breaking news
Kamareddy
-
వడ్లను ఆరబెట్టే మిషన్ ప్రారంభం
రామారెడ్డి: అన్నారంలో వడ్ల కొనుగోలు కేంద్రం –వడ్లు ఆరబెట్టే మిషన్ను మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడ ఇస్తోందని చెప్పారు. సొసైటీ సీఈవో చంద్రారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు మద్దికుంట దయానంద్, గడ్డం గంగారెడ్డి, సల్మాన్, కీసరి లక్ష్మణ్, శ్రీకాంత్, దేవదాసు, చంద్రం, మండ్ల బాలనర్సు, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు. వంద శాతం అక్షరాస్యత సాధించాలి భిక్కనూరు: వచ్చే ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం వరకు వంద శాతం అక్ష్యరాస్యత సాధించాలని జిల్లా ఏపీవో వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన భిక్కనూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన వయోజన విద్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 55 మహిళ గ్రామ సంఘాల నుంచి గ్రామ సంఘానికి ఇద్దరూ సభ్యులను ఒక్క వీవోఏలతో రెండు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రతి ఒక్కరూ వందశాతం అక్షరాస్యత కోసం పాటుపడాలని ఆయన కోరారు. ఎంపీడీవో రాజ్కిరణ్ రెడ్డి, ఎంఈవో రాజ్గంగారెడ్డి, సీఆర్పీలు సంగీత, దుర్గ, ఏపీఎం సాయిలు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో బీఎఫ్టీ భార్గవ్ మృతి పట్ల ఉపాధిహామీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో బీఎఫ్టీగా పనిచేస్తున్న భార్గవ్ అధికారుల వేధింపులకు గుండెపోటుతో మరణించిన విషయం రాష్ట్ర మంతా తెలిసిందన్నారు. ఆయన మృతిచెందడం బాధాకరమన్నారు. ఈసంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన శౌర్యగౌడ్ మంగళవారం రాత్రి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి రోధించాడు. ఆ దారి గుండి వెళ్తున్న ఆటోడ్రైవర్ రాములు బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించాడు. కొద్దిసేపటికి వాట్సాప్లో తమ కుమారుడు పోలీస్స్టేషన్లో ఉన్నట్లు గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పీఎస్కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పిట్లం:పిట్లం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో తప్పిపోయిన ఓ చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీకి చెందిన బేతయ్య దంపతులు కుమార్తె వరలక్ష్మి తో కలిసి బుధవారం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. చి న్నారిని వారు అక్కడే మరిచిపోయి ఇంటికి చేరుకున్నారు. దీంతో చిన్నారి అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తమ చిన్నారి పోలీస్స్టేషన్లో ఉన్నట్లుగుర్తించిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులను సంప్రదించారు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
చెరుకు సాగుకు ప్రోత్సాహం
సదాశివనగర్ : చెరుకు సాగును ప్రోత్సహించేందుకోసం జిల్లాలోని చెరుకు కర్మాగారాలు చర్యలు తీసుకుంటున్నాయి. విత్తనాన్ని ఉచితంగా అందించడంతోపాటు రాయితీపై అగ్రి డ్రోన్ను అందించనున్నట్లు ప్రకటించింది. జిల్లాలో చెరుకు సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతంలో బెల్లం వండిన సమయంలో సుమారు 30 వేల ఎకరాలలో ఈ పంట సాగయ్యేది. ఏడాది పంట కావడంతోపాటు నల్లబెల్లం తయారీపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు క్రమంగా చెరుకు సాగుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో 10 వేల ఎకరాల వరకు పంట సాగవుతోంది. గాయత్రి షుగర్స్కు అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఒకటి, నిజాంసాగర్ మండంలోని మాగిలో మరొక చెరుకు ఫ్యాక్టరీ ఉన్నాయి. ఫ్యాక్టరీ మనుగడ కోసం యాజమాన్యం జిల్లాలో చెరుకు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతులకు ఉచితంగా విత్తనం ఇస్తామంటూ ప్రచారం చేస్తోంది. ఎకరానికి రూ. 9,437 విలువ గల 2.50 టన్నుల చెరుకు విత్తనాన్ని ఉచితంగా అందించనున్నట్లు చెబుతోంది. విత్తనానికి తోడు ఈ సీజన్లో రూ. 7.50 లక్షల విలువ చేసే గాయత్రి ఏఈఆర్వో ఏజీ–10 రకం అగ్రి డ్రోన్ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని లక్ష రూపాయల రాయితీపై చెరుకు రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. డ్రోన్తో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు, పురుగుల మందులను పిచికారి చేయవచ్చు. వాతావరణ అనుకూలతను బట్టి రోజుకు 20 నుంచి 30 ఎకరాలలో మందులు పిచికారి చేయవచ్చని ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. తద్వారా కూలీల కొరతను అధిగమించ వచ్చంటున్నారు. చెరుకు రైతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. రైతులకు ఉచితంగా విత్తనాన్ని పంపిణీ చేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు, గడ్డి మందు స్ప్రే చేసేందుకోసం లక్ష రూపాయల రాయితీపై అగ్రి డ్రోన్ను అందిస్తున్నాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ డ్రోన్ల ద్వారా రైతులు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. – వేణుగోపాల్ రావు, గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్, అడ్లూర్ ఎల్లారెడ్డిఎరువులు పిచికారి చేస్తున్న డ్రోన్ రాయితీపై అగ్రి డ్రోన్ పంపిణీకి ముందుకొచ్చిన యాజమాన్యం విత్తనం ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం రైతుకు ఎకరాకు రూ. 10 వేల మేర చేకూరనున్న ప్రయోజనం -
నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం
కామారెడ్డి రూరల్: ఇస్రోజీవాడిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చెట్కూరి మల్లయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకున్న దంపతులకు ఆయన నూతన వస్త్రాలను అందజేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్రావు, మండల ఉపాధ్యక్షుడు కుమార్గౌడ్, చింతల రవితేజగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శంకర్గౌడ్, గంగయ్య, జగదీశ్వర్, చెట్కూరి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్నుంచి నీటి విడుదల
నిజాంసాగర్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరిగి వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం 9,570 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.802 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 9,570 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. కౌలాస్లోకి.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బుధవారం జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి 2,742 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల (1.237టీఎంసీలు) నిండుకుండలా ఉండడంతో రెండు వరద గేట్లను ఎత్తి 2,742 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నామన్నారు. -
ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించాలి
● ప్రతి సొసైటీ పరిధిలో వంద ఎకరాల సాగు లక్ష్యం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్: ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ, హెచ్యూఎల్ సంస్థల ఆధ్వర్యంలో వ్యవసాయ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ ప్రాథమిక సంఘానికి 100 ఎకరాలలో ఆయిల్పాం సాగు లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఆయిల్పాం సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందన్నారు. అలాగే ఈ రంగంలో ప్రభుత్వం, సహకార సంఘాలు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆయిల్పాం ఆర్థిక ప్రాధాన్యత, సాగు పద్ధతులు, నీటి వినియోగం, వాతావరణ అనుకూలత, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, మార్కెట్ అవకాశాలపై సంబంధిత అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రామ్మోహన్, పీఏసీఎస్ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. -
ఉజ్వల కనెక్షన్కు దరఖాస్తు చేసుకోండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో అర్హులైనవారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో జిల్లా ఉజ్వల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకి కొత్తగా 284 (ఇండేన్ –169, భారత్ –33, హెచ్పీ–82) ఉజ్వల కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హత గలవారు జిల్లాలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు తుది గడువు లేదన్నారు. రేషన్ కార్డ్ ఉండి, గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కనెక్షన్ పొందిన వారికి గ్యాస్ సిలిండర్, మొదటి రీఫిల్, గ్యాస్ స్టౌ, సురక్ష పైపు, రెగ్యులేటర్, ఇన్స్టాలేషన్ పూర్తిగా ఉచితంగా అందుతాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీసీఎస్వో వెంకటేశ్వర్రావు, జిల్లా బీపీసీఎల్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో చిన్నారి మృతి బాన్సువాడ రూరల్: పాముకాటుతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలం కాలునాయక్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన చౌహాన్ శ్రీకాంత్ కుమార్తె సరస్వతి(3) మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది. బుధవారం ఉదయం 6 గంటలకు చిన్నారి నోటి నుండి నురుగులు రావడాన్ని గుర్తించిన కుటుంబీకులు పాముకాటు వేసినట్లు గుర్తించారు. వెంటనే వారు బాన్సువాడకు తరలించగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. చేపల వేటకు వెళ్లి ఒకరు..నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లి ఒకరు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన కర్రె హన్మాండ్లు(30) ఈ నెల 27న రాత్రి స్థానిక చెరువులో చేపల వేట కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హన్మాండ్లు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటి మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో మరొకరు..రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందినట్లు కోటగిరి ఏఎస్సై బన్సీలాల్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎత్తొండ గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాస్(47) మంగళవారం రాత్రి మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్తుండగా తన ఇంటికి ఉన్న ఇనుప మెట్లను తాకిన సమయంలో విద్యుత్షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందినట్లు నిర్ధారించారు. బాత్రూమ్కు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి ఇనుప మెట్లపై పడడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు గుర్తించారు. మృతుడి భార్య లలిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె..బాన్సువాడ: బీర్కూర్ శివారులో బుధవారం విద్యుత్ షాక్తో గేదె మృతి చెందింది. బీర్కూర్ కామేశ్వర్రావుకు చెందిన గేదెలను మేత కోసం శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మేత కోసం వెళ్లిన గేదెకు విద్యుత్ షాక్ తగలడంతో గేదె అక్కడికక్కడే చనిపోయింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతోనే గేదెకు విద్యుత్ షాక్ తగిలి చనిపోయిందని, అధికారులు స్పందించి అందించాలని రైతు కామేశ్వర్రావు కోరారు. నవీపేట: కుటుంబ కలహాలతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం లింగాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు(36)కు ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన కవితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కవిత పుట్టింటికి వెళ్లింది. దీంతో జీవితంపై విరక్తితో సాయిలు ఈనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం సాయిలు మృతదేహం గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. మృతుడి తల్లి గంధం గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వెలగని వీధి దీపాలు
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధి 9వ వార్డు పరిధిలోని కల్కినగర్ అంధకారంలో మగ్గుతోంది. లింగాపూర్ గ్రామ పరిధిలోని కల్కినగర్ మున్సిపల్లో కలిశాక అభివృద్ధికి దూరమవుతుందనే మాటలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. కామారెడ్డి మున్సిపల్లో విలీనమైన తర్వాత కల్కినగర్ కాలనీ కష్టాలు మరింత పెరిగాయి. కాలనీలో ఆరు నెలలుగా వీధి లైట్లు రాకపోయినా పట్టించుకున్న నాథుడే లేరని కాలనీవాసులు పేర్కొంటున్నారు. కాలనీలో వీధి దీపాలు వెలగక దాదాపు మూడు నెలలు గడుస్తున్నా మున్సిపల్ సిబ్బంది అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. వార్డులో వీధి దీపాల సమస్య ఉందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, మున్సిపల్లో వీధిలైట్లు లేవని చెబుతున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. రోడ్ల పక్కన చెత్తాచెదారం, డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండటంతో రోడ్లపైకి రాత్రి సమయంలో పాములు వస్తున్నాయని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు దృష్టి సారించి వీధి దీపాల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కల్కినగర్లో అంధకారం... నిత్యం అవస్థలు పడుతున్న ప్రజలు మున్సిపల్లో వీధి దీపాలు లేవని సమాధానం ఇస్తున్న సిబ్బంది పలుమార్లు విన్నవించినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు -
మేమేమి పాపం చేశాం..?
లింగంపేట(ఎల్లారెడ్డి): తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. పాలకులు, అధికారుల కళ్ల ముందు కనిపిస్తున్నా కనికరించకపోవడం విశేషం. కూలీ నాలీ చేసుకుంటూ, నాలుగు ఇళ్లలో అడుక్కుంటూ జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో... వారికి ఉండడానికి ఇల్లు ఉండదు.. కట్టుకోవడానికి బట్టలు సరిగా ఉండవు. వృద్ధాప్యం వస్తున్నా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయదు. కనీసం రేషన్ కార్డు అయినా ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్న బతుకులు ఎన్నో. అనర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు వస్తున్నాయి, కాని అర్హులమైనా మేము ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండకూ, వానకూ, చలికి వణుకుతూ ప్రతీ రోజు నరకయాతన అనుభవిస్తూ రోడ్డు పక్కన, సగం నిర్మాణం చేసి వదిలేసిన భవన నిర్మాణాల స్లాబుల కింద జీవనం కొనసాగిస్తూ అభాగ్యులు చాలా మంది ఉన్నారు. పాలకులకు ఎన్నికలు రాగానే పేదలు గుర్తుకు వస్తారు. అధికారులకు తమ పనులు చేసుకోవడానికే సమయం సరిపోదు. పేదవారి ఆకలి ఎలా తెలుస్తుంది. కనీసం పేదవారికి రేషన్ కార్డు అయినా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. కటికె లింగోజి దీనగాథ.. లింగంపేట మండల కేంద్రంలో రెండు కుటుంబాలు గ్రంథాలయం పక్కన ఉన్న అంగన్వాడీ భవనం కోసం స్లాబు వేసి వదిలి పెట్టిన దాని కింద ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు. మండల కేంద్రానికి చెందిన కటికె లింగోజి దీనగాథ ఇలా ఉంది. లింగోజి భార్య మంగూబాయి 20 సంవత్సరాల క్రితం ముగ్గురు కూతుర్లకు జన్మనిచ్చింది. ముగ్గురు పిల్లలు పుట్టినా ఆరు నెలల వ్యవధిలోనే మృతి చెందారు. తర్వాత కామెర్ల వ్యాధితో ఆమె మృతి చెందింది. అప్పటి నుంచి లింగోజి ఒంటరి వాడయ్యాడు. ప్రస్తుతం లింగోజికి 60 ఏళ్లు పైబడ్డాయి. రెండేళ్లుగా పింఛను కోసం అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. 20 ఏళ్లుగా దీన స్థితిలో బతుకుతున్నాడు. కూలి పనులు చేసుకుందామన్నా చేతకావడం లేదు. వాళ్ల, వీళ్ల చేతికింద పనులు చేసుకుంటూ వాళ్లు ఇచ్చిన డబ్బులతో బియ్యం కొనుక్కొని వంట చేసుకొని తింటున్నాడు. అధికారులు స్పందించి కనీసం రేషన్ కార్డు, పింఛను మంజూరు చేయాలని కోరుతున్నాడు. ఉండడానికి ఇల్లు లేక నాలుగేళ్లుగా కిరాయి ఇళ్లలో జీవించాం. కిరాయికి డబ్బులు ఎల్లక అంగన్వాడీ స్లాబు కింద నివాసం ఉంటున్నాం. వానకు తడిసి, ఎండకు ఎండి, చలికి వణుకుతూ చాలా కష్టంగా బతుకుతున్నాం. అధికారులు తమపై కనికరించి నా కూతురు, భర్తకు పింఛన్లు మంజూరు చేయాలి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకుంటాము. – తుపాకుల కమల, లింగంపేట ఒక్క పూట కడుపు నిండా తినలేకపోతున్నాను. బియ్యం లేక ఒక్కోసారి అడుక్కొని తినాల్సి వస్తోంది. రేషన్ కార్డు లేదు. 65 సంవత్సరాల వయస్సు వచ్చింది. పని చేసుకోలేకపోతున్నాను. పింఛను రావడంలేదు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. రేషన్ కార్డు, పింఛను మంజూరు కాలేదు. అధికారులు, పాలకులు స్పందించి మంజూరు చేయండి. – కటికె లింగోజి, లింగంపేట అర్హత ఉన్నా అందని పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు అంగన్వాడీ స్లాబుల కిందే నిరుపేదల జీవనం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువు -
గంగమ్మ ౖపైపెకి!
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 9లో uకామారెడ్డి రూరల్: రేషన్ బియ్యం పంపిణీ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తారు. 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేట్ 150వ జయంతి సందర్భంగా ఈనెల 31వ తేదీన జిల్లా కేంద్రంలో ఐక్యత ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి జన్మభూమి రోడ్డులోని వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఐక్యత యాత్ర నిర్వహిస్తామన్నారు. యువకులు, జాతీయవాదులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి రూరల్: అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్రావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన ఉగ్రవాయిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు జరపకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలన్నారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ శ్రీకాంత్, డీటీ కిష్టయ్య తదితరులున్నారు.జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆగస్టు చివరలో కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనంతా వరద తాకిడితో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అన్ని చెరువులు, కుంటలు నిండాయి. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 885.5 మి.మీ. కాగా.. 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే సాధారణంకన్నా 58.4 శాతం అదనంగా వర్షం కురిసింది. సుమారు రెండు నెలలుగా వానలు పడుతుండడంతో వాగులు, వంకలు ప్రవహిస్తూనే ఉన్నాయి. మంజీర జీవనదిగా మారింది. దీంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. గతంలో నీటి ఊటలు లేక ఎత్తిపోయిన బోర్లన్నీ ప్రస్తుతం ఎత్తిపోస్తున్నాయి. 12.90 మీటర్ల లోతునుంచి.. జిల్లాలో జూలై 26 నాటికి సగటు భూగర్భ జలమ ట్టం 12.90 మీటర్ల లోతులో ఉంది. ఇది ఆగస్టు 26 నాటికి 8.87 మీటర్లకు చేరింది. ఆగస్టు చివరి వారంలో దంచికొట్టిన వర్షాలతో భూగర్భ జలమట్టం మరింత ఎగబాకింది. సెప్టెంబర్ చివరలో 5.93 మీటర్లకు వచ్చింది. అక్టోబర్ 26 నాటికి 5.42 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయని భూగర్భజల శాఖ నివేదికలు పేర్కొంటున్నారు. కాగా గతేడాది ఇదే సమయంలో జిల్లాలో భూగర్భ జలమట్టం 8.62 మీటర్లుగా ఉంది. అంటే గతేడాది కన్నా ఈ ఏడాది 3.19 మీటర్లు ఎక్కువగా పెరిగిందని స్పష్టమవుతోంది. వాగులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిండా నీరుండడంతో ఇప్పటికిప్పుడు భూగర్భ జలమట్టం పడిపోయే పరిస్థితి కూడా లేదు. ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతుండడంతో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. లింగంపేటలో చేతికందే లోతులో... లింగంపేట మండల కేంద్రంలో భూగర్భ జలమట్టం చేతికందే స్థాయిలోనే ఉంది. ఇక్కడ 0.18 మీటర్ల లోతులోనే నీరుందని భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా తాడ్వాయి మండలంలోని కన్కల్లో భూగర్భ జలాలు పెద్దగా పెరగలేదు. ఇక్కడ 19.88 మీటర్ల లోతులో నీరుంది. జిల్లాలో ఇదే అత్యధిక లోతు అని అధికారులు వివరించారు. రెండేళ్లదాకా ఢోకా లేనట్టే! జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. వాగులతో పాటు మంజీర నది నెలల తరబడిగా పారుతూనే ఉన్నాయి. నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు ఇప్పటికీ పొంగుతూనే ఉన్నాయి. జలాశయాలన్నీ జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈసారి జిల్లాలో కరువు ప్రాంతాలుగా పేర్కొ నే ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. దో మకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి, తదితర మండలాల్లో ఆగస్టు మూడో వారం వరకు అరకొర వర్షాలే కురిశాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. భూగర్భ జలాలు పెరిగి ఎత్తిపోయిన బోర్లన్నీ పోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో రెండేళ్ల దాకా ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు.మండలం నీటిమట్టం (మీటర్లలో) మహ్మద్నగర్ 1.88 నస్రుల్లాబాద్ 2.2 పాల్వంచ 2.4 జుక్కల్ 2.05 మద్నూర్ 2.49 బాన్సువాడ 2.99 బీర్కూర్ 3.13 మాచారెడ్డి 3.65 లింగంపేట 3.82 సదాశివనగర్ 4 రామారెడ్డి 4.37 బిచ్కుంద 4.82 నిజాంసాగర్ 5.63 భిక్కనూరు 6.2 ఎల్లారెడ్డి 6.41 నాగిరెడ్డిపేట 6.68 పిట్లం 6.76 పెద్దకొడప్గల్ 7.03 రాజంపేట 7.1 గాంధారి 7.99 దోమకొండ 8.95 తాడ్వాయి 9.36 డోంగ్లీ 9.8 కామారెడ్డి 9.92 సంవత్సరం సాధారణం నమోదైనది వ్యత్యాసం (మి.మీ.లలో) (మి.మీ.లలో) (శాతం) 2020–21 964.1 1,218 26.41 2021–22 1,029.0 1,280.8 24.43 2022–23 1,029.0 1,462.8 42.15 2023–24 1,029.0 1,114.6 8.31 2024–25 995.1 1,208.4 21.4 2025–26 (ఇప్పటివరకు) 885.5 1,402.7 58.4జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పాతాళ గంగమ్మ పైకి పొంగుకొచ్చింది. భారీగా భూగర్భ జలాలు పెరిగాయి. లింగంపేట మండల కేంద్రంలో 0.18 మీటర్ల లోతులోనే నీరుండడం గమనార్హం. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో యాసంగితోపాటు వచ్చే ఏడాది పంటలకూ ఢోకా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి జిల్లాలో రెండు నెలలుగా భారీ వర్షాలు సాధారణం కన్నా 58.4 శాతం అధిక వర్షపాతం నమోదు భారీగా పెరిగిన భూగర్భ జలమట్టం 5.42 మీటర్ల లోతులోనే నీరు.. -
ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి
● ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి రూరల్: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా 195 యూనిట్ల రక్తం సేకరించి రెడ్క్రాస్ సొసైటీకి అందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీఐలు, ఎస్సైలు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, విద్యార్థులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టేకు దుంగలు స్వాధీనం
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామ శివారులోని పట్టా భూమి నుంచి టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తుండగా మంగళవారం రాత్రిపెట్రోలింగ్ స మయంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను, వాటిని తరలిస్తున్న వాహనాన్ని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు.పట్టా భూమిలోని చెట్ల ను నరికే ముందు అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా అటవీ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తుకారం రాథోడ్, సెక్షన్ ఆఫీసర్లు అతిఖ్, భాస్కర్, బీట్ ఆఫీసర్లు ఉదయ్, ఖాదీర్, ప్రవీణ్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని నాగాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. నాగాపూర్ నుంచి కమ్మర్పల్లికి ప్రయాణికులతో వస్తున్న ఆటో ను మెట్పల్లి వైపునకు వెళ్తున్న తుఫాన్ వాహనం ఢీకొన్నది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న డ్రైవర్ ఖాదర్కు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్తానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రెంజల్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి బోధన్ కోర్టు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శేష తల్పసాయి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని పీఎస్కు తరలించి కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు న్యూసెన్స్ కేసులో మరో ఇద్దరికి జడ్జి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానాను సైతం విధించినట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట: మండలంలోని కోమట్పల్లిలో పేకాటస్థావరంపై దాడిచేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ బుధవారం తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన నలుగురు పట్టుబడగా వీరి నుంచి రూ. 5,530 నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. -
పేదలు నివసించే కాలనీలపై చిన్నచూపు
● వారం రోజులుగా వెలగని వీధిదీపాలు బాన్సువాడ రూరల్: పేరుగొప్ప– ఊరుదిబ్బ అన్నట్లు మారింది బాన్సువాడ మున్సిపాలిటీ అధికారుల పనితీరు. రూ.కోట్లలో అభివృద్ధి నిధులు, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ట్యాక్సులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు పేదలు నివసించే కాలనీల పట్ల సవతి తల్లి ప్రేమ చూిపిస్తున్నారు. శివారు కాలనీలు, వందశాతం పేదలు నివసించే పీఎస్ఆర్ డబుల్బెడ్రూం కాలనీల్లో సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదు. వారం రోజులుగా బాన్సువాడ డబుల్బెడ్రూం కాలనీకి వెళ్లే రహదారిపై వీధి దీపాలు వెలగడం లేదు. ఉదయం పొట్టకూటి కోసం వివిధ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చే బాటసారులు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడుతుండటంతో పాటు రహదారికి ఇరువైపులా పంట పొలాలు, నిజాంసాగర్ ఉపకాలువ ఉండటంతో పాములు, తేళ్లు, ఇతర విషకీటకాలు రోడ్డుపైకి వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. పట్టణంలో పెద్దలు నివసించే కాలనీపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధలో సగమైనా పేదలు నివసించే కాలనీపై తీసుకోవాలని, వెంటనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలని పీఎస్ఆర్ డబుల్బెడ్రూం కాలనీవాసులు కోరుతున్నారు. -
పసుపు పంటలో తెగుళ్లతో జాగ్రత్త..
