East Godavari District News
-
కోటసత్తెమ్మ సన్నిధిలో భక్తుల సందడి
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ తల్లి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకంతో దేవస్థానానికి రూ.1,88,977 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అమ్మవారికి జంగారెడ్డిగూడేనికి చెందిన కోసూరి దశరథరావు, నాగమణి దంపతులు, వారి కుమారుడు రాజేష్బాబు 500 గ్రాముల వెండి వస్తువులు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. యోగా.. అలవాటుగా మారాలిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రతి ఒక్కరికీ యోగా అలవాటుగా మారాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యాన గోదావరి తీరాన స్థానిక సరస్వతీ ఘాట్లో ఆదివారం తొలిసారిగా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగాపై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించేందుకు గాను ఈ నెల 20వ తేదీ వరకూ సాధన కార్యక్రమాలకు రూపకల్పన చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,700 మంది యోగా మాస్టర్ ట్రైనర్లుగా, 4,64,000 మంది అభ్యసకులుగా యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్, ఈ కార్యక్రమ నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ, ఈ నెల 7న కడియం సత్యదేవ నర్సరీ, 14న కొవ్వూరు గోష్పాద క్షేత్రం, 20న దివాన్ చెరువు నగరవనంలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. యోగాపై వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి విజేతలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రేపు జాబ్ మేళా సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఐటీసీ లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ కంపెనీల్లో ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి మంగళవారం కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఇంటర్ (ఒకేషనల్) ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 76608 23903 నంబర్లో సంప్రదించాలన్నారు. అయినవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి సన్నిధిలో లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్నప్రాశన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు. అన్నప్రసాద భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎన్.చైతన్య జనార్దన్, సిందూరి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.50,307, వి.వినోద్, సులోచనారాణి దంపతులు రూ.50,307 చొప్పున ఆదివారం విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. -
తలుపులమ్మ లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైయున్న తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్ల ద్వారా అమ్మవారిని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,11,455, పూజా టికెట్లకు రూ.2,13,300, కేశఖండన శాలకు రూ.24,040, వాహన పూజలకు రూ.5,010, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.85,956, విరాళాలు రూ.1,44,033 కలిపి మొత్తం రూ.6,83,794 ఆదాయం లభించిందని వివరించారు. -
రూ.384.19 కోట్ల పొగాకు విక్రయాలు
● కిలో గరిష్ట ధర రూ.290 ● సగటు ధర రూ.275 ● 13.96 మిలియన్ల కిలోల కొనుగోలు దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.384.19 కోట్ల విలువైన 13,964,687 కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ప్రస్తుత పంట కాలంలో కొనుగోళ్లు ప్రారంభించి 67 రోజులు కాగా, 54 రోజుల పాటు వేలం నిర్వహించారు. ఇప్పటి వరకూ 13.30 మిలియన్ల కిలోల వర్జీనియా (ఎన్ఎల్ఎస్), 6,54,991 కిలోలు బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు కొనుగోలు చేశారు. 1,08,004 బేళ్లు అమ్ముడు పోయాయి. కిలో గరిష్ట ధర రూ.290, కనిష్ట ధర రూ.200, సగటు ధర రూ.275.11 చొప్పున లభించాయి. సగటున కిలో ఎన్ఎల్ఎస్ పొగాకుకు రూ.276.70, బీఎస్ పొగాకుకు రూ.242.89 చొప్పున ధర లభించిందని పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రానికి శనివారం 469 బేళ్లు అమ్మకానికి రాగా, 306 బేళ్లు కొనుగోలు చేశారు. జంగారెడ్డిగూడెం–1లో 620 బేళ్లకు 384, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 685కు 469, కొయ్యలగూడెంలో 549కి 282, గోపాలపురం వేలం కేంద్రంలో 408 బేళ్లకు గాను 192 కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల నుంచి మొత్తం 2,731 బేళ్లు వేలానికి రాగా, 1,657 బేళ్లు అమ్ముడు పోయినట్టు ఆర్ఎం ప్రసాద్ తెలిపారు. కౌలు రైతుల ఆందోళన పొగాకు మార్కెట్ పట్ల కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మార్కెట్లో పొగాకు కొనుగోళ్లు ముగిసే నాటికి కిలో గరిష్ట ధర రూ.410, సగటు ధర రూ.390 చొప్పున పలికాయి. దీంతో చాలా మంది పెద్ద రైతులు కుబేరులయ్యారు. ఇది చూసి మెట్ట ప్రాంతంలోని చాలా మంది రైతులు పొగాకు సాగుకు మొగ్గు చూపారు. దాదాపు 20 ఏళ్లు కష్టపడి పెంచిన జీడిమామిడి, కొబ్బరి, ఆయిల్పామ్ వంటి తోటలను తొలగించి మరీ పొగాకు సాగు చేశారు. కొంత మంది కౌలు రైతులు అధిక ధరకు భూములు తీసుకుని పంట వేశారు. 2023–24 పంట కాలంలో ఎకరం కౌలు రూ.40 వేలు ఉండగా, ప్రస్తుత 2024–25 సీజన్లో ఏకంగా రూ.70 వేలు పలికింది. అయినప్పటికీ రైతులు పోటీ పడి మరీ కౌలుకు భూములు తీసుకున్నారు. బ్యారన్ల అద్దె, ఖరీదు ఊహించని విధంగా పెరిగాయి. బ్యారన్ అద్దె రూ.2 లక్షలు, బ్యారన్ ఖరీదు రూ.8 లక్షలు చొప్పున పలికాయి. 2022–23లో బ్యారన్ అద్దె రూ.60 వేలు, ఖరీదు రూ.2.50 లక్షలు మాత్రమే ఉంది. కౌలు భూములు, అద్దె బ్యారన్లను తీసుకుని పంట వేసిన కౌలు రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. చేసిన అప్పులను తలచుకుని వారు కుమిలిపోతున్నారు. పొగాకు సాగు చేసి అన్ని విధాలుగా దెబ్బ తిన్నామని వాపోతున్నారు. వేలం కేంద్రాల వారీగా జరిగిన కొనుగోళ్లు (కిలోలు), గరిష్ట, సగటు ధరలు (రూ.లు) వేలం కేంద్రం కొనుగోలు గరిష్ట ధర సగటు ధర గోపాలపురం 29,83,204 290.00 275.98 దేవరపల్లి 22,80,171 290.00 277.22 జంగారెడ్డిగూడెం–1 34,93,033 290.00 276.97 జంగారెడ్డిగూడెం–2 28,32,751 290.00 275.63 కొయ్యలగూడెం 23,75,527 290.00 278.13 -
మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్
పామర్రు పోలీస్ స్టేషన్కు తరలింపు ముమ్మిడివరం: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలపాలని మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం రూరల్, క్రైమ్ సీఐల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బందరుపాలెం సమీపంలో కర్రివానిరేవుకు చెందిన జేఏసీ నాయకుడు కాశి జగపతిరావు, ఎదుర్లంక గ్రామానికి చెందిన దుక్కిపాటి సత్యనారాయణ, ముమ్మిడివరానికి చెందిన దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పామర్రు పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకురాలు కాశి బాలమునికుమారిని ముమ్మిడివరం బాలయోగి ఆశ్రమం వద్ద గృహ నిర్బంధం చేశారు.అలాగే కాట్రేనికోనకు చెందిన వడ్డి శ్యాంప్రసాద్, గల్లా రాజేందర్లను గృహ నిర్బంధం చేశారు. శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు జేఏసీ నాయకులను తీసుకు వచ్చి అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బిక్కవోలు: పందలపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పందలపాక గ్రామానికి చెందిన రెడ్డి పైడారావు (57) పనిపై తొస్సిపూడి వెళ్లి తిరిగి బైకుపై ఇంటి వస్తుండగా... తొస్సిపూడి సెంటర్లో గుడిమెట్ల శ్రీనివాస్రెడ్డిని వస్తున్నారు. పందలపాక కోదండరామా రైస్మిల్లు వద్దకు వచ్చేసరికి, ధాన్యం ట్రాక్టర్ వేగంగా వెళ్తూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వీరు అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఇద్దరూ గాయపడ్డారు. దీంతో వారిని అనపర్తి సీహెచ్సీకి తరలించడంతో రెడ్డి పైడారావు మృతి చెందాడు. గుడిమెట్ల శ్రీనువాస్రెడ్డి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. అందరితో సరదా ఉండే వ్యక్తి మృతితో విషాదచాయలు అల్లుకున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలపై సమాచారం
సీతానగరం: మండలంలోని సింగవరం ర్యాంపు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై చైన్నె, ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్కు మెయిల్ ద్వారా సమాచా రం ఇచ్చానని వంగలపూడికి చెందిన మాజీ సైనికుడు, న్యాయ వాది సూరెడ్డి శివకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకుని, వాటిని వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్, ఏడీ మైన్స్, తహసీల్దార్, ఎస్సైలకు సామాజిక మాధ్య మాల ద్వారా తెలియపర్చానని తెలిపారు. దీంతో ఎస్సై స్పందించి లారీలను నిలిపివేశారని అన్నారు. శనివారం ఉదయం మైన్స్ ఏడీ నుంచి లిఖిత పూర్వక మెసేజ్ ఇచ్చారని, అందులో జిల్లా కలెక్టర్కు గాని, తనకు గాని సంబంధం లేదని తెలిపారన్నారు. అనకాపల్లి కలెక్టర్, మైన్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే సంబంధం ఉందని తెలియపర్చారని వివరించారు. జిల్లాలో తవ్వకాలపై వారికి సంబంధం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్జీటీకి తెలిపర్చిన తరువాత తనకు సమాచారం అందించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సింగవరం లంక భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండగా, వంగలపూడి లంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి, సింగవరం ర్యాంపు నుంచి కాకుండా వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లారీలపై తరలిస్తున్నారని అన్నారు. సోమవారం గ్రామస్తులంతా లారీలను అడ్డుకుంటారని, అనకాపల్లి కలెక్టర్, ఏడీ మైన్స్ వారు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసే వరకూ ఆ లారీలను అడ్డుకుంటామని శివకుమార్ హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
భార్యకు తీవ్ర గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన బిక్కన సత్యభాస్కరరావు (69), అతని భార్య పాపాయమ్మతో కలసి స్కూటీపై పెద్దాపురం మండలం కట్టమూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి వెనుక నుంచి వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో సత్యభాస్కరరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి సఖినేటిపల్లి: ఉయ్యూరువారి మెరక గ్రామంలోని పైలాన్ సెంటర్లో శనివారం విద్యుత్ షాక్కు గురై దింపు కార్మికుడు బూసి నాని (28) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఒక రైతు పొలంలో నాని కొబ్బరి దింపు తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చెట్టుకు సమీపంలోని 11 కేవీ విద్యుత్ లైనుకు చేరిఉన్న కొబ్బరి ఆకును తొలగించే క్రమంలో ప్రమాదశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో మృతి చెందిన నాని చెట్టుపైనే మోకుతో వేలాడుతూ ఉండిపోయాడు. -
రైతు ప్రాణం తీసిన కలుపు మందు
నల్లజర్ల: పంట పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ఓ యువ రైతు ప్రాణం తీసింది. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలాకృష్ణ ప్రసాద్ (30) పదిహేను రోజుల కిందట పొలాల్లో కలుపు నివారణకు ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు డబ్బాను పొలానికి తీసుకెళ్లాడు. ఆ డబ్బాను బైక్ ముందు కవర్లో పెట్టాడు. మార్గ మధ్యంలో డబ్బా మూత లీకై అతని ప్యాంట్పై పడింది. ఏమీకాదులే అని కడిగేసుకుని ఆ మందు స్ప్రే చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒంటిపై పడిన మందు ద్రావణం వృషణాల నుంచి శరీరంలోని కిడ్నీ, లివర్ తదితర అవయవాలకు సోకింది. అతను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది క్రితమే ప్రసాద్కు ఆవపాడుకు చెందిన మౌనికతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అటవీ భూమిలో చెట్ల నరికివేత గోపాలపురం: మండలంలోని కోమటికుంట అటవీ భూమిలో ఉన్న చెట్లు నరికివేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్ల పుల్లలను స్వాధీనం చేసుకున్నామని డీఆర్ఓ కె.వేణుగోపాల్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉన్న వేప, జీడిమామిడి చెట్లు అక్రమార్కులు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అక్కడ రెండు ట్రాక్టర్లతో ఉన్న సుమారు 12 టన్నుల పుల్లలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. -
పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తర భారత దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు మీదుగా వారణాసి, ప్రయోగరాజ్, రామ జన్మభూమి, త్రివేణి సంగమం నైమిశా శరణ్యం సందర్శించుకోవచ్చన్నారు. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పర్యటన ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల్లో ఉందన్నారు. ఈ రైలుకు విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూలై 5న పంచ జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమై అదే నెల 13న యాత్ర ముగుస్తుందన్నారు. నాగపూర్, ఉజ్జయిని, నాసిక్, పూణే ఔరంగాబాద్, డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహా పుణ్యస్థలాల సందర్శన ఉంటుందన్నారు. ఈ రైలుకు కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ స్టేషన్లో బోర్డింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి లేహ్, లడఖ్, చారుదాం, గోవాలకు విమాన ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఐసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు. -
అలా స్పాగిపోతున్నారు..!
హెయిర్ కటింగ్తో ప్రారంభమై.. ముందుగా హెయిర్ కటింగ్తో కస్టమర్లను ఆకర్షించే నిర్వాహకులు కస్టమర్లు అడగకపోయినా హెడ్ మసాజ్ వంటివి చేస్తారు. వారు చూపిస్తున్న ఆసక్తిని బట్టి తమ వద్ద బాడీ మసాజ్ కూడా ఉందని చెబుతారు. అలా ముగ్గులోకి వచ్చిన కస్టమర్లతో మసాజ్ ప్రక్రియలో భాగంగా పరిచయం పెంచుకుంటారు. చీకటి మాటున జరిగే ఈ మసాజ్ ప్రక్రియలో ఫుల్ మసాజ్, బాడీ టూ బాడీ మసాజ్ వంటి పేర్లతో యువతులతో మగ కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ప్రత్యేక గదిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరిగిపోతుంది. అలవాటు పడిన కస్టమర్లు వారానికి ఒకసారైనా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ఫోన్లో బ్యూటీపార్లర్కు వచ్చే ఆడవారికి మగ వ్యభిచారులను కూడా సమకూరుస్తున్నట్టు రికార్డింగ్ బయటపడటం విష సంస్కృతికి అద్దంపడుతోంది. ఫ మసాజ్ పేరుతో మగువలతో వల ఫ రాజమహేంద్రవరంలో స్పా సెంటర్లు ఫ గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం ఫ దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం కంబాలచెరువు: (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నయా సంస్కృతి మొదలైంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో ఉండే స్పా సెంటర్ల కల్చర్ ఇక్కడకు విస్తరించింది. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం అధికమైంది. ఉపాధి పేరుతో ఆయా స్పా సెంటర్లలో చేరిన యువతులను నిర్వాహకులు పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఏడాది కాలంలో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న సుమారు 14 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం చూస్తే.. జిల్లాలో చాపకింద నీరులా విష సంస్కృతి పెరిగిందని చెప్పకనే అర్థమవుతోంది. ఎక్కడే ఎందుకంటే.. రాజమహేంద్రవరంలో ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఏవీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, దానవాయిపేట వంటి ప్రాంతాల్లో ఇటీవల స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉపాధి వేటలో భాగంగా బ్యూటీ కోర్సులు, మసాజ్ కోర్సులు వంటివి చేసి స్పా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగుంటుండటంతో అసాంఘిక శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి పెట్టుబడి పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు పథక రచన చేస్తున్నారు. బ్యూటీపార్లర్లతో కూడిన మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కస్టమర్లను వ్యభిచారం వైపు లాగుతున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లే విటులలో ఎక్కువ వ్యాపార వర్గాలు, యువత ఉంటున్నారు. కొద్దినెలల కిందట ఏవీ అప్పారావు రోడ్డులో పట్టుబడిన స్పా సెంటర్ నిర్వాహకురాలు బ్యూటీ పార్లర్లకు వచ్చే మహిళలకు వారి అభిరుచి మేరకు మగ వ్యభిచారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ వాయిస్ రికార్డింగు బయటపడటం చూస్తే పరిస్థితి చేయిదాటిందని అర్థమవుతోంది. ఎక్కడో మెట్రోపాలిటిన్ సిటీల్లో బయటపడే ఇటువంటి ఘటనలు జిల్లాలో విస్తరించడం చూస్తే అసాంఘిక శక్తులు ఏ మేరకు చొచ్చుకు వస్తున్నాయో స్పష్టమవుతోంది. ఉద్యోగం పేరుతో రొంపిలోకి బ్యూటీపార్లర్, సెలూన్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు ప్రారంభించే నిర్వాహకులు ముందుగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మసాజ్ సెంటర్లలో అనుభవం ఉన్న ఒకరిద్దరు యువతులను ఆకర్షణీయమైన ప్యాకేజీతో నియమించుకుంటారు. జన సంచారం తక్కువగా ఉండే ధనిక వర్గాలు నివసించే ప్రాంతాల్లో అట్టహాసంగా స్పా, సెలూన్ సెంటర్లు ప్రారంభించి రిసెప్షన్, హెల్పర్ల పేరుతో అందమైన యువతులను పనిలో పెట్టుకుంటారు. ముందే అనుభవం ఉన్న యువతులు కొత్తగా చేరిన వారితో సన్నిహితంగా ఉంటారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ తమవైపు తిప్పుకుంటారు. వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ పూర్తిగా వీరి ఉచ్చులో పడే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్తగా చేరిన యువతులకు పాత యువతులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిని కూడా మసాజ్ ప్రక్రియకు ఉపయోగించుకుని కమీషన్ ఇస్తారు. నిర్వాహకులు ఆ యువతులతో చనువుగా ఉంటూ ఫోటోలు దిగడం చేస్తుంటారు. అవి నిర్వాహకుల వద్ద ఉండటంతో ఆ యువతులు పూర్తిగా విధేయతతో ఉంటారు. వారితో గొడవ పెట్టుకునేందుకు సాహసించరు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. ఏడాదిలో 14 సెంటర్లపై దాడి ఏడాది కాలంలో జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మసాజ్ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో అసాంఘిక కార్యకలాలు నిర్వహిస్తున్న 14 సెంటర్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్కడ దొరికే యువతులను సాక్షులుగా పరిగణిస్తూ విటులపై, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. స్పాలు, బ్యూటీపార్లర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ఇవ్వాలి. –డి.నరసింహకిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా -
మార్టేరులో నూతన వరి వంగడాలు
రాజానగరం: బీపీటీ–5204 సన్న వరి వంగడానికి ప్రత్యామ్నాయంగా మార్టేరు శాస్త్రవేత్తలు ఎంటీయూ–1224, ఎంటీయూ–1262 వరి వంగడాలను తయారు చేశారని దివాన్చెరువులోని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ చల్లా వెంకట నరసింహరావు తెలిపారు. ఎంటీయూ–1224 రకం 140 రోజులు, ఎంటీయూ–1262 రకం 150 రోజుల్లో కోతకు వస్తాయన్నారు. ఆసక్తి ఉన్న రైతులు మార్టేరు ఈ విత్తనాలను మార్టేరు నుంచి పొందవచ్చని, పూర్తి వివరాలకు 99896 23805 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మహా కాళేశ్వరాలయంలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఇన్నీసుపేటలోని మహా కాళేశ్వరాలయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో శనివారం దర్శించుకున్నారు. ఆయనకు రోటరీ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పట్టపగలు వెంకట్రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహాకాళేశ్వర స్వామిని, ఉపాలయాలను సావో దర్శించారు. ఆలయ విశిష్టత, నిర్మాణం తదితర విషయాలను వెంకట్రావు వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆలయానికి రూ.10 లక్షల విరాళం రెండు కిలోల వెండి సమర్పణ దేవరపల్లి: పల్లంట్ల గ్రామంలో రాజరాజేశ్వరి సమేత దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయానికి గ్రామానికి చెందిన కొయ్యలమూడి హనుమంతరావు భార్య మంగాదేవి రూ.10 లక్షల విరాళం, 2 కిలోల వెండి సమర్పించారు. వీటిని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి కొయ్యలమూడి చినబాబు, సుధారాణి దంపతులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ, దాతలు సమర్పించిన రెండు కిలోల వెండిని అమ్మవారికి మకర తోరణానికి ఉపయోగిస్తామని, రూ.10 లక్షల విరాళాన్ని ఆలయం పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని స్వామి, అమ్మవార్ల ధూపదీప నైవేద్యాలకు వినియోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఈడుపుగంటి శివరాం ప్రసాద్, కొయ్యలమూడి సురేంద్రనాథ్ చటర్జీ, మొక్కపాటి శ్రీనివాసరావు, కొయ్యలమూడి అప్పారావు, భక్తులు పాల్గొన్నారు. -
ఎండీయూ వాహనాల తొలగింపు దారుణం
ఫ హైకోర్టును ఆశ్రయించాం ఫ బాధితులకు అండగా నిలబడతాం ఫ ఎండీయూ ఆపరేటర్ల ర్యాలీలో మాజీ ఎంపీ భరత్రామ్ రాజమహేంద్రవరం సిటీ: లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే రేషన్ సరకులు అందించాలనే మంచి లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్ల వ్యవస్థను అర్ధాంతరంగా తొలగించడం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీయూ ఆపరేటర్ల జిల్లా యూనియన్ ఆధ్వర్యాన స్థానిక మెయిన్ రోడ్డులో శనివారం నిర్వహించిన నిరసన ర్యాలీకి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, నాడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,600 మంది ఎండీయూ ఆపరేటర్లకు ఉపాధి లభించిందన్నారు. ఈ వ్యవస్థ పట్ల వృద్ధులు, మహిళలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని, సక్రమంగా పని చేస్తున్నప్పటికీ ఎండీయూ వ్యాన్లను జూన్ 1 నుంచి తొలగిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. దీనివలన వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారు నిరుద్యోగులుగా మారి, రోడ్డున పడనున్నారన్నారు. అనాలోచిత నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2027 వరకూ ఎండీయూ వ్యాన్లు నిర్వహించుకునేందుకు అనుమతులున్నప్పటికీ అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశామని, న్యాయస్థానం ప్రభుత్వ వివరణ కోరిందని చెప్పారు. అయితే, ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున లాయర్లు కోర్టుకు వచ్చి, ఇది ప్రభుత్వ విధానమని, ఖర్చు ఆదా అవుతుందని, మూడు వారాలు గడువు కావాలని కోరారని తెలిపారు. దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చిందన్నారు. ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోగా ప్రతి వర్గాన్నీ దెబ్బ తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 29 వేల మంది రేషన్ డీలర్లు ఉండగా, కొత్తగా మరో ఆరు వేల మందిని తీసుకుంటున్నారని, వీటిని టీడీపీ నాయకులు, అనుయాయులకు కట్టబెట్టడానికి ఎమ్మెల్యేలు రూ.లక్షలు డిమాండ్ చేస్తూ, జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. ఒక్కో రేషన్ డిపోకు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భరత్రామ్ అన్నారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ మాజీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ గుత్తుల మురళీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పార్లమెంటరీ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, నాయకులు మజ్జి అప్పారావు, సంకిస భవానీప్రియ, వాసంశెట్టి గంగాధరరావు, సప్ప ఆదినారాయణ, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో అందించిన లబ్ధి (రూ.కోట్లలో)
రుచీపచీ లేని భోజనం గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేది. గుడ్లు, చిక్కీలతో పాటు రోజుకో మెనూతో బలవర్ధకమైన భోజనం వడ్డించేవారు. జిల్లావ్యాప్తంగా 1,011 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దాదాపు 1.26 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. జగనన్న గోరుముద్ద పథకానికి గత ప్రభుత్వం రూ.11.64 కోట్లు వెచ్చించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలం చెల్లిన గుడ్లు, చిక్కీలు అందజేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందని ద్రాక్షలా మారింది.సాక్షి, రాజమహేంద్రవరం: విద్యా రంగంలో మునుపెన్నడూ చూడని విప్లవాత్మక మార్పులకు గత ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ‘నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు ఏటా ట్యాబ్లు అందజేశారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ), స్మార్ట్ టీవీల ద్వారా విద్యా బోధనను కొత్త పుంతలు తొక్కించారు. అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెనలతో పేదల ఉన్నత విద్యకు బాటలు వేశారు. గోరుముద్దతో రుచికరమైన పౌష్టికాహారం అందించారు. ఈ వినూత్న సంస్కరణలన్నీ గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరోగమనంలో పయనిస్తున్నాయి. తల్లికి వందనం అందేనా? ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క పేద విద్యార్థీ చదువుకోలేని పరిస్థితి ఏర్పడకూడదనే సమున్నత లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం అమలు చేసింది. విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. ఈ విధంగా నాలుగేళ్లలో జిల్లా వ్యాప్తంగా 1,55,769 మంది విద్యార్థులకు రూ.233.65 కోట్లు అందించింది. ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే కుటుంబంలోని పిల్లలందరికీ తల్లికి వందనం పేరిట ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పెద్దలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గద్దెనెక్కి ఏడాదవుతున్నా.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. నాడు దీవెన.. నేడు నిర్వేదన ఉన్నత చదువులకు బాసటగా నిలవాలన్న తలంపుతో గత ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన 34,764 మంది పేద విద్యార్థులకు ఏటా రూ.32.74 కోట్ల చొప్పున అందజేసింది. దీనివలన ఫీజులు చెల్లించుకోలేని ఎంతో మంది విద్యార్థులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం పడింది. వనతి దీవెన జగనన్న వసతి దీవెన పథకం కింద జగన్ ప్రభుత్వం 34,261 మంది విద్యార్థులకు చెందిన 30,559 మంది తల్లుల ఖాతాలో ఏటా రూ.32.61 కోట్లు జమ చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ పథకాన్నే పట్టించుకోవడం లేదు. డిజి‘డల్’ బోధన విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వం క్రమం తప్పకుండా బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ అందజేసింది. 2022–23 విద్యా సంవత్సరంలో 15,291 మంది విద్యార్థులకు, 2,445 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు. 2023–24లో 15,332 మంది 8వ తరగతి విద్యార్థులకు 5,510 ట్యాబ్లు అందజేశారు. ఈ ట్యాబ్లలో ఈ–పాఠశాల యాప్ అప్లోడ్ చేశారు. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకూ పాఠాలను అప్లోడ్ చేశారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, టోఫెల్ విధానాలను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటన్నింటికీ మంగళం పాడింది. నాటి ‘స్మార్ట్’ ఏదీ? విద్యా బోధనలో గత ప్రభుత్వం స్మార్ట్కు నాంది పలికింది. జిల్లాలోని 297 పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధన అమలు చేశారు. దీనికి గాను 1,099 స్మార్ట్ టీవీలు, 386 ఐఎఫ్పీలు అమర్చారు. వీటి ద్వారా పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు సులభంగా బోధించేవారు. కూటమి ప్రభుత్వ హయాంలో డిజిటల్ బోధన సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. విద్యా కానుక గత ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పేరిట ఏటా స్కూల్ బ్యాగ్, యూనిఫాం, బెల్ట్, షూ, పాఠ్య, నోట్ పుస్తకాలు, వర్క్బుక్స్, డిక్షనరీ కలిపి ప్రత్యేక కిట్గా అందజేసేది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1.765 లక్షల మంది విద్యార్థులకు రూ.30.50 కోట్ల విలువైన వస్తువులు అందించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.గత ప్రభుత్వ హయాంలో.. ఫ గత ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ జెడ్పీ హైస్కూలులో అన్ని తరగతులూ కలిపి సాధారణంగా వెయ్యి మంది విద్యార్థులకు పరిమితి ఉంది. ఈ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దడం, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడంతో ప్రవేశాల సంఖ్య 1,375కు పెరిగింది. ఫ జిల్లావ్యాప్తంగా కొన్నేళ్లుగా నిరాదరణకు గురైన 15 జూనియర్ కళాశాలల అభివృద్ధికి బాటలు వేశారు. రూ.10.79 కోట్లతో కళాశాలల ఆధునీకరణ పనులు చేపట్టారు. ఫ పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యలోనూ రిజర్వేషన్లు అమలు చేసింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో పేదలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 10 శాతం ఎస్సీలకు, 5 శాతం దివ్యాంగులకు కేటాయించింది. మరో 4 శాతం ఎస్టీలకు, బలహీన వర్గాలకు 6 శాతం సీట్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. ఫ పదో తరగతి అనంతరం ఇంటర్ చదివేందుకు విద్యార్థులు పడుతున్న అవస్థలను దూరం చేసేందుకు, గ్రామానికి సమీపంలోనే ఉన్నత విద్యను అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలోనూ ఒకటి చొప్పున 15 బాలికల జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఫ కూటమి పాలనలో అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ ఫ అందని ‘తల్లికి వందనం’ ఫ నత్తకు మేనత్తలా ‘నాడు–నేడు’ ఫ డిజిటల్ విద్యకు మంగళం ఫ రుచి లేని మధ్యాహ్న భోజనం మందగించిన ‘నాడు–నేడు’ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పథకం తీసుకువచ్చింది. జిల్లాలో తొలి విడతతో 414 పాఠశాలల్లో 1,006 పనులకు రూ.129.70 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో రూ.271 కోట్లు వెచ్చించి 665 పాఠశాలల్లో 996 అభివృద్ధి పనులు చేపట్టారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, కుర్చీలు, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్చాక్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు తదితర వసతులు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో వేగంగా జరిగిన ఈ పనులు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నత్తకు మేనత్తలా మారాయి. ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పథకం లబ్ధిదారులు లబ్ధి విద్యా దీవెన 70,241 142.99 వసతి దీవెన 69,098 65.56 అమ్మ ఒడి 1,56,000 234 జగనన్న విదేశీ విద్య 12 1.37 జగనన్న గోరుముద్ద 84,488 12.32 జగనన్న విద్యా కానుక 1,22,000 28.8 నాడు–నేడు పనులు 1069 369.89 -
4న వెన్నుపోటు దినం
టెన్త్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటంఫ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం ఫ వైఫల్యాలను ఎండగడదాం ఫ ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు పిలుపు రాజమహేంద్రవరం రూరల్: ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిన తీరును ఎండగడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆధ్వర్యాన మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు కార్పోరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచించకుండా దుర్మార్గ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ఆయన కళ్లు తెరిపిస్తామన్నారు. ఏడాదిలోనే 99 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని చెప్పారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఏడాదిలోనే అరాచక పాలన చూపించారన్నారు. పైగా ఎన్నికల హామీల గురించి ప్రశ్నించకుండా భయోత్పాతం సృష్టించడాన్ని ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరని అన్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తెస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పీ4 అంటూ పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎంగా తొలి ఏడాదిలోనే చంద్రబాబు రూ.1.49 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ సొమ్మంతా దేనికి వినియోగించారో తెలియదని అన్నారు. నాడు మామకు, నేడు నేరుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వెన్నుపోటు దినం సందర్భంగా నియోజకవర్గ స్థాయిల్లో పార్టీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి, అధికారులకు విజ్ఞాపనలు సమర్పిస్తామని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని, ఏడాది కాలంగా ప్రజలకిస్తామన్న అన్ని పథకాల లబ్ధినీ తక్షణం విడుదల చేయాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు, కూటమి ప్రభుత్వంలో మోసపోయిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేణు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ, ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేకపోయినా రూ.1.49 లక్షల కోట్లు అప్పులు మాత్రం చంద్రబాబు చేశారని విమర్శించారు. వలంటీర్లతో సహా పలువురి ఉద్యోగాలు ఊడబీకారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల వైద్య విద్య కలను సాకారం చేసేందుకు గత ముఖ్యమంత్రి జగన్ మెడికల్ కళాశాలలు నిర్మిస్తే, ఇప్పుడు వాటిని కూడా బడాబాబులకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, 2014లో డ్వాక్రా మహిళలను చంద్రబాబు వంచించారని, ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మళ్లీ మోసం చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు గిరజాల వీర్రాజు (బాబు), పరిమి సోమరాజు, పిట్టా శ్రీనివాస్, కంఠమణి రమేష్, ఇంటి వీర్రాజు, మార్తి లక్ష్మి, పెయ్యల రాజేష్, బొప్పన సుబ్బారావు, యెనుముల త్యాగరాజు, చిట్టూరి అన్నవరం, కొలిశెట్టి నాగేశ్వరరావు, చాగల్లు ఎంపీపీ మట్టా వీరాస్వామి, నియోజకవర్గ నాయకులు అంగాడి సత్యప్రియ, కానుబోయిన సాగర్, గుత్తుల మురళీధర్, చీరా రాజు, దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం రూరల్: పదో తరగతి విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేయాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ఒత్తిడి తీసుకుని రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో 66,363 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మందికి పైగా విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు మార్కుల్లో మార్పులు వచ్చాయన్నారు. మూల్యాంకనంలో టీచర్లకు టార్గెట్లు పెట్టి వేధించి, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుందన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి లోకేష్ టీచర్లను దోషులుగా చూపించి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారని అన్నారు. పదో తరగతి మూల్యాంకనం తప్పిదాలపై లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వేణు డిమాండ్ చేశారు. -
చెరువు గుట్కాయస్వాహా!
● బియ్యపుగుంట చెరువును పూడ్చేసిన ఆక్రమణదారులు ● అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ● పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిడదవోలు: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తుందా.. పాగా వేసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. దీనికి తాజా ఉదాహరణగా నిడదవోలులోని బాలాజీనగర్లో మున్సిపాలిటికి చెందిన బియ్యపుగుంట చెరువును ఆక్రమణదారులు పూడ్చివేశారు. బుధవారం రాత్రికి రాత్రే లారీలతో మంటి తరలించి 80 సెంట్ల ఉన్న చెరువును పూడ్చివేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలిచి సరిహద్దు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. విలువైన భూమి పట్టణ శివారున బాలాజీనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంజోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి పొలాలు కొని వెంచర్లు వేసి అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన 80 సెంట్ల బియ్యపుగుంట చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం భూమి రూ.10 వేలు పలుకుతోంది. సెంటు భూమి సుమారు 4.80 లక్షలు అయితే 80 సెంట్ల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఎక్కువగా చాగల్లు మండలం ధారవరం, బ్రాహ్మణగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 300కి పైగా పశువులు చెరువులో దాహం తీర్చుకునేవి. సుమారు 50 ఎకరాలకు సంబంధించిన మురుగునీరు చెరువుకు చేరడంతో పొలాలకు నష్టం లేకుండా ఉండేది. అయితే చెరువును పూడ్చివేయడంతో వర్షపునీరు, పంట మురుగునీరు వెళ్లే దారిలేక భవిష్యత్తో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు కరువవుతుందని వాపోతున్నారు. -
ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలంటూ ధర్నా
రామచంద్రపురం రూరల్: ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని కోరుతూ వెంకటాయపాలెం, వేగాయమ్మపేట గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్కుమారి, వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ లారీలు, ముఖ్యంగా ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండి పడ్డారు. ఈ నెల 28న మహిళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తల్లిని కూడా కోల్పోయి అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపాలెం ప్రధాన రహదారి నుంచి వేగాయమ్మపేట, యర్రపోతవరం, యానాంలకు దగ్గరి దారిగా ఉండటంతో చీమలదిబ్బ గ్రామం నుంచి కాలువ గట్టు రహదారిపై నుంచి లారీలు రాకపోకలు సాగించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటం రెండు పక్కలా కాలువలు ఉండటంతో అధిక బరువు కలిగిన లారీల వల్ల రోడ్డు కూడా కుంగిపోయి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడులు వేస్తున్న ఇసుక లారీలకు కనీసం బరకాలు కూడా కప్పకపోవడంతో లారీల వేగానికి ఇసుక ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, చీమలదిబ్బ దారిలో లారీలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, రాయుడు కృష్ణ, కోడి అర్జునుడు, ఇళ్ల గణపతి, అనుసూరి దుర్గ, దంగేటి జ్యోతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దడాల రవికుమార్ పాల్గొన్నారు. -
జమైకా హ్యాపిల్!
