breaking news
Kamareddy
-
ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాలి
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి రూరల్: విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం దేవునిపల్లిలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన ఆశీస్సులతో కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు, దేవునిపల్లి అధ్యక్షుడు వడ్ల వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు రాములు చారి, ప్రధాన కార్యదర్శి లింబాద్రిచారి, కోశాధికారి మురళి చారి, ఉపాధ్యక్షుడు రమేష్ చారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో వరద బాధిత విద్యార్థుల కోసం సేకరించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి పంపిణీ వాహనాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల వర్షం బీభత్సం వల్ల కాలనీలు జలమయం కావడంతో భారీ నష్టంతో పాటు విద్యార్థులకు నష్టం కలిగిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఏ నోట్ బుక్’ పేరిట కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు సామాగ్రి పంపిణీ చేయబోవడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, నాయకులు పాల్గొన్నారు. పాఠశాలకు టీవీ వితరణ మాచారెడ్డి: మండల కేంద్రంలోని శ్రీరామ్ నగ ర్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం అదే గ్రా మానికి చెందిన పూర్వ విద్యార్థి రాగుల నర్సింగరావు మన బడి పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రూ.50 వేల విలువైన టీవీని అందజేశారు. ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి టీవీ తోడ్పడుతుందని అన్నారు.పాఠశాల హెచ్ఎం స్వ ప్న.. దాతతో పాటు పూర్వ విద్యార్థుల ఐక్య వే దిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు సుష్మ, ఐక్య వేదిక సభ్యులు కలిమెల రాజిరెడ్డి, రాగుల దేవరాజు, చల్ల కృష్ణారెడ్డి ఉన్నారు. -
సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం
బాన్సువాడ రూరల్: సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. తాడ్కోల్ రైతువేదికలో సీ్త్రశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ బీ..పడాయి బీ మాసోత్సవంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 రోజులుగా వివిధ సెక్టార్లకు చెందిన సూపర్వైజర్లు కార్యక్రమం విజయవంతానికి అంగన్వాడీ టీచర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారన్నారు. అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్వైజర్లు షహనాజ్బేగం, రాజేశ్వరి, పద్మ, సుమలత, మాధురి, తదితరులు పాల్గొన్నారు. క్యాసంపల్లిలో.. కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు పోషణ్ బీ పడాయి బీ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, పోషన్ అభియాన్ కో–ఆర్డినేటర్, 100 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి తిప్పలు
● కంబాపూర్ గ్రామస్తులకు వ్యవసాయ బోరుబావులే దిక్కు ● సమస్య గురించి పట్టించుకోని అధికారులుపిట్లం(జుక్కల్): కొన్ని రోజులుగా కంబాపూర్ గ్రామస్తులు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామం మొత్తానికి రెండు సింగిల్ ఫేజ్ మోటార్లున్నాయి. కాని ఆ నీళ్లు అన్ని ఇళ్లకు సరిపోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు మంచిగా రావడం లేదు. అవి కూడా 2 బిందెల కంటే ఎక్కువ రాకపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. గత నెల నుంచి గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది. పలు మార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. చేసేదేమీ లేక గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ తెచ్చుకుంటున్నామని, పలుమార్లు జారిపడి దెబ్బలు తగులుతున్నాయని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది దూర ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకుంటున్నారు. గ్రామంలో నీటి సమస్య వల్ల కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.గ్రామంలో గత నెల నుంచి నీటి సమస్య తీవ్రమైంది. నీటిని పొలాల నుంచి తెచ్చుకుంటున్నాం. నీళ్లు లేక పనులకు కూడా వెళ్లలేకపోతున్నాం. గ్రామం నుంచి వ్యవసాయ భూమికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – కృష్ణ, కంబాపూర్గ్రామంలో నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వ్యవసాయ బోరు బావుల నుంచి పిల్లలు, మేము కలిసి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్య వల్ల పిల్లలను పాఠశాలలకు సమయానికి పంపలేక పోతున్నాం. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి. – సాయగౌడ్, కంబాపూర్ -
మోదీ జన్మదినం కాదు నిరుద్యోగ దినం
బాన్సువాడ: ప్రధాన మంత్రి మోదీ జన్మదినం కాదని సెప్టెంబర్ 17న జాతీయ నిరుద్యోగ దినం చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి విమర్శించారు. జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు బుధవారం జాతీయ నిరుద్యోగ దినం నిర్వహించారు. నిరుద్యోగులతో కలిసి టీ అమ్ముతూ, బైక్ రిపేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి గద్దె ఎక్కిందన్నారు. అధికారంలో రాగానే నిరుద్యోగుల పొట్టగొడుతుందని మండిపడ్డారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నా రు. నాయకులు మన్సూర్, తిరుమల్రెడ్డి, సలీం, శ్రీనివాస్, అందే రమేష్, గౌస్ తదితరులున్నారు. నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్గా చలామణి అవుతున్న సౌదాగర్ అరవింద్కు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన అరవింద్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
గ్రామాల్లో మహిళలకు వైద్య పరీక్షలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్సీతో పాటు పోల్కంపేట, పోతాయిపల్లి, మోతె, బాణాపూర్, భవానిపేట, ముంబోజిపేట తదితర గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ‘స్వస్త్ నారీ..స్వశక్త్నారీ’ కార్యక్రమంలో భాగంగా 56 మందికి పరీక్షలు చేసి చికిత్స అందజేశారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ రమాదేవి, పీహెచ్సీ వైద్యులు రాంబాయి, సీహెచ్వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, చంద్రకళ, యాదగిరి, గీత, భాగ్య, అంజలి, పాలవ్వ, కవిత, తదితరులు పాల్గొన్నారు. హన్మాజీపేట్ పీహెచ్సీ పరిధిలో.. బాన్సువాడ రూరల్: స్వస్త్నారీ..స్వశక్త్నారీ కార్యక్ర మం బుధవారం హన్మాజీపేట్ పీహెచ్సీలో ప్రారంభించారు. కార్యక్రమం వచ్చే నెల 2 వరకు కొనసాగుతుందని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ తెలిపారు. తొలిరోజు మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు మహిళలకు దీర్ఘకాలిక రోగా లు, బీపీ, షుగర్, టీబీ, గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాలు దెబ్బతినడం తదితర వ్యాధులకు పరీ క్షించి ఉచితంగా వైద్యం అందజేస్తామని డాక్టర్ తెలిపారు. కోనాపూర్లోనూ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. -
క్రైం కార్నర్
కుక్కల దాడిలో మేకల మృతి నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రంలో కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందాయి. నందిపేటకు చెందిన ఎస్కే. అజీం తన ఇంటి ఎదుట రెండు మేకలను కట్టేసి ఉంచాడు. కాగా, ఒక్కసారి గుంపులుగా వచ్చిన కుక్కలు దాడి చేసి రెండు మేకల గొంతులను పట్టేసాయి. మేకల అరుపులు విని కుక్కలను తరిమివేసే ప్రయత్నం చేసినా కుక్కలు మేకలను విడిచి పెట్టకుండా వాటి తల, మొండెం భాగాలను వేరు చేశాయి. ఎల్లారెడ్డిరూరల్: రేసు కుక్కలు గొర్రెల మందపై దాడి చేయడంతో 9 గొర్రెలు, ఒక మేక మృతి చెందినట్లు బాధితుడు రవి తెలిపారు. మండలంలోని తిమ్మారెడ్డి కట్టకింది తండాకు చెందిన రవి గొర్రెల మందపై రేసు కుక్కలు దాడి చేశాయి. ఘటనా స్థలాన్ని బీట్ ఆఫీసర్ మౌనిక పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరారు. మెండోరాలో భారీ చోరీ ● ఆరు తులాల బంగారం అపహరణ బాల్కొండ: మెండోరా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలు చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేర రామకృష్ణ దంపతులు మెండోరా మండల కేంద్రంలో కిరాణాషాపును నిర్వహిస్తారు. రోజూ ఇంటికి తాళం వేసి వచ్చి షాపులో ఉంటారు. పట్టపగలు గుర్తుతెలియని దుండగులు తాళం పగుల గొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం పాఠఽశాల నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు తాళం పగుల గొట్టి ఉండడాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసేలోపు భారీ చోరీ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సుహాసిని ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సేవా దృక్పథంతో ముందుకు రావాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్/బిచ్కుంద(జుక్కల్): ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు రావాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వర్షాలకు ఇళ్లు కూలిపోయిన, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు బుధవారం దుప్పట్లు, దుస్తులు ఇతర సరుకులను సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న చేతులు మీదుగా పంపిణీ చేశారు. బిచ్కుంద, మద్నూర్లలో ఈ కిట్లను అందించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ సొసైటీ రక్తదానం, హెల్త్ క్యాంపులు నిర్వహించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్, రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు సంజీవ్, నరసింహ, వేణుగోపాల్, రచ్చ శివకాంత్, డాక్టర్ నర్సింలు, ఓంప్రకాష్ పాల్గొన్నారు. -
‘సకాలంలో రుణాలు మంజూరు చేయాలి’
కామారెడ్డి క్రైం: అర్హులైన రైతులందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూములకు సైతం పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, ఆర్బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఎల్డీఎం చంద్రశేఖర్, బ్యాంకర్లు పాల్గొన్నారు.మాచారెడ్డి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం మాచారెడ్డి మండలంలో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పంచాయతీ రోడ్డుతో పాటు చుక్కాపూర్ మాచారెడ్డి పీడబ్లూడీ రోడ్డు వరకు బండరామేశ్వరంపల్లి రోడ్డు మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఏఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ దోమకొండ స్వామి, ఏఈఈలు సంజయ్, తేజస్విని ఉన్నారు. -
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. బుధవారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో కామారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఆంగన్వాడీ టీచర్లకు పోషణ మాసం, పోషణ్ భీ – పడాయి భీ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ప్రారంభమైన పోషణ మాసం వచ్చేనెల 16 వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్రాలకు వచ్చేవారిలో పోషణ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో శ్రీలత, సూపర్వైజర్లు కవిత, పద్మజ, ఉమ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
హస్తం.. కొత్తోళ్లకే నేస్తం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమయ్యింది. సుమారు పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే అధికారంలో లేకపోయినా పలువురు నేతలు పార్టీ జెండాను పట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేధింపులను తట్టుకుని నిలిచారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. పదవులు దక్కుతాయని ఆశించారు. అయితే చాలామంది ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ అధికారంలోకి రాగానే వలసలు మొదలయ్యాయి. అప్పటివరకు ఎవరికి వ్యతిరేకంగానైతే పోరాడారో.. వారినే పార్టీలో చేర్చుకోవడంతో పాత నేతలు ఇబ్బందిపడుతున్నారు. గతంలో తమను ఇబ్బందిపెట్టినవారికే పార్టీలో, పదవులలో అందలం దక్కుతోందన్న భావనతో వారిలో అభద్రత భావం నెలకొంటోంది. దీనిపై ఇటీవల తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లగక్కుతున్నారు. ఓ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్గా ‘గెలిచాక నీతో నడిచేవాళ్లకంటే గెలుపు కోసం వెంట నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోండి’ అని పెట్టుకోగా.. దాన్ని చాలా మంది లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా తమ ఆవేదనను బయటపెట్టుకున్నారు. ‘అధికారంలోకి వచ్చాం కదా అని నిజమైన కార్యకర్తలను వదులుకుంటే అధికారం లేనపుడు పోరాడటానికి ఎవరూ ఉండరు, గెలిచాక వచ్చిన వాళ్లు పార్టీ ఓడిపోతే కనిపించరు’ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘కార్యకర్తలకు ఇవ్వరు. వాళ్ల చుట్టాలకు, వాళ్ల దగ్గరి వాళ్లు, వాళ్ల బర్త్డేలు, పెళ్లి రోజులకు ఖర్చు పెట్టేవాళ్లకే పదవులు ఇస్తారు, పనిచేసి పెడతారు. కార్యకర్తలకు ఏదీ ఇవ్వరు. పార్టీలు మార్చినోళ్లకు అధిక గౌరవం ఉంది కాంగ్రెస్లో. ఇది ఊరూరా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి’ అంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆయా పోస్టులను మిగిలిన కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. అసలైన వారిని పట్టించుకోవాలని, అవసరం కోసం వచ్చిన వారిని వదిలేయాలని కోరుతున్నారు. పాత శ్రేణుల్లో పెరుగుతున్న అభద్రత భావం ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే ప్రాధాన్యత.. కష్టపడినోళ్లకు గుర్తింపులేదని నైరాశ్యం సోషల్ మీడియా వేదికగా ఆవేదనను పంచుకుంటున్న నేతలు, కార్యకర్తలు -
‘పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’
కామారెడ్డి టౌన్ : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దోమకొండ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన రంగోల్ స్వప్న, నిజాంసాగర్ మండలానికి చెందిన ఇర్ఫానా బేగంకు సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరయ్యాయి. వాటిని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంలు రాజయ్య, సురేష్, ఫిషరీస్ శాఖ అధికారి శ్వేత, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పుష్పరాణి, మండల సమాఖ్య అధ్యక్షులు భూలక్ష్మి, సీసీలు శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
‘మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి’
దోమకొండ: స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వర్చువల్గా ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. దోమకొండ వైద్య శిబిరంలో 124 మంది మహిళలకు ప్రత్యేక వైద్య సేవలను అందించామన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, ప్రోగ్రాం అధికారులు శిరీష, రాధిక, అనురాధ, దోమకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎమెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకలను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 ఏళ్లుగా దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మోదీ అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. -
పోరాటంతోనే రాచరికం నుంచి విముక్తి
కామారెడ్డి టౌన్: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించి, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారామని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌసింగ్ బోర్డ్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణలు తొలగి హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిందన్నారు. రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుందన్నారు. జిల్లా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. రైతు భరోసా కింద జిల్లాలో 3,03,568 మంది రైతుల ఖాతాల్లో రూ. 305.98 కోట్లు జమచేశామన్నారు. కొత్తగా 16,152 రేషన్ కార్డులు మంజూరు చేశామని, 49,971 మంది కుటుంబ సభ్యులను పాత రేషన్ కార్డులలో జతచేశామని పేర్కొన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో 1,50,131 మంది వినియోగదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 1,62,000 మందికి ప్రతినెలా రూ. 36.12 కోట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా జిల్లాలో 1,63,163 మంది వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రక్షణ చర్యల్లో నిమగ్నమైందని, తద్వారా ప్రాణనష్టం తక్కువగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అత్యవసర బృందాల ఆధ్వర్యంలో 15 ప్రాంతాలలో 17 రక్షణ చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడారన్నారు. ముంపు ప్రాంతాలలో 740 కుటుంబాలలోని సభ్యులకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ. 81.85 లక్షల పరిహారం మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రాణనష్టం జరిగిన ఆరు కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున అందజేశామన్నారు. జిల్లాలో 28,615 ఎకరాలలో పంటనష్టం జరిగిందన్నారు. కామారెడ్డిని నేర రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ చర్యలతో పాటు ప్రజల సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.జిల్లాకు 11,621 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 6,063 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కోదండరెడ్డి తెలిపారు. ఇందులో 2,663 ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు, 736 గోడ లెవల్ వరకు, 306 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 43.21 కోట్లు చెల్లించామని వివరించారు. నాలుగు మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యాచరణ ద్వారా శానిటేషన్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పార్కుల నిర్వహణ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో జరిగిన మార్పు వల్లే దేశవ్యాప్తంగా తెలంగాణకు కీర్తి ప్రజాపాలన దినోత్సవంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
ఆడపడచులకు బతుకమ్మ కానుక
కామారెడ్డి టౌన్: బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడచులకు ప్రభుత్వం కానుకలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రేవంతన్న కానుక పేరుతో చేనేత చీరలను పంపిణీ చేయనుంది. అయితే గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి మహిళకు ఒక చీర పంపిణీ చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులకు మాత్రమే పంపిణీ చేయనుంది. జిల్లాలో మొత్తం 2,03,689 చీరలను అందించనున్నారు. ఇందులో పట్టణాల్లో 24,272, ఇతర ప్రాంతాలలో 1,79,417 చీరలను పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ, మెప్మా అధికారులు తెలిపారు. కామారెడ్డి రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అ మరావతిలో వచ్చేనెల 2న నిర్వహించే స్వచ్ఛతాన్ ఆఫ్ మారథాన్ ర న్నింగ్కు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి గుగ్గిలం అశోక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా వే ల్పూర్ గ్రామానికి చెందిన అశోక్ పలు జాతీ య, అంతర్జాతీయ మారథాన్ పోటీల్లో పాల్గొ ని విజయాలను సాధించారు. ఆయనను అమరావతి మారథాన్కు ఎంపిక చేయడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి టౌన్: ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్గా జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ గ్రీన్ క్రార్ప్స్(ఎన్జీసీ) డైరెక్టర్ ప్రసన్నకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించినందుకు విద్యాశాఖకు, ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు సిద్దిరాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అధికారం ఎక్కడుంటే అక్కడుంటారంటూ..
పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు అక్కడ వెలుగు వెలిగి, తమపై దౌర్జన్యాలు చేసిన వారంతా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కండువాలు మార్చి ఇక్కడా వారే పెత్తనం చేస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరేవారిని చేరదీయడం ద్వారా తమకు అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయంతో చాలామంది నేతలున్నారు. అధికారంలో లేనప్పుడు జెండాలు మోసిన వారిని పార్టీ పట్టించుకోవడం లేదని, అధికారం చేపట్టిన తరువాత వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన చెందుతోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలే వారినే ప్రోత్సహిస్తున్నారంటూ జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటున్న కొటేషన్లను చూస్తుంటే వారు ఎంత ఆవేదనతో ఉన్నారో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని నేతలు బాహటంగా మాట్లాడుకుంటున్నారు. -
మళ్లీ దంచికొట్టిన వాన
● ఇసాయిపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ● పొంగిపొర్లుతున్న వాగులు బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 9లో uనేడు ప్రజాపాలన దినోత్సవం కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, కోదండరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని సూచించారు. ‘వరిలో తడి పొడి విధానంతో పర్యావరణ పరిరక్షణ’ కామారెడ్డి రూరల్: వరి సాగులో తడి పొడి విధానాన్ని పాటించడం వల్ల పర్యావరణా న్ని పరిరక్షించవచ్చని జిల్లా వ్యవసాయ అధి కారి మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవా రం అడ్లూర్లో పద్మపాణి సొసైటీ, కోర్కార్బన్ ఎక్స్ సంస్థల ఆధ్వర్యంలో రైతులకు వరిలో తడి పొడి విధానంపై అవగాహన క ల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ ఈ విధానం వల్ల వరిలో మీథేన్ ఉద్గారాలను తగ్గించవచ్చన్నారు. తద్వారా ఎరు వులు సద్వినియోగం అవుతాయని, భూసా రం పెరుగుతుందని, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. నూతన విధా నాన్ని పాటిస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ఎకరానికి రూ. 500 చొప్పున ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీసీఎక్స్ ప్రతినిధు లు కార్తీక్రావు, నీలేష్, చందు, పాండు, భీ ష్రం, పద్మపాణి డైరెక్టర్ సత్యనారాయణ్, ఏ ఈవో దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ‘సజావుగా పత్తి కొనుగోలు చేయాలి’ కామారెడ్డి క్రైం : జిల్లాలో పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పత్తి విక్రయాల కోసం ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే ప్రత్యేక యాప్ను తీసుకువస్తోందని తెలిపారు. దాని ద్వారా రైతులు తమ ఇంటి నుంచే పత్తి విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్లాలి, ఏ సమయంలో వెళ్లాలి అనే విషయాలన్నీ యాప్ ద్వారా రైతులకు తెలుస్తాయన్నారు. యాప్ అమలులోకి రాగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల నమోదు, కౌలు రైతుల వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్ రోడ్డులో నిలిచిన వర్షం నీరుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి, పాల్వంచ, కామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, నిజాంసాగర్, తాడ్వాయి తదితర మండలాల్లో భారీ వాన పడింది. వర్షంతో కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో వాగులు పొంగి ప్రవహించాయి. కాగా వాగులు పొంగుతుండడంతో మరోసారి పంటలు నీటమునుగుతున్నాయి. గత నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తుండగా.. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికీ కొన్ని రూట్లలో వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. మరిన్ని వర్షాలు కురిస్తే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. మళ్లీ మునిగిన పంటలు నాగిరెడ్డిపేట : మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మళ్లీ పంటలు నీట మునుగుతున్నాయి. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరదనీటితోపాటు పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటితో నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, తాండూర్, వెంకంపల్లి, మాటూర్ తదితర గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. గత నెలాఖరున కురిసిన భారీవర్షాల కారణంగా మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో పంటలు నీటమునిగి భారీ నష్టం వాటిల్లింది. మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మిగిలిన పంట సైతం దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 55,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. సింగూరు ప్రాజెక్టుతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట, పోచారం ప్రాజెక్టుల ద్వారా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 9 గేట్ల ఎత్తి 61,542 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడం, ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నందున మంజీర నదీతీరం వైపు ఎవరూ వెళ్లవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల ఎప్పటికప్పుడు పెంచుతుండటంతో నదిలో ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. మంజీరా నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టుకు మంగళవారం వ రద తాకిడి పెరిగింది. 3,854 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీరు పోచారం ప్రాజెక్టు అలుగుపై నుంచి పొంగిపొర్లుతూ మంజీర నదిలోకి చేరుతోంది.ప్రాజెక్టు సమాచారం.. -
నేటినుంచి ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్’
● మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ను రూపొందించిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభం అవుతోందన్నారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తద్వారా కుటుంబాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఈవో రాజు, డీటీవో శ్రీనివాస్రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి సతీష్ యాదవ్, యువజన సంక్షేమ అధికారి వెంకటేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వీరులకు వందనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నిరంకుశ పాలన కిందే ఉండిపోయింది. దీంతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ఈ ప్రాంత ప్రజలు పోరాటాన్ని కొనసాగించారు. అటు ఆర్యసమాజ్ ద్వారా ఒక ఉద్యమం, ఇటు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం మరోవైపు కొనసాగాయి. ఇరువురి లక్ష్యం తెలంగాణ విముక్తి. ఈ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలను అర్పించారు. మరెందరో జైలు జీవితం గడిపారు. నిజాం పోలీసులు ఎంతో మందిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి యువత ప్రాణాలకు ఒడ్డి నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారిలో చాలా మంది మరణించారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన చాకలి సాయన్న, రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, గంగారెడ్డి, ఆగమయ్య, గుండారెడ్డి, రాజీరయ్య, వెంకయ్య, మల్లయ్య, రాంచంద్రం, నారా యణరెడ్డి, భూమారెడ్డి, గోపాల్రెడ్డి, విఠల్రెడ్డి, బాదల్చంద్, గంగయ్య, బాల్లింగం, కిషన్రావ్ తదితరులు నిజాం పాలకులతో పోరులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జిల్లాలోని దోమ కొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాలకు చెందిన వందలాది మంది నిజాం పాలనపై జరిగిన అన్ని పోరాటాల్లో భాగమయ్యారు. తర్వాతి కాలంలో కొందరిని ప్రభుత్వాలు స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాయి. ‘ఫణిహారం’ కీలక పాత్ర... నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో ఫణిహారం రంగాచారిది వీరోచిత పోరాటం. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మణాచారి కుమారుడైన రంగాచారి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉన్న రంగాచారితో పాటు ఆయన మిత్రుడు విఠల్రావ్లను అప్పటి ఉపాధ్యాయుడు బషీరొద్దీన్ హైదరాబాద్లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేర్పించాడు. రంగాచారి చదువుకుంటున్న సమయంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల కార్యకలాపాలు జోరుగా సాగేవి. వారికి దీటుగా ఆర్యసమాజ్ ఉద్యమం బలంగా వ్యాప్తిచెందడంతో రంగాచారి, విఠల్రావ్లు అటువైపు నడిచారు. ఆర్యసమాజ్ హిందువులకే ప్రాధాన్యం ఇవ్వడంతో వాళ్లిద్దరు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నాయకులైన జవాద్రజ్హీ, డాక్టర్ పరంజపేలతో సంబంధం పెట్టుకుని విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల దోపిడీ, నిర్భంద పన్నుల వసూళ్లు, లెవీ వసూళ్లపై రంగాచారి ఎన్నో చిత్రాలు గీశాడు. ఆయన గీసిన చిత్రాలు ఇప్పటికీ హైదరాబాద్లోని ముగ్దుంభవన్లో ఉన్నాయి. 1946 లో కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి గురికావడంతో పార్టీ కార్యదర్శిగా కేఎల్ మహేంద్ర ఎన్నికై రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో రంగాచారి తన సహచరులు బాసిత్, షానూర్అలీ, నర్సింగ్రావ్ మరికొందరితో కలిసి ఆయుధాలు సేకరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. సేకరించిన ఆయుధాలను ఉద్యమ ప్రాంతాలకు పంపించేవారు. అంతేగాకుండా ఉస్మానియా ఆస్పత్రి నుంచి రాజ్బహదూర్గౌడ్, ఎస్పీకే ప్రసాద్లను పోలీసు కస్టడీల నుంచి తప్పించడంలో రంగాచారి ప్రముఖ పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వర్రావ్ను కూడా ఆయన కాపాడారు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన రామచంద్రారెడ్డి ఎలుగుబంటి దాడిలో గాయపడగా చికిత్స కోసం చిలుకలగూడలో రంగాచారి నిర్వహిస్తున్న రహస్య స్థావరానికి తీసుకువచ్చారు. అయితే రంగాచారి ఆయనను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించారు. ఎడ్లబండిపై పడ్డ రక్తపు మరకల ఆధారంగా పోలీసులు రామచంద్రారెడ్డిని తీసుకువచ్చిన బండి యజమానిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడంతో రహస్య స్థావరం వివరాలు తెలిశాయి. నిజాం పోలీసులు అక్కడికి చేరుకుని రంగాచారి, వెదిరె రాజిరెడ్డిలను అరెస్టు చేసి చంచల్గూడ జైలులో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. రంగాచారి నుంచి రహస్యాలను రాబట్టలేని పోలీసులు.. వరంగల్ జిల్లాలోని మామునూర్ కాన్సన్ట్రేషన్ క్యాంపునకు తరలించి అక్కడ చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. రంగాచారి త్యాగాలను స్మరించుకునేందుకుగాను కామారెడ్డి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా తెలంగాణ విముక్తి రోజైన సెప్టెంబర్ 17న రంగాచారి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరులను స్మరించుకుంటున్నారు. గోపాల్ రెడ్డివకీల్ భూమారెడ్డినారాయణ రెడ్డిఫణిహారం రంగాచారివిఠల్ రెడ్డి1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తమై మిగతా భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నా.. తెలంగాణ ప్రజలు మాత్రం నిరంకుశ నిజాం పాలనలోనే మగ్గిపోవాల్సి వచ్చింది. స్వేచ్ఛ కోసం మరికొంతకాలం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 13 నెలలపాటు ఈ ప్రాంత బిడ్డలు తిరగబడ్డారు. నిజాం సేనల చేతిలో క్రూరమైన చిత్రహింసలను ఎదుర్కొన్నారు. చివరికి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి సాధించారు. నిజాం విముక్తి పోరుకు 77 ఏళ్లు నిండిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం క్రియాశీలక పాత్ర పోషించిన జిల్లావాసులు ‘విముక్తి’ పోరులో అమరులెందరో.. నేడు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు -
‘జాతీయ స్థాయిలో రాణించాలి’
కామారెడ్డి క్రైం : విద్యార్థులు జాతీయ స్థాయి యోగా పోటీల్లోనూ రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఇటీవల నిర్మల్ పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో కేజీబీవీ విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. పలు విభాగాల్లో కలిపి 12 బంగారు, 3 రజత, 4 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో తొలిసారి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. వీరు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిశారు. క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్గౌడ్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్ పాల్గొన్నారు. -
జీఎస్టీ తగ్గింపుతో భారం తగ్గింది
మద్నూర్(జుక్కల్): జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై అదనపు భారం తగ్గిందని బీజేపీ డోంగ్లీ మండల అధ్యక్షుడు ధనంజయ పాటిల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన సందర్భంగా బీజేపీ నాయకులు మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారులకు మంచి లాభదాయకమని అన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే ప్రధానమంత్రి ఉండటం ఆనందంగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి సచిన్, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, రేవాన్, గంగాధర్, రామాగౌడ్, శంకర్, మోహన్, ఆశోక్, దత్తు, భీంరావ్, నాగేష్ తదితరులున్నారు. -
పెద్దమల్లారెడ్డిలో యువకుడి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసు కున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన ఎల్క తిరుపతి (20) గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. గతంలో అమ్మాయిలను వేధించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి అతడు డబ్బులు కావాలని తల్లి రామవ్వపై ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో, అతడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి దూలానికి ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకున్న కొడుకును చూసి తల్లి రోదించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హెడ్కానిస్టెబుల్ అంజయ్య ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
సహకార సంఘం వద్ద రైతుల ఆందోళన
పిట్లం(జుక్కల్): రాంపూర్ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సహకార సంఘానికి 440 బ్యాగుల యూరియా వచ్చింది. మంగళవారం యూరియాను సరఫరా చేసే సమయంలో రైతులు ఆందోళనకు దిగారు. సహకార సంఘం పరిధిలో గౌరారం, గౌరారం తండా, బండపల్లి, మద్దెల చెరువు, బొల్లక్పల్లి తదితర గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు యూరియా కోసం పాస్బుక్లను పట్టుకొని సహకార సంఘం ముందు క్యూలో నిలబడ్డారు. కేవలం 440 సంచుల యూరియా రావడంతో, టోకెన్ల ప్రకారం ఒక పాస్ బుక్కు ఒక యూరియా బస్తాను సహకార సంఘం సిబ్బంది సరఫరా చేశారు. వచ్చిన యూరియా కొద్ది సమయంలోనే అయిపోవడంతో, మిగిలిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని సహకార సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పిట్లం ఎస్సై వెంకటరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. దీంతో రైతులు వెనుతిరిగి వెళ్లారు. -
దెబ్బతిన్న బంజర– లింగంపల్లికలాన్ రోడ్డు
● ప్రారంభంకాని రోడ్డు మరమ్మతు పనులు ● ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్న గ్రామస్తులునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని బంజర నుంచి లింగంపల్లికలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు రెండు చోట్ల తీవ్రంగా దెబ్బతిన్నది. బంజర–లింగంపల్లికలాన్ రోడ్డుకు ఒకవైపు పోచారం ప్రధాన కాలువ ఉండగా మరోవైపు పంటపొలాలున్నాయి. రోడ్డుకు ఒకవైపు ఉన్న పోచారం ప్రధాన కాలువ కింద నుంచి అక్కడక్కడా అండర్ టన్నెల్స్(నేల మోరీలు) ఉన్నాయి. అండర్ టన్నెల్స్ నుంచి వరదనీరు ఉప్పొంగి ప్రవహించడంతో రెండుచోట్ల మట్టి కొట్టుకుపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. అండర్ టన్నెల్స్ వద్ద మట్టి కోతకు గురై సైడ్వాల్స్ కూలిపోయి ఏర్పడిన భారీగుంతలతో ప్రయాణికులు భయపడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు రోజురోజుకు మరింత ధ్వంసమవుతోంది. ఈ రోడ్డుకు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డుపై గతయేడు వర్షాలతో ఒక చోట అండర్టన్నెల్ వద్ద దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టేందుకు నీటిపారుదలశాఖ ద్వారా రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. కాని మరమ్మతు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోగా ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా రోడ్డు మరింత దెబ్బతిన్నది. ఈ రోడ్డుపై రాకపోకలు సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.బంజర–లింగంపల్లికలాన్ రోడ్డు గతయేడు వర్షాలతో ఒక అండర్ టన్నెల్ వద్ద దెబ్బతిన్నది. గత నెలాఖరున కురిసిన భారీవర్షాలకు మరో అండర్టన్నెల్ వద్ద రోడ్డు దెబ్బతిన్నది. కాగా రోడ్డు ధ్వంసమైన అండర్టన్నెల్స్ వద్ద శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, డీఈఈ, ఇరిగేషన్ శాఖ, ఎల్లారెడ్డి -
ఫొటో ఎక్స్పోను విజయవంతం చేయండి
● ఫొటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రామారెడ్డిః హైదరాబాద్ ఈ నెల 19న జరిగే ఫొటో ఎక్సోపోకు ఫొటోగ్రాఫర్లు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఫొటోగ్రాఫర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. రామారెడ్డి మండలంలో ఫొటోగ్రాఫర్లు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై లావణ్యతో కలిసి వాల్పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, మండల అధ్యక్షుడు మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని గుట్టమీద గల శివభక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆలయంలోని హుండీని సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు ఆలయ ఆవరణలో పగులగొట్టి డబ్బులు దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యుడు ఆశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే మండల కేంద్రంలో ఇంటి ముందర నిలిపిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జక్రాన్పల్లి: బైక్ చోరి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, వారిని పట్టుకుని విచారించారు. వారి వద్దనున్న బైక్ను గత నెల 18న జక్రాన్పల్లి బస్టాండ్ వద్ద నుంచి చోరీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ది గువన ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద వర ద నీటిలో ఒకరు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (30) మంగళవారం అచ్చంపేట గ్రామంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తుండగా నాగమడుగు వద్ద వరద నీరు ఉధృతంగా ఉండటంతో ఈత కొట్టాడు. దీంతో అతడు నీటమునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వరద నీటిలో రాత్రి వరకు గాలించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు. నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం గ్రామంలో 600 గ్రాములు నిషేదిత అల్ప్రాజోలంను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నట్లు రూరల్ ఎస్హెచ్ మహ్మద్ ఆరీఫ్ మంగళవారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో గుండారం కల్లు బట్టిపై దాడి చేసి ఆల్ఫ్రాజోలంను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులైన అశోక్, రమేశ్ గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ● చికిత్స పొందుతూ మృతి ఖలీల్వాడి: దంపతులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని దొడ్డికొమరయ్య కాలనీకి చెందిన షకీల్(45) శనివారం మద్యం తాగి ఇంటి పక్కన ఉండే దంపతులు(నాగు–సరస్వతి)తో గొడవపడ్డాడు. దీంతో మరుసటి రోజు ఉదయం దంపతులు షకీల్ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. ఈక్రమంలో షకీల్ తలకు బలమైన గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, దంపతులను అదుపులోకి తీసుకున్నామని ఆరో టౌన్ పోలీసులు తెలిపారు. -
ఆయిల్పాం సాగుతో రైతులకు ప్రయోజనం
దోమకొండ: ఆయిల్పాం సాగుతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రతినిధి నసీంఅలీ అన్నారు. మంగళవారం అంబారీపేటలో ఆయిల్పామ్ సాగును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయిల్పామ్ తోటలు జనవరి నెలలో క్రాప్ కటింగ్ వస్తాయన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి క్రాప్ కటింగ్ ఉంటుందని, కంపెనీకి పంపడం కోసం కనెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంపెనీ సీనియర్ మేనేజర్ శ్రీనివాస్గౌడ్, క్లస్టర్ మేనేజర్ హిమకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల్ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్పల్లికి చెందిన తాటికొండ పురుషోత్తం(59) సోమవారం కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం నిర్మల్కు వెళ్లాడు. మంగళవారం వేకువజామున తిరిగి మెట్పల్లికి అదే కారులో బయలుదేరారు. మోర్తాడ్ వద్ద కారు డ్రైవర్ శేఖర్ హైవేపై ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్ను గమనించకపోవడంతో వేగంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న పురుషోత్తంకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. గాయాలైన డ్రైవర్ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పురుషోత్తం భార్య కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. -
గాంధారి మండలంలో కలెక్టర్ పర్యటన
గాంధారి: మండల కేంద్రంతో పాటు గుర్జాల్, వండ్రికల్ గ్రామాలను మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 65 ఇళ్లు కూలిపోయాయి. బాధితులకు రెడ్క్రాస్ ఆధ్వర్యంలో సహాయ కిట్స్ను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భా రీ వర్షాలతో జిల్లాలో సుమారు 600 ఇళ్లు కూలాయన్నారు. బాధితులకు రెడ్క్రాస్ ఆధ్వర్యంలో పలు వస్తువులతో కూడిన సహాయ కిట్స్ను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మురళి, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, జిల్లా రెడ్క్రాస్ కమిటీ అధ్యక్షుడు రాజన్న, ప్రతినిధులు సంజీవరెడ్డి, రఘుకుమార్, కృష్ణ మానేటి, నాగేశ్వర్రావు, అన్నారెడ్డి, గంగయ్య, కాశెట్టి కిషన్, మాత్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గుర్జాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో వంటశాలను, వంటలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నోటు బుక్కులను అందించారు. అనంతరం గుర్జాల్–వండ్రికల్ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించారు. -
పోగొట్టుకున్న పర్సు అందజేత
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఓ వ్యక్తి పొగొట్టుకున్న పర్సును తాడ్వాయి పోలీసులు అందజేశారు. లింగంపేట్ మండలంలోని భవానిపేట గ్రామానికి చెందిన సాతెల్లి నరేష్ అనే వ్యక్తి తన పర్సును ఈనెల 15న తాడ్వాయి మండలంలోని నందివాడలో పొగొట్టుకున్నారు. ఈ విషయమై తాడ్వాయి పోలీసు స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడు. పర్సు ఓ వ్యక్తికి దొరకగా, అతడు తాడ్వాయి పోలీసు స్టేషన్లో అందజేశాడన్నారు. అనంతరం పోలీసులు పర్సును పొగొట్టుకున్న వ్యక్తికి అందజేశారు. పర్సులో రూ. 200 నగదు, విలువైన కార్డులు ఉన్నాయన్నారు. బాన్సువాడ: బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో పాము కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం బాన్సువాడ బ్లడ్ బ్యాంకు సిబ్బంది ఎల్లారెడ్డిలో రక్త దాన శిబిరం ఉండడంతో అక్కడి వెళ్లారు. శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఫ్రిజ్లో పెట్టేందుకు సిబ్బంది సాయంత్రం వచ్చారు. సిబ్బంది వచ్చి బ్లడ్ బ్యాంకు గది తలుపులు తీసి చూడగా గదిలో శబ్దం రావడాన్ని గమనించారు. గదిలో ఓ మూలన పెద్ద జెర్రిపోతు పాము కంటపడింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వచ్చి పామును చంపేసారు. నెల రోజుల్లో బ్లడ్ బ్యాంకులో రెండు సార్లు పాములు ప్రత్యక్షం కావడంతో సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంకు చుట్లూ పొదలు పెరిగిపోవడంతో అందులో నుంచే పాములు వస్తున్నట్లు సిబ్బంది అంటున్నారు. వెంటనే బ్లడ్ బ్యాంకు పరిసరాలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. పిట్లం(జుక్కల్): దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని కోరుతూ దివ్యాంగులు పిట్లం తహసీల్ కార్యలయం వద్ద మంగళవారం సీనియర్ అసిస్టెంట్ గోపాల్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో సూచించిన విధంగా దివ్యాంగులకు రూ.4 వేల నుంచి 6 వేలకు పెంచి పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 22 నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులు లోక శ్రీనివాస్, వెంకట సాయి, రారాజు, శ్రీనివాస్, బ్రహ్మం, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
కిలోమీటర్కు రూ.500 చార్జి వసూలు
రామారెడ్డి: కిలోమీటరు దూరానికి ఆటో చార్జి మహా అయితే రూ.వందనో లేదంటే ఇంకా ఎక్కువలో ఎక్కువగా రూ.200 ఆటో చార్జి తీసుకుంటారు. కానీ అన్నారం నుంచి గొడుగుమర్రి జీపీకి అంగన్వాడీ స్కూల్కి సంబంధించిన వస్తువులు, అలాగే ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన బియ్యం ఇతర వస్తువులను ఆటోలో తీసుకెళ్లాలంటే రూ.500 చెల్లించాల్సిందే. అంత డబ్బులు చెల్లించినా ఆటోలు గొడుగుమర్రి తండాకు రావడానికి నిరాకరిస్తున్నారు. మట్టి రోడ్డుతో ఆటోలు చెడిపోతున్నాయని చెబుతున్నారు. కిలోమీటర్ దూరం నరకం చూపించే రోడ్డుతో విసిగిపోయిన ఆటో కార్మికులు అటువైపు వెళ్లడం లేదు. ఇటీవల గొడుగుమర్రి తండాకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. నిధులు రాకపోవడంతో కంకర పోసి మధ్యలోనే వదిలేశారు. కొద్ది దూరం కంకర ఆ తర్వాత బురదలో ప్రయాణాలకు ఇబ్బంది కావడంతో అటువైపే ఆటోలు రావడం లేదు. స్కూల్, అంగన్వాడీ స్కూల్కు చెందిన బియ్యాన్ని ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే బైకులపై తరలిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే బైకులపై సైతం ఈ రోడ్డుపై ప్రయాణం వీలుకాదు. దీంతో అన్నారం గ్రామంలో బైకులు పెట్టి ఉపాధ్యాయులు నడుచుకుంటూ గొడుగుమర్రి తండాకు వెళ్లి వస్తుంటారు. గొడుగుమర్రి తండాలో దెబ్బతిన్న రోడ్లు రోడ్లు బాగాలేకపోవడంతో ఆ గ్రామం వైపు వెళ్లడానికి జంకుతున్న ఆటోవాలాలు ఎక్కువ చార్జి చేస్తున్న వైనం -
ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి ఇటీవల నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్కు వచ్చి చెయ్యి కోసుకొని తమతో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు తమ విధులకు ఆటంకం కలిగించాడని ఎస్సై తెలిపారు. అలాగే మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు గంగారాజు ఇటీవల మద్యం తాగి తన ఇంటిముందర విద్యుత్ స్తంభం లేదని చెబుతూ సెల్టవర్ ఎక్కి డయల్ 100కు కాల్చేస్తూ, పోలీసులను దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించాడన్నారు. దీంతో యాదగిరి, గంగారాజుపై కేసులు నమోదుచేసి అరెస్టు చేశామని ఆయన తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఘన్పూర్ శివారులో మంగళవారం ఓ భారీ ట్రక్ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై వాహనం నిలిచిపోయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు పొక్లెయిన్ సహాయంతో ట్రక్ను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. -
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్వాడి: నగరంలోని బస్డిపో–1 ప్రహరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 14న ఉదయం సదరు వ్యక్తి అపస్మారకస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని చికిత్స నిమ్తిం జీజీహెచ్కు తరలించారు. కానీ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వద్ద ఎలాంటి ఆధారలు లభించలేవని, అతడు బూడిద రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు. మృతుడు భిక్షాటన చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నట్లు చెప్పారు. ఎవరికై నా అతడి వివరాలు తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ఏఐటీయూసీ మహాసభను విజయవంతం చేయాలి
పిట్లం(జుక్కల్): నిజామాబాద్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న మార్కెట్ హమాలీ, దడ్వాయి స్లీపర్ల ఏఐటీయూసీ రాష్ట్ర రెండో మహాసభలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుర్రెం బాల్ రాజ్ కోరారు. ఆయన మంగళవారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్రం తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ, సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: బోర్లంక్యాంపు తండాలో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం వారు గ్రామస్తులతో కలిసి టోర్నమెంట్ వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంట్రీ ఫీజు రూ.800 చెల్లించి ఈనెల 25లోగా జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టౌర్నీలో విజేతలకు రూ.20వేలు, రన్నరప్కు రూ.10వేల నగదుతో పాటు ట్రోఫీలు అందజేస్తామన్నారు. టోర్నీ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ధారవత్ రవి, తదితరులు పాల్గొన్నారు. వివరాలకు 77026 27567, 99085 50202కు సంప్రదించాలన్నారు. -
‘నా భార్య గర్భవతి.. ఇప్పుడు శవం దగ్గరకు పోవద్దంట’
ఒకప్పుడు మృతదేహాన్ని మోయడాన్ని పుణ్యంగా భావించేవారు. ఎవరైనా చనిపోయినపుడు బంధుమిత్రులే కాదు.. ముఖ పరిచయం ఉన్నవారు సైతం అంత్యక్రియల్లో పాల్గొనేవారు. కాసేపైనా పాడెను మోసేవారు. కనీసం ఓ చేయితో పాడెను పట్టుకుని నాలుగడుగులన్నా వేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అంత్యక్రియల్లో పాల్గొనడానికి చాలామంది ఇష్టపడడం లేదు. శవాన్ని మోయడానికి దగ్గరి బంధువులూ ముందుకు రావడం లేదు. దీంతో ‘ఆ నలుగురి’ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెరిగిన సాంకేతికతతో ఓవైపు ప్రపంచమే కుగ్రామంగా మారిపోగా.. మరోవైపు మనుషుల మధ్య మాత్రం దూరం పెరిగిపోతోంది. గతంలో ఎవరో తెలిసిన వారు చనిపోతేనే తల్లడిల్లిపోయిన గుండెలు.. ఇప్పుడు దగ్గరి వారు దూరమైతే కనీసం అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. మనుషుల్లో పెరిగిన స్వార్థం కావచ్చు, మూఢ విశ్వాసాలు కావచ్చు.. చా వు దగ్గరకు వచ్చేసరికి దగ్గరి వాళ్లు సైతం దూరంగా ఉంటున్నారు. ఎంత బలగం ఉన్నా, ఎంతమంది ఆ త్మీయులు ఉన్నా అంత్యక్రియలకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. వచ్చిన వారు కూడా దూరం నుంచే చూసి వెళుతున్నారు. ఏదో కొద్దిమంది మా త్రమే అంత్యక్రియలు అయ్యేదాకా ఆగుతున్నారు. వారు కూడా దూరంగా ఉండి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయోనని ఎదురు చూస్తున్నారు.పెరిగిన మూఢత్వంఇప్పుడు మనుషుల్లో తెలియని మూఢత్వం పెరిగిపోయింది. చాలామంది శవం దగ్గరకే రావడం లేదు. దూరం నుంచి కుటుంబ సభ్యులకు ముఖం చూపించి వెళుతున్నారు. మరికొందరు వచ్చామా, వెళ్లామా అన్నట్టుగా ఉంటున్నారు. పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులు కరువవుతుండడంతో ప్రతిచోటా శవాలను తీసుకువెళ్లేందుకు వైకుంఠరథాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇంటి దగ్గరి నుంచి వైకుంఠరథం దగ్గర దాకై నా మోయాల్సిందే కదా.. అలాగే దింపుడుగల్లం నుంచి వైకుంఠధామం వరకు మోసుకు వెళ్లాల్సిందే కదా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురి అవసరం ఎంతో ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో శవం మోయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో నలుగురు జమయ్యే దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.పట్టణాలు, నగరాల్లో మరీ దయనీయం..గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు కొంతమందయినా హాజరవుతున్నారు. శవాన్ని మోయడానికి ఇబ్బందులు ఎదురవడం లేదు. అయితే పట్టణాలు, నగరాల్లో అయితే దయనీయమైన పరిస్థితి ఉంటోంది. ఎవరైనా చనిపోతే ఇంటి చుట్టుపక్కల వారు కూడా పట్టించుకోవడం లేదు. బంధువులు వచ్చేదాకా ఇంటి దగ్గర నలుగురు జమ కావడం లేదు. ఏర్పాట్లు చేయాలని ఎవరూ ముందుకు రావడం లేదు. బంధువులు, స్నేహితులు వచ్చినా, ఎంతమంది ఉన్నా కొన్నిసార్లు ఇంట్లో నుంచి శవాన్ని పాడైపె పడుకోబెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు.ఇంటికొకరు నిబంధన..అంత్యక్రియల సమయంలో ఎవరూ ఉండకపోవడంతో కొన్ని కుల సంఘాలు కట్టుబాట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని కాలనీలలో కుల సంఘాలు ఎక్కువగా చావుల కోసమే నిలబడుతున్నాయి. సంఘంలో సభ్యులుగా ఉన్న వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలన్న నిబంధనలు పెడుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఇంటి దగ్గర, అంత్యక్రియలకు వెళుతుండగా మార్గమధ్యలో, అలాగే వైకుంఠధామం వద్ద.. ఇలా మూడు, నాలుగుసార్లు హాజరు తీసుకుంటున్నారు. అయితే శవాన్ని మోయాలన్న నిబంధన పెడితే రావడం కూడా తగ్గిపోతుందని ఆ ఒక్కటి మినహాయించినట్టు ఓ కుల సంఘం పెద్దమనిషి ‘సాక్షి’తో పేర్కొన్నారు.విచిత్రమైన కానణాలతో..దగ్గరి బంధువులు చనిపోయినా సరే కొందరు పాడె మోయడానికి ఏవో కారణాలు చెబుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఒక పెద్దాయన చనిపోగా దగ్గరి బంధువు ఒకరు దూరాన నిల్చుని చూస్తున్నాడు. పిలిచినా దగ్గరికి రాకపోవడంతో ఒకాయన అతడి వద్దకు వెళ్లి ‘మీ దగ్గరి వాళ్లు కదా.. శవం మోయడానికి ఎవరూ లేరు. నాలుగు అడుగులు మోయరాదే’ అని బతిమాలాడు. ‘నేను మొన్ననే ఇంటి నిర్మాణానికి గడప ఎక్కించిన. చావుకే వెళ్లొద్దని అందరు అంటున్నా ఇక్కడిదాకా వచ్చిన. శవం మోయద్దటా’ అని సమాధానం చెప్పి మెల్లిగా జారుకున్నాడు.మరో సంఘటనలో ఓ వ్యక్తి శవాన్ని మోయడానికి రావాలని అందరూ పిలుస్తుంటే ‘మొన్ననే నా బిడ్డ పెళ్లి అయ్యింది. కాళ్లు కడిగిన. శవం మోయద్దని అంటున్నరు. అందుకే దూరంగా ఉన్న’ అని మరణించినతని వంశానికి చెందిన వ్యక్తి సమాధానమిచ్చాడు.ఇంకోచోట ఓ వ్యక్తి చనిపోయాడు. రోజూ కలిసి తిరిగిన దోస్తు మాత్రం మృతదేహం దగ్గరికి వచ్చి దూరంగా నిల్చున్నాడు. దోస్తు అమ్మా, నాన్నను ఓదార్చడానికి కూడా వెళ్లలేదు. ఇద్దరు రోజూ కలిసి తిరిగేవారు కదా.. ఎందుకు రావడం లేదు అని అడగ్గా.. ‘నా భార్య గర్భవతి. ఇప్పుడు శవం దగ్గరకు పోవద్దంట. శవాన్ని మోయద్దంట. అందుకే దూరంగా ఉన్న’ అని చెప్పాడు.కొన్నాళ్ల క్రితం జిల్లాలో ఒకాయన చనిపోతే దగ్గరి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఒకాయన రాకపోవడంతో ఆయనకోసం ఎదురుచూడసాగారు. ఫోన్లు చేస్తే సమాధానం ఇవ్వడం లేదు. చివరికి తేలింది ఏమంటే సదరు వ్యక్తి ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. మరో వారంలో గృహ ప్రవేశం ఉంది. అందుకే ఆయన అంత్యక్రియలకు రాలేదు. ఇలా ఏదో ఒక సాకుతో దగ్గరివారి అంత్యక్రియల్లోనూ చాలామంది పాల్గొనడం లేదు. చివరి చూపు కోసం వచ్చినా పాడె మోయడానికి ముందుకు రావడం లేదు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కామారెడ్డి టౌన్: సీనియర్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సబబు కాదని, దీనినుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్ ప్రతినిధులు కోరారు. సోమవారం తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చందర్నాయక్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 15 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, రాజశేఖర్, సత్యనారాయణ, దత్తాచారి, సంతోష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ సొసైటీ చైర్మన్గా ఇంగు రాములు బాన్సువాడ : బీ ర్కూర్ సహకార సంఘం అధ్యక్షు డు ఎవరవుతార న్న ఉత్కంఠకు తెర పడింది. సొసైటీ చైర్మన్గా ఇంగు రాములును నియమిస్తూ సోమవారం డీసీవో రామ్మోహన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో చైర్మన్గా పనిచేసిన గాంధీ అనారోగ్యం కారణంగా పదవి కి రాజీనామా చేశారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న రాధాకృష్ణను ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఆయన సహకార సంఘంలో రూ.1.20 లక్షల విలువ గల ఎరువులను తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో పదవినుంచి తొలగించారు. దీంతో చైర్మన్ పదవి మళ్లీ ఖాళీ అయ్యింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ ఇంగు రాములుతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏ నుగు రవీందర్రెడ్డి వర్గీయుడైన డైరెక్టర్ పో గు పాండు ఇద్దరు చైర్మన్ స్థానం కోసం పో టీపడ్డారు. చివరికి పోచారం వర్గానికి చెంది న రాములునే అధ్యక్ష పదవి వరించింది. 19న విత్తన క్షేత్రంలో పంట ఉత్పత్తుల వేలం నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ఈనెల 19న మధ్యాహ్నం పంట ఉత్పత్తులను వేలం వేయనున్నట్లు క్షేత్రం ఏడీఏ ఇంద్రసేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విత్తన క్షేత్రంలో విత్తనం కోసం ఉపయోగపడని కేఎన్ఎం–1638 సన్నరకానికి చెందిన 492 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విత్తన క్షేత్ర కార్యాలయంలో వీటిని వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు రూ.2 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలం తర్వాత నిర్ధారించిన సొమ్ములో సగం డబ్బులను రెండురోజులో చెల్లించాలని, మిగతా మొత్తాన్ని వారంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. నిజాంసాగర్లోకి భారీ ఇన్ఫ్లో నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38,829 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 వరద గేట్ల ద్వారా 27,128 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూ ర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,404.72 అడుగుల (17.397టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. రేపు జాబ్మేళా కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. హెటెరో ఔషధ కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్ పోస్టులు, 100 జూనియర్ కెమిస్ట్ ట్రైనీ (పురుషులు మాత్రమే) పోస్టులు, 60 జూనియర్ ఇంజినీర్ పోస్టులు భర్తీ చేసేందుకు జాబ్మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 90598 88389, 76719 74009 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
చేప పిల్లలు వచ్చేదెప్పుడో!?
● టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ● ఆందోళనలో మత్స్యకారులు నిజాంసాగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చేప పిల్లల కోసం మత్స్యశాఖ అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టినా.. ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో జిల్లాలో ఈసారి చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై నీలినీడలు అలుముకున్నాయి. జిల్లాలో 2.85 కోట్ల చేప పి ల్లలను సరఫరా చేయాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు బకాయి ఉండడంతో కాంట్రాక్టర్లు టెండర్లకు దూరంగా ఉంటున్నారు. టెండర్ల ప్రక్రియ సాగేలా చూస్తాం. – శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి, కామారెడ్డి జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా.. వానాకాలం సీజన్ ముగింపునకు వస్తున్నా జిల్లాలో ఇప్పటివరకు చేప పిల్లల జాడ లేదు. టెండర్ల ప్రక్రియనే ఇంకా పూర్తి కాలేదు. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది యాభై శాతమే.. జిల్లాలో 768 చెరువులు, కుంటలతో పాటు ప్రధాన జలాశయాలైన నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టుల్లో చేప పిల్లలను వదులుతారు. ఆయా చెరువులు, ప్రధాన జలాశయాల్లో 720 మత్స్య సహకార సంఘాల్లో 14 వేల మంది కార్మికులు ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేందుకు గతంలో 2.85 కోట్ల చేప పిల్లలను వదిలేవారు. అయితే వివిధ కారణాలతో గతేడాది అందులో యాభై శాతమే చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 2.85 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చేపపిల్లల జాడ లేదు. -
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి
బాన్సువాడ రూరల్: తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావు అన్నారు. సోమవారం సోమేశ్వర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి గదిని ప్రారంభించి మాట్లాడారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల పేరిట ప్రైవేటు పాఠశాలకు పంపకుండా గ్రామంలోని పూర్వ ప్రాథమిక పాఠశాలకు పంపించాలన్నారు. హెచ్ఎం శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సఫీయాబేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రహ్మాజీవాడిలో సోమవారం ప్రీప్రైమరీ తరగతులను ఎంఈవో రామస్వామి ప్రారంభించి మాట్లాడారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు కళ్యాణి, సంగారెడ్డి, ఏఎంవో వేణుశర్మ, సీఎంవో నాగవేందర్, పాఠశాల హెచ్ఎం అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్:తిమ్మాపూర్లో సోమవారం ప్రీప్రై మరీ పాఠశాలను ఎంఈవో రాజులు ప్రారంభించా రు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు ఇంద్రజ,హెచ్ఎం అనిల్ కుమార్, ఉపాధ్యాయులు ది వ్య,పంచాయతీ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు. -
అధికారుల కోసం ఎదురుచూపులు
బిచ్కుంద(జుక్కల్): ప్రతి సోమవారం బిచ్కుంద తహసీల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి కొన్ని శాఖల అధికారులు మాత్రమే వచ్చారు. వ్యవసాయ, పీఆర్, విద్య శాఖల అధికారుల రాక కోసం రైతులు, ప్రజలు ఎదురుచూశారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, ఎంపీవో కృష్ణ, ఏపీఎం రవీందర్ మాత్రమే ప్రజావాణిలో పాల్గొన్నారు. మిగత ఆయా శాఖల అధికారులు పాల్గొనలేదు. ప్రజావాణిలో వినతులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు, రైతులు అధికారుల రాక కోసం మధ్యాహ్నం వరకు ఎదురుచూశారు. సంబంధిత అధికారులు ఎంతకీ రాకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. -
భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ
● ఘనంగా హిందీ భాషా దినోత్సవం భిక్కనూరు/ఎల్లారెడ్డి/మద్నూర్/:హిందీ భాషా దినోత్సవాన్ని జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపన్యాసం, డ్రాయింగ్, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన బహుమతులు ప్రదానం చేశారు. హిందీ భాష ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులు ఆటలు, పాటలు, నృత్యరూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. దేశంలో భిన్నమతాలు, భాషలున్నా భారతదేశాన్ని ఏకం చేసే భాష హిందీ మాత్రమేనని అన్నారు. హిందీ భాష గొప్పదనాన్ని, హిందీని సరళంగా నేర్చుకునే విధానం గురించి విద్యార్థులతో మాట్లాడారు. -
వ్యాధులు ప్రబలకుండా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: వ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లాలో డెంగీ వ్యాధి ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి పారిశుద్ధ్య కార్యక్రమాలు క్రమంతప్పకుండా జరగాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలన్నారు. మరో రెండు మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి’
కామారెడ్డి టౌన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిందని, ప్రస్తుత సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని, ఇది సరి కాదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగా ణ విమోచన దినోత్సవంగానే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు విపుల్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు సురేష్, వేణు, సంతోష్రెడ్డి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
18 వరకు రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఈ నెల 18 వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొదటగా ఈ నెల 15 వరకు చివరి తేదీ అని ప్రకటించగా మరో మూడు రోజులు రేషన్ పంపిణీ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.ఎర్రాపహాడ్వాసికి సినారె గజల్ పురస్కారంతాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన కవి కౌడి రవీందర్ సినారె గజల్ పురస్కారం అందుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం రవీందర్ హైదరాబాద్లో కొమ ర్రాజు ఫౌండేషన్ సంస్థ ఆధ్యర్యంలో నిర్వహించిన త్యాగరాయ గాన సభలో పాల్గొని పాట లు, కవిత్వం రాశారు.నైపుణ్యం గర్తించి రవీందర్కు సినారె గజల్ పురస్కారాన్ని అందజేశారు.నేడు ఎస్జీఎఫ్ జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపికగాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పేట్సంగెం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం జోనల్ స్థాయి ఎస్జీఎఫ్ క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని ఎంఈవో శ్రీహరి, పీఈటీ లక్ష్మణ్ రాథోడ్ సోమవారం ఓ ప్రకటననలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో అండర్–14, అండర్–17 విభాగాల్లో పోటీలు నిర్వహించి ఒక్కో విభాగం నుంచి ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వారు వెల్లడించారు.బాలాజీ జెండా వద్ద అన్నదానంమద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో కొలువుదీరిన తిరుమల తిరుపతి బాలాజీ జెండా వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సోమవారం నిర్వాహకులు డాక్టర్ రమణ తెలిపారు. మధ్యాహ్నం బాలాజీ జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అలాగే బుధ, గురువారం రెండు రోజుల పాటు ఈ సారి మండల కేంద్రంలో బాలాజీ జెండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ–పంచాయతీ ఆపరేటర్ సోమిరెడ్డికి నివాళిరాజంపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఈ–పంచాయతీ ఆపరేటర్గా నిధులు నిర్వహిస్తున్న సోమిరెడ్డి ఈ నెల 12 రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవడంపై మండల ఈ–పంచాయతీ ఆపరేటర్లు సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల పరిషత్ కా ర్యాలయంలో సోమిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రఘురాం, ఆపరేటర్లు చంద్రప్రసాద్, ప్రవీణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
పోషణ మాసాన్ని నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: పోషణమాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పోషణమాసం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి వచ్చేనెల 16 వరకు పోషణమాసం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. పోషణ లోపంతో ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీఆర్డీవో సురేందర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఈవో రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లిలో సోమవారం విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల్ల సాయిలు(52) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సాయిలు, భార్య లలిత కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీళ్లు పారించేందుకు సాయిలు బోరు మోటారు స్టార్టరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైల్వే పోలీసులు కాపాడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. సాలూరా మండలంలోని హాజీపూర్కు చెందిన పవన్ (28) ఇంజినీరింగ్ పూర్తి చేసి నిజామాబాద్లో ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిస కావడంతో అప్పులయ్యాయి. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. గాయపడిన పవన్ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నవీపేట: మండలంలోని యంచ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి వాడే ఐరన్ రాడ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అనూష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి వినియోగించే ఇనుప రాడ్లను యంచ సమీపంలో నిల్వ చేశారు. యంచ గ్రామానికి చెందిన పీరాజి వ్యాకంటి కొన్ని రోజులుగా ట్రాక్టర్లో ఇనుమును దొంగిలించాడని పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల ఇనుప రాడ్లను దొంగిలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చోరీకి పాల్పడిన పీరాజి వ్యాకంటిని సోమవారం అరెస్టు చేసి, రెండు టన్నుల ఇనుప రాడ్లను రికవరీ చేశామని ఎస్సై తెలిపారు. చోరీకి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
● అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్ ● కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కామారెడ్డి టౌన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేల కనీస వేతనంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని సీఐటీయూ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ జీవో నంబర్ 8 సవరణ, ఖాళీల భర్తీ తదితర హామీలను అమలు చేయాలన్నారు. గతేడాది జూలై ఒకటో తేదీనుంచే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటితోపాటు, పార్టీ కార్యాయాన్ని ముట్టడించామన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్ కుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బాబాయి, ప్రతినిధులు లక్ష్మి, యాదమ్మ, సురేఖ, విజయ, సరిత, సుజాత, సునంద, సిద్దమ్మ, లలిత, సురేఖ, రాణి, కవిత, అలివేలు, స్రవంతి తదితరులు పాల్గోన్నారు. -
భక్తిశ్రద్ధలతో దర్గా ఉత్సవాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలోని పీరానే పీర్ ఆజం దస్తగీర్ హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని దర్గా ఉత్సవాలను ఖాన్ ఖాయే ఆబిదుల్ హాష్మీ పీఠాధిపతి హజ్రత్ మహ్మద్ షరీఫోద్దీన్ షత్తారీ ఉల్ ఖాద్రి ఆధ్వర్యంలో సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద ఖురాన్ను పఠనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం గంధం, చాదర్ను దర్గాకు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖవాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగంపేట(ఎల్లారెడ్డి): పర్మళ్ల గ్రామానికి చెందిన పెద్దమ్మ ఆలయం కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బద్ద ప్రభురాజు, ఉపాధ్యక్షులుగా కొడబోయిన రాజు, జగతి రంజిత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఈర్ల పద్మరావు, కోశాధికారిగా ఈర్ల చిరంజీవి, సలహాదారులుగా దుర్గేష్, సాయిబాబు, బాల్రాజు, సురేష్లను ఎన్నుకున్నారు. -
‘బోను ఏర్పాటు చేస్తాం’
మద్నూర్: చిరుత పులి జాడ కోసం గాలిస్తున్నామని, దానిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేస్తా మని అటవీశాఖ రేంజ్ అధికారి సంతోష తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయానికి సో మవారం మద్నూర్ గ్రామస్తులు, రైతులు తరలి వచ్చి చిరుత పులిని పట్టుకోవాలని తహసీల్దార్ ము జీబ్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం తహసీల్ కార్యలయానికి వచ్చిన అటవీశాఖ అధికారులు రై తులతో సమావేశమయ్యారు. పులిని పట్టుకోవడాని కి డ్రోన్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా అ టవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి సుజాత, బీట్ అధికారి రాంచందర్, రైతులు బాల్కిషన్, రాములు, హన్మండ్లు, పరశురాం, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫాగింగ్... పరేషాన్..!
బాన్సువాడ రూరల్: దోమకాటుతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల నివారణకు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ మెషిన్లు చాలా పంచాయతీల్లో చెడిపోగా మరికొన్ని చోట్ల మిషన్లను వినియోగించడం లేదు. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్తో పాటు ఇతర వైరల్ జ్వరాలు తాండవం చేస్తున్నాయి. గత ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ.35 వేల నుంచి 40 వేలు వెచ్చించి ఫాగింగ్ మెషీన్లను కొనుగోలు చేసింది. కొన్ని మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులతో పంచాయతీ కార్యదర్శులు ఫాగింగ్ చేయిస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో యంత్రాలు చెడిపోవడంతో పక్కనున్న పంచాయతీల నుంచి తీసుకుని రావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించాలని అధికారులు సూచనలు చేసినప్పటికీ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. డీజిల్, పెట్రోల్, లిక్విడ్లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తోంది. ఖర్చు తడిసి మోపెడు.. మండలంలోని చాలా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులు చేయించలేక మూలన పడేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఒక్కో మేజర్ పంచాయతీలో ఒకసారి ఫాగింగ్ చేయించాలంటే రూ.7 వేల నుంచి 10 వేలు ఖర్చవుతాయి. ఇప్పటికే ఒక్కో కార్యదర్శి రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు అప్పుల పాలై అభివృద్ధి పనులు చేయించారు. గ్రామాల్లో ఫాగింగ్ చేయకపోతే దోమలు పెరుగుతాయి.. చేస్తే పంచాయతీ కార్యదర్శులకు అప్పులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేపట్టాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్ కావడంతో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసినప్పుడే దోమలను సగం వరకు నియంత్రణ చేయవచ్చు. గ్రామం మొత్తంగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదు. ఒకసారి పిచికారి చేయించిన ఫొటోలనే మార్చి మార్చి ప్రతినెలా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దోమకాటుకు పల్లెలు విలవిల మూలన పడిన యంత్రాలు కొరవడిన అధికారుల పర్యవేక్షణ ఫాగింగ్ చేస్తే అప్పులు..చేయకుంటే దోమలు పెరుగుతున్నాయంటున్న కార్యదర్శులుప్రతి గ్రామంలో దోమల నివారణ కోసం మందును పిచికారీ చేయాలని కార్యదర్శులకు సూచనలు ఇచ్చాం. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ మిషన్లు పాడైనట్లు కార్యదర్శులు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. – సత్యనారాయణరెడ్డి, డీఎల్పీవో, బాన్సువాడ -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 82 దరఖాస్తులు కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 82 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయించాలి ఇటీవల వరదలకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతూ భిక్కనూర్కు చెందిన గంగుల రవీందర్ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడకు వెళ్లేదారిలో ఉన్న దశనామ కుంట కట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని వినతిపత్రం సమర్పించారు. -
వరదలతో రూ.6.59 కోట్ల నష్టం
● ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్కుమార్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలతో విద్యుత్శాఖకు రూ.6.59 కోట్ల నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్కుమార్ తెలిపారు. చీనూర్, వెంకంపల్లి గ్రామాల్లో జరుగుతున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. వరదల వల్ల ముంపునకు గురై తేలిన పంటలను కాపాడేందుకు తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 589 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతోపాటు 864 విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. కాగా ఇప్పటివరకు 350 ట్రాన్స్ఫార్మర్లను బిగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. ట్రాన్స్కో డీఈఈ విజయసారథి, ఏడీఈ ప్రసాద్రెడ్డి, లైన్మెన్ సురేందర్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సీడీసీ డైరెక్టర్ పీర్రెడ్డి ఉన్నారు. -
ఐఐహెచ్పీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి టౌన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్(ఐఐహెచ్పీ) నిజామాబాద్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వైద్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు క్రిష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సుబ్బారావు, ప్రవీన్కుమార్, రాంప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కులకర్ణి, సహాయ కార్యదర్శులుగా చిలుక శ్రీనివాస్, ఇందిరామోహన్, కోశాధికారిగా మహేశ్కుమార్, మహిళా సభ్యులుగా పద్మజ, పద్మావతి, సృజన, ప్రనద్విత, సలహాదారులుగా గోపీకృష్ణ, రాజశేఖర్రెడ్డి, రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా రవీందర్, రుద్రశ్రీనివాస్, క్రాంతికుమార్, రజనీకాంత్లను ఎన్నుకున్నారు. ‘హలో లంబాడీ.. చలో హైదరాబాద్’ను జయప్రదం చేయాలి కామారెడ్డి టౌన్: లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే హలో లంబాడీ.. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ నాయక్, నాయకులు అర్జున్, సర్దార్, శంకర్, నవీన్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. -
మురికి కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని శివసాయి కాలనీలోగల మురికి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. సదరు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ప్యాంట్ జేబులో దొరికిన ఆధార్ కార్డులో నిర్మల్ లక్ష్మణ్ పేరు ఉందన్నారు. వయస్సు 42, చిరునామా బ్రాహ్మణపల్లి, ఎడపల్లి మండలం అని ఉందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించినాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడవిలింగాల్ గేట్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఆదివారం లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని బురదలో కూరుకుపోయింది. లారీ ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బ్రిడ్జి పక్కకు కూరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఆర్అండ్బీ డీఈ నారాయణ, ఏఈ ఐశ్వర్యలు స్పందించి బ్రిడ్జిపై దిగబడిపోయిన లారీని క్రేన్ల సహాయంతో తొలగించి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. నారింజపండ్ల లారీ బోల్తా.. ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో నారింజ పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నారింజ పండ్ల లోడ్ తో ఉన్న లారీ ఆదివారం హైదరాబాద్ నుంచి నాగ్పూర్వైపు జాతీయ రహదారిపై వెళ్తోంది. మండలంలోని చంద్రాయన్పల్లి శివారులో ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి బోల్తాపడి సర్వీస్రోడ్డుపై పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. బాన్సువాడ రూరల్: మండలంలోని జక్కల్దాని తండా శివారులో గల అటవీప్రాంతంలో పేకాడుతున్న ముగ్గురిని పట్టుకున్నట్లు బాన్సువాడ సీఐ మండల అశోక్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. అలాటే వారి వద్ద నుంచి రూ.24, 470 నగదు 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈనెల 9న కూడా ఇదే జక్కల్దాని తండాలోని స్మశానవాటిక వద్ద పేకాడుతున్న నలుగురిని పట్టుకొని రూ.10,270 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మట్కా ఆడుతున్న ముగ్గురు.. ఆర్మూర్టౌన్: పట్టణంలో మట్కా ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మట్కా స్థావరంపై దాడిచేసి గుజరాతి గోవర్ధన్, వొడుల మోహన్, మహ్మద్ రహీముద్దీన్ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ. 15వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయిన మట్కా నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత దా డిచేసి రెండు లేగ దూడలను హతమార్చినట్లు బాధితుడు దూప్సింగ్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆవుల మందను మేతకు అడవికి తీసుకెళ్లగా సాయంత్రం రెండు లేగదూడలు కనిపించలేదని తెలిపారు. లేగదూడల కోసం మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో గాలించగా ఆదివారం కుళ్లిపోయిన లేగదూడల కళేబరాలు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. చిరుత దాడిలోనే లేగదూడలు మృతి చెందాయని, అటవీశాఖ అధికారులు నష్టపరిహారం అందజేయాలని కోరారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఇందల్వాయి/ఖలీల్వాడి: ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే లైనును ఓ వ్యక్తి దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం తన పొలం వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఇందల్వాయి–సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలను అతడు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో శతాధిక వృద్ధురాలు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సామల నర్సవ్వ(103) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సవ్వ వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా తన పనులు తాను చేసుకునేదని పేర్కొన్నారు. నర్సవ్వ మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. -
వానర మూక స్వైర విహారం
రామారెడ్డి: వానరమూక రోడ్డుపై తిష్ట వేసి రోడ్డుపై వెళ్లే వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట మర్రి నుంచి రెడ్డిపేట ఎల్లమ్మ గుడి వరకు కిలోమీటర్ దూరం వరకు వానరమూక గుంపులు గుంపులుగా ఆదివారం హల్చల్ చేశాయి. ఆ వానరమూకను అక్కడి నుంచి తరలించడం ఎవరికీ సాధ్యం కాకపోవడంతో చుట్టుపక్కల రైతులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై వానర మూకలను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ పెద్ద చెరువు కట్ట తాత్కాలిక పనులను ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కట్ట తెగిపోవడంతో కట్ట నిర్మాణ పనులను తాత్కాలికంగా జరుపుతున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పంటలు ఎండకుండా వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా ఉండేందుకు పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. బతుకమ్మ పండుగలో భాగంగా హాస్టల్లో బాలికలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. వార్డెన్ విజయశాంతి, బాలికలు తదితరులున్నారు. -
పలువురిపై కేసు నమోదు
మోపాల్: మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల ఎల్లయ్యపై అకారణంగా దాడిచేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లయ్య టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేక్రమంలో ఆదివారం సాయంత్రం గేదెలు అడ్డుగా ఉన్నాయని టిప్పర్ను రోడ్డు పక్కన నిలిపాడు. వెనకాల బైక్లపై వస్తున్న నిజామాబాద్కు చెందిన యువకులు టిప్పర్ను ఎందుకు నిలిపావంటూ ఎల్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడ్డారు. ఆరు ద్విచక్ర వాహనాలపై పది మంది యువకులు వచ్చి దాడిచేశారని ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహాబూబ్(20)అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వచ్చాడు. ప్రాజెక్టు అలుగు పైనుంచి వెళ్తుండగా, కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. నీటమునిగి ఊపిరాడక మృతిచెందినట్లు తెలిసింది. మృతుడి అన్న షేక్ వాజీద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారులో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్తో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు. -
కళాశాలకు ప్రొజెక్టర్ అందజేత
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ముగ్గురు సీఐలు కలిసి ప్రాజెక్టర్ను అందజేశారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో బాన్సువాడ పట్టణానికి చెందిన చతుర్వేది అభినవ (సర్కిల్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్), సంజీవ్ (సర్కిల్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్), సాజిద్(జోనల్ ఇన్స్పెక్టర్, నిజామాబాద్)లు కలిసి రూ.30 వేలు విలువ గల ప్రొజెక్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు. భవిష్యత్లో ఉన్నత స్థానాలను సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం, ఇన్చార్జి ప్రిన్సిపల్ శివకుమార్, అధ్యాపకులు ఉన్నారు. -
ఒక్క బస్తా యూరియా కోసం..