● ప్రధానంగా రెండు రకాల శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి ● నివారణ చర్యలు చేపట్టాలంటున్న వ్యవసాయశాఖ అధికారులుబాల్కొండ: పసుపు పంటలో ఆకు తెగుళ్లతో జాగ్రత్త అంటూ బాల్కొండ ఉద్యావన శాఖ అధికారి రుద్ర వినాయక్ రైతులను హెచ్చరిస్తున్నారు. ఈమేరకు తెగుళ్ల లక్షణాలు– నివారణ చర్యలను ఒక ప్రకటనలో వివరించారు. పసుపు పంటలో ప్రధానంగా సోకే ఆకు తెగుళ్లు రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి తాటకు మచ్చ తెగుళ్లు (మర్రాకు తెగుళ్లు), రెండవది ఆకు మాడు తెగుళ్లు పసుపు పంటను ఆశిస్తాయి. తాటాకు మచ్చ తెగులు( మర్రాకు తెగులు): తాటాకు మచ్చ తెగులు కొల్లెటోట్రై కమ్ క్యాప్సిసి అనే శిలీంద్రం ద్వారా పంటకు సోకుతుంది. వర్షాకాలంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఆకుల మీద సోకుతుంది. ప్రధానంగా అక్టోబర్ చివరిలో ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు: ఈ శిలీంధ్రం సోకినప్పడు ఆకులపై పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఏర్పడి (4–15 సెంటీమీటర్లు) సైజులో ముదురు గోదుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఈ మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకు మాడిపోతుంది. నివారణ: లీటరు నీటికి 1 మిల్లీ లీటర్ల ప్రొపికోనజోల్ లేదా గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. లేదా 1 మిల్లీ లీటరు అజోక్సిస్ట్రోబిన్ లీటరు నీటికి కలుపుకుని పిచికారి చేసుకోవాలి. ఆకు మాడు తెగులు: ఆకు మాడు తెగులు టాప్రిన్మాక్యులాన్స్ అనే శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రం ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు: ఈ తెగుళ్ల వలన ఆకులపై ముందుగా చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు క్రమంగా అండాకారంగాను చతురస్రాకారంగాను ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పాడుతాయి. ఈ మచ్చలు క్రమేపి ఆకులంతా వ్యాపించి, ఆకు మాడిపోతుంది. నివారణ: లీటరు నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికొనజోల్ లేదా 1 గ్రాము థయోఫినెట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్, 1.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 1 మిల్లీలీటరు అజోక్సిస్ట్రోబిన్ కలిపి ఎకరానికి 200 లీటర్ల నీటిని పిచికారి చేయాలి.మర్రాకు తెగులు సోకిన పసుపు ఆకు మాడు తెగులు సోకిన పసుపు -
6నుంచి పీజీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల 7, 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నవంబర్ 6 నుంచి 17వరకు కొనసాగుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. కామారెడ్డి రూరల్: అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, సెర్ప్ టీం సభ్యులతో కలసి మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిశారు. పూలమొక్కను అందజేశారు. మండల సమాఖ్యలు, గ్రామ సంస్థల బలోపేతం కోసం సెర్ప్–టీజీ–ఐబీ యూనిట్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక 2025–26 సంసిద్ధతలో భాగంగా ఈ నెల 29 నుంచి స్టేట్ టీమ్ జిల్లాలో పర్యటన సందర్భంగా కలెక్టర్ను కలిసి కార్యక్రమం వివరాలను వివరించినట్లు వారు తెలిపారు. -
కానిస్టేబుల్కు ఎస్పీ అభినందనలు
కామారెడ్డి రూరల్: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1గా ఎంపికై న నేనావత్ కస్తూరిని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. కస్తూరి ఎక్లారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి వరకు విధ్యనభ్యసించి, అనంతరం వరంగల్లో ఇంటర్, కోటీ ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. 2024లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఎంపికై నిజాంసాగర్ పీఎస్లో విధులు చేపట్టారు. విధుల్లో నిబద్ధతతో పాటు నిరంతర అభ్యాసాన్ని కొనసాగిస్తూ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2025లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1( ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్)లో ఉద్యోగాన్ని సాధించడం విశేషం. కస్తూరిని ఎస్పీ అభినందించి మెమెంటోతో సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ..భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని ఆకాంక్షించారు. -
గోల్డెన్ అవర్లో చికిత్స.. ప్రాణాలను కాపాడే క్షణం
● బ్రెయిన్స్ట్రోక్ వచ్చిన వెంటనే రోగికి వైద్యం అందించడం ఎంతోముఖ్యం ● నేడు వరల్డ్ బ్రెయిన్స్ట్రోక్ డేనిజామాబాద్నాగారం: బ్రెయిన్ స్ట్రోక్ రోగికి వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రాణాలను కాపాడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నేడు ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా ‘బ్రెయిన్ స్ట్రోక్– గోల్డెన్ అవర్ చికిత్సపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 సెకన్లకూ ఒక వ్యక్తి స్ట్రోక్కు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటలు ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఈ సమయంలో రోగికి సరైన చికిత్స అందితే మెదడు నష్టాన్ని గణనీయంగా తగ్గించి, రోగి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగిన ప్రతి నిమిషం వేల మెదడు కణాల నష్టానికి దారితీస్తుంది. లక్షణాలు: ● రోగి ముఖం వంగిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే స్ట్రోక్గా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● స్ట్రోక్ను గుర్తించడానికి ‘బీఈ ఫస్ట్’ పద్ధతి: ● బీ–అకస్మాత్తుగా సంతులనం కోల్పోవడం ● ఇ–కన్నుల చూపు తగ్గిపోవడం ● ఎఫ్– ముఖం ఒక వైపుకు వంగిపోవడం ● ఎ – చేయి బలహీనపడటం ● ఎస్– మాట తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం ● టీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంరక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యాంత్రీకరణ జీవనంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. – శ్రీకృష్ణాధిత్య, మెడికవర్ ఆస్పత్రి న్యూరో సర్జన్ -
తల్లి గృహిణి.. తండ్రి రోజు కూలీ
● కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం నిజాంసాగర్(జుక్కల్): రోజూ కూలీ పని చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన దంతుల శివకృష్ణ కష్టపడి చదివి తొలి ప్రయ్నతంలో గ్రూప్–1 ఉద్యోగం సాధించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంతుల విజయలక్ష్మి, శంకర్ దంపతుల కుమారుడు శివకృష్ణ. శంకర్ సౌదీ దేశంలో కూలీ పని చేస్తుండగా విజయలక్ష్మి గృహణిగా ఉంది. అయితే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసిన శివకృష్ణ హైద్రాబాద్లో ఉస్మానియా యునివర్సిటిలో పీజీ చేసి, గ్రూప్–1 కోర్సు చదివాడు. గ్రూప్ పరీక్ష ఫలితాల్లో 458.5 మార్కులతో స్టేట్ 428 ర్యాంకు సాధించి నిజాంసాగర్ ఎంపీడీవోగా వచ్చారు. తొలి ప్రయ్నతంలోనే గ్రూప్–1 ఉద్యోగం సాధించడం పట్ల శివకృష్ణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ ఎంపీడీవోగా దంతుల శివకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● నిర్మాణ పనులను వేగవంతం చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సదాశివనగర్ : అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఎంపీడీవోతో మాట్లాడి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారి వద్దకు వెళ్లి కారణం తెలుసుకోవాలని సూచించారు. నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చూడాలని ఆదేశించారు. స్థోమత లేక ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఐకేపీ ద్వారా రూ. 4 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అలాంటి వారు ఉంటే వెంటనే గ్రామ సంఘాలను సంప్రదించి రుణ సదుపాయం పొందాలని సూచించారు. అనంతరం తిర్మన్పల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ నిర్మాణాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సతీశ్ యాదవ్, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఏపీవోలు శ్రీనివాస్, ప్రసాద్, ఎంపీవో సురేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్, విండో చైర్మన్ గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్రెడ్డి, నాయకులు రాజన్న, బీరయ్య, జగ్గ బాల్రాజ్, కుమ్మరి రాజయ్య, రాజేందర్, సీసీ ఆంజనేయులు, సీఏలు మమత, పద్మావతి తదతరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ
వర్ని (మోస్రా): మండలంలోని గోవూరు శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. నాలుగు ట్రాన్స్ఫార్మర్ల నుంచి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ను దొంగలించారు. చోరీకి గురైనం కాయిల్స్ విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుందని లైన్ ఇన్స్పెక్టర్ స్వామి వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు. రెంజల్(బోధన్): ఎల్జీ(లక్కీ జనరల్) యాప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు పిట్ల మధు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇటీవల ‘ఎల్జీ’ మోసాలు, బాధితులపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) పోలీసులు ఆరా తీశారు. బాధితుల వివరాలను సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే స్థాని క న్యాయవాది స్పందించి, బాధితులతో మాట్లాడి ఇటీవల స్థానిక ఠా ణా లో ఫిర్యాదు చేయించారు. ఈమేరకు ఎస్బీ పోలీసులు అందించిన వివరాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నిజాంసాగర్(జుక్కల్): బైండోవర్ ఉల్లంఘన చట్టం కింద నిందితుడికి మంగళవారం నిజాంసాగర్ తహసీల్దార్ బిక్షపతి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని మాగి గ్రామ శివారులోని బేడీల మైసమ్మ దాబాలో ఎటువంటి అనుమతుల లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తుండటంతో ఫిబ్రవరిలో పోలీసులు దాడులు చేశారు. దాబా నిర్వాహకుడు చింతకింది శేఖర్ను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ ఈనెల 10న సదరు దాబాలో మద్యం సిట్టింగ్ నడుపుతుండటంతో ఎస్సై దాడులు చేసి, శేఖర్పై కేసు నమోదు చేశారు. కేసును తహసీల్దార్ భిక్షపతి దృష్టికి తీసుకువెళ్లగా బైండోవర్ ఉల్లంఘన కింద నిందితుడికి రూ. 5వేల జరిమానా విధించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మోపాల్: మండలంలోని తాడెం (తానాకుర్దు) గ్రామంలో కల్లులో కలిపేందుకు తీసుకెళ్తున్న 580 గ్రాముల అల్ప్రాజోలంను పట్టుకున్నట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. తాడెం గ్రామంలో కల్లులో కలిపేందుకు మత్తుపదార్థాలు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో మంగళవారం ప్రవీణ్ గౌడ్, సాగర్ గౌడ్ అల్ప్రాజోలం తీసుకుని తాడెం వైపు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 580 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి రూరల్: పాస్పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూర్ ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న వెంకట్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఇన్చార్జి డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై నర్సయ్య గతంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసినప్పుడు ఒక పాస్పోర్టు దరఖాస్తుపై విచారణ చేపట్టాల్సిన బాధ్యతలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెంకట్రెడ్డి కూడా డీఎస్బీలో పని చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల పాస్పోర్టు దరఖాస్తు విచారణలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. ఈ విషయం ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి రావడంతో విచారణ జరిపిన ఎస్పీ తన నివేదికను ఇన్చార్జి డీఐజీకీ పంపించారు. ఆయన నిర్లక్ష్యాన్ని సీరియస్గా పరిగణించి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
రైతులు నష్టపోకుండా చూడాలి
రామారెడ్డి: వర్షాలు కురుస్తున్నందున రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నందున కొనుగోలు కేంద్రాలలో వడ్లు తడవకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపిన వడ్లను వెంటనే అన్లోడ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్వో మదన్మోహన్, డీసీఎం రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగం చేసిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ధాన్యంలో నిలిచిన నీటిని తొలగించడానికి రైతులు నానా పాట్లు పడ్డారు. నాగిరెడ్డిపేట: మండలంలో ఉదయం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైతులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆరబెట్టారు. సాయంత్రం తిరిగి వాన రావడంతో మళ్లీ వడ్లు తడిశాయి. రోజూ వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల మొలకలు వస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లింగంపేట: మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. మండల కేంద్రంతో పాటు మోతె, ముస్తాపూర్, లింగంపల్లి, అయిలాపూర్, ఒంటర్పల్లి, శెట్పల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, ఆరబెట్టిన వడ్లు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం నిల్వల మధ్య నుంచి వర్షం నీటిని తొలగించడానికి రైతులు ఆవస్థలు పడ్డారు. కామారెడ్డి రూరల్: జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఇల్చిపూర్ కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రోజు వర్షం వస్తుండడంతో వరిధాన్యం తడిసి పోతోందని రైతులు పేర్కొంటున్నారు. వరిధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. రామారెడ్డి: మండలంలో మంగళవారం ఒక్కసారి గా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాలలో అరబోసిన ధాన్యం తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేవని, త్వరగా కాంటా కా వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త ప్పనిసరి పరిస్థితులలో వ్యాపారులకు అమ్మాల్సి వ స్తోందంటున్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకాల ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్సువాడ రూరల్: మండలంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. తాడ్కోల్, బుడిమి, తిర్మలాపూర్, కొత్తాబాది, బోర్లం తదితర గ్రామాల్లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సదాశివనగర్ : మండల కేంద్రంతో పాటు, అడ్లూరు ఎల్లారెడ్డి, ధర్మారావుపేట్, కుప్రియల్, పద్మాజీవాడి, ఉత్తనూర్, వజ్జాపల్లి, బొంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మక్కలు సైతం తడిసిపోయాయి. ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
సొంత భవనంలోకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సొంత భవనంలోకి మారింది. కొన్ని సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలపాలన్నీ బడాకసాబ్ గల్లీలోనే జరిగాయి. ఆ తర్వాత కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోఎస్ కాలనీలో గల అద్దె భవనంలోకి కార్యాలయం మారింది. భారీ స్థాయిలో ఆదాయం ఉన్నప్పటికీ కార్యాలయానికి సొంత భవనం లేకుండా పోయింది. ఎన్జీవోఎస్ కాలనీలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆ తర్వాత పాతరాజంపేట గ్రామ పంచాయతీ భవనంలోకి మారింది. ఈ కార్యాలయం పట్టణానికి చాలా దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు అడ్లూర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్మించిన నూతన భవనంలోకి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మారింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ ఈ భవనంలోనే జరిగాయి. -
రైతుల్లో ‘మోంథా’ గుబులు!
● తుపాను ప్రభావంతో వర్షాలు ● తడుస్తున్న ధాన్యం ● ఆందోళనలో అన్నదాతలు నాగిరెడ్డిపేట : మోంథా తుపాను జిల్లాలోని రైతులకు గుబులు పుట్టిస్తోంది. తుపాను ప్రభావంతో పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి అడపాదడపా వర్షం కురుస్తోంది. దీంతో వడ్లు తడుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం పంటకోతలు చేపట్టడంతో భారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది. రైతులు వడ్లను ఆరబోశారు. తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాలు, రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టారు. అయితే ఆకాశంలో మబ్బులు పట్టిన ప్రతిసారీ ఆరబోసిన ధాన్యాన్ని కుప్పగా చేయడం, మబ్బులు తొలగిపోగానే తిరిగి ఆరబెట్టడంతోనే రోజంతా గడిచిపోయింది. ధాన్యం తడిసి మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం పంటకోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చా. అప్పటి నుండి ధాన్యాన్ని ఆరబెడుతూనే ఉన్నాను. ఇప్పటికే మూడుసార్లు వాన పడి వడ్లు తడిశాయి. వాన పడుతుండడంతో మళ్లీమళ్లీ తడుస్తున్నాయి. త్వరగా తూకాలు పూర్తయ్యేలా చూడాలి. – లక్ష్మీకాంతారెడ్డి, రైతు, నాగిరెడ్డిపేట వారం క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చాం. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాం. వర్షం కురిసిన ప్రతిసారి ధాన్యం తడవకుండా ఉండేందుకు కుప్పగాచేసి టాపర్లు కప్పడం, వర్షం తగ్గాక కుప్పలను తెరిచి మళ్లీ ఆరబెట్టడం.. రోజూ ఇదే జరుగుతోంది. – కుమ్మరి గంగమణి, మహిళా రైతు, నాగిరెడ్డిపేట -
‘రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి’
బాన్సువాడ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, చించొల్లి గ్రామాల్లో పర్యటించి, వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. డీసీవోతో ఫోన్ ద్వారా మాట్లాడి తూకం చేసిన వడ్లను తరలించేందుకు లారీల కోసం ఎదురు చూడవద్దని, ట్రాక్టర్లలో రైస్మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తూకం చేసిన బస్తాలు, ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. ‘ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా చూస్తాం’ మద్నూర్: ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా చూస్తామని జుక్కల్ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, అదనపు కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను వివరించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించుకోవాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక పునస్సమీక్షపై దిశానిర్దేశం చేశారు. సమావేశాలలో తహసీల్దార్లు ముజీబ్, అనిల్, వేణుగోపాల్ గౌడ్, లత, భిక్షపతి, మారుతి, రాజా నరేందర్గౌడ్, నాయబ్ తహసీల్దార్లు శరత్, హేమలత, శివ రామకృష్ణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సాయిలు, సంతోష్, రోహిదాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి నస్రుల్లాబాద్ : మండలవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వెంకటేశ్ సూచించారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వస్తున్నాయన్నారు. ఆయన వెంట ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి సరిత, గ్రామస్తులు ఉన్నారు. మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించాలి బిచ్కుంద(జుక్కల్): మున్నూరుకాపులు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. మంగళవారం బిచ్కుంద మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల క్రితం సంఘం ప్రతినిధులు సంఘం అభివృద్ధికి నిధులు కావాలని తనను కోరడంతో రూ. 10 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. భజన మండలి కమ్యూనిటీ హాల్ కోసం నిధులు కావాలని కోరడంతో ఎంపీ రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
చట్టాలు ప్రజలకు నేస్తాలు
నిజామాబాద్ లీగల్: శాసన వ్యవస్థలు చేసే చట్టాలు, ప్రజలకు నేస్తాలుగా నిలుస్తాయని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. నగరంలోని ‘వర్డ్‘ (వుమెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారికి ప్రజా సమస్యలు తెలుస్తాయని, వాటిలో ఎక్కువ శాతం చట్టం పరిధిలో పరిష్కరించే అవకాశలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, వర్డ్ సిబ్బంది రాణి, కిరణ్మయి, విజయ్,ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ నిజామాబాద్ లీగల్: నగరంలోని జిల్లా న్యాయసేవ సంస్థ కార్యాలయంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చెకుముకి సైన్స్ సంబురాలు–2025’ వాల్పోస్టర్లను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వేదిక కార్యదర్శి పులి జైపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల్లోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నవంబర్ 7న పాఠశాల స్థాయిలో, నవంబర్ 21న మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక ప్రతినిధులు ఖాజా ఉమర్ అలీ, బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, కరిగె పండరి, న్యాయవాదులు అశోక్, ప్రదీప్, కిరణ్,మల్లాని శివకుమార్ పాల్గొన్నారు. -
నాణ్యతతో మిషన్ భగీరథ సంపును నిర్మించాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): నాణ్యతతో మిషన్ భగీరథ సంపును నిర్మించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ సంపు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నిధుల కింద రూ.33 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీంతో స్థానికులకు మంచినీరు అందుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ఏఈ రాచప్ప, తహసీల్దార్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు మోహన్, నాగిరెడ్డి, మల్లప్ప పటేల్ పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే బలమైన సమాజ నిర్మాణం పౌష్టికాహారంతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు 40 టాయిలెట్స్ మంజూరయ్యాయని త్వరలోనే వాటి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. -
ఆర్మూర్లో పోలీసుల తనిఖీలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో మంగళవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్యాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటల్స్లలో, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్ధాల, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిఫర్ కుక్కల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పవన్నారు. నవీపేట: మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఒకరికి జిల్లాకోర్టు వారంరోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట శివారులో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మానవత్ కృష్ణ అనే రౌడీషీటర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో న్యూసెన్స్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదుచేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి అతడికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి శివారులో పండ్ల లోడ్తో వెళుతున్న మినీ ట్రక్కు బోల్తాపడింది. వివరాలు ఇలా.. ఉన్నాయి.. నారింజ పండ్ల లోడుతో మినీ ట్రక్కు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సోమవా రం అర్ధరాత్రి ట్రక్కు మండలంలోని నడిపల్లి శివారులోని పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ముందు టైరు పేలి ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయాన్నే సంబంధిత వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన ట్రక్కు నుంచి పండ్లను మరో వాహనంలోకి మార్చారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన ట్రక్కును తరలించారు. ఈవిషయమై డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ను సంప్రదించగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలి
అదనపు కలెక్టర్ విక్టర్మద్నూర్(జుక్కల్): పక్క రాష్ట్రాల నుంచి వరి ధాన్యం రాకుండా చెక్పోస్ట్ సిబ్బంది తనిఖీలు చేపట్టాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. మండలంలోని సలాబత్పూర్ వద్ద సరిహద్దులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి సన్న రకం వడ్లు రాకుండా రాష్ట్ర సరిహద్దులో చెక్పోస్ట్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. మిల్లులో తీసుకుంటున్న జాగ్రత్తలపై విచారించారు. తహసీల్దార్ ముజీబ్, సివిల్ సప్లై నాయబ్ తహసీల్దార్ ఖలీద్, తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి ఎల్లారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం గండిమాసానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, సొసైటీ కార్యదర్శి విశ్వనాథం తదితరులున్నారు. -
‘ఉద్యోగులందరికి ఆరోగ్య బీమా అమలు చేయాలి’
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి సమగ్ర నగదు రహిత ఆరోగ్య బీమా పథకం అమలయ్యేవిధంగా చూడాలని, ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి వెంటనే బెనిఫిట్లు అందజేయాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం టీఎన్జీవోస్ కేంద్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో నిర్వహించగా జిల్లా అధ్యక్షుడితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్క నాగరాజు, కేంద్ర సంఘం సభ్యుడు కాసం శివకుమార్లు హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా పక్షాన మాట్లాడిన వెంకట్రెడ్డి వివిధ సమస్యలను కేంద్ర సంఘానికి నివేదించారు. పురపాలక సంఘాల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు గురించి ప్రస్తావించారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కామారెడ్డి హెడ్క్వార్టర్ యూనిట్ తొలి సమావేశం మంగళవారం యూనిట్ అధ్యక్షుడు చేపూరి అర్జున్రావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నిట్టు విఠల్రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వి.విశ్వనాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గంగాగౌడ్లు హాజరయ్యారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎన్నికై న యూనిట్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ప్రతినిధులు మల్లేశం, యూనిట్ ప్రధాన కార్యదర్శి మహమూద్, ఆర్థిక కార్యదర్శి మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.రాములు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): అధికారులు వేధింపులు ఆపాలని సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ అన్నారు. ఆయన తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని చాలా మండలాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులను అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వెంటనే వేధింపులను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో బీఎఫ్టీగా పనిచేస్తున్న భార్గవ్ అనే వ్యక్తి మండల అధికారుల వేధింపుల వల్ల గుండెపోటుతో మరణించాడన్నారు. ఇప్పటికై నా వేధింపులను ఆపాలని కోరారు. -
గ్రూప్–1 విజేతలకు అభినందనలు
కామారెడ్డి క్రైం: ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో ఎంపికై న జిల్లాకు చెందిన అభ్యర్థులు సోమవారం కలెక్టరేట్కు విచ్చేసి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని కలెక్టర్ అభినందిందిచి జ్ఞాపికలను అందజేశారు. గ్రూప్–1 సాధించిన వారిలో పెద్దకొడప్గల్కు చెందిన అభినవ్, ఎల్లారెడ్డికి చెందిన ఎండీ.తాహెరా బేగం, బీర్కూర్కు చెందిన శ్రీనిధి, నిజాంసాగర్కు చెందిన శివకృష్ణ ఉన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): నేషనల్ రోడ్డు అఽథారిటీ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సాఽరథి కళాకారులు సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రోడ్డు ప్రమాదాలు, భద్రత, డ్రగ్స్పై ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్, రోడ్డు అథారిటీ అధికారి రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నాం
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్నగర్లో ఉన్న త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ షోరూంలో నాణ్యమైన ఫర్నిచర్ను విక్రయిస్తున్నట్లు సంస్థ స్థాపకులు కొండ వీరశేఖర్ గుప్తా తెలిపారు. సోమవారం షోరూంలో 50 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. షోరూంలో ప్రత్యేక పూజలు చేశారు. 1975లో దేవీరోడ్డులో స్థాపించామని, 2009లో వినాయక్నగర్లో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు తక్కువ ధరల్లోనే ఫర్నిచర్ను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొండ శ్రవణ్, పవన్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: యువత సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం సభ్యులు తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని వశిష్ట జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఆన్లైన్, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. అమ్మాయిలు వేధింపులకు గురైతే షీటీంలను సంప్రదించాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు, షీ టీం సభ్యులు సౌజన్య, భూమయ్య, కళాశాల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాథమికోన్నత పాఠశాలలో షీ టీం కానిస్టేబుళ్లు శ్రీశైలం, సుప్రజ సోమవారం పలురకాల సైబర్నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం టోల్ఫ్రీ నంబర్ 87126 86094, సైబర్ క్రైం టోల్ఫ్రీ నంబర్ 1930, అత్యవసరాల సమయంలో వినియోగించే 100నంబర్ గురించి విద్యార్థులకు వారు తెలియజేశారు. పాఠశాల హెచ్ఎం ఉదయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