యానాం: కరేబియన్ దీవులలో వెస్ట్ండీస్ సమీపంలోని జమైకా ద్వీప దేశంలో జమైకా ఆపిల్గా పిలిచే చెట్టు యానాం పట్టణంలో ఓ గృహంలోని పెరట్లో వందలాది కాయలతో విరగకాస్తుండటంతో పలువురిని ఆకర్షిస్తోంది. దీంతో పలువురు 20 అడుగుల ఎత్తులో ఉన్న ఆ చెట్టును చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బాలయోగి కాలనీలో కేతా ఫణి, జగదాంబకు చెందిన గృహంలో 15 ఏళ్ల క్రితం నాటిన జమైకా ఆపిల్ చెట్టు ఉంది. దీనికితోడు ఆ మొక్క పూలనుంచి ఎర్రని పుప్పొుడులు కిందికి పడటంతో చెట్టుకింద ఎర్రని తివాచీగా పరచినట్టు ఉంది చూపరులను ఆకర్షిస్తోంది. చూసేందుకు వాటర్యాపిల్లా ఉన్నప్పటికి రుచి కమ్మగా ఉంటుంది. జమైకా ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న జమైకా ఆపిల్ బలమైన ఎముకలు, దంతాలను నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు. -
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సీఐ
సామర్లకోట: పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బుధవారం సంతమార్కెట్ సెంటర్లో ఒక బాలుడు సెల్ఫోన్ చూస్తూ నడుచుకొంటూ వెళ్లిపోతున్నాడు. దానిని గమనించిన సీఐ ఎ.కృష్ణభగవాన్ బాలుడి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలుడు మూగవానిగా తెలుసుకున్నారు. దాంతో సెల్ఫోన్లో నంబర్కు ఫోన్ చేయడంతో ఆ బాలుడిని వేదాంశ్ కార్తికేయగా గుర్తించారు. సీఐ సమాచారం మేరకు తల్లి పోతుల తులసీ, తండ్రి శరత్కుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తాము విశాఖపట్నం నుంచి వేసవి సెలవుల కారణంగా కోట్లమ్మ చెరువు వద్ద బంధువుల ఇంటికి వచ్చామని తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల తమ కుమారుడు వేదాంశ్ కార్తికేయ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకొంటూ బయటకు వచ్చేయడాన్ని తాము గమనించలేదని చెప్పారు. క్షేమంగా తమ కుమారుడిని అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు సీఐకి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
అంగన్వాడీ కార్యకర్త తొలగింపుపై నిరశన
● నాలుగు రోజులుగా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు ● అస్వస్థతకు గురైన బాధితురాలు పద్మ ● ఆసుపత్రికి తరలించిన సహచరులు శంఖవరం: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో 12 ఏళ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం.పద్మను అక్రమంగా తొలగించి అదే గ్రామానికి చెందిన బీసీ డీ కులానికి చెందిన పాకిలా భవానీని విధుల్లోకి చేర్చుకోవడం అన్యాయమని ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఈ నెల 17 నుంచి ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తకు నోటీస్, రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా మరొకరిని విధుల్లోకి ఎలా చేర్చుకుంటారంటూ నాలుగు రోజులుగా ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. బాధితురాలు పద్మ నాలుగు రోజులుగా ఆహారం సక్రమంగా తీసుకోకుండా శుక్రవారం దీక్షలో కూర్చుంది. దీక్షలో కూర్చున్న గంటలో తీవ్ర అస్వస్థకు గురైంది. ఆమెను 108 వాహనంలో అంగన్వాడీలు సీహెచ్సీకీ తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అంగన్వాడీ కార్యకర్త పద్మకు పలువురి పరామర్శ నిరాహార దీక్షకు పూనుకున్న అంగన్వాడీ కార్యకర్త ఎం.పద్మ అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం పలువురు పరామర్శించారు. జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు శేషు బాబ్జి చికిత్స పొందుతున్న పద్మను పరామర్శించి ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అప్పటివరకు పని చేస్తున్న కార్యకర్తలనే కొనసాగించాలంటూ గత ప్రభుత్వం 2020 డిసెంబర్ 4వ తేదీన ఉత్తర్వులు విడుదల చేసిందని, అయినా అధికారులు ఈ జీవోన దాచిపెట్టి, ఈ నెల 16న కోర్టు ఆర్డర్ ఉన్నదంటూ మరో ఆమెను విధుల్లోకి చేర్చుకోవడం ఆన్యాయమన్నారు. ఇప్పటికై నా అధికారులు పద్మను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు గెడ్డం బుల్లమ్మ, బి.రత్నకుమారి, డి.సత్యవేణి, నూకరత్నం, రాజేశ్వరి పాల్గొన్నారు. -
నిలిచిపోయిన సంచార పశు వైద్యం
పశువులకు వాటి పోషకుల ఇంటి ముంగిటనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్లు తీసుకురాగా.. జిల్లాకు 16 కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ బృహత్తర కార్యక్రమానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఫోన్ చేసి, పశువు అనారోగ్య సమస్యను వివరిస్తే చాలు.. అంబులెన్స్లో రైతు ముంగిటకే వెళ్లి వైద్య సేవలు అందించేవారు. ఈ సేవలను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో పశు పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకునేందుకు నానా పాట్లూ పడుతున్నారు. ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దనే సంక్షేమం ఫ చేరువలోనే రేషన్, వైద్యం ఫ కూటమి హయాంలో నిలిచిన ఇంటింటి సేవలు ఫ వలంటీర్, రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థలు రద్దు ఫ ఫ్యామిలీ డాక్టర్కు మంగళం ఫ ప్రజలకు తప్పని ఇక్కట్లు సాక్షి, రాజమహేంద్రవరం: గడప గడపకూ రేషన్ వాహనాలు రానంటున్నాయి.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు స్తంభించాయి.. సంచార పశు వైద్య వాహనాలు కదలడం లేదు.. వలంటీర్ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ ఫలాలు గుమ్మం వద్దకు చేరడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మారిన పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలును విస్మరించిన కూటమి ప్రభుత్వం.. ప్రజల మన్ననలు పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గతంలో ఇంటి ముంగిట్లోనే అందిన సేవలను ఇప్పుడు దూరం చేసిన ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఫలితంగా అధికారం చేపట్టిన ఏడాదిలోనే కూటమి పాలన తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. అందని సురక్ష గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరిట ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాలు, క్లస్టర్ పరిధిలోని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన ఫ్యామిలీ మెంబర్, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అక్కడే అందజేసేవారు. ఈ సేవలకు కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. జిల్లాలో కూటమి హయాంలో నిలిచిన సేవలు గ్రామ, వార్డు వలంటీర్లు 9,579 సంచార పశువైద్య వాహనాలు 16 రేషన్ వాహనాలు 364సాక్షి, రాజమహేంద్రవరం: గడప గడపకూ రేషన్ వాహనాలు రానంటున్నాయి.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు స్తంభించాయి.. సంచార పశు వైద్య వాహనాలు కదలడం లేదు.. వలంటీర్ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ ఫలాలు గుమ్మం వద్దకు చేరడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మారిన పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలును విస్మరించిన కూటమి ప్రభుత్వం.. ప్రజల మన్ననలు పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గతంలో ఇంటి ముంగిట్లోనే అందిన సేవలను ఇప్పుడు దూరం చేసిన ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఫలితంగా అధికారం చేపట్టిన ఏడాదిలోనే కూటమి పాలన తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. -
ఇంటి వద్దకు రానంటున్న వైద్యం
వైద్యానికి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు ఇంటి వద్దనే వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ సేవలను 2022లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి పీహెచ్సీలో డాక్టర్తో కలిపి 14 మంది సిబ్బందిని నియమించింది. ప్రతి 5 వేల జనాభాకు ఒక స్పెషలిస్టు డాక్టర్ను అందుబాటులో ఉంచింది. 2023 జనవరి నుంచి ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇంటి వద్దనే బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు చేసి మందులు అందించేవారు. పీహెచ్సీ డాక్టర్ ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్లి ఓపీ సేవలందించేవారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద మంచం పట్టిన రోగులకు వారి ఇళ్ల వద్దనే వైద్య సేవలు, మందులు అందించేవారు. ఈవిధంగా ఒక్కో ఏడాది సుమారు 8 లక్షలకు పైగా ఓపీ సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఫలితంగా ప్రజలు నేడు వైద్య సేవల కోసం సుదూరంగా ఉన్న ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. దూరమైన ఆరోగ్య సేవలు గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 368 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కొన్నిచోట్ల వైద్యులను తొలగించి, నర్సులకు బాధ్యతలు అప్పగించడంతో మెరుగైన వైద్యం అందడం లేదు. ఫలితంగా దీర్ఘకాలిక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు అనాలోచితం
రాజమహేంద్రవరం సిటీ: మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లను కూటమి సర్కారు తొలగించడం అనాలోచిత చర్య అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నియమించిన తమను గడువు పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం తొలగించిందంటూ ఎండీయూ ఆపరేటర్లు రాష్ట్ర హైకోర్టులో భరత్రామ్ ఆధ్వర్యాన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ రాజమహేంద్రవరంలో శుక్రవారం మాట్లాడుతూ, ప్రజలకు ఇంటి వద్దనే రేషన్ సరకులు అందించే సదుద్దేశంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ నిరుద్యోగులకు సబ్సిడీపై ఎండీయూ వాహనాలు అందించిందని అన్నారు. రూ.5.23 లక్షల విలువైన వాహనానికి లబ్ధిదారులు రూ.70 వేలు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, వ్యాన్ కొనుగోలు చేసి, నిరుద్యోగ యువకులకు పంపిణీ చేసిందన్నారు. ఎండీయూ ఆపరేటర్కు నెలకు రూ.18 వేలు, హెల్పర్కు రూ.6 వేలు, పెట్రోలు ఖర్చులు 3 వేలు, ఏటా రూ.10 వేల ఇన్సూరెన్స్ చెల్లించే విధంగా ప్రభుత్వం నిబంధనలు పెట్టిందన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,500 మంది ఎండీయూ ఆపరేటర్లు రేషన్ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అనాలోచితంగా జూన్ 1 నుంచి ఈ వాహనాలను తొలగించేందుకు జీఓ జారీ చేయడంతో వేలాది మంది రోడ్డున పడే దుస్థితి నెలకొందన్నారు. ఎండీయూ ఆపరేటర్ల తరఫున వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిందని భరత్రామ్ తెలిపారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగంలో పలువురి నియామకం రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆరే శ్రీను (రాజమహేంద్రవరం సిటీ), కార్యదర్శులుగా కె.మణిబాబు (కొవ్వూరు), సత్తి సాయి వెంకటకృష్ణ ఈశ్వర్రెడ్డి (గోపాలపురం), సంయుక్త కార్యదర్శులుగా చేకూరి వీఎస్ రామకృష్ణంరాజు (రాజానగరం), ముచ్చకర్ల రవి (గోపాలపురం), నల్లమిల్లి విజయ మణికంఠ రెడ్డి (అనపర్తి), రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మేడుబోయిన గంగరాజు (గోపాలపురం), స్టేట్ వలంటరీ వింగ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవ రెడ్డి (అనపర్తి), వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తోమండ్రు రమేష్(గోపాలపురం)లను నియమించారు. డెల్టాలకు రేపటి నుంచి నీటి విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి ఖరీఫ్ సాగు అవసరాలకు ఆదివారం నుంచి గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు గోదారమ్మకు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు ముందస్తుగా పంట వేసుకునేందుకు వీలుగా జూన్ 1నే నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం క్లోజర్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి 15 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గుర్రపు డెక్క తొలగింపు పనులకు ఇబ్బందులు ఉండవన్నారు. సకాలంలో పంటలు వేసుకునేందుకు రైతులు సన్నద్ధం కావాలని గోపీనాథ్ కోరారు. 6 వరకూ రైల్వే గేటు మూసివేత కడియం: స్థానిక రైల్వే గేటును జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గేటు మూసివేస్తున్నామన్నారు. కడియం నుంచి రాజవోలు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రోడ్డు వినియోగించుకోవాలని కోరారు. -
ఇంటింటా రేషన్ రద్దు
రేషన్ షాపుల వద్ద ప్రజల అవస్థలకు స్వస్తి పలికేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. 2021 జనవరి 21న మొబైల్ డిస్పెన్సరీ వాహనాలను (ఎండీయూ) అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. దీనివలన రేషన్ డిపోకు వెళ్లి సరకులు తీసుకోలేని వృద్ధులు, అభాగ్యులలెందరికో సాంత్వన చేకూరేది. జిల్లావ్యాప్తంగా 364 రేషన్ పంపిణీ వాహనాలుండగా.. 5,64,994 రేషన్ కార్డులున్నాయి. 871 రేషన్ దుకాణాలుండగా ప్రతి నెలా 15,77,393 మందికి గాను 8,400 టన్నుల బియ్యం అందజేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానానికి మంగళం పాడింది. దీంతో, రేపటి నుంచి కార్డుదారులు క్యూలో నిల్చుని రేషన్ తీసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. -
కొల్ల్లగొట్టేస్తున్నారు
తాళ్లపూడి (కొవ్వూరు): ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెడ్జర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి, తరలించుకుపోతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో సుమారు 20 ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో 7 ఓపెన్, 13 బోట్స్మెన్ సొసైటీ ర్యాంపులు ఉన్నాయి. పడవ ర్యాంపుల్లో కూలీలతో ఇసుక సేకరించి పడవల్లో ఒడ్డుకు తేవాలి. ఓపెన్ ర్యాంపుల్లో అయితే అసలు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంత తరలిస్తున్నారనే దానికి లెక్కా పత్రం లేకుండా పోతోంది. లారీలు, భారీ యత్రాలు, పైగా డ్రెడ్జర్లను సైతం ఉపయోగించి ఇసుక తవ్వేస్తున్నారు. పలుచోట్ల బోట్స్మెన్ సొసైటీల ముసుగులో సైతం డ్రెడ్జర్లతో ఇసుక తవ్వుతున్నారు. కుమారదేవం, చిడిపి, తాడిపూడి వద్ద ఆరు ఓపెన్ ర్యాంపులున్నాయి. ఇక్కడ నదీ గర్భంలోకి కిలోమీటర్ల మేర బాటలు వేసి మరీ, భారీ యంత్రాల ఉపయోగించి ఇసుక తవ్వి, లారీలతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అధికార కూటమి నేతల ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తవ్వుకుపోతున్నారిలా.. ఫ కుమారదేవం వద్ద ఉన్న 3 ర్యాంపుల్లో భారీ యంత్రాలు వాడుతున్నారు. నదీ గర్భంలోకి 3 కిలోమీటర్ల మేర బాటలు వేసి మరీ ఇసుక తవ్వుతున్నారు. ఫ తాడిపూడిలోని ఓపెన్ ర్యాంపుల నుంచి ఏలూరు జిల్లాలోని స్టాక్ పాయింట్కు ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ భారీగా ఇసుక తవ్వేస్తూండటంతో గోదావరి నదీగర్భంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. గత శివరాత్రి పుణ్యస్నానాలకు వెళ్లి ఇక్కడే ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ఫ ఆరికిరేవుల వద్ద ఉన్న అన్ని ర్యాంపులు, కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపాన ఉన్న ర్యాంపుల్లో కూడా నిరంతరం డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేస్తున్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద కూడా ఇదేవిధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మిగిలిన ర్యాంపుల్లోనూ ఇదే తంతు. డ్రెడ్జర్లతో పడవల్లోకి ఇసుకను లోడ్ చేసి, యంత్రాలతో అన్లోడింగ్ చేస్తున్నారు. రాత్రి వేళ మరిన్ని డ్రెడ్జర్లు వాడుతున్నారు. ఆరికిరేవుల ర్యాంపులో అయితే పట్టపగలే డ్రెడ్జర్లు ఉపయోగిస్తున్నారు. సెమీ మెకనైజ్డ్ పేరుతో భారీ యంత్రాలకు అనుమతి ఇవ్వచ్చా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫ నిబంధనల ప్రకారం వంతెనలు, ఇతర నిర్మాణాలకు 500 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదు. కానీ, ఆ నిబంధనను ఇసుక మాఫియా తుంగలో తొక్కేస్తోంది. ఫ గతంలో బల్లిపాడు ర్యాంపులో ఇసుక తవ్వుతున్న ఓ డ్రెడ్జర్ను రాత్రి వేళ అధికారులు పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు పట్టపగలే కళ్ల ముందు పదుల సంఖ్యలో డ్రెడ్జర్లతో తవ్వేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఫ స్టాక్ పాయింట్ల వద్ద కూడా భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఫ ఓపెన్ ర్యాంపుల్లో టన్ను ఇసుకను రూ.78 నుంచి రూ.90 వరకూ విక్రయించాల్సి ఉండగా రూ.160 నుంచి రూ.180 వరకూ వసూలు చేస్తున్నారు. యూనిట్ ఇసుకను రూ.700 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. గట్టుకు తూట్లు కొత్తగా పలు ర్యాంపులకు అనుమతులు ఇవ్వడంతో వారు గోదావరి గట్టుకు ఇష్టానుసారం తూట్లు పొడిచి, బాటలు వేస్తున్నారు. దీంతో గోదావరి ఏటిగట్టుపై ప్రయాణాలంటేనే హడలెత్తే పరిస్థితి వచ్చింది. ర్యాంపులోంచి లారీలు అకస్మాత్తుగా రావడాన్ని కొందరు గమనించలేకపోతున్నారు. కొత్తగా వచ్చే వారికి ర్యాంపు ఎక్కడుందో తెలియడం లేదు. లంకలకు సైతం ఇష్టారాజ్యంగా తూట్లు పొడుస్తున్నారు. నిరంతరం అధిక లోడుతో ఇసుక లారీలు కళ్ల ముందే వెళ్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఇసుక జారిపడుతోంది. గోదావరి ఏటిగట్టు రోడ్డుకు ఆనుకుని స్టాక్ పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే వాహనాలు జారిపోయి, గాయపడుతున్నారు. మరోవైపు కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత ర్యాంపుల్లో నిరంతరం తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాడిపూడి ర్యాంపును గురువారం తనిఖీ చేశారు. సెమీ మెకనైజ్ట్ యంత్రాలకు అనుమతులున్నట్లు తెలిపారు. ఇసుక అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ, అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద ఇసుక ర్యాంపు ఫ గోదారి గర్భంలో డ్రెడ్జర్లతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ఫ భారీ యంత్రాలతో లోడింగ్ ఫ ర్యాంపుల నుంచి తరలిస్తున్న ఇసుకకు లెక్కే లేదు ఉచిత ఇసుక ముసుగులో దోపిడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని ర్యాంపుల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. భారీ యంత్రాలు, డ్రెడ్జర్లతో ఇసుక కొల్లగొడుతున్నారు. ఏటిగట్టు పొడవునా ఎక్కడ పడితే అక్కడ ఇసుక స్టాక్ చేస్తున్నారు. దీనివలన గట్టు పాడవుతుంది. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, కొవ్వూరు పర్యావరణ అనుమతులున్నాయా? గోదావరిలో ఇసుక తవ్వకాలకు అసలు పర్యావరణ అనుమతులున్నాయా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలతో గోదావరిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో లేని అనుమతులు ఇప్పుడెలా వచ్చాయి? ఇకనైనా నిబంధనలు పాటించాలి. – పిట్టా శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ దళిత జేఏసీ నాయకుడు, అన్నదేవరపేట -
వలంటీర్లకు ఉద్వాసన
సంక్షేమ పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముంగిట్లోనే అందించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించింది. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 9,579 మంది గ్రామ, వార్డు వలంటీర్లు నియమితులయ్యారు. ప్రజలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు (కుల, ఆదాయ, రేషన్ కార్డులు, పింఛన్ల దరఖాస్తులు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, నేటివిటీ తదితర) కావాలన్నా, సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా వలంటీర్లు దగ్గరుండి చూసుకునే వారు. వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పెద్దలు గద్దెనెక్కిన తర్వాత.. అత్యంత ప్రజాదరణ పొంది, దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. -
‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’
● ఏఈఓపై మరో ఆరోపణ ● సీఎంఓకు ఫిర్యాదు చేసిన భక్తుడు ● విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈఓకు ఉన్నతాధికారుల ఆదేశం అన్నవరం: ఏఈఓ కె.కొండలరావుపై మరోసారి ఆరోపణలు రావడం అన్నవరం దేవస్థానంలో కలకలం రేపింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఆయన ఫిర్యాదు ప్రకారం.. ఏం జరిగిందంటే.. హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.2 వేల టికెట్టుతో సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి తోసేశారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో, తాను ఒక్కసారిగా షాక్కు గురయ్యానన్నారు. ఆ వ్యక్తి దేవస్థానం ఉద్యోగి కె.కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే కింద పడిపోయిన తన భార్యను లేవదీసి, ఈఓకు ఫిర్యాదు చేద్దామనుకున్నానన్నారు. అప్పటికే ఈఓ కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈఓను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈఓ తెలిపారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు తోడవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. -
సైనిక సంక్షేమానికి చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో సైనిక సంక్షేమ నిధికి వచ్చిన విరాళాలను సైనికులకు, వారి కుటుంబాలకు అందజేసి, ఆర్థిక భరోసా, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన రూ.6,37,790 చెక్కును సైనిక సంక్షేమ అధికారికి కలెక్టర్, ఎస్పీ గురువారం అందచేశారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, సైనిక సంక్షేమ నిధికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని కోరారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, సైనిక సంక్షేమ నిధి ద్వారా సేకరించిన విరాళాలను మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన మాజీ సైనికులు, రక్షణ సిబ్బంది కుటుంబాల సంక్షేమం, పునరావాసానికి వెచ్చిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, సైనిక సంక్షేమ అధికారి కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యకుమార్, డీపీఎం బి.హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అర్జీలను త్వరితగతిన పరిశీలించాలి రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు, అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రీ సర్వేకి సంబంధించిన రాజానగరం గురించి 3, కోరుకొండ నుంచి 1, చాగల్లు నుంచి 6 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించామని, పరిష్కారం విషయంలో కచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. -
పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ
రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది. బదిలీలకు 8,836 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్ హెచ్ఎంలు 215, ఎల్పీ హిందీ 41, ఎల్పీ సంస్కృతం 3, ఎల్పీ తెలుగు 93, ఎల్పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్ఏ తెలుగు 524 మంది, ఎస్ఏ ఇంగ్లిష్ 729, ఎస్ఏ హిందీ 396, ఎస్ఏ సంస్కృతం 9, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ బయలాజికల్ సైన్స్ 479, ఎస్ఏ గణితం 873, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 615, ఎస్ఏ సోషల్ స్టడీస్ 471, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ 260, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 10, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,826 మంది ఉన్నారు. -
అయ్యో.. అసలే వద్దంటారా..!
● పంపాలో స్నానాలు వద్దంటున్న దేవస్థానం ● యువకుడి మృతితో చర్యలు ● అప్రమత్తం చేసే బదులు ఇదేం పని? ● ఘాట్లలో రక్షణ ఏర్పాట్లు చేయాలని భక్తుల విన్నపంఅన్నవరం: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లిన వారు గోదావరిలో స్నానం చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను కాపలా పెడితే ఎలా ఉంటుంది? అన్నవరం పంపా జలాశయం వద్ద ఇటువంటి పరిస్థితే భక్తులకు ఎదురవుతోంది. పంపా జలాశయంలో శ్రీచక్ర స్నానం గొయ్యిలో మునిగిపోయి బుధవారం ఒక యువకుడు మృతి చెందిన విషయం విదితమే. అక్కడ గొయ్యి ఉందని తెలియక, పెద్దగా లోతుండదని భావించి వెళ్లిన అతడు ఆ గోతిలో పడి మృతి చెందాడు. అక్కడ దేవస్థానం అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ గొయ్యి చుట్టూ మెష్ ఏర్పాటు చేసి, కర్రలు పాతి, జెండాలు అమర్చినా గొయ్యి ఉందనే విషయం అందరికీ తెలిసి ఉండేది. అటువంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద సంఘటనతో మేల్కొన్న అధికారులు విచిత్రమైన చర్య తీసుకున్నారు. అసలు పంపా జలాశయం వద్దకే వెళ్లవద్దని, అక్కడ స్నానం చేయవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో మార్చి లేదా ఏప్రిల్లో శ్రీరామ నవమి వేడుకలు, మే నెలలో సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అప్పుడు పంపాలో పెద్దగా నీరుండదు. ఈ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం కోసం పంపా స్నానఘట్టాలకు కొద్ది దూరంలో నాలుగేళ్ల క్రితం నలు చదరంగా సుమారు ఆరడుగుల లోతున గొయ్యి తవ్వారు. ఏటా ఆ గోతిని నీటితో నింపి చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న కూడా ఈ గోతిలోనే సత్యదేవుని చక్రస్నానం నిర్వహించారు. అయితే, పంపాలోకి నీరు వస్తే ఆ గొయ్యి పూర్తిగా మునిగిపోతుంది. ఒడ్డు నుంచి చూస్తే అక్కడ గొయ్యి ఉందనే విషయమే ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం తెలియకే కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వాసంశెట్టి చరణ్తేజ్ ఆ గోతిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ‘గేట్లు దాటి లోపలకు వెళ్లేందుకు ప్రవేశం లేదు’ అంటూ అధికారులు పంపా గేట్లకు గురువారం ఫ్లెక్సీలు తగిలించారు. అలాగే, నది వద్ద ‘ఇచ్చట నీటిలో దిగుట ప్రమాదకరం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే, పంపాలో స్నానం చేయడం నిషిద్ధమని బోర్డులు పెట్టారు. దీంతో, పంపా జలాశయానికి స్నానం చేయడానికి వస్తున్న భక్తులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పుణ్యస్నానాలకు వందలాదిగా.. పవిత్ర పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తూంటారు. అలాగే, అన్నవరం చుట్టుపక్కల ప్రజలు కూడా పండగలు, ఇతర పర్వదినాలు, గణపతి నవరాత్రుల్లో నిమజ్జనాలు, దసరా నవరాత్రుల్లో భవానీ మాలలు వేసిన వారితో పాటు కార్తిక మాసం నెల పొడవునా ఉదయం, సాయంత్రం వందలాది మంది పంపాలో పుణ్యస్నానాలు ఆచరిస్తూంటారు. పంపాలో స్నానం చేయకుండా వీరిని నియంత్రించడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి. ప్రమాదం గురించి అందరికీ తెలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కానీ మొత్తానికే స్నానం చేయవద్దంటే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలు మేలు ● స్నానం చేయవద్దని కాకుండా స్నానఘట్టాల వద్ద కొద్ది దూరంలో సత్యదేవుని చక్రస్నానం కోసం తీసిన గొయ్యి ఉందని, అందువలన స్నానం చేసేందుకు అక్కడి వరకూ వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ● చక్రస్నానం గొయ్యి చుట్టూ కర్రలు పాతి, వాటికి జెండాలు కట్టాలి. ● ప్రస్తుతం పంపా నీటిమట్టం 88 అడుగులకు చేరింది. వర్షాలు ఇంకా పడుతున్నాయి కనుక నీటిమట్టం త్వరలోనే 90 అడుగులకు చేరుతుంది. అప్పుడు స్నానఘట్టాల వరకూ నీరు వస్తుంది. అప్పుడు భక్తులు ఒడ్డునే స్నానం చేసే అవకాశం ఉంటుంది. ● గోదావరి, కృష్ణా నదుల స్నాన ఘట్టాల మాదిరిగా పంపా స్నాన ఘట్టాలకు కొద్ది దూరం వరకూ మాత్రమే భక్తులు వెళ్లేలా ఇనుప స్తంభాలు పాతి, ఇనుప గొలుసులు లేదా మెష్లు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే, భక్తులు అవి దాటి నది లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. -
రుచి మధురం.. రైతుకు లాభం
మలికిపురం: మామిడి తోటల నుంచి అధిక దిగుబడి సాధించడానికి రైతులు అనేక చర్యలు చేపడతారు. కాయలు రాలిపోకుండా, బాగా పెరిగేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం మామిడి సాగులో కవర్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. గత మూడేళ్లుగా ఈ విధానంలో అమల్లో ఉన్నప్పటికీ ఇటీవల బాగా వెలుగులోకి వచ్చింది. తోటల నుంచి దిగుబడి మెరుగ్గా ఉండడంతో రైతులందరూ ఈ విధానం ఆచరిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ కవర్ కల్చర్ విధానం ఉన్నప్పటికీ మామిడిలో మేలు జాతి అయిన బంగినపల్లి సాగులో ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా రైతులు, లీజుదారులు కూడా బంగినపల్లి మామిడిపై అధికంగా పెట్టుబడితో పాటు లాభాలపై ఆశలు పెట్టుకుంటారు. అయితే ఈ రకంపై చీడ పీడల కారణంగా నష్టపోతున్నారు.బంగినపల్లి మామిడి పండ్లకు మలికిపురం మండలంలోని గూడపల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది. గూడపల్లి కేంద్రంగా రాజోలు దీవిలో పలు గ్రామాలలో సాగవుతున్న బంగినపల్లి మామిడికి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇక్కడ సాగయ్యే బంగినపల్లి మామిడిపై రైతులు, వ్యాపారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మంచి ధర కవర్ కల్చర్ విధానంలో సాగు చేసిన మామిడి కాయలకు ధర ఎక్కువగానే లభిస్తుంది. సాధారణ విధానంలో సాగైన బంగినపల్లి మామిడికి సంబంధించి నూజివీడు మార్కెట్లో మంగు కాయ కేజీ రూ.15 నుంచి రూ.20 వరకూ ఉంటుంది. మేలైన కాయ కేజీ రూ.40 వరకూ పలుకుతుంది. అయితే గూడపల్లిలో బంగిన పల్లి కాయ ధర రూ.70 వరకూ ఉంటుంది. కవర్ కల్చర్లో పెరిగిన మామిడి కాయ గూడపల్లిలో ఏకంగా కేజీ రూ.130 నుంచి 160 వరకూ ధర పలుకుతోంది. వీటిని కూడా నేరుగా తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. ఫోన్లో ఆర్డర్లు చేసి ట్రాన్స్పోర్టు చేయించుకుంటున్నారు. సాధారణంగా బంగినపల్లి మామిడికి రుచి ఎక్కువ. రాజోలు దీవిలోని గూడపల్లి బంగినపల్లికి మరింత రుచి ఉంటుంది. ఎర్రని నేలలు రాజోలు దీవిలోని పలు గ్రామాలలో ఎర్రని ఇసుక నేలల ఉండడం వల్ల ఇక్కడ బంగిన పల్లికి రుచి ఎక్కువగా ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి కాయలకు ధర కూడా ఎక్కువే. వాతావరణ మార్పుల రీత్యా రాజోలు దీవిలో మామిడి చెట్లు ఆలస్యంగా కాపునకు వస్తాయి. ఏప్రిల్లో పూత పూస్తాయి. సీజన్ చివర జూన్లో దిగుబడి వస్తాయి. కానీ వర్షాలు మొదలు కావడంతో గూడపల్లి కాయలు మే చివరి నాటికే పక్వానికి చేరుకున్నాయి. జోరుగా ఎగుమతులు సాగుతున్నాయి. రాజోలు దీవి నుంచి ప్రతి ఏడాది సుమారు పది వేల టన్నుల బంగినపల్లి రకం బయట ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. దిగుబడి బాగుంది కవర్ కల్చర్ విధానంలో మూడేళ్లుగా బంగినపల్లి మామిడిని సాగు చేస్తున్నాను. కృష్ణా జిల్లాతో పాటు రాజోలు దీవిలోని గూడపల్లి పరిసర ప్రాంతాలలో ఈ పద్ధతి పాటిస్తున్నారు. దీనివల్ల దిగుబడి చాలా బాగుంది. ఎక్కువ ఆదాయం వస్తోంది. – గట్టెం సూరిబాబు, రైతు, తూర్పుపాలెం మామిడి సాగులో కవర్ కల్చర్ ఆశాజనకంగా దిగుబడి చీడపీడల నుంచి రక్షణ బంగినపల్లి రకానికి ఎంతో అనుకూలంసాగు ఇలా.. సాధారణంగా ఫిబ్రవరిలో పూతకు వచ్చే మామిడికి అంతకు ముందు డిసెంబర్, జనవరి నెలల్లో చీడపీడలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మార్చి నెలాఖరుకు, ఏప్రిల్లో పిందె దశకు చేరుకుంటుంది. పిందె వంద గ్రాములు అయ్యాక ప్రత్యేకమైన కవర్ను ఆ పిందెకు కడతారు. ఇక పండు తయారయ్యే వరకూ దాన్ని తీయరు. దీనివల్ల ఆ మామిడిని ఏ విధమైన చీడపీడలు ఆశించవు. కవర్ వేయడం వల్ల ఈదురుగాలులకు కాయ రాలిపోదు. ఒకవేళ రాలిపోయినా కాయ పాడవదు. నిర్ణీత సమయానికి పక్వానికి వచ్చిన కాయలను కోసి ఎగుమతి చేసుకోవచ్చు. ఇవి సాధారణ కాయల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పురుగు పట్టకుండా నాణ్యతగా ఉంటాయి. దిగుబడి కూడా రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు. మామూలుగా చీడపీడల వల్ల సగానికి పైగా కాయలు.. పిందె దశలోనే రాలి పోతాయి. అయితే కవర్ కల్చర్ వల్ల పురుగు చేరకుండా మామిడి పెరుగుతుంది. నష్టం పెద్దగా ఉండదు. కేవలం ఒక్కొక్క కవర్కు రూ.2.50 మాత్రమే ఖర్చవుతుంది. వీటిని కాయకు కట్టేందుకు మరో రూ.2.50 అవుతుంది. -
తీర్థయాత్రలకు వెళితే ఇంటిని దోచేశారు
రాజానగరం: ఇంటికి తాళం పెట్టి కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్తే, దుండగులు ఆ ఇంటిలో చొరబడి రూ.1.77 లక్షల విలువైన వస్తువులను దోచుకుపోయారు. దివాన్చెరువు శివారు రఘునాథపురంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై నాగార్జున బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన బల్లి వెంకటేశులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 25న తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లాడు. దీన్ని గమనించిన దొంగలు ఆ ఇంటి తాళం బద్దలు కొట్టి, దొరికినంత దోచుకుపోయారు. తర్వాత ఉదయం పక్కింటి వాళ్లు ఆ ఇంటి తలుపులు తెరచివుండటాన్ని గమనించి, తీర్థయాత్రలకు వెళ్లిన వారు తిరిగి వచ్చారమోనని చూశారు. వారి జాడ లేకపోవడంతో ఏదో జరిగి ఉంటుందని భావించి వెంకటేశుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే వెంకటేశులు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో భద్రపరిచిన 64 గ్రాముల బంగారు నగలు, 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు అపహరణకు గురైనట్టుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగార్జున తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ని రప్పించి, వేలిముద్రలను సేకరించారు. -
దైవదర్శనానికి వచ్చి అనంత లోకాలకు..
