Kamareddy
-
చెరువు శిఖం భూమి కబ్జా
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సారంగా పూర్ శివారులో చెరువు శిఖం భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం ఇటీవల వెలుగు చూసింది. 10 ఎకరాల చెరువు శిఖం భూమిలో ప్లా ట్ల దందా ప్రారంభించారు. నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల రూపా యల విలువజేసే ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శిఖం భూమి పక్కనే ఉన్న ప్రైవేటు భూమి పట్టాను చూపుతూ కొందరు కబ్జాకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, గతంలో చెరువు శిఖం భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డును పెట్టారు. సర్వే నంబర్ 231లోని సుమారు 10 ఎకరాల 8 గుంటల శిఖం భూమి చుట్టూ కందకాన్ని తవ్వారు. కానీ, ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ కందకాన్ని తొలగించి శిఖం స్థలంలో ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే శిఖం భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానిక నాయకులు కొందరు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి చెరువు శిఖం భూమిని పరిశీలించారు. పది ఎకరాల్లో ప్లాట్ల దందా కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం -
రికవరీ ఎందుకు చేయలేదు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో డిఫా ల్ట్ రైస్మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎకై ్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, భూభారతి, వానాకాలం సాగు ప్రణాళిక అంశాలపై సమీక్షించారు. ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం సేకరించిన విషయమై అధికార యంత్రాంగాన్ని అభినందించారు. రికవరీ రూ. 4.4 కోట్లేనా? కామారెడ్డి జిల్లాలో 49 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.45 కోట్లు రికవరీ కావాల్సి ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రూ. 4.4 కోట్లు మాత్రమే రికవరీ చేయడమేమిటని, మిగిలిన మొత్తం రికవరీ కోసం చర్యలు తీసుకోవాలని జూపల్లి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి 15 రోజులకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఫలితం సాధించాలన్నారు. కామారెడ్డి జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వివరించారు. 116 మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయించామని, రైతులకు రూ.822 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు జరిపామని పేర్కొన్నారు. గతేడాదికంటే ఈసారి యాసంగిలో 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చామని మంత్రి జూపల్లి అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిరుద్యోగ యువతకు బాసటగా నిలువాలని, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలట్ మండలాల్లో అమలు చేశామని, జూన్ 3 నుంచి అన్ని మండలాల్లో విజయవంతంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సీఎంఆర్ రాబట్టే విషయంలో చర్యలు తీసుకోలేదెందుకు? ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు -
90 శాతం సబ్సిడీతో మగ్గాల ఏర్పాటు
దోమకొండ: దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఆరుగురికి 90 శాతం సబ్సిడీతో మగ్గాలు అందించేందుకు హైదారాబాద్కు చెందిన చేనేత సేవ సొసైటీ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని దోమకొండ గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ తెలిపారు. మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో స్థానిక చేనేత కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చేనెలాఖరుకల్లా ఈ మగ్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భద్రత, సహాయం అందించేందుకు త్రిఫ్ట్ ఫండ్ పేరుతో సామాజిక సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నిధిని విద్య, వైద్య ఖర్చులు, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి అవసరాలను విని యోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన జిల్లావాసి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ డైరెక్టర్ జ్యోత్స్న నేపాల్ మార్గంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్(5,364 మీటర్ల ఎత్తు) అధిరోహించారు. త్రివర్ణ పతాకంతో పాటు పాఠశాల బ్యానర్ను ప్రదర్శించారు. జ్యోత్స్న ఎవరెస్ట్ను అధిరోహించడం తమ పాఠశాలకు గర్వకారణమని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విద్యార్థి సంఘాల ఆందోళన కామారెడ్డి టౌన్: అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కూల్కు అనుమతి లేదని డీఈవో ఉత్తర్వులు జారీ చేసినా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. పుస్తకాలు, యూనిఫాం, అడ్మిషన్ల పేరిట ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తక్షణమే స్కూల్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో నాయకులు విఠల్, ముదాం అరుణ్కుమార్, బుల్లెట్, స్టాలిన్, మణికంఠ, రాహుల్, హరి, శివకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గణపతి