బోధన్టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వెంకట నా రాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మున్సిపల్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రాజం నాగమణి(37) స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తోంది. బోధన్ నుంచి బాన్సువాడ వైపునకు వెళ్తున్న సంగారెడ్డి జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆమెను ఢీకొన్నది. ఈ ఘటనలో ఆమె కాళ్లు నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికులు, తోటి కార్మికులు ఆమెను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు నిజామాబాద్కు తరలించాలని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి ..నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఓ హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సోమవారం పడిఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయస్సు 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతుడి వివరాలు తెలిపిన వారు 8712659 714 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. రైల్వేస్టేషన్ ప్రాంతంలో మరొకరు.. నిజామాబాద్ అర్బన్:నగరంలోని రైల్వేస్టేషన్ కమాన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. మృతుడి వివరాలు తెలిపిన వారు 8712659714 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. రుద్రూర్: రెండు నెలల క్రితం అదృశ్యమైన వృద్ధుడు మంజీరా నదిలో మృతదేహమై కనిపించాడు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలం కారేగాం గ్రామానికి చెందిన పందిరి బుడ్డ చిన్నబోయి(64) అనే వృద్ధుడు కనిపించడం లేదని అతని కుమార్తె ఆగస్టు 31న కోటగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం సుంకిని శివారులోని మంజీరా నదిలో మృతదేహం ఉన్నట్లుగా సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. మృతదేహం చిన్నబోయిగా గుర్తించారు. కాలకృత్యాల కోసం మంజీరా నది వైపు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉంటాడని మృతుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దళిత సంఘాల ఆందోళన
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటలో ఓ దళిత మహిళపై స్థానిక రైస్ మిల్లులో పనిచేసే కూలీ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితురాలికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు రైస్ మిల్ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్లను పనుల్లో పెట్టుకోవద్దని రైస్ మిల్లర్కు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి రూరల్ సీఐ రామన్ పోలీస్ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను సముదాయించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మాచారెడ్డి: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1న నిర్వహించనున్న చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు బట్ట రమేష్ కోరారు. సోమవారం చుక్కాపూర్లో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు జడ్జి గవాయ్పై దాడి చేసిన అడ్వకేట్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులు హరీష్, విజయ్, రాజశేఖర్, నాగరాజు, శేఖర్, బాల్ రాజు, విగ్నేష్, మహేష్ ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాడ్వాయి సింగిల్ విండో ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాని సింగిల్ విండో ప్రత్యేక అధికారి లక్ష్మణ్ అన్నారు. తాడ్వాయి సింగిల్విండో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చైర్మన్గా ఉన్న కపిల్రెడ్డి పదవీకాలం ముగిసిందని, ప్రస్తుతం ఆయన పదవీలో లేరన్నారు. ఆయన దీనిపై కోర్టుకు వెళ్లాడని అది పెండింగ్లో ఉందన్నారు. చైర్మన్, ఇద్దరు డైరెక్టర్లు సొసైటీ కొంత డబ్బును వాడుకున్నారు. కపిల్ అధ్యక్షుడిగా సాగాలని డీసీవో ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదన్నారు. అధికారుల ఆదేశాల మేరకే తాడ్వాయి మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రాంభించామన్నారు. అధికారి విఠల్, సీఈవో నర్సిములు, సిబ్బంది ఉన్నారు. -
దావత్లు షురూ..!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ విషయం అందరికి తెలిసిందే. అధికార పార్టీ నాయకుల్లో అత్యూత్సాహం మాత్రం మరింతా పెరిగిపోయింది. ఎన్నికల ఎప్పుడు వచ్చినా రిజర్వేషన్ మాత్రం మాకే కలిసి వస్తుందని, మీ సపోర్ట్ మాకే కావాలని ఇప్పటి నుంచే దావత్లు షురూ చేశారు. సదాశివనగర్ మండల కేంద్రంలో గతంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్కు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం బీసీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వు అయినట్లు ప్రకటించడం వల్ల ఉత్సాహం మరింత పెరిగి పోయింది. బీసీ మహిళకు గానీ, బీసీ జనరల్కు గానీ, జనరల్ కు గానీ రిజర్వేషన్ను కేటాయిస్తే మీ సపోర్టు మాత్రం మాకే ఉండాలంటూ ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడు భారీ ఎత్తున దావత్లు షురూ చేశారు. ఇన్ని రోజులు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండల కేంద్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారి పోయాయి. సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ నాయకుడినని ఒకరు, స్వచ్ఛందంగా ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మరొక్కరు, పెద్దమ్మ టెంపుల్ వద్ద భారీ ఎత్తున షెడ్ నిర్మాణం కోసం అయ్యే ఖర్చును నేనే భరిస్తాను..మన ఓట్లన్ని నాకే పడేలా చూడాలని మరొక్కరు..ఇలా తమ తమ వర్గాలకు సంబంధించిన మద్ధతు పూర్తిగా మాకే కావాలని ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. కుల సంఘాల పెద్ద మనుషులతో చర్చలు జరుపుతూ తమ సభ్యుల ఓట్లు పూర్తి స్థాయిలో తమకే పడేలా చూడాలని వేడుకోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల కమిషన్ ఇంకా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ను ప్రకటించక ముందే మండల కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే, గ్రామాల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు. సదాశివనగర్ మండలకేంద్రంలో ఓ పార్టీ నాయకుల అత్యుత్సాహం రిజర్వేషన్ మాకే కలిసి వస్తుంది.. పూర్తి సపోర్ట్ మాకే కావాలి అంటూ కుల సంఘాలకు ఎర -
‘గాలికుంటు’ టీకాలు వేయించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని మండల పశువైద్యాధికారి రమేశ్ అన్నారు. నందివాడలో సోమవారం పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆవులు, గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. జీవాలకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఏ సీజన్కు సంబంధించి ఆ సీజన్ మందులను వే యించాలని సూచించారు. ఈ సందర్భంగా 98 ఆ వులు, 203 గేదెలకు టీకాలు వేశారు. వైద్య సిబ్బంది పోచయ్య, కొండల్రెడ్డి, ప్రేమ్సింగ్, గోపాల మిత్రలు మహిపాల్రెడ్డి, బ్రహ్మం పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 106 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 106 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు దుకాణంలో చోరీ
నవీపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా ఉన్న వైష్ణవి బంగారు దుకాణంలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సష్టించారు. నల్లని దుస్తులు, మాస్కులు ధరించిన ముగ్గురు దుండగులు పల్సర్ బైక్పై వచ్చి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణానికి ఇరువైపులా ఉన్న నివాస గృహాలకు గొలుసులు వేశారు. దుకాణం ముందు భాగంలోని ఇనుప గేటుకు వేసిన తాళాలను ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేశారు. ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి లోపల ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదే ప్రాంతంలో అద్దెకు ఉన్న బిహారి కూలీలు దొంగతనం జరుగుతున్నట్లు గుర్తించి వారిపై రాళ్లు విసిరారు. ఈ చోరీలో రూ.10 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను దుండగులు చోరీకి పాల్పడినట్లు దుకాణ యజమాని పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైమ్ సెల్ ఏసీపీ నాగేంద్ర చారి, సీఐ సాయినాథ్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి ఘటన స్థలాన్ని, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన
● కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ హైదరాబాద్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ , పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నాయకులు నిజామాబాద్రూరల్: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వారు అన్నారు. సోమవారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల సీజ్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎలాంటి అనుమతులు లేకుండా లింగంపేట మండలం నుంచి నాగిరెడ్డిపేట మండలానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆదివారంరాత్రి పట్టుకొని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్ సోమవారం తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్లకు చెందిన రెండు ట్రాక్టర్లలో, శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒక ట్రాక్టర్తోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని పల్లెబోగుడతండాకు చెందిన ఒక ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా నాగిరెడ్డిపేట మండలంలోని జప్తిజాన్కంపల్లికి తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన చెప్పారు. ట్రాక్టర్లను సీజ్చేసి నాగిరెడ్డిపేట పీఎస్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముగ్గురిపై కేసునమోదు కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారిని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపేస్తామని బెదిరించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల నుంచి ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న కానిస్టేబుళ్లు గంగారాం, సందీప్ను ఆదివారం రాత్రి పర్మళ్లకు చెందిన రమావత్ లింబ్యాతోపాటు అతని సోదరులు పరమేశ్, రమేశ్పై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వాధికారుల విధులకు ఆటంకం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. రాజంపేట: మండలంలోని అన్నారం తండాలో వీధి కుక్కల దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తండాకు చెందిన మాలోత్ దీప్లా, సంగీత, వినోద్, ధర్మిల పై కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
నిబంధనల్లో మార్పులు
బిచ్కుంద: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి వెళ్లాలని పొలీస్ అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహదారులకు పొలీసులు చలాన్(జరిమానా)విధిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉదయం, సాయంత్రం పొలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఒక్క ఫోటో క్లిక్తో భారీ జరిమానా పడుతుంది. ఎన్ని జరిమానాలు ఉన్నా వాహనదారులు చెల్లించకుండా అలాగే వాహనంపై తిరుగుతున్నారు. చలాన్లు ఉండి తిరగడానికి ఇప్పటి నుంచి వీలు లేదని కేంద్ర రవాణా శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వెంటనే అమలు చేయాలని పొలీస్ అధికారులను ఆదేశించారు. కొత్త నిబఽంధనల ప్రకారం 5 చలాన్లకు మించి ఉండరాదు. 45 రోజుల వ్యవధిలో చలాన్లు చెల్లించాలి. లేకుంటే డ్రైవింగ్ లైసెన్సు రద్దుతో పాటు వాహనం జప్తు చేసే అధికారం పోలీస్ అధికారులకు ఉంది. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చలాన్లు చెల్లించని వారిపై ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. వాహనాలు జప్తు చేయడం, లైసెన్సు రద్దుకు అవకాశ కల్పించడం వంటి కొత్త రూల్స్ ప్రభుత్వం రూపొందించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హెల్మెట్ లేకున్నా పొలీసులు వాహనాల తనిఖీల్లో రన్నింగ్లో ఉన్న వాహనాల వెనక నుంచి ఫోటోలు తీసి వాహనదారులకు తెలియకుండా చలాన్లు వేస్తున్నారు. ఎక్కడ తప్పు చేయకున్నా జరిమానా విధించడం ఎంతవరకు సమంజసమని వాహనదారులు ఇప్పటికే గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో వాహనదారులను వేధించడం తప్ప ఏమీ లేదని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర రవాణ శాఖ వెనక్కి తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తున్న పొలీసులు... అన్ని రకాల చిన్న పెద్ద వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పొలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్, లైసెన్సు, ఇన్సూరెన్స్, ట్యాక్స్, పర్మిట్ ఇతర పత్రాలు అన్నీ ఉండాలి లేకుంటే జరిమానా విధిస్తున్నారు. ఆన్లైన్లో వాహనం నెంబరు పరిశీలించి చలాన్ ఉంటే చెల్లించాలని సూచిస్తున్నారు. చెల్లించే వరకు వాహనాన్ని పంపించడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి చలానా విధిస్తున్నారు. కొందరు ద్విచక్ర వాహనదారులు నెంబరు ప్లేట్ లేకుండానే తిరుగుతున్నారు. మరి కొందరు తప్పుడు నెంబర్ ప్లేట్, ఇతర వాహనాల నెంబర్లను బిగించుకుంటున్నారు. పోలీసుల చలాన్లు అసలైన వాహనదారులకు మెసేజ్ వెళ్తుండడంతో వారు కంగుతింటున్నారు. దొంగ నెంబర్ ప్లేట్ల ఆటకట్టించేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలపై ఉన్న చలాన్లు వెంటనే కట్టుకోవాలి. రవాణా శాఖ కొత్త రూల్స్ ప్రకారం చలాన్లు ఉంచుకోవద్దు. లైసెన్సు రద్దు, పొలీసులు వాహనం స్వాదీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి చలాన్లు పడకుండా చూసుకోవాలి. మైనర్లు వాహనాలు నడపొద్దు. తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. – మోహన్రెడ్డి, ఎస్సై, బిచ్కుంద చలాన్లు ఐదు కంటే ఎక్కువ పెండింగ్లో ఉంటే లైసెన్సు రద్దు కొత్త నిబంధనలతో వాహనదారుల్లో ఆందోళన 45 రోజుల్లో చెల్లించకుంటే వాహనం జప్తు -
వచ్చేనెలలో వన్యప్రాణుల గణన
● ఆరు రోజులపాటు నిర్వహిస్తాం ● కామారెడ్డి ఎఫ్డీవో రామకృష్ణనాగిరెడ్డిపేట : ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే వన్యప్రాణుల గణన జిల్లాలో నవంబర్ నెలాఖరులో ప్రారంభమవుతుందని కామారెడ్డి ఫారెస్ట్ డివిజన్ అధికారి రామకృష్ణ తెలిపారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని లొంకలపల్లి శివారులో చిరుత పులి సంచరిస్తున్న విషయం తెలుసుకున్న ఆయన సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. చిరుత పులి పాదముద్రలతోపాటు చిరుతను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరాలను పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం మాల్తుమ్మెద శివారులోని ఫారెస్ట్ నర్సరీని సందర్శించి నర్సరీలోని మొక్కల వివరాలను తెలుసుకున్నారు. నాగిరెడ్డిపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి చేరుకుని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆరురోజులపాటు వన్యప్రాణుల గణన ప్రక్రియ చేపడతామన్నారు. ప్రత్యక్షంగా చూడడంతోపాటు వన్యప్రాణులు వదిలిన విసర్జితాలు, సెన్సార్ కెమెరాల ఆధారంగా గణన ప్రక్రియ సాగుతుందన్నారు. గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత 2026 రిపోర్ట్ తయారు చేస్తామన్నారు. గతేడాది డివిజన్ పరిధిలో 50 వేల మొక్కలను నాటామని, వచ్చే ఏడాది లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రెండేళ్లలో జిల్లాలో ఎక్కడా అటవీ భూమి ఆక్రమణకు గురికాలేదన్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు అనేక అక్రమ దారులున్నాయని, వాటిలో దాదాపు 50 శాతం దారులను మూసేశామని, రానున్న రోజుల్లో అన్నింటిని మూసేస్తామని తెలిపారు. ఆయనవెంట నాగిరెడ్డిపేట డీఎఫ్ఆర్వో రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్ తదితరులున్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
● మీ మార్పు కుటుంబానికి, సమాజానికి ఎంతో గర్వకారణం ● రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రానిజామాబాద్అర్బన్: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, వారిలోని మార్పు కుటుంబానికి, సమాజానికి ఎంతో గర్వకారణమని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యమిశ్రా అన్నారు. జిల్లా జైల్లో సోమవారం తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్, ఫ్యూయల్ ఔట్లెట్ కార్యక్రమాలను ఆమె ప్రారంభించింది. ఈసందర్భంగా డీజీ మాట్లాడుతూ.. ఖైదీలకు ఉపాధి కల్పించడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆర్థిక స్వావలంబన పెంపు లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఖైదీలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వృత్తిని కొనసాగించవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి సహాయం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. జైళ్ల శాఖ ఐజీ ఎన్ మురళి బాబు మాట్లాడుతూ.. జిల్లా జైలు పరిధిలో మూడు కార్యక్రమాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్యూయల్ అవు ట్ లెట్, తేనెటీగల పెంపకం, నివృత్తి డీ–అడిక్షన్ సెంటర్ ఇవన్నీ ఖైదీల పునరవాసానికి మైలురాళ్లుగా నిలుస్తాయన్నారు. జైళ్ల శాఖ డీఐజీ సంపత్ మాట్లాడుతూ.. చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల పెంపకం యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయని, మై నేషన్ బ్రాండ్ కింద తయారవుతున్న తేనెకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. సీపీ సాయిచైతన్య, సైకాలజిస్ట్ శ్రావ్య, ప్రకృతి ఎన్జీవో కల్పన, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, శ్రావణ్ కుమార్, వెంకట కార్తీక్, జైల్ సూపరింటెండెంట్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
లక్కున్నోళ్లు!
● లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ● కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియకామారెడ్డి రూరల్: జిల్లాలో 2025–27 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల కేటాయింపు కోసం సోమవారం లక్కీడ్రా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. ఉదయం 11 గంటలకు లక్కీడ్రా ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా 11.30 గంటలకు ప్రారంభమైంది. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అప్పటికే కల్యాణ మండపానికి చేరుకుని నిరీక్షించారు. దరఖాస్తుదారులను మాత్రమే హాల్ లోనికి అనుమతించారు. కలెక్టర్ 49 దుకాణాలకు లక్కీ డ్రా తీశారు. దుకాణాలు దక్కినవారు సంబురాలు చేసుకోగా.. రానివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, తహసీల్దార్ జనార్దన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లక్కీ డ్రాలో చాలామందికి నిరాశ మిగలగా.. కొందరికి జాక్పాట్ తగిటింది. ఓ మహిళ పేరుతో రెండు దుకాణాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మియాపూర్ ప్రాంతంలోని ఓల్డ్ హఫీజ్పేటకు చెందిన సుద్దపల్లి భారతికి ఎల్లారెడ్డి షాప్–2తోపాటు మద్నూర్ షాప్–1 దక్కాయి. అలాగే బీర్కూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన నర్సాగౌడ్, మొగులాగౌడ్లకు ఇద్దరిని మద్యం దుకాణాలు వరించాయి. నిజాంసాగర్ దుకాణాన్ని నర్సాగౌడ్, నస్రుల్లాబాద్ దుకాణాన్ని మొగులాగౌడ్ దక్కించుకున్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● వర్షాలతో రైతులు నష్టపోకుండా చూడాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిచిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వరి కోతలు జరపకుండా రైతులకు అవగాహన క ల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు పంపించడంతోపాటు వెంటనే అన్లోడింగ్ జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగ విరమణ చేసిన రోజే ప్రయోజనాలు ఇవ్వాలి’
కామారెడ్డి అర్బన్: ఉద్యోగ విరమణ చేసిన రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చూడాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్ హన్మంత్రెడ్డి, విజయరామరాజు, లచ్చయ్య మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసినవారికి రెండేళ్ల నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించడం లేదని, దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ఆత్మహత్యలకు కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకరయ్య, రవీందర్, రాజలింగం, సత్తయ్య, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి టౌన్: రగ్బీ అండర్ –17 బాలబాలికల జిల్లా జట్లను వచ్చేనెల 3వ తేదీన ఎంపిక చేయనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 3న ఉదయం 10 గంటలకు క్రీడాకారులు రిపోర్టు చేయాలని సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నవంబర్ 7, 8, 9 తేదీలలో డోర్నకల్, మహబూబాబాద్ జిల్లాలలో జరుగుతాయని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్: జూడో అండర్–17 బాల, బాలికల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్లను ఈనెల 30న ఎంపిక చేయనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కార్యదర్శులు నాగమణి, హీరాలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు ఒరిజినల్ ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో రావాలని, ఇతర వివరాలకు 78939 73128 నంబర్లో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి టౌన్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఉన్నత విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు ఈ బంద్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మణికంఠ, రాహుల్, నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిలోకి నీటి విడుదల బాల్కొండ: ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి పోమవారం ఉదయం మళ్లీ వరద పెరగడంతో ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఎగువ ప్రాంతాల నుంచి 22,154 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి 4 వరద గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మికాలువ ద్వారా 200, ఆవిరి రూపంలో 573, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. -
ఉపాధి కూలీలకు అందని డబ్బులు
● ఐదు నెలలుగా కూలి కోసం ఎదురుచూపులు ● జిల్లాలో 4.74 లక్షల మంది కూలీలుఎల్లారెడ్డిరూరల్: మండు వేసవిలో కష్టపడి ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు కూలి డబ్బులు అందకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేసిన పనులకు సంబంధించి కూలి డబ్బులు వెంటనే అందించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో 24 మండలాల పరిధిలో 536 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల 50 వేల జాబ్ కార్డులు ఉండగా.. 4 లక్షల 74 వేల మంది కూలీలు ఉన్నారు. వీరిలో 2 లక్షల 55 వేల 667 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఉపాధి కూలీలలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. మే నుంచి సెప్టెంబర్ వరకు ఉపాధి పనులకు సంబంధించిన డబ్బులు సైతం కూలీలకు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఽధికారులు స్పందించి వెంటనే చేసిన పనులకు కూలి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
అప్పు.. ముప్పు!
తాకట్టు రుణాలు కొంపకు ఎసరుపెడుతున్నాయి. అవసరానికి కార్పొరేట్ రుణ సంస్థల వద్ద అప్పులు తీసుకున్న సామాన్యులు.. సకాలంలో వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. అప్పిచ్చినవారు నోటీసులు ఇస్తూ, ఆస్తులను జప్తు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● కొంపకు ఎసరుపెడుతున్న తాకట్టు రుణాలు ● సులువుగా రుణాలిచ్చి.. వసూళ్లలో జబర్దస్తీకి దిగుతున్న సంస్థలు ● విలవిల్లాడుతున్న సామాన్యులు మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025– 8లో uజిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లో కార్పొరేట్ సంస్థలు హౌజింగ్ రుణాలు ఇస్తామంటూ కార్యాలయాలు తెరిచాయి. సిబ్బందికి టార్గెట్లు ఇచ్చి మరీ వారిని ఊళ్ల మీదకు పంపిస్తున్నాయి. అప్పులు పుట్టక అవస్థల్లో ఉన్న వారు కార్పొరేట్ సంస్థల వలలో పడుతున్నారు. ఇప్పుడు అవసరం తీరితే సరిపోతుందని చాలా మంది ఇళ్లను తనఖా పెట్టేసి రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత నెలనెలా వాయిదాలు చెల్లించడం భారంగా మారుతోంది. మొదట్లో సర్దుబాటు చేసి కట్టినవారు నాలుగైదు నెలలు గడిచేసరికి డబ్బులు సర్దుబాటు కాక వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. వ్యవసాయం, కూలినాలి చేసుకుని బతికేవారికి నెలనెలా డబ్బులు సర్దుబాటు చేయడం సాధ్యం కావడం లేదు.అవసరానికి అప్పులు పుట్టకపోవడంతో చాలామంది ఆస్తులను తనఖా పెట్టి (మార్టిగేజ్ చేసి) తీసుకుంటున్న రుణాలు ఉరితాళ్లు పేనుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న కార్పొరేట్ రుణ సంస్థలు సులువుగా రుణాలిస్తున్నాయి. దీంతో అవసరం ఉందని చాలా మంది తమ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. మొదట్లో ఏదో రకంగా వాయిదాలు చెల్లిస్తున్నా.. తరువాత సర్దుబాటు కాకపోవడంతో వాయిదాలు తప్పుతున్నారు. దీంతో అప్పులిచ్చిన సంస్థలు వసూళ్ల కోసం జబర్దస్తీకి దిగుతున్నాయి. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసుకుంటామంటూ నోటీసులు ఇవ్వడం, ఆస్తులపై బోర్డులు ఏర్పాటు చేస్తుండడంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. ఇంటి నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే తక్కువ వడ్డీ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు, వ్యాపారులకు బ్యాంకులు పిలిచి రుణాలిస్తాయి. మార్టిగేజ్ రుణాలు కూడా వారికి అడిగినంత ఇస్తాయి. అయితే సామాన్యులకు అలాంటి అవకాశం ఉండదు. దీంతో చాలా మంది కార్పొరేట్ సంస్థల నుంచి రుణాలు తీసుకుని అప్పులపాలవుతున్నారు. అవగాహన లేక... కార్పొరేట్ సంస్థలకు ఆస్తులు తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న వారికి తాము తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ పడుతుందో తెలియదు. వడ్డీతో కలిపి రుణం చెల్లించడానికి వాయిదాలు పెట్టుకున్నపుడు నెలనెలా చెల్లించకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అన్న విషయంపైనా అవగాహన ఉండదు. రుణం ఇచ్చే సంస్థలు, ఆయా సంస్థల సిబ్బంది తక్కువ వడ్డీ అని చెప్పి రుణం మంజూరు చేస్తారే తప్ప, వాయిదాలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై అవగాహన కల్పించరు. తీసుకున్న అప్పు వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తే ఏ ఇబ్బందీ ఉండదు. చాలా మంది వాయిదాలు చెల్లించకపోవడంతో వడ్డీకి వడ్డీ కలిపి నడ్డి విరిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఇంటిని, ఇతర ఆస్తులను తాకట్టు పెట్టుకుని రుణాలిస్తున్న ఆయా సంస్థలు.. తాము చేసుకున్న ఒప్పందం ప్రకారం వాయిదాలు చెల్లించని వారికి నోటీసులు ఇస్తున్నాయి. వాటికి స్పందించకపోతే ఆస్తులను జప్తు చేయడానికి వెనుకాడడం లేదు. ఇంటికి నోటీసులు అతికించడం, బోర్డులు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. అయినా కూడా అప్పు వాయిదాలు క్లియర్ చేయనిపక్షంలో ఆస్తులను జప్తు చేస్తున్నారు. లీగల్గా అధికారం అప్పు ఇచ్చిన వారికే వెళుతోంది. దీంతో కొందరు అప్పు చెల్లించలేక, ఆస్తులు కాపాడుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో కొందరు తాకట్టు రుణాల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పులు తీసుకున్న మరెందరో ఇబ్బందుల్లో ఉన్నారు. -
ఊపందుకున్న వరికోతలు
లింగంపేట/బాన్సువాడ రూరల్ : లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాల కారణంగా ధాన్యం దిగుబడి తక్కువగా వస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు చైన్ హార్వెస్టర్ యంత్రానికి గంటకు రూ. 2600, టైర్ హార్వెస్టర్ యంత్రానికి గంటకు రూ. 2000 తీసుకుంటున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు ధాన్యం దిగుబడి వస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 30 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్ గ్రామ శివార్లలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు నూర్పిడీ చేసిన ధాన్యాన్ని రోడ్లపై పోసి ఆరబెడ్తుండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్తున్నారు. -
మూడేళ్లయినా పూర్తికాలే!