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువకుడి ప్రాణం పోయింది. పంపా రిజర్వాయర్లో స్నానఘట్టాల వద్ద స్నానం చేసేందుకు దిగిన ఆ యువకుడు శ్రీచక్రస్నానం కోసం తీసిన గోతిలో జారిపడి మృతి చెందాడు. అన్నవరం ఎస్సై శ్రీహరి బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం జగపతి నగరానికి చెందిన 15 మంది భక్తులు బుధవారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. స్నానాలు చేసేందుకు పవర్ ఆఫీసు వద్ద గల పంపా స్నానఘట్టాల వద్దకు వచ్చారు. వీరిలో ముగ్గురు యువకులు నదిలోకి దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. మొదట మూడు అడుగుల లోతు మాత్రమే ఉండడంతో ఇంకా ముందుకు వెళ్లగా సత్యదేవుని చక్రస్నానం కోసం తీసిన గోతిలో జారి మునిగిపోయారు. వారి కేకలు విన్న సమీపంలోని వారు వెంటనే అక్కడకు వెళ్లి ఇద్దరిని ఒడ్డుకు లాగేశారు. వాసంశెట్టి చరణ్ తేజ్ (16) మాత్రం లోపలకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. కొంతసేపటికి చరణ్ తేజ్ పైకి తేలడంతో ఒడ్డుకు తీసుకువచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. చరణ్ తేజ్ ఇటీవల విడుదలై పదోతరగతి ఫలితాల్లో కిర్లంపూడి మండలంలోనే మొదటి స్థానం పొందినట్టు తల్లిదండ్రులు తెలిపారు. నిర్లక్ష్యంగా వదిలేశారు పంపా నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో సత్యదేవుని ఉత్సవాల కోసం నాలుగేళ్ల క్రితం పంపా స్నానఘట్టాలకు సమీపంలో కోనేరు మాదిరిగా ఆరు అడుగుల లోతు గొయ్యి తవ్వారు. ఏటా వేసవిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఆ గోతిని మరింత లోతుగా చేసి, దానిలో నీరు నింపి శ్రీరామనవమి వేడుకలు, సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలలో చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన కూడా ఆ గోతిలోనే సత్యదేవుని చక్రస్నానం నిర్వహించారు. ఆ కార్యక్రమం అయ్యాక ఆ గోతి చుట్టూ మెస్తో ఫెన్సింగ్ చేయడమో లేక ఆ గోతి చుట్టూ సుమారు పది అడుగుల ఎత్తు కలిగిన కర్రలు పాతి జెండాలు అమర్చితే అందరికీ తెలిసేది. ఇటీవల వర్షాలకు పంపాలోకి నీరు చేరి, నీటిమట్టం 88 అడుగులకు వచ్చేసింది. దీంతో ఆ గొయ్యి నీటితో నిండిపోయింది. ఒడ్డు నుంచి చూసే వారికి అక్కడ గొయ్యి ఉందనే సంగతే తెలియదు. చరణ్ తేజ్తో పాటు మరో ఇద్దరు కూడా అలాగే ఆ గోతిలో పడిపోయారు. స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడి మృతి అన్నవరంలోని పంపా స్నానఘట్టాల వద్ద ప్రమాదం -
రూ.12 లక్షలతో అక్కౌంటెంట్ పరారు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన వ్యాపారి గంగుమళ్ల కాసుబాబు వద్ద ఐదేళ్లుగా అక్కౌంటెంట్గా పనిచేస్తున్న కంతేటి రాజా రూ.12 లక్షలతో ఉడాయించాడు. దీనిపై కాసుబాబు ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పి.వీరబాబు తెలిపిన వివరా ల ప్రకారం.. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన రాజా.. వ్యాపారి కాసుబాబు వద్ద అక్కౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న రాజాకు వ్యాపారి కాసుబాబు ముమ్మిడివరం సీఎస్బీ బ్యాంకులో తాకట్టు పెట్టిన దాదాపు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు విడిపించాలని, దానికి రూ.2.25 లక్షలు నగదు ఇచ్చి పంపించారు. అయితే రాజా ఆ బ్యాంకులో బంగారు నగలను తీసుకుని నగదుతో పరారయ్యాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్పై కేసుచాగల్లు: నిడదవోలు – పంగిడి రహదారిలో అతి వేగంగా, నిర్లక్ష్యంగా లారీ నడిపి నాలుగు గేదెలు చనిపోవడానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. మీనానగరం గ్రామ శివారులోని ఐఎంఎల్ డిపో వద్ద నిడదవోలు నుంచి పంగిడి వైపు వెళుతున్న క్వారీ లారీ మంగళవారం రాత్రి గేదెలను ఢీకొంది. ఈ ఘటనలో నాలుగు గేదెలు అక్కడికక్కడే చనిపోయాయి. వాటి యాజమాని మంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.చెట్టుకు ఉరి వేసుకుని రైతు మృతినల్లజర్ల: చీపురుగూడెం రిజర్వు ఫారెస్ట్లో చెట్టుకు ఉరి వేసుకుని రైతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మన్నపాలెం గ్రామానికి చెందిన రైతు మానికల వెంకన్నబాబు (35) గత నెల 7వ తేదీన పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కానీ తిరిగి రాకపోవడంతో 8వ తేదీన ఆయన భార్య దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. అదే గ్రామానికి చెందిన దానయ్య ఈ నెల 27న మేకలు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా ఒక చోట వెంకన్నబాబుకు చెందిన సైకిల్, చెప్పులు, సెల్ఫోన్ కనిపించాయి. ఈ విషయాన్ని వెంటనే వెంకన్నబాబు తండ్రి సత్యనారాయణకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఒక చెట్టుకు ఎముకల గూడు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల సాయంతో అది వెంకన్నబాబుదేనని గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. అంబాజీపేట: దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా కారును లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇవీ.. అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన మామిడిశెట్టి వెంకటపతి (ముసలయ్య) (58), భార్య కనకదుర్గ (54), వీరి కుమారుడు వెంకటరత్నం (32), కోడలు జ్యోతి స్వరూప, మనుమలు 12 ఏళ్ల దీక్షిత, 2 ఏళ్ల చేతన్ ఈ నెల 19వ తేదీ రాత్రి కాళేశ్వరం పుష్కరాలకు కారులో వెళ్లారు. అనంతరం ఈ నెల 20న భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగివస్తుండగా ఈనెల 21వ తేదీన కొత్తగూడెం వద్ద బొగ్గు టిప్పర్ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కనకదుర్గ, వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు. ముసలయ్య విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. జ్యోతి స్వరూప, దీక్షిత, చేతన్ చికిత్స పొందుతున్నారు. విద్యుత్ షాక్తో.. నల్లజర్ల: అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడేనికి చెందిన పదిలం శ్రీను (42) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిలం శ్రీను వ్యవసాయ కూలీ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం పొలం పనికి వెళ్లి వచ్చాడు. తన పశువులను మేత కోసం ఉండాళ్ల చెరువు సమీపానికి తోలుకు వెళ్లాడు. అక్కడ నీరు లేకపోవడంతో దగ్గరలోని బోరు వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. అతడికి భార్య మహేంద్ర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒమెన్లో అల్లవరం వాసి.. అల్లవరం: మండలంలోని వీరన్న మెరక ప్రాంతానికి చెందిన బద్దె రాజేంద్ర ప్రసాద్ (41) ఒమెన్లో వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యు లు, బంధువులు అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. ఒమెన్ దేశంలో పదేళ్లుగా డ్రైవర్గా రాజేంద్ర ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి, తిరిగి ఆ దేశానికి వెళ్లిపోయాడు. అక్కడ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తూనే జై భీమ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. కాగా.. రాజేంద్ర ప్రసాద్ చనిపోయాడన్న సమాచారం తెలియడంతో, దాన్ని నిర్థారణ చేసుకోవడం కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను అతడి భార్య సుధ ఆశ్రయించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు ఏపీ ఎన్నార్టీ ద్వారా భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడ వారు విచారణ చేయగా, మే 20న ఒమెన్లోని సూర్ పట్టణంలో రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని వివరణ ఇచ్చారు. ఆయన మృతదేహాన్ని భారత్కు తరలించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకున్నారు. -
అవయవ దానం.. బాధితులకు జీవితం
కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ద్వారపూడికి చెందిన నున్న శివన్నారాయణ (శివ) అవయవాలను ముగ్గురికి విజయవంతంగా అమర్చినట్టు ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ తెలిపారు. ట్రస్ట్ ఆస్పత్రిలో రోగికి శస్త్ర చికిత్స ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా చేపట్టామని, హైదరాబాద్కు చెందిన వైద్య నిపుణుడు సర్జన్ సచిన్ డాగా పాల్గొన్నారన్నారు. ట్రస్ట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ మూర్తి నేతృత్వంలో వైద్యులు సోమయాజులు, కిశోర్, గణేష్, సురేంద్ర, శ్రీకాంత్, రామకృష్ణ సమష్టిగా అవయవ సేకరణ, అమరిక నిర్వహించారన్నారు. రెండు కిడ్నీలలో ఒకటి విశాఖలో కిమ్స్ ఆస్పత్రిలోనూ, మరో కిడ్నీని ట్రస్ట్ ఆస్పత్రిలో రోగులకు అమర్చా మన్నారు. రెండు కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు అందించామన్నారు. శివ సోదరుడు వీరబాబు, వదిన శిరీష, భార్య విజయలక్ష్మి అవయవ దానం కోసం ముందుకు రావడంతోనే ఇది సాధ్యమైందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ నెల 25 రాజమహేంద్రవరం – ద్వారపూడి రోడ్డులో శివన్నారాయణ ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహానికి నివాళి కపిలేశ్వరపురం (మండపేట): అవయవాల మార్పిడి ప్రక్రియ అనంతరం శివన్నారాయణ మృతదేహాన్ని ద్వారపూడికి బుధవారం తరలించా రు. నియోజకవర్గంలోని పలువురు ద్వారపూడికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులు అర్పించిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ, పలు పార్టీల నాయకులు కంకటాల మురళీకృష్ణ, పాలిక రమణ, గజ్జి వెంకట రమణ, చింతా శ్రీనివాసరావు, పల్లా సన్యాసిరావు, తెల్లాకుల శివప్రసాద్, డాక్టర్ నాయుడు తదితరులు ఉన్నారు. -
జల్సాలకు బానిసలై చోరీల బాట
కడియం: వేమగిరి దేవీజనార్దన్ నగర్లో మే 26వ తేదీ జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ముగ్గురిని కడియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దేవీజనార్దన్ నగర్లో ఒంటరిగా ఉంటున్న దుళ్ళ అనంతలక్ష్మి అనే మహిళ ఇంట్లోకి ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం ఒక యువకుడు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. ఆమెను కొట్టి మెడలోని 12 గ్రాముల బంగారు గొలుసు, బీరువాలోని వెండి పూజా సామగ్రి, రూ.5 వేలు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై పట్టా ధనలక్ష్మి ప్రసన్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు, ఎస్సైలు పట్టా ధనలక్ష్మి ప్రసన్న, బి.దుర్గాప్రసాద్, క్రైం కానిస్టేబుల్ కె.సురేష్ బాబు, జి.రవికుమార్ ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తును ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా.. ఇదిలా ఉండగా వాహనాల తనిఖీల్లో భాగంగా కడియం రైల్వే స్టేషన్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామానికి చెందిన పెరవలి రామ్కుమార్, కాకినాడ జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన భయ్యి ఉష, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలానికి చెందిన కాట ఇందిరా ప్రియదర్శినిలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో వేమగిరిలో చోరీ విషయం వెలుగుచూసింది. వారి నుంచి 216 గ్రాముల వెండి వస్తువులు, 11.40 గ్రాముల బంగారు గొలుసు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించిన బ్లాక్ కలర్ మోటారు సైకిల్ను కూడా సీజ్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరు ముగ్గురూ బృందంగా ఏర్పడి నేరానికి పాల్పడుతున్నారు. వేమగిరిలో మొట్టమొదటి చోరీ చేశారని, వేగంగా దర్యాప్తు చేయడంతో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. రూ.3 లక్షల బంగారు ఆభరణాల చోరీకాకినాడ రూరల్: ఇంటి యజమానులు నిద్రిస్తుండగా, దొంగలు చొరబడి రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిమ్మాపురం రామకృష్ణ నగర్లోని ముదునూరి సుబ్బరాజు ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగలు ప్రవేశించారు. ఆ సమయంలో సుబ్బరాజు, భార్య ఆ గదిలోనే నిద్రిస్తున్నారు. ఆ పక్క గదిలో వారి అమ్మాయి పడుకుంది. దొంగలు ఏమాత్రం భయపడకుండా సుబ్బరాజు గదిలోకి వచ్చి, టేబుల్పై ఉన్న తాళాలను తీసుకుని బీరువా తెరిచి బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు తిరిగి వెళుతున్న సమయంలో పక్క గదిలోని కుక్క మెరగడంతో సుబ్బరాజుకు మెలకువ వచ్చింది. అప్పటికే దొంగలు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుపై తిమ్మాపురం అదనపు ఎస్సై మూర్తి కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి.● ఇద్దరు యువతులు, యువకుడి అరెస్టు ● బంగారం, వెండి వస్తువుల స్వాధీనం -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెకండ్, ఫైనల్ ఇయర్ ఫలితాలను ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు బుధవారం విడుదల చేశారు. ఫైనల్ ఇయర్ (ఆరో సెమిస్టర్) ఫలితాలకు సంబంధించి బీఏ 91.30 శాతం, బీకాం 94.03 శాతం, బీబీఏ 97.92 శాతం, బీఎస్సీ 87.50 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ (నాలుగో సెమిస్టర్) ఫలితాలలో బీఏ 74.1 శాతం, బీకాం 81.36 శాతం, బీబీఏ 81.65 శాతం, బీఎస్సీలో 80.44 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎస్సీ యువతకు ఉపాధి శిక్షణసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు లీడ్ క్యాప్, సీడాప్ ద్వారా లెదర్ ఫుట్ వేర్ తయారీ కోర్సులో 60 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కార్యనిర్వాహక సంచాలకులు జె.సత్యవతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన వారితో పాటు ఫెయిలైనవారు కూడా శిక్షణకు అర్హులే. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి. గుంటూరులోని నల్లపాడులో ఉన్న శ్రీకృష్ణసాయి ఎడ్యుకేషన్ సొసైటీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉచితంగా భోజనం, వసతితో కూడిన సదుపాయాలు కల్పిస్తారు. మరిన్ని వివరాలకు 90309 24569, 79813 49691 నంబర్లను సంప్రదించాలి. వ్యక్తిని రక్షించి.. యువకుడి మృతిఎస్.రాయవరం (అనకాపల్లి): రేవు పోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడబోయే ప్రయత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై విభీషణరావు తెలిపిన వివరాల ప్రకారం.. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ ఇషాక్ మదీనా వలీ (20), షేక్ అలీషాలు అదే గ్రామానికి చెందిన షేక్ అహ్మదుల్లా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బుధవారం అనకాపల్లి జిల్లా రేవు పోలవరం తీరానికి వచ్చారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సముద్రంలోకి కొట్టుకు పోతున్నట్టు గమనించారు. ఒడ్డున ఉన్న మహిళ బిగ్గరగా అరవడంతో విన్న ఇషాక్ మదీనా వలీ, అలీషాలు సముద్రంలోకి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. ఇంతలో రాకాసి అలలు పోటెత్తడంతో ఇషాక్ మదీనావలీ కొట్టుకుపోయాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు బయటకు తీసినప్పటికీ ప్రాణాలు నిలువలేదు. అతడి మృతదేహాన్ని నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
లాటరైట్ లారీలకు జరిమానా
ప్రత్తిపాడు: వంతాడ క్వారీ నుంచి లాటరైట్ ఖనిజాన్ని తరలిస్తూ నిబంధనలు పాటించని తొమ్మిది లారీలపై బుధవారం ట్రాన్స్పోర్టు అధికారులు కేసులు నమోదు చేశారు. జిల్లా డీటీసీ శ్రీధర్ ఆదేశాల మేరకు శంఖవరం మండలం కత్తిపూడి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో వాహనాల తనిఖీ చేపట్టారు. వంతాడ క్వారీ నుంచి లాటరైట్ ఖనిజాన్ని రావికంపాడుకు తరలిస్తున్న వాహనాలను పరిశీలించగా, లాటరైట్ ఖనిజం లోడుపై కవరు కప్పి ఉంచకపోవడం, మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం, డ్రైవర్ల వద్ద డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడం తదితర కారణాలపై తొమ్మిది వాహనాలపై కేసులు నమోదు చేశారు. వీటికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస్ రూ.58 వేల జరిమానా విధించారు. -
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
చాగల్లు: రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. బుధవారం చాగల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ నడిరోడ్డుపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. దళితులపై పోలీసుల అరాచకాలు కొనసాగుతున్నాయని, చట్టాలను కాపాడాల్సిన పోలీసులే వాటిని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టొద్దని దళిత, మైనార్టీ యువకులు వేడుకుంటున్నా పోలీసులు నడిరోడ్డుపై లాఠీలతో చితకబాదటం దారుణమన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలు, బడుగులకు ఆత్మగౌరవంతో బతికే హక్కు లేదా? వారిని పశువులను కొట్టినట్లు నడిరోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఏ రాజ్యాంగం ఇచ్చింది?’ అని వెంకట్రావు ప్రశ్నించారు. ’రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులు, మైనారిటీలను ఇలాగే హింసించాలని ఉందా అని ప్రశ్నించారు. ఇంతటి అమానవీయ ఘటన జరిగితే కనీసం దళిత హోంమంత్రి కూడా. స్పందించరా? యువకులను కొడుతుండగా వీడియోలు తీసి పోలీసులు ఎవరికి పంపారు? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనను చూసి దళితులు, మైనారిటీలు అభద్రతాభావానికి లోనవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. తెనాలి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో.. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడన్న కారణంతో రాజమహేంద్రవరానికి చెందిన అనే దళిత యువకుడిని పోలీసులు స్టేషన్కి పిలిపించి కొట్టి బెదిరించారని, అర్ధనగ్నంగా లాకప్లో నిలబెట్టి మహిళా కానిస్టేబుల్ను కాపలాగా ఉంచి మానసికంగా వేధించారని వెంకట్రావు గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కంతేరులో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలికి చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 20 మంది పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి లాక్కెళ్లారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందన్న కారణంగా పాలేటి కృష్ణవేణి అనే మహిళను హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చారని, ఆమెను కలిసే అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కే బేడీలు వేశారని వివరించారు. వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు ధ్వజం -
రాష్ట్ర పండగగా ఎన్టీఆర్ జయంతి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్టీఆర్ జయంతిని మొదటిసారి రాష్ట్ర పండగగా జరుపుకుంటున్నామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సమాచార పౌర సంబంధాల అధికారి, కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం కథానాయకుడు మాత్రమే కాదని, ఒక పరిపూర్ణమైన నటుడని అన్నారు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక పాత్ర లను కూడా ప్రేక్షకులు మెచ్చేలా నటించడం ఎన్టీఆర్కే సాధ్యమైందని చెప్పారు. సీ్త్రలకు ఆస్తి హక్కు దక్కేలా చట్ట సవరణ చేశారని, జనతా వస్త్రాలు రేషన్ షాపుల ద్వారా అందించారని, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియామకం పొందిన కె.ఎస్.జవహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.డీపీటీఓగా మూర్తి బాధ్యతల స్వీకరణరాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వైఎస్ఎన్ మూర్తి బుధవారం రాజమహేంద్రవరంలో బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం డిపో మేనేజర్గా విధులు నిర్వహిస్తూ డీపీటీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఉమ్మడి జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి కొండలరావు అభినందనలు తెలిపారు.లోవకు హుండీల ఆదాయం రూ.42.28 లక్షలుతుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.42,28,835 ఆదాయం లభించినట్టు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బుధవారం కాకినాడ భీమేశ్వరస్వామి గ్రేడ్–2 ఈఓ ఆర్.రాజేశ్వరరావు, సిరిపురం గ్రూపు టెంపుల్స్ గ్రేడ్–3 కార్యనిర్వహణ అధికారి ఎం.సూర్య రమణి సమక్షంలో హుండీలను తెరిచి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో నగదు లెక్కించినట్టు ఈఓ తెలిపారు. నాణేలు రూ.2,66,236, నోట్లు రూ.39,62,600 వచ్చాయన్నారు. లెక్కింపులో గోదావరి చైతన్య బ్యాంకు సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగి సస్పెన్షన్హుండీల ద్వారా భక్తులు సమర్పించిన నగదును లెక్కింపులో తస్కరించిన దేవస్థానం అటెండర్ ఎల్.ఎస్.వి.రమణను సస్పెండ్ చేసినట్టు ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో 109 నోట్లు ఉన్న రూ.500 కట్టను తస్కరించినట్టు సిబ్బంది గుర్తించారని, ఈ విషయం సీసీ ఫుటేజ్లోను స్పష్టమయినట్టు ఈఓ తెలిపారు. చోరీకి పాల్పడిన రమణపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం విధుల నుంచి తొలగించామన్నారు.అటెండర్ ఆత్మహత్యాయత్నంనేరారోపణకు గురైన అటెండర్ ఎల్ఎస్వీ రమణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనను సస్పెండ్ చేయడంతో మనస్థాపం చెందిన రమణ దేవస్థానం మూడో అంతస్తు నుంచి కిందకు (వినాయకుడి గుడి) వద్దకు దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రమణను సహ ఉద్యోగులు తుని ఏరియా ఆస్పత్రికి అక్కడ నుంచి కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయమవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.గోదావరిలో క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యంముమ్మిడివరం: కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలోని గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల్లో సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం బుధవారం ఉదయం సంఘటన స్థలంలో లభ్యమైంది. కె.గంగవరం మండలం శేరిల్లంకలో స్నేహితుడి ఇంట సోమవారం జరిగిన ఓణీ ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన ఎనిమిదిమంది యువకులు గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఐ.పోలవరం మండలం జి.మూలపొలం శివారు ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్, కాకినాడ తూరంగికి చెందిన యలవర్తి సాయి మహేష్, కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్, కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన ఎలిపే మహేష్, మండపేటకు చెందిన కులపాక రోహిత్, కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ల మృతదేహాలు మంగళవారం దొరికాయి. సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొన్నారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయన బుధవారం ఉదయం సంఘటనా స్థలంలో క్రాంతి కిరణ్ మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జి.మూలపొలం శివారు ఎర్రగరువు చెందిన అన్నదమ్ములు వడ్డి మహేష్, వడ్డి రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇంజినీరు పోస్టులు ఖాళీగా ఉండడం ఆందోళనకరం
రాజమహేంద్రవరం సిటీ : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలతో సహ ట్రానన్స్కో, జెన్ కోతో కలుపుకుని క్షేత్రస్థాయిలో వెయ్యికి పైగా ఏఈల పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కపల్లి శ్యామ్యూల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండడం లేదన్నారు. కీలకమైన ఏఈ స్థాయి అధికారుల యామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. 2022 పే రివిజన్ కారణంగా 1,800 మంది ఇంజినీర్లు ఇంక్రిమెంట్లు కోల్పోయారని సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నాగప్రసాద్, అసోసియేట్ సెక్రటరీ కె.వి.రామారావు, బ్రాంచి సెక్రటరీ రత్నాలరావు పాల్గొన్నారు. -
థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జూన్ 1నుంచి సినిమా థియేటర్ల బంద్ నిర్ణయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ల అచ్యుత రామారావు(బాబు) స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సినిమా థియేటర్ల మనుగడ కోసం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చించుకోవడానికి తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించామన్నారు. జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు తమ సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయని, థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు. హైదరాబాద్లో మే 13న సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో నైజాంలో అమల్లో ఉన్న పర్సంటేజీల విధానం ఆంధ్రాలోను అమలు చేయాలనే వాదన వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు జూన్ ఒకటి నుంచి ఎవరికి వారు థియేటర్లను సొంత నిర్ణయంపై నడుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ప్రకటన రావడంతో నైజాంకు చెందిన కొందరు పెద్దలు సినిమా రిలీజ్ను అడ్డుకోవాలని కుట్ర చేయడం వాస్తవమన్నారు. అయితే ఆ నెపాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణపై నెట్టివేశారని ఆరోపించారు. సినిమా హాల్స్ నిర్వహించడం ఆర్థికంగా నష్టదాయకమని, నిర్మాతలు పర్సంటేజీలు ఇస్తేనే ప్రదర్శనలు జరుగుతాయన్నారు. సమస్య పరిష్కారానికి సినీ నిర్మాత మండలి, నటీనటుల సంఘం (మా), ప్రభుత్వం సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తే థియేటర్లకు మనుగడ హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తేనే థియేటర్లకు మనుగడ ఉంటుందన్నారు. ఒక్కో హీరో సినిమా రెండేళ్లకు పైగా పడుతోందని దీనివల్ల సినిమాలు లేక థియేటర్లో కొన్ని షోలు నిలుపుకోవాల్సి వస్తోందన్నారు. థియేటర్లలో అధికారుల తనిఖీలు సర్వ సాధారణమన్నారు. సినిమాలకు ప్రేక్షకులే రానప్పుడు తినుబండారాల అమ్మకాలు ఏం జరుగుతాయన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు టిక్కెట్ ధరలు పెంచడం వల్ల సినిమాకు వచ్చే ప్రేక్షకులతో తిట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధిక ధరలు వల్ల నేల టిక్కెట్లు అమ్ముడు పోవడం లేదన్నారు. థియేటర్లు వ్యవహారంపై ఈనెల 30విశాఖలో ఏపీ ఫిల్మ్ చాంబర్, డిస్ట్రిబ్యూటర్ల సంయుక్త సమావేశం జరుగుతుందన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు ఎం.సదాశివ, డి.శ్రీనివాస్, సభ్యులు జి.రామారావు, జాస్తి బాపయ్య పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు అసోసియేషన్ అధ్యక్షుడు కోళ్ల బాబు -
పోలీసులమని చెప్పి బెదిరిస్తున్న ఇద్దరి అరెస్టు
రూ.1000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్, బటన్చాకు స్వాధీనం రాజమహేంద్రవరం రూరల్: పోలీసులం అని చెప్పి హైవేపై వాహనాలను ఆపి డబ్బు దోచుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి,. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు దివాన్చెరువు ఫారెస్టు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ఫీల్డ్పై వచ్చి బొలెరో వాహనాన్ని నిలుపుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ను బొలెరో వాహనానికి అడ్డుగా పెట్టి తాము పోలీసులమని చెప్పి కత్తి చూపించి బెదిరించారు. బొలెరో వాహనం డ్రైవర్ను కొట్టి జేబులోని రూ.1,000 నగదు దోపీడీ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పెదమానాపురంనకు చెందిన బొలెరో డ్రైవర్ కూరడ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్ మురళీమోహన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దివాన్చెరువు గ్రామశివారు పాలచర్ల రోడ్డులో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన సిర్ర జాస్పర్ప్రిన్స్ ఎలియాస్ జాస్పర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన గుడిసెరాబిన్లను అరెస్టు చేశారు. నిందితులు గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని డీఎస్పీ విద్య తెలిపారు. వీరిపై దారి దోపిడీ, గంజాయి కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్నాయని చెప్పారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు
రాజోలు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన నీతిపూడి పౌలుకుమార్ ఆచంట మండలం అయోధ్యలంక శివారు రావిలంక వద్ద గోదావరిలో గల్లంతైన ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పౌలుకుమార్ తండ్రి నాని 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు పౌలుకుమార్ గోదావరిలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పౌలుకుమార్ తల్లి నాగలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నాన్నమ్మ వద్ద ఉంటున్నాడు. రాజోలు మండలం తాటిపాక మఠం గ్రామానికి ఆనుకుని పెదలంక ఉండడంతో పౌలుకుమార్ 10వ తరగతి వరకూ తాటిపాక ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇటీవల 10వ తరగతి పాసయ్యాడు. నెల రోజుల క్రితం నాన్నమ్మ గారి ఊరైన పెదలంక నుంచి అమ్మమ్మ గారి ఊరైన పి.గన్నవరం మండలం నాగుల్లంక వెళ్లాడు. ఈ నెల 24వ తేదీన పౌలుకుమార్ పెదలంక వచ్చి మళ్లీ అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాడని నాన్నమ్మ భాగ్యవతి భోరున విలపించింది. నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మనుమడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని కంటతడి పెట్టుకుంది. గోదావరిలో గల్లంతైన మనుమడు పౌలుకుమార్ కోసం విలపిస్తున్న నాన్నమ్మ భాగ్యవతి, తాతయ్య నాగేశ్వరరావులను చుట్టుపక్కల వారు ఓదార్చారు. -
ఆరు కుటుంబాల్లో పెను విషాదం నింపిన గోదావరి స్నానాలు
సాక్షి, అమలాపురం/ ముమ్మిడివరం/ తాళ్లరేవు/ కాట్రేనికోన: గోదావరి తీరం శోక సంద్రంగా మారింది. గోదావరి ఒడిలో గల్లంతైన తమ బిడ్డలు ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారని తెల్లవార్లూ ఎదురుచూసిన ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర నిరాశే మిగిలింది. జిల్లా యంత్రాంగం మంగళవారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. యానాంకు చెందిన గజ ఈతగాళ్లు, పోలీస్ యంత్రాంగంతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆరు స్పీడ్ బోట్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కొక్క యువకుడి మృతదేహం లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.కె.గంగవరం మండలం శేరిలంకలో స్నేహితుడి సోదరి ఓణీల ఫంక్షన్కు వెళ్లిన 8 మంది యువకులు సోమవారం గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. తమ బిడ్డల ఆచూకీ కోసం రాత్రంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసినా చివరకు వారు విగత జీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయతీ శివారు ఎర్రగరువు గ్రామానికి చెందిన వడ్డి మహేష్(15) మృతదేహం తొలుత లభ్యమైంది. తరువాత కాకినాడ తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ (20), కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (15), మండపేట మండలం అర్తమూరుకు చెందిన కులపాక వీర వెంకట రోహిత్ (19), కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ కుమార్ (18), ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన వడ్డి రాజేష్ (18) మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడకు చెందిన పాస్టర్ కుమారుడు సబ్బతి క్రాంతి ఇమ్మానుయేల్ (19) ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను అంబులెన్స్లో ఎప్పటికప్పుడు ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ సాయిశృతి ఆధ్వర్యంలో డాక్టర్ నిఖిత, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ కౌశిక్ పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిస్థితిని రామచంద్రపురం డీఎస్పీ ఎం.రఘువీర్, అమలాపురం డీఎస్పీ టీఆర్ఎస్కే ప్రసాద్, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు మాధవి, డి.అఖిల సమీక్షించారు.దురదృష్టకర ఘటనశేరిలంక ఘటన చాలా దురదృష్టకరమైనదని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ అన్నారు. 20 ఏళ్ల లోపు యువకులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. స్నేహితులు ఆటవిడుపుగా ఇక్కడకు వచ్చి ఈవిధంగా మృత్యువాత పడడం చాలా దురదృష్టకరమైన ఘటన అన్నారు. గోదావరి లోపలికి వెళ్లడం, ఈత రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వీరిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ, చింతలపాటి శ్రీనురాజు, ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్కుమార్, నాయకులు కోలా బాబ్జీ తదితరులున్నారు.గురజనాపల్లిలో విషాద ఛాయలుకరప: స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లి గల్లంతైన వారిలో తాతపూడి నితీష్ కుమార్(18)ది కరప మండలం గురజనాపల్లి గ్రామం. అతని తండ్రి ఆటోడ్రైవర్, తల్లి వరలక్ష్మి గృహిణి. వీరికి సుచిత్ర, భానులత ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నితీష్. కాకినాడలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ, కాకినాడ జగన్నాథపురంలోని ఒక చర్చిలో గిటారిస్ట్గా నితీష్ నైపుణ్యం సాధించాడు. అతడి అకాల మరణంతో గురజనాపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే నితీష్ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. నితీష్ గల్లంతైన విషయం తల్లి వరలక్ష్మికి తెలియనివ్వలేదు. శవపంచనామా తర్వాత గురజనాపల్లి తీసుకొచ్చిన కుమారుడి మృతదేహం చూసి ఆమె గుండెలవిసేలా విలపించింది. చదువుకుని ప్రయోజకుడు అవుతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆ తల్లి రోదనకు అక్కడివారు కన్నీటి పర్యంతమయ్యారు. తదనంతరం నితీష్ కుమార్ మృతదేహం వద్ద అతని కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఖననం చేశారు.అన్నయ్యా.. నాకు దిక్కెవరుఅన్నయ్యా.. నాకు దిక్కెవరంటూ గోదావరిలో గల్లంతైన కులపాక వీర వెంకట రోహిత్ చెల్లెలు బిందు మాధవి బోరున విలపించింది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రోహిత్ చెల్లెలి కోసం తన చదువును పదో తరగతిలోనే ముగించి, అర్తమూరులోని ఒక రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. బిందు మాధవి ఇంటర్మీడియెట్ చదువుతోంది. పెద్ద దిక్కు లేని వీరిద్దరూ పెద్దమ్మ, పెదనాన్నలైన నక్కా సుజాత, గోవిందరాజుల వద్ద పెరుగుతున్నారు. చెల్లెల్ని ఉన్నత చదువులు చదివించాలన్న కోరిక తీరకుండానే రోహిత్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో చెల్లెలు బిందు మాధవితో పాటు పెద్దమ్మ, పెదనాన్నలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.నిండా ఇరవై ఏళ్లు లేవు. ఇంకా నూనూగు మీసాలు రాలేదు. వారిలో కొందరికి ఈత రాదు. కానీ ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. అందరూ కలిసి గౌతమీ గోదావరిలో స్నానాలకు వెళ్లారు. గోదారి తల్లి వారిని నిర్దాక్షిణ్యంగా తనలో కలిపేసుకుంది. ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో స్నానాలకు వెళ్లి సోమవారం గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురు విగత జీవులై తేలారు. అన్నపానీయాలకు ఆలవాలమైన గోదారమ్మ తల్లికి మరేం కోపం వచ్చిందో తెలియదు కానీ... ఏడు కుటుంబాలకు గర్భశోకాన్ని మిగిల్చింది.ఎవరి కోసం బతకాలి‘ఇద్దరు కొడుకులనూ ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడు. ఇంక నేను ఎవరి కోసం బతకాలి?’ అంటూ సబ్బతి పాల్ అభిషేక్ మృతదేహాన్ని చూసి తండ్రి రమేష్ అలియాస్ రఘు గుండెలవిసేలా రోదించాడు. రమేష్కు పాల్ అభిషేక్, క్రాంతి ఇమ్మానుయేల్ ఇద్దరు కుమారులు. ఈ ఘటనలో గల్లంతైన పాల్ మృతదేహం లభ్యంకాగా ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసి రమేష్ బోరున విలపించారు. ‘ఫంక్షన్కు వెళుతున్నాను డాడీ. డబ్బు కావాలి ఫోన్ పే చేయండి అని అడగగా పెద్ద కుమారుడు క్రాంతికి ఫోన్పే చేశాను. కానీ, చిన్న కుమారుడు పాల్తో చివరిసారిగా మాట్లాడలేకపోయాను’ అంటూ వాపోయారు. పెద్ద కుమారుడు ఆరడగుల ఆజానుబాహుడు కావడంతో పోలీస్ ట్రైనింగ్కి వెళితే సెలెక్ట్ అవుతావని ప్రోత్సహించేవాడినని, తన కుమారుల కోసం తన భార్య పండ్లు, తినుబండారాలు సిద్ధం చేసి ఉంచేదని, ఆమెకు ఏం చెప్పాలని అంటూ తల్లడిల్లిపోయారు. ఈత రాకున్నా వారు గోదావరిలో ఎందుకు దిగారో తెలియడం లేదన్నారు.ఉన్నత చదువు చదువుతాడనుకున్నాను‘మా కుమారుడు ఉన్నత చదువు చదివి ప్రయోజకుడవుతాడని కలలు కన్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది’ అంటూ కాకినాడ తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ తండ్రి ప్రసాద్ కంటతడి పెట్టుకున్నారు. తనకిద్దరు కుమారులని, పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేశాడని, రెండో కుమారుడైన సాయి మహేష్ ఒంగోలులో ఫిజియోథెరపీ కోర్సు చేస్తూ నీట్కు ప్రిపేర్ అవుదామనుకున్నాడని చెప్పారు. ‘ఉన్నత చదువులు చదువుతాడనుకున్నాను. పది రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు. స్నేహితుని ఇంట శుభకార్యానికి వెళతానని చెప్పి వచ్చి గోదావరిలో కలిసిపోయాడు’ అంటూ విలపించారు. -
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్ అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం కమిని గ్రామం వద్ద గోదావరిలో మృతిచెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, అండగా నిలవాలని జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అమలాపురంలో మంగళవారం యువకుల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల చాలామంది విద్యార్థులు, స్థానికులు మృతి చెందుతున్నారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కోనసీమ జెడ్పీటీసీ సభ్యులు, పందిరిశ్రీహరి రామ్గోపాల్, గెడ్డం సంపదరావు, కోనుకు గౌతమి, మట్టాశైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, పుట్టి కూడివీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా సంతాపం తెలిపారు. -
రైస్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రైస్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కొత్త కార్డుతో పాటు కార్డు విభజన, సింగిల్ మెంబర్ స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పు, బియ్యం కార్డు సరెండర్ వంటి వాటికి అవకాశం ఉందన్నారు. ఈ సేవలు పొందటానికి ఎటువంటి కాలపరిమితీ విధించలేదనీ, నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వరి విత్తనాలు సిద్ధం రాజమహేంద్రవరం రూరల్: ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 73,812 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్న నేపథ్యంలో, దానికి అవసరమైన 36,906 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంగా ఉంచామన్నారు. వీటిలో ప్రైవేటు డీలర్ల ద్వారా 3,690 క్వింటాళ్లు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. రైతు నుంచి రైతుకు 32,816 క్వింటాళ్ల విత్తనాలు వినియోగించడానికి సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 400 క్వింటాళ్ల విత్తనాలను జూన్ మొదటి వారంలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీపై అందిస్తామన్నారు. జీవితంలో యోగా భాగం కావాలికంబాలచెరువు (రాజమహేంద్రవరం): యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మంగళవారం రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. దీనికి మంత్రితో పాటు కలెక్టర్ పి.ప్రశాంతి హాజరయ్యారు. సుమారు 1,300 మంది ఖైదీలు, 200 మంది కారాగార సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో యోగా ఆవశ్యకతను వివరిస్తూ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, యోగా సాధన నిరంతర ప్రక్రియ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్, గిన్నిస్ రికార్డు గ్రహీత కేఎల్వీ శ్రీధర్రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, సెంట్రల్ జైలు అధికారులు బి.రత్నరాజు, ఆర్.శ్రీనివాసులు, జిల్లా ఆయుష్ వైద్యులు కె.రమేష్, సెంట్రల్ జైలు ఉపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త పి.కేజియా, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డు ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కోవిడ్ వ్యాిప్తి నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమవుతున్నారు. ముందు జాగ్రత్తగా రాజమహేంద్రరం ప్రభుత్వాసుపత్రిలో 20 పడకలతో కోవిడ్ వార్డును సిద్ధం చేశారు. ఈ వార్డులో పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశారు. అవసరమైతే ఉపయోగించేందుకు వెంటిలేటర్ను అందుబాటులో ఉంచారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వ్యాధి లక్షణాలను బట్టి అవసరమైతే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. పూర్వపు క్యాంటీన్ ప్రాంతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్యప్రభ చర్యలు చేపట్దారు. -
వ్యక్తి ఆత్మహత్యా యత్నం
అంబాజీపేట: బీరు సీసాను పగలగొట్టి ఆ పెంకుతో పీక కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబాజీపేట శివారు జయంతినగర్కు చెందిన ఈతకోట రవి మంగళవారం స్థానిక బస్టాండ్ వెనుక ఓ చెట్టు వద్ద బీరు సీసా పగలగొట్టి ఆ పెంకుతో పీక కోసుకున్నాడు. అక్కడ నుంచి రక్తస్రావంతో బస్టాండ్ వద్దకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు స్పందించి 108లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. రవి పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు తెలియలేదు.బావిలో పడిపోయిన లేగ దూడరక్షించిన పిఠాపురం అగ్నిమాపక అధికారులుసామర్లకోట: చెంగు..చెంగున గెంతులు వేస్తూ పొలంలో గడ్డి మేస్తున్న లేగ దూడ అక్కడ ఉన్న బావిలో పడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని నవర గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న బావిలో లేగ దూడ సోమవారం సాయంత్రం పడిపోయింది. రైతులు పిఠాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సుమారు 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిన లేగదూడను మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక అధికారులు రక్షించారు. దాంతో రైతులు గోమాత జిందాబాద్, అగ్నిమాపక సిబ్బంది జిందాబాద్ అంటూ నినాదా లు చేశారు. బావి నుంచి లేగ దూడ బయట పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంట పొలాలకు, రైతులకు నీటి కోసం పూర్వీకులు అ క్కడ బావి ఏర్పాటు చేసినట్టు రైతులు తెలిపారు.వ్యక్తి ఆత్మహత్యకాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... నగరంలోని ప్రేజర్పేటకు చెందిన వనమాడి దొరబాబు (45) భార్యతో నెలకొన్న కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కాకినాడ జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా ఆందోళన ఎవరికీ పట్టదా?
