాహన కల్పిస్తుస్తూ అవసరమైన సహకారం అందిస్తున్నాం. అనుకున్న సమయానికి వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. వరికి జిల్లాలో నీటికొరత లేదు. ఈ సీజన్లో జూన్ 1వ తేదీన నీటిని విడుదల చేశాం. – ఎస్.మాధవరావు, వ్యవసాయ అధికారిఅధ్వానంగా కాలువలు గోదావరి డెల్టా పరిధిలోని పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ప్రారంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేపడతామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. కాలువల్లో ఉన్న పూడిక, గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. ఈ పరిణామంతో రబీలో రైతులకు నీటి ఎద్దడికి కారణమైంది. దీనికి తోడు పంట కాలువల ద్వారా వస్తున్న నీటిని ఆక్వా రైతులు మోటార్లతో తోడేయడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా చేపట్టిన క్లోజర్ పనులను సైతం తూతూ మంత్రంగా చేపట్టినట్లు సమాచారం. ఖరీఫ్ సాగు దృష్ట్యా కాలువలకు నీరు వదిలినా కాలువల ఆధునీకరణ, పూడిక తొలగింపు వల్ల పూర్తి స్థాయిలో నీరు దిగువకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నీటి కొరత నేపథ్యంలో రైతులు దుక్కులు సైతం చేయలేని దుస్థితి తలెత్తింది. జూలై మూడో వారంలో నాట్లు పూర్తి చేస్తే ఖరీఫ్ చివరిలో విపత్తులు, వరదలు, వర్షాలు కురిసినా.. పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది. నాట్ల ప్రక్రియ ఆలస్యమైతే పంటను కోల్పోవాలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వానాకాలం.. పిడుగుల గండం..
రాయవరం/అంబాజీపేట: ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వానల కారణంగా చెట్లు, పొలాలు ఆకుపచ్చ రంగులో కనువిందు చేస్తుంటాయి. సాగు పనులతో గ్రామాల్లో సందడి నెలకొంటుంది. అదే సమయంలో వర్షాకాలం ప్రమాదాలను కూడా తీసుకువస్తుంది. వాటిలో పిడుగులతో అనేక అనర్థాలు కలుగుతాయి. సాధారణంగా వర్షం కురిసే సమయంలో ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. వాటి వల్ల పెద్ద ధ్వనులు, వెలుతురుతో పాటు విద్యుత్ శక్తి విడుదలవుతుంది. తుపానులు, భారీ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ విపత్తు నివారణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే పిడుగు ఎలా పడుతుంది, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అనేక అనర్థాలు పిడుగుల వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పశువులను మేపుకొనే కాపరులు, వ్యవసాయ పనులు చేసుకునే రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కసారి చెట్లు, మూగజీవాలు కూడా పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. పిడుగు అంటే ఆకాశంలో సహజ సిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదాపాతం. మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు, శబ్దాన్ని ఉరుము, ఉత్పన్నమయ్యే విద్యుత్తును పిడుగు అని పిలుస్తారు. అత్యధిక విద్యుత్తును కలిగిన పిడుగు పడడం వల్ల అసాధారణ నష్టాలు సంభవిస్తుంటాయి. ఒక్క పిడుగులో.. ఒక్క పిడుగులో ఒక పట్టణ అవసరాలకు ఆరు నెలల పాటు విద్యుత్తు అందించగలిగే శక్తి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. విరుద్ధ ఆవేశాలున్న మేఘాల మధ్య రాపిడి జరిగినప్పుడు మెరుపులు, ఉరుములు ఏర్పడతాయి. ఆ సమయంలో మేఘాల్లో రాపిడితో జనించే ఉష్ణం 50 వేల డిగ్రీల ఫారన్ గ్రేడ్ వరకూ ఉంటుందని అంచనా. ఈ వేడి అణువులన్నీ కలిసి ఒక నాళం మాదిరిగా ఏర్పడి భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీతో కలిస్తే పిడుగు అవుతుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్తు ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. ఆ సమయంలో ఏర్పడే క్షేత్ర తీవ్రత మీటర్కు 2 లక్షల ఓల్టులతో సమానమని చెబుతారు. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్ తరంగాలు సన్నని మార్గంలో భూమి మీదకు చేరేందుకు వాహనాలను వెదుక్కొంటాయి. ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ధ్వజ స్తంభాలు, ఎత్తయిన భవనాలపై కూడా పడతాయి. కాపర్ ఎర్త్ పిడుగు నుంచి తప్పించుకునేందుకు ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైరును అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటు చేసుకోవాలి. ఇది దాదాపు కిలోమీటరు దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఉప్పు, కర్పూర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమి లోపలకు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. పిడుగులతో అత్యంత ప్రమాదం వర్షాల సమయంలో అప్రమత్తత అవసరం జాగ్రత్తలు అవసరం వర్షం కురిసేటప్పుడు చెట్ల కింద ఉండకూడదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్లపై ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పిడుగులో లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది. వర్షం కురుస్తున్న సమయంలో అందరూ గొడుగులను వాడుతుంటారు. అయితే వాటిపై ఇనుప బోల్టులు లేకుండా చూసుకోవాలి. మీ దగ్గర కెమెరాలు, సెల్ ఫోన్లు ఉంచుకోకూడదు. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెరువులు, నది, సముద్రంలో ఈత కొట్టరాదు. -
శనైశ్చరస్వామి క్షేత్ర ప్రతిష్ఠను పెంచేందుకు చర్యలు
కొత్తపేట: శనిదోష నివారణకు దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర)స్వామి క్షేత్రంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు క్షేత్ర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారి (ఈఓ) డి.సురేష్బాబు అన్నారు. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఇన్చార్జి ఈఓగా వ్యవహరించారు. పూర్తిస్థాయి ఈఓగా రాజానగరం అన్నదాన సత్రం ఈఓగా పనిచేసిన సురేష్బాబు నియమితులయ్యారు. ముందుగా ఆయనకు దేవస్థానం సిబ్బంది, అర్చకులు వేదాశీర్వచనాలతో స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణం, పరిసరాలు, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఈఓ పరిశీలించారు. స్వామివారికి పూజలు, తైలాభిషేకాలు, ఇతర సేవలు, విధివిధానాలపై అర్చకులను అడిగి తెలుసుకున్నారు. నా భర్త ఆచూకీ తెలపండి సామర్లకోట: బయటకు వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాలేదని, అతడి ఆచూకీ తెలియజేయాలంటూ పేకేటి శరణ్య అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాట్లాడుతూ చంద్రంపాలెం గ్రామంలోని మసీదు చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకంపై తన భర్త శ్రీనివాసరావు ప్రశ్నించాడని, వారే అతడిని మాయం చేశారనే అనుమానం వ్యక్తం చేసింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటకు బయటకు వెళ్లిన శ్రీనివాసరావు రాత్రి వరకు రాలేదని, దీంతో బంధువుల ఇంటిలో వాకబు చేయగా ఫలితం కనిపించలేదని తెలిపింది. కాగా.. చంద్రపాలెం మెయిన్ రోడ్డు సెంటర్లో శ్రీనివాసరావు జ్యూస్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో నీలం రంగు ప్యాంటు, ఎరుపు, నీలం గళ్ల షర్టు ధరించాడు. సుమారు 5.1 అడుగుల ఎత్తు ఉంటాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ శరణ్య చేసిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమర్థవంతంగా మూల్యాంకన రాజానగరం: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మూల్యాంకన ప్రక్రియను సమర్థంగా పూర్తి చేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అధ్యాపకులకు సూచించారు. గోదావరి జిల్లాల్లోని 40 అనుబంధ బీఈడీ కళాశాలల 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకణ ప్రక్రియ యూనివర్సిటీ సెమినార్ హాలులో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ ప్రక్రియను బుధవారం సందర్శించిన ఆమె.. సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి అనపర్తి: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై పెబ్బిలి లోవరాజు బుధవారం తెలిపారు. ద్వారపూడి – అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై సుమారు 35 ఏళ్లు వ్యక్తి మృతదేహం పడి ఉందన్నారు. అతడి ఒంటిపై లేత నీలి రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు. దీనిపై సమాచారం కోసం ఎస్సై 