ఆలయంలో పూజలు కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పశ్చిమ హౌసింగ్బోర్డు కాలనీలోని సంకష్టహర గణపతి ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో సామూహిక కల్యాణ తిలక ఉత్సవం నిర్వహించారు. పెళ్లి కాని, వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ, యువకులు సుమారు 105 మంది కల్యాణ తిలకం ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో వేదపండితుడు జి ఆంజనేయశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు సుతారి అంజయ్య, రవీందర్గౌడ్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో పోలీసుల తనిఖీ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో గురువారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటళ్లు, పాన్ షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్లతో తనిఖీలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు వాడితే చర్యలు తప్పవన్నారు. -
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
మద్నూర్: మండలంలోని కొడిచిరలో డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 62 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోగా 18 మందికి మోతిబిందు ఉన్నట్లు వైద్యుడు అజయ్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ ఇన్చార్జి హన్మంత్రావు, సిబ్బంది రఫిక్, జీపీ కార్యదర్శి రాజు,ఆశావర్కర్ రుక్మిణి,గ్రామస్తులు పాల్గొన్నారు. తాడ్వాయిలో.. తాడ్వాయి: మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు లింబాద్రి పిల్లలకు కంటి పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి మందులు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరీశ్గౌడ్, స్వప్న, లింబాద్రి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డీపీఎంల నుంచి షురూ.. ● బదిలీకు ఆప్షన్లు ఇచ్చిన సెర్ప్ డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో ఉద్యోగ బదిలీల ప్రక్రియ మొదలైంది. డీపీఎంల నుంచి బదిలీలను మొదలు పెట్టిన రాష్ట్ర సెర్ప్ శాఖ వారికి ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జిల్లాలో ఆరుగురు డీపీఎంలతోపాటు ఒక ఏపీడీ ఉన్నారు. వీరందరినీ బదిలీ చేసేందుకు ఆప్షన్ ఫారాలను ఇచ్చింది. వీటిని నింపిన డీపీఎంలు, ఏపీడీ సెర్ప్ శాఖకు హార్డ్కాపీని అందజేయగా ఆన్లైన్లో కూడా ఆప్షన్లు పెట్టుకున్నారు. రెండు, మూడు రోజుల్లో సెర్ప్ సీఈవో వీరికి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. అయితే, డీపీఎంల బదిలీలు పూర్తయిన వెంటనే ఏపీఎంలు, సీసీలకు కూడా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. వీరికి జిల్లా స్థాయిలోనే డీఆర్డీవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
రెంజల్(బోధన్): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. గత శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన లక్ష్మణ్ భార్యతో ఘర్షణ పడగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన తల్లికి లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి, సోయా, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాలను వివరించారు. ఒకే రకమైన పంట వేయడంతో భూములు చౌడు బారిపోతున్నాయని, దీని నివారణకు పంట మార్పిడి చేయాలన్నారు. తక్కువ కాల పరిమితి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. వ్యవసాయ సమాచార సాధానాలపై విస్తరణ శాస్త్రవేత్త శ్వేత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి నిశిత, వెటర్నరీ డాక్టర్ సురేశ్కుమార్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, రైతులు పాల్గొన్నారు. -
ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపేది..?
నస్రుల్లాబాద్: ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపు లేకుండా పోయింది. ఉచిత బస్సు సౌకర్యం అమలులో ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే జనం సంఖ్య పెరిగింది. దీంతో బస్సు వచ్చే వరకు బస్టాండుల్లో వేచి చూడాల్సి వస్తోంది. కానీ బస్టాండ్లో మాత్రం కనీస వసతులు కల్పించ క పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండుల్లో తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక పోవడంతో ప్రయాణికులుఅసహనంవ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా వసతులు కరువు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం బస్టాండ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు బస్సులు వెళ్తుంటాయి. అంతే కాకుండా నస్రుల్లాబాద్ చుట్టూ ఉన్న గ్రామాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు సైతం ప్రజలు వెళ్తుంటారు. అర్ధరాత్రుళ్లు కూడా బస్టాండ్లో ప్రజలు లేట్ నైట్ బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బస్టాండ్ను ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెమ్లి గ్రామానికి చెందిన దాతలు బస్టాండ్ ప్రాంగణం నిర్మించి