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం గ్రామ శివారులో వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023లో రూ. 4.8 కోట్లు మంజూరు అయ్యాయి. వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా పనులు మాత్రం పూర్తికాక, నిర్మాణం ముందుకు సాగకపోవడంతో నిలిచాయి. వంతెన పనులు ప్రారంభమైనప్పుడు ఆయకట్టు ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వాగు మధ్యలో పిల్లర్లను నిర్మించి పనులు నిలిపివేశారు. వంతెన నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. హైలెవల్ వంతెన నిర్మాణ పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారా జ్యంగా పనులు చేపడుతున్నారు. గతేడాది కాలం నుంచి సదరు వంతెన నిర్మాణ పనుల ముందుకు సాగడం లేదు. వాగు దాటడం ప్రాణం సంకటం సింగితం వాగు అవతల ఉన్న చెరువుల కింద 280 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఆయా చెరువుల కింద పంటలు సాగు చేయాలంటే వాగులో వరద నీటిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వర్షాకాలంలో వాగు దాటడం ప్రాణం సంకటంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి వర్షాలు దంచికొట్టడంతో వాగు అవతల భూములు పంటల సాగుకు నోచుకోక బీళ్లుగా ఉన్నాయి. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు పంటలు సాగు చేయక లక్షల రుపాయలు నష్టపోయారు.ఈఏడాది వర్షాలు దంచికొట్టడంతో మునుపెన్నడు లేనంతగా వాగు పారింది. పంటలు వేద్దామంటే వాగు అడ్డంగా ఉంది. వాగు మీద బ్రిడ్జి నిర్మిస్తే పంటలు సాగు చేయడం సులువుగా ఉంటుంది. ఏడాదిన్నర నుంచి వాగు పనుల జాడ లేదు. – దుర్గం లక్ష్మయ్య, రైతు, సింగితంమా తాత, ముత్తాల సంది సింగితం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని అడుగుతున్నాం. ఎన్నో ఎండ్ల సంది అడుగుతుంటే సింగితం వా గుపై వంతెన నిర్మాణానికి నిధులు వచ్చాయి. వంతెన నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వాగు దాటి సాగు చేయకపోవడంతో భూములు బీళ్లుగా ఉన్నాయి. సార్లు ఇప్పడైన వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – పద్మ గంగారాం, రైతు సింగితం సింగితం గ్రామ శివారులో వాగుపై నిలిచిన హైలెవల్ వంతెన నిర్మాణ పనులు వాగుదాటే పరిస్థితి లేక సాగుకు నోచుకోని భూములు పట్టించుకోని అధికారులు -
గాంధారి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ● పలు చోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనగాంధారి(ఎల్లారెడ్డి): నియోజకవర్గంలో గాంధారి మండల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్ను, నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. దుర్గానగర్ కాలనీలో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మండలంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు రాజంపేట : స్థానిక ఎన్నికలలో పోటీచేసేందుకు ఇద్దరి పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినందుకుగాను ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే మదన్మోహన్ రావును శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు నిబంధన విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే మదన్ మోహన్రావు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సల్మాన్ తదితరులున్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
భిక్కనూరు: సౌత్ ఆఫ్రికాలో ఈనెల 20న మృతి చెందిన బత్తుల శ్రీనివాస్ మృతదేహం ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. బతుకుదెరువు కోసం ఇటీవల సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన శ్రీనివాస్ కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబీకులు, బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహన్ని చూసిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని శ్రీనివాస్కు కన్నీటి వీడ్కోలు పలికారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని విఠల్వాడీ తండాకు చెందిన పవర్ సవితపై అనుమానంతో గురువారం రాత్రి భర్త పవర్ కిషన్ హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదివారం నిందితుడు కిషన్ను పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అరుణ్ కుమార్, సీఐ రవికుమార్ తెలిపారు. పిట్లం(జుక్కల్): తండ్రికి సేవలు చేయలేక అడ్డు తొలగించుకున్నడో కొడుకు. మండలంలోని గౌ రారం తండాలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాలు ఇలా.. గౌరారం తండాకు చెందిన కేతావత్ వామన్ తన తండ్రి దశరథ్ (58)కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంతకాలం నుంచి సపర్యలు చేస్తున్నాడు. తండ్రికి భోజనం పెట్టడం, బట్టలు ఉతకడం, స్నానం చేయించడం, మలమూత్ర విసర్జన ఎత్తిపోయడం వంటి పనులు అతడు భారంగా భావించాడు. దీంతో తండ్రికి సేవలు చేయలేక హతమార్చాలనుకున్నాడు. ఈనెల 24న రాత్రి తండ్రికి కల్లులో గుర్తుతెలియని పురుగుల మందు తాగించి, హత్యచేశాడు. అందరికి సాధారణ మృతిగా నమ్మించాడు. కానీ దశరథ్ చిన్న కొడుకు కేతావత్ శ్రీకాంత్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వామన్ను పట్టుకొని విచారించగా, తానే తండ్రిని హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు వామన్ను ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజని గ్రామ శివారులో శనివారం రాత్రి పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారి నుంచి రూ.12,750 నగదు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు. బొమ్మా–బొరుసు ఆడుతున్న 8మంది.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులో బొమ్మా, బొరుసు(చిత్తు,బొత్తు) ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బొమ్మా–బొరుసు కేంద్రంపై దాడి చేసి, వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు, రూ. 3400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామ శివారులోగల డిచ్పల్లి – నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి సమీపంలోని పెట్రోల్ బంక్ దిమ్మెను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు పెట్రోల్ పంపు లోపలికి వెళ్లివుంటే పెను ప్రమాదం సంభవించేదని, బంక్ దిమ్మె వద్దనే నిలిచిపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదంపై బంకు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
అలరిస్తున్న గంగిరెద్దుల ప్రదర్శన
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గంగిరెద్దుల ప్రదర్శన ప్రజలకు ఆకట్టుకుంది. గంగిరెద్దుల వారు ఇంటింటి తిరుగుతూ అమ్మవారికి దండం పెట్టు అయ్యవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దు చేత దండాలు పెట్టించారు. తదుపరి గంగిరెద్దుల వారికి ప్రజలు భిక్షపెడుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో గంగిరెద్దుల యాజమాని సిరిసిల్లా–రాజన్న జిల్లాకు చెందిన కొండాపూర్కు చెందిన భిక్షమయ్య మాట్లాడుతూ తమ కుటుంబం తరతరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నామన్నారు. తనకు ఇద్దరూ కుమారులు ఉన్నారని వారు కూడా గంగిరెద్దులను ఆడిస్తూ జీవనం గడుపుతున్నారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటల సీజన్లో తాము గంగిరెద్దులతో భిక్షాటన చేస్తామని తదుపరి కూలీ పనులకు వెళ్తామన్నారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డోంగ్లీ నుంచి కుర్లా, మదన్హిప్పర్గా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంతలు మూడు ఫీట్ల లోతులో పెద్దగా ఉండటంతో అందులో నీరు చేరి చెరువులా తయారైందని వాహనదారులు పేర్కొంటున్నారు. అదుపు తప్పి కింద పడిపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. -
కరెంట్షాక్తో యువ రైతు మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఆరేడ్ గ్రామంలో ఓ యువరైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప(38) అనే యువ రైతు ఆదివారం సాయంత్రం గ్రామశివారులోని పొలానికి వెళ్లాడు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్న కరెంట్ మోటార్ ఆన్ కాకపోవడంతో కేబుల్ వైర్ పట్టుకొని ప్రాజెక్టు నీళ్లల్లోకి దిగాడు. కేబుల్ వైర్తోపాటు మోటార్ వద్దకు చేరుకున్న బసప్ప కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. బసప్ప తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అతడి కోసం గాలించగా కరెంట్ మోటార్ వద్ద నీటిలో అతడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పదస్థితిలో ఒకరు.. రాజంపేట: మండలంలోని మూడుమామిళ్ల తండాలో ఒకరు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని శేర్శంకర్ తండా పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన ముద్రిచ్చ లాల్య(38) ఆదివారం ఉదయం ఇంటి నిర్మాణ విషయంలో పక్కవారితో గొడవపడ్డాడు. అనంతరం తన ఇంట్లోకి వచ్చి నీరు తాగి, మళ్లీ బయటకు వెళ్లగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై తెలిపారు. -
చింపాంజీ వేషం.. కోతులు పరార్
అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వానరాలు గ్రామీణ ప్రాంతాల్లో జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఇళ్లలోకి వెళ్లి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడమే కాకుండా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడదను తప్పించేందుకు పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు. ఆదివారం ఓ వ్యక్తికి చింపాంజీ డ్రెస్ వేయించి కోతులు ఉన్న ప్రాంతాల్లో తిప్పారు. దీంతో కోతులు భయపడి పరారవ్వడంతో గ్రామస్తులకు ఉపశమనం లభించింది. కాగా, చింపాంజీ వేషధారణ చేసిన వ్యక్తితో యువకులు కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. – పెద్దకొడప్గల్(జుక్కల్) -
దళారుల పాలవుతున్న సోయా
మద్నూర్: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో సోయా రైతులు నష్టపోతున్నారు. దళారులు చెప్పిన ధరకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్నూర్, డోంగ్లీ మండలాల్లో సోయా పంట కోతలు దాదాపు పూర్తయ్యాయి. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో డబ్బులు అవసరం ఉన్న రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పిన ధరకు పంటను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం సోయా క్వింటాలుకు రూ. 5,320 మద్దతు ధర ప్రకటించగా.. వ్యాపారులు రూ. 4,200 లోపే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 11 వందలపైనే నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సోయా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. -
కుక్కల బెడద
● లింగంపేట మండలంలో భయాందోళనకు గురవుతున్న ప్రజలు లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు రాత్రింబవళ్లు రోడ్లపై తిరుగుతూ వాహనదారుల వెంటబడుతున్నాయి. దీంతో వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయాలపాలవుతున్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు కుక్కల బెడదను నివారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలి
● టీచర్లకు టెట్ అర్హతను ఉపసంహరించుకోవాలి ● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి కామారెడ్డి అర్బన్: ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినప్పుడే నాణ్యమైన విద్య అందుతుందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్రెడ్డి పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలలతోనే ఉన్నత పాఠశాలలు బలోపేతం అవుతాయని వివరించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్లాపూర్ కుషాల్ అధ్యక్షతన ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకట్రెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, అసోసియేట్ అధ్యక్షుడు గోవర్ధన్ తదితరులు మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన హెడ్మాస్టర్లకు ఇప్పటి వరకు నిధులు చెల్లించకపోవడం విచారకమని దామోదర్రెడ్డి అన్నారు. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హతను ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్యానెల్ జాబితా ప్రకారం ప్రతినెలా ప్రమోషన్ల కోసం కృషి చేస్తున్నామన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల, హెల్త్కార్డుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఆదర్శ, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి పుట్ట శ్రీనివాస్రెడ్డి, సంఘ నియామవళి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అసోసియేట్ అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా బాధ్యులతోపాటు దాదాపు 500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నేడు వైన్ షాపులకు లక్కీ డ్రా
● కలెక్టర్ ఆధ్వర్యంలో దుకాణాల కేటాయింపు ● వ్యాపారుల ముందస్తు ఒప్పందాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా సోమవారం నిర్వహించనున్నారు. 2025–27 సంవత్సరాలకు జిల్లాలోని 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు రాగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో డ్రా తీసేందుకు ఎకై ్సజ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటల నుంచి దుకాణాల కేటాయింపు కోసం డ్రా తీయనున్నారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తు చేసుకున్న వారి సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి వారికి ఆయా దుకాణాలను కేటాయిస్తారు. జిల్లాలో మద్యం దందాలో సక్సెస్లో ఉన్నవారు కొందరు సిండికేట్గా మారి వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ వారి పేరిట దుకాణాలు దక్కకుంటే, వచ్చిన వారికి గుడ్విల్ ఇచ్చి తీసుకునేందుకు ముందుగానే ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగే కొన్ని దుకాణాలకు ఎక్కువ పోటీ ఉంది. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని మద్యం వ్యాపారులు ముందస్తు ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
కల్లుగీత మహాసభలను విజయవంతం చేయాలి
దోమకొండ: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ కోరారు. ఈసభకు సంబంధించిన మహాసభల కరపత్రాలను ఆదివారం మండలకేంద్రంలో గీతకార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 68 సంవత్సరాలు అవుతుందన్నారు. 1957లో ధర్మాబిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం దొరలను భూస్వాములను ఎదిరించి హర్రాజు మామ్లాలను రద్దు చేయించుకున్నామన్నారు. సొసైటీలను ఏర్పాటు చేసుకొని అనేక హక్కులను సాధించుకున్నామని పేర్కొన్నారు. నవంబర్ 11 న కామారెడ్డిలో జిల్లా మహాసభ ఉంటుందని, నవంబర్ 28, 29,30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు సూర్యాపేటలో ఉంటాయని, ఈమహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహా సభలో కల్లు గీత వృత్తి రక్షణ కోసం పలుతీర్మానాలు ఆమోదిస్తామని పేర్కొన్నారు. కల్లుగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా అధునికీకరణ చేపట్టాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజనర్సాగౌడ్, నాయకులు రాజాగౌడ్, రాజెందర్గౌడ్ , వెంకట్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దార్థ్గౌడ్, నరేష్గౌడ్, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కోర్సులలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3న సీసీ టీవీ ఇన్స్టాలేషన్ (13రోజులు), వెజిటబుల్ నర్సరీ (35రోజులు), పాపడ్, ఊరగాయల తయారీ (10 రోజులు), తేనెటీగల పెంపకం (20 రోజులు), పుట్టగొడుగుల పెంపకం (10 రోజులు), నవంబర్ 17న మగ్గం వర్క్ (31రోజులు), నవంబర్ 18న (టైలరింగ్ (31రోజులు), నవంబర్ 19న బ్యూటీపార్లర్ (35రోజులు) కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని 19–45 సంవత్సరాల వయస్సు కలిగిన గ్రామీణ ప్రాంత యువతీయువకులు దరఖాస్తులకు అర్హులన్నారు. ఆసక్తిగల వారు తమ ఆధార్కార్డు, రేషన్కార్డు, 10వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు ఖాతా జిరాక్స్ వెంట తెచ్చుకుని నేటినుంచి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం డిచ్పల్లిలోని ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో లేదా 08461–295428 నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. ఆర్మూర్టౌన్: బీజేపీ కార్యాకర్తలు, నాయకులు పార్టీ అభివృద్ధి కోసం కృషిచేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి అన్నారు. ఆర్మూర్లోని 16వ వార్డులో ఆదివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి పీఎం మన్కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయ్యాలన్నారు. నాయకుడు భూపతిరెడ్డి, కంచెట్టి గంగాధర్, మందుల బాలు, సుంకరి రంగన్న, కలిగొట ప్రశాంత్, ఉదయ్గౌడ్ పాల్గొన్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీద్పేట శివారులో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న 45 సంవత్సరాల మహిళపై ఆదివారం సాయంత్రం బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తీవ్ర రక్తస్రావమై, అస్వస్థతకు గురికావడంతో స్థానికులు గుర్తించి, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బానిషాతో.. బతుకు ఛిద్రం
● మద్యానికి బానిసలవుతున్న యువత ● నాలుగు నెలల్లో ముగ్గురి ఆత్మహత్య ● ఆధారం కోల్పోతున్న కుటుంబాలు ● సెప్టెంబర్ 6న నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డితండాకు చెందిన కేతావత్ రాజు(36)ను మద్యం తాగుడు మానేయాలని భార్య నచ్చజేప్పే ప్రయత్నం చేసింది. దీంతో రాజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మరుసటిరోజు కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించి అతనిని ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి ఇంటి ముందున్న పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలో ని పలు గ్రామాల్లో యువత మత్తుకు బానిసవుతున్నారు. మత్తు బాట వీడాలని కుటుంబసభ్యులు చె ప్పే మాటలు మింగుడు పడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గడిచిన నాలుగు నెలల్లో మండలంలో ని ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులతో పాటు సమీపంలో ఉన్న మరో గ్రామానికి చెందిన యువకుడు మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు ఆధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి. యువత ఇటీవల కాలంలో మత్తుకు కట్టుబానిసలు గా మారుతున్నారు. చాలామంది మద్యం, కల్లు, గంజాయికి బానిసలై విలువైన భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మద్యంతోపాటు గంజాయి అలవాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తప్పుడుదారిలో వెళ్తు న్నా గట్టిగా మందలించ లేక తల్లిదండ్రులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. అయితే, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నాగిరెడ్డిపేట మండలం తాండూర్కు చెందిన దాకమొల్లి కుమార్(18) కల్లు, మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఈ నెల 22న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్కు చెందిన బైండ్ల అనిల్కుమార్(16) కల్లుకు బానిసయ్యాడు. జూలై 3న గ్రామశివారులో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డిమందు తాగాడు. గుర్తించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరుసటిరోజు మరణించాడు. -
ఏఐ క్లాసులతో సత్ఫలితాలు
● ప్రైమరీ స్కూళ్లలో పెరిగిన హాజరు ● విద్యార్థుల్లో పెరుగుతున్న కంప్యూటర్ పరిజ్ఞానం ● ఇబ్బంది పెడుతున్న ఇంటర్నెట్రామారెడ్డి : ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) క్లాసులు సత్ఫలితాలనిస్తున్నాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచడంతోపాటు పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయి. దీంతో ఏఐ క్లాసులు ఉన్న స్కూళ్లలో విద్యార్థుల హాజరుశాతం మెరుగుపడింది. చదువులో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకునేందుకు ప్రైమరీ స్కూళ్లలో ప్రభుత్వం ఏఐ క్లాసులను నిర్వహిస్తోంది. కామారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 27 ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేశారు. కంప్యూటర్ ద్వారానే మ్యాథ్స్, సైన్స్, తెలుగు తదితర సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు చెబుతున్నారు. ఆకట్టుకునే బొమ్మలతో పాఠాలు చెప్పటంతో విద్యార్థులు సులభంగా నేర్చుకుంటున్నారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుపై 20 నిమిషాలు క్లాస్ నిర్వహిస్తున్నారు. అయితే, ఏఐ క్లాసుల నిర్వహణతో డ్రాపౌట్స్ తగ్గాయి. దీంతో అధికారులు ఇటీవల ‘నో మోర్ డ్రాపౌట్స్’ పేరిట డాక్యుమెంటరీ తీశారు. ఇదిలా ఉండగా ఏఐ క్లాసుల నిర్వహణకు ఇంటర్నెట్ సమస్యగా తలనొప్పిగా మారింది. మొబైల్ ఫోన్ల ద్వారా కనెక్షన్ ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలం ప్రాథమిక పాఠశాలలు రామారెడ్డి రెడ్డిపేట తండా, రామారెడ్డి, మద్దికుంట లింగంపేట శెట్పల్లి, మోతె తండా, పోతాయిపల్లి బాన్సువాడ తాడ్కోల్, హన్మాజీపేట, బొల్లారం బీబీపేట శివారు రాంరెడ్డిపల్లి జుక్కల్ హంగర్గ బిచ్కుంద హస్గుల్, గుండెనెమ్లి, జామ మసీద్ నస్రుల్లాబాద్ నస్రుల్లాబాద్ఏఐ బోధన విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. ఇ బ్బంది పడకుండా అన్ని వి షయాలను నేర్చుకుంటు న్నారు. రెగ్యులర్ తరగతిలో అందరినీ దృష్టిలో పెట్టుకొ ని టీచర్లు పాఠాలు చెబుతారు. ఏఐలో విద్యార్థి సా మర్థ్యం పసిగట్టి దాని ఆధారంగానే పాఠాల బోధన ఉంటుంది. – ఆనంద్రావు, ఎంఈవో, రామారెడ్డి ఏఐ క్లాసుల నిర్వహణతో కంప్యూటర్ పరిజ్ఞానం పెరు గుతుంది. పాఠాలను సుల భంగా అర్థం చేసుకుంటు న్నారు. దీంతో విద్యార్థుల్లో చదివే సామర్థ్యం పెరుగుతోంది. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. – రాజు, ఉపాధ్యాయుడు, రామారెడ్డి -
రామేశ్వర్పల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లిలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన మల్లిని రమేష్ (35)కు అదే గ్రామానికి చెందిన అనిలతో పదహారేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్య ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో రమేష్ తాగుడుకు బానిసగా మారాడు. ఈనెల 24న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మళ్లీ బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. గ్రామంలోని ఆపారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని రమేష్గా గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఎక్కడికి వెళ్లినా..
దోమకొండకు చెందిన మోహన్రెడ్డి, సురేఖ దంపతులు ఫంక్షన్లు, పెళ్లిళ్లతోపాటు దేవాలయాల వ ద్ద జరిగే ఉత్సవాలకు వె ళ్లినపుడు భోజనం చేయడానికి వెంట స్టీల్ ప్లేట్లు తీసుకువెళ్తారు. అక్కడ స్టీల్ ప్లేట్లు ఉంటే వాటిలో తింటారు. లేదంటే తమ వెంట తీసుకువెళ్లిన ప్లేట్లలో తినేసి శు భ్రంగా కడుక్కుని బ్యాగులో పెట్టేసుకుంటారు. అలాగే మద్నూర్కు చెందిన తమ్మేవార్ అరవింద్, సోనాలి దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్లు తీసుకువెళ్తారు. వారికి హైదరాబాద్, ముంబై, ఔరంగాబాద్, పూణే వంటి ప్రాంతాల్లో బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్లినా వారివెంట స్టీల్ ప్లేట్లు ఉంటాయి. అందరూ పేపర్, అట్ట ప్లేట్లలో తింటుంటే వీళ్లు మాత్రం స్టీల్ ప్లేట్లలో తింటారు. -
ధాన్యం తీసుకోవడం లేదని రైతుల రాస్తారోకో
● రైస్ మిల్ నిర్వాహకుల తీరుపై రైతుల ఆగ్రహం ● పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నంనస్రుల్లాబాద్ : మండలంలోని బొమ్మన్దేవ్పల్లి నుంచి వచ్చే లారీల్లోని ధాన్యం తీసుకునేందుకు ఓ రైస్ మిల్లు నిర్వాహకుడు నిరాకరించడంతో ఆ గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం క్రాస్ రోడ్డుపైకి చేరుకొని రాస్తారోకో చేశారు. ఇది వరకు వచ్చిన ధాన్యం నాసిరకంగా ఉందని, బొమ్మన్దేవ్పల్లి నుంచి వచ్చే ధాన్యాన్ని తీసుకోవద్దని అన్ని రైస్ మిల్లుల నిర్వాహకులకు సూచించడంతో లారీలు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సొసైటీ సీఈవోను ప్రశ్నించగా రైస్మిల్లర్లు ధాన్యం తీసుకోకపోతే తమకేమీ సంబంధం లేదని సమాధానం ఇచ్చారన్నారు. రైతులకు ఉపయోగపడని రైస్మిల్లులు ఎందుకని, రైస్ మిల్లు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్ఫోర్స్ డీటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మిల్లర్లతో ఆయన కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రైతులను సముదాయించేందుకు పోలీసులు రాగా, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని పలువురు వారి కాళ్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ రైతు పెట్రోల్పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా తోటి రైతులు అడ్డుకున్నారు. బొమ్మన్దేవ్పల్లి రైతులకు నస్రుల్లాబాద్, కామిశెట్టిపల్లి, నెమ్లి తదితర గ్రామాల రైతులు మద్దతు తెలిపారు. తహసీల్దార్ సువర్ణ రైతుల వద్దకు చేరుకొని సముదాయించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని, సదరు రైస్ మిల్లర్ తీరుపై ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. డీసీఎస్వో వెంకటేశ్వరరావు, డీసీవో రామ్మోహన్రావు, డీఎం శ్రీకాంత్, డీఏవో మోహన్రెడ్డి, తహసీల్దార్ సువర్ణ, ఏవో భవానీ, ఆర్ఐ వెంకటస్వామి, పీఏసీఎస్ చైర్మన్ గంగారాం తదితరులు గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సుగుణ రైస్మిల్లు నిర్వాహకులు ధాన్యం తీసుకోవడం లేదని ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
స్మరిస్తూ.. సైకిల్ ర్యాలీ
పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, ఏఎస్పీ, పోలీసులుకామారెడ్డి క్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. నర్సన్నపల్లి బైపాస్లో ర్యాలీని ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి పట్టణం లోని ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. పోలీసు అమర వీరులకు జోహార్లు తెలుపుతూ ప్రధాన రహదారి వెంబడి పోలీసుల సైకిల్ ర్యాలీ ఉత్సా హంగా సాగింది. ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డిలు సైకిల్ ర్యాలీలో పా ల్గొని మిగతావారిని ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అమర వీరుల త్యాగాలు మరువలేవన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 300 మంది పోలీసులు, కళాశాలల విద్యార్థులు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. -
ఆదుకోవడం మరిచారా?