● పనులన్నీ వదిలేసుకొని రాత్రి పగలు పడిగాపులు ● అన్నారం, రెడ్డిపేట గ్రామాలలో యూరియా కోసం బారులు తీరిన రైతులురామారెడ్డి: రైతులకు ఒక యూరియా బస్తా దొరకడమే గగనమైపోయింది. ఒకరోజు ఒక బస్తా యూరియా కోసం టోకెన్ తీసుకోవడం కోసం క్యూ లైన్, ఆ తర్వాత తీసుకున్న టోకెన్ ద్వారా యూరియా బస్తా తీసుకోవడం కోసం మరో క్యూ లైన్లో ఉండాల్సి వస్తోంది. ఆదివారం రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట, అన్నారం గ్రామాలలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. పోలీసులు యూరియా పంపిణీ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెడ్డి పేటలో 440 బస్తాలు పంపిణీ చేయగా, అన్నారంలోనూ 440 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.నాకు 79 ఏళ్లు. మబ్బున మూడు గంటలకు వచ్చి లైన్ కట్టిన. లైన్లో నిలబడి కింద పడితే పక్కన కూర్చోపెట్టారు. ఒక బస్తానైనా దొరుకుతుందో లేదో తెలవదు. – సాయవ్వ, రైతు, అన్నారం -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
బిచ్కుంద(జుక్కల్): పల్లెల నుంచి పట్టణం వరకు విషజ్వరాలు విజృంభించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు జ్వర పీడితులున్నారు. కురిసిన వర్షాల వల్ల బిచ్కుందలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాల్ అధికారులు పారిశుద్ధ్యంపై అంతగా దృష్టిసారించకపోవడంతో ఆయా వార్డులలో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఎటుచూసినా ఇళ్ల నివాసాల మధ్య మోకాళ్ల వరకు వరద, మురికి నీరు ఆగి ఉన్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు, పట్టణంలో మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య లోపాన్ని నిర్మూలించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో దోమలకు మురికి ప్రాంతాలు ఆవాసాలుగా మారుతున్నాయి. వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వివిధ వ్యాధులు, జ్వరాల బారినపడుతున్నారు. రోజురోజుకు ఆస్పత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య పెరుగుతోంది. డెంగీ కేసులతో ఆందోళన.. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జులై, ఆగ స్టు నెలల్లో 59 డెంగీ కేసులు నమోదయ్యాయి. బి చ్కుందలో 2 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. హ జ్గుల్లో 12 ఏళ్ల బాలునికి, బిచ్కుందలో ఓ మహిళకు డెంగీ బారినపడి బిచ్కుంద, బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం చికిత్స పొందారు. ఇంటి పరిసరాలలో ఆగిన మురికి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. డెంగీ కేసులు పెరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నా వైద్య అరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు చోద్యంచూస్తున్నారు. నిధుల కొరతతో పనుల్లో జాప్యం.. బిచ్కుంద మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి మోటార్లు, వీధి లైట్లు, కార్మికులు వేతనాలకు ఇచ్చి పనులు చేస్తున్నట్లు జీపీ అధికారులు అంటున్నారు. జీపీ నిర్వహణకు ప్రభుత్వం చిల్లి గవ్వ నిధులు ఇవ్వలేదు.. పనులు చేయలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. బిచ్కుంద కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగైదు నెలల కావస్తుంది..కానీ ఇప్పటి వరకు నిధులు రాలేదు. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉందని పనులు చేపట్టడానికి వార్డు ఆఫీసర్లు వెనకడుగు వేస్తున్నారు. ఇకనైనా కలెక్టర్ స్పందించి జీపీలు, మున్సిపాలిటీకి నిధులు వచ్చే విధంగా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇళ్లల్లోని తొట్టెలలో నిలువ నీటి పారబోత, ఇంటి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు బిచ్కుంద మండలంలో విఫలమయ్యారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నట్లు ఎక్కడా ఆనవాళ్లు కనపడటం లేదు. ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం చేపట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాల్సిన వైద్య సిబ్బంది, జీపీ అధికారులు పత్తాలేకుండా పోయారు. విషజ్వరాల గుర్తింపు.. తూతుమంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పారుతున్న మురికి నీరు జిల్లాలో రెండు నెలల్లో 59 డెంగీ కేసులు బిచ్కుందలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ ప్రబలుతున్న విషజ్వరాలు.. ఆందోళనలో ప్రజలు చోద్యం చూస్తున్న మున్సిపల్, వైద్య శాఖాధికారులు -
తల్లిని చంపిన కొడుకు అరెస్టు
బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్తో కలిసి సాయవ్వను బైక్పై ఎక్కించుకొని బోలక్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్ను, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్కు తరలించామని, మైనర్ను జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించామని అన్నారు. దోమకొండ: నియోజకవర్గంలో యూరియా కొరత రాకుండా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తెలిపినట్లు మాజీ సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య తెలిపారు. ఆదివారం షబ్బీర్అలీని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలువగా, సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలపై బీబీపేట ఎస్సైతో పాటు పార్టీ నాయకులు, అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు గెలిచేలా కృషి చేయాలని సూచించారని అన్నారు. దోమకొండ: మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సందెల అబ్బయ్య, సిద్దరాములు, రంజిత్గౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, మాజీ ఎంపీపీ కానుగంటి శారద, భక్తులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరి మాత ఆశ్రమంలో శనివారం రాత్రి భక్తులు భగవన్నామ సంకీర్తనలతో ప్రత్యేక భజనలు చేశారు. అలాగే ఆలయం ప్రాంగణంలోని వెంకటేశ్వర, దత్తాత్రేయ, మార్కండేయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈయేడాది పంటలు బాగా పండాలని దేవతామూర్తులను వేడుకున్నారు. రెండో శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. -
షార్ట్సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో షార్ట్ సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా.. గోసంగి కాలనీలో సల్ల భాగ్య, తురపాటి సాయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి పాత సా మాన్ల కొనుగోలు వ్యాపారం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో వారు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సల్ల భాగ్య ఇంట్లో విద్యుత్ తీగలు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కన ఉన్న తూరపాటి సాయమ్మ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేశారు. కానీ అప్పటికే రెండు ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి. సల్ల భాగ్య ఇంట్లో తులం బంగారం, వెండి ఆభరణాలు, రూ.3లక్షల నగదు కాలిపోగా, తూరపాటి సాయమ్మ ఇంట్లో కొంత నగదుతోపాటు వంట సామగ్రి, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయాయి. సుమారు రెండు ఇళ్లల్లో కలిపి సుమారు రూ. 5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధి తులు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్ బాధిత కుటుంబాలను పరామర్శించి వంట సామగ్రి, దుస్తులను అందజేశారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు భిక్కనూరు/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. భిక్కనూరులోని పద్మశాలి కల్యాణ మండపంలో ఆదివారం భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు పెద్దమల్లారెడ్డిలోని వీరభద్ర ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ ఉన్నత పాఠశాల 2001–02 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు సైతం సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. -
సంస్కారాన్ని నేర్పుతున్న శిశుమందిరాలు
● ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు ● ముగిసిన రాష్ట్రస్థాయి గణిత విజ్ఞాన మేళా కామారెడ్డి అర్బన్: నైతిక విలువలు కనిపించకుండా పోతున్న ప్రస్తుత సమాజంలో చదువుతో పాటు సంస్కారం నేర్పుతున్న శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలల్లో చదువుకోవడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలని కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు పేర్కొన్నారు. శ్రీసరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో కామారెడ్డిలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో శుక్రవారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి గణిత సాంస్కృతిక విజ్ఞాన మేళా ఆదివారం ముగిసింది. ముగింపు సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. పోటీ ప్రపంచంలో ఆధునిక సాంకేతికత నుంచి మంచిని మాత్రమే తీసుకోవాలని, భారతీయులందరు తన కుటుంబ సభ్యులేననే జాతీయ భావన ప్రతి ఒక్కరిలో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. విద్య, నిజాయితీ, వ్యక్తిత్వం, సవాళ్లను ఎదుర్కొనే శక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. మానవ జీవితంతో గణితం, సైన్స్ విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని ముఖ్యవక్త అర్ధచంద్ర ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన మేళా విజేతలకు బహుమతులు అందించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావులను సన్మానించారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఒకే వేదికపై సన్మానించడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, శ్రీసరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్రావు, వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షులు సామల గంగారెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు కృష్ణమాచార్యులు, హరిస్మరణ్రెడ్డి, గీరెడ్డి రాజారెడ్డి, రంజిత్మోహన్, మల్లేష్యాదవ్, ప్రధానాచార్యులు నాగభూషణం, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులకు నిధులు మంజూరు
● 8 పనులకు రూ. 46 లక్షలు.. ● యుద్ధ ప్రాతిపదికన పనుల ప్రారంభానికి చర్యలునిజాంసాగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షా లతో దెబ్బతిన్న ప్రాజెక్టులు, చెరువులకు తాత్కాలిక మరమ్మతులకోసం నిధులు మంజూరయ్యాయి. పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. కల్యాణి ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గత నెల 27న మట్టి కట్టలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో ప్రాజెక్టు మట్టికట్టలు తెగడంతో బొగ్గుగుడిసె చౌరస్తా నీటమునిగింది. మట్టి కట్టలకు తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో కల్యాణి ప్రాజెక్టుకు రెండువైపులా కొట్టుకుపోయిన మట్టి కట్టల వద్ద ఇసుక బస్తాలు, మట్టి, మొరం వేసి తాత్కాలికంగా గండ్లు పూడ్చనున్నారు. చెరువు కట్టలకు.. మహమ్మద్నగర్ మండలంలోని నర్వ పాతచెరువు పంట కాలువ కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతుల కోసం రూ. 5.9 లక్షలు మంజూరయ్యాయి. సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ తాత్కాలిక మరమ్మతులకు రూ. 9.5 లక్షలు మంజూరు చేశారు. గాలిపూర్ చెరువు మరమ్మతులకు రూ. 2 లక్షలు, మద్నూర్ మండలం హండేకల్లూర్ చెరువుకు లక్ష రూపాయల చొప్పున ఫ్లడ్ డ్యామేజ్ కింద నిధులు మంజూరయ్యాయి. చిన్నపూల్ వంతెన రెయిలింగ్కు.. ఇటీవల నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్లోని చిన్నపూల్ వంతెన రెయిలింగ్ కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతుల కోసం రూ. 6.75 లక్షలు మంజూరయ్యాయి.వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మట్టి కట్టలకు తాత్కాలిక మరమ్మతుల కోసం ఎమర్జెన్సీ కింద రూ. 46 లక్షలు మంజూరయ్యాయి. కల్యాణి ప్రాజెక్టు మట్టికట్టలతో పాటు సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్, పలు చెరువులకు మరమ్మతుల కోసం నిధులు వచ్చాయి. ఒకటిరెండు రోజుల్లో టెండర్లు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. – సోలోమన్, నీటిపారుదల శాఖ ఈఈ, నిజాంసాగర్ -
చిరుత కోసం గాలింపు
మద్నూర్ : మండల కేంద్ర శివారులో చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆదివారం అటవీ అధికారులు చిరుత జాడ కోసం గాలింపు చేపట్టారు. మండలంలోని హండేకేలూర్ శివారులో, పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాగ్రాల్ శివారులో చిరుత ఉందన్న సమాచారంతో తెలంగాణతోపాటు మహారాష్ట్రకు చెందిన అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలలో పాల్గొంటున్నాయి. చిరుత తిరిగిన చోట పాదముద్రలను సేకరించామని జుక్కల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి సుజాత తెలిపారు. వాటిని గమనిస్తే చిరుత అడుగులుగానే కనిపిస్తున్నాయని, వాటిని ల్యాబ్కు పంపిస్తామని పేర్కొన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా దానిని పట్టుకోవాలని కోరుతున్నారు. ‘తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు’ కామారెడ్డి అర్బన్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పూలపండుగ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని సంస్కార భారతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేకేవీ శర్మ కోరారు. ఆదివారం సంస్కారభారతి కామారెడ్డి శాఖ కార్యాలయంలో బతుకమ్మ సంబరాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమ్మిరెడ్డి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజు, మాతృశక్తి కన్వీనర్ ఎన్.ప్రసన్న, ఉపాధ్యక్షులు మనోహర్, చిన్న సిద్ధిరాములు, ప్రతినిధులు రామచంద్రరావు, స్వామిగౌడ్, సాయిబాబాగౌడ్, రమేష్గౌడ్, పరమేశ్వర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస పోటీలు బాన్సువాడ : బాన్సువాడలోని గిరిజన ఆశ్ర మ పాఠశాలలో ఆదివారం హిందీ దివస్ను పురస్కరించుకుని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మేరా యువ భారత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతు లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ హిందీ భాష నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా భాషా సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం విజయభారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోచారం ప్రధాన కాలువ మరమ్మతుల పరిశీలన నాగిరెడ్డిపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాల కు నాగిరెడ్డిపేట శివారులో దెబ్బతిన్న పోచా రం ప్రధాన కాలువకు చేపట్టిన మరమ్మతులను ఆదివారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రధాన కాలువకు చేపడుతున్న మరమ్మతులకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్కు పలు సూచనలు ఇచ్చారు. మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన వర్క్ఇన్స్పెక్టర్ యాదగిరి ఉన్నారు. ‘యాత్రాదానం’ ప్రారంభం ఖలీల్వాడి: పర్యాటక రంగ అభివృద్ధి, ప్రయాణికులకు విభిన్నమైన సేవలు అందించేందుకు ‘యాత్రాదానం– గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్’ పథకాన్ని ప్రారంభించినట్లు ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ పథకం కింద కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, విద్యాసంస్థలు, సమాజ సేవా సంస్థలు, ఉమ్మడి కుటుంబాలు స్పాన్సర్షిప్ ద్వారా బస్సు యాత్రలను అందించవచ్చన్నారు. ఆసక్తిగలవారు 99592 26018(కామారెడ్డి), 99592 26020(బాన్సువాడ), నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బీర్కూర్ ‘సహకారం’ ఎవరికో?
● పోచారం, ఏనుగు వర్గీయుల మధ్య పోటీ ● నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశంబాన్సువాడ : బీర్కూర్ సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల డైరెక్టర్లు పట్టుబడుతు న్నట్లు తెలుస్తోంది. గతంలో సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆరు నెలల క్రితం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాధాకృష్ణకు అధికారులు ఇన్చార్జి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. కాగా ఆయన సహకార సంఘంలో బకాయి పెట్టి ఎరువులను తీసుకున్నారు. ఎరువుల బకాయిలు రూ.1.20 లక్షలు చెల్లించాలని జిల్లా సహకార అధికారులు రాధాకృష్ణకు నోటీసులు ఇచ్చారు. అయితే రాధాకృష్ణ ఎంతకీ బకాయి మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఇన్చార్జి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవల అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్ష పదవికి మరో డైరెక్టర్ను నియమించాల్సి ఉంది. పోచారం వర్గానికి చెందిన డైరెక్టర్ ఇంగు రాములు, ఏనుగు రవీందర్రెడ్డి వర్గానికి చెందిన పోగు పాండు అధ్యక్ష పదవి కోసం పట్టుపడుతున్నారు. ఇరువురు కూడా స్థానిక నాయకులతో కలిసి రెండు రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి వర్గానికి చెందిన ఇంగు రాములు తన నాయకులతో కలిసి సీఎంతో పాటు మంత్రులను కలిసినట్లు తెలిసింది. ఏనుగు రవీందర్రెడ్డి వర్గానికి చెందిన పోగు పాండు.. ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డివిజన్లో అందరి దృష్టి బీర్కూర్ సహకార సంఘంపై ఉంది. నేడో రేపో అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
విద్యుత్ షాక్తో మూడు గేదెలు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామ శివారులో విద్యుత్ షాక్తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్మెన్ పాండు తెలిపారు. గ్రామానికి చెందిన మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటారు సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్పై పడింది. ఈక్రమంలో శనివారం అదే గ్రామానికి చెందిన ఆకుల సురేందర్, గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములుకు చెందిన గేదెలు గ్రామ శివారులోకి మేతకు వెళ్లాయి. దీంతో గేదెలు మేత మేసుకుంటూ వెళ్లగా ఫినిషింగ్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గేదెల విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చికిత్సపొందుతూ వృద్ధురాలు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నట్ట అనసూయ(79) అనే వృద్ధురాలు గత నెల 28న కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వెళ్లి కాలుజారి నేలపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న మె దక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 8న హైదరాబాద్ లోని నిమ్స్కు తరలించి చికిత్స చేయించారు. కాగా ఈ నెల 12న ఆమె ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాహిత అదృశ్యం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కర్రె రవికి, నాగిరెడ్డిపేటలకు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉ న్నారు. భార్యాభర్తలు పిల్లలతో కలిసి గతేడాది జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ దంపతుల మధ్య విబేధాలు తలెత్తడంతో భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. నాగిరెడ్డిపేటలోని తన తల్లిగారింట్లో గత నెల 16న నిద్రించిన సదరు వివాహిత మరుసటి రోజు నుంచి అదృశ్యమైంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో వివాహిత తల్లి శనివారం నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు వివాహిత అదృశ్యంపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సైపేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన జిల్లా కేంద్రంలోచోటు చేసుకుంది. వివరాలు ఇలా.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విభూతి దివ్య–రమేష్ దంపతులకు 4 ఏళ్ల కుమార్తె పల్లవి ఉంది. చిన్నారి శనివారం సాయంత్రం ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిరానగర్ కాలనీ వద్ద స్థానికులు గమనించి చిన్నారిని పోలీసులకు అప్పగించారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. వారు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. -
క్రైం కార్నర్
● మద్నూర్లో చోటుచేసుకున్న విషాద ఘటన ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు తొట్టెలో పడి బాలుడు మృతి మద్నూర్(జుక్కల్): నీటి తొట్టెలో పడి బాలుడు ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిర నగర్ కాలనీకి చెందిన మేత్రివార్ రాజు, అనిత దంపతులు మద్నూర్లోని పాత బస్టాండ్లో టీ పాయింట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజు టీ పాయింట్లో ఉండగా, అనిత ఇంట్లో వంట చేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉండగా చిన్న కొడుకు అక్షయ్ (2) ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టె వద్దకు వెళ్లాడు. అక్షయ్ చేతిలో ఉన్న ఆట వస్తువు నీటి తొట్టెలో పడటంతో దాన్ని తీసుకోవడానికి వంగడంతో బ్యాలెన్స్ తప్పి తల నీటి తొట్టెలోకి పడిపోయి కాళ్లు బయటకు తేలాయి. కొద్ది సేపటికి తల్లి అనిత బయటకు వచ్చి చూడగా అక్షయ్ నీటి తొట్టెలో కనిపించాడు. బాలుడిని నీటి తొట్టెలోంచి బయటకు తీసి స్థానికులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. -
లోక్ అదాలత్లో భారీగా కేసుల పరిష్కారం
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్టులో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ ఇరువర్గాల కక్షదారులకు మాట్లాడి లోక్ అదాలత్ కింద కేసులు పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్లో 356 కేసుల పరిష్కరంకాగా, డ్రంక్ డ్రైవ్, సెటిల్మెంట్ ద్వారా రూ.23,67,360 రికవరీ చేశారు. న్యాయవాదులు లక్ష్మణరావు, మల్లేశ్వర్, విఠల్రావు, ప్రకాష్, విఠల్, బిచ్కుంద ఎస్సై మోహన్రెడ్డి, మద్నూర్ ఎస్సై విజయ్కొండ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో .. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో 441 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్ ద్వారా రూ.13,98,145 రికవరీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోపాల్రావు, పండరి, శ్రీనివాస్, నవీద్, సాయిప్రకాష్ , శ్రీకాంత్, సాయిబాబా, సతీ ష్, ఎకై ్సజ్సీఐ షాకీర్ అహ్మద్ తదితరులున్నారు. బాన్సువాడ కోర్టులో.. బాన్సువాడ రూరల్: లోక్ అదాలత్తో కేసులు సత్వర పరిష్కారం అవుతాయని బాన్సువాడ సివిల్కోర్టు న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి అన్నారు. కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్లో 300 కేసుల పరిష్కరంకాగా, సెటిల్మెంట్ ద్వారా రూ.16,23, 222 రికవరీ చేశారు.ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ మోహన్రెడ్డి, న్యాయవాదులు ఖలీల్, దత్తాత్రేయ, మోగులయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
మద్నూర్లో మళ్లీ చిరుత పులి అలజడి..!