94914 44022, సీఐ 94406 27551, ల్యాండ్ లైన్ 0883 2442821 నంబర్లను సంప్రదించాలని కోరారు. కోత అనంతర పద్ధతులతో పంటకు విలువ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలలో కోత అనంతరం పాటించే పద్ధతుల ద్వారా వాటి విలువ, మార్కెట్ సామర్థ్యం, నిల్వ సమయం పెరుగుతాయని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. స్థానిక జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ కార్యాలయంలో నాబార్డు సహకారంతో మంజూరు చేసిన చిల్లీ హీట్ పంప్ డ్రైయర్, టర్మిక్ ప్రాసెసింగ్ యూనిట్లను బుధవారం నాబార్డు ఏజీఎం ఎం.రాజశేఖరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. నాబార్డు ఏజీఎం ఎం.రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఐకార్–నిర్కా, నాబార్డు సంయుక్త భాగస్వామ్యంతో వాణిజ్య రంగం మరింత స్థిరంగా మారుతుందన్నారు. నాబార్డు డీడీఎం ఆర్.చక్రధర్, ఫోస్ట్ హార్వేస్ట్ విభాగాధిపతి డాక్టర్ కేఎల్ ప్రసాద్ మాట్లాడారు. -
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి: వర్జీనియా పొగాకు ధర మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాలకు బుధవారం 5,516 బేళ్లు అమ్మకానికి రాగా, వాటిలో 3917 బేళ్లు కొనుగోలు చేశారు. 1,599 బేళ్లను ట్రేడర్లు తిరస్కరించారు. కిలో గరిష్ట ధరను రూ.3 పెంచి కొనుగోలు చేశారు. మార్చి 24 నుంచి ఈ నెల 22 వరకు మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.290 పలికింది. దాదాపు 72 రోజులు ఈ ధర నిలకడగా కొనసాగింది. మంగళవారం మార్కెట్లో కిలో ధర రూ.291 పలకగా, బుధవారం మార్కెట్లో రూ.292 నుంచి రూ.293 లభించింది. అంటే మూడు రోజుల వ్యవధిలో రూ.3 పెరిగింది. ఎక్స్ గ్రేడ్ పొగాకుపై ఆసక్తి ఎక్స్ గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడంతో రైతులు తమ వద్ద ఉన్న ఆ గ్రేడ్ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. అయితే ఈ ధర కంటితుడుపు చర్య మాత్రమేనని, కిలోకు సగటు ధర రూ.350 ఉంటే గిట్టుబాటు అవుతుందని కౌలు రైతులు చెబుతున్నారు. బుధవారం మార్కెట్లో ఐదు వేలం కేంద్రాల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు 1,66,537 కిలోలు కొనుగోలు చేయగా, బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకు 7,086 కిలోలు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 21.41 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. వేలం కేంద్రాల వారీగా దేవరపల్లిలో కిలో గరిష్ట ధర రూ.292, సగటు ధర రూ.268, జంగారెడ్డిగూడెం–1లో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.276, జంగారెడ్డిగూడెం–2లో గరిష్ట ధర రూ.292, సగటు ధర రూ.279.27, కొయ్యలగూడెంలో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.271.55, గోపాలపురంలో గరిష్ట ధర రూ.293, సగటు ధర రూ.279.17 లభించింది. ఐదు వేలం కేంద్రాల కిలో సగటు ధర రూ. 275.09 పలికింది. కిలో గరిష్ట ధర రూ.293 కొనసాగుతున్న కొనుగోళ్లు -
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలకూ అవకాశం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. నిబంధనలు ఇవే.. ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు. జిల్లాలో పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 945 ప్రాజెక్టులు నమోదయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ వాటి రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల, ఎంపికయ్యే వాటి సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణంగా తెలుస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 202 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కనీసం మూడు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదు ప్రాజెక్టులు రూపొందించాలి. సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు పంపే వీలు బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం హెచ్ఎంలు చొరవ చూపాలి విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – కె.వాసుదేవరావు, డీఈవో, తూర్పుగోదావరి జిల్లా జాతీయ స్థాయిలో నిలిచేలా.. జిల్లా నుంచి వెళ్లే ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు విద్యార్థులు సృజనాత్మక ప్రాజెక్టులు తయారు చేసేలా ప్రోత్సహించాలి. – జీవీఎన్ఎస్ నెహ్రూ, జిల్లా సైన్స్ అధికారి -