పవన్కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి వారాహి యాత్ర సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వినతిపత్రం ఇవ్వగా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో మేము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. నేరుగా కలుద్దాం అని కాకినాడ నుంచి పిఠాపురంలో జనసేన కార్యాలయానికి పాదయాత్రగా వెళితే ఆయన అందుబాటులో లేరు సరికదా బాధ్యులు కూడా కనిపించలేదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. – ఎస్.వెంకటరమణ, యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ శ్రమ దోపిడీకి గురవుతున్నాం మున్సిపాలిటీ, కార్పొరేషన్ల లో ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నా రు. అన్ని అత్యవసర విభాగాల్లోనూ మేమే సేవలందిస్తున్నాం. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచారు.. మాకు మాత్రం పెంచడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొంటాం. – ఉండవల్లి వీరవెంకటరమణరాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, సామర్లకోట మున్సిపాలిటీ ● మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆవేదన ● సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20 రోజులుగా సమ్మె ● హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పట్టించుకోని వైనం పిఠాపురం: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంజినీరింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు వినతిపత్రం అందజేయాలని వారు చేసిన ప్రయత్నం విఫలమయినట్లు కార్మికులు చెబుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న తమకు సరైన జీత భత్యాలు లేవంటున్నారు. తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 4,500 మంది ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా పని చేస్తున్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, మంచినీటి పథకాల నిర్వహణ తదితర పనులు చేస్తుంటారు. అయితే తమకు పనికి తగ్గ వేతనాలు లేవని, దీంతో జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు రూ.13,087 మాత్రమే వేతనం ఇస్తున్నారని చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో వారాహి యాత్రకు వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు, యువగళంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు వినతిపత్రాలు ఇచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ మా సంగతి పట్టించుకోలేదు. డిమాండ్లు ఇవీ.. కార్మిక చట్టాల ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు రూ.29,200, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ. 24,500 చొప్పున జీతాలు చెల్లించాలి. 15 ఏళ్లు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలి ప్రభుత్వం ప్రకటించే 52 ఆదివారాలు, 17 దేశ జాతీయ, రాష్ట్ర పండగ దినాలను సెలవు రోజులుగా ప్రకటించాలి లేదా వేతన దినాలుగా అయినా పేర్కొనాలి. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. విధి నిర్వహణ భారంగా మారి శరీరం సహకరించని వారికి, దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం వైద్య సేవలందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేబర్ యాక్టు ప్రకారం సీనియారిటీని ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా గుర్తించి టెక్నికల్ ఉద్యోగులుగా నిర్ణయించి వారికి తగిన జీతాలు ఇవ్వాలి. కార్మిక చట్టాల ద్వారా సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంజినీరింగ్ విభాగంలో వాటర్ బోర్డును ఏ ర్పాటు చేయాలి. స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి. –పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గ్రాడ్యూటీతో పాటు కనీసం రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలి, లేదా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. -
సీఎం పర్యటన కోసం చెట్ల నరికివేత
కాట్రేనికోన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31 పర్యటించనున్న నేపథ్యంలో సందర్భంగా చెయ్యేరులో రోడ్డు వెంబడి చెట్లను నరికి వేస్తున్నారు. పచ్చదనం కోసం రోడ్డుకు ఇరువైపులా మహిపాలచెరువు నుంచి పల్లంకుర్రు వరకు ప్రభుత్వం మొక్కలు నాటింది. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం పర్యటన సందర్భంగా రోడ్డు వెంబడి పచ్చదనంగా ఉండి ప్రయాణికులకు నీడను అందిస్తున్న చెట్లు నరివేస్తుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యేరులో రోడు వెంబడి చెట్లు నరికి వేస్తున్న దృశ్యం -
రత్నగిరిపై పడకేసిన రక్షణ
కీలకమైన ప్రదేశాలలో కానరాని సెక్యూరిటీ గార్డులు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సెక్యూరిటీ పడకేసింది. దేవస్థానంలో కీలక ప్రాంతాలలో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. సెక్యూరిటీ కోసం దేవస్థానం ఏడాదికి సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులు వివిధ చోట్ల దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. వీరిపై దేవస్థానం నియమించిన సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఉన్నారు. కాని వీరెవరూ సరిగా విధులు నిర్వహించకపోయినా అడిగే నాథుడు లేడు. టోల్గేట్ వద్ద, రత్నగిరిపై, వై.జంక్షన్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. పశ్చిమ రాజగోపురం వద్ద కానరాని సెక్యూరిటీ దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం చాలా కీలకమైన చోటు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో 80 శాతం మంది పశ్చిమ రాజగోపురం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ నుంచి వంద మీటర్లు దూరంలో అన్నదానం భవనం ఉంటుంది. వాహనాల పార్కింగ్ స్థలం అక్కడకు 150 మీటర్ల దూరం. పశ్చిమ రాజగోపురం వద్దనే దేవస్థానం బస్సులు ఆగుతాయి. ఇంత ప్రాధాన్యం కలిగిన స్థలంలో కనీసం నలుగురు అయినా సెక్యూరిటీ గార్డులు ఉండాలి. కాని ఒక్కరూ కూడా ఉండడం లేదు. వ్రతాలు, కల్యాణం, ఇతర సేవా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద కూడా ప్రయివేట్ షాపుల వద్ద పనిచేసేవారే భక్తులను నియంత్రిస్తున్నారు. అక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు ఎవరూ ఉండడం లేదు. గత శనివారం విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో వ్రతాల టిక్కెట్లను ఒక వ్యక్తి బ్లాక్లో అమ్ముతుండగా హోమ్గార్డు పట్టుకుని మందలించి వదిలేశారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని అయినా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. కాని సోమవారం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ కనిపించలేదు. రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో... రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద కూడా అదే పరిస్థితి. ఇక్కడ గతంలో ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడం లేదు. స్వామివారి సన్నిధికి విచ్చేసే సామాన్య భక్తులు స్వామివారి వ్రతాలు, దర్శనం, అన్నదానం పథకంలో భోజనం చేశాక రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో సేద తీరుతారు. కొంతమంది మహిళా భక్తులు వ్రతాల సమయంలో తాము ధరించిన పట్టుచీరలు, నూతన చీరలను అక్కడ ఆరబెట్టి కొంతసేపు నిద్రపోతుండగా అదను చూసి కొంతమంది దొంగలు ఆ చీరలను పట్టుకుపోతున్నారు. ఆ షెడ్డుకు గల సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్ల వద్ద కూడా సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి కొంత సేపు ఆదమరిస్తే చాలు ఆ ఫోన్లు ఉండవక్కడ. ఇవే కాదు భక్తుల బ్యాగ్లు, విలువైన వస్తువులు కూడా దొంగలు అపహరిస్తున్నారు. ఎదురుగా ఈఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఈ విశ్రాంతి షెడ్డులో దొంగతనం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ రాత్రివేళల్లో వివాహాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పెళ్లి బృందాలలోని మహిళల ఆభరణాలు, నగదు కూడా చోరీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా గల ఉచిత డార్మెట్రీ వద్ద కూడా సెక్యూరిటీ లేదు. ఇలా చాలాచోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. దేవస్థానం అధికారులు పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద, ఉచిత డార్మెట్రీ వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా ఈ ప్రాంతాలలో రద్దీ సమయాల్లో హోం గార్డులతో తనిఖీలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. -
ద్విచక్ర వాహనదారునికి ఫైన్ షాక్
డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.10 వేల జరిమానా కొత్తపేట: లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి రూ.10 వేలు ఫైన్ పడింది. వివరాలిలా ఉన్నాయి... కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర సోమవారం స్థానిక కమ్మిరెడ్డిపాలెం మలుపు వద్ద సిబ్బందితో కలిసి ట్రాఫిక్ బీట్ వేశారు. ఆ సందర్భంగా స్థానిక బాలయోగిపేటకి చెందిన ఒక యువకుడు మరో ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఎస్సై సురేంద్ర ఆపారు. లైసెన్స్ ఏది? అని అడగ్గా లేదని చెప్పడంతో నంబరుతోపాటు మోటార్ సైకిల్తో సహా అతని ఫొటో తీసి నేషనల్ ఎంవీ యాక్ట్ యాప్లో నమోదు చేసి ఆ వాహనదారు ని పంపించేశారు. అయితే రాత్రి అతని సెల్ఫోన్కు మోటార్సైకిల్ డీటెయిల్స్తో పాటు లైసెన్స్ లేనందుకు రూ.10,035 ఫైన్ పడినట్టు మెసేజ్ వచ్చింది. ఆ ఫైన్ను ఆన్లైన్లో చెల్లించాలని ఆ చలానాలో పేర్కొన్నారు. దీంతో ఆ వాహనదారుడు నిర్ఘాంతపోయాడు. -
కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే కడతేరిపోయాడు
ఉన్నత చదువులు చదివి కుటుంబాన్ని పోషిస్తాడని అనుకుంటే చదువు పూర్తి కాకుండానే తన కుమారుడు కడతేరిపోయాడని ఆ తండ్రి తీవ్రంగా విలపించారు. గోదావరిలో గల్లంతై మృతి చెందిన తాతపూడి నితీష్ కుమార్ తండ్రి రాజును వారించడం అక్కడివారి వల్ల కాలేదు. తన కుమారుడు బీఎస్సీ యానిమేషన్ కోర్సు చదువుతూ, తనకు ఆసరాగా ఉంటున్నాడని, ఇటీవల ఆర్థిక పరిస్థితి బాగా లేక తాను ఫీజు కట్టలేనని చెప్పగా.. ‘డాడీ నా ఫీజు నేనే కట్టుకుంటాను’ అని చెప్పి ఈవెంట్లు చేసి తన ఫీజులు తానే కట్టుకుంటున్నాడని వాపోయారు. కుటుంబాన్ని ఆదుకుంటాడని, తన కుమార్తెలిద్దరికీ పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకున్నానని, అంతలోనే అర్ధాంతరంగా మృతి చెందాడని రోదించారు. ఇక్కడి ఫంక్షన్కు రాకుండా ఉంటే తన కొడుకు బతికి ఉండేవాడని విలపించారు. -
తల్లడిల్లుతున్న తల్లి పేగు
పి.గన్నవరం: గోదావరి పాయలో మంగళవారం సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు నీట మునిగి గల్లంతు కావడం వారి కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వీరిలో ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకైక సంతానం కాగా, మరొకరికి అక్క ఉంది. రెక్కాడితేనే గానీ డొక్కాడని ఆయా కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తారన్న కుమారులు నీట మునిగి గల్లంతు కావడంతో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి చెందిన కేతా ప్రవీణ్ (15), సానబోయిన సూర్యతేజ (12), పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామానికి చెందిన నీతిపూడి పౌలు కుమార్ (15), మరో ఇద్దరు విద్యార్థులు కలిసి సాయంత్రం వరకూ నాగుల్లంకలో ఆడుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో నాగుల్లంకకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిలంకలో వశిష్ట నదీపాయలో సరదాగా స్నానం చేసేందుకు సైకిళ్లపై వెళ్లారు. పెదలంకకు చెందిన నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి నెల రోజుల క్రితం పౌలుకుమార్ వచ్చాడు. నదీలో స్నానం చేస్తున్న ప్రవీణ్, సూర్యతేజ, పౌలుకుమార్లు నీట మునిగిపోవడంతో మిగిలిన ఇద్దరు బాలురు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరారయ్యారు. వారి వివరాలు తెలియ రాలేదు. ప్రమాద స్థలానికి సమీప లంకల్లో పని చేస్తున్న కూలీలు.. నీట మునుగుతున్న విద్యార్థులను గమనించి, అక్కడికి చేరుకునే సరికే వారు మునిగిపోయారు. విద్యార్థుల దుస్తుల్లో ఉన్న సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నాగుల్లంకలో విషాద ఛాయలు ముగ్గురు విద్యార్థులు గల్లంతవడంతో నాగుల్లంక గ్రామంలో విషాయ ఛాయలు అలముకున్నాయి. కేతా ప్రవీణ్ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అతడి తండ్రి వెంకటేశ్వరరావు తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సరోజిని గృహిణి. వీరి మొదటి కుమారుడు ఏడాది వయసులోనే మరణించడంతో రెండో కుమారుడైన ప్రవీణ్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రవీణ్ గల్లంతు కావడంతో వారు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సానబోయిన సూర్యతేజ తండ్రి ఏడుకొండలు వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి దుర్గాభవాని గృహిణి. వీరికి ఏకైక సంతానమైన సూర్యతేజ నీట మునిగి గల్లంతు కావడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పెదలంకకు చెందిన పౌలుకుమార్ నెల రోజుల క్రితం నాగుల్లంకలోని మేనమామ సానబోయిన ఏడుకొండలు ఇంటికి వచ్చాడు. ప్రమాద స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మంగళవారం రాత్రి పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పి.గన్నవరం తహసీల్దార్ పి.శ్రీపల్లవి, సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై బి.శివకృష్ణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వశిష్ట నదీపాయలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు మూడు కుటుంబాల్లోనూ ఏకై క కుమారులే -
ఆ జీవోను ఉపసంహరించుకోవాలి
● మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ● ఎండీయూ ఆపరేటర్లకు వైఎస్సార్ సీపీ నేతల మద్దతు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజాసేవలో ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఎండీయూ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే చిన్ని ఆధ్వర్యంలో ఈ ధర్నా సాగింది. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పచ్చదనం, సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ప్రతినెలా సక్రమంగా ఇంటింటికీ రేషన్ అందచేస్తున్న ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 9 వేల ఎండీయూ వాహనాలు, వారికొక అసిస్టెంట్ అంటే 18 వేల మంది, వారితో పాటు కుటుంబ సభ్యులు జీవనోపాధిని దెబ్బతీశారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నారు. కాని షిప్ వెళ్లిపోయింది, రైస్ వెళ్లిపోయింది. అదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. ఆరోపణలు నిరూపించుకోలేక ఎండీయూ వాహనదారుల మీద పెడుతున్నారన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పక్కదారి పడుతోందని ఆరోపించడం కూటమి ప్రభుత్వం చేతకాని తనమన్నారు. అదే నిజమైతే ఎండీయూ వాహనాలపై కేసులు పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మద్యం పాలనీని విచ్చలవిడిగా చేసి మద్యాన్ని డోర్ డెలివరి చేసే విధంగా తయారు చేశారన్నారు. రేషన్ బియ్యాన్ని సక్రమంగా ఇంటింటికీ అందిస్తున్న ఎండీయూ ఆపరేటర్లను తీసివేసి ఇంటింటికి మద్యాన్ని అందించే వారిని పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో శ్రద్ధ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వ్యయప్రయాసల కోర్చి పీజీఆర్ఎస్కు వచ్చిన వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, ఆన్లైన్లో మీసేవ ద్వారా, 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడుతో కలిసి స్వీకరించారు. రెవెన్యూ 163, పంచాయతీరాజ్ 19, పోలీస్ 11, ఇతర శాఖలకు చెందిన 55 అర్జీలను స్వీకరించారు. పోలీసు పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు పీజీఆర్ఎస్కు 40 ఫిర్యాదులు అందాయి. జిల్లా అడిషనల్ ఎస్పీలు యంబీయం.మురళీకృష్ణ, ఏవీ.సుబ్బరాజు అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్లో అడిషనల్ ఎస్పీలు ఫిర్యాదులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్ఎస్కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన రాజమహేంద్రవరం రూరల్: రూ.37 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటివారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం హుకుంపేటలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆకర్షణీయంగా, పుష్కర్ ఘాట్ను అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. బ్రిడ్జిలంకలో సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. కడియం నర్సరీల అందాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది తమ ఉద్దే శమన్నారు. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా తీర్చిదిద్దుతామన్నారు. నిడదవోలును, కోట సత్తెమ్మ ఆలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటకులు రెండు మూడు రోజులు పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు వీలుగా టెంట్ సిటీలు,హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండువాలోగిళ్లను లీజుకు తీసుకొని గ్రామాల్లో గడిపేలా చర్యలు చేపట్టామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కూటమి ప్రభుత్వ సమష్టి విజయంగా భావిస్తున్నామన్నారు. -
రోడ్డు ప్రమాదంపై మాజీ ఎంపీ భరత్రామ్ దిగ్భ్రాంతి
రాజమహేంద్రవరం సిటీ: గామన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. లోడు లారీ బ్రేక్ కొట్టడంతో లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారన్నారు. పరిమితికి మించి ఇసుక లారీలలో తరలించడం వలన లారీలలో ఇసుక రోడ్ల మీద పడి రాజమహేంద్రవరం నగరం రూరల్ ప్రాంతాలలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయమే ధ్యేయంగా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి కూటమి నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెగబడుతున్నారని భరత్ రామ్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయో పోలీసుల రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. గతంలో మూడు ఇసుక ర్యాంపులు ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఇసుక ర్యాంపులతో ప్రతీ రోజు వందలాది లారీలతో ఇసుకను తరలించి కూటమి నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాల వలన ధవళేశ్వరం ఆనకట్ట, రోడ్ కం రైల్వే బ్రిడ్జి, నాల్గవ (గామన్)బ్రిడ్జి మనుగడ ప్రమాదంలో పడిందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూటమి నాయకులు ఇసుక తవ్వకాలు ఆపడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా వలన సీతానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరం ప్రాంతాలలో వందలాదిమంది గాయాల పాలై మృత్యువాత పడుతున్నారన్నారు. ఇసుక లారీల వలన ప్రమాదానికి గురి మృతిచెందినప్పుడే సంఘటనలు బయటకు వస్తున్నాయని, గాయాల పాలైన సంఘటనలు బయటకు రావడం లేదన్నారు. -
యువకుడిని బలిగొన్న లారీ
పెరవలి: లారీ రూపంలో రహదారిపై చీకట్లో పొంచి ఉన్న మృత్యువును ఆ యువకుడు గమనించలేకపోయాడు. ఫలితంగా రాంగ్ రూట్లో, హెడ్లైట్లు కూడా వేయకుండా దూసుకొచ్చిన లారీ అతడి ప్రాణాన్ని కబళించింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కుంపట్ల పెద వీరన్న(24) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం కాకరపర్రులో పనికి వెళ్లి, రాత్రి 10.30 సమయంలో మోటార్ బైక్పై స్వగ్రామానికి తిరిగి పయనమయ్యాడు. మార్గం మధ్యలో రహదారిపై ఓ లారీ హెడ్ లైట్లు వేయకుండా రాంగ్ రూట్లో ఆగి ఉంది. లైట్లు వేయకుండానే ఆకస్మికంగా ఆ లారీని ముందుకు దూసుకురావడంతో.. అటుగా మోటార్ బైక్పై వచ్చిన పెద వీరన్న అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి కుంపట్ల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. యువతి ఆత్మహత్య ఉప్పలగుప్తం: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్ రాజేష్ వివరాల మేరకు, ఎస్.యానం పెదపేటకు చెందిన మట్టా సునీత(24) ఆదివారం సాయంత్రం ఇంటి పక్కనున్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో మనస్తాపానికి గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తండ్రి నకులుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
స్ట్రాంగ్మన్గా జగన్.. స్ట్రాంగ్ వుమన్గా వందన
ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలుఅమలాపురం టౌన్: అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్, స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో స్థానిక సర్ సీవీ రామన్ స్కూలు ప్రాంగణంలో ఆదివారం జరిగిన మూడో యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కేటగిరీల వారీగా విజేతలకు బహుమతీ ప్రదానం జరిగింది. తుది ఫలితాలను హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు సోమవారం వెల్లడించారు. స్ట్రాంగ్మన్ విన్నర్గా ఎం.జగన్ (కాకినాడ), స్ట్రాంగ్మన్ రన్నర్గా కె.శివకుమార్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమన్ విన్నర్గా పి.వందన (అమలాపురం), స్ట్రాంగ్ వుమన్ రన్నర్గా బి.అఖిల (రామచంద్రపురం) నిలిచారు. అలాగే స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్గా డి.నాగేశ్వరరావు (రామచంద్రపురం), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్గా బి.అప్పన్న (అమలాపురం) సాధించారు. టీమ్ చాంపియన్షిప్ విన్నర్గా కాకినాడ, టీమ్ చాంపియన్షిప్ రన్నర్గా అమలాపురం కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలు 24 మంది వచ్చే నెల ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్టు కోచ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఏయూ డిగ్రీ ఫలితాల్లో ‘ఆదిత్య’ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులు 1, 2, 3 ర్యాంకులతో పాటు, నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం తెలిపారు. బీసీఏ విభాగంలో దున్నా ధనలక్ష్మి మొదటి ర్యాంక్, ఎ.పావని ఏ.క్యాతిశ్రీ రెండో ర్యాంక్, బి.శిరీష మూడో ర్యాంక్, జి.రిపిక మూడో ర్యాంక్ సాధించారన్నారు. బీబీఏ నుంచి కె.మహిత రెండో ర్యాంక్, వి.మౌనిక మూడో ర్యాంక్, జి.వెంకటసాయికీర్తి మూడో ర్యాంక్, బీఎస్సీలో ఎం.యమున ఫస్ట్ ర్యాంక్, సత్తి మోనిక విషాల్ మూడో ర్యాంక్, బీకామ్ నుంచి పి.హరిప్రియ రెండో ర్యాంక్, పి.పల్లవి మూడో ర్యాంక్ సాధించారని చెప్పారు. యూనివర్సిటీ తరఫున ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఈఎన్ ధనుంజయరావు అభినందనలు తెలిపారు. ఆదిత్య కళాశాల ఉన్నత విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల కార్యదక్షతను కొనియాడారు. విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.సుగుణారెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 2024–25లో ఇప్పటి వరకూ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 15,120 మంది విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు నిడదవోలు: పట్టణంలోని శెట్టిపేటకు చెందిన అడపా కోటసత్యనారాయణపై హత్యాయత్నం నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలు, రూ.3 వేల జరిమానా విధిస్తూ సోమవారం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జీవీఎల్ సరస్వతి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, నిడదవోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపేటలో అడపా కోటసత్యనారాయణ తనకు దూరపు బంధువైన కానూరి కోటసత్యనారాయణ మధ్య పాత కక్షలున్నాయి. ఈ క్రమంలో 2016లో అడపా కోటసత్యనారాయణపై కత్తితో దాడి చేసి హతమార్చడానికి కానూరి కోటసత్యనారాయణ యత్నించాడు. దీనిపై అప్పట్లో నిడదవోలు సీఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్షీట్ ఫైల్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కాకులపాటి వెంకటరమణ వాదించగా, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్,, ఎస్సై కె.జగన్మోహన్రావు ఈ కేసుకు సహకరించారు. కోర్టు హెచ్సీ సీహెచ్ కరుణాకరరావు సాక్షులను హాజరుపరిచారు. -
డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్.. కూటమి సర్కారు
● ఏ రైతు ముఖంలోనూ సంతోషం లేదు ● వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల సీతానగరం: కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఎన్నికల హామీలు అమలు చేయని ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. ఇనుగంటివారిపేటలోని శ్రీ లంకాలమ్మ అమ్మవారి జాతరలో ఆదివారం ఆమె పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, శ్యామల విలేకర్లతో మాట్లాడుతూ, హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని అన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అనారోగ్య కారణాలు చెప్పి బెయిల్పై బయటకు వచ్చారని, ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ముఖంలో చిరునవ్వు, మనస్సులో సంతోషం లేవని, ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, అటువంటివేవీ కూటమి ప్రభుత్వంలో జరగడం లేదని అన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల కోసం కొంత నిధి ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పొగాకు రైతుల కోసం గత ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే, నేడు నష్టపోతున్న వారి కోసం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆక్షేపించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యాన ఈ నెల 28న రైతన్న పోరుబాట నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యాన రాజానగరం నియోజకవర్గాన్ని రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పథంలో నడిపించారని శ్యామల కొనియాడారు. కాతేరు – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో పాటు పాఠశాలలను అభివృద్ధి చేశారని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుదనే భరోసా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రజలు మాత్రం రాజాతోనే ఉన్నారని శ్యామల అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తోట నరసింహం, యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, సర్పంచ్ సత్యం రాంపండు, వైస్ ఎంపీపీ–2 సత్య మదన్బాబు, పార్టీ మండల కన్వీనర్ గంటా శ్రీనివాస్, కో కన్వీనర్ కరుటూరి శ్రీహరిబాబు, మాజీ ఎంపీపీ పెందుర్తి దేవదాసు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దుర్గారావు, నాయకులు చల్లమళ్ళ సుజీరాజు, కవల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కౌలు డబ్బులు కూడా రావు
ఈ ఏడాది పొగాకు రైతులు నిండా మునిగారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనబడడం లేదు. మార్కెట్లో గిట్టుబాటు ధర పలకడం లేదు. కొనుగోలుదారుల మధ్య పోటీ లేదు. వేలానికి తెచ్చిన బేళ్లలో సగం కూడా కొనడం లేదు. బేలు తీసుకు రావడానికి, కొనకపోతే తిరిగి తీసుకు వెళ్లడానికి రవాణా ఖర్చులు రూ.200 అవుతోంది. కిలో రూ.260 నుంచి 270 మధ్య కొంటున్నారు. ఈ ఏడాది ఎకరం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.2 లక్షలు, పెట్టుబడి బ్యారన్కు రూ.లక్ష చొప్పున అయ్యింది. అన్ని ఖర్చులూ కలిపి ఎకరం సాగుకు రూ.3 లక్షలైంది. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఇప్పుడొస్తున్న ధర ప్రకారం ఎకరాకు రూ.2.80 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఎకరాకు నష్టం కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేలు. నేను పదెకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతులు కోలుకోవడం కష్టం. – పసలపూడి సత్యనారాయణ, కౌలు రైతు, బందపురం, దేవరపల్లి మండలం లోగ్రేడు పొగాకు వాసన చూడటం లేదు మార్కెట్లో లోగ్రేడు పొగాకు వాసనే చూడటం లేదు. ఈ పొగాకు ఎక్కడిదక్కడే ఉంది. మంచి పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వేలానికి తీసుకు వచ్చిన బేళ్లు పూర్తిగా కొనడం లేదు. 10 బేళ్లు తెస్తే రెండు మూడు కొంటున్నారు. మిగిలినవి తిరస్కరిస్తున్నారు. రైతు మొరను పట్టించుకున్న నాథుడే కనిపించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. నేను ఎకరం రూ.60 వేల చొప్పున పదెకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. గత ఏడాది మార్కెట్లో కిలో రూ.410 పలకడంతో ఈ ఏడాది ఎక్కువ మంది కౌలుదారులు పొగాకు సాగు చేశారు. అంచనాకు మించి ఉత్పత్తి పెరగడంతో కొనుగోలుదారులు సిండికేట్ అయ్యారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. – శొంఠి వీర నాగేంద్ర, కౌలు రైతు, బందపురం, దేవరపల్లి మండలం ముందు నుంచీ చెబుతూనే ఉన్నాం ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉండదని, పరిమితికి మించి పంట వేయవద్దని సీజన్ ప్రారంభం కాక ముందు నుంచే రైతులకు చెబుతూనే ఉన్నాం. సాగు విస్తీర్ణం పెంచవద్దని అవగాహన సదస్సులు నిర్వహించాం. అయినప్పటికీ రైతులు నల్లరేగడి భూములు, బాడవ భూముల్లో అధిక విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం చేశారు. సెంటు భూమి కూడా లేనివారు అధిక ధరకు కౌలుకు తీసుకుని పంట వేశారు. ఫలితంగా అనుమతికి మించి సాగు జరిగింది. ఇదే సమయంలో మన పొగాకుకు పోటీనిచ్చే దేశాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ లేదు. బాడవ భూముల్లో పండించిన పొగాకు కొనుగోలుదారులు కొనడం లేదు. వేలానికి బేళ్లు తక్కువగా వస్తున్నాయి. పొగాకు మార్కెట్ డిమాండ్, సప్లయ్పై ఆధారపడి ఉంటుంది. – పి.హేమస్మిత, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి -
ఏడాది కాలంలో ఏం పొడిచారు?
● ఫ్లెక్సీలు కట్టి డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారు? ● అసలు బాబూకొడుకులకేం తెలుసు? ● నా చరిత్ర తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు ● ఆదిరెడ్డి కుటుంబంపై గోరంట్ల ఫైర్ రాజమహేంద్రవరం రూరల్: ‘‘బుచ్చయ్య చౌదరి ఒక చరిత్ర. నా చరిత్ర తెలియనివారు ఏదో మాట్లాడుతున్నారు. రాజమండ్రి నగరం అభివృద్ధి నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఏడాది కాలంగా బాబూ కొడుకులు ఏం చేశారు? నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏడాదిగా ఏం పొడిచారు? ఫ్లెక్సీలు కట్టుకుని డబ్బాలు కొట్టుకోవడమే చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్కు ఏం చేశారని ఫ్లెక్సీలు కట్టుకున్నారు? నన్ను అవమానపరచాలంటే తాతలు దిగి రావాలి’’ అంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సొంత పార్టీ టీడీపీకే చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటును ఆదిరెడ్డి వాసు తన ఘనతగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. తెలుగు విశ్వ విద్యాలయం భూముల కేటాయింపులో తాను భాగస్వామినని, రాష్ట్ర విభజన తరువాత తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని, దీని కోసం 2014–19 మధ్య అనేకసార్లు చంద్రబాబుతో తాను మాట్లాడానని చెప్పారు. వాసు వ్యవహారం చూస్తూంటే.. ఎవరో కన్న బిడ్డకు తాను తండ్రిగా చెప్పుకున్నట్లు ఉందని దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యం మైదానంలో సభ ఏర్పాటు చేసి, తాను చేసిన అభివృద్ధిని సవివరంగా చెబుతానని గోరంట్ల అన్నారు. తారస్థాయికి చేరిన రాజకీయ వైరం టీడీపీలో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య చిరకాలంగా నెలకొన్న రాజకీయ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడుకు ముందే వారి మధ్య వైరుధ్యాలు వెలుగు చూశాయి. ఇన్నాళ్లూ నాయకులు, కార్యకర్తల మధ్యనే జరుగుతున్న వివాదం కాస్తా ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చింది. బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు మధ్య వివాదం నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో చెలరేగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పార్టీలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి జిల్లా స్థాయి మినీ మహానాడులో గోరంట్లకు జరిగిన అవమానంతో వీరిద్దరి వివాదం మరింత మురుదు పాకాన పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందరి భాగస్వామ్యంతో ‘యోగాంధ్రప్రదేశ్’ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే నెల 1న సరస్వతీ ఘాట్ వద్ద, 7న కడియం సత్యదేవ నర్సరీ, 14న కొవ్వూరు గోష్పాద క్షేత్రం, 20న నగర వనంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని వివరించా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా పోటీలు నిర్వహించి, జిల్లా స్థాయి విజేతలు వచ్చే నెల 21న విశాఖలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
ప్రదక్షిణ పదేపదే..
● ప‘రేషన్’సాక్షి, రాజమహేంద్రవరం: కొత్తగా రేషన్ కార్డు పొందాలనుకున్న వారికి కూటమి ప్రభుత్వ నిబంధనలు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు, హౌస్ మ్యాపింగ్ సమస్యలతో సతమతమవుతున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఇచ్చినా ఆన్లైన్ సమస్యలతో చిక్కులు తప్పడం లేదు. సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం, ఉన్నట్లుండి మొరాయిస్తూండటంతో సచివాలయాల వద్ద గంటలకొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలోనే సర్వర్ పని చేస్తూండటంతో దరఖాస్తుదారులు ఆ సమయం వచ్చే వరకూ వేచి ఉండి మరీ వేలిముద్రలు వేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో సచివాలయానికి పదుల సంఖ్యలో దరఖాస్తులు అందుతూంటే.. రెండు గంటల వ్యవధిలో ఐదు వరకూ ఆన్లైన్ చేయగలుతున్నట్లు సమాచారం. మిగిలిన వారు తెల్లముఖం వేసుకుని వెనుదిరగాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఫలితంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు వారు రెండు మూడు రోజుల పాటు పనులు మానుకొని సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారు రోజు కూలి కోల్పోతున్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో చిక్కులు హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు అధికంగా వస్తున్నాయి. హౌస్ హోల్డ్ సర్వేలో వివరాలు తొలగించడం, సవరించడం కుదరకపోవడంతో లబ్ధిదారులకు విపరీతమైన సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వేలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తేనే ఈ సమస్య కొలిక్కివచ్చే అవకాశముంది. కొన్నిచోట్ల రెండు కార్డుల్లోని సభ్యులందరూ ఒకే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ కార్డుల్లో ఒక సభ్యుడిని చేర్చాలన్నా, తొలగించాలన్నా సాంకేతికంగా ఇబ్బంది అవుతోంది. సభ్యులందరూ సచివాలయానికి వచ్చి వేలిముద్రలు వేయాలని సిబ్బంది చెబుతున్నారు. దీంతో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రెండు కార్డుల్లోని సభ్యులందరూ సచివాలయానికి పరుగులు తీయాల్సి వస్తోంది. అవస్థలు పడి వచ్చాక.. సర్వర్ మొరాయిస్తూండటంతో అది పని చేసేంత వరకూ వేచి ఉండాల్సిందే. ఒకే కుటుంబమైనా మ్యాపింగ్ ఒకేచోట లేకపోతే దరఖాస్తు స్వీకరణ సమయంలో ఆన్లైన్లో ఎర్రర్ చూపిస్తోంది. దీని సవరణకు ఒక్కోసారి రెండు రోజులు కూడా పడుతోంది. దీంతో, ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వేచి చూడాల్సి వస్తోంది. ఓటీపీ ఆప్షన్కు మంగళం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో దరఖాస్తుదారు వేలిముద్రలు (బయోమెట్రిక్) తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. అవి పడకుంటే దరఖాస్తు ఆన్లైన్లో నమోదు కావడం లేదు. గతంలో ఆధార్ లింక్ అయిన సెల్ఫోన్కు ఓటీపీ వచ్చేది. దీనివల్ల బయోమెట్రిక్స్ పడిన వారికి ఉపయోగకరంగా ఉండేది. ప్రభుత్వం ఓటీపీ ఆప్షన్ డిజేబుల్ చేయడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త జంటలకు తప్పని తిప్పలు కొత్తగా పెళ్లయిన జంటలు రేషన్ కార్డు పొందేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. కొత్తగా పెళ్లయిన వారిలో ఒకరిని కార్డులో చేర్చేందుకు వివాహ ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి కార్డులు, ఫెళ్లి ఫొటోలు అప్లోడ్ చేయాలనే నిబంధన పెట్టారు. అవి లేకపోతే అప్లోడ్ కాక ఈ నెల 7 నుంచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని చెబుతున్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతోంది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లేని జంటలు రెండు వారాలుగా రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడో వివాహమై సంతానం కలిగిన వారికి ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్లు అడగడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ల నిబంధన తొలగించాలనే డిమాండ్ సర్వత్రా వస్తోంది. రేషన్ కార్డు దరఖాస్తులకు అవస్థలు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రెండు మూడు రోజుల పాటు పనులకు తప్పని బ్రేక్ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు -
ఎక్కడి బేళ్లు అక్కడే..