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సుజాత మద్నూర్(జుక్కల్): చిరుత పులిపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సూజాత సూచించారు. మండల కేంద్రంలో చిరుత పులి వచ్చిందని సమాచారం మేరకు శనివారం ఆమె, సిబ్బందితో కలిసి పంట చెలల్లో పరిశీలించారు. పొలంలో గడ్డి కోసుకుంటుండగా చిరుత పులి కనబడిందని రైతు పరుశురాం చెప్పడంతో మద్నూర్లో ఆందోళన నెలకొంది. మూడు రోజుల క్రితం చిరుతపులి కనిపించిందని పుకార్లు షికార్లు కావడంతో అటవీశాఖ అధికారులు అది పులి కాదు అడవి పిల్లి అని తేల్చడంతో అందరు ఊపిరిపిల్చుకున్నారు. మళ్లీ శనివారం చిరుత పులిని చూశానంటు రైతు పరశురాం భయంతో పరుగులు తీసి మద్నూర్లో పలువురికి చెప్పడంతో గ్రామస్తులు తండోపతండాలుగా చిరుత పులి ఉన్న ప్రదేశానికి తరలివెళ్లారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మండల కేంద్రానికి సమీపంలోని సోనాల గ్రామానికి వెళ్లె రహదారి పక్కన చిరుత పాద ముద్రల కోసం వెతికారు. చిరుత కనిపించిందని చెబుతున్న పులికి సంబంధించిన ఆనవాళ్లు లేవని జుక్కల్ రేంజ్ ఫారెస్టు అధికారిణి సూజాత అన్నారు. చిరుత పులి గోళ్లు పోడువుగా ఉంటాయని మద్నూర్ శివారులో కనిపించిన గుర్తులు అలా లేవని ఆమె అన్నారు.మద్నూర్, సోనాల, పెద్ద శక్కర్గా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల్లో చాటింపు వేయించాలని జీపీ సిబ్బందికి సూచించామన్నారు. మద్నూర్ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గల రేకులషెడ్డు వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని ఆదివారం సీసీ ఫుటేజీని పరిశీలిస్తామన్నారు. -
జీజీహెచ్లో నవజాత శిశువు మృత్యువాత
● ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టిన బంధువులు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అ ప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వై ద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని శిశువు కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడికి చెందిన అఖిల పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జీజీహెచ్కు వచ్చింది. వైద్యులు అర్ధరాత్రి ఆమెకు ప్రసవం చేశారు. ఆడపిల్ల పుట్టడంతో మహాలక్ష్మి పుట్టిందనే కుటుంబ సభ్యుల సంబరం కొద్దిసేపటికే ఆవిరైంది. మృత శిశువు జన్మించిందని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. కాలయాపన చేయకుండా ఆపరేషన్ చేసి ఉంటే శిశువు బతికేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. పట్టణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి వారిని సముదాయించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. ఉమ్మనీరు మింగడంతోనే శిశువు మృతి చెందిందని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం: కేసు నమోదు నవీపేట: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మూడు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వర్గానికి చెందిన యువకుడు ప్రార్థనా మందిరంపై జెండాను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియలో షేర్ చేశాడు. ఇది వైరల్గా మారడంతో ఆగ్రహానికి గురైన మరో వర్గానికి చెందిన యువకులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేశారు. ఈక్రమంలో వారు పోలీస్ స్టేషన్లో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. ఆరుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జీ మంథని సామ్యెల్ డిమాండ్ చేశారు. డోంగ్లీ మండల కేంద్రంలో శనివారం ఆయన ఎమ్మార్పీఎస్ నా యకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా .. దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్, వృద్ధులు, వితంతువులు చేయూత పెన్షన్దారులకు రూ.4 వేల పింఛన్ను ఇవ్వడంలేదని విమర్శించారు. 15న దివ్యాంగుల పెన్షన్దారులతో తహసీల్ కార్యలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ నెల 14న సరిహద్దులోని దేగ్లూర్కు మందకృష్ణ మాదిగ వస్తున్నారని ఆయన తెలిపారు.నాయకులు పెద్దబూరి గంగారం, మండల అధ్యక్షుడు, మారుతి, హన్మంత్, రాహుల్, శివాజీ, చందు, భీంరావ్, అరవింద్, తుకారం తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలి రాజంపేట: రాష్ట్ర ఎమ్మార్పీస్ ఆదేశాల మేరకు ఈ నెల 15న నిర్వహించే తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు సట్టిగారి లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం రాజంపేట మండల కేంద్రంలోని స్థానిక పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో దివ్యాంగుల హక్కుల పొరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు జి. రాజు, భాస్కర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలు చోరీ చేసే ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఆటోల చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పో లీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరా లు వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటకు చెందిన తాడేపల్లి క్రిష్ణ ఆటో ఈ నెల 11న చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు. శనివారం ఉదయం మాల్తుమ్మెద వద్ద పోలీసు లు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో పారిపోబోయిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం బయటపడింది. నిందితులను నిజామాబాద్ జిల్లా మంచిప్పకు చెందిన కుమ్మరి రాజు, కొల్ల దుర్గరాజులుగా గుర్తించా రు. వారిలో కుమ్మరి రాజుపై గతంలో కరీంనగర్, జ గిత్యాల, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 20 దొంగతనం కేసులు ఉన్నాయ ని ఎస్పీ తెలిపారు. వాటిలో ఎక్కువగా ఆటోల చోరీ కేసులే ఉన్నాయన్నారు. దుర్గరాజుపై గతంలో ఒక ఆటో చోరీ కేసు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి నాగిరెడ్డిపేటలో దొంగిలించిన ఆటోతోపాటు మెదక్ జిల్లాలో దొంగిలించిన 2 ఆటోలు, భి క్కనూర్లో ఎత్తుకెళ్లిన మరో ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ గంగారాం, హోంగార్డు బాలాజీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ర్యాగట్లపల్లిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
● నిందితులను పట్టుకున్న గ్రామస్తులు ● ఎనిమిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలోగల బసవేశ్వరాలయం ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ర్యాగట్లపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న అతిపురాతనమైన బసవేశ్వరాలయం ప్రాంతంలో శనివారం వేకువజామున ప్రొక్లెయిన్ సహాయంతో కొందరూ గుప్తనిధుల కోసం తవ్వకాలను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులు ప్రశ్నించగా దురుసుగా సమాధానాలు చెప్పడంతో వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులైన ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన చిన్న భూమయ్య, మహేందర్, మంత్రి దుర్గయ్య, రామాయంపేట, భిక్కనూర్కు చెందిన సభావత్ భరత్, నాగభూషణం, యాదగిరి, వెంకట చంధ్రశేఖర్, నెల్లూరి కాంతారావులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంజనేయులు వివరించారు. -
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీవో నరేశ్ సూచించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయంలో కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో మురికి కాల్వలు, వీధుల్లో రోడ్లపై మురికి నీరు నిల్వకుండా, చెత్తా చెదారం వీధుల్లో లేకుండా చూడాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంపీవో మలహరి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. భిక్కనూరు: ఆర్యసమాజ్మందిరం వ్యవస్థాకుడు గువ్వ బుచ్చయ్య మరణం ఆధ్యాత్మికతకు తీరని లోటు అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డిలు అన్నారు. శనివారం వారు భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి వెళ్లి ఇటీవల మృతి చెందన విండో మాజీ చైర్మన్ గువ్వ బుచ్చయ్య కుటుంబాన్ని పరమార్శించారు. బ్రహ్మజ్ఞాన ఆశ్రమం, శ్రీకృష్ణమందిరం నిర్మాణానికి బుచ్చయ్య ఎంతగానో శ్రమించాడని కొనియాడారు. కాంగ్రెస్ నేతలు బల్యాల సుధర్శన్, అందే దయాకర్రెడ్డి, కల్లురి సిద్దరాములు, లింబాద్రి,నరేష్ ,మూర్తి, ప్రకాశ్, సిద్దరాములు తదితరులు ఉన్నారు. భిక్కనూరు: మండలంలో కురుస్తున్న వర్షాలకు పురాతన ఇళ్లు కూలిపోతున్నాయని అందులో నివసిస్తు ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని భిక్కనూరు మండల బీఆర్ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు దేవర లక్ష్మి అన్నారు. శనివారం ఆమె భిక్కనూరులో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఇటీవల గోడ కూలి జాగిరిసింగ్ మృతి చెందడంతో ఆయన కుటుంబం వీధిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు నష్టపోయిన వారిని పార్టీలకతీతంగా అన్ని పార్టీల వారు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో శనివారం మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది హెల్త్ క్యాంపులు నిర్వహించారు. మండలంలోని దావల్మల్కపల్లి, మల్లయ్యపల్లి గ్రామాలలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శరత్, ఆరోగ్య సిబ్బంది తదితరులున్నారు. -
రాజీయే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ● లోక్ అదాలత్లో 2,294 కేసుల పరిష్కారంకామారెడ్డి టౌన్ : రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కోర్టులలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్లో బ్యాంక్, క్రిమినల్, సివిల్, కుటుంబ, ఆయా కేసులకు సంబంధించి కక్షిదారులు ఇరువర్గాలు రాజీ చేసుకుని రాజమార్గంలో కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్ను వినియోగంచుకుని కక్షిదారులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా కూడా ప్రజలకు పరిష్కారాలు లభించే అవకాశాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కల్పిసుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సురా సుమలత, సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ దీక్ష, ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎనిమిది లోక్ అదాలత్ బెంచీల ద్వారా మొత్తం 2,294 కేసులకు పరిష్కారం చూపినట్లు న్యాయమూర్తులు తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2,162, సివిల్ 24, సైబర్ క్రైం 23, బ్యాంక్ 80, మోటార్ అక్సిడెంట్ క్లయిమ్ 5 కేసులు ఉన్నాయన్నారు. బాధితులకు నష్టపరిహారంగా రూ. 1,52,18,066 అందజేశామని పేర్కొన్నారు. -
యూరియా గోస తీరేది ఎప్పుడో?
బీబీపేట : రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. వారాల తరబడి సమస్య కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. బీబీపేట సొసైటీకి 662 బస్తాల యూరియా వచ్చిందని తెలియగానే శుక్రవారం రాత్రే రైతులు తరలివచ్చి బారులు తీరారు. శనివారం ఉదయం వరకు వెయ్యి మందికిపైనే క్యూలో ఉన్నారు. సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సొసైటీ వద్దకు చేరుకొని ఎస్సై ప్రభాకర్ ఆధ్వర్యంలో టోకెన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులనూ తోసేశారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఇటుక రాయిని కానిస్టేబుల్ నవీన్పైకి విసరడంతో అతడికి ఛాతీలో దెబ్బ తగిలింది. వెంటనే అతడిని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎస్సై పరిస్థితి చేయి దాటడంతో టోకెన్ల పంపిణీ ఆపేసి పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న రైతులు టోకెన్లను ఇవ్వాలని పట్టుబట్టడంతో అధికారులతో చర్చించి వరుస క్రమంలో రైతులను కూర్చోబెట్టారు. సొసైటీ వద్ద ఇచ్చిన టోకెన్లను రద్దు చేసి కొత్తవాటిని తయారు చేశారు. గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దోమకొండ పోలీసులతో పాటు సీఐ సంపత్ సైతం అక్కడకు చేరుకొని వారిని సముదాయించి, ఒక్కో రైతుకు ఒక టోకెన్ ఇచ్చారు. ఈ క్రమంలో మల్కాపూర్ గ్రామానికి చెందిన గట్క రేఖయ్య అనే రైతుకు ఫిట్స్ రావడంతో అక్కడే ఉన్న రైతులు స్పందించి అతనికి సహాయం అందించారు. అతడిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సొసైటీ వద్ద కూడా బారెడు రైతులు ఉండడంతో రైతులకు పొద్దంతా బస్తా యూరియా సంపాదించడంలోనే గడిచిపోయింది. మొత్తం వెయ్యి మంది రాగా శనివారం 662 టోకెన్లు ఇచ్చిన అధికారులు.. సోమవారం కోసం మిగిలినవారికి టోకెన్లు అందించారు. సొసైటీ వద్ద బారులు తీరిన రైతులుటోకెన్ల కోసం పోలీస్ స్టేషన్ వద్ద వరుసలో కూర్చున్న రైతులువరి పంటకు అసలు టైంలో యూరియా చల్లితేనే మంచి దిగుబడి వస్తుంది. కానీ ఎరువు దొరక్కపోవడంతో పంటకు వేయలేకపోతున్నాం. లేటుగా వేస్తే లాభం ఉండదు. ప్రభుత్వం స్పందించి అవసరమైన మేర యూరియాను తెప్పించాలి. – బోయినపురం రమేశ్, సీతారాంపల్లి యూరియా కోసం రాత్రి వచ్చి ఇక్కడే పడుకున్నాను. రోజంతా ఉన్నా ఒకే బస్తా దొరికింది. నాలుగు ఎకరా ల్లో నాట్లు వేస్తే ఇప్పటివరకు రెండు బస్తాలు మాత్రమే దొరికాయి. ఎరువు వేయకపోవడంతో ఈసారి పంట దిగుబడులు వచ్చేలా లేవు. – పిట్ల స్వామి, రైతు, మల్కాపూర్ వీరంతా నేరస్తులు కాదు.. ఏ కేసుతోనూ సంబంధం లేదు.. యూరియా బస్తా కోసం రోజుల తరబడి సొసైటీ చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు.. బీబీపేట సొసైటీలో బస్తాలు తక్కువగా ఉండడం.. ఎక్కువమంది రైతులు తరలిరావడం.. టోకెన్ల పంపిణీ సందర్భంగా తోపులాట జరగడం.. గుర్తు తెలియని వ్యక్తి పోలీసుపై రాళ్లు విసరడం.. దీంతో పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు అందరినీ పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇలా ఎండలో వరుసలో కూర్చోబెట్టి టోకెన్లు పంపిణీ చేశారు. రోజూ సొసైటీల వద్దకు వస్తున్న రైతులు టోకెన్ల పంపిణీపై అసహనం.. రాళ్ల దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి కానిస్టేబుల్కు గాయాలు పోలీసు స్టేషన్ వద్ద టోకెన్లను పంపిణీ చేసిన పోలీసులు -
ఉడత పేరుతో..
చాలా గ్రామాల్లో ఇంటి పేర్లు పక్షులు, జంతువుల పేరుతో ఉన్నాయి. పలువురికి అడవి జంతువులైన ఏనుగు, పులి, నక్క వంటి ఇంటి పేర్లున్నాయి. అలాగే కుక్కల, ఎలుక, ఉడుత, చిలుక, కొంగ, కొంగల, కోతి, కాకి, బాతు, నెమలి అన్న పేర్లూ ఉన్నాయి. వ్యవసాయంలో ఒకప్పుడు కీలకంగా ఉన్న ఎద్దు సైతం చాలామందికి ఇంటిపేరుగా ఉంది. మేక, మేకల, గుర్రం, గొర్రెల, పిల్లి, పంది, పోతుల, పోతరాజు, పాముల.. ఇలా అనేక రకాల ఇంటి పేర్లు ఉన్నాయి. కొన్ని కుటుంబాల ఇంటి పేరు శరీరంలోని అవయవాలనుంచి వచ్చింది. కొందరి మారుపేరు బొడ్డు, ముక్కు అని ఉంది. మీసాల, గడ్డం, గడ్డంవార్, గోరు, గోళ్ల పేరుతోనూ ఇంటి పేర్లున్నాయి. రోజూ మనం తినే కూరగాయలు, ఇతర పంటల పేర్లే ఇంటి పేరుగా కలిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వంకాయల, మిరపకాయల, తోట, తోటకూర, చామకూర, గుమ్మడి, పసుపు, పాలకూర, పాలమాకుల వంటి పేర్లున్నాయి. కంది, కందుల, జొన్న, జొన్నల, పసుపు, పసుపునూరి, అల్లం, ఆలుగడ్డ, పోకల, గుమ్మడి, పత్తి, ఆముదాల, సామల, మక్కల వంటి పేర్లు చాలా కుటుంబాలు ఇంటి పేరుగా కలిగి ఉన్నాయి. చెట్లు, పువ్వులనుంచీ చాలా మందికి ఇంటి పేరు వచ్చింది. చింత, చింతల, కొబ్బరికాయ, ఇప్పకాయ, మామిడి, మామిండ్ల, నిమ్మ, నిమ్మల, జీడి, తాటి, తాటికాయల, తాటిపాముల, తాళ్ల వంటి పేర్లతోపాటు వేప, యాప పేర్లు కూడా ఇంటి పేర్లుగా మారాయి. మల్లెల, మల్లెపూల, చామంతి, చామంతుల, గన్నేరు పేర్లు కూడా ఉన్నాయి. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అనే సామెత వినే ఉంటాం. ఎందుకంటే ఉప్పు ఉంటేనే రుచి ఉంటుంది. ఉప్పు పేరు ఇంటి పేరుగా ఎన్నో కుటుంబాలు కలిగి ఉన్నాయి. ఉప్పుతో పాటు ఉప్పల అనే పేరు కూడా ఉంది. పప్పు, పప్పుల అనే పేర్లతో పలువురికి ఇంటి పేర్లున్నాయి. నేతి కూడా ఇంటి పేరుగా ఉంది. మా ఇంటి పేరులో ఉ డుత ఉంటుంది. మా ప్రాంతంలో ప్రతి ఇంటి పేరు పక్కన వార్ అని పెడతారు. అందు కే మా ఇంటి పేరు ఉడతవార్. ఉడత పేరు ప్రత్యేకమనే అనిపిస్తుంది. – ఉడతవార్ సుభాష్, మద్నూర్ కాదేదీ సర్నేమ్కు అనర్హం మారుపేరుగా పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వుల పేర్లు ఉప్పు, పప్పు, కారం, కూరగాయలతోనూ ఇంటి పేరు.. తరతరాలుగా ఆయా పేర్లతోనే పిలుచుకుంటున్న జనం -
‘వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత పెరుగుతుంది’
కామారెడ్డి అర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయని డీఈవో రాజు పే ర్కొన్నారు. కామారెడ్డిలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో ప్రారంభమైన మూడు రోజుల రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన, సాంస్కృతిక మహోత్సవం కొనసాగుతోంది. శనివారం రెండోరోజు కార్యక్రమంలో డీఈ వో మాట్లాడుతూ విద్యార్థుల బహుముఖ వికాసానికి ఉపయోగపడే విధంగా సాంస్కృతిక, గణిత విజ్ఞాన ప్రదర్శన నిర్వహించడం బాగుందన్నారు. పట్టణంలోని వాగ్దేవి, ఎస్పీఆర్, ఆర్చిడ్స్, లిటిల్ స్కాలర్స్ హైసూళ్లతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనను సందర్శించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత శైక్షణిక్ ప్రముఖ్ నల్లాన్చక్రవర్తుల కృష్ణమాచార్యులు, స్థానిక సరస్వతి విద్యామందిర్ ప్రతినిధులు గంగారెడ్డి, హరిస్మరణ్రెడ్డి, గీరెడ్డి రాజారెడ్డి, రంజిత్మోహన్, భాస్కర్రావు, గోవర్ధన్రెడ్డి, ప్రిన్సిపల్ నాగభూషణం, అకడమిక్ ప్రిన్సిపల్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘మరమ్మతులు చేపట్టాలి’ కామారెడ్డి క్రైం : భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న మౌలిక వసతులకు సంబంధించిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన.. దెబ్బతిన్న రోడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని వైకుంఠధామం వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మతులు, నీటి సరఫరా జరిగే ఫిల్టర్ బెడ్లను సందర్శించారు. పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్, అధికారులు వేణుప్రసాద్, డీటీ రవికుమార్, ఆర్ఐ నర్సింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ‘సమయ పాలన పాటించాలి’ ఎల్లారెడ్డిరూరల్: అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన పాటించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. శనివారం అన్నాసాగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన భవనం పైకప్పునుంచి నీరు కారినందున వేరే భవనంలోకి మార్చేలా చూడాలని గ్రామస్తులు జిల్లా అధికారిని కోరారు. కార్యక్రమంలో ఏసీడీపీవో ప్రసన్న, అంగన్వాడీ టీచర్ దుర్గ తదితరులు పాల్గొన్నారు. ‘సిమీ, పీఎఫ్ఐ, ఐసీఎస్కు నిజామాబాద్ అడ్డా’ ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): సిమీ, పీఎఫ్ఐ, ఐసీఎస్ వంటి సంస్థలకు నిజామాబాద్ అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో శనివారం సీపీ పోతరాజు సాయిచైతన్యతో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా లో పోస్టు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన సుమారు 400 మంది బైక్ ర్యాలీ నిర్వహించి, హారన్ కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం పోలీసులు కేసు పెట్టలేదన్నారు. తాను పోలీసులతో మాట్లాడిన తర్వాత ర్యాలీకి బాధ్యత వహించిన వారిపై కేసులు నమోదు చేశారన్నారు. తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. హిందువుల పండుగలకు ఆంక్షలు ఎక్కువయ్యాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఉగ్ర కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సీపీని కోరినట్లు తెలిపారు. -
చుట్టం చూపుగా వచ్చి చోరీలు
● రాజస్థాన్కు చెందిన నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: చుట్టం చూపుగా వచ్చి, అనుమానం రాకుండా వాహనానికి తెలంగాణ నంబర్ ప్లేట్ పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 25 న జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన మాసిరెడ్డి శివారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం వేములవాడకు వెళ్లింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశారు. శనివారం హౌసింగ్బోర్డు కాలనీలో ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాకబు చేయగా హిందీలో మాట్లాడాడు. తెలంగాణ నంబర్ ప్లేట్ గల కారులో తిరుగుతూ హిందీలో మాత్రమే మాట్లాడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ జిల్లా అజీజ్పూర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీనాగా గుర్తించారు. అతడు కొద్ది రోజుల క్రితం మెదక్ రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండే తన బంధువు ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడని పేర్కొన్నారు. స్నేహితుడైన అభిషేక్తో కలిసి కామారెడ్డిలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేశాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, చోరీకి ఉపయోగించిన కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరిపై రాజస్థాన్లో అనేక దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిసిందని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. నిందితులు చోరీ చేిసిన ఇతర బంగారు ఆభరణాలను గుర్తించేందుకు, మరో నిందితుడు అభిషేక్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన అధికారులను అభినందించి రివార్డులను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్గా గాంధారి ఈఎంఆర్ఎస్
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో కామారెడ్డి జిల్లా గాంధారి ఈఎంఆర్ఎస్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. శనివారం క్రీడల ముగింపు వేడుకలు నిర్వహించగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాజరై, మాట్లాడారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపుకోసం మరోసారి ప్రయత్నించాలనిన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన గాంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాఽథ్కేకన్, ఆర్డీవో కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీవో రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజయ్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పాతాళ గంగమ్మ ౖపైపెకి..
● భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ జలాలు ● సరాసరిన 7.32 మీటర్ల లోతులో నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పారిన వరదలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలో సరాసరిన 7.32 మీటర్ల లోతులోనే నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊట వచ్చింది. దీంతో యాసంగిలోనూ సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూలై 26 నాటికి భూగర్భ జలమట్టం 12.90 మీటర్లు కాగా.. ఆగస్టు 26 నాటికి 8.87 మీటర్లుగా ఉంది. ఆగస్టు చివరి వారంలో దంచికొట్టిన వర్షాలతో భూగర్భ జలమట్టం మరింత ఎగబాకి 7.32 మీటర్లకు చేరింది. జిల్లాలో ఏడాది సాధారణ వర్షపాతం 983 మి.మీ. కాగా ఇప్పటికే 1,074 మి.మీటర్ల వర్షం కురిసింది. నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనంత వరద తాకిడితో ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండాయి. మంజీర నదితో పాటు వాగులన్నీ ఇప్పటికీ పారుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి జిల్లాలో కరువు ప్రాంతాలుగా పేర్కొనే చోటా భారీ వర్షాలు కురిశాయి. దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి తదితర మండలాల్లో ఆగస్టు మూడో వారం వరకు అరకొర వర్షాలే కురిశాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. ఎత్తిపోయిన బోర్లన్నీ పోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో రెండు పంటలకు ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జలాశయాలన్నీ జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటలతో పాటు యాసంగికీ నీటి ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎర్రాపహాడ్లో 0.29 మీటర్ల లోతులోనే నీరు.. జిల్లాలోని కొన్నిచోట్ల భూగర్భ జలమట్టం మరింత పైకి ఎగబాకింది. తాడ్వాయి మండలం ఎర్రాపహడ్లో 0.29 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలుండడం గమనార్హం. సదాశివనగర్లో 0.80 మీటర్లు, భిక్కనూరులో 0.87 మీటర్లు, మద్నూర్ మండలం మేనూర్లో 1.19 మీటర్లు, నిజాంసాగర్ మండలం బూర్గుల్లో 1.46 మీటర్లు, మద్నూర్ మండల కేంద్రంలో 1.49 మీటర్లు, జుక్కల్ మండలంలోని సావర్గావ్లో 1.75 మీటర్లు, బాన్సువాడలో 2.10 మీటర్లు, లింగంపేట మండలం భవానీపేటలో 2.20 మీటర్లు, మాచారెడ్డిలో 2.70 మీటర్లు, బాన్సువాడ మండలం హన్మాజీపేటలో 2.80 మీటర్లు, సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో 2.90 మీటర్లు, దోమకొండ మండలం అంబారీపేటలో 2.95 మీటర్ల లోతులోనే నీరున్నట్లు డిజిటల్ వాటర్ లెవల్ మీటర్లు స్పష్టం చేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరం
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరమని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని, ప్రతి ప్రమాదం వెనక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు సహాయపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈధర్ మేనేజర్ వర్షా నిహంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్ కాటేగర్, సీటీసీ సర్కిల్ సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి ప్రతిభకు ప్రోత్సాహం
● ‘ఎన్ఎంఎంఎస్’తో ఉపకారవేతనాల అందజేత ● పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంసదాశివనగర్(ఎల్లారెడ్డి): విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పేరుతో స్కాలర్ షిప్లను అందజేస్తుంది. దీని కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఇంటర్ వరకు కొనసాగించేలా స్కాలర్ షిప్లను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ● అర్హతలు: ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదివేవారు. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3–5 లక్షల లోపు ఉండాలి. ● కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, స్టడీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు ● పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల విద్యార్థులకు రూ. 50 దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 6 ● పరీక్ష తేదీ: నవంబర్ 23న (డివిజన్ కేంద్రాల్లో) -
‘పీజీ కోర్సులకు ప్రతిపాదనలు పంపండి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధి, పీజీ కోర్సులకోసం ప్రతిపాదనలు పంపించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరే షన్ చైర్మన్ జి.అమిత్రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. డెయిరీ వివిధ వి భాగాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కళాశాలకు ప్రహారీ నిర్మించ డానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పీజీ కోర్సు ప్రారంభిస్తే ఇక్కడి బీటెక్ వి ద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని కళాశాల అసోసియేట్ డీన్ సురేశ్ రాథోడ్ వి వరించారు. కళాశాల అధ్యాపకులు ఉమాపతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. పాతరాజంపేట డెయిరీ సందర్శన పాతరాజంపేటలోని విజయ డెయిరీని వాకిటి శ్రీహరి, గుత్తా అమిత్రెడ్డి సందర్శించారు. 45 ఏళ్లుగా సేవలందిస్తున్న డెయిరీని ఆధునికీకరించాల్సి ఉందన్నారు. పాతరాజంపేట డెయిరీ అభివృద్ధి విషయమై మంత్రి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు, జీఎం మధుసూదన్, అధికారులు కవిత, ధనరాజ్, లావణ్య, వైష్ణవి, పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నేత పుల్గం దామోదర్రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉద్యోగ విరమణ చేయడంతో శుక్రవారం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. -
పంట పొలాల్లో ఇసుక మేటల తొలగింపు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో తొలగిస్తున్నట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూరుగిద్ద ఊర చెరువు కట్ట తెగిపోవడంతో ఇసుక మేటలు ఏర్పడ్డాయన్నారు. ఉపాధి హామి కూలీలతో ఇసుక మేటలు తొగించాలని కలెక్టర్ ఆదేశించడడంతో కూలీలను ఏర్పాటు చేసి ఇసుక మేటలను తొలగిస్తున్నామన్నారు. ఇసుక మేటలు తొలగించి తిరిగి పంటలు సాగయ్యేలా చేస్తామన్నారు. ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏపీవో నరేందర్, తదితరులున్నారు. బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్కు ఆశించిన స్పందన రాకపోవడంతో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు డాక్టర్ గంగాధర్, లక్ష్మీనారాయణ వేర్వేరుగా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు కోరారు. ఈ ఏడాది మాత్రమే కల్పించిన స్పాట్ అడ్మిషన్ల విధానాఽన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రామారెడ్డి: ప్రజల్లోకి ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకెళ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్గౌడ్ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు మండల అధ్యక్ష పదవి రావడానికి కారణమైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్కు ప్రవీణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
స్వేచ్ఛను హరించొద్దు
కామారెడ్డి అర్బన్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్ : ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు మేధావులు పేర్కొన్నారు. పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షంతోపాటు పత్రికలపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు.బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులకు పత్రికలే గొంతుకలు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి. అంతేగాని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారన్న సాకుతో సాక్షి జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదు. – ముదాం అరుణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకలు పత్రికలే. విమర్శలను ప్రభుత్వాలు సరైన విధంగా తీసుకోవాలి. పత్రికల గొంతునొక్కడం సరికాదు. సాక్షి మీడియాపై ఏపీ సర్కారు వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. – కొంగల వెంకటి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య నిజాలను నిర్భయంగా రాసే వారికి సంకెళ్లు వేసినట్లుంది. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అవుతుంది. జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – నాగం సాయిబాబా, న్యాయవాది, ఎల్లారెడ్డి ప్రజలు, ప్రజాస్వామికవాదుల పక్షాన నిలబడే పత్రికలపై ప్రభుత్వాల దాడులు సర్వసాధారణమయ్యాయి. ప్రజల గొంతుకగా నిలబడుతున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం ఇలాగే కేసు పెట్టింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తప్పులను ఎత్తిచూపుతున్నారనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తులపై కాకుండా.. దానిని ప్రచురించిన పత్రిక సంపాదకుడు, జర్నలిస్టులపై కేసులు పెట్టడం అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. – అయ్యాల సంతోష్, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బాన్సువాడ ప్రజాసమస్యలను ప్రభుత్వానికి వినిపించే పత్రికలపై అణచివేత ధోరణి సరికాదు. ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలు అబద్ధమైతే అధికార పక్షం వాస్తవాలను చెప్పి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి. జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. – పి.లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాది. బాన్సువాడ -
‘విజ్ఞాన ప్రదర్శనలతో కొత్త ఆవిష్కరణలు’
కామారెడ్డి అర్బన్: విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలతో పాటు తమ సొంత ఆలోచనలను ఆవిష్కరింపజేయడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతో తోడ్పడుతాయని విశ్రాంత ఆచార్యులు, శ్రీసరస్వతి విద్యాపీఠం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్వీకే విశ్వేశ్వరరావు అన్నారు. కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో శుక్రవారం 3 రోజులపాటు రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన, సాంస్కృతిక మహోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డితో పాటు ముఖ్యవక్తగా విశ్రాంత ఆచార్యులు విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. శిశుమందిర్ పాఠశాలల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు శాసీ్త్రయ దృక్పథం, దేశభక్తి అంశాలతో ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దుతారన్నారు. నలంద, తక్షశిల లాంటి ప్రపంచంలోనే ఉత్తమ విశ్వ విద్యాలయాలు ప్రాచీన భారతదేశంలో ఉండేవని, చర్రితకు ఎక్కని ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశమన్నారు. విద్యార్థులు వివేకానందుడిని ఆదర్శగా తీసుకోవాలని, ఆయన విద్యార్థి దశలో అన్నీ ప్రశ్నలే వేసేవారని, వాటి ద్వారా అనేక జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ ఆధ్యాత్మిక, తత్వవేత్తగా నిలబడ్డారన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయని శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. శ్రీసరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. పలు జిల్లాలకు చెందిన 303 మంది విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
విమోచన దినోత్సవం రోజున సేవా కార్యక్రమాలు
బాన్సువాడ: తెలంగాణ విమోచన దినోత్సవం రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని బాన్సువాడలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం పురస్కరించుకుని పలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప ఆలయంలో మోదీ పేరుపై అర్చన, ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18న స్వచ్ఛ భారత్ పేరిట బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో పరిశుభ్రత కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, శంకర్గౌడ్, మోహన్రెడ్డి, మజ్జిగ శ్రీనివాస్, చిరంజీవి, శంకర్, మహేష్, అనీల్, సాయిబాబా, కొండని తదితరులున్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
నిజామాబాద్ లీగల్: నగరానికి చెందిన న్యాయ వాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) గుండెపోటుతో మృతి చెందాడు. కిరణ్ శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. 1997లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన కిరణ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశాడు, న్యాయవాదిగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. గవర్నమెంట్ ప్లీడర్గా, న్యాయవాదుల సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతిపట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ ..రుద్రూరు: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. వివరాలు ఇలా.. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇసుక మేట.. తొలిగేదెలా?