మట్టి అక్రమ తవ్వకాలు ఆపండి
పాపిడిదొడ్డి చెరువుపిఠాపురం: మా నాయకుడు తవ్వుకోమన్నారు.. ఇటుక బట్టీలకు తరలించమన్నారు.. అంటు జనసేన నేతలు అధికార బలంతో ప్రారంభించిన మట్టి తవ్వకాలకు హైకోర్టు బ్రేక్ వేసిందని రైతులు తెలిపారు. మండలంలోని పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలపై ఇటీవల జనసేన నేతలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసినట్టు గ్రామ రైతులు, గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి తవ్వకాలు నిలిపివేయాలని గత నెలలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ చెరువు ఇప్పటికే చాలా లోతుగా ఉందని, ఇంకా తవ్వకాలు చేపడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారతాయని అధికారులకు అనేకసార్లు విన్నవించామన్నారు. అయినప్పటికీ కొందరు అధికార పార్టీ నేతలు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అడ్డగోలు మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ముమ్మిడి మహాలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు. జనసేన నేతలకు హైకోర్టు ఝలక్ ఎఫ్కే పాలెం రైతుల హర్షం -
డ్రైన్లో ఆవు మూగ వేదన
అతి కష్టంపై తీసిన అగ్నిమాపక సిబ్బంది అమలాపురం టౌన్: స్థానిక విత్తనాల వారి కాల్వ ప్రాంతంలో ఓ ఆవు రోడ్డు పక్క డ్రైన్లో ప్రమాద వశాత్తు పడిపోయి బయటకు వచ్చేందుకు నరక యాతన పడింది. డ్రైన్లో పడి ఇరుక్కుపోయిన ఆవు అవస్థ చూసిన స్థానికులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ కార్యకర్తలు స్పందించి అగ్ని మాపక దళానికి సమాచారం అందించారు. ఆ సిబ్బంది తాళ్లు, చెక్క బల్లలతో ఆవును తీసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మరో ప్రయత్నంగా డ్రైన్ను కొంచెం పగలగొట్టి ఆవును బయటకు తీశారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి కూడా అక్కడకు చేరుకుని ఆవును ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆవు సురక్షితంగా బయటకు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
డ్రైన్లో పడి యువకుడి మృతి
కరప: అసంపూర్తిగా వదిలేసిన డ్రెయిన్లో పడిన ఓ యువకుడు అందులోని ఇనుప రాడ్ గుచ్చుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా కలవరపరచింది. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొరిపల్లి గ్రామానికి చెందిన పరిసిపోగులు బాబులు (35) కూలి పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం కరపకు వచ్చిన బాబులు మద్యం తాగి ఆ మత్తులో తిరిగి కొరిపల్లి వెళ్తూ రోడ్డుపక్కన అసంపూర్తిగా వదిలేసిన సీసీ డ్రైన్లో అదుపు తప్పి పడిపోయా డు. దీంతో డ్రైన్లోని ఇనుప రాడ్ ఒకటి అతని చెవిలోంచి తలలోకి దిగిపోయింది. అక్కడే తాపీ పనిచేస్తున్న వారు మిషన్తో ఆ రాడ్ను కట్ చేసి చికిత్స కోసం 108లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు బాబులును పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాడాలలో ఎద్దుల బలప్రదర్శన
కోరుకొండ: మండలంలోని గాడాలలో మంగళవారం ఎద్దుల బలప్రదర్శన పోటీ జరిగింది. పోటీల్లో రాజానగరం నియోజకవర్గంలోని 25 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తక్కువ సమయంలో నిర్ణీత ప్రదేశానికి ఎద్దుల బండితో చేరుకున్న ఎద్దులకు బహుమతులు అందజేశారు. చక్రద్వారబంధానికి చెందిన శ్రీను ఎద్దులకు ప్రధమ బహుమతి రూ.10 వేలు, ట్రోఫీ, మురముండకు చెందిన సురేష్ గౌడ ఎద్దులకు రూ.8 వేలు, తోకలంక ఎద్దులకు రూ.7 వేలు, సీతానగరానికి చెందిన ఎద్దులకు రూ.6 వేలు, గాడాలకు చెందిన శ్రీను ఎద్దులకు రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేశారు. పాల్గొన్న ఎద్దుల యజమానులందరికీ రూ.వెయ్యి చొప్పున అందజేశారు. స్థానికనాయకులు, రైతులు పాల్గొన్నారు.