అభివృద్ధి నిధులు సరే..● కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.18.75 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు ● వరద నష్టం సాయం ఇప్పట్లో అందేనా..కామారెడ్డి టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.15 కోట్లతోపాటు అదనంగా మరో రూ.3.75 కోట్లు మొత్తం రూ.18.75 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టాలా? లేక ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయా పనులు చేపట్టాలా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నెలన్నర క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా పట్టణంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు, మురికికాలువలు, బ్రిడ్జిలు ధ్వంసమైన విషయం తెలిసిందే. మరమత్తులకు రూ.100 కోట్లు అవసరమవుతాయని ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇదిలా ఉండగా అన్ని మున్సిపాలిటీలతోపాటు కామారెడ్డి మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం వరద నష్టానికి సంబంధించిన సాయాన్ని ఇప్పట్లో అందిస్తుందా? ప్రస్తుతం మంజూరు చేసిన రూ.18.75 కోట్లతో నూతన పనులు కాకుండా వరద కారణంగా దెబ్బతిన్న రోడ్లు, మురికి కాలువలు, బ్రిడ్జిల మరమ్మతులు చేపడతారా? అని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. -
బోనస్ చెల్లింపు ప్రారంభం
కామారెడ్డి క్రైం: రైతులకు ఖరీఫ్ ధాన్యానికి సంబంధించిన బోనస్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ఎంట్రీ, మొత్తం ప్రాసెస్ పూర్తయిన జిల్లాలోని ముగ్గురు రైతుల ఖాతాల్లో శనివారం రూ.2.69 లక్షలు జమయ్యాయని వెల్లడించారు. మిగతా రైతులకు కూడా ధాన్యం సేకరణ, ఆన్లైన్ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే బోసన్ డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే యాసంగి సీజన్కు సంబంధించి రూ.89 కోట్ల బోనస్ చెల్లింపు పెండింగ్లోనే ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల సంబరాలు ● జిల్లాలోనే మొదటగా 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావడంపై హర్షం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధ ర్మారెడ్డి గ్రామశివారులో మహిళాసంఘం ఆ ధ్వర్యంలో ఈఏడాది వానాకాలం సీజన్కు సంబంధించి ఏర్పాటు చేసిన కొనుగోలుకేంద్రంలో సేకరించిన ధాన్యం డబ్బులు జిల్లాలోనే మొదటగా 48గంటల్లో రైతుల ఖాతా ల్లో జమయ్యాయి. దీంతో శనివారం రైతు లు, మహిళాసంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ..కొనుగోలుకేంద్రంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో 11మంది రైతుల నుంచి 528.80క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు ఏ పీఎం రాంనారాయణగౌడ్ తెలిపారు. ఈ మే రకు సంబంధిత రైతుల ఖాతాల్లో రూ.12లక్షల63వేల303 జమైనట్లు ఆయన చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డిక్రైం: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11,931 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో 11,201 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతరంగా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులు పాల్గొన్నారు. 4.25 లక్షల చేపపిల్లలు సిద్ధం నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలోని రెండు నర్సరీల్లో 4.25 లక్షల చేప పిల్లలు పంపిణీ సిద్ధంగా ఉన్నాయి. స్థానిక చెరువుల్లో నుంచి తల్లి చేపలను తీసుకొచ్చి కట్ల, రహు రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. దాదాపు రెండు ననెలలుగా చేపపిల్లల ఉత్పత్తి చేపడుతుండగా ప్రస్తుతం 35 నుంచి 40ఎంఎం సైజ్కు చేరుకున్నాయి. ప్రభుత్వ నుంచి ఆదేశాలు వెలువడగానే చేప పిల్లలను స్థానిక చెరువులు, కుంటల్లో విడుదల చేస్తామని మత్య్సశాఖ ఎఫ్డీవో డోలిసింగ్ తెలిపారు. ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులు కామారెడ్డి టౌన్: కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రాలు అరుణాచలం, శ్రీశైలం, రామప్ప, కాళేశ్వరం, ఉజ్జయిని, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోడానికి డిపో నుంచి డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు ఇస్తామన్నారు. వివరాలు, బుకింగ్ కోసం 9959226018, 7382851280, 7382843783 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
శభాష్రెడ్డి..
● దీనార్తుల సొంతింటి కలను నెరవేర్చిన వ్యాపారవేత్త సుభాష్రెడ్డి ● దోమకొండ, బీబీపేటలో మొత్తం ఐదు ఇళ్ల నిర్మాణంబీబీపేట/దోమకొండ : ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నేనున్నానంటూ దీనార్తులకు భరోసా కల్పించి వారి సొంతింటి కలను నెరవేర్చారు. బీబీపేట మండలం మాందాపూర్లో గతేడాది చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాగే దోమకొండ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగులైన అక్కాచెల్లెళ్లు కమ్మరి లక్ష్మి, కమ్మరి రాజేశ్వరికి తల్లిదండ్రులు లేరు. శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లో ఉంటున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న సుభాష్రెడ్డి ఇళ్లను నిర్మించి శనివారం గృహప్రవేశం చేయించారు. దీనార్తులకు అండగా నిలిచిన సుభాష్రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు. -
● ఫంక్షన్లు, పెళ్లిళ్ల్లకు వెళితే వెంట తీసుకెళతారు ● వీళ్లు పేపర్, అట్ట ప్లేట్లకు దూరం ● ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు తాగేది లేదు
జంగంపల్లికి చెందిన చెన్నప్పగారి మోహన్రెడ్డి తన కూతురుతో కలిసి స్టీల్ ప్లేట్లో తింటున్న దృశ్యం.. పేపర్ప్లేట్లలో తింటున్న మిగతావారు (ఫైల్) ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా గిన్నేగిలాస(స్టీల్ ప్లేట్, గ్లాస్) శబ్దం వినిపించడం లేదు. ఇప్పుడంతా ఇన్స్టాంట్, డిస్పోజబుల్. ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ప్రమాదకర రసాయనాలు కలిపి తయారు చేసే పేపర్ ప్లేట్లు, గ్లాస్లు ఉపయోగిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ‘శ్రమ’ ఉండదనే షార్ట్కట్ దారి భయం అనేది లేకుండా చేస్తోంది. అంతా డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాస్లు వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్, గ్లాస్లు తీసుకెళ్తూ వాటిలో భోజనం చేసి కడిగేసి బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు. డిస్పోజబుల్ భూతంతో పొంచి ఉన్న ప్రమాదంపై వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫంక్షన్లలో అవగాహన కల్పిస్తున్నారు. తన వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేటులో భోజనం చేస్తున్న మద్నూర్కు చెందిన అరవింద్ (ఫైల్) సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెళ్లి, ఫంక్షన్, పండగ, అన్నదానాలు... ఆఖరుకు ఇంట్లో చేసుకునే చిన్నచిన్న దావత్లలో కూడా భోజనాలకు పేపర్ ప్లేట్లు, అట్ట ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్న రోజులివి. పేపర్ ప్లేట్ల మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. వేడివేడి అన్నం, కూరలు వేసుకున్నపుడు ప్లాస్టిక్ కరిగిపోతుందని, తినే ఆహారంతోపాటు కడుపులోకి వెళుతుందని మనందరికీ తెలుసు. అయినా వాటినే వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల వల్ల కలిగే అనర్థాలను అర్థం చేసుకున్న కొందరు వాటికి దూరంగా ఉంటున్నారు. ఫంక్షన్లలో, పెళ్లిళ్లలో స్టీల్ ప్లేట్లు ఉంటేనే భోజనం చేస్తున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేటు, గ్లాసులు ఉంచుకోవడం అలవాటు చేసుకున్నారు. పలువురు పేపర్ ప్లేట్లు, అట్ట ప్లేట్లను వదిలేసి స్టీల్ ప్లేట్ల భోజనానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లలో స్టీల్ ప్లేట్లు కడగడానికి డబ్బులు ఖర్చయినా సరే పనిమనుషులను పెడుతున్నారు. ఇంకొందరు ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్లకు సరిపడా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసి ఇళ్లలో ఉంచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు అవసరమైతే వాటిని ఇస్తున్నారు. -
అదృష్టం ఎవరిని వరించునో..
● రేపు లక్కీ డ్రా ద్వారా వైన్షాపుల కేటాయింపు ● 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నిర్దేశించిన గడువులోగా 49 దుకాణాలకు 1,502 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో డ్రా తీసి దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.45.06 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకానుంది. ఇదిలా ఉండగా లక్కీడ్రాలో అదృష్టం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంది. డ్రాలో మద్యం దుకాణం దక్కకుంటే గుడ్ విల్ ఇచ్చి కొనేందుకు కూడా కొంత మంది ఆసక్తి చూపుతున్నారు. గత కొంత కాలంగా ఇతర వ్యాపారాలు దెబ్బతిన్న పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార వర్గాలు మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణరంగం, రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న పరిస్థితులతో చాలా మంది బిల్డర్లు, రియల్టర్లు మద్యం దుకాణాల కోసం టెండర్లు దాఖలు చేశారు. తమవారితోనూ వేయించారు. ఒక వేళ తమకు రాకుంటే గుడ్ విల్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేయనున్నారు. -
పేపర్ ప్లేట్లలో తినేది లేదు..
భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చెన్నప్పగారి మోహన్రెడ్డి కుటుంబం స్టీల్ ప్లేట్లనే వాడుతోంది. ఆయన భార్య పావని, పిల్లలు సహన, సహజలు ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లినపుడు వెంట ఓ బ్యాగులో స్టీల్ ప్లేట్లు తీసుకుని వెళ్తారు. అక్కడ స్టీల్ ప్లేట్లలో భోజనం ఉంటే వాటిలో తింటారు. లేదంటే తమ వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లను బయటికి తీసి అందులో తిని, కడిగేసుకుని వెళ్తారు. ఏదైనా పరిస్థితుల్లో ప్లేట్ వెంట లేకుంటే తినకుండా ఉంటారు తప్ప, పేపర్, అట్ట ప్లేట్లలో మాత్రం తినేది లేదని మోహన్రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. -
పాడి సంపదను పెంచుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంటు డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కాలోజివాడి గ్రామాలలో శనివారం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తమ పశవులకు తప్పనిసరిగా గాలికుంటు నిరోధక టీకాలను వేయించాలన్నారు. లేనియెడల పశువులలో పాలదిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు.ఈసందర్భంగా 60 ఆవులు, 348 గేదేలకు గాలికుంటూ నిరోధక టీకాలను ఇచ్చారు. అలాగే సాధారణ చికిత్సలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశవువైద్యాధికారి రమేష్, వీఎల్వో పోచయ్య, జేవీవోలు కొండల్రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు మహిపాల్రెడ్డి, బ్రహ్మం, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని బుడిమి, కాద్లాపూర్ గ్రామాల్లో శనివారం పశుసంవర్ధకశాఖ ఆధ్వ ర్యంలో ఆవులు, ఎడ్లు, బర్రెలు, పోతులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. రైతులు విధిగా తమ పశువులకు టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి జైపాల్సింగ్ సూచించారు.ఆఫీస్ సబార్డినేట్ ఖాదర్, బాలరాజు, గోపాల మిత్ర ప్రవీణ్, సాయిలు, పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు జాబితా
కామారెడ్డి క్రైం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాను పకడ్బందీగా తయారు చేయడం జరుగుతున్నదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశిస్తూ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించిన వివరాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల అధికారికి వివరించారు. బీఎల్వోలు, సూపర్వైజర్ లతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారం రోజుల్లోగా జాబితాలను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ వీసీలో కామారెడ్డి నుంచి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్వో మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహా రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి కామారెడ్డి క్రైం: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్రీడాకారులకు సూచించారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు కలెక్టర్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సన్మానించారు. కృషి, పట్టుదలతో ముందుకుసాగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లివిగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ సంగ్వాన్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పి ంచిందని, ఇందుకోసం రూ.5.80 కోట్లు కేటాయించిందన్నారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్అండ్బీ ఈఈ మోహన్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్లు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని భద్రాల్ తండా అంగన్వాడీ స్కూల్లో టీచర్, ఆయమ్మ సమయపాలన పాటించడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. శనివారం తండావాసులు సెంటర్కు వెళ్లగా మధ్యాహ్నం మూడు గంటలకు తాళం వేసి వెళ్లిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కేంద్రం తెరిచి. సాయంత్రం 4 గంటల వరకు ఉంచాలన్నారు. అలాకాకుండా ఉదయం, సాయంత్రం సెంటర్ సమయపాలన పాటించడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ మండల సుపర్వైజర్ వినోద ఇన్చార్జి సూపర్వైజర్గా ఉన్నారని, సెంటర్ నిర్వహణపై దృష్టిసారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
జీవ వైవిధ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
కామారెడ్డి అర్బన్: జీవ వైవిధ్యంతోనే పర్యావరణ పరిరక్షణ జరుతుందని, జీవజాతులను పరిరక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని కామారెడ్డి డివిజనల్ అటవీ అధికారి రామకృష్ణ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్రం, ఫారెస్టీ విభాగం విద్యార్థులు 85 మంది, అధ్యాపకులు అటవీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప అటవీప్రాంతాన్ని సందర్శించారు. అడవి జంతువుల జీవన విధానాన్ని, సంరక్షణను ప్రజలకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. అటవీశాఖలో ఉద్యోగులు, వారి హోదాలు, భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలను వివరించారు. ప్రిన్సిపల్ కే.విజయ్కుమార్, అధ్యాపకులు దినకర్, శ్రీనివాస్రావు, శ్రీవల్లి, వెన్నెల, రమణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి రమే శ్, శ్రీధర్రావు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని గత రెండు సంవత్సరాలు పంపిణీ వ్యవస్థ ఆగిపోయిందని అఖిల భారత యాదవ జిల్లా మహాసభ ఉపాధ్యక్షులు యూత్ మహేష్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గొర్రెల, మేకల పెంపకదారులు కనీసం ఎలాంటి నట్టల నివారణ మందులు ఇవ్వడం లేదని, వందల సంఖ్యలో జీవాలు మరణిస్తున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పశుసంవర్ధక శాఖ తక్షణమే స్పందించి వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన వర్గీయులు అన్నారు. బాన్సువాడలో శనివారం వారు మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పోచారం శ్రీనివాస్రెడ్డికే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొన్ని బిల్లులు పెండింగ్లో ఉండడంతో సీఎం రేవంత్రెడ్డి సహకారం కోసం ఆయనను కలిశారని అన్నారు. అందుకు ఇప్పటి వరకు రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు మంజురు చేశారని అన్నారు. 16 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధికి రూ.150కోట్ల నిధులు మంజురు చేయించారని గుర్తు చేశారు. 2004లో బాన్సువాడలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడను రాయలసీమగా మార్చారని ఆరోపించారు. సమావేశంలో పోచారంవర్గం నాయకులు కృష్ణరెడ్డి, గురువినయ్, పిట్ల శ్రీధర్, నార్ల సురేష్, జంగం గంగాధర్, ఎజాస్, ఖలేక్ తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీ సిబ్బందికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆడిట్పై అవగాహన కల్పించారు. నిజామాబాద్తోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఐకేపీ ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ సెర్ప్ నుంచి వచ్చిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఎంవీ కృష్ణ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు ఏవిధంగా చేస్తే సంస్థల ఆర్థిక పరిస్థితి, రికవరీ, అడ్వాన్స్లు వస్తాయో వివరించారు. ఆడిట్లో వచ్చిన అభ్యంతరాలను డీఆర్డీవోకు ప్రతి నెలా పంపాలని సూచించారు. మూడు జిల్లాల డీఆర్డీవోలు సాయాగౌడ్, విజయలక్ష్మి, సురేంధర్, ఏపీడీ మధుసూదన్, ఫైనాన్స్ డీపీఎం కిరణ్కుమార్ తదితరులున్నారు. -
స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని ర్యాలీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రూ. 8900కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్లు రాకపోండంలో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్నారని, పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజయ్, కౌషిక్, ఆకాష్, విష్ణు, లోకేష్, విఘ్నేష్, శ్రవ్య, సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి నాగిరెడ్డిపేట/లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం లొంకలపల్లి శివారులో చిరుతపులి సంచారంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాగిరెడ్డిపేట డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్ అన్నారు. లొంకలపల్లి శివారులో రెండురోజులుగా చిరుతపులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామశివారులోని పంటచేనుల్లో చిరుతపలి పాదముద్రలు కనిపించడంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శనివారం అటవీశాఖ అధికారి రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్ గ్రామ సమీపంలోని వ్యవసాయభూముల్లో చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటకోతలు ప్రారంభమైన నేపథ్యంలో పొలాలకు వెళ్లే అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను అప్రమత్తం చేశారు. కాగా ఫారెస్ట్ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అనర్హత వేటు వేయడం సరికాదు
● విచారణ జరిపి న్యాయం చేయాలి ● డీసీవోకు ఇద్దరు డైరెక్టర్ల వినతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తమపై అనర్హత వేటు వేసి పదవుల నుంచి తొలగించడం అన్యాయమని, తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకారసంఘానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శనివారం కామారెడ్డిలోని డీసీవో రాంమోహన్కు వినతిపత్రాన్ని అందజేశారు. సహకారసంఘానికి ఎలాంటి బకాయి లేనప్పటికీ ఉన్నతాధికారులకు సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి తనపై అనర్హత వేటు వేయించారని సహకారసంఘం వైస్చైర్మన్ మిద్దె బాబు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో పాటు సహకారసంఘం ద్వారా కొందరు రైతులకు ఉద్దెరగా ఇప్పించిన ఫర్టిలైజర్ డబ్బులను తాను గత నెలలో చెల్లించానని మండలంలోని జలాల్పూర్ డైరెక్టర్ సిద్ధిరాంరెడ్డి తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫర్టిలైజర్ బకాయి డబ్బులను చెల్లించే విషయమై ఎలాంటి గడువు విధించకపోగా తనపై అనర్హత వేటు వేసి తనకు అన్యాయం చేశారని ఆయన చెప్పారు. ఈ విషయమై తగు విచారణ జరిపించి తమ పదవులను పునరుద్ధరించాలని వారు కోరారు. -
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులేరి?
మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు లేక బోసిపోతున్నాయి. ప్రతి సెంటర్లలో 20 నుంచి 30 మంది పిల్లలు ఉండగా ఇద్దరు లేదా ముగ్గరు కంటే ఎక్కువ చిన్నారులు కనబడటం లేదు. మద్నూర్ మండలంలోని సోనాల, తడిహిప్పర్గా, డోంగ్లీ మండలంలోని లింబుర్, డోంగ్లీలోని అంగన్వాడీ కేంద్రాలకు శనివారం చిన్నారులు రాలేదు. డోంగ్లీ మండల కేంద్రంలోని మొదటి సెంటర్లో ఒక్కరు రాకపోవడంతో టీచర్ ఒక్కరే ఉన్నారు. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కేంద్రాలకు పంపించేలా చూడాల్సిన బాధ్యతను, అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి సరుకులు ఉన్నాయా .. పిల్లలు వస్తున్నారా.. కేంద్రాల్లో మెనూ అమలు చేస్తున్నారా అని పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు !
మీకు తెలుసా.. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేట పరిధిలోని మఠంరాళ్ల తండాలో ఆదిమానవుల ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అందరినీ అబ్బురపరుస్తున్నాయి. గుహలో రాళ్లపై ఎరుపురంగులో చిత్రాలున్నాయి. ఈ తండా వాసి, కాకతీయ యూని వర్సిటీ పరిశోధక విద్యార్థి లింగం, మరో పరిశోధక విద్యార్థి జైనథ్కుమార్ ఈ రాతి చిత్రాలను చూసి బయటి ప్రపంచానికి పరిచయం చే శారు. అంతకుముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడైన కేపీఆర్ ఆ గుహ ను సందర్శించారు. గుహలో ఉన్న రాతిపనిము ట్లు, చిత్రాలను ఫోటోలు తీసుకువెళ్లారని స్థాని కులు తెలిపారు. అనంతరం కొత్త తెలంగాణ చ రిత్ర బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, సహాయకుడు నాగరాజుతోపాటు కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ లు ఆదిమానవులు వాడిన పాత రాతి యుగపు పనిముట్లను పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఆదిమానవుల కాలం నాటి ఆనవాళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. శనివారం టేక్రియాల్లో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. టేక్రియాల్లో నందివాడ సాయిలు, సుంకరి సాయిలు, రాయల సాయి కుటుంబాలను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న, చెవిటి భాస్కర్, సుంకరి బిందులతో మాట్లాడారు. ఈ ఐడు కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఆలయానికి రూ. 50వేల విరాళం టేక్రియాల్లోని హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ. 50వేల విరాళాన్ని అందజేశారు. కా ర్యక్రమంలో నాయకులు శంకర్రావు, రవి, శ్రీనివా స్, సుధాకర్, సాయిబాబా, సలీం, వంశీ, రమేష్, ఆంజనేయులు, తదితరులున్నారు. -
ప్లాస్టిక్ వాడకం, క్యాన్సర్కు కారకం
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● ఎల్లారెడ్డిలో స్వచ్ఛత ర్యాలీ ఎల్లారెడ్డి: ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్కు కారకమవుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్లో వసతులను బస్సులోని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ఆవరణలో టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అనంతరం మార్కెట్లో గాజు గ్లాసులో టీ విక్రయిస్తున్న నిర్వాహకులు ఇస్మాయిల్ను శాలువాతో సన్మానించి, గాజు గ్లాసులో టీ తాగారు. కూరగాయల మార్కెట్కు జూట్ బ్యాగులతో వచ్చిన వారికి, మటన్ మార్కెట్కు టిఫిన్ బాక్సులను తీసుకుని వచ్చిన వారికి శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తినే పదార్ధాలు ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని వెళ్లడంతో టీని ప్లాస్టిక్ గ్లాసులలో తాగడంతో క్యాన్సర్ కారక కణాలు శరీరంలో వృద్ధి చెందుతాయన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మశ్రీకాంత్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, వినోద్గౌడ్, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఆరీఫ్, విద్యాసాగర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్మీడియా కోఆర్డినేటర్గా మహేందర్ ఎల్లారెడ్డిరూరల్:ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నిజ్జన మహేందర్ను నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు శనివారం తెలిపారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియామక పత్రాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు శనివారం మహేందర్కు అందించినట్లు వారు తెలిపారు. అన్ని గ్రామాల అభివృద్ధే ధ్యేయం గాంధారి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు ఉండేలా సమగ్ర అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు.హేమ్లానాయక్ తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి, ఎక్కకుంట తండాలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి, సర్వాపూర్, పిష్కిల్ గుట్ట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేట్సంగెం, గుర్జాల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సహకార సంఘం గోడౌన్లను, పోతంగల్ కలాన్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ముదెల్లి, సీతాయిపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ డీఏలు, పదవివిరమణ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులలో 2010 కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. నూతన జిల్లా కమిటీ ఎన్నిక ఎస్టీయూటీఎస్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంట రాములు, ప్రధాన కార్యదర్శిగా పంపరి ప్రవీణ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీమోద్దిన్, ఉపాధ్యక్షులుగా పందిరి రాజేష్, రిజ్వానా ఆఫ్రిన్, కార్యదర్శిగా రాజు, రఫల్ సుల్తానా, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్, రాజేందర్, రాష్ట్ర కౌన్సిలర్గా దయానంద్లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సాబేర్ అలీ, గజేందర్, మండలాల నాయకులు పాల్గొన్నారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీ
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో పలు ఏజెన్సీ దుకాణాలను శనివారం తూనికల, కొలతల అధికారులు స్పందించారు. తూకం.. మోసం శీర్షికన శనివారం ప్రచురితమైన కథానానికి అధికారులు పలు దుకాణాల్లో తూకం చేసే యంత్రాలు, ఆయిల్ డబ్బాలు, బియ్యం సంచులను పరిశీలించారు. తూకాల్లో ఎలాంటి మోసాలకు తావివొద్దని, మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి టౌన్: ఈనెల 26, 27వ తేదీలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాలుగోవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండవ రోజు ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆశాలకు రూ. 18వేలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాం కల్పించాలన్నారు. 26 న జరిగే బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీ, మమత, భాగ్యలక్ష్మి, పల్లవి, కవిత, లలిత, గంగమణి తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్దేవ్ పల్లిలో ధాన్యం విక్రయం కాక పోవడంతో కల్లాలకే ధాన్యం పరిమితం అయ్యాయి. ఎండ బెట్టినా కూడా వాతావరణం అనుకూలించక పోవడంతో మాయిశ్చర్ రాక ముందే కుప్పలుగా చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు వాతావరణం అనుకూలించక మరో పక్క రైస్ మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
హడలెత్తిస్తున్న వాన
సదాశివనగర్/నిజాంసాగర్/పిట్లం : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బందులు పడ్డారు. సదాశివనగర్ మండల కేంద్రంతోపాటు తిర్మన్పల్లి, మర్కల్, కుప్రియాల్, ధర్మారావ్పేట్ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో వర్షం కురవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. సదాశివనగర్ మండలం మోడెగాంలో వర్షానికి కొట్టుకు పోయిన వడ్లు -
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాన్సువాడ : పోషకాహార లోపం ఉన్న పిల్లలను గు ర్తించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడ మే షోషణ మాస లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసా య సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ రెడ్డి సంఘంలో నిర్వహించిన పోషక మాసం కార్యక్రమానికి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి పోచారం హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాంటే కు టుంబంలోని మహిళ పాత్ర ప్రత్యేకమని అన్నారు. గర్భిణుల పోషణ స్థితిని మెరుగుపర్చాలని, అప్పు డే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నా రు. రక్తహీనత సమస్య తలెత్తకుండా మహిళలు పౌ ష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంత రం గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. రెడ్డి సంఘం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పో చారం పరిశీలించారు. పీడీ ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్భాస్కర్, సీడీపీవో సౌభా గ్య, కాంగ్రెస్ నాయకులు జంగం గంగాధర్, పిట్ల శ్రీధర్, నార్ల సురేశ్, ఎజాస్, అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు బాన్సువాడ: బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులను వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్త తీవ్రగాయాలపాలైన ఘటన బీర్కూర్ మండలం రైతునగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన మోత్కూర్ సాయాగౌడ్, శకుంతల(50) భార్యభర్తలు. బీర్కూర్ మండలం కిష్టాపూర్లో వారి బంధువు చనిపోతే అంత్యక్రియలకు ఎక్స్ఎల్ వాహనంపై బయలుదేరారు. మిర్జాపూర్ మీదుగా రైతునగర్ నుంచి కిష్టాపూర్కు వెళ్లే దారిలో రైతునగర్ వద్ద మలుపు దాటుతుండగా ఎదురుగా పొతంగల్ నుంచి బాన్సువాడ మార్కెట్కు వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నది. దీంతో సాయాగౌడ్కు, శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి స్థానికులు తరలిస్తుండగా మార్గమధ్యలో శకుంతల మృతి చెందింది. సాయాగౌడ్కు రెండు కాళ్లు విరగడంతో బాన్సువాడ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తరలించారు. ప్రస్తుతం సాయాగౌడ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు. -
ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఏడాది జైలు
బాల్కొండ: ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి ఏడాది జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేంద్ర గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మగల్లీకి చెందిన బండి నరేంద్ర 2025 ఏప్రిల్ 24న మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించాడు. దీంతో అతనిపై పోలీస్ కేసు నమోదైంది. నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానాను విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూసెన్స్ కేసులో ఒకరికి నాలుగు రోజులు..ధర్పల్లి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తికి జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతాయిపేట్కు చెందిన భానుచందర్ రెండు రోజుల క్రితం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి తాను నివాసం ఉండే కాలనీలో న్యూసెన్స్ చేశాడు. దీంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి ఆధారాలను పరిశీలించి భానుచందర్కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు తెలిపారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఆర్డీవో సురేందర్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లోని మహిళాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి, రైతుల్లో నమ్మకాన్ని పెంచాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీ్త్రనిధి రుణాలతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలను లక్ష్యం మేరకు మహిళా సంఘాల సభ్యులకు అందించాలన్నారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, డీపీఎం సాయిలు, ఏపీఎం రాంనారాయణగౌడ్, అకౌంటెంట్ రాజుతోపాటు సీసీలు పాల్గొన్నారు. బీబీపేట: బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని, తద్వారా సొసైటీకి, బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారని నాబార్డు డీడీఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో‘అంతర్జాతీయ సహకార సంవత్సరం కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన సహకార బ్యాంకు, నాబార్డ్ గురించి రైతులకు అవసరమైన సూచనలు, లోన్లు విషయంలో అవగాహన కల్పించారు. ఎన్డీసీసీ బ్యాంకు సీఈవో వందే నాగభూషణం, డీజీఎం లింబాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, సెక్రెటరీ నర్సాగౌడ్, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని బాన్సువాడ డీఎల్పీవో ప్రసాదరావు అన్నారు. గురువారం ఆయన బోర్లం గ్రామం షమానగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎంపీడీవో ఆనంద్తో కలిసి భూమిపూజ చేశారు. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు 5 విడతల్లో రూ.లక్ష చొప్పున రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఇంకా పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: రైలు నుంచి కిందపడి గుర్తు తెలియని ఒకరు(25) మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి గురువారం తెలిపారు. వివరాలు.. భిక్కనూరు–తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య ఒకరు గుర్తు తెలియని రైలు నుంచి కింద పడి మృతి చెందాడు. మృతుడి కుడి చేతిపై మోకిట్ ఏకే అనే పచ్చబొట్టు ఇంగ్లిష్లో రాసి ఉంది. మృతుడి వద్ద ఖమ్మం నుంచి లక్నో వరకు టిక్కెట్లు ఉన్నాయి. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658616 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఖలీల్వాడి: పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని డీఈవో అశోక్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13వ తేదీ లోపు హెచ్ఎంలకు చెల్లించాలన్నారు. హెచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లించి విద్యార్థుల డాటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూర్కు చెందిన దాకమొల్లి సంగయ్య, ఎల్లవ్వకు ఇద్దరు కుమారులు నాగరాజు, కుమార్(18) ఉన్నారు. పెద్దకుమారుడైన నాగరాజు హైదరాబాద్లో ఉంటుండగా చిన్నాకుమారుడు కుమార్ గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
సాక్షి నెట్వర్క్ :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పలుచోట్ల గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్ను ఎలా అదుపు చేయాలి.. డ్రగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతున్నారనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు అమరుల ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం పోలీసు కళాబృందం సభ్యులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. అలాగే నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో పోలీస్ సిబ్బందికి ‘పనిప్రదేశంలో లింగ వివక్షత’అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. -
ప్రతిరోజు వ్యాయామం చేయించాలి
బాన్సువాడ రూరల్: శారీరక వికలాంగులైన విద్యార్థులకు ప్రతిరోజు తల్లిదండ్రులు బాధ్యతగా భావించి వ్యాయామం చేయించాలని బాన్సువాడ మండ ల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. గు రువారం ఆయన బాన్సువాడ లోని భవిత కేంద్రంలో కొనసాగిన ఫిజియోథెరపీ శిబిరాన్ని సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులను ప్రతినెలా డాక్టర్ను చూపించి మందులు వేయాలన్నారు. చదువుకు వైకల్యం అడ్డు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం భవిత సెంటర్లు నెలకొల్పిందన్నారు. రిసోర్స్ టీచర్స్ వెంకట పద్మ, అందె అనిల్, మంద ప్రవీణ్, ఫిజి యోథెరపిస్టు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొత్తాబాది దర్గా వద్ద ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హజ్రత్ సోఫి సయ్యద్షా, మొహ్మద్ అయినోద్దీన్ దర్గా ఉర్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు సయ్యద్ షా మహ్మద్ యూసుఫుద్దీన్ కోరారు. ఈ నెల 25న గంధం ఊరేగింపు, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుందన్నారు. ఆదివారం దీపారాధన, మహిఫిలే సమజల్స–ఏ–ఔలియా ఖవ్వాలీ, 26న తక్మీమ్–ఏ తబరుకాత్ సాయంత్రం తిలావతే ఖురానేపాక్, ఫాతేహా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. భిక్కనూరు: కామారెడ్డి–రామాయంపేట మధ్య బస్సు ట్రిప్పుల సంఖ్యను పునరుద్ధరించినట్లు కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రుంలో కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అందె దయాకర్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, తదితరులులు విలేకరులతో మాట్లాడుతూ.. పదిరోజులుగా కామారెడ్డి–రామాయంపేట మధ్య బ స్సు ట్రిప్పుల సంఖ్యను తగ్గించారని, ఈ విషయ మై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి విన్నవించగా ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, బస్సుల సంఖ్యను పునరుద్ధరింపజేశారన్నారు. కాంగ్రెస్ నేతలు విజయకుమార్గౌడ్, మైపాల్రెడ్డి, దుంపల మోహన్రెడ్డి, నీల అంజయ్య, చీకోటి ప్రభాకర్,జనార్దన్రెడ్డి తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపికలను పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించగా క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్ ప్రారంభించారు. 150 బాలికలు, 178 మంది బాలురు మొత్తం 328 మంది పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మంది బాలురు, 20 మంది బాలికలను రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారికి ఈనెల 25 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనిల్, అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, కోశాధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధిక పంట దిగుబడికి డ్రోన్లను వినియోగించాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఆధునిక టెక్నాలజీ డ్రోన్లను వినియోగించుకోవాలని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్ శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావులు సూచించారు. మొదటగా మండల కేంద్రంలో వంగిటి రాజు(రైతు) పంటలో గాయత్రి ఎయిరో సిస్టమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గాయత్రి షుగర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధునాతన సాంకేతికతో డ్రోన్లను తయారు చేశామన్నారు. డీజీసీఏ అనుమతితో రూ.7లక్షల 50వేల విలువ గల డ్రోన్ రూ.లక్ష సబ్సిడీ ఇస్తూ.. ఇన్సూరెన్స్తో పాటు రూ.6లక్షల 50వేలకు అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో రోజుకు 30 నుంచి 32 ఎకరాల పంటకు స్ప్రే చేయవచ్చని సూచించారు. డ్రోన్లు కావల్సిన రైతులు గాయత్రి షుగర్స్లో సంప్రదించాలని, లేకుంటే ఫీల్డ్ మెన్లను సంప్రదించాలని సూచించారు. చెరుకు సాగుకు రైతులకు అనేక రాయితీలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైలట్కు ఉచితంగా శిక్షణను కూడా ఇస్తామన్నారు. మార్కెటింగ్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, ఏవో రమేశ్, విండో చైర్మన్ కమలాకర్ రావు, రైతులు పాల్గొన్నారు. -
పంట ఆరబోసేందుకు ఇబ్బందులు
● టార్పాలిన్లు లేక కష్టాలు పడుతున్న అన్నదాతలు ● అద్దెకు తెచ్చుకోవడంతో అదనపు భారం దోమకొండ: గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కో రైతుపై కనీసం రూ.2 వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంటను అరబెట్టుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై వాటిని సరఫరా చేసింది. కాని నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో.. రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తూ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయశాఖ 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్లను జిల్లా వ్యాప్తంగా అందజేసింది. రైతన్నలకు అదనపు ఖర్చు.. జిల్లాలో ఈ సారి 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో సహకార సంఘాల ద్వారా 233, ఐకేపీ ఆధ్వర్యంలో మరో 194 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 5.90 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇస్తున్నారు. రైతులు ఒక్కోదానికి రోజూ రూ 60 నుంచి రూ.80 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి గాను రైతుకు కనీసం 6 నుంచి 10 టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. వాటిపై ప్రతి రైతుకు రూ.5 వేల వరకు భారం పడుతోంది. మాకు 20 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ప్రతి ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దె కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే నమస్యల్లో కూరుకుపోయిన రైతులకు ఇది అదనపు భారం అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులకు సబ్సిడీపై వీటిని అందించాలి. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బోరెడ్డి నాగరాజ్రెడ్డి, రైతు, దోమకొండ -
విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం
బాన్సువాడ రూరల్: విద్యార్థులతో కలిసి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి గురువారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈనెల 14న నియోజకవర్గ పర్యటన నిమిత్తం బయలుదేరిన ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గుంపులుగా బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థులను గమనించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోవడంతో వెంటనే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించారు. బస్సు సౌకర్యం ప్రారంభం కాగా గురువారం ఆకస్మికంగా బస్టాండ్ చేరుకుని విద్యార్థులతో కలిసి కళాశాల వరకు బస్సులో ప్రయాణించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. బస్సు సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని డిపో మేనేజర్ రవికుమార్ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు పాల్గొన్నారు. -
మేన బావతో వివాహం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.మేన బావతో 2012లో వివాహం..కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్పై పెద్దగుట్ట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు. -
ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● అంకోల్తండా హత్య కేసును ఛేదించిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్రకామారెడ్డి క్రైం: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన రాధీబాయి (67)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారంతా పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రాధీబాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఎదురు ఇంట్లో ఉండే సవాయిసింగ్ చాలా రోజులుగా మద్యం, పేకాట, ఇతర వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గతంలో అతనిపై పలు దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ నెల 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధీబాయిపై సవాయి సింగ్ గొడ్డలి కామతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న 30 తులాల వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యే క్రమంలో పక్క ఇంట్లో ఉండే లక్ష్మీబాయి చూసింది. మృతురాలి చిన్న కొడుకు లాల్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని తక్కువ సమయంలో పట్టుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై రాఘవేంద్ర, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
1,449 దరఖాస్తులు..
కామారెడ్డి రూరల్: జిల్లాలోని మద్యం దుకాణాలకు బుధవారం 5 దరఖాస్తులు అందినట్లు ఎక్సై జ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 1,449 దరఖాస్తులు అందాయన్నారు. కామారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు గాను 450 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 226, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 245, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 307, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 221 దరఖాస్తులు అందినట్లు వివరించారు. గురువారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తిగల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ కోరారు. 27వ తేదీన కామారెడ్డి పట్టణంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. -
ప్రధాన కారణాలివే..!
జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, గౌడ కులస్తులకు 7, ఓపెన్ కేటగిరి కింద 35 వైన్షాపులను కేటాయించారు. దుకాణాల నిర్వహణకు అయ్యే ఖర్చు రోజురోజుకి పెరుగుతుండగా లాభం తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. తమకు మొదటి రూ.2 కోట్ల అమ్మకాలపై ప్రభుత్వం నుంచి 12 శాతం లాభాన్ని ఇస్తారని.. రూ.2 కోట్ల విక్రయాల తర్వాత ఇచ్చే కమిషన్ అమాంతం 4 శాతానికి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు ఎక్కువగా ఉండే వైన్షాపులకు రూ.2 కోట్ల వ్యాపారం మొదటి 3 నుంచి 4 నెలల్లోలే పూర్తవుతుంది. కానీ ఖర్చులు ఎప్పటికీ ఉండేవే. దీంతో ఖర్చులు ఎక్కువ.. లాభం తక్కువ అనే భావన వ్యాపారుల్లో పెరుగుతోంది. దీనికి తోడు దరఖాస్తు రుసుమును ప్రభుత్వం ఈ సారి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. -
పరీక్షల వేళ శిక్షణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణ, సమావేశాల పేరుతో చాలా స్కూళ్లలో బోధన కుంటుపడింది. సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)–1 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుండగా, చాలా చోట్ల ఆయా సబ్జెక్టులకు సంబంధించి పోర్షన్ పూర్తి కాలేదు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎస్ఏ–1 పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే పరీక్షలు ప్రారంభం కానున్న శుక్రవారం రోజు నుంచే ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లకు ఎక్స్పరిమెంటల్ లర్నింగ్ మెథడాలజీస్పై ఐదు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సహకారంతో ఈ నెల 24 నుంచి ఐదు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సాయంతో ప్రైవేట్ కాలేజీలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆఖరుకు ట్రైనింగ్కు హాజరయ్యే ఉపాధ్యాయులకు వారే లంచ్ ఏర్పాట్లు చేసుకోవాలంటూ మెసేజ్లు చేశారు. మరి కార్పొరేట్ సంస్థ ఇచ్చే ఆర్థిక సాయం ఎవరి జేబుల్లోకి వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన డిప్యుటేషన్లతో జిల్లా విద్యాశాఖ చేస్తున్న అవినీతి గురించి ఉపాధ్యాయులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే చాలా మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీలల్లో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్ తదితర మండలాలకు వెళ్లారు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా మంది టీచర్లు కార్లలోనే ప్రయాణం చేస్తుంటారు. కారుకు అయ్యే ఖర్చు వేలల్లో ఉంటోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని జిల్లా కేంద్రానికి సమీపంలోని బడులకు డిప్యుటేషన్పై వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ డిప్యుటేషన్లకు తెరలేపారు. ఈ విషయంలో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపితే ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో శిక్షణలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అధికారులకే తెలియాలి.విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు శిక్షణకు వెళ్తే పరీక్షలు ఎవరు నిర్వహించాలో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేక బోధన సరిగా సాగడం లేదు. ఉన్న చోట ఉపాధ్యాయులకు రకరకాల పనులు నెత్తిన పెట్టడంతో పోర్షన్ పూర్తి కావడం లేదు. కనీసం పరీక్షలు ఉంటాయన్న సోయి లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడే ట్రైనింగ్కు వెళితే ఎవరు నిర్వహించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మంచి బోధన అందించాలని ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించే పరిస్థితులు లేకపోగా, పరీక్షల సమయంలోనైనా టీచర్లు బడుల్లో ఉండకుండా ట్రైనింగ్ల పేరుతో వారిని పంపించడం తగదని పలువురు పేర్కొంటున్నారు. రేపటి నుంచే ఎస్ఏ – 1 పరీక్షలు ఇదే సమయంలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తో ఆటలు -
ఆర్టీఏ చెక్పోస్టుల ఎత్తివేత
మద్నూర్/భిక్కనూర్ : జిల్లాలోని సలాబత్పూర్, జంగంపల్లి వద్ద కొనసాగిన ఆర్టీఏ చెక్పోస్టులను ఎత్తివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 5గంటలకు చెక్పోస్టులను మూసివేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్పూర్తోపాటు భిక్కనూర్ మండలం జంగంపల్లి శివార్లలో రవాణాశాఖకు సంబంధించి చెక్పోస్టు కార్యకలాపాలు కొనసాగవు. చెక్పోస్టుల్లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, రిజిస్టర్లతోపాటు ఇతర సామగ్రిని జిల్లా కేంద్రానికి తరలించారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్.. రాష్ట్రంలోని రవాణశాఖ చెక్పోస్ట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెక్పోస్ట్ల స్థానంలో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఏఎన్పీఆర్) విధానం తీసుకువస్తున్నారు. ఏఎన్పీఆర్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ సిస్టమ్ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. ఏ వాహనమైనా కెమెరా కన్నుకప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహన యాజమానుల అసోషియేషన్కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్తోపాటు సరుకు రవాణా వాహనాల పర్మిట్లు మిగిలిన అనుమతులన్ని ముందే ఆన్లైన్లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సలాబత్పూర్, జంగంపల్లి శివార్లలో మూసివేత కార్యాలయాలకు తాళాలు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రిపోర్ట్ చేసిన అధికారులు -
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. మండలంలోని నందివాడలో బుధవా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ మా ర్కింగ్ చేశారు. నందివాడ గ్రామానికి 24 ఇళ్లు మంజూరు కాగా అందులో 13 మా త్రమే మార్కింగ్ చేశారన్నారు. స్లాబ్ లెవల్ లో ఒకటి ఉండగా, బేస్మెంట్ లెవల్లో నాలుగు ఉన్నాయని, మరో నాలుగు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. మూడు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, వాటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి సకాంలో బిల్లులు అందేలా చూస్తామన్నారు. పీడీ విజయసా యిరెడ్డి, డీఈ సుభాష్రెడ్డి, ఎంపీడీవో స య్యద్ సాజీద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవితారెడ్డి, ఏఈ శ్రీనివాస్, గ్రామపెద్ద లు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఎన్కౌంటర్ విచారణ అధికారిగా ఎల్లారెడ్డి డీఎస్పీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసు శాఖ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించింది. బుధవారం డీఎస్పీ శ్రీనివాసరావు నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చి విచారణ నిర్వహించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై పౌరసంఘాలు స్పందించడం, మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ పక్క జిల్లా డీఎస్పీ ద్వారా విచారణ చేయిస్తోంది.బాన్సువాడ: పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ బుధవారం పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలోని సమస్యలను తెలుసుకున్నారు. తేమశాతాన్ని పరీక్షించే యంత్రాలతోపాటు ప్యాడి క్లీనర్లను సరఫరా చేస్తామన్నారు. పెద్ద డ్రైయర్ల సరఫరా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఎండీ పేర్కొన్నారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీవో సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రామ్మోహన్, సివిల్ సప్లయీస్ జిల్లా అఽ దికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ , పీఎసీఎస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ , రైతులు, సొసైటీల సెక్రెటరీలు, రైతులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్రెడ్డి, విజయరామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టాంకాం) ద్వారా జర్మనీ దేశంలో ఆరోగ్య సంరక్షణ ఉ ద్యోగాల కోసం 18 నుంచి 28 ఏళ్లలోపు వారి నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు కో రుతున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో 3 ఏళ్ల నర్సింగ్ ఇంటర్నేషనల్ డిగ్రీని పొందడంతో పాటు నెలకు రూ.లక్ష స్కాలర్షిప్ అందిస్తారని, కోర్సు అనంతరం నెలకు రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్లో కనీసం 60 శా తం మార్కులతో పాసైన వారికి హైదరాబా ద్లో 9 నెలల పాటు జర్మనీ భాషలో రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 63022 92450, 94400 51763 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. -
రైతులకు తక్కువ ధరకే డ్రోన్ స్ప్రేయర్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చెరుకు రైతుల సంక్షేమమే గాయత్రి షుగర్స్ లక్ష్యమని, రూ.7.50 లక్షల విలువ చేసే డ్రోన్ స్ప్రేయర్ను రూ.లక్షకే అందజేస్తున్నా మని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, శంకర్రావు అన్నారు. గాయత్రి ఏఈఆర్వో ఆధ్వర్యంలో తయారు చేసిన డ్రోన్తో పురుగు మందు పిచికారీ చేసే విధానంపై బుధవారం మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నూతన సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కామారెడ్డి, నిజాంసాగర్ గాయత్రీ షుగర్స్ పరిధిలో గల చెరుకు రైతుల అభివృద్ధి కోసం రైతు పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. స్ప్రేయర్ కొనుగోలు చేసిన రైతుకు ఒక బ్యాటరీ సెట్, చార్జర్తోపాటు డ్రోన్ నడిపే శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు రైతులకు బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. చెరుకు నాటిన రైతులకు రూ.9,437 విలువగల చెరుకు విత్తనం 2 టన్నుల 50 కిలోలను ఉచితంగా అందజేస్తుందన్నారు. గాయత్రి షుగర్స్ ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్, గాయత్రి షుగర్స్ ఫీల్డ్ మెన్లు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడీకోటలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్గౌడ్, ఎస్సై స్రవంతి, ఎంపీడీవో ప్రవీ ణ్కుమార్ తదితరులు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. అండర్– 14 ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో భువన్, ప్రణీత్, అంకుల్, అండర్ –14 బాలికల విభాగంలో లాస్య, స్నేహ, రమ్య, అండర్– 17 బాలుర విభాగంలో శ్రీశాంత్, రేహాన్, రామ్చరణ్, బాలికల విభాగంలో ప్రీతి, శ్రీవర్చన, సహస్ర, అండర్–10 విభాగంలో వర్షిత, అండర్–19 బాలుర విభాగంలో రాజేందర్, దీక్షిత్, రిత్విక్, బాలికల విభాగంలో అమూల్య, సుమిత్ర, అశ్విని, రికరు అండర్–14 బాలుర విభాగంలో రుత్విక్, స్నేహిత్, బాలికల విభాగంలో వర్షిణి, నక్షత్ర, నైనిక, అండర్ 17 విభాగంలో ఇందు, సుమంత్, కాంపౌండ్ విభాగంలో కృష్ణసాయి తదితరులు ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, పీడీ నరసింహారెడ్డి, అర్చరీ అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరె మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కుక్కను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
● ఒకరి మృతి బోధన్రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పింబోయిన ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వెండి లక్ష్మణ్(37) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం పొలంలో కోసిన వడ్లను ట్రాక్టర్ ద్వారా రైస్మిల్కు తరలిస్తుండగా గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను త ప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో లక్ష్మణ్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కు టుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యుత్షాక్తో రైతు ..ఎల్లారెడ్డిరూరల్: వ్యవసాయ పొలంలో చెడిపోయిన బోరుబావి స్టాటర్ డబ్బాను రిపేర్ చేస్తుండగా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృత్రావు(48) అనే రైతు విద్యుత్షాక్తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అమృత్రావు పొలం పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. బుధవారం తన వ్యవసాయ పొలంలో బోరుబావి మోటరు పనిచేయకపోవడంతో స్టాటర్ డబ్బాను విప్పి రిపేరు చేస్తున్నా డు. ఈ క్రమంలో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ..తాడ్వాయి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తాడ్వాయి ఎస్సై న రేశ్ తెలిపారు.వివరాలిలా ఉన్నాయి.మండలంలోని సోమావారం తండాకు చెందిన భూక్య కమిలి(32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తితో ఈనెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫారెస్ట్ అధికారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
రాజంపేట: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అకారణంగా తమను వేధింపులకు గురిచేస్తున్నాడంటు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజంపేట మండలం శేర్శంకర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన కాట్రోత్ సుభాష్ అనే వ్యక్తిని గతేడాది ఓ కేసు విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ బాబా అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతేకాకుండా కేసు విషయంలో ట్రాక్టర్ను సైతం కోర్టులో హాజరుపర్చినట్లు సుభాష్ పేర్కొన్నాడు. బుధవారం తిరిగి సెక్షన్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్ను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా సుభాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. గమనించిన కుటుంబీకులు కామారెడ్డి ఆస్పత్రికి త రలించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో రమేశ్ను ‘సా క్షి’ వివరణ కోరగా గతంలో ఉన్న కేసులో భాగంగానే అధికారులు సుభాశ్ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకోడానికి ఇంటికి వద్దకు వెళ్లారని తెలిపారు. -
స్టడీ అవర్స్ పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ను ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు వారి ప్రతిభను గమనించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ధీటుగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర పరీక్షలకు కావాల్సిన సిలబస్ను ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ బోర్డు ద్వారా మంజూరైన రూ.16 లక్షల నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. బాన్సువాడరూరల్: పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోందని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం తాడ్కోల్ గ్రామ పంచాయతీలో అధికారులు, లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంజూరు వచ్చాక కూడా పనులు ప్రారంభించకపోవడానికి కారణాలను అడిగి తెల్సుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు జీఎస్టీ మినహాయించి రూ.4 లక్షలే బిల్లు ఇవ్వగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందన్నారు. డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు అదనంగా రూ.లక్ష బ్యాంకు రుణం మంజూరు చేయిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే విడతల వారీగా బిల్లులు చెల్లింపు చేస్తున్నామన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇండ్లకు భూమిపూజ చేశారు. నేతలు మధుసూదన్రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగారాం, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సూపరింటెండెంట్ ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద: తనపై అకారణంగా దాడి చేశాడంటు బిచ్కుంద ఎన్డీసీసీబీ మేనేజర్ త్రిశుల్పై పబ్బత్ తుకారాం అనే రైతు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన రైతు తుకారాం స్థానిక ఎన్డీసీసీబీలో ఏడేళ్ల క్రితం రుణం తీసుకున్నాడు. తాను తీసుకున్న లోన్ డబ్బులు కొంత తిరిగి ఇచ్చానని, మిగతా దానికి సమయం ఇవ్వాలని కోరినా బ్యాంక్ మేనేజర్ వినిపించుకోకుండా మంగళవారం జరిగిన వాగ్వాదంలో తనపై దాడి చేశాడని ఆరోపించాడు. తాను ఇంట్లో లేని సమయంలో మహిళలను దూషించాడని రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ను వివరణ కోరగా తాను మహిళలను దూషించలేదని తుకారాం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
పన్ను వసూలు వేగవంతం చేయండి
● డీపీవో శ్రీనివాస్రావు బోధన్: గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తి, ఇతర పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు వంద శాతం పన్ను వసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధవారం సాలూర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవోలు శ్రీనివాస్, మధుకర్, ఎంపీవో మద్దిలేటి, తహసీల్దార్ శశిభూషణ్తో సమావేశమయ్యారు. పంచాయతీ పాలనకు సంబంధించిన అంశాల పై చర్చించారు. అనంతరం నర్సరీని సందర్శించి నాటిన మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని దళితవాడ వైకుంఠధామంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని సంఘం సభ్యులు వాపోతున్నారు. గోసంగి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో అంత్యక్రియలు నిర్వహించామని వారు వాపోయారు. రోడ్డు సరిగా లేదని, నీటి సౌకర్యం లేదని వారు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని పాలకులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
మూడు నెలలపాటు శిక్షణ● జిల్లాలోని 40 పీఎంశ్రీ బడుల్లో అమలు ● ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు శిక్షణ ఖలీల్వాడి: బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది నవంబర్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజీబీవీ, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమ లు చేయనున్నారు. ఈ బడుల్లో విద్యతో పాటు బాలికలకు కరాటే, జూడో, కుంగ్ఫూ వంటి వాటిని నేర్పిస్తారు. వీటిని నేర్పించడంతోపాటు విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందిస్తారు. గతంలా కాకుండా.. గతంలో పాఠశాలల్లో కరాటే, కుంగ్ఫూ, జూడో వంటి శిక్షణలను ఇష్టారాజ్యంగా నిర్వహించేవారు. విద్యార్థినులకు ప్రత్యేకమైన మెలకువలు నేర్పించాలనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు సమగ్ర శిక్షణ అధికారులు స్వీయరక్షణ కోసం ఇచ్చే మెలకువలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. శిక్షణకు ముందుగా విద్యార్థినులకు కసరత్తులు, స్కిల్ ట్రైనింగ్ తోపాటు వ్యాయామాలు చేయించిన తర్వాతే విద్యార్థినులకు కరాటే, కుంగ్పూ, జూడో వంటి వాటిపై శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 72 తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్లాసులను స్కూళ్లలోని పీఈటీ, పీడీ పర్యవేక్షణలో 45 నిమిషాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. పీఏం శ్రీ కింద ఉన్న పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో, కుంగ్ఫూ వంటి శిక్షణ అందిస్తాం. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో మహిళా శిక్షకులను ఎంపిక చేస్తాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. దీంతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఇవి పీఈటీల పర్యవేక్షణలో కొనసాగుతాయి. నవంబర్లో శిక్షణ ప్రారంభమవుతుంది. – భాగ్యలక్ష్మి, జెండర్ ఈక్విటీ కో–ఆర్డినేటర్, నిజామాబాద్ జిల్లాలో 40 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. వీటిలో చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ విద్య అమలు చేయనున్నారు. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.30 వేల చొప్పు న నిధులు మంజూరయ్యాయి. వారానికి ఆరు సార్లు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. 50 మంది లోపు విద్యార్థినులు ఉంటే రూ.15 వేల వేతనం, 50 కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేల గౌరవ వేతనాన్ని శిక్షకులకు అందించనున్నారు. ఈ శిక్షణ నేర్పించేందుకు అవసరమైన మహిళా శిక్షకురాలను జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. -
నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణం
● బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వరదలతో పంటలు నష్టపోయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా చేపట్టిన అయ్యప్ప ఆలయ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణదశలో ఉన్న ఆలయ వివరాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల రెండు పండుగలు గడిచిపోయినా వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడం విచారకరమన్నారు. వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు హన్మాండ్లు, దేవిసింగ్, రాజు, విష్ణు తదితరులున్నారు. -
అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టం
భిక్కనూరు:దేవాలయాల అభివృద్ధిలో భాగస్వా మ్యం అవడం పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. బుధవారం భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం పునర్నిర్మాణకమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో షబ్బీర్అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు. వీరికి ఆలయం తరపున వేద బ్రాహ్మణులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మలు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మా ట్లాడుతూ..తాను 1992లో భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మండల కేంద్రం నుంచి బీటీరోడ్డు, టీటీడీ కల్యాణం మండపాన్ని నిర్మించానని తెలియజేశారు. తాను మంత్రిగా వైఎస్సార్ హయాంలో ప నిచేసినప్పుడు నియోజకవర్గంలో చాలా ఆలయాలను దూపదీప నైవేద్య పథకంలో చేర్పించానన్నా రు.వేదబ్రాహ్మణులు,పండితుల ఆశీర్వచనాలు దే వుళ్ల ఆశీస్సులతోనే తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు.హైకోర్టు న్యాయవాది పెద్దబచ్చగా రి రాంరెడ్డి సిద్ధరామేశ్వరాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని ఆయనను అభినందించారు. పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నిజాయితీగా పనిచేసి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆలయం అభివృద్ధికి తాను ముందుంటానని రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయం మహంత్ సదాశివ మహంత్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, నేతలు బల్యాల సుదర్శన్, బల్యాల రేఖ, జాంగారి గాలిరెడ్డి, తొగరి సుదర్శన్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, వైస్చైర్మన్ అందె దయాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. షబ్బీర్ తోడ్పాటు అభినందనీయం: ఎంపీ షెట్కార్ షబ్బీర్అలీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కొనియాడారు. నూతన దేవాలయాలను నిర్మించడం కంటే పురాతన దేవాలయాలను అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. సిద్దరామేశ్వరాలయం అభివృద్దికి రూ.5 లక్షలను తన ఎంపీ నిధుఽల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
నేరస్తులకు ముకుతాడు!