●● మందకొడిగా పొగాకు మార్కెట్ ● పెరగని ధర ● దిగులు చెందుతున్న రైతులు ● ఇప్పటి వరకూ రూ.333.43 కోట్ల కొనుగోళ్లు దేవరపల్లి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమై రెండు నెలలు దాటింది. శనివారం నాటికి 48 రోజుల పాటు వేలం నిర్వహించారు. అయినప్పటికీ, గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతుల ఇళ్ల వద్ద ఎక్కడి బేళ్లు అక్కడే ఉండిపోయాయి. వేలానికి తీసుకుని వెళ్లినా 40 శాతం బేళ్లు అమ్ముడవని పరిస్థితి. దీంతో, వాటిని రైతులు తిరిగి ఇళ్లకు తీసుకు వెళ్తున్నారు. వేలం కేంద్రానికి తీసుకు రావడానికి, కొనకపోతే తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి బేలుకు దూరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.400 వరకూ రవాణా చార్జీలు అవుతున్నాయని, దీంతో అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సన్న, చిన్నకారు, కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాలకు శనివారం 3,290 బేళ్లు అమ్మకానికి రాగా, 2,160 బేళ్లు కొనుగోలు చేశారు. 1,128 బేళ్ల కొనుగోలుకు ట్రేడర్లు తిరస్కరించారు. కిలో గరిష్ట ధర రూ.290, కనిష్ట ధర రూ.205, సగటు ధర రూ.275.55 చొప్పున పలికాయి. వేలంలో 14 కంపెనీలు పాల్గొంటున్నాయి. రెండు మూడు కంపెనీలు మాత్రమే ఎక్కువ శాతం పొగాకు కొనుగోలు చేస్తూండగా, మిగిలిన కంపెనీలు మొక్కుబడిగా కొంటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గరిష్ట ధర కిలో రూ.290 ఉన్నప్పటికీ 10 శాతం బేళ్లకు మాత్రమే ఆ ధర పలుకుతోందని చెబుతున్నారు. మిగిలిన బేళ్లకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పొగాకు రైతులు దిగులు చెందుతున్నారు. వేలం కేంద్రాల వారీగా పొగాకు కొనుగోళ్లు (మిలియన్ కిలోల్లో) వేలం కేంద్రం కొనుగోళ్లు దేవరపల్లి 1.91 జంగారెడ్డిగూడెం–1 3.07 జంగారెడ్డిగూడెం–2 2.40 కొయ్యలగూడెం 2.04 గోపాలపురం 2.65 మొత్తం పొగాకు ఉత్పత్తి అంచనా : సుమారు 80 మిలియన్ కిలోలు ఇప్పటి వరకూ కొన్న పొగాకు : 12.10 మిలియన్ కిలోలు దీని విలువ : రూ.333.43 కోట్లు రైతుల వద్ద ఇంకా మిగిలిన పొగాకు : 65 నుంచి 68 మిలియన్ కిలోలు ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 93,628 బేళ్లు కొనుగోలు చేశారు. వీటిలో వర్జీనియా పొగాకు 89,754 బేళ్లు, బ్లాక్ సాయిల్ పొగాకు 3,874 బేళ్లు ఉన్నాయి. -
వీరి కష్టం తుడిచేవారేరీ!
ఫ అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి అవస్థలు ఫ ఇంకా అందని ఏప్రిల్ నెల జీతాలు ఫ గత నెలలోనూ ఇదే పరిస్థితి ఫ పట్టించుకోని అధికార యంత్రాంగంఅన్నవరం: ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అని సరిదిద్దుకోవచ్చు.. రెండో సారి కూడా అదే పునరావృతమైతే ఏమనుకోవాలో దేవుడికెరుక. అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరు సిబ్బందిని ఇబ్బందుల పాల్జేస్తోంది. సత్యదేవుని దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. మే నెల కూడా మరో వారం రోజుల్లో ముగిసిపోతుండగా, ఇంకా గత నెల జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే జీతమే తక్కువ.. అదీ సకాలంలో అందడం లేదని సిబ్బంది నిట్టూర్పు వదులుతున్నారు. ఈ ఆలస్యం ఈ నెల మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. గత నెలలో కూడా మార్చి నెల జీతం ఏప్రిల్ 30న ఇచ్చారు. అది కూడా జీతం ఆలస్యం అయ్యిందని, ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...?’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి ఆదరాబాదరాగా ఫైల్ నడిపి నెలాఖరున వారి అకౌంట్లో వేశారు. అయితే అధికారులు మాత్రం తమ తప్పేమీ లేదని పాత పాటే పాడుతున్నారు. గత నెలలో వివరణ ఇచ్చినట్టుగానే దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ ఆ సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని ఆలస్యంగా బ్యాంకులో జమ చేయాల్సి రావడంతోనే జాప్యం అయ్యిందని అంటున్నారు. ఒకటి రెండ్రోజుల్లో జీతాలు చెల్లిస్తామని చెప్పుకొస్తున్నారు. పని పెరిగింది.. జీతం ఆగింది మే నెల ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవస్థానంలో పారిశుధ్య సిబ్బంది అదనంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. దీనికితోడు వివాహాల కారణంగా పెళ్లిబృందాలతో దేవస్థానం రద్దీగా మారి చెత్త పెరిగింది. బాత్రూమ్లు, ఆలయ ప్రాంగణం, సత్రాలు, గదులు అదనంగా శుభ్రం చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా కూడా జీతాలు అందించకపోవడంతో వారు అసంతృప్తి చెందుతున్నారు. అప్పట్లో పదో తేదీకే.. హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ హయాంలో ప్రతి నెలా పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేవారు. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థకు శానిటరీ కాంట్రాక్ట్కు ఎంపిక చేసేవరకూ విధులు నిర్వహించాలని దేవస్థానం కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. దాంతో మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలోని అన్ని విభాగాలు, సత్రాలు, దేవస్థానం ఆవరణ, ఆలయ ప్రాకారం, వ్రతమండపాలు, టాయిలెట్స్ తదితర చోట్ల మొత్తం 349 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఈ సిబ్బందికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. వీరికి శానిటరీ ఏజెన్సీ ద్వారా నెలకు సుమారు రూ.55 లక్షలు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నెల జీతాలు ఇంకా చెల్లించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. పారిశుధ్య సిబ్బంది పీఎఫ్ మొత్తం వారి బ్యాంకు ఖాతాలకు కొత్త ఏజెన్సీ ఆలస్యంగా జమ చేయాల్సి రావడంతో జీతాలు చెల్లింపునకు జాప్యం అయ్యిందని అధికారులు తెలిపారు. త్వరలోనే చెల్లిస్తామన్నారు. -
సత్యవాడలో కరోనా కలకలం
కె.గంగవరం: మండల పరిధిలోని సత్యవాడ గ్రామంలో కరోనా కేసు నమోదు కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. గ్రామంలో ఆదివారం పామర్రు పీహెచ్సీ వైద్యులు పోలిశెట్టి హర్షిత, పసుపులేటి విష్ణువర్థన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను హోమ్ క్యారంటైన్లో ఉంచారు. పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు. వారు మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని కోరారు. దగ్గడం, తుమ్మడం వంటివి చేసినప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవడం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం మంచిదన్నారు. సర్పంచ్ సలాది సూర్యకళావతి, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.అప్రమత్తమైన వైద్య సిబ్బంది -
సహజ వాయువు దోపిడీపై నిలదీద్దాం..
అమలాపురం టౌన్: కృష్ణా గోదావరి బేసిన్లో ప్రకృతి పరంగా, సహజ సిద్ధంగా లభ్యమవుతున్న చమురు, సహజ వాయువు దోపిడీని అరికట్టాలని, ఈ విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మేధావులు, విద్యావేత్తలు, సహజ వనరుల పరిరక్షణ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు. చమురు, సహజ వాయువును కేజీ బేసిన్లో అన్వేషించి ఇతర రాష్ట్రాలకు దోచుకుని వెళ్లిపోతున్న చమురు సంస్థల నిర్వాకాన్ని అడ్డుకోవాలన్నారు. గ్యాస్, చమురు, సహజ వనరుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో ఆదివారం సదస్సు జరిగింది. పరిరక్షణ కమిటీ ప్రతినిధి కె.సత్తిబాబు ఆధ్వర్యంలో సామాజికవేత్త ఆలతతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రొఫెసర్ వైవీఎస్ మహాదేవ్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. కేజీ బేసిన్లో చమురు, సహజ వాయువుల ఖనిజ సంపద అపారంగా ఉందని గుర్తుచేస్తూ, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. చమురును సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోయి రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తుంటే.. ఇక్కడి అభివృద్ధి మాత్రం కుంటుపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని నిరోధించేందుకు మనమంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు కలసికట్టుగా చట్టసభల్లో ఈ దోపిడీని ప్రశ్నిస్తే రాష్ట్రానికి రావాల్సిన వాటా దానంతట అదే వస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వక్తలు సూచించారు. దేశంలో లభ్యమవుతున్న సహజ వాయువుల్లో 30 శాతం కేజీ బేసిన్లోనే లభ్యమవుతోందని గుర్తు చేశారు. అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో చమురు సంస్థలు కేజీ బేసిన్ భూములను గుల్ల చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంస్థల భారీ వాహనాలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సహజ వాయువు సాధన సమితి కన్వీనర్ కొల్లా రాజమోహన్, కోనసీమ రైల్వే సాధన సమితి కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడుతోపాటు పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రసంగించారు. పోరాటాలతో రాష్ట్ర వాటా సాధిద్దాం చమురు, సహజ వనరుల పరిరక్షణ సదస్సులో నేతల పిలుపు -
అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి
పిఠాపురం: అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని పిఠాపురం సీఐ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. ఆదివారం పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఈ సెర్చ్ నిర్వహించారన్నారు. ఆ ఏరియాలో అనుమానితులను తనిఖీ చేసి వారి నుంచి సరైన పత్రాలు లేని సుమారు 43 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. 15 లీటర్ల సారా సీజ్ చేసి కేసు నమోదు చేశామని అన్నారు. అనుమానితులు కనిపించిన వెంటనే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఐ అన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పిఠాపురం టౌన్, రూరల్, గొల్లప్రోలు, కొత్తపల్లి ఎస్సైలు మణికుమార్, జాన్బాషా, ఎన్.రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బరువులెత్తారు.. సత్తా చాటారు
అమలాపురం టౌన్: అమలాపురం హెల్త్ ఫిట్నెస్ జిమ్, స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సర్ సీవీ రామన్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం 3వ యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీలు ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి 135 మంది క్రీడాకారులు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. తొలుత ఈ క్రీడను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ప్రారంభించారు. పవర్ లిఫ్టింగ్, బ్రెంచ్ ప్రెస్, వుమెన్, మాస్టర్ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. 53 కిలోల నుంచి 260 కిలోల వరకూ బరువులను లిఫ్టర్లు ఎత్తారు. 53 కిలోలు, 59, 66, 74, 83, 93, 105 కిలోలు ఇలా పలు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. వీటికి న్యాయ నిర్ణేతలుగా కాకినాడ ప్రభుత్వ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దొమ్మేటి వెంకటరమణ, రాజమహేంద్రవరానికి చెందిన ఇంటర్నేషనల్ లిఫ్టర్, రైల్వే ఉద్యోగి డి.లక్ష్మీనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన మరో ఇంటర్నేషనల్ లిఫ్టర్ ఎ.బాలకృష్ణ, పి.గన్నవరానికి చెందిన సీనియర్ లిఫ్టర్ కత్తుల శ్రీనివాసరావులు వ్యవహరించారు. పోటీల్లో కేటగిరీల వారీగా విజేతలైన లిఫ్టర్లకు ఎప్పటికప్పుడు పోటీల నిర్వహణా సంస్థలైన హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్, స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్లు పతకాలు, బహుమతులు,ఽ సర్టిఫికెట్లు అందజేశాయి. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, సర్ సీవీ రామన్ స్కూల్ డైరెక్టర్ రవణం వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూదా గణపతి తదితర పట్టణ ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ కళాశాలలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు కరాటం రవి సుధీర్, డీఆర్కే నాగేశ్వరరావు, జోషఫ్లు పోటీలకు రిఫరీలుగా వ్యవహరించారు. ఉత్కంఠగా పవర్ లిఫ్టింగ్ పోటీలు 135 మంది క్రీడాకారుల రాక -
భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఫిర్యాదు
అమలాపురం రూరల్: తాము 68 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1.40 ఎకరాల భూమిని కొనుగోలు చేశామంటూ అమలాపురానికి చెందిన టీడీపీ నాయకుడు గంధం పల్లంరాజుకు చెందిన కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని కామనగరువుకు చెందిన భూపతిరాజు సుబ్బరాజు, నరసింహరాజు సోదరులు వాపోతున్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము కౌలుదారులుగా లైఫ్టైమ్ సాగు చేసుకోవచ్చని అమలాపురం సివిల్ కోర్డులో ట్రిబ్యునల్ ఆర్డర్ ఇవ్వడంతో భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు. సాగు భూమిలో లారీలతో ఇసుక తరలించి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకుంటే తమను చంపుతామని పలువురు బెదిరించారని అన్నారు. పోలీసుల సమక్షంలో దాడికి ప్రయత్ని ంచారని వాపోయారు. అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యంగా చేలోకి ప్రవేశించి ఇసుకతో భూమిని కప్పేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాడతామని సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి పేరు చెబుతూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. మంత్రి అండదండలతో రెచ్చిపోయి భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎస్పీ, తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని అమలాపురం తాలుకా ఎస్సై శేఖర్బాబు తెలిపారు. సివిల్ వివాదం కావడంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆ ఏడుగురినీ విధుల్లోకి తీసుకోండి
అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శానిటరీ విభాగంలో తొలగించిన ఏడుగురు సూపర్వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిఫ్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి.శ్రీనివాసరావు (కాకినాడ) దేవస్థానం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తాత్కాలికంగా శానిటరీ కాంట్రాక్టర్చే పని చేయిస్తున్నామని, కొత్త శానిటరీ కాంట్రాక్ట్ ఖరారయ్యాక విధుల్లోకి తీసుకోవాలని చెబుతామని దేవస్థానం అధికారులు చెప్పడంతో ఆ మేరకు ఆయన ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని తొలగించబడిన సూపర్వైజర్లలో ఒకరైన కొల్లు బాబూరావు ఆదివారం తెలిపారు. సూపర్వైజర్ల ఫిర్యాదు మేరకు లేబర్ కోర్టు అన్నవరం దేవస్థానానికి నోటీసులు జారీ చేసింది. శనివారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించడంతో దేవస్థానం తరఫున సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సూపర్వైజర్లను ఎందుకు తొలగించారని డీసీ ఆఫ్ లేబర్ శ్రీనివాసరావు అధికారులను ప్రశ్నించగా, తాము తొలగించలేదని, శానిటరీ కాంట్రాక్టర్ తొలగించారని వారు సమాధానం చెప్పారు. కాంట్రాక్టర్ ఎందుకు తొలగించారని అడగ్గా ప్రవర్తన బాగోకపోయినా, భక్తులు ఫిర్యాదు చేసినా, పని సామర్థ్యం తగ్గినా కాంట్రాక్టర్కు తొలగించే హక్కు ఉందని వారన్నారు. తాము దశాబ్దాల తరబడి శానిటరీ విభాగంలో పనిచేస్తున్నామని, తమ పనితీరు బాగోలేదని ఎవరూ ఫిర్యాదు చేయలేదని సూపర్వైజర్లు వివరించారు. దీంతో వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్టర్తో చెప్పమనగా, త్వరలో కొత్త కాంట్రాక్టర్ వస్తారని వారికి చెబుతామని అధికారులు చెప్పినట్లు సూపర్వైజర్లు తెలిపారు. తాము కాదని మాట మార్చి.. శానిటరీ సూపర్వైజర్లపై వైఎస్సార్ సీపీ ముద్ర వేసి ఈ నెల 15 నుంచి తొలగించారు. అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు వారిని తొలగించారని సూపర్వైజర్లు తెలిపారు. దీనిపై ఈ నెల 18న ‘సాక్షి’ దినపత్రికలో ‘వైఎస్సార్ సీపీ వాళ్లంటూ చిరుద్యోగుల పొట్ట కొట్టారు’ అనే శీర్షికన కథనం వచ్చింది. కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో, లేబర్ కోర్టులో సూపర్వైజర్లు ఫిర్యాదు చేయడంతో దేవస్థానం అధికారులు మాట మార్చి వీరిని తొలగించింది తాము కాదని, కాంట్రాక్టర్ అని చెప్పడం చర్చనీయాంశమైంది. కొత్త కాంట్రాక్టర్కు వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెబుతామని చెప్పిన అధికారులు, తమ స్థానంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి సిఫార్స్తో వచ్చిన ఐదుగురిని సూపర్వైజర్లుగా నియమించినట్లు తొలగించిన సూపర్వైజర్లు చెప్పారు. ● అన్నవరం దేవస్థానానికి లేబర్ కోర్టు ఆదేశం ● కొత్త కాంట్రాక్టర్కు చెబుతామన్న అధికారులు -
స్పందించి.. సాయమందించి
హరిదాసుకు గ్రామస్తుల చేయూతపెదపూడి: కళ్లు తిరిగి కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైన హరిదాసు సూరిబాబుకు ఆదివారం జి.మామిడాడ (జీఎండీ) గ్రామస్తులు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఇక్కడి సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యలు తెలిపిన వివరాల ప్రకారం.. జి.మామిడాడలో తాళ్లూరి సూరిబాబు ఎన్నో ఏళ్లుగా ధనుర్మాసం సందర్భంగా గ్రామంలో హరిదాసుగా తిరుగుతూ హరినామ సంకీర్తనలు చేసుకుంటూ ఎంతో నియమ నిష్టలతో ప్రజలంతా బాగుండాలని కోరుకునేవాడు. ధనుర్మాసం పూర్తయిన తర్వాత గ్రామంలో ప్రతి ఇంటికి వెళితే ఎంతో కొంత దానంగా బియ్యం, నగదు ఇవ్వడం అనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే హరిదాసు గ్రామంలో తిరిగేటప్పుడు కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు బలమైన గాయం తగిలింది. అసలే అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉండడం, వెన్నెముకకు తగిలిన గాయానికి చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చు కావడంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమ గ్రామం కోసం ఏర్పాటు చేసుకున్న ‘మన ఊరు– ఊరికోసం’ వాట్సాప్ గ్రూప్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు స్పందించి ఎవరికి తోచిన ఆర్థిక సహాయం వారు చేశారు. సుమారు రూ.1.71 లక్షలు సమకూరింది. దీంతో ఆ కుటుంబానికి సూర్యనారాయణమూర్తి స్వామి ఆలయంలో రేజేటి వెంకట నరసింహాచార్యులు, గ్రామస్తుల చేతుల మీదుగా సాయం అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తుల్యభాగ నదిలో దూకి విద్యాకమిటీ చైర్మన్ మృతి
కాజులూరు: గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్, మండల వర్తక సంఘ సభ్యుడు కొల్లుశెట్టి సత్యం (పలావు సెంటర్ స్వామి) కరప మండలం గొర్రిపూడి వద్ద తుల్యభాగ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సత్యం తన మోటారు బైక్తో వెళ్లి సెల్ఫోన్, చెప్పులు రోడ్డుపై వదిలి వంతెనపై నుంచి తుల్యభాగ నదిలోకి దూకాడు. ఆపై ఊపిరాడక కేకలు వేయడంతో సమీప కాలువ రేవులో దుస్తులు ఉతుకుతున్న మహిళలు, స్థానికులు ఎవరో నీటిలో దూకినట్టు గమనించి బైక్, సెల్ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వెళ్లి సత్యం కోసం వెతికే ప్రయత్నం చేసినా రాత్రి కావడంతో అతని ఆచూకీ లభించలేదు. ఆదివారం పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్యర్యంలో కాకినాడ రెస్క్యూ టీమ్ వచ్చి హై స్పీడ్ బోట్లతో కాలువను జల్లెడ పట్టారు. సాయంత్రం తణుకువాడ, గొర్రిపూడి గ్రామల సరిహద్దులో సత్యం మృతదేహం కనిపించింది. ఐదేళ్ల కిందట సత్యం కుమార్తె అనారోగ్యంతో చనిపోగా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. వీఆర్వో శవ పంచనామా అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందరితో కలిసిపోతూ వర్తక సంఘ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే సత్యం అకాల మరణం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
మట్టిమాయం చేసేందుకు...
గోపాలపురం మండలం గంగోలు పెద్దచెరువులో జేసీబీలతో మట్టి తవ్వకాలు ఫ దందాకు తెరలేపిన టీడీపీ ఫ వాటాలు పంచుకుంటున్న వైనం ఫ కూటమిలో భాగస్వాములకు మొండిచేయి గోపాలపురం: మట్టి దందాకు తెరలేపారు.. అందినకాడకు తవ్వేస్తున్నారు.. అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. గోపాలపురం మండలం గంగోలు, భీమోలు, కరిచర్లగూడెం, గోపాలపురం గ్రామాల్లోని పెద్ద చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం చెరువులో మట్టిని తరలించుకునేందుకు ప్రభుత్వానికి నామమాత్రంగా ఫీజు చెల్లించి ఆయకట్టు రైతులు తీసుకోవచ్చు. అనుమతులు వచ్చాక ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై మట్టిని తరలించుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. దీనికి నీళ్లు వదిలి అసలు రైతులకు కాకుండా ఆయా గ్రామాల టీడీపీ నాయకులు మట్టిని ఇటుక బట్టీలకు లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రైతులకు మొండిచేయి చూపి మట్టిని రాత్రనక పగలనక ఒక్కో చెరువులో రెండు జేసీబీలు, సుమారు 15 లారీలతో తరలిస్తున్నారు. గంగోలు పెద్ద చెరువు నుంచి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో ఇటుక బట్టీలకు మట్టిని తీసుకెళ్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల్లో నియోజకస్థాయి ప్రతినిధి వాటాగా 70 శాతం, మిగిలిన 30 శాతం స్థానిక టీడీపీ నాయకులు పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని, 15 వేల క్యూబిక్ మీటర్లకు తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇటువైపు చూడడం లేదు. మట్టి తరలింపు లారీల రాకపోకలతో ఆయా గ్రామాల్లో రోడ్లు ఛిద్రంగా మారుతున్నాయని, లారీలో తరలించే మట్టి సుమారు 40 నుంచి 45 టన్నుల బరువు ఉండటంతో రోడ్లు గోతులు పడుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మరిన్ని గ్రామాల్లో మట్టిని అక్రమంగా తరలించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. కూటమి భాగస్వాములకు మొండిచేయి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులకు టీడీపీ నాయకులు మొండిచేయి చూపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలోనూ వారికి వాటాలు ఇవ్వకపోవడంతో ఆయా పార్టీల నాయకులు అధిష్టానానికి తెలియజేసేలా, మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసేందుకు కార్యాచరణ చేసుకున్నట్లు సమాచారం. -
అమ్మా నాన్నా లేరని.. ఇక రారని
ఫ చలించిన పసి హృదయాలు ఫ కళ్లెదుటే తల్లిదండ్రుల మృతితో షాక్ అయిన పిల్లలు ఫ జాతీయ రహదారి దేవరపల్లి వద్ద హృదయ విదారక ఘటన దేవరపల్లి / గోకవరం : పసిప్రాయం చిన్నబోయింది.. తల్లిదండ్రులు తమ కళ్లెదుటే మృత్యువాత పడడం చూసి గుండె ఆగినట్టు అయ్యింది. తమ ఆలనాపాలనా చూసే అమ్మానాన్న విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ పసివాళ్లు గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.. తల్లిదండ్రులతో కలసి నానమ్మ ఇంటికి వెళుతున్నామన్న ఆ చిన్నారుల ఆనందం అంతలోనే ఆవిరైంది. అనుకోని ప్రమాదంలో తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పేడూరి పెదబేబి (30), దేవరపల్లి సమీపం యాదవోలుకు చెందిన తుంటా దుర్గాప్రసాద్ (35)కు సుమారు 13 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. వివాహం అనంతరం దుర్గాప్రసాద్ గోపాలపురంలోనే తాపీ చేస్తుండగా, పెదబేబి అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. వీరిద్దరికి కుమార్తె ప్రవల్లిక, కుమారుడు ఇమ్మానుయేల్ ఉన్నారు. కుమార్తె వీరలంకపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి, కుమారుడు గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు కావడంతో శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు ఇద్దరూ పిల్లలను తీసుకుని యాదవోలుకు బైక్పై బయలు దేరారు. వీరు గుండుగొలను– కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి డైమండ్ జంక్షన్కు వచ్చేసరికి ఆ ఇద్దరు పిల్లలు టాయ్లెట్ వస్తుందనడంతో రోడ్డు పక్కన బైక్ ఆపారు. పిల్లలను రోడ్డుకు అటువైపు టాయ్లెట్కు పంపించారు. తన సోదరుడికి తీసుకు వెళుతున్న మామిడి పండ్లను భార్యాభర్తలు సర్దుకుంటుండగా వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదబేబి, దుర్గాప్రసాద్ అక్కడకక్కడే దుర్మరణం చెందగా, టాయ్లెట్కు వెళ్లిన పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో దురా్గ్ప్రసాద్ కాలు తెగి దూరంగా పడిపోయింది. తమ కళ్ల ఎదుటే తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో పిల్లలు ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిపోయారు. ఈ ఘటనా స్థలానికి దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అమ్మా నాన్నా ఇక లేరని.. అప్పటి వరకూ తల్లిదండ్రులతో ఆనందంగా గడిపిన పిల్లలు తల్లిదండ్రులు ఇక లేరని తెలుసుకుని కన్నీరు, మున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణంతో ప్రవల్లిక, ఇమ్మానియేలు దిక్కులేని వారిగా మిగిలారు. ప్రమాద ఘటనను కళ్లారా చూసిన వారు షాక్కు గురయ్యారు. అమ్మా నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు. గోపాలపురంలో విషాదం భార్యాభర్తలు మృతి చెంది పిల్లలు అనాథలు కావడంతో గోపాలపురంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులతో మంచి సత్ససంబంధాలు కలిగిన వీరు ప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనాథలైన చిన్నారులను తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. మధ్యాహ్నం తాపీ పని ముగించుకుని.. దుర్గాప్రసాద్ గ్రామంలో తాపీ పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం వరకూ పనిచేసి ఇంటికి వచ్చిన అతను భార్యా పిల్లలతో కలసి సరదాగా గడిపేందుకు తన గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల కిందట పెదబేబి తన భర్త దుర్గాప్రసాద్తో కలసి గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో తోటి అంగన్వాడీ టీచర్కు సంబంధించిన ఫంక్షన్లో పాల్గొంది. ఈ సమయంలో తమతో కలసి ఎంతో సందడి చేసిందని ఇంతలోనే ఇలా జరిగిందని, సహచర అంగన్వాడీ సిబ్బంది బోరున విలపించారు. -
రీ వాల్యుయేషన్లో పెరిగిన మార్కులు
నల్లజర్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో దూబచర్ల సంఘమిత్రా స్కూల్ విద్యార్థులు షేక్ అబ్ధుల్ సలామ్, పి.రమ్యశ్రీలు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. షేక్ అబ్ధుల్కు సోషల్ సబ్జెక్ట్లో 13 మార్కులు కలిశాయి. దీంతో 586 మార్కులతో స్కూల్ టాపర్గా, మండలంలో 4వ స్థానం సాధించాడు. పి.రమ్యశ్రీకి హిందీలో 10 మార్కులు కలిశాయి. దీంతో ఆమెకు 513 మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ స్కూల్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు శనివారం విలేకర్లకు తెలిపారు. పని మనిషే నిందితురాలు సామర్లకోట: ఇంట్లో పని మనిషి చోరీ చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ ఎ.కృష్ణభవాన్ కథనం ప్రకారం.. స్థానిక అంబటివారి తోటలోని సింగవరపు సత్యనారాయణ ఇంట్లో బొడ్డు దుర్గాదేవి పని చేస్తోంది. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన వజ్రాలు, వాచ్, బంగారు ఆభరణాలు చోరీ చేసింది. చోరీ విషయాన్ని గమనించిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలమ్మ చెరువు వద్ద ఉన్న పని మనిషి దుర్గాదేవిపై అనుమానంతో ఇంటికి వెళ్లి సీఐ కృష్ణభవాన్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఆమె ఇంట్లో బంగారు ఆభరణాలు, 17 చిన్న డైమండ్స్, ఒక స్మార్ట్ వాచ్ను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. ఆరు లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు వీఆర్వో ఎస్.ఏడుకొండలు సమక్షంలో ఆమె నుంచి వాంగ్మూలం సేకరించగా నేరాన్ని అంగికరిందన్నారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారని చెప్పారు. చోరీ సొత్తును రికవరీ చేసిన సీఐ కృష్ణభగవాన్, క్రైమ్ సీఐ అంకబాబు, సిబ్బందిని డీఎస్పీ డి.శ్రీహరిరాజు అభినందించారు. -
ఐఐఎఫ్టీలో సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ): స్థానిక జేఎన్టీయూలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) క్యాంపస్లో గురువారం ఎగుమతి– దిగుమతి నిర్వహణపై సర్టిఫికెట్ ప్రోగ్రాం ప్రారంభమైంది. దీనిని ఆన్లైన్లో ఐఐఎఫ్టీ వీసీ రాకేష్మోహన్ జోషి ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుత భౌగోళిక రాజకీయాలు, దాని అనిశ్చితి తెలుసుకోవడంతో పాటు అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్మించడంలో ఈ ప్రోగ్రామ్ ఏవిధంగా సహాయపడుతుందో వివరించారు. ఐఐఎఫ్టీ కాకినాడ హెడ్ రవీంద్రసారథి మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతి నిర్వహణలో అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది మంచి విలువైన కోర్సు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమల నిపుణులు, విద్యావేత్తలు, సహచరులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థ శంకర్రాయ్, అధ్యాపకులుి పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి తాపీమేస్త్రి మృతి
జగ్గంపేట: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు జగ్గంపేట ఎస్సై రఘునందనరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. జగ్గంపేట గ్రామానికి చెందిన సుంకరరాజు (35) తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతను స్థానిక బాలాజీ నగర్లో ఓ ఇంట్లో తాపీపని చేస్తున్నాడు. శనివారం యథావిధిగా ఉదయం పనిలోకి వచ్చిన రాజు శ్లాబ్ వేసే నిమిత్తం కర్రలు కోస్తుండగా కర్రలు కోసే మెషీన్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మహిళకు గాయాలు పిఠాపురం: గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, ఒక మహిళకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి పిఠాపురం వైపు వెళుతున్న పాల ట్యాంకర్ గొల్లప్రోలు టోల్గేట్ దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ వేయడంతో దాని వెనుక వస్తున్న ఆటో అదుపుతప్పి లారీని ఢీకొంది. ఆటోలో ఉన్న డ్రైవరు గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన మేడిద ధర్మేంద్ర వరప్రసాద్ (34), అదే గ్రామానికి చెందిన బి.లోవకుమారిలకు గాయాలయ్యాయి. ఇందులో వరప్రసాద్ మృతి చెందగా, లోవకుమారి చికిత్స పొందుతోంది. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దుర్మరణం రాజోలు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై కె.నరసింహారావు కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి పొదలాడకు చెందిన బత్తుల వంశీకృష్ణరాజు (19) పాల ప్యాకెట్ కోసం మోటార్ సైకిల్పై ఆ గ్రామంలో సెంటర్కు వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. తాటిపాక నుంచి మోటార్ సైకిల్పై రాజోలు వస్తున్న కొప్పాడి రాజీవ్, మొగలి గణేష్లు ఢీకొట్టారు. దీంతో వంశీకృష్ణరాజు తలకు తీవ్రగాయం కావడంతో వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వంశీకృష్ణ విజయవాడలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమారుడి మృతితో తండ్రి బత్తుల దొరరాజు కన్నీరు మున్నీరుగా విలపించారు. దొరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. -
శ్రీనివాసా... శ్రీవేంకటేశా
ఫ కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం ఫ వర్షాన్నీ లెక్కచేయకుండా తరలివచ్చిన భక్తులు కొత్తపేట: దినదిన ప్రవర్థమానంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పులకించింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శనివారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. శ్రీఏడు శనివారాలు– ఏడు ప్రదక్షిణలుశ్రీ నోము ఆచరిస్తున్న భక్తుల గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తి అయిన వేంకటేశ్వరస్వామిని నూతన దంపతులు దర్శించుకుని తరించారు. దేవదాయ –ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. పూర్ణాలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు పులకించారు. అనంతరం ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.48,99,380 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
స్మార్త పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు
రాజమహేంద్రవరం సిటీ: కోటిలింగాలపేటలోని పందిరి మహదేవుడు కోటిలింగాల సత్రంలో నిర్వహిస్తున్న స్మార్త పాఠశాలలో ప్రవేశానికి బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పందిరి మహదేవుడు సత్రం సహాయ కమిషనర్ పి.విశ్వనాథరాజు శనివారం ఈ విషయం తెలిపారు. ఆరేళ్ల కృష్ణ యజుర్వేద స్మార్త విద్యను అభ్యసించేందుకు తొమ్మిదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఉపనయనం జరిగిన బాలురు అర్హులన్నారు. వారికి ఉచిత వసతి, భోజనం, వైద్య సదుపాయం ఉంటుందని, నెలకు రూ.2 వేల వంతున ఉపకార వేతనం అందిస్తామన్నారు. దరఖాస్తులను సత్రం కార్యాలయంలో జూన్ 9వ తేదీ వరకు పొందవచ్చన్నారు. జూన్ 11 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశానికి మౌఖిక పరీక్ష ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తులుపంపించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించండిరాజానగరం: యూనివర్సిటీ, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లతో పాటు అనుబంధ కళాశాలల్లో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆదేశించారు. ప్రిన్సిపాల్స్, డీన్స్తో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నందున అప్రమత్తత ఎంతో అవసరమన్నారు. గతంలో మాదిరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియామకాలు రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి నల్లమిల్లి కాంతమ్మ (అనపర్తి), ఆచంట అనసూయ (గోపాలపురం), బూత్ కమిటీ వింగ్స్ కార్యదర్శిగా బొడ్డు ముత్యాలరావు (అనపర్తి), జాయింట్ సెక్రటరీగా కళ్యాణం రాంబాబు (రాజానగరం), ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా పెండ్యాల వీర రాఘవులు (గోపాలపురం), ఒండ్రు సత్యనారాయణ (అనపర్తి), ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా కె.సర్రాజు (రాజానగరం), పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా మండా రాజారెడ్డి (అనపర్తి), తాడి హరిచంద్ర ప్రసాద్రెడ్డి (రాజానగరం) నియమితులయ్యారు. ఉపాధ్యాయ బదిలీ దరఖాస్తుల గడువు పెంపుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించే గడువును మరో రోజుకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం రాత్రి తెలిపారు. ఆ ప్రకారం ఆదివారం రాత్రి 11.45 గంటల వరకూ అవకాశం ఉందన్నారు. డివిజన్ ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులకు ఈ సమాచారాన్ని అందజేయాలన్నారు.స్వామిని చూసి.. మది మురిసిమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు. 5 నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి తిరు కల్యాణోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. జూన్ 9 వరకూ ఈ కల్యాణోత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం 11.31 గంటలకు స్వామివారి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. -
అన్నదాతల సమరభేరి