బీబీపేట : జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ప్రాజెక్టులు, చెరువుల కట్టలు దెబ్బతినడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు, రప్పలు వచ్చి చేరాయి. ఒకవైపు పంట కొట్టుకుపోయి ఏర్పడిన నష్టం.. మరోవైపు ఇసుక మేటలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రం.. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు సర్కారు నుంచి సైతం ఊరట లభించడం లేదు. పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకంలో తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి పలు నిబంధనలు విధిస్తున్నారు. బాధిత రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్కార్డ్ ఉండాలంటున్నారు. ఒక్కో రైతుకు రెండెకరాలలోపు విస్తీర్ణంలో ఏర్పడిన మేటలను మాత్రమే తొలగిస్తామంటున్నారు. అదీ గరిష్టంగా 600 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఈ నిబంధనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబ్కార్డ్ లేని, రెండుకరాలపైన భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 600 క్యూబిక్ మీటర్ల నిబంధననూ తప్పుపడుతున్నారు. అర ఎకరంలోనే 600 క్యూబిక్ మీటర్లకు మించి ఇసుక పేరుకుపోయిందని పేర్కొంటున్నారు.ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 586 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయని అధి కారులు గుర్తించారు. ఒక్క బీబీపేట మండలంలోనే 97 ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి. ఇందులో 40 మందికి జాబ్కార్డు ఉండగా పది మందికి జాబ్కార్డు లు లేవు. కొందరి భూమిలో రెండెకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇసుక మేటలు వేయడంతో వారికి ఉపాధి హామీ పథకం వర్తించదు. ఈ నిబంధనలను రైతులు తప్పుపడుతున్నారు. ఎన్ని ఎకరాల్లో ఇసుకమేటలు ఉ న్నా ప్రభుత్వమే తొలగించాలని కోరుతున్నారు. పంట పొలాల్లో ఇసుకమేటలు ఉన్నట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా తొలగింపజేస్తాం. దీనికి ఉపాధి హామీ జాబ్కార్డు ఉన్నవారు అర్హులు. జాబ్కార్డు లేనివారికి జాబ్కార్డు అందించడానికి చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే ఇసుక మేటలు తొలగిస్తాం. – సురేందర్, డీఆర్డీవో, కామారెడ్డి ఇటీవలి వరదలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలు ఇసుక తొలగింపునకు ఉపాధి హామీ జాబ్కార్డ్తో లింక్ అదీ ఒక రైతుకు 600 క్యూబిక్ మీటర్లకు మాత్రమే వర్తింపు ఆందోళనలో బాధిత రైతులు -
దుబాయ్లో మోపాల్వాసి మృతి
మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు. వాకింగ్ చేస్తున్న యువకులను ఢీకొన్న లారీ ● ఇద్దరికి గాయాలు కామారెడ్డి క్రైం: వాకింగ్ చేస్తున్న యువకులను ఓ లారీ అదుపుతప్పి, ఢీకొన్న ఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి సమీ పంలోని జాతీయ రహదారిపై చోటుచేసు కుంది. వివరాలు ఇలా.. శాబ్దిపూర్ రైట్ తండాకు చెందిన శివ కుమార్, రామేశ్వర్పల్లి తండాకు చెందిన బదావత్ సంజీవ్ కలిసి శుక్రవారం ఉదయం వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. రామేశ్వర్పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వారిని ఓ గుర్తు తెలియని లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్కు స్వల్ప గాయాలు కాగా శివ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మెరుగైన చికిత్స కోసం శివ కుమార్ను హైదరాబాద్కు రిఫర్ చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత బాన్సువాడ: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోలెరో వాహనాన్ని శుక్రవా రం సీఐ అశోక్ పట్టుకున్నారు. బీర్కూర్ నుంచి అక్రమంగా వాహనంలో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమేశ్వర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. -
అడుగుకో గుంత.. తీరేనా చింత
భిక్కనూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. భిక్కనూరు–రామేశ్వర్పల్లి, భిక్కనూరు–అంతంపల్లి, పెద్దమల్లారెడ్డి– ఇసన్నపల్లి, మల్లుపల్లి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గాల్లో అడుగుతీసి అడుగేస్తే గుంత ప్రత్యక్షమవుతోంది. ఈ గ్రామాలకు వెళ్లే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలపైన కాకుండా నడుచుకుంటూ వెళ్లినప్పటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాల్లో వాహనాదారులు కింద పడి గాయాలపాలవుతున్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.భిక్కనూరు నుంచి తిప్పాపూర్ గ్రామానికి వెళ్లాలంటే రామేశ్వర్పల్లి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భిక్కనూరు–రామేశ్వర్పల్లి రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఈ రోడ్డుపై వెళ్తూ నరకం చూస్తున్నాం. గుంతలతో పాటు బురదమయంగా మారింది. నడుచుకుంటూ వెళ్లినా నరకం తప్పడం లేదు. – స్వామి, తిప్పాపూర్ -
వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ అన్నారు. శుక్రవారం కుప్రియాల్, ధర్మారావ్పేట్, భూంపల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించారు. సీహెచ్వో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. రాజంపేట: రాజంపేట, తలమడ్ల గ్రామాల్లో రాజంపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రఘురాం, డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మహమ్మద్ మంజూర్, గంగామణి, జీపీ సెక్రెటరీ అశోక్ కుమార్, వైఆర్జీకేర్ సుధాకర్, క్లస్టర్ లింక్ వర్కర్ శ్వేత, లావణ్య పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాటూర్, లింగంపల్లికలాన్, ఎర్రకుంటతండాలలో శుక్రవారం వైద్యశిబిరాలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందజేశారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యదర్శులు రవీందర్, వనజ, అనిత, హెల్త్ సూపర్వైజర్ మణెమ్మ, ఎంఎల్హెచ్పీలు సుజాత, అపర్ణ, అజయ్, ఏఎన్ఎంలు మంగ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట వేస్తున్నాం
● రిజర్వేషన్లను అమలు చేస్తాం ● కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మంత్రి సీతక్క మాచారెడ్డి : బీసీలకు పెద్దపీట వేస్తున్నామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటూ రాజకీయం చేస్తోందన్నారు. కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. బీసీ డిక్లరేషన్ సభ ఎప్పుడు నిర్వహించినా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్యపు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. మహిళలకు రుణాలు ఇవ్వకపోగా, పావలా వడ్డీ ఎగ్గొట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. యూరియా అందించే బాధ్యత కేంద్రానిదని, తాము కూడా యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాల వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేకుండా చేస్తాం రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాలకు 40 మెట్రిక్ టన్నులు, సోమారంపేట, రత్నగిరిపల్లి గ్రామాలకు 30 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో బీసీ డిక్లరేషన్ సభ తేదీని ప్రకటిస్తామన్నారు. కామారెడ్డి ప్రజలు ఇకముందైనా సరైన నిర్ణయం తీసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మాచారెడ్డి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసీలాల్, రమేశ్గౌడ్, నాయకులు పూల్చంద్ నాయక్, సాయిలు, కమలాకర్రెడ్డి, శ్రీనివాస్చారి, బ్రహ్మానందరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, గణేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్ : సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ‘ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా ప్రోత్సహించాలి’ కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు త్వరగా పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రో త్సహించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో మాట్లాడి ఏదైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ (1800 599 5991)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ పథకానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, ఇందుకోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ సుభాష్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు. మరమ్మతుల పరిశీలన నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రధాన కాలువకు చేపట్టిన మరమ్మతు పనులను శుక్రవారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఏఈ అక్షయ్కుమార్ ఉన్నారు. సీ్త్రనిధి బోర్డు రాష్ట్ర కోశాధికారిగా స్రవంతి బీబీపేట : సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి ఎన్నికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కోశాధికారిగా తనను ఎన్నుకున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను జిల్లా సమాఖ్య సభ్యులు సన్మానించారు. -
షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని మావులీ హోల్సెల్ బేకరి, కిరాణ దుకాణం శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. టీచర్స్ కాలనీలోని కోండవార్ రాకేష్ హోల్సెల్ బేకరి, కిరాణ దుకాణం నడపుతున్నాడు. శుక్రవారం ఆయన వేరే ఊరికి వెళ్లగా అతడి భార్య ఉజ్వల దుకాణంలో ఉంది. దుకాణం వెనకభాగంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు, పొగ వ్యాపించడంతో భయంతో ఆమె బయటకు పరుగులు తీసింది. స్థానికులు వెంటనే మద్నూర్ ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. దుకాణం మొత్తం మంటలు వ్యాపించి వస్తువులు మొత్తం కాలిబుడిదయ్యాయని బాధితులు తెలిపారు. దుకాణం మొదటి అంతస్తులో కిరాయికి ఉన్న వారు మంటలను చూసి పక్కన ఉన్న మరో ఇంటిలోంచి బయటకు వచ్చేశారు. ఫైర్సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మద్నూర్ ఎస్సై విజయ్కొండ, పోలీసు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో దుకాణం పక్కనే ఉన్న మరో గోడౌన్లోని సామాన్లు బయటకు పడేయడంతో ఆస్తినష్టం తగ్గిందని వారు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత దుకాణం లోపల స్టీల్ డబ్బాలో దాచిన ఉన్న 15 తులాల బంగారం, రూ.3 లక్షల నగదును లీడింగ్ ఫైర్మెన్ నరసింహులు బాధితులకు అప్పగించారు. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది హరీష్, రాణాప్రతాప్, రాజు, దిగంబర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్కు సమాచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు. -
యువకుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్ నగర్కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం మోర్తాడ్: భీమ్గల్ మండలం బాబాపూర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడి నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కాలనీలో ఏడాది కాలంగా వ్యభిచారం చేస్తుండగా బుధవారం రాత్రి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై రాఘవేంద్ర సిబ్బందితో కలిసి సదరు గృహంపై దాడి చేశారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సంగమిత్ర, బ్రమోత్ జయ, సాయాగౌడ్, బస్వాయిపల్లికి చెందిన హైమద్లను అదుపులోకి తీసుకున్నారు. నస్రుల్లాబాద్లో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్న ఇంటి యజమానిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు రూ.500 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోధన్రూరల్: సాలూర మండలంలోని మందర్న శివారులో గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను, 2 ఆటోలను సాలూర రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు. -
చిరుతపులి సంచారమంటూ వైరల్
● భయాందోళనకు గురైన మద్నూర్వాసులు ● అది చిరుత కాదు.. అడవి పిల్లి అని నిర్ధారించిన అటవీ శాఖాధికారులు మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో చిరుత పులి తిరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మద్నూర్లో చిరుత పులి తిరిగిందని వాటి పాదముద్రలు ఉన్నాయని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారులు రంగంలోకి దిగా రు. మద్నూర్ ఎస్సై విజయ్కొండ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంచందర్లు తన సి బ్బందితో మ ద్నూర్ శివారు లో చిరుత అడు గులను పరిశీలించారు. పూర్తి వి చారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారు లు అది చిరుత పులి పాదంకాదని అడవి పిల్లి పాదం అని తెల్చడంతో ప్రజలు ఊపిరిపిల్చుకున్నారు. చిరుత పులి అడుగులు పెద్దగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య
ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన మార్గపు ప్రదీప్తో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. -
సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతూ శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని పాత అంగడి బజార్, కుమ్మరి గల్లీ, పాత బాన్సువాడ, గౌలీగూడ, ఇస్లాంపూర తదితర కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించాలని అన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పాడుతుందని అన్నారు. ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతి పత్రం అందజేశారు. నాయకులు సాయిబాబా, చందర్, రమేష్యాదవ్, ఇషాక్, సాయిలు, నాగనాథ్, ఉబేద్, అప్జల్, లతీఫ్ తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు ఇవ్వొద్దు
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్రెడ్డి సూచించారు. మండలంలోని కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18005995991ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేసే విధానాన్ని తెలిపారు. అవసరమైన ఇసుకను రెవెన్యూ అధికారి అనుమతితో ఉచితంగా తెచ్చుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ గోపాల్, ఏఈ వినీత్, పంచాయతీ కార్యదర్శి భరత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. -
గోడ కూలి వృద్ధ దంపతులకు గాయాలు
మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్ లోని ఇంట్లో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణీబా యి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. -
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారంప్రాజెక్టు 15 రోజులుగా అలుగు పారుతూనే ఉంది. ప్రాజెక్టుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇన్ఫ్లోగా వచ్చిన నీరు అలుగుపై నుంచి జాలువారుతూ దిగువకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,182 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా 1,152 క్యూసెక్కుల నీరు అలుగుపై నుంచి దిగువకు ప్రవహిస్తూ అవుట్ఫ్లోగా వెళ్తుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.అవగాహనే ఆయుధంకామారెడ్డి క్రైం: అవగాహన పెంచుకోవడమే సైబర్ నేరాల నియంత్రణకు ప్రధాన ఆయుధమని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పో లీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నియంత్రణపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సైబర్ వారియర్లకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో తయారు చేసిన టీషర్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబ ర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు. నేరాల నియంత్రణపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930కి లేదా స్థానిక పోలీసులకు లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేలా ప్రతి పోలీస్ స్టేషనన్్ పరిధిలోనూ నిపుణుల బృందం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సైబర్ క్రైం జిల్లా నోడల్ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.పరామర్శభిక్కనూరు: ఏఎంసీ మాజీ డైరెక్టర్ బుర్రిగోపాల్ను బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నేత గంప శశాంక్ గురువారం పరామర్శించారు. గోపాల్ తల్లి రాజవ్వ రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న శశాంక్.. బస్వాపూర్ గ్రామానికి వచ్చి గోపాల్ను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు రంజిత్ వర్మ, నేతలు ఉన్నారు. -
పడిగాపులు కాస్తే ఒక్కో బస్తా..
కామారెడ్డి రూరల్: కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కామారెడ్డి పట్టణంలో, గర్గుల్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లోని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బుధవారం రాత్రి నుంచే యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లో చెప్పులు, బస్తాలు, ఇటుకలు, రాళ్లు పెట్టి గురువారం ఉదయం వరకు వేచి ఉన్నారు. కామారెడ్డి, గర్గుల్, చిన్నమల్లారెడ్డికి 222 బస్తాల చొప్పున రాగా, వాటిని ఒక్కోక్కరికి ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే రాత్రి మళ్లీ యూరియా లోడ్ వస్తుందని మిగతా రైతులకు మూడో చోట్ల టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలతో పొలాల్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నామని, అటు పొలాలను చూసుకోవాలా? ఇటు యూరియా కోసం తిరగాలా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ సొసైటీలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ విషయమై మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ... కామారెడ్డి మండలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తరలి రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని. రైతులందరికీ సరిపడా యూరియా అందజేస్తామన్నారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో.. మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట, మాచారెడ్డి మండలం ఎల్లంపేట, సోమారంపేట గ్రామాల్లో రైతులు యూరియా కోసం బారులు తీరారు. భవానీపేటకు 220, ఎల్లంపేట, సోమారంపేటకు 220 చొప్పున బస్తాలు రాగా రైతులు ఒక్కసారిగా పోటీపడ్డారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ రైతులను సముదాయించి టోకెన్లు ఇప్పించారు. సాయంత్రం వరకు టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా తీసుకున్నారు. -
‘కంది’ పంటకు కష్టం.. నష్టం
బిచ్కుంద(జుక్కల్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిచ్కుంద మండలంలో సోయా, పత్తి, కంది, పెసర, మినుము, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట చేలలో వరద నీరు ఆగి ఉండడంతో సోయా, కంది పంట మొక్కలు కుళ్లిపోయి పూర్తిగా మాడిపోయాయి. దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదిక అందించాలని ప్రభుత్వ ఆదేశంతో బిచ్కుంద మండలంలో వ్యవసాయ అధికారులు సర్వే చేపట్టారు. మండలంలో ఎక్కువ శాతం కందిలో అంతర పంటగా సోయా సాగవుతుంది. ఎకరం భూమిలో అంతర పంటలో సోయా, కంది రెండు పంటలు నష్టపోయినప్పటికి ఆ రెండు పంటను సర్వే నివేదికలో నమోదు చేయాల్సి ఉండగా అధికారులు కేవలం సోయా పంటకు మాత్రమే నష్ట జరిగిందని సర్వే నివేదికలో నమోదు చేయడం గమనర్హం. కంది కుళ్లిపోయి ఎండిపోయింది. కనీసం ఒక ఎకరం కూడా నష్టపోయిందని అధికారులు గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం కింద ఒకే పంట పరిగణనలోకి తీసుకుంటే చాలా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం కూడా గుర్తించకపోవడంపై ఆగ్రహం.. బిచ్కుంద మండలంలోని సిర్సముందర్, దేవాడ, దడ్గి, తక్కడ్పల్లి, బిచ్కుంద, దౌల్తాపూర్, గుండెకల్లూర్, మిషన్ కల్లాలి గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు సర్వే చేసి సోయా 2,685 ఎకరాలు, వరి 392 ఎకరాలు, పత్తి 86 ఎకరాలు, మినుము 18, పెసర 12 ఎకరాలు మొత్తం 3,193 ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందని లెక్కలు తేల్చారు. వందల ఎకరాలలో కంది పంటకు నష్టం జరిగినప్పటికి ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి నష్టంవాటిల్లిన రెండు పంటల వివరాలు తీసుకొని పరిహారం అందేవిధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. దిగుబడిపై వర్ష ప్రభావం... భారీ వర్షాలతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా సోయా పంట ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు .. కంది 7 నుంచి 8 క్వింటాలు, పెసర 5 క్వింటాలు దిగుబడి వచ్చేది. పెసర, సోయా పూత దశలో ఉండగా వర్షాలు పడటంతో ఉన్నపూత రాలిపోయి కొన్ని కుళ్లిపోయాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం సోయా దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు, కంది ఎకరానికి 4 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. పెసర పంటకు పూర్తిగా నష్టం జరిగిందంటున్నారు. ఒక ఎకరం భూమిలో అంతర పంటగా సాగవుతున్న రెండు పంటలు దెబ్బతింటే ఎకరం భూమి కింద ఒకే పంటను పరిగణలోకి తీసుకుంటున్నాం. సోయా అంతర పంటలో కంది సాగు అవుతుంది. ఏ పంటకు ఎక్కువ నష్టం ఉందో ఆ పంటను పరిగణలోకి తీసుకొని సర్వే నివేదికలో నమోదు చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. –అమర్ ప్రసాద్, ఏవో, బిచ్కుంద అంతర పంటలో భాగంగా కంది సాగును నష్టంగా గుర్తించని అధికారులు సోయాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు రెండు పంటలకు పరిహారం ఇవ్వాలంటున్న రైతులు -
మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
● అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● అత్యవసరమైతేనే బయటికి రావాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచనకామారెడ్డి క్రైం: జిల్లాలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సమాచారం అందించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, వరదకు గురయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, కాలువలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు తదితర అన్నింటినీ ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియపర్చాలని అధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు తీసుకువెళ్లడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468–220069కు సమాచారం అందించాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యయంత్రాంగం అప్రమత్తమైంది. గత నెలలో కురిసిన భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా చాలా రూట్లలో రోడ్లు క్లియర్ కాలేదు. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘ఉపాధి’ ద్వారా ఇసుక మేటలు తొలగిస్తాం
బీబీపేట: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగిస్తామని డీఆర్డీఏ పీడీ సురేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయభూముల్లో ఇసుక మేటలను ఆయన పరిశీలించారు. బాధితులు జాబ్ కార్డు కలిగి ఉండి చిన్న, సన్నకారు రైతులు అయితే ఈజీఎస్ కూలీల ద్వారా పనులు చేయిస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, ఏపీవో తిరుపతి, సిబ్బంది ఉన్నారు.నేటి నుంచి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కామారెడ్డి అర్బన్: తెలంగాణ శ్రీసరస్వతి విద్యాపీఠం (ఎస్ఎస్వీపీ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి గణిత విజ్ఞాన, సంస్కృతి మహోత్సవం–2025 (రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్) నిర్వహించనున్నట్టు ఎస్ఎస్వీపీ జిల్లా అధ్యక్షుడు వి శ్యాంసుందర్రావు గురువారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ యాదగిరి ముఖ్యఅతిథిగా, ఎస్ఎస్వీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్వీకే వెంకటేశ్వరరావు వక్తగా హాజరవుతారని, రాష్ట్రంలోని అన్ని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూళ్ల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.రిజర్వేషన్ హామీని నిలబెట్టుకున్నాంకామారెడ్డి టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి నాయిని రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కా మారెడ్డిలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకునేలా మహిళలు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో మహిళా నాయకులు స్వప్న, ఫరీదా, జమున తదితరులు పాల్గొన్నారు. ‘సాగర్’ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటి విడుదలనిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది
బీబీపేట/దోమకొండ/భిక్కనూరు: తమ ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసిందని, రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వం తమదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రంలో బీసీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండల కేంద్రాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అగ్రస్థానంలో నిలిపేందుకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్లు కేవలం ఓట్ల కోసం పథకాలను ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ ప్రజల అభ్యున్నతికోసం పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మహిళలను కించపరచడమే అవుతుందన్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హయాంలో ఆనాడు విద్యుత్ మంత్రిగా షబ్బీర్అలీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల కారణంగానే నేడు ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోందని కొనియాడారు. వరదల కారణంగా బీబీపేట ప్రధాన రహదారిపై దెబ్బతిన్న బ్రిడ్జీని మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అలాగే పెద్ద చెరువు బుంగ పూడ్చిన స్థలాన్ని కూడా వారు పరిశీలించారు.రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడడానికి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమే కారణమని మంత్రి సీతక్క విమర్శించారు. సీజన్ ప్రారంబానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత మేరకు యూరియా అవసరమో కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా వివరించిందన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి, యాదవరెడ్డి, అనంతరెడ్డి, సుతారి రమేశ్, మార్కెట్ కమిటీల చైర్మన్లు రాజు, పాత రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ అంటనే పేదల సంక్షేమ పార్టీ అని.. నాడు ప్రజాభివృద్ధిలో రాజన్న.. నేడు అదే బాటలో రేవంతన్న ముందుకు దూసుకెళ్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. ఆయా మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. నాడు వెఎస్సాఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయగా.. నేడు రేవంత్రెడ్డి పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నారన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలను అగ్రస్థానంలో నిలిపేందుకు రిజర్వేషన్లు ప్రజల అభ్యున్నతి కోసం పథకాలు ఉచిత బస్సు ప్రయాణంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పంచాయతీరాజ్శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క -
ముదురుతున్న లొల్లి!