● మూడు నెలల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్టు ● నేరాల నియంత్రణకు పోలీసుల చర్యలునేరం చేసి అరెస్టయి బెయిల్పై విడుదలైన కొందరు నేరప్రవృత్తిని మార్చుకోవడం లేదు. జైళ్లకు వెళ్లినా వారు మారడం లేదు. అక్కడ పరిచయమయ్యే నేరస్తులతో కలిసి మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. ఒక్కోసారి చిన్న ఆధారం దొరక్క నేరస్తులను పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారికి ముకుతాడు వేసేందుకు జిల్లా పోలీసు శాఖ పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెక్షన్)ను ప్రయోగిస్తోంది. వారిపై పీడీ యాక్టు నమోదు చేయడం మూలంగా త్వరగా బెయిల్ దొరక్క ఎక్కువ రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. అందుకే పోలీసు ఉన్నతాధికారులు పీడీ యాక్టుకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా దారిదోపిడీలు, దొంగతనాల వంటి కేసుల్లో చిక్కిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించి ముకుతాడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మూడు నెలల కాలంలో ఎనిమిది మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నారు. జిల్లాకు చెందిన వారు ఒకరిద్దరు ఉండగా, మిగతావారు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారున్నారు. జిల్లాలోని లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గారబోయిన శ్రీకాంత్ (29) అంతర్జిల్లా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసుకు చిక్కాడు. లింగంపేటలో అమ్ముల లక్ష్మి అనే మహిళను చంపి ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులో అరెస్టయ్యాడు. దీంతో కలెక్టర్ అనుమతి తీసుకుని పోలీసు శాఖ గత సెప్టెంబర్లో శ్రీకాంత్పై పీడీ యాక్టు నమోదు చేసింది. జైల్లో ఉన్న సదరు నేరస్తుడికి పీడీ యాక్టు నమోదు పత్రాలు అందించారు. అలాగే జాతీయ రహదారులపై దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మారణాయుధాలతో దాడులు చేసి దారిదోపిడీలకు పాల్పడ్డారు. అలాగే ఇళ్లలో దొంగతనాలు, ఇంట్లో ఉన్నవారిపై దాడులు చేసిన కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్కు చెందిన కృష్ణబాబు షిండే (25), మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నామ్దేవ్ (28), వసూర్కు చెందిన రాథోడ్ అజిత్ రమేశ్ (21)పై ఇతర ప్రాంతాల్లో హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. వీరిద్దరు దారిదోపిడీ కేసుల్లో నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జూలై 25న వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థీ ముఠా సభ్యులు నలుగురిపై పీడీ యాక్టు నమోదైంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాకు చెందిన చోండా అలియాస్ కూలీ పవార్ (30), జాకీ గుజ్జియా బోస్లే (27), హరీశ్పవార్ (18), అనురాగ్ రత్నప్ప బోస్లే (50)పై జూలై 7న పీడీ యాక్టు నమోదైంది. వీరు కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో తొమ్మిది దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి ఆయుధాలతో బెదిరించి డబ్బులు, మొబైల్స్, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.పదేపదే నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. పీడీ యాక్టు నమోదైన వారు జైలు జీవితానికే పరిమితం కావాల్సి ఉంటుంది. తరచూ నేరాలకు పాల్పడే వారు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – రాజేశ్ చంద్ర, ఎస్పీ -
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
డీజీపీ పరామర్శ..నిజామాబాద్ అర్బన్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ సోమవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని హస్మికాలనీకి చెందిన రియాజ్కు వాహనాల దొంగతనాలు , చైన్స్నాచింగ్లు చేయడం అలవాటుగా మారింది. అతనిపై 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. పాత కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకున్న తరువాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయిన రియాజ్ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. సారంగపూర్ వద్ద అరెస్టు చేసి రియాజ్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాజ్కు ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని 407 గదిలో చికిత్స అందించారు. అనంతర పరిణామ ఘటనల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పంచనామా, పోస్టుమార్టం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అందించగా మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పకడ్బందీగా వ్యవహరించారు. బాణాసంచా కాల్చి.. షేక్ రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడని తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి ముందు బీజేపీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొందరు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మూడవ టౌన్, ఆర్మూర్ పోలీస్స్టేషన్, ఇతర ఠాణాల్లో పోలీసులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరి కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ రిప్రంజెంటేటివ్లు ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు.పాత నేరస్తుడు రియాజ్ మృతిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు ఫైర్ చేసేందుకు ప్రయత్నం.. ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు హతుడి పై కానిస్టేబుల్ హత్య కేసు, గతంలో 40 పైగా చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాల కేసులు సంచలనం రేపిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన ఆస్పతి ఎదుట, ఠాణాల్లో బాణాసంచా కాల్చి సంబురాలు -
త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం
ఘనంగా దీపావళిదీపావళి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అమావాస్య తిథి సోమవారం మధ్యాహ్నం రాగా పండితులు శుభ ముహూర్తంగా సూచించిన రాత్రి 7.15 గంటల నుంచి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించారు. దీపాల వెలుగులో కళకళలాడాయి. అందరూ కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటూ పటాకుల మోత మోగించారు.నేరప్రవృత్తిని మార్చుకోకుండా తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి ముకుతాడు వేసేందుకు పోలీసుశాఖ పీడీ యాక్ట్ను ప్రయోగిస్తోంది. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. మూడు నెలల కాలంలో జిల్లాలో ఎనిమిది మందిపై జిల్లా పోలీసుశాఖ పీడీ యాక్ట్ నమోదు చేసింది. ఎనిమిది మందిలో జిల్లాకు చెందిన ఇద్దరు నేరగాళ్లు ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజైలులో ఉన్న నేరస్తులకు పీడీ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను అందజేస్తున్న పోలీసు అధికారులు (ఫైల్) -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుడి మృతి.. తట్టుకోలేక ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలో ని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తట్టుకోలేక స్నేహితుడు ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై అంజనే యులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద నర్సింలు (60) సోమవారం గ్రామానికి చెందిన కొమ్మ భాస్కర్తో కలిసి, బైక్పై గ్రామంలోని శ్రీ కృష్ణమందిరానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వా రిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, నర్సింలును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా జంగంపల్లి గ్రామానికి చెందిన హరి భూమయ్య(58), మంగలి పెద్ద నర్సింలు ఇద్దరూ ప్రాణస్నేహితులు. నర్సింలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం హరి భూ మయ్యకు తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. ఈక్రమంలో విపరీతంగా మద్యం తాగి, సో మవారం రాత్రి ఇంటికి వచ్చాడు. మళ్లీ మంగళ వారం ఉదయం కూడా విపరీతంగా మద్యం తాగడంతో భూమయ్యను భా ర్య గౌరవ్వ ప్రశ్నించింది. వెంటనే అతడు పొలం వ ద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంత రం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ మయ్య స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
బార్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్
కామారెడ్డి అర్బన్: తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడిగా కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్ ఎన్నికయ్యారు. నాంపల్లి కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించగా నిజామా బాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయిరెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై న ట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేశ్కు పలువురు అభినందనలు తెలిపారు. మాచారెడ్డి: పాల్వంచ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్ను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా తోట బాల్రాజు, ఉపాధ్యక్షులుగా రమేష్ యాదవ్, నాగయ్య, కోశాధికారిగా శంకర్లను ఎన్నుకున్నారు. ● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ కామారెడ్డి క్రైం: ‘సాక్షి’ దినపత్రికలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు అనే శీర్షికతో ఆదివారం(ఈ నెల 19న) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండలంలో మొత్తం 38 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇంకా రావడం లేదని, 5 కేంద్రాలకు మాత్రమే ధాన్యం కుప్పలు వచ్చాయన్నారు. తేమ శాతం నిబంధనల ప్రకారంగా లేకపోవడంతో రైతులు ధా న్యాన్ని ఆరబెడుతున్నారని తెలిపారు. అందుకే కాంటా ప్రారంభం కాలేదన్నారు. 7 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో గన్నీ బ్యాగులు పంపలేదన్నారు. తొందర్లోనే అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్ శివారులోని ప్రధాన రోడ్డుపై కోతకు గురైన కల్వర్టు మరమ్మతుల పనులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్ ప్రారంభించారు. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కోతకు గురైంది. దాంతో కోమట్పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, రాంపల్లితండా, పొల్కంపేట గ్రామాలతో పాటు మెదక్ వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు కల్వర్టుకు మరమ్మతులు చేసి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నాయకులు సంగయ్య, భైరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక లారీలను సోమవారం పట్టుకున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ధరకు అమ్మడానికి ములుగు జిల్లా, మరొకటి కరీంనగర్ జిల్లాల నుంచి బీబీపేటకు వస్తుండగా, యాడారం రోడ్డులో ఒక లారీని పట్టుకున్నామన్నారు. అలాగే మరోక లారీని పెద్దమ్మ ఆలయం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంతోపాటు గుర్జాల్, మాతుసంగెం, పేట్సంగెంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కల్లాల్లో ధాన్యం తేమ 40 నుంచి 50 శాతం వస్తోందని 17 శాతం తేమ వచ్చేవరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఆయన వెంట గాంధారి విండో ఇన్చార్జి సీఈవో సాయిలు, రైతులు, సిబ్బంది ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని కూనిపూర్ గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గోవూరి సుజాత ఇటీవల ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమచారం అందించింది. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ. 30వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుర్గామాత ఆలయంలో.. వర్ని: మండలంలోని అఫంధి ఫారం గ్రామంలోగల దుర్గామాత ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి నగదుతోపాటు 20 తులాల వెండి, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్ టవర్ ఎక్కిన వృద్ధుడు
భిక్కనూరు: వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించానని కుటుంబ సభ్యులు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇక తనకు చావే శరణ్యమని జంగంపల్లికి చెందిన వృద్ధుడు కర్రోల్ల చిన్న మల్లయ్య మంగళవారం సెల్ టవర్ ఎక్కా డు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని టవర్పై ఉన్న మల్లయ్యతో ఫోన్లో మాట్లాడి సముదాయించడంతో అతడు కిందికు దిగాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తనపై వేడి టీ పోశారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు చావే దిక్కని భావించి సెల్టవర్ ఎక్కానని అన్నాడు. -
ఎస్సారెస్పీకి 878 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్ చరిత్రలోనే మూడో అత్యధిక వరద నీరు వచ్చి రికార్డును నెలకొల్పింది. 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమస్థానంలో ఉండగా, 1988–89లో 912.95 టీఎంసీలతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత సంవత్సరం (2025–26) 878 టీఎంసీల వరద నీరు వచ్చిచేరడంతో మూడో స్థానం సాధించింది. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగు రోజులుగా గోదావరి శాంతించింది. కనిష్టంగా 5464 క్యూసెక్కులకు వరద పడిపోయింది. మళ్లీ కొంత మేర పెరిగి9464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. మరో పక్షం రోజులు గడిస్తే ఖరీఫ్ సీజన్ పంటలకు నీటి సరఫరా నిలిపి వేస్తారు. ఇప్పటి వరకు కాలువల ద్వారా, గోదావరిలోకి మొత్తం 810 టీఎంసీల నీటిని వదిలారు. అధికంగా మహా వరద.. ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో స్థానిక ఎగువ ప్రాంతాల నుంచే అధికంగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రస్తుత సంవత్సరం అధికంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచే వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్లోకి వచ్చిన 878 టీఎంసీల వరదలో 70 శాతం మేర నీరు మహారాష్ట్ర ప్రాంతం నుంచే వచ్చి చేరిందని రికార్డులు తెలుపుతున్నాయి. మరో వారం రోజులు గడిస్తే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడుతాయి. అక్టోబర్ 28న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసి వేస్తారు. కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)తో నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం యాసంగీ సీజన్ ప్రారంభం వరకు కూడ ప్రాజెక్ట్ నిండుకుండల ఉండే అవకాశం ఉంది. -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు ● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ)లో ఉద్యోగ బదిలీలు జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం సిబ్బంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా పలువురు ఏపీఎంలు తమదైన స్థాయిలో పైరవీలు చేయడంతోపాటు, నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే డీఆర్డీవోపై సైతం ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు.. పదేళ్ల తర్వాత సెర్ప్ సీఈవో పారదర్శకంగా బదిలీలు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కొందరు ఇప్పుడు జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఐతే, బదిలీలు జరిగిన తర్వాత మళ్లీ ఈ డిప్యుటేషన్లు ఏంటీ అని శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐకేపీలో ఈ ఏడాది ఆగస్టు నెలలో డీపీఎంల నుంచి మొదలుకొని సీసీల దాకా ఉద్యోగ బదిలీలు జరిగాయి. సెర్ప్ సీఈవోనే సీనియార్టీ ప్రకారం జాబితాను జిల్లాకు పంపించి కలెక్టర్ అధ్యక్షతన స్థాన చలనం కలిగించారు. బదిలీలకు ఆప్షన్లు పెట్టుకుని ఇతర మండలాలకు వెళ్లిన ఏపీఎంలు ఇప్పుడు డిప్యుటేషన్లను ఆశించడం వెనక మతలబు ఏంటో తెలియడం లేదు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో డిప్యుటేషన్పై వచ్చి పని చేయడానికి నాలుగురైదుగురు ఏపీఎంలు పోటీ పడుతున్నారు. మండలాల్లో పని చేసే సదరు ఏపీఎంలు జిల్లా స్థాయిలో ఎందుకు పని చేయాలని కోరుకుంటున్నారో అని శాఖలోని ఉద్యోగులు అనుకుంటున్నారు. డిప్యుటేషన్లకు అవకాశం కల్పిస్తే మిగతా ఉద్యోగులు కూడా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని డీఆర్డీవోను కోరుతామంటున్నారు. పైరవీలకు తలొగ్గి డిప్యుటేషన్లు వేస్తారా? లేదా ఫైలును తిరస్కరిస్తారా? అనేది డీఆర్డీవోపై ఆధారపడి ఉందంటున్నారు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగ బదిలీలు చేసినప్పుడు వీటిని భర్తీ చేయలేదు. డిప్యుటేషన్పై జిల్లా ఆఫీసులో పని చేస్తామని కొందరు ఏపీఎంలు దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐతే ఒకరిద్దరు సీసీలకు మాత్రం వారి సమస్యను పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం మ్యూచ్వల్ బదిలీ చేయాలనుకుంటున్నాం. –సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
క్రైం కార్నర్
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని అంకోల్ తండాలో ఓ వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై రాఘవేందర్ తెలిపారు.వివరాలు ఇలా.. తండాకు చెందిన రాధిబాయి(65) సోమ వారం ఇంట్లో ఒక్కరే ఉ న్నారు.ఈక్రమంలో ఆమె ఒంటిపై ఉన్న వెండి నగలను కాజేయడానికి తండా కు చెందిన మెగావత్ సవాయి సింగ్ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి తలుపులు వేసి వృద్ధురాలిపై దాడి చేసి, ఒంటిపై ఉన్న వెండినగలు దోచుకొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో దుండగుడు వారిని ఎవరికై న చెబితే మీ అందరిని చంపుతామని బెదిరించాడు. తలకు తీవ్రగాయమైన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కొడుకు లాల్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు సవాయి సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. వృద్ధురాలి ఆత్మహత్య మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అంగోత్ సోనాబాయి (56) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈనెల 18న కొడుకు శ్రీరామ్ మద్యం తాగవద్దని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనాబా యి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం గ్రామ శివారులోని నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. కు టుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
డీఈవో ఎస్.రాజు కామారెడ్డి టౌన్: విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో ఎస్.రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల ముంగిపు కార్యక్రమానికి డీఈవో హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 64 కళలలో నృత్యానికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. అందులో జానపద నృత్యం గ్రామీణ ప్రజల గుండె చప్పుళ్లను ప్రతిధ్వనిస్తుందన్నారు. ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమారంపేట, ఇసాయిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ నాగవేందర్, న్యాయనిర్ణేతలు వసుధ, మనోహర్, భవాని, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేత గాంధారి జట్టు
కామారెడ్డి అర్బన్:సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్రస్థా యి రెండు రోజుల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ సోమవారం రాత్రి ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి విజేత జట్ల కు బహుమతులు,ట్రోఫీలు అందజేశారు. ప్రథమంగా నిలిచిన గాంధారి జట్టుకు రూ.20వేల నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పిట్లం జట్టుకు రూ.10వేల నగదు, తృతీయ స్థానంలో నిలిచిన తాడ్వాయి జట్టుకు రూ.5వేల న గదు అందజేశారు.పాల్గొన్న క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరేష్, మహేందర్రెడ్డి, గంగాధర్రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, మనోహర్రావు, బాబా, జగదీష్, మురళి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో పేట్సంగెం విద్యార్థిని ప్రతిభ గాంధారి(ఎల్లారెడ్డి): రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అండర్–17 బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లక్ష్మణ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రస్థాయి ఉమ్మడి నిజామాబాద్ జట్టులో జెడ్పీ ఉన్నత పాఠశాల పేట్సంగెం విద్యార్థిని సృజన మంచి ప్రతిభ కనబర్చి నిర్వాహకుల దృష్టిని ఆకర్షించి ప్రశంసా పత్రం అందుకున్నట్లు తెలిపారు. సృజనను పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
దళారులను ఆశ్రయించొద్దు
కామారెడ్డి క్రైం: డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని రవాణా శాఖ జిల్లా అధికా రి శ్రీనివాస్రెడ్డి సూ చించారు. మంగగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించాలన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘సారథి’ అనే వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసేందకు ఎక్కువ సమయం తీసుకుంటోందని, అదొక్క టి మాత్రమే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో రెన్యువల్స్కు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్లాట్ బుకింగ్ త్వరగా అయ్యేలా చూడాలని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గగంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో సోమవారం ఉదయం బైక్పై సామగ్రి కోసం నిజామాబాద్కు బయలుదేరాడు. నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అతడు మూల మలుగుతుండగా, అదేసమయంలో మాధవనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్లక్ష్యపు డ్రైవింగే కారణం! మాధవనగర్కు చెందిన యువకుడితోపాటు మరో ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు, స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ఉన్న నలుగురు పరారయ్యారు. మంగళవారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లభించలేదని తెలిసింది. కాగా యువకుడు మృతికి కారణమైన వారిని కాపాడేందుకు పోలీస్స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని పూలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన అరుణ్ మృతిచెందడంతో కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేడ్చల్లో మాచారెడ్డి మండల వాసి.. మాచారెడ్డి: మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం నెమ్లిగుట్ట తండాకు చెందిన భానోత్ శ్రీనివాస్ (33) మృతిచెందాడు. వివరాలు ఇలా.. శ్రీనివాస్ మేడ్చల్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ మంగళవారం బైక్పై తిరిగి మేడ్చల్ బయలుదేరాడు. మేడ్చల్ సమీపంలో అతడిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కాావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో పడి మహిళ.. ఎల్లారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సాతెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన పసుపుల పద్మ (43) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గ్రామశివారులోని చెరువులో మరుసటి రోజు ఆమె మృతహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమచారాం అందించారు. పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాలకృత్యాల కోసం వెళ్లిన పద్మ చెరువులో జారి పడి ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఫిట్స్తో చిన్నారి.. మోపాల్: మండలకేంద్రంలో ఐదు నెలల చిన్నారి ఫిట్స్తో మృతిచెందినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మండలం, కూర్మల్ గూడ గ్రామం ఇంద్రానగర్ కాలనీకి చెందిన జంగం లక్ష్మీ–శ్రీరాములు దంపతులకు ఐదు నెలల చిన్నారి(సంధ్య) ఉంది. దంపతుల మధ్య గొడవల కారణంగా లక్ష్మీ చిన్నారితోపాటు రెండు నెలల క్రితమే మోపాల్లోని తన అన్న ఇంటికి వచ్చింది. చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో మంగళవారం ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. వారిలో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, చెరువులో పడి ఓ మహిళ, ఫిట్స్తో ఓ చిన్నారి ప్రాణాలు విడిచారు. అలాగే సౌతాఫ్రికాలో భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించారు. -
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్వెల్స్లో పనిచేస్తుండేవాడు. ఏడాదికి రెండు మూడు పర్యాయాలు స్వదేశానికి వెళ్లివస్తుండగా, ఈ ఏడాది జనవరిలో భిక్కనూరుకు వచ్చి ఏప్రిల్లో తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికాలోని జెలిజా పట్టణం సమీపంలో ఓ చెట్టుకు శ్రీనివాస్ వేలాడుతున్నట్లు ఉన్న ఫొటోలను అక్కడి వారు సోమవారం అతడి కుటుంబీకులకు పంపించారు. ఆదివారం కుటుంబీకులతో సంతోషంగా మాట్లాడిన శ్రీనివాస్ సోమవారం వేకువజామున ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో శ్రీనివాస్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రీనివాస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని శుక్రవారం మృతదేహం ఇండియాకు చేరుకుంటుందని తెలుస్తోంది. మృతుడికి తండ్రి బలరాం, తల్లి లావణ్య భార్య నవనీత, కూతురు లాస్య కుమారుడు నిహాల్ ఉన్నారు. -
పత్తి విక్రయించేందుకు స్లాట్ బుక్చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. స్లాట్ బుక్ చేసుకుంటే రైతులు పత్తిని ఏ తేదీన, ఏ మిల్లుకు తీసుకురావాలనే వివరాలు అందులోనే ఉంటాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ లేని, ఫోన్ వాడకం తెలియని రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓటీపీ ద్వారా అధికారులు రైతులకు స్లాట్బుక్ చేసి ఇస్తారని, స్లాట్ బుక్ చేసుకోకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తేమ శాతం 8కి మించకుండా ఉండేలా చూసుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి, రూ.8,110 మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. -
కుక్కల స్వైర విహారం