● మాకు లేదా.. ప్రాధాన్యం?ఇదిగో అదిగో అంటున్నారు ఏప్రిల్ 29న మూడెకరాల పంటకు చెందిన ధాన్యం అమ్మాను. నేటికీ సొమ్ములు పడలేదు. అధికారులను అడుగుతూంటే ఇదిగో వస్తాయి, అదిగో వస్తాయని అంటున్నారే తప్ప సొమ్ము రాలేదు. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? – నిచెనకోళ్ల కృష్ణమూర్తి, వరి రైతు, కోరుపల్లి కాళ్లరిగేలా తిరిగినా.. ధాన్యం టార్గెట్ అయిపోయిందన్నారు. ఆందోళన చేస్తే ధాన్యం తీసుకున్నారు. కానీ నెల రోజులైనా సొమ్ము మాత్రం వేయలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. చివరకు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాం. – తుమ్మలపల్లి సత్యనారాయణ, రైతు, కానూరు డబ్బు రావడం లేదు ధాన్యం నేటికీ రాశుల్లోనే ఉంది. అనుమతులు రాలేదంటున్నారు. పోనీ, అమ్మిన ధాన్యానికి సొమ్ము వస్తే అప్పులు తీరుద్దామంటే ఆ డబ్బులు రావడం లేదు. అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నాం. వ్యవసాయం చేసేకన్నా అడుక్కుంటే మంచిదిలా ఉంది. – కేతా శ్రీనివాస్, వరి రైతు, ముక్కామల ● ధాన్యం సొమ్ము చెల్లించని కూటమి సర్కార్ ● రూ.143.4 కోట్ల మేర బకాయి ● నెల రోజులుగా రైతుల ఎదురు చూపులు ● ఆగ్రహంతో రోడ్డెక్కిన అన్నదాతలు ● ఎలా బతకాలని ఆవేదన ● కానూరు, డి.ముప్పవరంలో ఆందోళనలు పెరవలి: అప్పులు తెచ్చారు.. పెట్టుబడులు పెట్టారు.. కౌలు చెల్లించారు.. ఎరువులు, పురుగు మందులు జల్లారు.. ప్రకృతి విపత్తులకు ఎదురీదారు.. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నారు.. చివరకు పసిడి గింజలు పండించారు.. తీరా చూస్తే కొనుగోళ్ల సమయంలో టార్గెట్ల పేరుతో మోసం.. పండించిన లక్షల టన్నుల ధాన్యం గింజలు ఏం చేసుకోవాలో తెలియక ఆక్రోశం.. దళారుల దగా.. ఆందోళనకు దిగితే ముష్టి విదిల్చినట్లు కొనుగోలు టార్గెట్ మరో లక్ష టన్నుల పెంపు.. సరేననుకుంటే కొన్న ధాన్యానికి నెల రోజులుగా నయాపైసా కూడా చెల్లించడం లేదు.. ఇటువంటి వేదనాభరితమైన పరిస్థితుల్లో అన్నదాతలకు కడుపు మండింది.. పండించిన ప్రతి ధాన్యం గింజా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని, ఇది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పడమే తప్ప.. కూటమి సర్కారు తమకు ఒరగబెట్టిందేమీ లేదని కన్నెర్రజేశారు. తమపై ఈ చిన్నచూపు ఏమిటని, కొన్న ధాన్యానికి డబ్బులెప్పుడిస్తారని ప్రశ్నిస్తూ పోరుబాట పట్టారు. పెరవలి మండలం కానూరు, నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామాల్లో రహదారులు దిగ్బంధించారు. కొనుగోలు నుంచే దగా జిల్లావ్యాప్తంగా రైతులు రబీలో 58,586 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. మొత్తం 5.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా ప్రభుత్వం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని మొదట లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లక్ష్యం పూర్తయిపోయిందంటూ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోళ్లు నిలిపివేయడం.. ధాన్యం తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరించడం.. అదే సమయంలో అకాల వర్షాలు కురవడంతో.. మిగిలిన ధాన్యం ఏం చేయాలో, ఎలా కాపాడుకోవాలో అర్థం కాక పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. తమ వద్ద ఉన్న ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు తదితర మండలాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. దీంతో, దిగివచ్చిన ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 3.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. ఇంత అస్తవ్యస్త విధానాలతో ధాన్యం కొనుగోలు చేసిన సర్కారు.. నెల రోజులు గడుస్తున్నా నేటికీ సొమ్ము జమ చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ఇంత మోసమా? ఈ నెల 22వ తేదీ వరకూ 3.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. మరో 13 వేల మెట్రిక్ టన్నులు సేకరిస్తే లక్ష్యం పూర్తవుతుంది. ఇప్పటి వరకూ సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.776 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇందులో రూ.632.6 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. అది కూడా ఈ నెల 7వ తేదీ వరకూ మాత్రమే చెల్లించారు. మరో రూ.143.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెరవలి మండలంలో రూ.4.39 కోట్లు, కానూరు రైతులకు రూ.1.39 కోట్లు, నిడదవోలు మండలంలో 605 మంది రైతులకు రూ.8.22 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇదే విధంగా దాదాపు ప్రతి మండలంలోనూ రూ.5 నుంచి 10 కోట్ల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. అదనంగా సేకరించిన లక్ష టన్నుల ధాన్యానికి సొమ్ము చెల్లించకుండా ప్రభుత్వం తమను మోసం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొంతమందికి ఏప్రిల్లో సేకరించిన ధాన్యానికి సైతం ఇప్పటి వరకూ డబ్బులు జమ చేయలేదని, ఇలాగైతే తాము ఏవిధంగా బతకాలని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు పెద్ద రైతులకు సొమ్ము జమ చేసి, కౌలు, సన్న, చిన్నకారు రైతులకు ఇవ్వడం లేదని, దీంతో తాము ఆర్థికంగా నలిగిపోతున్నామని వాపోతున్నారు. ఈ డబ్బులు రాకపోతే పంటకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని, కౌలు ఎలా చెల్లించాలని, ఖరీఫ్ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడు ఆలకించరా..! నిడదవోలు రూరల్: రబీలో పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడంతో పాటు నెల రోజులుగా నుంచి పెండింగ్ పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు శనివారం ధర్నా నిర్వహించారు. నిడదవోలు మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని జీడిగుంట, పందలపర్రు, కోరుపల్లి, పెండ్యాల, మునిపల్లి, కలవచర్ల గ్రామాలకు చెందిన రైతులు డి.ముప్పవరం ప్రధాన సెంటర్లో నిరసన తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోయామన్నారు. రైతులు ఉప్పల శ్రీనివాస్, జల్లేపల్లి వీరరాఘవులు మాట్లాడుతూ, రబీ ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. నిడదవోలు మండలంలోని ఆయా ఆర్ఎస్కేల ద్వారా రబీలో 8,600 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రతి గింజా కొంటామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి మిల్లులకు ధాన్యం తోలిన 605 మంది రైతులకు రూ.8.22 కోట్లు చెల్లించాలని, డబ్బులు ఎప్పుడు పడతాయో సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు నినదించారు. వ్యవసాయ శాఖ కొవ్వూరు అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఏఎస్ఓ నాగాంజనేయులు, మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ, ఎస్సై కె.వీరబాబు అక్కడకు చేరుకుని, రైతులతో చర్చించారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యక్రమంలో రైతులు నిచ్చెనకోళ్ల కృష్ణమూర్తి, కామన కొండబాబు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్లాన్.. అట్టర్ఫ్లాప్
జీఓలో నిబంధనలు సడలించాలి జీఓ–20లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యలు సవరించడం ద్వారా ఈ జీఓ మరింత ఫలవంతమవుతుంది. భవన నిర్మాణాల్లో యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు లైసెన్స్ సర్వేయర్లను బాధ్యులను చేయడం సరైంది కాదు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించాం. జీఓ అమలులో లైసెన్స్ హోల్డర్ల హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా ఉండేలా చూడాలి. – సత్తి రాంబాబు, అధ్యక్షుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన నిర్మాణాలు ● ప్లాన్లు ఇవ్వడానికి సర్వేయర్ల నిరాకరణ ● పుర ప్రజలకు గుదిబండగా జీఓ–20 సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా సర్కారు నిర్ణయాలు తయారయ్యాయనే విమర్శ వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యవస్థల్లో ప్రభుత్వం తెస్తున్న మార్పులతో మొదటికే మోసం వస్తోంది. మూడు నెలల క్రితం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) కోసం విడుదల చేసిన జీఓ–20 నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు అవరోధంగా మారింది. ఈ జీఓ దెబ్బకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి ప్లాన్లు అక్కడే చతికిలపడ్డాయి. ఈ జీఓ అమలులోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపన్నుల నుంచి మధ్య తరగతి వరకూ వారి స్థాయికి తగ్గట్టుగా నిర్మించుకునే ఇళ్లకు ముహూర్తాలు చూసుకుంటారు. అన్నీ చూసుకుని పనులు మొదలు పెట్టాలంటే ముందుగా బిల్డింగ్ ప్లాన్లకు అనుమతి రావాలి. దీనిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో నిర్మాణదారులకు పెద్ద సమస్యగా మార్చేసి, చుక్కలు చూపిస్తోంది. కొత్తగా భవనాలు నిర్మించుకోవాలనే వారికి మున్సిపల్ ప్లాన్లు ఇచ్చేందుకు సర్వేయర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఇలా.. పట్టణాలు, నగరాల్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్ను సంప్రదించి, ప్లాన్ రెడీ చేసుకుంటారు. దరఖాస్తు, ప్లాన్తో పాటు సంబంధిత సొమ్మును కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చెల్లించిన అనంతరం ఆ ఫైల్ ఆన్లైన్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చేరుతుంది. న్యాయ, సాంకేతికపరమైన అంశాలతో పాటు నిబంధనలను పరిశీలించిన తర్వాత టౌన్ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనం నిర్మిస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సర్వేయర్దే బాధ్యత కూటమి సర్కారు కొత్తగా జారీ చేసిన జీఓ–20 ప్రకారం ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ప్లాన్ గీసిన సర్వేయర్ లేదా ఇంజినీర్ పైనే మొత్తం బాధ్యత పెట్టారు. ప్లాన్ వేసిన అనంతరం సర్వేయర్లు బేస్మెంట్, లింటల్, స్లాబ్లు.. ఇలా వివిధ దశల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోతే ఆ విషయాన్ని కూడా ప్లాన్ వేసిన సర్వేయరే అప్లోడ్ చేయాలి. వాస్తవానికి ఈ ప్రక్రియను మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షించాలి. అన్ని అధికారాలూ ఉండే మున్సిపల్ అధికారులకు కాకుండా తమపై ఈ బాధ్యత పెడితే ఎలాగని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడైనా ఉల్లంఘనలుంటే ప్లాన్ వేసిన సర్వేయర్ లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం వారిని బాధ్యులను చేస్తారు. ఇదెంతవరకూ సహేతుకమని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ పుణ్యమా అని సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు మూడు నెలలుగా ముందుకు రావడం లేదు. ప్లాన్ వేస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయంతో వారు ఒకవిధంగా పెన్డౌన్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఒక ప్లాన్ తయారు చేసి, అప్లోడ్ చేసి, అనుమతి లభిస్తే భవన యజమాని నుంచి రూ.ఐదారు వేలు, మరీ ఎక్కువైతే రూ.10 వేలు వస్తాయి. ఈ జీఓ అమలు పుణ్యమా అని చేయని తప్పునకు తామెందుకు బాధ్యత వహించాలని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో మూడు నెలలుగా ప్లాన్లు నిలిచిపోయాయి. దీనిపై భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ నగరంఇది పరిస్థితి కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 100 మంది సర్వేయర్లున్నారు. ప్లాన్ల ద్వారా కార్పొరేషన్కు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.40 లక్షల ఆదాయం వస్తూంటుంది. గడచిన మూడు నెలలుగా రూ.రెండు మూడు లక్షలు కూడా రావడం లేదు. సుమారు వెయ్యి ప్లాన్లు ఆగిపోయాయని చెబుతున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్ల వద్దకు గతంలో నెలకు 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చేవి. ఏడాదికి సుమారు 120 ప్లాన్లు అప్లోడ్ అవడంతో రూ.52 లక్షల ఆదాయం వచ్చేది. జీఓ–20 కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. పెద్దాపురం మున్సిపాలిటీలో నలుగురు సర్వేయర్లున్నారు. ప్లానింగ్ ద్వారా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.లక్ష వస్తే గొప్పన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ప్లాన్లు ఇవ్వడం లేదు. తుని మున్సిపాలిటీలో 20 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రతి నెలా 60 వరకూ ప్లాన్లు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. జీఓ–20 అమలులోకి వచ్చాక ప్లాన్లు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలో సుమారు 250 మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30కి మించి దరఖాస్తులు రావడం లేదు. నిడదవోలు మున్సిపాలిటీలో నలుగురు ప్రైవేటు సర్వేయర్లున్నారు. ఏటా ప్లాన్ల కోసం 10 దరఖాస్తులు వచ్చేవి. జీఓ–20 విడుదలైన తరువాత ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అమలాపురం మున్సిపాలిటీలో 20 మంది ప్రైవేటు సర్వేయర్ల వద్దకు జీఓ–20కి ముందు ప్రతి నెలా 25 నుంచి 35 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు వచ్చేవి. ఈ జీఓ వచ్చిన తరువాత సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మండపేట మున్సిపాలిటీలోని 15 మంది ప్రైవేటు సర్వేయర్లు నెలకు సుమారు 20 ప్లాన్లు ఇస్తూంటారు. మున్సిపాలిటీకి నెలకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. జీఓ–20తో నెలకు కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వస్తున్నాయి. సర్వేయర్లు ప్లాన్లు తయారు చేయడం ఆపేశారు. -
రత్నగిరి.. భక్తజన సాగరం
భక్తులకు ఇక్కట్లు భక్తులు రూ.300 వ్రతాల నుంచి రూ.2 వేల వ్రతాల వరకూ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.1,500 వ్రతాలాచరించే భక్తులను అనివేటి మండపం లోపలకు అనుమతించకపోవడంతో గుమ్మం వద్దనే సుమారు గంటసేపు నిలబడాల్సి వచ్చింది. దేవస్థానంలో వైఫై, సెల్ఫోన్ నెట్వర్క్లు పని చేయకపోవడంతో ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్స్, క్రెడిట్ కార్డుల ద్వారా వివిధ సేవా టికెట్లు కొనుగోలు చేసే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వ్రతాల టిక్కెట్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడటంతో ఇదే అదనుగా కొంతమంది ముందుగా వ్రతాల టికెట్లు కొనుగోలు చేసి, బ్లాక్లో అధిక ధరలకు విక్రయించారు.● సత్యదేవుని దర్శించిన 60 వేల మంది ● 5 వేల వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయంఅన్నవరం: ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు వివాహాల సందడితో రత్నగిరి శనివారం భక్తజనసాగరాన్ని తలపించింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. భక్తుల రద్దీ తట్టుకోలేక మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. మొత్తం 60 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఐదు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. -
అనాథ బాలలకు ‘ఆధార్’ ఇవ్వండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనాథ బాలబాలికలను కనుగొని, వారికి ఆధార్ కార్డు ఇవ్వాలని, చదువు లేని వారికి విద్యావకాశం కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఇన్చార్జి సెక్రటరీ షేక్ జానీ బాషా సూచించారు. డీఎల్ఎస్ఏ కార్యాలయంలో ‘సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇన్క్లూజన్ ఆన్ 13 మే 2025’ సాథీ కమిటీ సర్వే సభ్యులకు శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యంగా లేని బాలబాలికలకు వైద్య సేవలు, ఉచిత న్యాయ సలహాలు అందించడంపై సభ్యులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సాథీ కమిటీ సర్వే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 26 వరకూ నిర్వహించాలన్నారు. వీధుల్లో, వసతి గృహాల్లో ఉన్న 18 సంవత్సరాల లోపు అనాథ బాలికలను గుర్తించి, ఆధార్ కార్డు కల్పించడమే సాథి సర్వే ముఖ్యోద్దేశమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.జగదీష్కుమార్, మండలాల తహసీల్దార్లు, విద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖాధికారులు, బాలల సంరక్షణాధికారులు, ప్యానల్ లాయర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన. ఆ స్థాయిలో కాకపోయినా.. రాజమహేంద్రవరం ఐదు బళ్ల మార్కెట్ సెంటర్లో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి వారు శుక్రవారం నవ్యశోభతో దర్శనమిచ్చారు. ఆలయ 31వ వార్షికోత్సవం.. హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారిని శుక్రవారం జామకాయలతో విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ఆకు పూజలు, సిందూర పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) -
సంక్షేమ హాస్టళ్లలో వసతులకు ప్రాధాన్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సౌకర్యాలూ కల్పించాలని, పాఠశాలలు ప్రారంభించే నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. జిల్లా సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బడి బయటి పిల్లలను గుర్తించి, తిరిగి పాఠశాలలకు వచ్చేలా, వసతి గృహాల్లో సీట్లు కేటాయించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి, హాస్టళ్లలో చేర్పించాలని చెప్పారు. విడాకులు తీసుకున్న, విదేశాలకు వెళ్లిన మహిళల పిల్లలు, అసురక్షిత వాతావరణంలో ఉన్న ఆడ పిల్లలను గుర్తించి హాస్టళ్లలో చేర్పించాలన్నారు. తక్కువ మంది పిల్లలున్న వసతి గృహాలను గుర్తించి, హేతుబద్ధీకరించాలని సూచించారు. అన్ని వసతి గృహాల్లో టీవీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో.. ఏం చేయాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. సేవ చేయడానికి వచ్చిన తమను ఏఈఓ కె.కొండలరావు దూషించారంటూ మంచిర్యాల భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో కాషాయ రంగు చీరలు ధరించిన మహిళా సేవకులు.. భక్తులకు కనిపిస్తూంటారు. వీరందరూ తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్న స్వచ్ఛంద సేవకులు. వీరందరూ దేవస్థానంలో తమకు నిర్దేశించిన సేవలు ఉచితంగా అందిస్తూంటారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధిలో సేవ చేద్దామనే ఆశతో వస్తున్నా.. రత్నగిరిపై ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సేవా విభాగం లేక.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి రోజూ వేలాదిగా మహిళా సేవకులు వివిధ చోట్ల సేవలందిస్తూంటారు. అలాగే, పరకామణి అంటే హుండీ లెక్కింపుతో పాటు ఇతర సేవలను పురుషులు అందిస్తూంటారు. భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీలో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. దాని ఫోన్ నంబర్ టీటీడీ వెబ్సైట్లో ఉంటుంది. సేవకు వెళ్లాలనుకునేవారు ఆ నంబర్కు ఫోన్ చేస్తే వారు పూర్తి వివరాలు చెబుతారు. దాని ప్రకారం ఆ సేవా కార్యకర్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు సేవకు రావాలి, ఎవరిని కలవాలనే వివరాలు తెలియజేస్తారు. దాని ప్రకారం భక్తులు అక్కడకు వెళ్లి సేవ చేయవచ్చు. ఇటువంటి ఏర్పాటు అన్నవరం దేవస్థానంలో లేదు. గతంలో సేవ చేసిన వారైతే దేవస్థానంలో పరిచయం ఉన్నవారికి ఫోన్ చేసి వస్తున్నారు. కొత్తవారైతే మధ్యవర్తులను ఆశ్రయించి, మోసపోవాల్సిన పరిస్థితి. మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవా కార్యకర్తలు ఇదేవిధంగా మోసపోయారు. అన్నవరం దేవస్థానంలో సేవ చేసేందుకు మధ్యవర్తిని ఆశ్రయించగా, అతడు మరో మహిళకు ఈ పని అప్పగించాడు. ఆమె అన్నవరం దేవస్థానానికి పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసింది. తీరా ఇక్కడకు వస్తే సేవ చేయడానికి ఖాళీ లేదని, వెళ్లిపోవాలని ఏఈఓ చిరాకుపడ్డారని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ.. ఆ తరువాత రూ.300 చొప్పున వెనక్కి ఇచ్చి, మిగిలిన రూ.200 ఉంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటువంటి అవస్థలు భక్తులకు ఎదురవకుండా ఉండాలంటే అన్నవరం దేవస్థానంలో కూడా టీటీడీ తరహాలో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనంతరం, సేవ చేయాలనుకునేవారు ఆ విభాగాన్ని సంప్రదించేలా ఫోన్ నంబర్ను దేవస్థానం వెబ్సైట్లో పొందుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ·˘ Æý‡™èl²WÇOò³ çÜÓ^èle…§ýl õÜÐ]lMýS$ÌSMýS$ Cº¾…§ýl$Ë$ ఫ సేవకు దేవస్థానంలో ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి ·˘ {ç³™ólÅMýS Ñ¿êVýS… HÆ>µr$ చేయాలని భక్తుల డిమాండ్ మాకూ ఇలాగే జరిగింది సత్యదేవుని దీక్ష, ఉత్సవాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూంటాను. మా ప్రాంతం నుంచి సేవా కార్యకర్తలను అన్నవరం దేవస్థానానికి తీసుకువెళ్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దాంతో వెనక్కి వచ్చేశాం. దీనికోసం దేవస్థానంలో ఒక విభాగం ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవ చేసే భక్తులకు సమయం నిర్దేశిస్తే మేలు. – కృష్ణ, సేవా కార్యకర్త -
మహిళల రక్షణే మొదటి ప్రాధాన్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికలు, మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. మహిళలు, బాలికల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా పోలీసు అధికారులు, శక్తి టీములతో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళా మొబైల్ ఫోన్లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా 24 గంటలూ పోలీసు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, గుర్తించిన హాట్స్పాట్ల వద్ద శక్తి టీముల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వుమెన్ హెల్ప్ డెస్క్, మహిళల ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు, జోనల్ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మినీ మహానాడులో.. టీఢీపీ
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: మినీ మహానాడు వేదికగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. కార్యక్రమ నిర్వహణ పద్ధతిగా లేదంటూ ఒకరు.. తమ నేతకు ప్రాధాన్యం దక్కలేదని మరో వర్గం.. అసలు పార్టీ కార్యాలయమే లేకపోవడమేమిటని మరొక నేత వ్యాఖ్యానించడంతో సభలో కలకలం రేగింది. స్వపక్షంలోనే నేతలు విపక్షంగా మారి ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలే ఆవేదన వెళ్లగక్కడం చూస్తూంటే టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడు శుక్రవారం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాసు వర్గం కొంత మందికే ప్రాధాన్యం ఇచ్చిందని, మిగిలిన వారిని పక్కన పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పరస్పరం విమర్శలకు దిగడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. నిర్వహించే పద్ధతి ఇదేనా? క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో క్రమశిక్షణ కొరవడిందని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) మాజీ చైర్మన్, సీనియర్ నేత గన్ని కృష్ణ ధ్వజమెత్తారు. ఒక పద్ధతి లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికే రాలేదని విమర్శించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చామని.. తన వ్యాఖ్యలు కొందరికి కోపం రప్పించినా ఫర్వాలేదన్నారు. పార్టీ క్రమశిక్షణతో నడవాలనే ఉద్దేశాన్ని కుండ బద్దలుగొట్టినట్లు వెల్లడించారు. గన్ని ప్రసంగం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. పార్టీ కార్యాలయానికే దిక్కులేదు రాజకీయాలకు కీలకమైన తూర్పు గోదావరిలో టీడీపీకి ఇప్పటి వరకూ జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయమే లేదు.. ఇక పార్టీ అంతర్గత నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గోరంట్లకు ఘోర అవమానం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలక నేతగా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఘోర అవమానం ఎదురైంది. సభా ప్రాంగణం స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీంతో కోపోద్రిక్తులైన గోరంట్ల అనుచరులు, పార్టీ నేతలు ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు వ్యవహార శైలికి నిరసనగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి నిరసనకు దిగారు. సీనియర్ నేత అనే గౌరవం కూడా లేకుండా ఫొటో పెట్టకుండా అవమానించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. దీంతో, ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లింది. ఆయన రంగంలోకి దిగి, ఎమ్మెల్యేకి సూచించడంతో చివరకు సభా వేదిక వద్ద ఉన్న బ్యానర్లో హుటాహుటిగా బుచ్చయ్య ఫొటో ఏర్పాటు చేశారు. ఆది నుంచీ ఇదే తంతు ఫ ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య కొన్నేళ్లుగా వర్గ పోరు నడుస్తూనే ఉంది. తాజాగా పేపర్ మిల్లు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేపర్ మిల్లు కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరిపై ఫోన్లో రెచ్చిపోయారు. నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. వారిద్దరి ఫోన్ కాల్ సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. ‘నువ్వు వైఎస్సార్ పార్టీలోకి బుచ్చయ్య మాట విని వెళ్లావు. ఏం పీకావు? మా మీద కామెంట్లు చేశావు. విడిచిపెడతాననుకోకు. కామెంట్లకు పనిష్మెంట్లు ఉంటాయి’ అంటూ ప్రవీణ్పై అప్పారావు ధ్వజమెత్తారు. ఫ రాజమహేంద్రవరానికి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎన్నికలు ఎప్పుడున్న స్పష్టత రావడం లేదు. ఫ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు – రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఇటీవల రాజమహేంద్రవరం బోధనాస్పత్రి వద్ద మెడికల్ షాపు వివాదం మళ్లీ అగ్గి రాజేసింది. తమకు కావాలంటే తమకే దక్కాలంటూ పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలా ప్రతి విషయంలోనూ వర్గ విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో మినీ మహానాడు జరగడం.. బుచ్చయ్యతో విభేదాల నేపథ్యంలోనే ఆయన ఫొటోకు స్వాగత ఫ్లెక్సీలో స్థానం కల్పించలేదన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎంత విభేదాలున్నా పార్టీ కార్యక్రమానికి అందరూ కలసి రావాలి తప్ప.. ఇలా రచ్చకెక్కడమేమిటని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ·˘ M>Æý‡Å{MýSÐ]l$ °Æý‡Óç߿׿Oò³ AçÜ…™èl–í³¢ ·˘ ç³§ýl®†V> fÆý‡VýSÌôæ§ýl…r* గన్ని కృష్ణ ధ్వజం ·˘ hÌêÏ A«§ýlÅ„ýS$yól OVðSÆ>áfOÆð‡™ól ఎలాగంటూ మండిపాటు ·˘ ´ëÈtMìS hÌêÏ M>Æ>ÅÌSĶæ$… లేకపోవడమేమిటన్న బొడ్డు ·˘ ïܰĶæ$ÆŠ‡ GÐðl$ÃÌôæÅ VøÆý‡…rÏ ఫొటోకు దక్కని చోటు ·˘ ¯ól™èlÌS A…™èlÆý‡Y™èl కుమ్ములాటలు బహిర్గతం అగ్నికి ఆజ్యం పోసిన పరిశీలకుడు మినీ మహానాడు వేదికగా పార్టీ బలోపేతం, అంతర్గత నిర్మాణం, నేతల ప్రాధాన్యంపై టీడీపీ శ్రేణులు ప్రశ్నించగా.. పుండు మీద కారం జల్లినట్లు.. పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర అటవీ కార్పోరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు చేసిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో మరింత ఆగ్రహావేశాలు నింపాయి. అనుకున్న పదవులు రానందువల్లనే నేతలందరూ ఇలా ఆవేదన చెందుతున్నారని అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరిశీలకుడిగా పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి.. అగ్నికి ఆయన మరింత ఆజ్యం పోస్తున్నారన్న భావన కార్యకర్తల్లో వెల్లడైంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు. -
ఇది మానవ హక్కుల ఉల్లంఘనే..
రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. నగరంలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులను అడ్డం పెట్టుకుని సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. పోలీసుల టార్చర్తో గుడాల జాన్సన్ అనే వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను ఆపేది లేదని, అయితే, ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్నారు. సభకు త్వరలోనే హైకోర్టు నుంచి అనుమతి రానున్నదన్నారు. కోర్టుకు తాను ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు పోలీసులు చెప్పారని, ఇదే నిజమైతే తనపై ఫోర్జరీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవులను వివక్షతో చూస్తూ, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. -
కూటమి హామీలు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) అధ్యక్ష సహాయ అధ్యక్షులు పఠాన్ బాజీ, చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ నెల 1న చిత్తూరులో ప్రారంభమైన సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగుల ధర్నాలో నేతలిద్దరూ ప్రసంగించార. రాష్ట్రంలో 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికల ముంది ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు, ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్ఓ టి.సీతారామ్మూర్తికి సీపీఎస్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ విల్సన్పాల్, సహాధ్యక్షుడు డీఎస్ చాంబర్లీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీఎస్ రమేష్, ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు జె.రాజారావు, కె.గోపాలకృష్ణ, కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ·˘ ïÜï³-G‹Ü E§øÅVýS çÜ…çœ$ ¯ól™èlË$ ·˘ MýSÌñæMýSt-Æó‡sŒæ Ð]l§ýlª «§ýlÆ>² -
మద్యం షాపులు, బార్లు నిబంధనలు పాటించాలి
ఫ దీనిపై నైట్ పెట్రోలింగ్ ఫ జిల్లా ఎకై ్సజ్ అధికారి లావణ్య ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు అనుగుణంగా పని చేసేలా చూసేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమయ పాలన పాటించేలా, లూజు విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అమ్మకాలు జరగకుండా చూడటం, అనధికార సిట్టింగ్లను నివారించడం, షాపు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతామని వివరించారు. షాపులో రికార్డులు సమర్థవంతంగా నిర్వహించేలా, సీసీ కెమెరాలు సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా ప్రతి కానిస్టేబుల్కు మూడు నాలుగు షాపుల బాధ్యత అప్పగించామన్నారు. నైట్ పెట్రోలింగ్ను ఎస్సై, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నేరుగా పర్యవేక్షిస్తారని లావణ్య తెలిపారు. మద్యం షాపులు, బార్లు పకడ్బందీగా నిర్వహించేలా ఎకై ్సజ్ ‘ఐ’ మొబైల్ అప్లికేషన్ త్వరలో వస్తుందన్నారు. ఎకై ్సజ్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులుంటే 14405 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులకు తప్పని బదిలీలు రాయవరం: బదిలీ దరఖాస్తుల ప్రక్రియలో ఉపాధ్యాయులు తలమునకలయ్యారు. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, స్కూల్ అసిస్టెంట్ల ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నెల 27వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు ఉంది. అయితే బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిషన్ చేసే సమయంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ బదిలీ దరఖాస్తుల సబ్మిషన్ సమయంలో ఓటీపీ రావడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం సర్వర్ మొరాయించగా, మధ్యాహ్నం నుంచి సర్వర్ పనిచేయడంతో దరఖాస్తులు చేసుకున్నారు. పీడీలు దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్లో ఓపెన్ కాగా, పీఈటీలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఓపెన్ కాలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 64 మండలాల పరిధిలో 3,696 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి స్థానచలనం ఉంది. ఈ జాబితాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, తత్సమాన క్యాడర్ ఉపాధ్యాయులున్నారు. వీరిలో రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ అయ్యే ఉపాధ్యాయులు, దివ్యాంగ ఉపాధ్యాయులకు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేపట్టరు. ఖాళీలపై రావాల్సిన స్పష్టత క్యాడర్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ దరఖాస్తులు సమర్పించగా, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24 అర్ధరాత్రితో గడువు ముగియనుంది. దరఖాస్తులను సమర్పించిన తర్వాత బదిలీ కోరుకునే ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ప్రాధాన్యతా క్రమంలో వారు బదిలీ కోరుకునే స్థానాలను ఆన్లైన్లో ఎంపిక చేసుకుంటారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలను ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలను 25న స్వీకరిస్తారు. 27న ఫైనల్ సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఖాళీలను తెలియజేస్తారు. 28న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ కోరుకునే ప్రాంతానికి ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటారు. ఈ నెల 30 గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్తో పాటు యువకులు కూడా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. స్థానిక పోలీసుల కథనం మేరకు పెద్దాపురం గ్రామానికి చెందిన నవుడు వీర వెంకట మణికంఠ తన స్నేహితుడు కిషోర్తో కలిసి బైక్పై ప్రత్తిపాడులోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందు వస్తున్నాడు. స్థానిక హైవేపై నరేంద్రగిరి వద్ద వీరి బైక్ను జగ్గంపేట నుంచి అన్నవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో బైక్తో పాటు యువకులు లంపకలోవ రోడ్డులో ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన మణికంఠ, కిషోర్లను 108 అంబులెన్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రేడ్–2 హెచ్ఎం బదిలీలకు 245 దరఖాస్తులు
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 245 దరఖాస్తులు వచ్చాయి. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ బదిలీ దరఖాస్తుల్లో రిక్వెస్ట్ బదిలీలకు 181 దరఖాస్తులు రాగా, తప్పనిసరి బదిలీలకు 64 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను రెండు దశల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రాకపోకలు సాగించేందుకు 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటిస్తూ రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం– ఎస్ఎంబీటీ బెంగళూరు, ఎస్ఎంబీటీ బెంగళూరు (08581/ 08582) రైళ్లు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతీ సోమ, మంగళ వారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం –తిరుపతి, తిరుపతి విశాఖపట్నం (08547/ 08548) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతీ బుధ,గురువారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం– చర్లపల్లి, చర్లపల్లి –విశాఖపట్నం (08579/ 08580) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతీ శుక్ర, శనివారాలలో రాకపోకలు సాగించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగనున్నాయని తెలిపారు. -
ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్
మోసాలు చేస్తున్న నిందితుడి అరెస్ట్ యానాం: యానాం నియోజకవర్గ శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్తో షాది డాట్కమ్ను ప్రారంభించి పలువురిని మోసం చేస్తున్న ఘటనకు సంబంధించి నిందితుడు చెరుకూరి వంశీ అనే యువకుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫొటోతో ఎవరో షాది డాట్కమ్ ఫేక్ అకౌంట్ ప్రారంభించి మోసాలు చేస్తున్నారని, ఇదివరలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు వంశీ ఆచూకీ కోసం గాలించారు. అయితే అతనిపై గత 8 ఏళ్లలో హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో పలు కేసులు నమోదుకాగా నాలుగేళ్ల వరకు జైలుశిక్ష సైతం పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్ ఫొటోతో ఫేక్ అకౌంట్ మొదలుపెట్టినట్లు గుర్తించారు. నిందితుడు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుసుకున్న యానాం పోలీసులు అతనిని యానాం తీసుకువచ్చి విచారించారు. అయితే హైదరాబాద్లో కూడా అతనిపై పలు కేసులు ఉండటంతో తిరిగి అక్కడకు పోలీసులు తరలించగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపినట్లు తెలిసింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రం సుబ్బారాయుడు గుడి వద్ద శుక్రవారం ఉదయం పల్లం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీ కొట్టడంతో సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు (49) మృతి చెందారు. కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపిన సమాచారం ప్రకారం అమలాపురం డిపో ఆర్టీసీ బస్సు పల్లం నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీ కొట్టింది. నరసింహరాజును స్థానికులు 108 అంబులెన్సులో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు కోనపాకపేట ఆనంద హేచరీలో పని చేస్తున్నాడు. అక్కడకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు యూకేలో ఉన్నారు. యూకేలో కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఎంఎస్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కె.గంగవరం: మండలంలోని అముజూరుకి చెందిన పాలపర్తి శేషగిరిరావు(60) కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. శేషగిరిరావు రామచంద్రపురం నుంచి స్వగ్రామం అముజూరు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో స్థానికులు అతడిని పామర్రు పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల బృందానికి అవమానం ● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన ● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం ● విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఈఓకు ఆదేశం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన మహిళా సేవకుల పట్ల దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో సేవలందించేందుకు రెండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా మహిళా సేవకులు వస్తున్నారు. వీరు పది రోజుల నుంచి రెండు వారాల వరకూ స్వామివారి ఆలయం, యంత్రాలయం, ఉపాలయాలు, అన్నదానం, ప్రసాదం, క్యూ లైన్లు తదితర చోట్ల సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళలు గతంలో అన్నవరం దేవస్థానంలో సేవ చేసిన హైదరాబాద్కు చెందిన మరో సేవా బృందం మహిళను సంప్రదించారు. ఆమె స్వయంగా రానూపోనూ రైలు టికెట్లు రిజర్వ్ చేయించి, ఒక్కొక్కరి నుంచి రూ.500 అధికంగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అన్నవరం వచ్చిన మంచిర్యాల మహిళా సేవకుల బృందానికి డ్యూటీలు వేసేందుకు ఆలయ ఏఈఓ కె.కొండలరావు నిరాకరించారు. తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం వారే దేవస్థానం వద్దకు సేవకులను పంపిస్తారని, ఆమెతో మాట్లాడాలని చెప్పారు. దీంతో, మంచిర్యాల సేవకుల బృందం తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం ప్రతినిధితో మాట్లాడగా, తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆమె విరుచుకు పడింది. వెంటనే వెళ్లిపోవాలని, తాను కబురు చేసినప్పుడే రావాలని చెప్పింది. వారు మళ్లీ ఏఈఓ కొండలరావు వద్దకు రాగా.. ఆయన కూడా వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా కసిరినట్టు చెప్పారు. దేవుని సేవ చేద్దామని అంత దూరం నుంచి వస్తే తమను ఇలా అవమానించడమేమిటని మంచిర్యాల బృంద సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని వెంటనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై మండిపడిన ఆయన.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. -
పసుపు జెండా.. వెలిసిపోతోందా..!