● యూరియా కోసం రైతుల ఆందోళనబాట ● పొలాలను వదిలి రోడ్లపైకి.. ● అవసరమైన సమయంలో దొరక్క ఆందోళనమాచారెడ్డి మండలం సోమారంపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యూరియా సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా దొరక్కపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన సమయంలో యూరియా దొరకడం లేదని ఆవేదనకు గురవుతున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో యూరియా సమస్య తీవ్రంగా ఉంది. అవసరానికి సరిపడా యూరియా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు ప్రతిరోజూ యూరియా కోసం పొలాలను వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో గతేడాది 48,904 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఈ సారి ఇప్పటి వరకు 47 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఏడాదికేడాది రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఇదే సమయంలో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుండడంతో ఎరువుల అవసరం ఎక్కువైంది. రోడ్డెక్కుతున్న రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరిగి వేసారిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యూరియా గొడవలపై స్పందించారు. అధికారుల మధ్య సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఒక్కచోటనే పంపిణీ చేయడంతో అన్ని గ్రామాల రైతులు అక్కడకి చేరుకుంటున్నారని, దీంతో అందరికీ సరిపోక గొడవలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని ఎరువులను ఎక్కడికక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు సరైన ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వ్యవసాయ భూముల్లో తిరగాల్సిన రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడ్ వస్తోందని తెలియగానే ముందు రోజు నుంచే క్యూ కడుతున్నారు. రాత్రిళ్లు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ధర్నాలు, నిరసనలకు దారితీస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు.నాటు వేయకముందు ఎరువు చల్లిన. యూరియా కోసం రామారెడ్డి, సదాశివనగర్కు పలుమార్లు తిరిగిన, వరుసలో నిల్చున్నా దొరకలేదు. అవసరమైన సమయంలో ఎరువు వేయకపోవడంతో వరి గంట పోయడం లేదు. దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎవరూ పట్టించుకుంటలేరు. – రాజిరెడ్డి, రైతు, ఉప్పల్వాయిఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నా. 24 బస్తాలు అవసరం ఉంది. ఇప్పటి వరకు 10 బస్తాలు దొరికాయి. ఇంకా 14 బస్తాల యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్నా. సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరిగి దిగుబడి వస్తుంది. – అంజల్రెడ్డి, రైతు, చుక్కాపూర్ -
కలం గొంతు నొక్కడమే..
● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు ● స్వేచ్ఛను హరించడమే.. ● అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్ : ప్రజల పక్షాన అక్షర సమరం చేస్తున్న ‘సాక్షి’ పై కక్షగట్టి న ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్ర భుత్వం అక్రమ కేసులతో గొంతునొక్కుతూ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డితో పాటు పలువురు సాక్షి జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి వేధించడాన్ని నిరసించారు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యక్తిగత కక్ష సాధిస్తోంది. సాక్షి దినపత్రికపై పలుమార్లు దాడులు, అక్రమ కేసులు బనాయించడమే ఇందుకు నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి, అన్యాయం, అవినీతిపై వార్తలు రాసే పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం. – రజనీకాంత్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే చట్టపరంగా పోవాలే తప్పా ఇలా వ్యక్తిగతంగా సాక్షిపై కక్ష గట్టి అక్రమ కేసులు బనాయిండం, దాడులు చేయించడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కూటమిప్రభుత్వం కాపాడాలి. ఇలాంటి దాడుదు సరికాదు. ప్రజలే బుద్ధిచెబుతారు. – లతిఫ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికై నా పత్రికలపై కక్ష మానుకుని రాష్ట్ర అభివృద్ధివైపు అడుగువేయాలని సూచిస్తున్నాం. – జి.జగన్నాథం, జేఏసీ కన్వీనర్, కామారెడ్డిఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక, చానల్పై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు పత్రికా స్వేచ్ఛపై పాల్పడుతున్న కక్ష్య సాధింపు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని భావిస్తున్నాం. ప్రజా సమస్యలను, అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నందుకు కక్ష సాధించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. – చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజల పక్షాన నిలిచే మీడియానే గౌరవించని ప్రభుత్వం ప్రజలను ఏం కాపాడుతుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులతో సాక్షి కార్యాలయాలపై భౌతిక దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయిచడం పిరికిపంద చర్య. ప్రజలే బుద్ధి చెబుతారు. – ఎల్ఎన్.ఆజాద్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పూర్తిగా చట్టాలను, న్యాయాన్ని గౌరవిచండం లేదు. కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే సాక్షి దినపత్రిక, చానల్పై, కార్యాలయాలపై తరుచూ దాడులు చేయిస్తోంది. టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించడం చూసి చలించిపోయాం. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత దాడిగా భావిస్తున్నాం. – క్యాతం సిద్దిరాములు, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, న్యాయవాది -
అటవీ అమరవీరులకు నివాళులు
కామారెడ్డి క్రైం: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్వో నిఖిత, అధికారులు అటవీ అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులను స్మరిస్తూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎఫ్వో మాట్లాడుతూ.. విధుల్లో ఎదురయ్యే సవాళ్లకు భయపడొద్దని, సమష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి అధికారికి అండగా ఉంటామన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫ్డీవోలు రామకృష్ణ, సునీత, ఎఫ్ఆర్వోలు హబీబ్, రమేశ్, వాసుదేవ్, చరణ్ తేజ, హేమ చందన, రవికుమార్, సంతో్ష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్తా కోసం భారంగా..
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి. » కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు. » సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. » మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది. » సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు. » మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి. -
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
కామారెడ్డి క్రైం: కామారెడ్డిలో ఈనెల 15 న నిర్వహించే సీఎం సభకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలో సీఎం సభ నిర్వహించే ప్రాంతం, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, రామన్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఆదివాసి నాయక్పోడ్లు
● కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆందోళన నిజాంసాగర్(జుక్కల్): ఎస్టీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆదివాసీనాయక్పోడ్ కులస్తులు కదం తొక్కారు. బుధవారం మహమ్మద్నగర్ మండల కేంద్రానికి నాయక్పోడ్ కులస్తులు ర్యాలీగా తరలి వచ్చారు. బస్టాండ్ ప్రాంతంలో బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఎస్టీ కులద్రువీకరణ పత్రాలు ఇవ్వని మహమ్మద్నగర్ తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివకుమార్ ధర్నా వద్దకు చేరుకొని నాయక్ పోడ్ కులస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుల ద్రువీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చేంతర వరకు కదిలేది లేదని వారు బీష్మించి కూర్చున్నారు. మహమ్మద్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అక్కడి చేరుకొని నాయక్పోడ్కులస్తుల సమస్యను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ధర్నాను విరమించుకొని తహసీల్ కార్యాలయం ముట్టడికి వచ్చారు. తహసీల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నాయక్పోడ్ల సమస్యలను తెలుసుకున్నారు. పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి వారి గ్రామాలకు వెళ్లారు. నాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య, నేతలు భూమయ్య, శంకర్, సాయిబాబా, కాశీరాం తదితరులున్నారు. -
‘సమాజాభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకం’
బాన్సువాడ : సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్య హబ్గా మార్చామన్నారు. నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో 350 అదనపు తరగతి గదులను నిర్మించామన్నారు. దేశంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలు 13 మంజూరైతే అందులో ఒకటి బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామన్నారు. నర్సింగ్ కళాశాలలు జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేస్తారని, కానీ పట్టుబట్టి బాన్సువాడకు మంజురు చేయించానని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బదిలీల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, పీఆర్టీయూ ప్రతినిధులు నరహరి, శ్రీనివాస్, ప్రవీణ్, సంతోష్, రవీందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధిత విద్యార్థులకు ఏబీవీపీ చేయూత
కామారెడ్డి రూరల్: అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్ను బుధవారం ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలో వరదల కారణంగా విద్యార్థుల పుస్తకాలు వాటికి సంబంధించిన స్టేషనరీ వస్తువులు కొట్టుకుపోయాయి. వారికి చేయూతను అందించడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు ఒక పెన్ను, ఒక నోట్ బుక్, పెన్సిల్, స్టేషనరీ వరద బాధితుల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు ముందుకొచ్చి ఈ పని చేస్తున్నాయని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలను ఎస్పీ ప్రశంసించి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఎన్నో చేయాలని వారు సూచించారు. ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ రెడ్డి, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్, కామారెడ్డి నగర కార్యదర్శి సంతోష్, నాయకులు సంజయ్, చరణ్, రాజు నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● రెండు రోజుల్లో పరిహారం అందించాలి ● లేకపోతే బీసీ సభను అడ్డుకుంటాం ● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ఎల్లారెడ్డి: భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఎల్లారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన పర్యటన రైతులను పరామర్శించడానికి వచ్చినట్లుగా కాకుండా విహారయాత్రకు వచ్చివెళ్లినట్లుగా సాగిందని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. రూ. వంద కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారనుకుంటే పది రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన బోర్ మోటార్లు వరదలో కొట్టుకుపోయాయని, వారికి వెంటనే ప్రభుత్వం కొత్త మోటార్లు అందజేయాలని కోరారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ.. ఓట్ల కోసమే బీసీ సభ పేరిట కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలందర్రెడ్డి, సతీష్, ముదాం సాయిలు, కపిల్ రెడ్డి, నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఉగ్ర కలకలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మరోసారి ఉగ్ర మూలాలు కలకలం సృష్టించగా ప్రజలు ఉలి క్కిపడుతున్నారు. తాజాగా బుధవారం బోధన్ పట్టణానికి చెందిన హాజీయమన్ను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులను జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్ఐఏ అరెస్టు చేసి విచారణ చేసిన సమయంలో బోధన్కు చెందిన హాజీయమన్ పేరు బయటకు వచ్చింది. హాజీయమన్ గత కొంతకాలంగా అంతర్జాతీయ ఫోన్కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఇతని ఇంట్లో ఎయిర్గన్ను ఎన్ఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోధన్ కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం హాజీయమన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్తో సైతం లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ● బోధన్ పట్టణంలో నకిలీ చిరునామాలతో 2018 లో బంగ్లాదేశీయులకు అక్రమ పద్ధతిలో 74 పాస్పోర్టులు జారీ చేశారు. ఈ విషయమై అప్పటి స్పెష ల్ బ్రాంచ్ ఏఎస్ఐలు మల్లేష్, అనిల్లపై ప్రభు త్వం చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు తరువాత బోధన్కు వచ్చిన వ్యక్తులకు అక్ర మంగా పాస్పోర్టులు జారీ చేసే విషయంలో ఈ ఇద్దరు ఏఎస్ఐలు కీలక పాత్ర పోషించడం గమనార్హం. బోధన్లోని ఒకే ఇంటి నంబర్ మీద 24 పాస్ పోర్టులు ఇవ్వడం అప్పట్లో సంచలనం కలిగించింది. అలాగే ఇతర అద్దె ఇంటి నంబర్లపై సైతం ధ్రువీకరణలు సృష్టించి పాస్పోర్టులు జారీ చేయించారు. తరువాత కాలంలో బోధన్లో రోహింగ్యాలకు ఆధార్ కార్డులు సైతం జారీ చేయడం గమనార్హం. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్తో.. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో 2022 జూలై 4న పీఎఫ్ఐ సభ్యుడు, శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్తో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్ ఖాదర్ డైరీ, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ తర్వాత నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారంతో పోలీసులు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షేక్ షాదుల్లాను, నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ వద్ద దొరికిన డైరీలోని వివరాలతో విచారణ చేపట్టారు. జిల్లాలో 200 మందికి పైగా శిక్షణ తీసుకోగా, ఇందులో 23 మంది కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్లో కడప బేస్ క్యాంపుగా ఏర్పాటు చేసుకుని పీఎఫ్ఐ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. విచారణలో పీఎఫ్ఐ ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఎన్ఐఏకు లేఖ రాశారు. ఎన్ఐఏకు చెందిన ఉన్నత స్థాయి అధికారి జిల్లా పోలీసులతో సమావేశమయ్యారు. కేసులో తీవత్రను గుర్తించిన ఎన్ఐఏ 2022 ఆగష్టు 26న పీఎఫ్ఐ కేసును తీసుకుంది. ఎన్ఐఏ అధికారులు నలుగురిని విచారించిన తరువాత సెప్టెంబర్ 18న నిజామాబాద్తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్ట్యాప్లు, ఎలక్ట్రిక్ వస్తువులు, సెల్ఫోన్లులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు లభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నలుగురిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు హాజరు పర్చారు. వారిచ్చిన సమాచారంతో పాటు ఎన్ఐఏ సేకరించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. 170 మందిని అరెస్ట్ చేయడంతో పాటు విదేశాల నుంచి రూ.120 కోట్లు సేకరించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిమి నుంచి పీఎఫ్ఐగా మారిన ఈ సంస్థకు ఐసిస్, లష్కరేతోయిబా సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు తేలింది.నిషేధిత సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) నుంచి పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)గా రూపాంతరం చెందిన ఉగ్ర సంస్థ శిక్షణ కేంద్రాన్ని 2022లో నిజామాబాద్లో కనుగొన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో వివిధ రకాలుగా హత్యలు ఎలా చేయడం, మతకలహాలు సృష్టించే విషయాలపై శిక్ష ణ ఇచ్చారు. దక్షిణాదిలో కీలకమైన బేస్క్యాంప్గా నిజామాబాద్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2022 జూలై 4న నిజామాబాద్లో పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్టుతో దేశవ్యాప్తంగా డొంక కదిలింది. తరువాత జూలై 6న మరో ముగ్గురిని నిజామాబాద్లో అరెస్టు చేశారు. సెప్టెంబర్ 18న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం 23 మందిపై జిల్లాలో కేసులు నమోదు చేశారు. ఆర్మూర్కు చెందిన నవీద్ అనే వ్యక్తిని సైతం ఎన్ఐఏ విచారించింది. అదేక్రమంలో దేశవ్యాప్తంగా 106 చోట్ల వివిధ రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ మొత్తం 170 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలన్నింటిపైన కేంద్రం యూఏపీఏ చట్టం కింద నిషేధం విధించింది. బోధన్లో హాజీయమన్ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ ఎన్ఐఏ బృందం ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజానీకం గతంలో బంగ్లాదేశీయులకు అక్రమంగా పాస్పోర్టులు జారీ చేసిన వైనం 2022లో జిల్లా కేంద్రంలో ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాన్ని కనుగొన్న ఎన్ఐఏ, పోలీసులు అనంతరం పీఎఫ్ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం -
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ
● మోసాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించిన కాలనీ వాసులు సదాశివనగర్: కామారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి తాము వచ్చామంటూ 25 మందిని బురిడీ కొట్టించి దొరికి పోయిన వారిని పోలీసులకు అప్ప గించిన ఘటన బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో చోటు చేసుకుంది. రూ.2,500 చెల్లిస్తే రూ.లక్షా50వేలు ఇస్తామని దానికి సంబంధించిన ఫారాలను నింపి బాధితుల నుంచి సంతకాలు సైతం తీసుకున్నారు. మూడు నెలల్లో రూ. 50వేలు చెల్లిస్తే మిగతా రూ. లక్ష చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతో కాలనీకి చెందిన 25 మంది రూ. 2500 చెల్లించారు. కొంత మందికి అనుమానం రావడంతో మీరు కామారెడ్డిలోని ఏ బ్యాంక్ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వారు తడబడుతూ ఓ ప్రైవేట్ బ్యాంక్ పేరు చెప్పారు. వెంటనే కాలనీవాసులు ఆ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్ పేరు మీద ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు వచ్చారని చెప్పగా వారు మా బ్యాంక్ సిబ్బంది కాదని తెలపడంతో పాటు వారిని కాలనీవాసులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి నుంచి తీసుకున్న డబ్బులను ఇప్పించారు. -
తైబజార్ కాదు.. హప్తా వసూల్
పిట్లం(జుక్కల్): పిట్లంలో తైబజార్ పేరుతో వసూళ్ల మాఫియా బరితెగించింది. సంతలలో తైబజార్ రసీదులు ఇవ్వకుండానే వ్యాపారస్తులు, దుకాణదారుల నుంచి తైబజార్ నిర్వాహకులు దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి తీరు సంతలో తైబజార్ వసూల్లా లేదు హప్తా వసూల్లా ఉందని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇలా జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పిట్లం మేకల సంత, పిట్లం తైబజారు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తైబజారు వేలం పాట నిర్వహించే సమమంలో రోజువారీ సంత, పశువుల దాఖాలు, గొర్రెలు, మేకలకు రేట్లను నిర్ణయించి ఇంతే వసూ లు చేయాలని కాంట్రాక్టర్కు అధికారులు సూచించారు. పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్లనే కాంట్రాక్టర్ వసూలు చేయాలి. కానీ తైబజారు దక్కించుకున్న కాంట్రాక్టర్ మరో కొంత మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఇష్టం వచ్చి నట్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరు సంతలో దుకాణదారులు, వ్యాపారులకు తైబజార్ రుసుము రసీదులు ఇవ్వకుండా ఒకటికి రెండింతలు డబ్బు లు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల నుంచి చిన్నాచితక రైతులు సంతలో కూరగాయలు అమ్ము కోడానికి వస్తుంటారు. అందులో కొంత లా భం రాకున్న వారు నష్టపోయినా సరే వారి వద్ద నిర్ణయించిన దాని కంటే అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్నారు. అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్న కాంగ్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సంతలో పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్ల ఫ్లెక్సీల ను ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. పిట్లం మేకల సంతలో వసూళ్ల పర్వం రసీదులు ఇవ్వని వైనం ఇబ్బందులకు గురవుతున్న రైతులు, దుకాణదారులు, వ్యాపారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
సేవ చేసేందుకు ఇష్టం లేక హత్య
బోధన్రూరల్: వృద్ధురాలికి సేవ చేసేందుకు ఇష్టం లేని కుటుంబీకులు హత్య చేసిన ఘటన సాలూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు భర్త, కుమారులు లేకపోవడంతో మరిది చిన్న గంగారాం వద్ద ఉంటోంది. ఆమెకు సేవలు చేసేందుకు ఇష్టం లేని గంగారాం, భార్య, కుమారుడు గొంతు నులిమి హత్య చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే నిందితులు హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పీఎస్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సూరజ్రావు(22), అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ అమ్మాయి వేరే యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటును బుధవారం టాటా ఏఎస్ వాహనం ఢీకొనడంతో మధ్యలో విరిగిపోయింది. ఉదయం 11:30 ప్రాంతంలో రైలు వస్తుందని గేట్మన్ గేటు వేస్తుండగా గేటు దాటి త్వరగా వెళ్లాలని నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గేటును ఢీకొన్నదని గేట్మన్ తెలిపారు. గేట్ మధ్యలో విరిగిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు వేసి రైలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను సిబ్బంది ఆపుతున్నారు. మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
వేగంగా చలానా!
అతి వేగంగా వాహనాలను నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేగ నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. జాతీయ రహదారులతోపాటు రాష్ట్రీయ రహదారిపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేసింది. వేగ పరిమితి దాటితే ఈ గన్ పసిగట్టి వెంటనే చలానా జారీ చేస్తుంది. ఈ చర్యతో వాహనాల వేగానికి కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిప్రధాన రహదారులపై వెళుతున్నపుడు చాలామంది అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై యూటర్న్ల దగ్గర ముందూ, వెనకా చూసుకోకుండా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రాంగ్ రూట్లో వెళ్లి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలామంది హెల్మెట్ ధరించకపోవడం మూలంగా కింద పడినప్పుడు తలకు గాయాలై చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు, తీవ్ర గాయాలతో ఆస్పత్రులపాలైన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ గట్టి చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు పట్టుకుని రిమాండుకు పంపుతున్నారు. ఇటీవలి కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పలువురికి ఒకటి, రెండు రోజులు జైలు శిక్షలు పడడమే ఇందుకు నిదర్శనం. అలాగే వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి స్పీడ్ గన్లను వాడుతోంది. వేగ పరిమితి దాటితే స్పీడ్ గన్ రికార్డు చేసి, చలానా జారీ చేస్తుంది.రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్లాలి. ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రులపాలైనా, ప్రాణాలు కోల్పోయినా కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ విషయాన్ని మరచిపోవద్దు. ప్రమాదాల బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమిత వేగంతో వెళ్లడం, హెల్మెట్ ధరించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. – రాజేశ్చంద్ర, ఎస్పీజిల్లాలో మూడు ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేశారు. ఈనెల 8న 44వ నంబరు జాతీయ రహదారిపై సదాశివనగర్లోని అయ్యప్ప మందిరం వద్ద ఒక స్పీడ్ లేజర్ గన్ను ప్రారంభించారు. దీనిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పరిశీలించారు. 161వ నంబరు జాతీయ రహదారిపై ఒకటి, 16వ నంబరు రాష్ట్రీయ రహదారి (కేకేవై రోడ్డు)పై మరో స్పీడ్ లేజర్ గన్ను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జరిమానాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చర్యలు తీసుకుంటుండడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఆగస్టు చివరి నాటికి జిల్లాలో 188 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఈ ఏడాది ఆగస్టు నాటికి 145 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు 22.9 శాతం తగ్గాయని చెబుతున్నారు. అలాగే రోడ్డు ప్రమదాలలో మరణాల సంఖ్య గతేడాది 197 ఉండగా, ఈ ఏడాది 153కు తగ్గిందంటున్నారు. మరణాల శాతం 22 శాతం తగ్గిందని పేర్కొంటున్నారు. వాహనాల స్పీడుకు కళ్లెం వేసేందుకు పోలీసుల చర్యలు ప్రధాన రహదారులపై పలుచోట్ల స్పీడ్ లేజర్ గన్ల ఏర్పాటు ప్రమాదాల నివారణ కోసమేనంటున్న అధికారులు -
ఎన్నాళ్లీ పాట్లు..