● వాహనదారులను వెంటాడుతున్న కుక్కలు ● తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు దోమకొండ: గ్రామాల్లో ఎక్కడా చూసినా శునకా లు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించి న వారిని వెంటాడుతున్నాయి. దొరికిన వారిపై దాడి చేస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా పదు ల సంఖ్యలో శునకాలు వీధుల్లో తిరుగుతుండడంతో జనాలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. నిత్యం కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. వీటి సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో కుక్కలు అడ్డు వచ్చి వాటిని తప్పించబోయి గ్రామానికి చెందిన పలువురు ఇటీవల గాయపడ్డారు. స్థానిక పాత పోలీస్స్టేషన్, బీబీపేట రోడ్డులో కుక్కలు ఎక్కువగా రోడ్డుపై అడ్డురాగా, వాటిని తప్పించే క్రమంలో బైక్లు అదుపు తప్పిపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కోళ్ల వ్యర్థాలు.. ముఖ్యంగా మండల కేంద్రంలో చికెన్ దుకాణా ల వద్ద కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. రోడ్ల పక్కనే కోళ్ల వ్యర్థాలు పడేయడటంతో కు క్కలు తిరుగుతున్నాయి. చికెన్ దుకాణదారులు కోళ్ల వ్యర్ధాలను దారుల వెంట వేయడంతో వాటిని తినేందుకు పోట్లాడుకుంటున్నాయి. కోళ్ల వ్యర్థాలను గ్రామానికి దూరంగా వేసేలా, పంచాయతీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన గాంధారి రమేష్ (40) ఈనెల 14న ఉదయం మొక్కజొన్న కొట్టడానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం అతడు ఇంటికి రాగా, కొద్దిసేపటికే మళ్లీ బయటకు వెళ్లాడు. రాత్రయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు తాడ్వాయి బస్టాండ్ దగ్గర అతడు కిందపడి ఉండటంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 18న సాయంత్రం రమేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తవ్వ, కూతుర్లు కీర్తన, శృతి ఉన్నారు. మృతుడి భార్య ముత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. మోపాల్ మండలంలో మహిళ.. మోపాల్: మండలంలోని గుడి తండాలో శనివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన రుదవత్ నీలాబాయి (41), భర్త వామన్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్, తన భార్యతో కలిసి గ్రామంలోనే ఆటో నడుపుకుంటున్నాడు. ఇటీవల వారి కుటుంబంలో కలహాలు నెలకొనగా, శనివారం రాత్రి వామన్, వినోద్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరిని నీలాబాయి సముదాయించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తుడైన వామన్ ఆమె తలపై కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వామన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అంబేడ్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
మాచారెడ్డి: పాల్వంచ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.చంద్రం, అధ్యక్షునిగా ఎం.బాల్ నర్సు, ఉపాధ్యక్షుడిగా జి.నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా శంకర్ బాబు, కోశాధికారిగా సీహెచ్. మైసయ్య, కార్యదర్శిగా డి.రవి, సలహాదారులుగా సీహెచ్ లక్ష్మణ్, నడిపి నర్సింలు, శ్రీను, రమేష్, కార్యవర్గ సభ్యులుగా మల్లేష్, నర్సింలు, రాకేష్, చిన్న నర్సింలు, బాల ఎల్లయ్య, రాజులను ఎన్నుకున్నారు. బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణానికి చెందిన అద్నాన్ నిర్మాతగా పలు భాషల్లో తెరకెక్కుతున్న వాంపర్స్ సాగా చిత్రంలోని పలు సన్నివేశాలను బాన్సువాడ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో చిత్రీకరిస్తున్నారు. మండలంలోని బోర్లంక్యాంపు, తాడ్కోల్ తదితర గ్రామాల్లో శనివారం రాత్రి చిత్ర సన్నివేశాలు తీశారు. హర్రర్ మూవీ కావడంతో రాత్రిపూట శ్మశానవాటిక, ఊడలమర్రి చెట్ల కింద షూటింగ్ తీస్తున్నారు. ఇటీవల చిత్రం టీజర్ విడుదల చేయగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టించిందని చిత్ర నటుడు, దర్శక, నిర్మాత అబ్దుల్ అద్నాన్ పేర్కొన్నారు. సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్, హర్రర్ ఓ స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్ సందర్భంగా సినీతారలు జుబేర్ఖాన్, సనా సుల్తానా, బుష్రా షేక్, చేతన్, హన్స్రాజ్ సందడి చేశారు. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి నిజామాబాద్ నాగారం: రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ఉందని సీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో పౌరహక్కుల సంఘం(సీఎల్సీ) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కుల సంఘం ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం, తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తోందన్నారు. కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లోని హక్కులని, మారణ హోమానికి వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగిస్తోందన్నారు. -
ప్రారంభించిన ఒక రోజుకే దిగబడ్డ లారీ
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. 45 రోజులుగా బస్సులు, లారీల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చొరవతో డైవర్షన్ రోడ్డుకు రూ.కోటి మంజూరు చేయించారు. నెల రోజుల నుంచి డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారు. మొదట వర్షాలు కురియడంతో రోడ్డు పనులు నత్తనడకన కొనసాగాయి. పది రోజులుగా వర్షాలు ఆగిపోయి ఎండలు కొడుతుండటంతో రోడ్డు పనుల్లో వేగం పెంచారు. వాగు మధ్యలో కంకర రోడ్డు వేసి రెండు వరుసల్లో పైపులు వేశారు. పైపులకు ఇరువైపులా మొరం వేసి రోలర్తో తొక్కించి రాకపోకలు పునరుద్ధరించారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి కంకర, రాళ్లు వేయకుండానే కేవలం మొరం వేయడంతో రాకపోకలు పునరుద్ధరించిన ఒక రోజుకే లారీ దిగబడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వంతెనకు ఇరువైపులా మొరం దిగబడుతుండడంతో ఆదివారం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం తిరిగి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఆర్ఈండ్బీఽ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగించే రోడ్డు నాణ్యతగా చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. -
పత్తి రైతు చిత్తు..!
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని వైనం పెద్దకొడప్గల్(జుక్కల్): ఇటీవల నెల రోజుల పా టు నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో మొ త్తం 5 వేల 310 ఎకరాలల్లో పత్తి పంటను రైతులు సాగుచేశారు. ఇది వరకు పత్తి పంటను మూడు,నా లుగు సార్లు తీసేవారు. 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గి ఒకేసారి పత్తిని తీయగానే పత్తి మొక్కలను తొలగించే పరిస్థితి వచ్చింది. దిగుబడి 4 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు తగ్గిపోయింది. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు రూ.25 వేల వరకు ఉండగా ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేల ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు ఉంటుంది. పంట చేనులో ఉన్నదన్నా ఏరుకోవాలంటే కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరింది అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధరలేదు. ఓపెన్ మార్కెట్లో దళారీలదే రాజ్యం నాణ్యత పేరుతో వారు నిర్ణయించిందే ధర. రూ.4,800 నుంచి రూ.5, 200 వరకు ధరకే కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన పత్తి నాణ్యతా ప్రమాణాల ఆంక్షలు లేకుండా రూ.10 వేల కనీస ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నాకున్న మూడు ఎకరాలల్లో పత్తి పంట వేసుకున్నాను. భారీ వర్షాలకు పత్తి నల్లబారడమే కాకుండా నాణ్యత కూడా తగ్గిపోయింది. 8 నుండి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలతో తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గింది. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.కనీసం రూ.10 వేలు ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్నిఆదుకోవాలి. – తోట కిష్టయ్య, రైతు, పెద్దకొడప్గల్ నేను 8 ఎకరాలు కౌలు తీసుకున్నాను. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేలు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. కూలీలు దొరక్క కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – గోతి సుప్చంద్, రైతు, టికారం తండా పత్తి పంట దెబ్బతినడంతో రెండో పంటగా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. తీయటానికి వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండో పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేలపైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. -
మార్కెట్లో కొనుగోళ్ల సందడి
జిల్లా కేంద్రంలోని మార్కెట్లో దీపావళి సందడి నెలకొంది. జిల్లా ప్రజలు పండుగకు ఒకరోజు ముందుగానే ఆదివారం సామగ్రి కోసం తరలిరావడంతో కిటకిటలాడింది. ప్రధాన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన ప్రమిదలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, టపాసుల దుకాణాలను వ్యాపారులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. అలాగే టపాసులు అమ్మేందుకు దుకాణదారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పండుగ సామగ్రి కొనుగోళ్లతో దీపావళి శోభ సంతరించుకుంది. –సాక్షి నెట్వర్క్ పటాకులు కొనుగోలు చేస్తూ..జిల్లా కేంద్రంలోని మార్కెట్లో పండుగ సామగ్రి కొనుగోలు చేస్తూ.. -
రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్
● రూ. 85వేలు నగదు స్వాధీనం ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పేకాడుతున్న 81 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85వేల నగదు, 41 సెల్ఫోన్లు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. పేకాట, చట్ట వ్యతిరేక కార్యకలపాలను సహించేది లేదన్నారు. దీపావళి నేపథ్యంలో పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాడితే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 87126 86133కు గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. బట్టాపూర్లో.. మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బట్టాపూర్లో ఒక ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,01,280 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు సెల్ఫోన్లు, 3 బైక్లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక లారీ స్వాధీనం మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ శివారు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. మెండోరా మండలం పోచంపాడ్కు చెందిన కాంట్లి రాజు, కమ్మర్పల్లికి చెందిన బోదాసు రాజు లారీలో ఇసుకను నింపుకుని ఏర్గట్లవైపు వస్తుండగా లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్నామన్నారు, లింగంపేటలో ట్రాక్టర్.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని పెద్దవా గు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రాజు అనుమతులు లేకుండా పెద్ద వాగు నుంచి ట్రాక్టర్పై ఇసుక తరలిస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముదక్పల్లిలో టిప్పర్.. మోపాల్: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్పల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. డ్రైవర్ మహేష్ సరైన అనుమతులు చూపకపోవడంతో టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సెమీస్ చేరిన జిల్లా వాలీబాల్ జట్టు
నిజామాబాద్ నాగారం: మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్జీఎఫ్ అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి వాలీబా ల్ టోర్నమెంట్ కొనసాగుతోంది. పోటీల్లో నిజామాబాద్ జట్టు సెమీస్కు చేరినట్లు సమాచారం. ఈసందర్భంగా క్రీడాకారులకు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ‘సాగర్’ గేటు ఎత్తివేత నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వర ద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూ సెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామ ని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు (17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
పదికి ప్రత్యేక కసరత్తు
నిజాంసాగర్(జుక్కల్): పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాలు పెంచి, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 13,617 మంది విద్యార్థులు జిల్లాలోని 306 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 13,617 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందుగానే ఆయా పాఠశాలల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతను సా ధించడమే లక్ష్యంగా విద్యార్థు లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేయడంతోపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక క్లాసులు ఉంటాయి. – రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శద్ధ వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: స్మారక క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.చంద్రకాంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి శ్రీ సరస్వతి శిశుమందిర్ మైదానంలో ఆదివారం సాయంత్రం సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ఆయా జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్లో కామారెడ్డి జిల్లా బొల్లారం, సిద్దిపేట జట్లు తలపడ్డాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్, నర్సింలు, మనోహర్రావు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో రియాజ్
నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసులో నిందితుడైన పాతనేరస్తుడు రియాజ్ పోలీసులకు ఆదివారం చిక్కాడు. బైక్ చోరీ కేసులో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తీసుకొస్తుండగా కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఆదివారం మధ్యా హ్నం 12 గంటలకు సారంగాపూర్ ప్రాంతంలో ఓ లారీ విడిభాగమైన క్యాబిన్లో రియాజ్ దాక్కున్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకో గానే గమనించిన రియాజ్ పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. అదే సమయంలో రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే యువకుడు ప్రయత్నించగా అతడిపై గాజు ముక్కతో దాడి చేశాడు. అప్పటికే పోలీస్ బృందాలు రియాజ్ను చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్ వదంతులు రియాజ్ను సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఆదివారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి. అయితే రియాజ్ తమ అదుపులోనే ఉన్నాడని, ఎన్కౌంటర్ చేయలేదని సీపీ సాయి చైతన్య ప్రకటన విడుదల చేయడంతో వదంతులకు పుల్స్టాప్ పడింది. వీడియో వైరల్ రియాజ్ను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఒకరు తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడి వద్ద కత్తి ఉందనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులోకి తీసుకున్నారు. తుపాకులతో గురిపెట్టి నేలపై పడుకోబెట్టి, అనంతరం బేడీలు వేసి, తాళ్లతో కట్టేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భద్రత నడుమ ఆస్పత్రికి.. నిందితుడు రియాజ్కు దెబ్బలు తగలడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీలకు వైద్యం అందించే వార్డులో ఉంచారు. మొదట ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం రియాజ్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయలపాలైన ఆసిఫ్ను పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి నిలకడగా ఉంది.శుక్రవారం రాత్రి నుంచి 8 ప్రత్యేక బృందాలు రియాజ్ కోసం తీవ్రంగా గాలించాయి. నిందితుడు మొదట జిల్లా దాటినట్లు భావించినప్పటికీ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నగరంలోనే ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. రియాజ్ పాతనేరస్తుడు కావడంతో అతడు తరచూ తిరిగే ప్రాంతాలు, కలిసే వ్యక్తులపై పోలీసులు నిఘా సారించి ఫోన్ నంబర్ను ట్రేసింగ్లో పెట్టారు. కానీ రియాజ్ ఫోన్ ఉపయోగించకుండా చోరీ చేసిన బైకుతో పోలీసుల కన్నుగప్పి వివిధ ప్రాంతాలు తిరిగాడు. బర్కత్పురాలోని ఓ లాయర్ వద్దకు వెళ్లిన రియాజ్ అతడి ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు లాయర్ సాయం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. సారంగాపూర్ ప్రాంతంలో పట్టుకున్న ప్రత్యేక బృందాలు అడ్డుకున్న స్థానిక యువకుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు వదంతులు నమ్మొద్దు : సీపీ -
దాడులు దాడులే.. వసూళ్లు వసూళ్లే...
రవాణా శాఖ చెక్పోస్టులు, చెక్పాయింట్లపై అప్పుడప్పుడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, ఏవో కేసులు నమోదు చేయడం తర్వాత వసూళ్లు యథావిధిగా నడుస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఏసీబీ అధికారుల కళ్లెదుటే వసూళ్ల పర్వం కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయాలు, చెక్పోస్టుల్లో జరిగే వసూళ్ల దందా విషయం అందరికీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వ విధానాల్లో లోపాలే ఇలాంటివి కొనసాగడానికి కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేసి రవాణా శాఖను బద్నాం చేయడమే తప్ప, తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ ఉండడం లేదు. వసూళ్లను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
● ఈ నెల 23 వరకు అవకాశం కామారెడ్డి రూరల్: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు కామారెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారి హనుమంత రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం మొదట ఈ నెల 18 వరకే గడువు విధించింది. అయితే, శనివారం రాత్రి వరకు మొత్తం 1,444 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కామారెడ్డి పరిధిలో 449, దోమకొండ పరిధిలో 307, బిచ్కుంద పరిధిలో 222, బాన్సువాడ పరిధిలో 240, ఎల్లారెడ్డి పరిధిలో 226 దరఖాస్తులు వచ్చాయి. మరో ఐదు రోజులపాటు గడువు పొడిగించడంతో ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ అధికారి హనుమంతరావు తెలిపారు. ఈ నెల 27న లాటరీ నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వ స్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజె క్టు ఒక వరద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు(17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపిక ఈనెల 23న గురువారం ఉదయం 9గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అతీకుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు ఈ నెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లంలో ప్రత్యేక శిబిరం నిర్వహించి నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు పెద్దపల్లి ఇండియన్ మిషన్ హైస్కూల్లో నిర్వహించే 58వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. వివరాలకు 85559 96271, 94942 259901, 96762 69988 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ● ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి క్రైం: దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర జిల్లా ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు గాయాలు కాకుండా, అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లను అలంకరించే క్రమంలో దీపాలు, లైటింగ్ ఏర్పాట్లు విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శబ్ద, కాలుష్య నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలన్నారు. ● జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ కామారెడ్డి రూరల్: లైసెన్స్ ఉన్న షాపులలో మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలకు సూచించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 94 పటాకుల దుకాణాలకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్, 5 కిలోల ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఉండాలని తెలిపారు. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. రోడ్లు, ఇళ్ల మధ్య పటాకులు కాల్చొద్దని, ఓపెన్ స్థలాల్లో మాత్రమే కాల్చాలన్నారు. -
ఓపెన్ కలెక్షన్!
ఏసీబీ దాడిచేసిన సలాబత్పూర్ ఆర్టీవో చెక్పోస్ట్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అవి చెక్పోస్టులు, చెక్పాయింట్లు అనేకంటే కలెక్షన్ సెంటర్లు అనొచ్చు. ఎందుకంటే అక్కడ వాహనాల తనిఖీలు ఉండవు. కేవలం వసూళ్లే జరుగుతాయి. అది కూడా బహిరంగంగా నడిచే వ్యవహారమే. ఈ విషయం రవాణా శాఖ ఉన్నతాధికారులకు తెలియందీ కాదు. పైగా చెక్పోస్టులు, చెక్పాయింట్లలో ప్రైవేటు వ్యక్తులే వ సూళ్ల బాధ్యతలు చూసుకుంటారు. వాళ్లే లెక్కలు క ట్టి అధికారులకు అప్పగిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యం. అయితే ఏసీబీ అధికారులు అప్పుడప్పు డు దాడులు చేయడం, వాళ్ల ఎదుటే సరుకు రవాణాకు సంబంధించిన వాహనదారులు డబ్బులు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసి వెళ్లడం సర్వ సాధారణమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద ఉన్న చెక్పాయింట్పై, అలాగే 161వ నెంబర్ జాతీయ రహదారిపై మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల ఎదుటే వాహనదారులు డబ్బులు తెచ్చి బాక్సుల్లో వేసి వెళ్లారు. భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద చెక్పాయింట్లో రూ.51,300 అలాగే మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద చెక్పోస్టులో రూ.36 వేల నగదును సీజ్ చేశారు. చెక్ పోస్టుల వద్ద డ్రైవర్లు డబ్బులు వేసేందుకు బాక్సుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులతో దర్జాగా వసూళ్లు మారని రవాణా శాఖ తీరు మరోసారి దాడులు చేసిన ఏసీబీ -
దాడులు తెలియక.. యథావిధిగా..
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద ఉన్న ఆర్టీవో చెక్పోస్ట్పై శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా.. ఆ విషయం తెలియని లారీ డ్రైవర్లు చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో యథావిధిగా డబ్బులు వేస్తూ కనిపించారు. ఆ డబ్బులను ఓ ప్రయివేటు వ్యక్తి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడాన్ని ఏసీబీ అధికారులు గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. చెక్పోస్ట్లలో అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రభుత్వానికి నివేదించామని, దీంతో త్వరలో అన్ని చెక్పోస్ట్లను ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై చెక్పోస్ట్లలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ తయారు చేసి ఆ యాప్పై లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. -
‘సాక్షి’పై కూటమి కుట్రలు
కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షర యజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభు త్వం చేస్తున్న కుట్రలు చేస్తోందని ప్రజా, ఉ పాధ్యాయ, జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని సా క్షి దినపత్రిక ప్రధాన కార్యాలయంపై దాడు లు అలాగే ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు వంటిచర్యలను మానుకోవాలని అ న్ని వర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం దారుణం. ఏపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సాక్షిపై కక్ష సాధింపులను మానుకోవాలి. – ఎల్ దశరథ్, సీపీఐ జిల్లా కార్యదర్శిమీడియా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. రాజకీయంగా ఏదైనా ఉంటే కోర్టులు, చట్టాలు ఉ న్నాయి. న్యాయపరంగా పోరాడాలి. సాక్షిపై దాడులు చేయడం, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. – ముదాం శంకర్, టీయూడబ్ల్యూజే, జిల్లా ఉపాధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఆంధ్రప్రదేశ్లో సాక్షిపై కక్ష సాధింపులు మానుకుని చట్టప్రకారం ముందుకెళ్లాలి. ప్రజా సమస్యలను కథనాల రూపంలో రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. – కొంగల వెంకటి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుసాక్షి మీడియాపై రాజకీయ కక్షతోనే దాడులు చేయడం సరికాదు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై అక్రమ కేసులు బకాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కుట్రలు మానుకోవాలి. – సీహెచ్ అనిల్కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దాడులు, అక్రమ కేసులు బనాయించడం దారుణం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి పత్రికాస్వేచ్ఛను కాపాడాలి -
సోయా.. కొనే సోయి లేదా?
మద్నూర్(జుక్కల్): చేతికొచ్చిన సోయాను ఆరబోస్తూ రాశులు చేస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. పండగ పూట చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్నారు. గత పదిహేను రోజులుగా సోయా కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో సోయాబీన్ 80 వేల ఎకరాల్లో సాగు కాగా, అందులో 35 వేల ఎకరాల సాగు విస్తీర్ణం మద్నూర్, డోంగ్లీ మండలాల పరిధిలో ఉంది. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఎక్కువ శాతం రైతులు సోయా పంట పండించారని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఈ సారి పంట కోతల సమయంలో భారీ వర్షాలు కురవడంతో సోయా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు పడిపోయిందని, ఖర్చులు బాగా పెరిగాయని రైతులు అంటున్నారు. కేవలం కల్లానికి ఎకరాకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.5320 కాగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.3,800 నుంచి రూ.4,200 చెల్లిస్తున్నారు. అంతే కాకుండా హడత్, హామాలీ పేరుతో రూ.వెయ్యి వరకు కట్ చేస్తున్నారు. ఈ ఏడాది డోంగ్లీలో సైతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల రైతులు కోరుతున్నారు. మద్నూర్ వరకు తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని అంటున్నారు.నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సోయా కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర అందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. సోయా కొనుగోళ్ల అంశంపై మార్కెఫెడ్ చైర్మన్ గంగారెడ్డితో శనివారం ఫోన్లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే సాక్షికి తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో సోయా పంట ఆశాజనకంగా ఉందని, పంట కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారం రోజుల్లో సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించొద్దని రైతులకు ఎమ్మెల్యే సూచించారు.కొనుగోలు కేంద్రం ప్రా రంభం కాకపోవడంతో బహి రంగ మార్కెట్లో రూ.4వేలకు చొప్పున 6 క్వింటాళ్ల సోయాను అమ్మేశా. పండగపూట చేతిలో చిల్లిగ వ్వ లేకపోవడం, అప్పుల వాళ్లు డబ్బులు కట్టాలనడంతో మరోదారి లేక అమ్మేశా. – శివన్న, రైతు, మద్నూర్ పంట చేతికొచ్చి పదిహేను రోజులు.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు రోడ్లపై పంట దిగుబడి రాశులు పండగ పూట చేతిలో చిల్లిగవ్వ లేక రైతుల సతమతం తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం -
అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ ● నిందితుడి కోసం ఎనిమిది పోలీసు బృందాల గాంలిపునిజామాబాద్అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్సాబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో రియాజ్ను పట్టుకునేందుకు కాని స్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్ను వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తన బైక్పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్ను పొడిచి హత్య చేశారు. నిందితుడు రియాజ్ సెల్ఫోన్ వదిలేసి మరో బైక్ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం. కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు. అంత్యక్రియలో పాల్గొన్న ఐజీ, సీపీ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు నగరంలో శనివారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలోని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సాయి చైత న్య, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించబోమన్నారు.