●● ‘గ్లాస్’మేట్స్కే నామినేటెడ్ సీట్లా? ● ఈ పొత్తుతో చిత్తయిపోతామన్న జ్యోతుల ● నెహ్రూ వ్యాఖ్యలపై కూటమిలో దుమారం ● ఆధిపత్య ఆరాటమేనని విమర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ క్రమంగా నిర్వీర్యమైపోయినట్లే.. ఇప్పుడు జనసేన పొత్తుతో ‘పసుపు’ రంగు వెలిసిపోయే పరిస్థితి ఏర్పడుతోందా అంటే.. అవుననే అంటున్నాయి జిల్లాలోని టీడీపీ శ్రేణులు. కాకినాడలో గురువారం జరిగిన ఆ పార్టీ జిల్లా మహానాడులో సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఆధిపత్యం కోసమేనని మిత్రపక్షమైన జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద రెండు రోజులుగా జ్యోతుల అండ్ సన్ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో దుమారం రేపుతున్నాయి. పదవుల్లో ప్రాధాన్యం ఏదీ? టీడీపీ, జనసేనల మధ్య చాపకింద నీరులా కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు జ్యోతుల వ్యాఖ్యలతో రచ్చకెక్కాయి. పదవుల పందేరం మొదలుకొని జిల్లాలో జనసేనకే పెద్ద పీట వేయడాన్ని టీడీపీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశం మినీ మహానాడు వేదికలుగా ఆ పార్టీ నేతల మాటల్లో ప్రస్ఫుటమైంది. జనసేన కంటే బలం, బలగం అధికంగా ఉన్నప్పటికీ పదవుల్లో అన్యాయం జరుగుతోందని టీడీపీ శ్రేణులు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ‘గతంలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలకు తాత్కాలికంగా ఒకటో రెండో పదవులు వచ్చి ఉండవచ్చు. అప్పుడు మనం తెలివిగా రాజకీయం చేశాం. కేవలం మనతో పొత్తు కారణంగానే తరువాతి కాలంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యమైపోయాయి. ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి’ అని జ్యోతుల అన్నారు. పదవుల్లో టీడీపీ అధిష్టానం జనసేనకే పెద్దపీట వేస్తూండటంతో టీడీపీ క్రమంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతోందని నేరుగా కాకపోయినా పరోక్షంగా అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడైన తుమ్మల బాబుకు కొన్నాళ్ల కిందట కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనకే తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే, ఎక్కడా జనసేన, ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండా.. ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం న్యాయమా అని జ్యోతుల నిలదీశారు. ఇలాగైతే మెజార్టీలో ఉన్న టీడీపీ ఏమైపోతుందని నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించారు. జ్యోతులే కాదు.. ఆయన తనయుడు నవీన్ కుమార్ కూడా రెండు రోజుల క్రితం పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మినీ మహానాడుల్లో సైతం దాదాపు ఇదే అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు. పార్టీ పరంగా పిఠాపురంలో ఒకప్పుడు దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు దాదాపు స్తబ్దుగా మారిపోవడం చూస్తూంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోందని నవీన్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని నియమించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇలాగైతే జిల్లాలో పార్టీ ఎటువైపు పోతుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. తండ్రీకొడుకులు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. అదేం ప్రశ్న! అయితే, ఈ వ్యవహారంపై జనసేన నేతలు వేరేలా కౌంటర్ ఇస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టగానే కౌడా చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తుమ్మల బాబు ప్రకటించారని, అటువంటప్పుడు ఒకరికే రెండు పదవులని నెహ్రూ ఎలా అంటారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్గిరీని నవీన్ ఆశించి భంగపడ్డారని, అందువల్లనే నెహ్రూ నోట జోడు పదవుల ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. పదవుల పందేరంలో టీడీపీ నేతలకు అన్యాయమనేది సాకు మాత్రమేననని చెబుతున్నారు. పదవులన్నీ వాళ్లకే ఇచ్చేస్తే.. మనకో మరి!ప్రాధాన్యం దక్కనందుకేనా! పార్టీ పరంగా, రాజకీయంగా ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు వంటి నేతలకు జనసేనకు పెద్దపీట వేయడం నచ్చడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో దాదాపు జిల్లా ఉన్నతాధికారులు ఏ అంశంలోనైనా ఆయన మాటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సీనియర్లమైనప్పటికీ తమను పరిగణనలోకి తీసుకోకవడమే నెహ్రూ ఆగ్రహానికి కారణమై ఉంటుందనే అభిప్రాయం టీడీపీలో కూడా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలున్నప్పుడు ఎమ్మెల్యేలందరూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేశామని నెహ్రూ చెప్పుకొన్నారు. ఇప్పుడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకే పరిమితమైనా సమన్వయం కొరవడి, ఏమీ చేయలేకపోతున్నామన్న నెహ్రూ మాటల్లో ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశమే కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం ఎసిపోడ్లో టీడీపీ నిర్వీర్యమైపోతుందన్న నెహ్రూ వ్యాఖ్యలపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
అర్ధరాత్రి కారు బీభత్సం
పిఠాపురం: స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో బుధవారం అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి మోటారు సైకిల్పై వెళుతున్న ముగ్గురిని ఢీకొట్టి పాదగయ ఆలయం వద్ద పార్కింగ్లో ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా పలు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు బుధవారం అర్ధరాత్రి పిఠాపురం పాదగయ సెంటర్లో ఒకే మోటార్ సైకిల్పై చంద్రపాలెం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్థానిక ఇందిరానగర్కు చెందిన పల్లా కృష్ణ, ఏడిద వెంకటేష్, బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్రను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి పాదగయ క్షేత్రం వద్ద పార్కింగ్లో ఉన్న పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడగా పాదగయ సెంటర్లో ఉన్న పలు మోటారు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి మోటార్ సైకిలిస్టులను ఢీ కొట్టిన వైనం ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం కారులోని వారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు -
యూటీఎఫ్ హెల్ప్ డెస్క్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయుల సందేహాలు నివృత్తి చేయడానికి నగరంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ మాట్లాడుతూ బదిలీల విషయంలో ఉపాధ్యాయులకు అవసరమైన సహకారం అందించడానికి, మార్గనిర్దేశం, దరఖాస్తు ప్రక్రియలో సాయం చేయడానికి రాజమహేంద్రవరంతో పాటు కోరుకొండ, ఉండ్రాజవరం, గోకవరం, నిడదవోలుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వివరాలకు 99899 82503, 99899 82503 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు ప్రభాకరవర్మ, ప్రసాదరావు, జిల్లా కార్యదర్శులు కె.రమేష్బాబు, ఎన్.రవిబాబు, దయానిధి, మనోహర్, ప్రకాశరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంత మండపాలు నవదంపతులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. పదవులన్నీ జనసేనకేనా! కాకినాడ సిటీ: జిల్లాలో పలు పదవులు తమకు కాకుండా జనసేనకే కట్టబెట్టడమేమిటని పలువురు టీడీపీ నాయకులు ప్రశ్నించారు. కాకినాడలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా మహానాడులో నాయకులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు విలువ లేకుండా పోతోందని, అన్నిచోట్లా జనసేన నాయకులకే పనులు జరుగుతున్నాయని, దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని నేతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను, అవమానాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునేలా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కార్యకర్తలు ప్రజల నుంచి దోచుకోకుండా ఆర్థిక స్థితి కల్పించి, ఆదుకోవాలని అన్నారు. మిత్రధర్మం పాటిస్తూనే టీడీపీ కార్యకర్తలకు పొత్తు నిష్పత్తిలో న్యాయం చేయాలని సూచించారు. కాకినాడ సెజ్ 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారని, ఎటువంటి పరిశ్రమలూ రాకపోవడంతో యువత, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా నియోజకవర్గా ల్లోని సమస్యలు లేవనెత్తారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈఏపీ సెట్కు 96.32 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్ష జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,736 మంది హాజరు కా గా, 63 మంది గైర్హాజరయ్యారు. ఉదయ పరీక్షకు 871 మంది హాజరవ్వగా 30 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 865 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. -
పట్టణవాసికి.. పన్నుపోటు!
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టినప్పటి నుంచీ బాదుడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలకు పెను భారం మోపిన సర్కారు.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, ఖాళీ స్థల, కుళాయి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం 15 శాతం చెల్లిస్తున్న ఆస్తి పన్నును 20 శాతానికి పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తోంది. పురపాలక సంస్థల్లో చాలా ఆస్తులకు అసెస్మెంట్ చేయలేదని, దీనికోసం సర్వే చేపడుతున్నామని నమ్మబలుకుతోంది. కానీ, ప్రజలకు ‘అదనపు వడ్డింపు’లు చేయడమే దీని వెనుక అసలు లక్ష్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20 శాతం అధికంగా పన్నులు వసూలు చేయాలని ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో తలమునకలవుతున్నారు. ఇదేనా సంపద సృష్టి? కూటమి అధికారంలోకి వస్తే ఏటా పెంచే 15 శాతం పన్నును తగ్గిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. గద్దెనెక్కిన కొన్ని నెలల వ్యవధిలోనే కూటమి పెద్దలు ప్రజల నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా భవనానికి నిర్మాణ సమయంలోనే కొలతలు, నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి, పన్ను విధిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో లోపాలున్నాయంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ప్రభుత్వం.. తాజాగా కొలతలు తీసుకోవాలని పేర్కొంటూ, కొత్తగా పన్ను భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20 శాతం అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు నాంది పలుకుతోంది. ఈ మేరకు పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పట్టణ స్థానిక సంస్థలో ఎంత మేర అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టాక మోపుతున్న భారాలను చూస్తూంటే.. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు గారూ.. అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇంటింటి సర్వే చేస్తారిలా.. ● సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వేనిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ, సర్వేయర్ల సహాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ● ఇళ్లు, భవనాలున్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, లేదా తనిఖీ చేస్తారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ● నిర్మాణ విస్తీర్ణం మేరకు పన్ను విధించారా, లేదా.. అదనపు అంతస్తులకు పన్ను విధించారా.. నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తారు. బాదుడు ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.307.89 కోట్ల పన్ను డిమాండ్ ఇక్కడ ఉంది. తాజా ‘పన్ను పోటు’లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల ప్రజలపై అత్యధిక భారం పడనుంంది. రాజమహేంద్రవరంలో అత్యధికంగా రూ.137.32 కోట్ల డిమాండ్ ఉంటోంది. సర్వే పూర్తయితే ఇక్కడి ప్రజలపై మరో రూ.15 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లో పన్నుల డిమాండ్ రూ.110.99 కోట్లు కాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ బాదుడుతో ఈ నగర ప్రజలపై మరో రూ.12 కోట్లు వడ్డిస్తారు. అదనపు వసూళ్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల 15లోగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీయాలని ఆదేశాలు కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో అమలు రాజమహేంద్రవరంలో రూ.15 కోట్లు.. కాకినాడలో రూ.12 కోట్ల భారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల వడ్డింపు ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో) నగరం/పట్టణం పన్ను డిమాండ్ కాకినాడ 110.99 పిఠాపురం 10.17 సామర్లకోట 8.78 రాజమహేంద్రవరం 137.32 నిడదవోలు 8.47 ఏలేశ్వరం 2.61 అమలాపురం 14.72 రామచంద్రపురం 7.65 పెద్దాపురం 7.18 కొవ్వూరు 4.56 -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి. రాజోలు దీవిలో.. రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది. కొత్త గింజలతో వ్యాపారం ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. స్వదేశీ గింజలతో వ్యాపారం సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే మార్కెట్లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది. జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా కలసిరాని పెళ్లిళ్ల సీజన్ అమాంతంగా పెరిగిన గింజల ధర పెరిగిన గింజల ధర కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది. – ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి మందకొడిగా వ్యాపారం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది. – జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ప్రారంభించిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ సామర్లకోట: పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలివచ్చారు. గురువారం సాయంత్రం శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ అంటే ఒక శక్తి అని, వారి జోలికి వస్తే మట్టి కరిపిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతిలోని అలిపిరి ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా స్వామీజీ వివరించారు. హిందువులు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారని అన్నారు. రామనామం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా శక్తి ఏర్పడుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది శోభాయాత్రకు తరలి వచ్చారు. సీఐ ఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పిఠాపురం రోడ్డు నుంచి పెద్దాపురం రోడ్డు మీదుగా శోభాయాత్ర ర్యాలీ పెద్దాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరి తిరిగి సామర్లకోట వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు స్వామిజీ మోటారు సైకిల్పై కూర్చుని శోభాయాత్రలో పాల్గొన్నారు. -
యోగాపై అవగాహన కార్యక్రమాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. రోజుకో ప్రభుత్వ శాఖ చొప్పున నెల రోజుల పాటు అన్ని శాఖలూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 27న యోగా సంఘాలతో, 28న అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో, 29న సెంట్రల్ జైలులో రాష్ట్ర స్థాయి కార్యక్రమం, 30న వైద్యాధికారులు, వైద్యులతో, 31న మాజీ సైనికోద్యోగులతో, జూన్ 1న ఫ్యామిలీ యోగా, 2న ఆటో, లారీ సంఘాలు, 3న మత్స్యకారులు, 4న గిరిజనులు, 5న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, 6న ఉపాధ్యాయులు, 7న రెసిడెన్షియల్ అసోసియేషన్లు, 8న సీనియర్ సిటిజన్లు, 9న ఇంజినీరింగ్ విద్యార్థులతో యోగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈవిధంగా వచ్చే నెల 21 వరకూ వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరితో యోగా వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించాలని, వారంతా సాధన చేసేలా చూడాలని సూచించారు. అనంతరం, కలెక్టర్మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జూన్ 21న రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందితో రికార్డు స్థాయిలో యోగా చేయించాలనే లక్ష్యంలో భాగంగా నగరంలోని వై.జంక్షన్ నుంచి లాలాచెరువు వరకూ ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య యోగా సాధన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేసే క్రమంలో కడియం, కొవ్వూరు గోష్పాద క్షేత్రం, వివిధ ఘాట్లలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. -
పట్టు వదలకుండా పోరాడుదాం
చేబ్రోలులో పట్టు రైతుల సమావేశం పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం స్థానిక పట్టు పరిశ్రమ కేంద్రంలో నిర్వహించిన పట్టు రైతుల సమావేశంలో పట్టు వదిలేసి పామాయిల్ సాగు చేయండి అన్న ఉన్నతాధికారుల సలహాలపై చర్చించుకున్నారు. రైతులు మాట్లాడుతూ వేలాది మంది రైతులకు జీవనోపాధి, రాష్ట్రంలో పట్టు సాగులో కీలక పాత్ర వహించే చేబ్రోలులో పట్టు సాగు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పంట కాదని ఎందరికో ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ అని ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. కొంతకాలంగా ఈ పరిశ్రమ ఇలా దిగజారిపోవడానికి జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి గీతారాణి అని, ఆమె పట్టు పరిశ్రమ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ఆమె పోలీసులతో తమపై దౌర్జన్యం చేయించి రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. పంటలు నాశనం అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని, ఆమెను తక్షణం బదిలీ చేసి పట్టు పరిశ్రమ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టు సాగు వదిలేసి పామాయిల్ సాగు చేయడం జరగని పని అని అన్నారు. పట్టు సాగులో నష్టాలు రాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి, చర్యలు తీసుకుని పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావాలని రైతులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మళ్లీ విజ్ఞప్తులు చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. పట్టు రైతులు ఉలవకాయల రాంబాబు, ఓరుగంటి సందీప్, ఓరుగంటి శ్రీను, చల్లా రామకృష్ణ, ఎలుగుబంటి బాబు పాల్గొన్నారు. -
బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా
కాకినాడ క్రైం: బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ధూమపానం వల్ల ఎదురయ్యే అనర్థాలను వాల్పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని అన్నారు. ప్రార్థనా ప్రదేశాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత శాఖతో కలిసి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాల్లో చిక్కుకున్న సొత్తును తిరిగి ఖాతాదారుడికి అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చేసిన విచారణను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన పెంపొందించాలని సూచించారు. పోక్సో, రేప్ కేసుల్లో బాధితులను విచారించేందుకు శక్తి టీం సేవలను వినియోగించుకోవాలని, ఇటువంటి కేసుల్లో 60 రోజుల్లోపు చార్జిషీటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాత కేసులు, ఆస్తి తగాదాలు, పోక్సో, రేప్, ఎన్డీపీఎస్, సైబర్ క్రైం, మిస్సింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం ఎస్డీపీవో హరిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు రామచంద్రపురం రూరల్: మండలంలోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన యువతి ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. ఆదివారపుపేట గ్రామానికి చెందిన పిచ్చిక సత్యవతి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామం ఆదివారపుపేట వచ్చారు. ఈ నేపథ్యంలో 21 రాత్రి 2 గంటల సమయంలో తల్లి సత్యవతి ఇంటిలో తన కూతురు అపర్ణ లేకపోవడం గమనించింది. పరిసరాల్లోను, బంధువు ఇళ్లల్లోను విచారణ చేసినా ఉపయోగం లేకపోవడంతో ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆగివున్న లారీని ఢీకొట్టిన టాటా వ్యాన్
ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన నాగుల వెంకటేశ్వరరావు, ఎన్.రాజ్యలక్ష్మి, బి.రఘుబాబు, లక్ష్మీదుర్గ, తాళం రాధ, బి.దేవిక, బి.లోకేశ్వర్రావు, బి.దేవేంద్ర, ఎన్.పావని అన్నవరానికి టాటా మేజిక్ వ్యాన్లో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వైఎస్సార్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్క ఆగివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ చింతలచెరువు మధుతోపాటు అందులో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రమం ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, దైవ దర్శనం కోసం అన్నవరానికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు డ్రైవర్ కునుకు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై ఆందోళనలు
● ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటాలు ● వైఎస్సార్ సీపీ నేతలు తిప్పల గురుమూర్తిరెడ్డి, వేణు రాజమహేంద్రవరం రూరల్: ఏడాది కాక మునుపే కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమరోత్సాహంతో తిప్పి కొట్టాలని, ప్రజల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం సమైక్యంగా ఆందోళన బాట పట్టాలని, వారిలో విశ్వసనీయతను పెంచాలని పిలుపునిచ్చారు. తద్వారా వైఎస్సార్ సీపీ మరింత బలపడి, భవిష్యత్తులో అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, తదితర అంశాలపై గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రులు వేణు, తానేటి వనిత, యువజన రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు సమీక్షించారు. వేణు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో గురుమూర్తిరెడ్డి, వేణు మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్యాయం చేసిన వారి తరఫున పోరాడటంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించ లేదని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా, ఇతర సంక్షేమ పథకాలను సైతం అందించకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు సిద్ధం కావాలన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించారు. పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులై తొలిసారిగా నగరానికి వచ్చిన గురుమూర్తిరెడ్డిని ఈ సందర్భంగా నేతలు సత్కరించారు. -
హత్యాయత్నం కేసులో జైలు
దేవరపల్లి: భార్య కాపురానికి రాకపోవడానికి బావమరిది కారణమనే కోపంతో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.వి.ఎల్ సరస్వతి గురువారం నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించారు. దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవరపల్లి మండలం బందపురం శివారు రంగరాయకాలనీకి చెందిన షేక్ సయ్యద్ బాజీ తన భార్య కాపురానికి రావట్లేదని, దీనికి కారణం తన బావమరిది షేక్ కరీముల్లా అనే కోపంతో 2017లో కత్తితో దాడి చేశాడు. అప్పటి ఎస్సై కె.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్చు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కాకులపాటి వెంకరమణ వాదించినట్టు ఆయన తెలిపారు. బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, లుంగీ ధరించి ఉన్నాడని, మృతదేహం ఉన్న తీరుని బట్టి చనిపోయి సుమారు 15 రోజులు అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించామని, వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కె.గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కులం పేరుతో దూషించారంటూ నిరసన కె.గంగవరం: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట గ్రామంలో దళిత కాలనీకి చెందిన మహిళలు, పురుషులు భారీగా స్టేషన్ వద్దకు తరలివచ్చి కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు మోటారు సైకిల్పై ఏటిగట్టు వైపు వెళుతున్న సమయంలో అటుగా రోడ్డపై వస్తున్న ఉపాధి కూలీలకు మోటారు సైకిల్ హ్యాండిల్ తగిలింది. వెంటనే కూలీలు అతనిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో ఈశ్వరరావు మహిళా కూలీలను కులం పేరుతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో వారు ఈశ్వరరావును స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈశ్వరరావు కూడా రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. స్టేషన్ వద్ద నిరసన.. కోట గ్రామానికి చెందిన పలువురు వాహనాలలో భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కులం పేరుతో దూషించి మహిళలను దాడి చేసిన ఈశ్వరరావును వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొంత సేపు నిరసన చేశారు. ఈశ్వరరావు గతంలో కూడా దళితులను చిన్నచూపు చూశాడని, తమ కాలనీలో గల చెరువును తవ్వనీయకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. చెరువు లేకపోతే మాకు నీరు ఉండదని లంక భూములు సాగు చేసుకునే విషయంలో కూడా అడ్డుకుంటున్నాడని వారు నిరసన చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాయవరం: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలను పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బదిలీల జీవో 22ను ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తారు. 2017 ఆగస్టు 31కి ముందు ఆ పాఠశాలలో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్/ఎస్జీటీ తత్సమాన క్యాడర్, 2020 ఆగస్టు 31 ముందు విధుల్లో చేరిన గ్రేడ్–2 హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 2027 మే నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని క్యాడర్లకు చెందిన సుమారు 18 వేల మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన తేదీలు ● బదిలీల ప్రక్రియకు సంబంధించి బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. 28న ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. ● స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 21 నుంచి 24 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్న్1, 2 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలి. ● ఎస్జీటీలు ఈ నెల 21 నుంచి 27 వరకూ దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి జూన్ ఏడు నుంచి 10వ తేదీ వరకూ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. హామీలకు కట్టుబడాలి ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. బదిలీ జీవోలో ప్రధానంగా మూడు అంశాల్లో స్పష్టత కొరవడింది. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, ఖాళీలు బ్లాక్ చేయకుండా ఉండడం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ ఖాళీల విషయంలో హామీలను అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ స్పష్టత లేదు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం మరికొన్ని విషయాల్లో అధికారులు స్పష్టంగా జీవోలు విడుదల చేయాలి. ఇంగ్లిషు మీడియంతో సమానంగా తెలుగు మీడియం నిర్వహించాలన్న అంశం, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశాలపై స్పష్టత లేదు. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ నిబంధనల ప్రకారమే.. బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తాం. విద్యాశాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కిందస్థాయికి చేరవేసి, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహిస్తాం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా విడుదలైన జీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కొన్ని అంశాలపై స్పష్టత లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు -
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. -
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సారా నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్అండ్బీ రహదారిలోని రైస్మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు. -
కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం 24 రోజులుగా రాజమహేంద్రవరం కలెక్టర్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేయడంతో పార్టీ తరఫున అండగా ఉంటామని భరత్ హామీ ఇచ్చారు. ఆందోళన కారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైనన్స్ ప్రకారం ఆరేళ్లు వర్క్ చేస్తే, పర్మినెంట్ చేయాలని, అందుకే మీ డిమాండ్కి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం ఎందుకు లొంగిపోయిందో అర్థం కావడం లేదన్నారు. కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భరత్ చెప్పారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ మొదటి ఫేజ్లోనే తీసుకొచ్చామని, రెండవ ఏడాదిలోకి కాలేజీ అడుగుపెట్టిందని అన్నారు. తమ ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్లను కూడా తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రానికి మన ఎంపీల మద్దతుతో పనిలేకున్నా సరే, పోరాడి సాధించామని చెప్పారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. అప్పులు చేసుకుంటూ పోతూ కూడా సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదని భరత్ విమర్శించారు. మాజీ ఎంపీ భరత్ -
పొగాకు రైతుల పక్షాన పోరాటం
దేవరపల్లి: పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం గోపాలపురంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కూసం రామ్మోహన్రెడ్డి ఇంటి వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. పొగాకు రైతుల కష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి మరికొన్ని రోజులు గడువు ఇద్దామనే ఉద్దేశంతో గురువారం పొగాకు వేలం కేంద్రం వద్ద జరగవలసిన ఆందోళనను వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 2021 పంట సీజన్లో కరోనా సమయంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో ఉండగా, అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.200 కోట్లు విడుదల చేసి మార్క్ఫెడ్ ద్వారా పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. పంటల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతు పండించిన పంటలకు మద్ధతు ధర ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. 2024–25 పంట కాలంలో రైతులు సుమారు 75 మిలియన్ల కిలోల పొగాకు పండించగా, ఇప్పటి వరకు కేవలం 12 మిలియన్ల కిలోలు కొనుగోలు జరిగిందన్నారు. గత ఏడాది కిలోకు రూ. 410 లభించగా, ఈ ఏడాది రూ. 250 పలుకుతోందని, దీని వల్ల పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ఆయన తెలిపారు. ఆరుగాలం కష్టపడే రైతులు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదన్నారు. రైతులు పండించిన పొగాకును రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో అప్పులు రూ.1.40 లక్షల కోట్లు కాగా, కూటమి ప్రభుత్వం 11 నెలల పాలనలో 1.59 కోట్లు అప్పు చేసిందన్నారు. ఇంటింటికీ రేషన్ వాహనాల రద్దు దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లను, 16 వేల మంది మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న నిరుద్యోగులను, మరొక 16 వేల మంది రేషన్ వాహనదారులను తొలగించిందని మండిపడ్డారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి,రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, రైతు విభాగం అధ్యక్షుడు వి.సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ -
కారు ఢీకొని మహిళ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కలవచర్లకు చెందిన యర్రా మాణిక్యం (54) కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతోంది. కంటి పరీక్ష చేయించుకుందామని జీఎస్ఎల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. టు వే గా ఉన్న రహదారిపై డివైడర్ దాటి అవతలి వైపుకు వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి గండేపల్లి: వర్షం కారణంగా మోటారు బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లికి చెందిన షేక్ నాగూర్ సాహెబ్ (57) రాజానగరంలోని గైట్ కళాశాలలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మోటార్ సైకిల్పై డ్యూటీకి బయలుదేరారు. వర్షం పడుతున్న సమయంలో మురారి శివారు మాతారాణి దాబా ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజానగరం జీఎస్ఎల్కు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నాగూర్ సాహెబ్కు భార్య నూర్జహాన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్ఎస్ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మళ్లీ నిరీక్షణాలు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం అనుకున్నంత పని చేసింది. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానానికి మంగళం పాడింది. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేస్తున్న ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలను తొలగిస్తున్నట్లు గతంలో స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేబినేట్లో నిర్ణయం తీసుకోవడంతో వాహనాల తొలగింపునకు మార్గం సుగమమైంది. వృద్ధులు, వికలాంగులకు రేషన్ సరకులను డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. దేశం మెచ్చిన వ్యవస్థను ఎత్తివేసి వాళ్లకు మాత్రం ఎలా అందిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు అగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు తమకు అవకాశం ఉన్నా.. వచ్చే నెల 1వ తేదీ నుంచే తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమపై కూటమి ప్రభుత్వానికి ‘ఎందుకంత కక్ష’ అని నిట్టూరుస్తున్నారు. తాము కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ఆవేదన చెందుతున్నారు. వందల మందికి ఉపాధి దూరం చేయడం దారుణమంటున్నారు. వ్యవస్థ రద్దయితే తిరిగి పాత పద్ధతి తెరపైకి రానుంది. రేషన్ షాపుల వద్ద గంటల తరబడి నిరీక్షించే రోజులు మళ్లీ ప్రారంభం కానున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ప్రతి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అందరూ కలిసి తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడుకి విన్నవించారు. 2021లో శ్రీకారం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చౌకదుకాణాల వద్ద రేషన్ పొందాలంటే గగనంగా మారేది. షాపుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. అలాంటి దయనీయ పరిస్థితికి స్వస్తి పలికేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పథకానికి శ్రీకారం చుట్టింది. 2021 జనవరి 21న వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ఈ వ్యవస్థ కొనసాగుతోంది. వృద్ధులు, అభాగ్యులు, రేషన్ డిపో వద్దకు వెళ్లి సరకులు తీసుకోలేని వారికి ఎంతో సాంత్వన చేకూరేది. ‘తూర్పు’లో ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 364 రేషన్ పంపిణీ వాహనాలు ఉండగా.. 5,64,994 రేషన్ కార్డులున్నాయి. 871 రేషన్ దుకాణాలుండగా.. ప్రతి నెలా 15,77,393 మందికి గాను 8,400 టన్నుల బియ్యం అందజేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 17 వరకూ ఈ–పోస్ యంత్రం ద్వారా జీపీఎస్ ట్రాకింగ్ పద్ధతిలో పంపిణీ చేస్తున్నారు. మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయడంతో పకడ్బందీగా పథకం నడుస్తోంది. కొత్త పథకం వచ్చిందని రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ఎండీయూలకు సరకులను సరఫరా చేసే బాధ్యతలను ఆయా డీలర్లకు అప్పగించారు. ఒప్పందం సంగతేంటి? ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీకి సంబంధించి ఎండీయూ నిర్వాహకులు 2027 వరకూ కొనసాగేలా గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాహనాల వాయిదాలు సైతం అప్పటి వరకూ చెల్లించేలా సమయం కేటాయించింది. ఎండీయూ వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. వాహన వ్యయంలో 10 శాతం లబ్ధిదారుడు నెలకు రూ.3 వేలు చెల్లిస్తుండగా.. మిగిలిన రూ.8 వేలు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తోంది. పథకాన్ని రద్దు చేస్తే ఈ ఒప్పందాన్ని ఏం చేస్తారన్న మీమాంస నెలకొంది. తాము నెలవారీ వాయిదాలు ఎలా చెల్లించాలన్న ఆవేదన ఎండీయూ ఆపరేటర్లలో నెలకొంది. నిత్యావసరాలకు పంగనామాలు రేషన్ కార్డున్న లబ్ధిదారుడికి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై కిలో గోధుమ పిండి, కేజీ కందిపప్పు, అర కేజీ పంచదార ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అరకొరగా సరఫరా చేస్తున్నారు. తూకంలో తేడా వస్తోందన్న వాదనతో మంత్రి నాదెండ్ల మనోహర్ పంచదార పంపిణీ ఆపేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడో జరిగిన తప్పునకు తమను బాధ్యులను చేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచీ అంతే... ప్రజా పంపిణీ విధానాన్ని నిర్వీర్యం చేసేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు ఆలోచన అని చెప్పడంతో ఆయనకు ప్రజలపై ఏ మేరకు బాధ్యత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలదన్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు సైతం ఎండీయూ ఆపరేటర్లను తీసేయాలన్న వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తోంది.జిల్లాలో రేషన్ దుకాణాలు : 871 రేషన్ పంపిణీ వాహనాలు : 364 రేషన్ కార్డులు : 5,64,994 పంపిణీ చేసే బియ్యం : 8,400 టన్నులు బియ్యం లబ్ధిదారులు : 15,77,393 364 మంది ఉపాధికి గండిఇంటింటికీ బియ్యం సరఫరా వాహనాలను నిలిపివేస్తే జిల్లా వ్యాప్తంగా 364 మంది ఎండీయూ ఆపరేటర్ల ఉపాధికి గండి పడుతుంది. ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ యూనిట్ కాస్ట్ రూ.6 లక్షలు కాగా అందులో లబ్ధిదారుని వాటా 10 శాతం (రూ.60వేలు) మిగిలిన రూ.5.40 లక్షలు బ్యాంకు రుణంగా ఇచ్చి ప్రోత్సహించింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. డీలర్ వద్ద సరకులు సేకరించి ప్రతి ఇంటికీ అందజేసేందుకు నెలకు రూ.21వేలు ఇస్తుండగా రూ.3 వేలు బ్యాంకుకు, రూ.3 వేలు పెట్రోల్ ఖర్చులు, హెల్పర్కు రూ.5వేలు పోగా మిలిగిన రూ.10 వేల లబ్ధిదారుడి ఉపాధి కోసం కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం వాహనాల తొలగింపు ప్రకటన చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు, వాహనదారుల ఉపాధికి గండి కొట్టిన పరిస్థితి తలెత్తింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆగనున్న సేవలు ఎండీయూ వాహనాలు తొలగిస్తున్నట్టు కేబినెట్లో వెల్లడి మొదలు కానున్న రేషన్ కష్టాలు షాపుల వద్ద ప్రజలకు తప్పని యాతనలు ఒక్కో సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు డోర్ డెలివరీపై సందిగ్ధం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎండీయూ ఆపరేటర్ల ఉద్యమ బాట తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రం -
ఐసెట్లో 96.90 శాతం ఉత్తీర్ణత
రాయవరం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చి, 96.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల ఏడో తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 743 మంది విద్యార్థులు హాజరు కాగా, 720 మంది పాసయ్యారు. వారిలో 240 మంది బాలురు, 480 మంది బాలికలు ఉన్నారు. ప్రశాంతంగా టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ, ఓపెన్ పరీక్షలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్షకు 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. 18 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 904 మంది హాజరుకావాల్సి వుంది. ఓపెన్ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తెలుగు పరీక్షకు 235 మందికి 110 మంది హాజరయ్యారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రసాయన శాస్త్రం పరీక్షకు 384 మందికి 253 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 21 వరకు యోగా మాసోత్సవాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మన ధరిత్రి మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి కోరారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్న రాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. జూన్ 21వ తేదీ వరకు యోగా మాసంగా పాటిస్తామన్నారు. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లుఅన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు లెక్కింపులో పాల్గొన్నారు. పార్టీ తప్పిదం వల్లనే కార్యకర్తల్లో అసహనం – టీడీపీ కాకినాడ రూరల్ మినీ మహానాడులో జ్యోతుల నవీన్ కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
బోటు బోల్తా పడి మత్స్యకారుడి గల్లంతు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఒక మత్స్యకారుడు గల్లంతు కాగా మరో ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన మేరుగు శ్యామ్ అదే గ్రామానికి చెందిన రామిశెట్టి వీరబాబు, వంకా ఇస్సాక్ బోటుపై మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు చేపల వేటకు వెళ్లారు. తుపాను ప్రభావంతో సముద్రం ఉధృతంగా ఉండడంతో హోప్ హైలాండ్ సమీపంలో బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న మేరుగు శ్యామ్ గల్లంతుకాగా వీరబాబు, ఇస్సాక్ హోప్ హైలాండ్ తీరానికి చేరుకున్నారు. మత్స్యకారులు, అధికారులు గల్లంతైన శ్యామ్ కోసం బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. శ్యామ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికొత్తపేట: ఇద్దరు మోటారు సైక్లిస్టులు ఎదురెదురుగా ఢీకొనగా ఒక మోటార్ సైక్లిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన వాడ చైతన్యజనార్దన (36) సోమవారం రాత్రి ఒక పని నిమిత్తం మోటార్ సైకిల్పై రావులపాలెం వెళ్లి తిరిగి అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా మందపల్లి వంతెన సమపంలో కొత్తపేట వైపు నుంచి మోటార్ సైక్లిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. చైతన్యజనార్దనను ఢీకొన్న మోటార్ సైక్లిస్టుకు కూడా గాయాలైనట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. మృతుని భార్య వాడ చిన్నారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
చోరీ సొత్తుతో సహా నిందితుడి అరెస్ట్
● రూ.10 లక్షల నగదు రికవరీ ● 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు అన్నవరం: స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుడి బ్యాగ్ కోసి రూ.10 లక్షలు అపహరించిన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ డీ శ్రీహరి రాజు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన బోడపాటి నాగేశ్వరరావుకు తునిలో ఇంటి స్థలం ఉంది. దానిని ఆయన తన స్నేహితుడు భానుప్రకాష్ ద్వారా రూ.20 లక్షలకు ఇటీవల విక్రయించారు. ఆ మేరకు రూ.10 లక్షల నగదు, మరో రూ.10 లక్షల చెక్కును బ్యాగులో పెట్టుకుని సోమవారం ఉదయం తునిలో ఆర్టీసీ బస్సు ఎక్కి అన్నవరం బస్కాంప్లెక్స్లో దిగారు. బస్కాంప్లెక్స్లో గుంటూరు బస్సు కోసం వేచి చూస్తుండగా మరో వ్యక్తి ప్రయాణికుడిలా నటిస్తూ ఆయనతో మాటలు కలిపారు. అనంతరం ఆయనను మభ్యపెట్టి పదునైన చాకుతో బ్యాగ్ కోసి రూ.పది లక్షల నగదు అపహరించి పారిపోయాడు. మధ్యాహ్నం ఆయన గుంటూరు బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ చూడగా కోసి ఉంది. దీంతో ఆయన కంగారుగా బస్సు దిగి చూడగా బ్యాగ్లో రూ.10 లక్షలు లేవు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నం అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ కాంప్లెక్స్లో తనను మాటల్లో పెట్టిన వ్యక్తే చోరీ చేసుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ శ్రీహరి రాజు, పెద్దాపురం సీసీఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ శ్రీ హరి బాబు, ఏఎస్సై బలరామ్, హెడ్ కానిస్టేబుల్ రాధాకృష్ణ బాధితునితో మాట్లాడారు. నేరస్తుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపాం సెంటర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి బ్యాగ్ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పొలీసులు అతడిని ప్రశ్నించడంతో ఆ నేరం తానే చేసినట్టు అంగీకరించాడు. అతడిని విశాఖకు చెందిన కంబాల శ్రీనుగా గుర్తించారు. అతని వద్ద గల బ్యాగ్లో చోరీ సొత్తు రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ జీ బిందుమాధవ్ అభినందించారు. -
కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకం
● ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న ఐజీ, ఎస్పీ ● ఈ నెల 24న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ ● అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ● మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఈ నెల 24న జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజీవ్గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐజీ, ఎస్పీలు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి గతంలో ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతీ చర్చిలో మీటింగులు పెట్టి ఈ నెల 24వ తేదీన జరిగే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు వెళ్లవద్దని, వెళ్లిన వారిపై అరెస్టులు చేసి, కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై మాట్లాడినా, పోస్టర్లు ముద్రించినా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కేసులు పెడతామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్ వేశామన్నారు. ఆ పోస్టర్లో కొంతమంది పెద్దల పేర్లు వేశామని తెలిపారు. వారిని ఎమ్మార్వో ఆఫీస్కు పిలిపించి రూ.50 వేల సొంత పూచీకత్తు కట్టించుకుని, బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. క్రైస్తవులకు మీటింగులు పెట్టుకునే హక్కు లేదని ప్రకటిస్తే మేము మీటింగులు పెట్టబోమన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి హత్యగానే నమ్ముతున్నామన్నారు. ప్రవీణ్ పగడాల హత్యపై రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభ జరగనివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రవీణ్ ప్రగడాల హత్య వెనుక చాలా పెద్ద హస్తమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభకు ఒకరోజు ముందుగానే 50 మంది బిషప్లు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రైస్తవ సంఘాలు, యువజన సంఘాలు ఈ సభకు తరలి వస్తున్నాయని ఎక్కడైనా ఆపితే అక్కడకక్కడే ధర్నా చేసి సభ నిర్వహిస్తారని, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని దానికి బాధ్యులు పోలీసులే అవుతారని పేర్కొన్నారు. శాంతియుతంగా సభ నిర్వహిస్తామని, దానిని పరిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన.. అటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణ ధారలు కురిపిస్తూండటంతో పావన పంపా రిజర్వాయర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా.. పరీవాహక ప్రాంతాలైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కొండల్లో నెల రోజుల నుంచి తరచుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో, రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం నాటికి 84.60 అడుగులకు పెరిగింది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. ప్రస్తుతం 0.028 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 105 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండడంతో జలాశయం నీటిమట్టం 85 అడుగుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు జలకళతో తొణికిసలాడుతున్న పంపా రిజర్వాయర్ను చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తురాయి చెట్లు కూడా ఎర్రని పూలు పూస్తూండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పలువురు భక్తులు రత్నగిరి నుంచి పంపా రిజర్వాయర్ కవరయ్యేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. పంపా ఘాట్ల వద్ద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. – అన్నవరం పంపా ఘాట్ల వద్ద పెరిగిన నీటిమట్టం -
వానలో తడుస్తూ.. సమస్యలపై ఎలుగెత్తుతూ..