● యూరియా కోసం తప్పని తిప్పలు ● అరకొరగానే సరఫరా ● పోలీసుల పహారా మధ్య పంపిణీభిక్కనూరు/మాచారెడ్డి/బీబీపేట/రాజంపేట/సదాశివనగర్/రామారెడ్డి: రోజులు గడుస్తున్నా యూరియా సమస్య పరిష్కారం కావడం లేదు. బస్తా ఎరువు కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం భిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి మండలాల పరిధిలోని సొసైటీలలో యూరియా పంపిణీ చేశారు. బస్తాలు తక్కువగా ఉండడం, రైతులు ఎక్కువగా ఉండడం భారీ బారులు కనిపించాయి. బారెడు లైన్లలో గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులు, చెట్ల కొమ్మలు, రాళ్లు.. ఎలా ఏవి కనిపిస్తే అవి లైన్లలో ఉంచి పక్కన వేచి ఉన్నారు. పోలీసు పహారా మధ్య యూరియాను పంపిణీ చేశారు. బీబీపేటలో రైతుల ఘర్షణ.. బీబీపేట సొసైటీ వద్ద ఉదయంనుంచే రైతులు బారులు తీరారు. గంటల తరబడి నిలబడాల్సి రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాచారెడ్డిలో.. మాచారెడ్డి మండల కేంద్రంతో పాటు సోమారంపేట గ్రామంలో, పాల్వంచ మండలం భవానీపేట, ఎల్పుగొండలలో యూరియా పంపిణీ చేశారు. మాచారెడ్డి సింగిల్ విండోకు 450 బస్తాలు రాగా.. రైతులు ఎగబడి బస్తాలు తీసుకువెళ్లారు. చాలామందికి ఎరువు దక్కలేదు. భవానీపేటలో 220 బస్తాలే రావడంతో వందలాది మందికి నిరాశే ఎదురయ్యింది. సోమారంపేటలో ఉదయమే వచ్చి కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. చివరికి యూరియా రాకపోవడంతో నిరసన తెలిపి, నిరాశతో వెళ్లిపోయారు. రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లోనూ తెల్లవారకముందు నుంచే రైతులు యూరియా కోసం లైన్లు కట్టారు.బీబీపేటలో ఘర్షణ పడుతున్న రైతులుమాచారెడ్డి సింగిల్విండో వద్ద క్యూలో రైతులు -
ముదిరాజ్లను బీసీ–ఏలోకి మార్చాలని వినతి
● బాన్సువాడలో రౌండ్ టేబుల్ సమావేశం బాన్సువాడ: ముదిరాజ్ కులస్తులను బీసీ–డి నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేయాలని కోరుతూ బుధవారం బాన్సువాడలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్లకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అ ధ్యక్షుడు బట్టు విఠల్ మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభు త్వం వెంటనే ముదిరాజ్ కులస్తులకు న్యాయం చే యాలని కోరారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్లో ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏలోకి మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వా లని అన్నారు. ముదిరాజ్ కులస్తులు గురువినయ్, జిన్న రఘు, లింగమేశ్వర్, కనుకుట్ల రాజు, డాక య్య, భీమ గంగారం, కొంకి విఠల్, రాజేష్, దత్తు, కొంకి విఠల్, మొగులయ్య తదితరులున్నారు. -
క్రైం కార్నర్
గోడకూలి ఒకరి మృతిభిక్కనూరు: మండల కేంద్రంలో గోడకూలి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన జాగీర్సింగ్(37) రేకుల షెడ్డుల నిర్మాణంతో పాటు షటర్లను తయారు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గత నెలలో కురిసిన భారీ వర్షానికి జాగీర్సింగ్ ఇల్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా వర్షానికి కూలిన ఇంటి గోడ జాగీర్సింగ్పై పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, అంధుడైన ఓ కుమారుడు ఉన్నారు.ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ ..రుద్రూర్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు గాండ్ల సావిత్రి అలియాస్ సాయమ్మ (52) అనే మహిళ పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయమ్మ మంగళవారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి జారి పడిపోయిందని తెలిపారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.వాహనం పైనుంచి పడి యువకుడు.. ఖలీల్వాడి: నగరంలోని జడ్పీ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన మహేశ్(32) పని నిమిత్తం అశోక్ లీలాండ్ వెహికల్పై వస్తున్నాడు. డ్రైవర్ గాటే ఖండూ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం వెనకాల కూర్చొని ఉన్న మహేశ్ వాహనం పైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.రెండు టన్నుల స్టీల్ చోరీనవీపేట: మండలంలోని యంచ శివారులో జరుగుతున్న జాతీయ రహదారి(బీబీ 161)విస్తరణ పనుల కోసం డంప్ చేసిన స్టీల్ నుంచి పీరాజీ అనే వ్యక్తి 2 టన్నులు దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పనులు నిర్వహిస్తున్న అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజర్ పార్థసారధి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అంత్యక్రియలు నేనే చేస్తా.. నువ్వెవరో తెలియదు
కామారెడ్డి రూరల్: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. -
తెరపైకి రింగ్ రోడ్డు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు తెరదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రింగ్రోడ్డు నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పట్టణంలోని ట్రాఫిక్ కష్టాలను వివరించి, డీపీఆర్ చూపించి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఎదిగిన తరువాత మరింతగా విస్తరించింది. దీనికి తోడు పట్టణంలో పలు గ్రామాలను విలీనం చేశారు. అయితే పరిధి పెరిగినా.. పట్టణం విస్తరించినా.. సరైన రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం పట్టణానికి రావడం, పట్టణం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ‘రింగ్రోడ్డు’ను తెరపైకి తీసుకువచ్చారు. పట్టణానికి చుట్టూరా రింగ్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయించి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుంచారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే.. కామారెడ్డి పట్టణానికి ఉన్న ఇబ్బందులను వివరించి, రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వాలని డీపీఆర్తో పాటు వినతిపత్రం అందించారు. కామారెడ్డి పట్టణానికి మరో వందేళ్ల దాకా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రింగ్ రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి విన్నవించారు. పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల మీదుగా దాదాపు 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని రూపొందించిన డీపీఆర్ను అప్పగించారు. పట్టణ మ్యాప్ను చూపించి మరీ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. రోడ్డు నిర్మాణానికి రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఈ రోడ్డు నిర్మిస్తే పట్టణంపై ఒత్తిడి తగ్గుతుందని, అభివృద్ధి పెరుగుతుందని ఆయన పేర్కొంటున్నారు. కేంద్రం కరుణిస్తుందా.. రింగ్ రోడ్డు నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్న పని. 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడానికి మధ్యలో రెండు చోట్ల రైల్వే వంతెనలు, అలాగే వాగులపైన వంతెనాలు నిర్మించాల్సి ఉంటుంది. జాతీయ రహదారిని దాటే క్రమంలోనూ వంతెనలు అవసరం. దీనికి తోడు భూసేకరణ అనేది పెద్ద సవాల్గా ఉంటుంది. రోడ్డు నిర్మాణం చేయాలంటే రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం కరుణించి రింగ్రోడ్డు నిర్మించాలని జిల్లావాసులు కోరుతున్నారు.ట్రాఫిక్ కష్టాలు అనేకం.. జిల్లా కేంద్రాన్ని రైల్వే లైన్ రెండుగా విభజిస్తోంది. అయితే పట్టణంలో ఒకే రైల్వే వంతెన ఉంది. వాహనాల రద్దీ పెరిగిన తరువాత వంతెన ఏమాత్రం సరిపోవడం లేదు. రైల్వే వంతెన మీద ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశోక్నగర్లో రైల్వే గేటు ఉండగా.. రైళ్ల సంఖ్య పెరిగి ప్రతి పావు గంటకోసారి గేటు వేయాల్సి వస్తోంది. గేటు వేసినపుడల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వంతెన విస్తరించకపోవడం, అశోక్నగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎటు వెళ్లాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్హెచ్–44 బైపాస్ రోడ్డు ద్వారా కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా పట్టణంలోకి రావాల్సిందే.. అలాగే అటువైపు నుంచి ఇటు వెళ్లేవారు కూడా పట్టణం మీదుగానే వెళ్లాలి. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం, ట్రాఫిక్ సమస్య మూలంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలో 54 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు రూ.510 కోట్లతో అంచనాలు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్ మంజూరు చేయాలని వినతి -
ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారు
● ఆర్డీవో పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డి: ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డిలో చాలా మంది ఇళ్లు కూలాయని, చెరువు కట్టలు తెగిపోవడంతో పంటలు నీట మునిగిపోవడం, ఇసుక మేటలు వేయడం, పంటలు కొట్టుకుపోయాయన్నారు. ఇలాంటి వారికి ఆపత్కాలంలో లయన్స్ క్లబ్ వారు నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకమన్నారు. లయన్స్క్లబ్ గవర్నర్ అమర్నాథ్రావు, బసవేశ్వర్రావు, సంజీవరెడ్డి, రమేష్, నర్సింహరాజు, నాగరాజు, పద్మావతి, డీటీ శ్రీనివాస్, గిర్దావర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తదితరులున్నారు. -
‘నగదు రహిత లావాదేవీలు జరపాలి’
దోమకొండలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న డీఆర్డీవో సురేందర్దోమకొండ: నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం కోసం జిల్లాలో దోమకొండ మండలాన్ని ఎంపిక చేసినట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన మండలానికి చెందిన గ్రామ సంఘాల సభ్యులు, ఐకేపీ సీసీలు, సీఏలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామసంఘాల అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లావాదేవీలు జరిగేలా చూడాలని కోరారు. యూపీఐ ద్వారా రోజూ లక్ష రూపాయల వరకు లావాదేవీలు జరుపవచ్చన్నారు. మహిళలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఐకేపీ ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
కొరతకు కారణం పోడేనా?
కామారెడ్డి క్రైం : జిల్లాలోని పలు ప్రాంతాలలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజూ ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితులున్నాయి. అయి తే అధికారుల అంచనాల మేరకు జిల్లాకు యూరి యా వచ్చినా కొరత ఏర్పడడం గమనార్హం. దీనికి పోడు వ్యవసాయమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ అధికారులు సాగులోకి వచ్చే పంటలు, గత సీజన్ను బట్టి అవసరమైన ఎరువులు, విత్తనాల విషయంలో అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. దాని ప్రకారమే అన్ని జిల్లాలకు విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. ఈ లెక్కలన్నీ జిల్లావ్యాప్తంగా అధికారికంగా ఉన్న సాగు భూములు, సాగయ్యే పంటలపై ఆధారపడి ఉంటాయి. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే దాదాపు ప్రతి సీజన్లోనూ ఎరువుల కొరత కనిపిస్తుంది. ఈసారి కూడా ఖరీఫ్ చివరలో కామారెడ్డి డివిజన్ పరిధిలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొంది. రైతులు సింగిల్విండోల ఎదుట బారులు తీరుతున్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. లెక్కలోకి రాని సాగు వల్లే.. జిల్లాలో ఒకప్పుడు 84 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అట వీ భూమి విస్తరించి ఉండేది. అటవీశాఖ కామారెడ్డి, బాన్సువాడ సబ్డివిజన్ల పరిధిలో 8 రేంజ్లు ఉన్నాయి. గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల పరిధిలో అడవులు ఎక్కువగా ఉన్నా యి. గతంలో భూమి లేని నిరుపేదలు ఎక్కడో ఓ చోట కొద్దిపాటి భూమిలో పోడు వ్యవసాయం చేసేవారు. కానీ ప్రభుత్వాలు పోడు పట్టాలు ఇవ్వ డం మొదలుపెట్టాక చాలామంది అటవీ భూములను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో జిల్లాలో చాలా వరకు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగిన గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పరిధిలో అడవులు, గుట్టలు మాయమ య్యాయి. ఈ భూములలో సాగవుతున్న పంటలు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల్లోకి రాకపోవడంతో అంచనాలు తలకిందులవుతున్నాయి. దీంతో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అడవుల ఆక్రమణకు చెక్పెట్టాలని, ఎరువుల కొరత తీర్చాలని రైతులు కోరుతున్నారు.గాంధారి మండలంలో సాగు భూమిగా మారిన గుట్ట (ఫైల్)ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 5.23 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు వేశారు. గత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 49 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించా రు. ఈసారి(మే నుంచి సెప్టెంబర్ వరకు) 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 18,222 మెట్రిక్ టన్నుల డీఏపీ, 16,926 మెట్రిక్ టన్ను ల ఏంవోపీ, 44,762 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాకు 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. దానిని రైతులకు పంపిణీ చేశారు. ఇంకా సెప్టెంబర్ కోటా రావాల్సి ఉంది. ఏటా పెరుగుతున్న అటవీ భూముల సాగు విస్తీర్ణం తలకిందులవుతున్న వ్యవసాయ అధికారుల అంచనాలు యూరియా దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు -
కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం వారు లేరని బేడ బుడగ జంగాలు మాత్రమే ఉన్నారని, బేడ బుడగ జంగాల పేరు మీద కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరుపాటి వేణు అన్నారు. ఈమేరకు కామారెడ్డి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుశురాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గిర్ని వెంకటి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాష, రాష్ట్ర జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, జేఏసీ వైస్ చైర్మన్ తూర్పాటి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బాన్సువాడకు జ్వరమొచ్చింది!
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్లో జ్వరాలు వి జృంభిస్తున్నాయి. ప్రజలు చాలామంది కీళ్లు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. మరోవైపు దగ్గు, జలుబు వేధిస్తున్నా యి. దీంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి రోజూ 800 నుంచి 900 వరకు జ్వర పీడితులు వస్తున్నారు. రోగులతో ప్రైవేట్ ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. నెల రోజులుగా.. ప్రజలు నెల రోజులుగా వైరల్ జ్వరాలతో బాధ పడుతున్నారు. డివిజన్లోని బాన్సువాడ, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, బీర్కూ ర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్లతోపాటు పొరుగున ఉన్న కంగ్టి, నారాయణఖేడ్ మండలాలనుంచీ రోగులు బాన్సువాడఆస్పత్రికి వస్తున్నారు. జ్వరం, మలేరియా, డెంగీ, వాంతులు, విరేచనాలు, కాళ్ల వాపులు, కీళ్లు, ఒళ్లు నొప్పులు రోజుల తరబడి తగ్గకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నా రు. నొప్పుల తీవ్రత అధికంగా ఉండడంతో రోజుల తరబడి మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఏ పని సొంతంగా చేసుకోలేకపోతున్నా మని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బా న్సువాడ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో ఒ క్కో మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు చేస్తు న్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలోనూ రోగుల తాకిడి ఉంది. వ్యాధులతో బాధపడుతున్న డివిజన్ ప్రజలు ఏరియా ఆస్పత్రికి పెరుగుతున్న రోగుల తాకిడి రోజూ 800 పైనే ఓపీ.. ప్రైవేటు ఆస్పత్రులలోనూ రద్దీ -
ఎఫ్సీఎస్లో నాటకీయ పరిణామాలు
కామారెడ్డి అర్బన్: జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం(ఎఫ్సీఎస్) అధ్యక్షుడిగా నియమితులైన పెద్ద సాయిలు.. 24 గంటల్లో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. గాదం సత్యనారాయణకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. లింగంపేట మండలంలోని మోతె గ్రామానికి చెందిన గాదం సత్యనారాయణ గతంలో జి ల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన గ్రామంలో నివసించడం లేదన్న కారణంతో అక్కడి సంఘంలో ప్రాథమిక సభ్యత్వం తొలగించారు. దీంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిని కోల్పోయారు. కాగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉ న్న పసుపుల పెద్ద సాయిలును సోమవారం జి ల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే తన సభ్యత్వం రద్దు విషయంలో సత్యనారాయణ సహకార ట్రిబ్యునల్ నుంచి స్టే ఆర్డర్ తీసుకువచ్చి సోమవారం సాయంత్రం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతికి అందించారు. దీంతో మంగళవారం స్టే ఆర్డర్ను అమలు చేయడంతో పెద్ద సాయిలు పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ డోలిసింగ్ మంగళవారం మధ్యాహ్నం సత్యనారాయణను అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గాదం సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని డోలిసింగ్ తెలిపారు. 24 గంటల్లోనే పదవిని కోల్పోయిన పెద్దసాయిలు మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణకే బాధ్యతలు -
రెవెన్యూకు మంచి పేరు తీసుకురావాలి
కామారెడ్డి క్రైం: ఉత్తమ సేవలు అందించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో 363 గ్రామ పాలనాధికారుల పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివిధ క్లస్టర్లకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూభారతి చట్టం అమలు, ఇతర రెవెన్యూ విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలోని ఈవీ ఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, భద్రత సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆ ర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల వి భాగం డీటీ అనిల్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన తిరుపతి బాలాజీ జెండా
● 11 రోజుల పాటు పూజలు ● పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలుమద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ జెండా కొలువుదీరింది. పాత బస్టాండ్ ప్రాంతంలోని హనమాన్ ఆలయం ముందు గ్రామస్తులు, జెండా కమిటీ సభ్యులు బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు గోవిందా..గోవిందా... వెంకట రమణ గోవిందా అంటూ బాలాజీ జెండాకు స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన అనంతరం తిరుమల జెండా వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. జెండా మద్నూర్లో 11 రోజుల పాటు పూజలు అందుకుంటుందని.. అనంతరం ఈ జెండా తిరుపతి శ్రీవారి ఆలయానికి భయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. -
ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజ
● చికిత్స చేసి తొలగించిన వైద్యులు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి తొలగించి ఆయన ప్రాణాలు కాపాడారు. వివరాలు.. వారం రోజులుగా దగ్గు, దమ్ము, ఛాతినొప్పితో తీవ్ర అవస్థ పడుతున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి చికిత్స కోసం మంగళవారం వచ్చాడు. వైద్యులు పరీక్షించి, స్కానింగ్ చేయగా ఆయన ఊపిరితిత్తిలో ఒక శనగ గింజ ఉందని గుర్తించారు. పల్మనాలజిస్టు వైద్యుడు సాయికృష్ణారావు తన వైద్య బృందంతో కలిసి అధునాతనమైన బ్రాంకోస్కోపి చికిత్స ద్వారా ఇరుకున్న శనగగింజను తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, తినేటప్పుడు శనగ గింజ పొరపాటున ఊపిరితిత్తులలో ఇరుక్కుని ఉంటుందని వైద్యులు తెలిపారు. -
ప్రారంభానికి నోచుకోని పీహెచ్సీ
నస్రుల్లాబాద్: మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా చికిత్స కోసం పాత మండలాలు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం మాత్రం తప్పడం లేదు. గర్భిణులు, చిన్నారులు ప్రతి నెలా టీకాల కోసం బీర్కూర్ వెళ్లి రావాల్సి వస్తుంది. ప్రతి వారం నస్రుల్లాబాద్ మండలంలోని 19 గ్రామ పంచాయతీల నుంచి మహిళలు ఇబ్బందులు పడుతూ పోతున్నారు. నూతన పంచాయతీ ఏర్పాటై తర్వాత కూడా పాత మండలాలకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు. అలంకారప్రాయంగా.. మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) రూ.1.43 కోట్లతో పూర్తి చేశారు. దీనికి తోడు రూ.12 లక్షలు పెట్టి సీసీ రోడ్లు సైతం పూర్తి చేశారు. కాని అధికారులు సిబ్బంది కేటాయింపులో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో అలంకారప్రాయంగా దర్శనం ఇస్తోంది. వివిధ మండలాల నుంచి ఫర్నిచర్ను తీసుకువచ్చి పెట్టారు. మంత్రులతో ప్రారంభింపజేయాలని స్థానిక నాయకులు ఎదురుచూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. అందుబాటులో లేని వాక్సిన్లు నస్రుల్లాబాద్లో కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. అటవీ ప్రాంతానికి దగ్గరగా మండలం ఉండటంతో పాములు, కుక్కలు, కోతుల కాట్లకు గురవుతున్నారు. అయితే స్థానికంగా వాక్సిన్ నిల్వ చేసే ఏర్పాట్లు లేకపోవడంతో బీర్కూర్, బాన్సువాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని పీహెచ్సీ అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.నిర్మాణం పూర్తయినా సేవలు మొదలు కాని నస్రుల్లాబాద్ పీహెచ్సీప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. అధికారులు నాయకులు త్వరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజల అవసరాలు తీర్చాలి. – నర్సింలు గౌడ్, నస్రుల్లాబాద్మండలంలో సరైన వై ద్య సదుపాయం లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. పాము కాటు వాక్సిన్ సమయానికి అందక ప్రాణాలు పోతున్నాయి. పీహెచ్సీని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రజలకు మేలవుతుంది. – అల్లం రాములు, మైలారం సిబ్బంది కేటాయింపులో అధికారుల అలసత్వం చికిత్స కోసం బీర్కూర్, బాన్సువాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇందల్వాయి: మండల పరిధి లోని 44వ నంబరు జాతీయ ర హదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. అదిలా బాద్ జిల్లాలోని ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(21), విశాల్ అనే ఇద్దరు యువకులు హైదరా బాద్లో బీటెక్ చదువుతున్నారు. వారు మంగళవారం వేకువజామున కారులో హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. ఇందల్వాయి మండలంలోని దేవితండా హైవే వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న విశాల్కు స్వల్ప గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపిన విశాల్పై, లారీ పార్క్ చేసిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఆలాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చెరువులో పడి వృద్ధుడు.. సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ చెరువులో ఓ వృద్ధుడు పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గోప్య తండాకు చెందిన బుక్యా శంకర్(59) అనే వృద్ధుడు సోమవారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లాడు. రాత్రి అయిన అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా శంకర్ కనిపించలేదు. చెరువు కట్టపై అతడి బట్టలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా చెరువులో శంకర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
దరఖాస్తు గడువు పెంపు
సదాశినగర్(ఎల్లారెడ్డి): ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ కేంద్రం ఇన్చార్జి, కల్వరాల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరం పదో తరగతి పాసైన వారికి ఒకే సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తవుతుందని.. రెగ్యులర్ ఇంటర్తో సమానమైన అవకాశాలుంటాయన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సర్వాపూర్, ముదెల్లి గ్రామాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. ఇటీవల కురిసన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టం జరిగిన పంటలు, బాధిత రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఏఈవో దీక్షిత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉత్తునూర్ పీహెచ్సీ వైద్యాధికారి సాయికుమార్ అన్నారు. మంగళవారం ఆశాడే సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వీధులతో పాటు పరిసరాల్లో చెత్తా చెదారం కూరుకుపోయి ఉంటుందన్నారు. ఆశాకార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎం భాగ్యశ్రీ, హెచ్ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల వరదలకు ధ్వంసమైన హౌసింగ్ బోర్డుకాలనీ వైకుంఠధామానికి వెళ్లే రోడ్డును తక్షణమే బాగు చేయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం నాయకులు రోడ్డును పరిశీలించారు. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వారం రోజులుగా అంత్యక్రియలకు వచ్చిన పలువురు శ్మశానవాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్డు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నర్సింలు, అరుణ్కుమార్ తదితరులున్నారు. బాన్సువాడ: బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మ నరేష్, గౌరవ అధ్యక్షుడిగా చిదుర శివకుమార్, ఉపాధ్యక్షుడిగా బుడాల సాయిలు, ప్రధాన కార్యదర్శిగా దాసరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శిగా రాగిరి శ్రావణ్ కుమార్, కోశాధికారిగా పత్తి మహేందర్, సహాయ కోశాధికారిగా నవీన్లను ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు పత్తి శ్రీకాంత్, గంగాధర్, ఉప్పరి లింగం తదితరులున్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఐకేపీ వీవోఏల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గౌస్ ఖాన్ తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రమ్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్రావు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షురాలిగా ప్రభావతి రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీప్రియ, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీదేవి, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా కవితను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
విద్యుత్ సబ్స్టేషన్లో పగిలిన లింబు
● గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయంనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం లింబు పగిలిపోవడంతో సబ్స్టేషన్న్ పరిధిలోని పలు గ్రామాలకు గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సబ్స్టేషన్లో 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటకు వచ్చే ఎల్వీ బ్రేకర్పై లింబు ఆకస్మికంగా పగిలిపోయింది. కాగా లింబు పగిలిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. కాగా నూతన లింబును తీసుకువచ్చి బిగించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మండల కేంద్రం గోపాల్పేటతోపాటు పలుగ్రామాలకు 5 గంటలకుపైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 73 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 73 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్ల మంజూరు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి వెంచర్లో గ్రామ పంచాయతీకి వదిలిపెట్టాల్సిన ఓపెన్ ల్యాండ్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూర్కు చెందిన గంగల రవీందర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భిక్కనూరు జీపీకి చెందిన ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని, ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా, తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హకుం జారీ చేసినట్లు తెలిపారు. తెల్లకాగితంపై సంతకాలు చేయకపోవడంతో తమను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తమకు సంబంఽధించిన హోటళ్లు, దుకాణాలు, ఆటోల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు పెట్టినట్లు గౌడ కులస్తులు తెలిపారు. -
బస్సు ఢీకొని ఒకరు..
ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు. కంఠేశ్వర్లోని అయ్య ప్ప స్వామి ఆలయ సమీపంలో ముందున్న ఓ స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న సంతోష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం
సుభాష్నగర్: ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు నగరంలోని గాంధీచౌక్లో సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారితోకలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపు నుంచి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. తద్వారా దేశంలో దీపావళి పండుగ సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతోపాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి, గ్రామీణస్థాయి నుంచి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాము, నాయకులు జ్యోతి, వనిత, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, హరీశ్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మాస్టర్ శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం -
జార్ఖండ్లో అబ్బాపూర్తండావాసి మృతి
● మృతుడు పోస్టల్ ఉద్యోగి నవీపేట: మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) సోమవారం జార్ఖండ్లో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ తండాకు చెందిన సభావత్ కై లాస్ కుమారుడు జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ఫూల్ పరిధి ఒటాదిరి బ్రాంచ్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన స్నేహితులతో కలిసి సమీపంలోని వాటర్ఫాల్కు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి నీటమునిగాడు. ఊపిరాడకపోవడంతో మృతి చెందాడు. జార్ఖండ్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీహరి మృతితో అబ్బాపూర్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటుతో ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల మొగులయ్య(59) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మొగులయ్య ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఏదో కుట్టినట్లు తెలియడంతో నిద్ర నుంచి మేల్కొని పరిశీలించగా పాము కనిపించింది. కుటుంబసభ్యులకు తెలపడంతో పామును చంపేసి మొగులయ్యను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు మొగులయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తూ దారి మరిచి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తూర్పాటి లక్ష్మి–చింటులకు 4 ఏళ్ల కుమార్తె సాయిపల్లవి ఉంది. ఆమె ప్రతిరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉదయం 10 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి వచ్చేది. సోమవారం ఇంటికి వస్తుండగా దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గాలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ బాలికను చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చాడు. పట్టణ ఎస్హెచ్వో నరహరి కుటుంబసభ్యులకు సమాచారం అందించి చిన్నారిని అప్పగించారు. -
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్న్లో రామకృష్ణ మఠ్, ఇన్ఫోసిస్ సహకారంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగిందన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మఠ్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 9న మంగళవారం ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను ఇన్ఫోసిస్, రామకృష్ణ మఠ్ సహకారంతో అందిస్తామన్నారు. మొత్తం కిట్ల విలువ రూ. 20 లక్షలు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. -
మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 30 లో చిన్న, పెద్ద గుట్టలు ఉన్నాయని తెలిపారు. వాటిలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. మరికొందరు తమకు ఈ సర్వే నెంబర్లో పట్టా భుములు ఉన్నాయని చెబుతూ యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని క్రమబద్దీకరించి గ్రామస్తులు వడ్లు ఆరబెట్టుకునేందుకు, పశువుల మేతకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.