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) జాతీయ రహదారిపై వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇలాగైన ప్రభుత్వ పెద్దల మనస్సు కరిగి, సానుకూలంగా స్పందించాలని కోరారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పి)/సీహెచ్ఓల అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యాన సీహెచ్ఓలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. -
జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టి–హబ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోనిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేసేలా కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో టి–హబ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్ర ప్రాంగణాన్ని మంగళవారం ఆమె పరిశీలించి, భవనం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా యువతకు మరింత ఉపాధి, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంగణంలో ప్రాథమిక శిక్షణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతో చేపట్టనున్న ఈ భవన నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఏఈ శంకర్ను ఆదేశించారు. ప్రస్తుత భవనంలో నైపుణ్య శిక్షణలు త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా నైపుణ్యాధికారి వీడీజీ మురళిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ల్యాండ్ సర్వేయర్ ఏడీ బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లో అర్హుల జాబితా రాజమహేంద్రవరం రూరల్: మిషన్ వాత్సల్య, వన్స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులు, అనర్హుల జాబితాను తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్సైట్లో ఉంచారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి విజయకుమారి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తమ కార్యాలయం ఆధ్వర్యాన గత ఏడాది అక్టోబర్ 14న, ఈ ఏడాది జనవరి 31న, ఏప్రిల్ 7న మిషన్ వాత్సల్య, వన్స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్లలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు, అనర్హుల వివరాలను eastgodavari.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. అలాగే, కలెక్టరేట్లోను, బొమ్మూరులోని తమ కార్యాలయంలోని నోటీసు బోర్డులోను ఈ జాబితాను ఉంచామన్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని విజయకుమారి సూచించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల సమ్మె రాజమహేంద్రవరం రూరల్: సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలనే డిమాండ్లతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ 102 సర్వీస్ డ్రైవర్లు కలెక్టరేట్ వద్ద మంగళవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. వారి సమ్మెకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు సంఘీభావం తెలిపారు. 102 సేవలను 2015లో ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ వీరికి రూ.8,800 మాత్రమే జీతం ఇస్తున్నారని వారు తెలిపారు. పదేళ్లలో ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలు మారాయి, కంపెనీలు మారాయి కానీ, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు మాదిరిగా వీరికి కూడా రూ.18,500 వేతనం ఇప్పించాలని కోరారు. హైకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.27,68,281 అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు. -
విక్రయ వస్తువుపై ధర, బరువు ఉండాలి
అమలాపురం టౌన్: విక్రయ వస్తువుల ప్యాకెట్లపై దాని ధర, బరువు లేదా కొలత విధిగా ఉండాలని అమలాపురం తూనికలు, కొలతలశాఖ (లీగల్ మెట్రాలజీ) అసిస్టెంట్ కమిషనర్ కె.రాజేష్ సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువులకు సంబంధించి దుకాణాదారుని నుంచి బిల్లును అడిగే చైతన్యం వినియోగదారుల్లో రావాలని అన్నారు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎర్రవంతెన వద్ద గల ఆ శాఖ కార్యాలయంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కొన్న వస్తువులకు బిల్లులు అడగడం ఓ హక్కుగా వినియోగదారులు భావించాలన్నారు. ముఖ్యంగా బంగారం విక్రయాలకు సంబంధించి వినియోగదారులకు ఇచ్చే బిల్లులపై విధిగా ఆ బంగారం ఎన్ని క్యారెట్లు వంటి వివరాలు ఉండాలని సూచించారు. వ్యాపార సంఘాల ప్రతినిధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర బంగారం, వెండి వర్తకుల సంఘం కోశాధికారి అనిల్కుమార్ జైన్, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్ మాట్లాడుతూ తూనికలు, కొలతల నిబంధనలపై వ్యాపారస్తులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వినియోగదారుల సంఘాల ప్రతినిధులు అమరేశ్వరరావు, అభిరామ్, అమలాపురం బంగారు, వెండి వర్తకుల సంఘం అధ్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు, మెడికల్ అసోసియేషన్ ప్రతినిధిగా మోకా వెంకట సుబ్బారావు, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధిగా దొమ్మేటి సాయిబాబు, వ్యాపారులు కొవ్వూరి వెంకటరెడ్డి, రేకపల్లి సత్యనారాయణమూర్తి, రాయుడు నాని, అనుపోజు శ్రీను, చవాకుల కృష్ణ, చింతలపూడి సత్తిబాబు ప్రసంగించారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గోకరకొండ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు. ఫ నడిరోడ్డుపై.. హోరువానలో ఓ అమ్మ ఆక్రందన ఫ పిల్లలకు ఆహారం, వైద్యం అందించలేక వేదన ఫ తక్షణమే స్పందించిన డీసీపీయూ బృందం ఫ తల్లి, ముగ్గురు పిల్లలకు రక్షణ ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకై నా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటన కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... -
పొగాకు గిట్టుబాటు ధర కోసం 22న ధర్నా
ఫ దేవరపల్లి వేలం కేంద్రం వద్ద ఆందోళన ఫ వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా దేవరపల్లి: పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ఈ నెల 22న ధర్నా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం 9 గంటలకు రైతులతో కలసి ఈ ఆందోళన చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు విలవిలలాడుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొగాకు రైతులకు అండగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన భారీ ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాజా కోరారు. అర్జీదారులకు ఎండార్స్మెంట్లు తప్పనిసరి రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అందజేసిన అర్జీలకు సంబంధించి ఫిర్యాదీలకు ఎండార్స్మెంట్లు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఆడిట్ నివేదిక ప్రకారం 50 శాతం మంది అర్జీదారులకు ఎండార్స్మెంట్ చేరడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ సీతారామమూర్తి, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖకు సంబంధించి 127, పంచాయతీరాజ్ 40, పోలీసు 30, వ్యవసాయం 16, ఇతర శాఖలకు సంబంధించి 73 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఫిర్యాదుల్లో రెవెన్యూ, సర్వే శాఖలవే అధికంగా ఉంటున్నాయని, తర్వాతి స్థానాల్లో పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖలున్నాయని తెలిపారు. పరిష్కారం చూపలేని అంశాలకు కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సమకూర్చిన రూ.25 వేల విలువైన కృత్రిమ అవయవాలను ముగ్గురు మహిళలు, ఒక పురుషునికి కలెక్టర్ ప్రశాంతి అందజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 40 అర్జీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 40 అర్జీలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా క్రైం బ్రాంచి (డీసీఆర్బీ) ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. నగరంలోని లూథర్గిరి అయాన్ డిజిటల్ జోన్లో జరిగిన ఈ పరీక్షలకు 92.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 649 మందికి 594 మంది పరీక్షలు రాశారు. అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 657 మందికి గాను 610 మంది హాజరయ్యారు. మొత్తం 1,300 మందికి గాను 1,204 మంది పరీక్షలు రాశారు. -
కొత్తిమీర.. అధర గొట్టేలా..
పెరవలి: దాదాపు ప్రతి ఒక్కరూ నిత్యం వంటల్లో ఉపయోగించే కొత్తిమీరకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. సాగు చివరి దశకు చేరడంతో మార్కెట్లోకి కొత్తిమీర రావడం కాస్త తగ్గుతోంది. దీంతో, మార్కెట్లో దీని ధర పెరుగుతోంది. దీనికి అనుగుణంగా రైతు వద్ద కూడా ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పెరవలి మండలం అన్నవరప్పాడు, ఖండవల్లి, ముత్యాలవారిపాలెం, లంకమాలపల్లి, ఓదూరివారిపాలెం, కాకరపర్రు, తీపర్రు, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు గ్రామాల్లో సుమారు 150 ఎకరాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కిలో కొత్తిమీర ధర ఏకంగా రూ.150కి పెరిగింది. అంతలోనే దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్ను ముంచెత్తడంతో క్రమంగా ధర తగ్గుతూ వచ్చి కిలోకు ఏకంగా రూ.20కి పడిపోయింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొందరు రైతులు నిర్వేదానికి గురై, ప్రజలను కొత్తిమీర ఉచితంగా పట్టుకెళ్లిపొమ్మని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దశలో కూలి రేట్లు కూడా పెరిగిపోవడంతో కొత్తిమీర మొక్కలు తీసి, కట్టలు కట్టే కన్నా పొలంలో వదిలేస్తేనే నయమని రైతులు భావించారు. అటువంటిది.. ప్రస్తుతం సాగు చివరి దశకు రావడంతో దిగుబడి తగ్గి, కొత్తిమీర ధర క్రమేపీ పెరగడం మొదలైంది. ప్రస్తుతం రైతుకు కిలో రూ.60 వరకూ దక్కుతోంది. మార్కెట్లో వినియోగదారులకు ఒక్కో కొత్తిమీర కట్ట రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. కిలోకు ఐదారు కట్టలు వస్తాయి. దీని ప్రకారం మార్కెట్లో కిలో కొత్తిమీర ధర రూ.100 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. కానీ, రైతుకు రూ.60 మాత్రమే దక్కుతోంది. ధర మరి కాస్త పెరిగితే తమకు మరింత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో కొత్తిమీర సాగుకు రూ.25 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. దిగుబడి రెండు మూడు టన్నులు వస్తోంది. టన్నుకు రూ.60 వేలు వస్తోందని, పెట్టుబడి, ఇతర ఖర్చులు పోనూ ఎకరానికి నికరంగా రూ.30 వేలు మిగులుతుందని రైతులు చెబుతున్నారు. అయితే, దిగుబడులు తగ్గిన తరువాత ధర పెరగడంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. ధర స్థిరంగా ఉంటే.. పదెకరాల్లో కొత్తిమీర సాగు వేశా ను. ఎకరానికి రూ.20 వేల వర కూ పెట్టుబడి అయ్యింది. ఎనిమిదెకరాల్లో పంట ముందుగా రావడంతో కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య అమ్మాల్సి వచ్చింది. పెట్టుబడి కూడా రాలేదు. ప్రస్తుతం కిలోకు రూ.60 పలుకుతోంది. దిగుబడిని బట్టి ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకూ వస్తుంది. ఈ ధరలు స్థిరంగా ఉంటే మొదటి పంట నష్టం కొంతవరకూ పూడ్చుకోగలం. – ఆకుల సూర్యనారాయణ, రైతు, ముత్యాలవారిపాలెం ఫ గతంలో కిలో రూ.20కి పడిపోయిన రైతు ధర ఫ నేడు ఏకంగా రూ.60కి పెరుగుదల ఫ రిటైల్ మార్కెట్లో రూ.100కు పైనే -
గుల్జార్ హౌస్లు!
మనకీ ఉన్నాయి..ఈ జాగ్రత్తలు అవసరం ఇళ్లు, అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్ల వంటి నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం అక్షరాలా ప్రాణ రక్షణతో సమానం. అగ్నిమాపక విభాగం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రమాణాలు ఈ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయి. ఫ ప్రతి భవంతిలో రెండు ఫైర్ ఎగ్జిట్లు తప్పనిసరి. అవి ఎక్కడున్నాయో అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. వినియోగించడంపై అవగాహన ఉండాలి. ఫ ఫైర్ అలారం వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. పొగ, మంటలు చెలరేగినప్పుడు స్పీకర్లు, హెచ్చరిక లైట్లతో అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం. ఫ ప్రతి ఫ్లోర్లో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు తగినన్ని ఉండాలి. వాటి పని తీరును ప్రతి నాలుగు నెలలకోకసారి పరిశీలించుకోవాలి. ఫ భారీ భవంతుల్లో ఫైర్ హైడ్రెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనూహ్యంగా ప్రమాదాలేవైనా జరిగితే వీటి ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలను మరింత సులువుగా చేపట్టగలుగుతారు. ఫ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనంలోనూ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. ఫ కనీసం ప్రతి ఆరు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తే నివాసితుల్లో అవగాహన పెరుగుతుంది. ఫ విద్యుత్ వైరింగ్, ఉపకరణాల్లో లోపాలే చాలా అగ్నిప్రమాదాలకు మూలం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భవన యజమానులకు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు, సాకెట్లు క్రమం తప్పకుండా నాణ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ ప్రతి భవనం నిర్మాణ సమయంలో అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ సేఫ్టీ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంతో ఉలికిపాటు ఫ మన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు ఫ కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలుచోట్ల ప్రమాదకరంగా భవనాలు ఫ ముందే మేల్కొంటే మేలు కాకినాడ క్రైం: హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమైపోయారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎనిమిది మంది, 60 ఏళ్ల పైబడ్డ వారు ఐదుగురు ఉన్నారు. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఘోర అగ్ని ప్రమాదమిది. ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిలో అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో బయటపడడం ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఈ ఘోర కలి మన నగరాల్లోని భవనాలల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఇరుకై న వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనమూ ముందస్తుగా మేల్కోవలసిన ఆవశ్యకతను గుల్జార్ హౌస్ ప్రమాదం గుర్తు చేస్తోంది. ఇరుకు ప్రాంతాలు.. భద్రత లేని భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో చాలా ప్రాంతాలు ఎంతో ఇరుకుగా ఉన్నాయి. మెయిన్ రోడ్లు సహా మార్కెట్ వీధులు, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి భవనాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాకినాడ మెయిన్ రోడ్డులో మసీద్ సెంటర్ మొదలు జగన్నాథపురం వంతెన వరకూ కుడి, ఎడమ వైపున అనేక దుకాణాలను గ్రౌండ్ ఫ్లోర్లలోనే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్తో స్టాక్ పెట్టి, రెండో అంతస్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు ఇదే రీతిలో ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ పై అంతస్తుల నుంచి కిందకి దిగడానికి ఒకటే మార్గం ఉంటోంది. ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. ఫ కొద్ది రోజుల క్రితం కాకినాడ సంతచెరువు జంక్షన్లోని ఓ భవంతి ఒకటో అంతస్తులో ఏసీ షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫ కాకినాడ భానుగుడి కూడలిలో వ్యాపార సముదాయాలు కలిగిన సుభద్ర ఆర్కేడ్లో కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ప్యానళ్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. ఉదయం వేళ కావడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, ప్రమాదాన్ని నిలువరించారు. నిలిచిన తనిఖీలు ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్లు నిలిపి వేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అగ్నిమాపక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో ప్రస్తుతం తనిఖీలేవీ జరగడం లేదు. గతంలో భవనాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసి, ఒకే మార్గాలున్న భవనాలన్నింటికీ అదనపు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయించారు. అయితే, కొన్ని నెలల క్రితం నుంచి ఆ తనిఖీలకు తిలోదకాలిచ్చారు. పొగే ప్రమాదకారి మంటలు వ్యాప్తి చెందే తొలి దశలో మంటల కంటే పొగే ప్రమాదకారి. హైదరాబాద్ ఘటనలో 17 మరణాలు సంభవించడానికి కారణం కూడా పొగ వ్యాపించి, ఊపిరి ఆడకపోవడమే. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని సైతం ఈ పొగ అడ్డుకుంటుంది. ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీస్తుంది. ఇరుకై న నివాస, వర్తక సముదాయాలు అగ్నిప్రమాదాలకు నిలయాలు. ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్ ఆధ్వర్యంలో తరచుగా చేపడుతున్న మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. – ఉద్దండురావు సుబ్బారావు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కాకినాడ -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సోమవారం భక్తజనఝరిని తలపించింది. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాలతో అలంకరించి (ముత్తంగి సేవ) పూజించారు. -
సీహెచ్ఓల వినూత్న నిరసన
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 21 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) సోమవారం వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సూర్య నమస్కారాలు వేస్తూ, ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి, తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ)/సీహెచ్ఓ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలు సానుకూలంగా పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, కోత లేకుండా క్రమం తప్పకుండా పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. – రాజమహేంద్రవరం రూరల్ -
రాజోలు టీడీపీలో ఇన్చార్జి రగడ
ఫ గుబ్బలకు చెక్ పెడుతూ ఎస్సీల సమావేశం ఫ పదవి కోసం పావులు కదుపుతున్న జగడం, గెడ్డం మలికిపురం: రాజోలు నియోజకవర్గంలోని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కూటమి నుంచి జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అతీగతీ లేకుండా ఉన్నామని టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉండగా.. గత కొంత కాలంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవిపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సోమవారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం సమావేశాన్ని గోనిపాటి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల తరువాత ఒక నాయకత్వం లేకుండా ఉన్న టీడీపీకి ఇన్చార్జిని వెంటనే నియమించాలని కోరుతూ తీర్మానం చేశారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడిగా ఉన్న గెడ్డం సింహాను ఇన్చార్జిగా నియమించాలని తీర్మానించారు. అయితే ఈ పదవి కోసం ఆ పార్టీలోని అదే సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు రాజోలుకు చెందిన జగడం సత్యనారాయణ కూడా కర్చీఫ్ వేశారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును టీడీపీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించుకుని జనసేన ఎమ్మెల్యేకు ధీటుగా పెట్టుకుందామని టీడీపీలో ఒక వర్గం పావులు కదపగా, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం అత్యవసరంగా సమావేశం కావడం వెనుక ఆ పార్టీలో ఉన్న తీవ్ర అసంతృప్తే కారణమని తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుంచి ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఉన్న గుబ్బల శ్రీనివాస్ను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఖరారు చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ధీటుగా ఎస్సీ నియోజకవర్గమైన రాజోలుకు బీసీ ఇన్చార్జి ఏంటనే విధంగా తాజాగా ఎస్సీ విభాగం సమావేశం తీర్మానం చేసింది. ఇందులో భాగంగా గెడ్డం సింహాను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని చేసిన తీర్మానం కాపీలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు సోమవారం సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. -
కోకో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
అంబాజీపేట: ఆరుగాలం శ్రమించి పండించిన కోకో గింజలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కోకో సాగురైతు సంఘ సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ అన్నారు. అంబాజీపేట కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా కోకో రైతుల సమావేశం జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోకో గింజలు నాణ్యత ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో కోకో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కోకో గింజలకు ప్రస్తుతం అంతర్జాతీయ ధర కిలో రూ.940లు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు కిలో రూ.500లోపు కొంటున్నారన్నారు. అంతర్జాతీయ ధరకే కోకో గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశీ గింజల దిగుమతులు నిలుపుదల చెయ్యాలని, ధరలు నిర్ణయించే వరకూ రైతులు, కంపెనీలు కొనుగోలు, అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోకో గింజల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు దంగేటి గిరిధర్, అడబాల రాజమోహన్, రెడ్డి రామకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, సరెళ్ల అప్పారావు, ప్రకాష్, సమయవంతుల పండు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..
అన్నవరం: అన్నవరం.. ఈ పేరు వింటేనే ప్రతి భక్తుని మది మురిసిపోతుంది.. ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది.. అలాంటి రత్నగిరిపై లోటుపాట్లు విమర్శలకు తావిచ్చాయి.. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ స్పందించారు. చక్కదిద్దే చర్యలకు ముందుకు వచ్చారు.. ఇక నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజాదికాలు, స్వామివారి కల్యాణోత్సవాలు, వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై త్వరలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు రోహిత్ వెల్లడించారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాల్లో గతంలో జరిగిన ఉత్సవాలకు భిన్నంగా వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే. అదే విధంగా 13న జరిగిన స్వామివారి శ్రీపుష్పయాగంలో అమ్మవారిని స్వామివారికి ఎడుమవైపు కాకుండా కుడివైపునకు వచ్చేలా ఏర్పాటు చేయడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. కల్యాణోత్సవాల్లో చోటు చేసుకున్న అపశ్రుతులపై కూడా ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ప్చ్..కళ కట్టలేదు’ శీర్షికన కథనం వచ్చింది. దేవస్థానంలో వైదిక కార్యక్రమాల విధి విధానాలు రూపొందించాల్సిన వైదిక కమిటీ సరైన శ్రద్ధ చూపకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతితో చర్చించి వారి సూచనల మేరకు దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ఉత్సవాల్లో చేయాల్సిన క్రతువులు, హోమాలు నిలుపుదల చేయాలా వద్దా తదితర విషయాలపై కూడా స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. వైదిక సలహాదారుడు లేక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వైదిక కార్యక్రమాలపై సలహాలకు ప్రముఖ పండితుడిని వైదిక సలహాదారుగా నియమించి పూజలు నిర్వహించేవారు. తొలుత ప్రముఖ పండితుడు తంగిరాల బాలగంగాధరశాస్త్రి దేవస్థానం వైదిక సలహాదారుగా ఉండేవారు. ఆయన తరువాత రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2010 వరకూ కొనసాగారు. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన జాంపండు మాస్టారుగా పేరు పొందిన ప్రముఖ పండితుడు శ్రీసత్యనారాయణ మూర్తిని నియమించారు. ఆ తరువాత మరో సలహాదారుడిని నియమించలేదు. దీంతో దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకే వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వైదిక సలహాదారు లేని లోటు కనిపిస్తోంది. దేవస్థానంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన ప్రముఖ వేద, జ్యోతిష పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు, కంచి కామకోటి పీథం, శృంగేరీ పీఠాధిపతులతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిని వైదిక సలహాదారునిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాలు ‘సాక్షి’లో వరుస కథనాలతో చర్యలు శృంగేరి పీఠాధిపతి సూచనలతో ముందుకు.. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ వెల్లడి విధి విధానాలు రూపొందిస్తాం.. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి హోమాల నిలిపివేత, శ్రీపుష్పయాగం రోజున స్వామి, అమ్మవారి అలంకరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్లో ఇటువంటి వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటాం. దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, అలంకరణలపై శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారిని మార్గదర్శనం చేయాలని కోరతాం. వారి సూచనలు, సలహాలు ప్రకారం నడుచుకుంటాం. వీటిని అతిక్రమించకుండా చూస్తాం. –ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం -
ఐఎఫ్ఎస్కు ములగపూడి విద్యార్థి ఎంపిక
రౌతులపూడి: మండలంలోని ములగపూడికి చెందిన చింతకాయల లవకుమార్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన 2024 ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాల్లో ఆయన 49వ ర్యాంకు సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరసర్వ చక్రవర్తి, వీర వరహాలు దంపతులకు లవకుమార్ జన్మించారు. ఆయనకు సోదరి స్వాతి ఉన్నారు. లవకుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకూ ములగపూడిలో చదువుకున్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ కత్తిపూడి రిఫరల్ పాఠశాలలోను, 9, 10 తరగతులు తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థలోను, ఇంటర్మీడియెట్ విజయవాడ చైతన్య జూనియర్ కళాశాలలో, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బీవీఎస్సీ డిగ్రీ చదివారు. కొంతకాలం వెటర్నరీ అంబులెన్స్లో సేవలందిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఎటువంటి కోచింగ్ లేకుండా, సెల్ఫోన్లు వాడకుండా పట్టుదలతో చదివారు. నిరంతర కృషితో ఎట్టకేలకు ఐఎఫ్ఎస్ సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఐఎఫ్ఎస్ సాధించిన మొదటి వ్యక్తి తమ కుమారుడు కావడం ఆనందంగా ఉందన్నారు. లవకుమార్ విజయంపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాడి రాకేష్ (17) స్నేహితులతో కలసి కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ నేపథ్యంలో గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి తండ్రి శ్రీను, తల్లి, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. శ్రీను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మృతి ఘటనపై కొవ్వూరు పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల నుంచి సీతంపేట వద్దకు నిత్యం అధిక సంఖ్యలో స్నానాలకు వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణంకొత్తపేట: స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు (40) ఆదివారం రాత్రి స్థానిక దేవాలయంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొత్తపేట వచ్చాడు. నాగేశ్వరరావు పాత బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా అమలాపురం వైపు నుంచి రావులపాలెం వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మృతుని భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర వివరించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాల నాయుడు
అంబాజీపేట: స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంధ్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్ర నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ముత్యాల నాయుడు కొవ్వూరు, దర్శి, మహానంది తదితర పరిశోధన స్థానాల్లో సుగంధ ద్రవ్య పంటలు, అరటి, నిమ్మ, దుంప పంటలు, పండ్లు, కూరగాయల పంటలపై పరిశోధనలు చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. కొబ్బరిలో తెగుళ్లు, పురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చేరువలో ఉంటానన్నారు. కొబ్బరిని ఆశించిన తెల్లదోమ నివారణకు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై నివారణకు కృషి చేస్తానన్నారు. ముత్యాల నాయుడిని స్థానిక శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా బదిలీపై వెళ్లారు. -
అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అమలాపురం రూరల్: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్లైన్లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతులు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్లైన్ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్లైన్లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు. -
శ్యాంబాబు మృతి మాదిగలకు తీరని లోటు
కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
ఆ ఇంట్లో ‘పెద్ద’ కష్టం
ఫ సైకిల్పై నుంచి పడిపోవడంతో ప్రమాదం ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద ఫ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొత్తపేట: ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంటి పెద్ద ప్రమాదానికి గురై మంచాన పడటంతో అతని 15 ఏళ్ల కుమారుడిపైనే భారం పడింది. ఒకపక్క తండ్రికి వైద్యం, మరోపక్క కుటుంబాన్ని నెట్టుకురావడం ఈ బాలుడికి ఇబ్బందిగా మారింది. ఇలా నలుగురు సభ్యుల ఆ కుటుంబం తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన షేక్ అహ్మద్ యాకూబ్ ఆలీషా (48)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాపీమేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తూ ఆలీషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. గతేడాది నవంబరులో ఒకరోజు రాత్రి కూలిపని ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ హెడ్లైట్లు కాంతి కంట్లోకి కొట్టి కళ్లు కనిపించక సైకిల్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో రాళ్లపై పడిపోయాడు. మెడ కింద వెన్నెపూస నరాలు నలిగిపోయి కాళ్లు చచ్చుబడిపోయాయి. మొదట్లో రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులు వైద్యం చేశారు. రోగం ముదిరిందే తప్ప తగ్గలేదు. తర్వాత అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు, కొన్ని రోజులు వైద్యం చేసి ఆపరేషన్ పడుతుందని, రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్కు రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలింది బాధితులే భరించాలన్నారు. అప్పటికే అప్పులు చేసి, బంధువులు, తెలిసిన వారు చేసిన సాయంతో సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశారు. కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా అనారోగ్యం ముదిరి పక్షవాతం వచ్చింది. ఇక ఆర్థిక స్తోమత లేక కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తాం కానీ పూర్తిగా కోలుకుంటాడని చెప్పలేమని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు అంటున్నారు. దాంతో వద్దని చెప్పడంతో కొన్ని రోజులు వైద్యం చేసి డిచ్చార్జ్ చేశారు. నడవలేక మంచానికే పరిమితమైన ఆలీషాను నెలా, రెండు నెలలకోసారి ఫిజియోథెరపీకి కాకినాడ తీసుకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారి అంబులెన్స్కు రూ.10 వేలు, అక్కడ సిబ్బందికి రెండు, మూడొందలు ఇవ్వాల్సి వస్తుందని అతని భార్య బీబీజా వాపోయారు. భర్త మంచాన పడి, ఆదాయం లేకపోవడంతో పదో తరగతి పాసైన కుమారుడిపైనే వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ పడిందన్నారు. చదువుకు స్వస్తి చెప్పి కూలి పనికి వెళ్తున్నాడని, అయ్యే ఖర్చులకు తన కొడుకు సంపాదన సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బీబీజా ఆవేదనతో చెప్పారు. మంచాన పడిన వారికి ఇచ్చే పింఛను కోసం సదరం క్యాంపునకు వెళితే, 83 శాతం అంగవైకల్యం అని సర్టిఫికెట్లో పేర్కొన్నారు. కానీ టెంపరరీ అని రాశారని, దీనివల్ల పింఛను రాదన్నారని బీబీజా వాపోయారు. దీనావస్థలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించాలని స్థానిక పీఎంపీ షేక్ హైదర్, మెడికల్ రిప్రజంటేటివ్ షేక్ మక్బుల్ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మరొకరికి గాయాలు పిఠాపురం: దైవ దర్శనానికి కాలి నడకన వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన తొగర సూర్యలక్ష్మి, అడపా చంద్రకళ (35)లు శనివారం తెల్లవారుజామున గొల్లప్రో లు నుంచి పెద్దాపురం మండలం చిన తిరుపతి బయలుదేరారు. నడుచుకుంటూ వెళుతుండగా పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిద్దరినీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన అడపా చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యలక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సూర్యలక్ష్మిని హైవే అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త త్రిమూర్తులు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు రాజేష్ ఇటీవలే పదో తరగతి పాసై ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. అంతా తానై కుటుంబాన్ని చూసుకునే చంద్రకళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబం వీధిన పడిందని స్థానికులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. నీకు నాలాగ పేదరికం ఉండకూడదని, తనను తల్లి చదివిస్తుందంటూ కుమారుడు రాజేష్ గుండెలవిసేలా విలపించాడు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అనాథరక్షకా.. ఆపద్బాంధవా..
ఫ గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి ఫ ఒక్కరోజే రూ.48.50 లక్షల ఆదాయం కొత్తపేట: అనాథరక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తులు ఆ స్వామిని కొలిచారు. గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. శనివారం వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. భారీ క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.48,50,199 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయం వద్ద రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము బందోబస్తు పర్యవేక్షించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడిచాయి. -
అనుమానాస్పద స్థితిలో జంట ఆత్మహత్య?
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ రైలుకు అడ్డుగా ఆ జంట నిలబడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే కాకినాడలోని ఓ ఆఫీస్లో అకౌంటెంట్గా సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు, ఆ మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని రైల్వే మేనేజర్ రమేష్ వివరించారు. ఆ జంటకు వేర్వేరుగా వివాహాలు కాగా, ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు రాత్రి వరకూ ఎటువంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అంబాజీపేట: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబాజీపేట మండలం ముక్కామల, వక్కలంక వంతెనకు మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు, సమీప బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నిజామ్పేటకు చెందిన దొమ్మేటి శ్రావణ్కుమార్, అతని భార్య రేఖాలక్ష్మి (38), వీరి కుమార్తెలు లాస్య, మోహనగన ప్రియతో పాటు రేఖాలక్ష్మి అమ్మమ్మ కె.ధనలక్ష్మితో కలసి కారులో శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం అమలాపురం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కామల వచ్చేసరికి అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్ను వీరి కారు బలంగా ఢీకొంది. దాంతో కారులో ఉన్న రేఖాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. శ్రావణ్కుమార్, లాస్య, మోహనగన ప్రియ, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అమలాపురంలో ఓ ఆస్పత్రికి తరలించారు. రేఖాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్కుమార్ నిజామ్పేటలో స్థిరపడి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనిది యానం కాగా, మృతురాలి తల్లిదండ్రులది అమలాపురం.పళ్లాలమ్మ జాతరకు వచ్చి...వారం రోజుల కిందట నిజామ్పేట నుంచి వానపల్లి పళ్లాలమ్మ అమ్మవారి జాతర చూసేందుకు వచ్చి అమలాపురంలో మృతురాలి తల్లి ఇంటి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులంతా కలసి వెళ్లారు. అనంతరం యానం వెళ్దామనుకుని అమలాపురం వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు చెప్పారు. వారం రోజుల పాటు బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి ఇంతలో ప్రమాదం జరగడంతో అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేసవి సెలవులకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుందని అనుకోలేదని బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.వివాహిత మృతి, నలుగురికి తీవ్ర గాయాలు