ఇచ్చారు. కానీ కనీస వసతులు లేక నిరుపయోగంగా మారింది. కామిశెట్టిపల్లి, అంకోల్ వంటి గ్రామాల్లో కూడా ప్రయాణ ప్రాంగణాల వైపు అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో నిరుపయోగంగా మారాయి. అద్దెలు సరే.. అవసరాల మాటేమిటి ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారాలు చేయాలంటే టెండర్ వేసి అద్దెలు వసూలు చేస్తారు. ఇదే తరహాలో నస్రుల్లాబాద్ బస్టాండ్లో కూడా ఏళ్లుగా వ్యాపార సముదాయాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. వీటితో ఆర్టీసీ లాభాలు పొందుతుందే కానీ ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో శ్రద్ధ వహించడం లేదు. ఇకనైనా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయం కల్పిచాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీస వసతులు లేని నస్రుల్లాబాద్ బస్టాండ్ అసౌకర్యాల నడుమ బస్టాండ్లు కనీస వసతుల కల్పనలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు -
అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన గూల విఠల్ కుమారుడు గోవర్ధన్ నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒకాయోలో ఎంఎస్ చదివేందుకు వెళ్లా డు. గతేడాది నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న గోవర్ధన్.. బుఽ దవారం కుటుంబసభ్యులతో మాట్లాడాడు. గురువారం గోవర్ధన్ మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వచ్చేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నదని స్థానికులు తెలిపారు. -
భద్రతా భావాన్ని పెంపొందించాలి
కామారెడ్డి క్రైం: ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువా రం ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ రాజేశ్ చంద్ర పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయ ఆవరణలో డీజీపీ మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో ని పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసులు, నేరాల పరిశోధన, ప్రజలకు అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తాము సురక్షితంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ప్రతి కేసులో సమర్థవంతమైన, నిష్పక్షపాత దర్యా ప్తు జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించవచ్చన్నారు. సాంకేతికత ఉపయోగంలో దేశంలో నే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే అథారిటీ, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, బాధితులకు అండగా నిలవడం, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల విచారణ జరిపించడం తదితర అంశాల్లో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. సమీక్షలో మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి పోలీసు అధికారులతో సమీక్షలో డీజీపీ జితేందర్సిబ్బందికి అభినందన కామారెడ్డి క్రైం: ఇటీవల డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించిన బ్లూకోల్ట్, పెట్రో కార్ పోలీసులను డీజీపీ అభినందించారు. బాన్సువాడ ఎస్సై తాజుద్దీన్, బాన్సువాడ కానిస్టేబుల్ శంకర్, పిట్లం కానిస్టేబుల్ రవిచంద్ర, పిట్లం హోంగార్డ్ మారుతిలను అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతిని అందించారు. -
‘జీలుగ’ కోసం బారులు
తాడ్వాయిలో క్యూలో ఉన్న రైతులుభిక్కనూరు: భూసారం పెంచడానికి ఉపయోగపడే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు జిల్లాలో కొరత ఉంది. అరొకరగానే సరఫరా అవుతుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి, జంగంపల్లి గ్రామాల్లోని సింగిల్విండోల్లో విత్తనాలు విక్రయిస్తున్నారని తెలియగానే రైతులు పరుగులు తీశారు. అరగంటలోనే విత్తనాల స్టాక్ పూర్తవడంతో ఆయా విండోల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. అవసరమైన జీలుగ విత్తనాలను తెప్పిస్తామని విండో చైర్మన్లు గంగళ్ల భూమయ్య, నాగార్తి భూంరెడ్డి, గొండ్ల సిద్దరాములు తెలిపారు. తాడ్వాయిలో.. తాడ్వాయి: మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయంలో గురువారం జిలుగ విత్తనాలను పంపిణీ చేస్తారని తెలియగానే రైతులు ఉదయం 6 గంటలకే తరలివచ్చారు. అధికారులు వచ్చి వరుసగా రైతులకు విత్తనాలు అందించారు. అయితే సగం మందికి కూడా విత్తనాలు సరిపోలేదు. దీంతో రైతులు నిరాశ చెందారు. రైతులకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏవో నర్సింలు మాట్లాడుతూ మండలానికి 220 సంచులు మాత్రమే వచ్చాయన్నారు. మరిన్ని విత్తనాల కోసం పైఅధికారులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అరగంటలోనే ఖాళీ అయిన విత్తనాలు నిరాశలో పలువురు రైతులు -
సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం
కామారెడ్డి టౌన్: గత ప్రభుత్వ పథకాలతో పాటు కాంగ్రెస్ హామీ ఇచ్చిన పథకాలను సైతం ఆపకుండా అమలు చేస్తున్నామని ఎకై ్సజ్ శాఖ మంత్రి, జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ 70 నుంచి 80 శాతం సీట్లు సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దీనికి సంబంధించిన భూసేకరణ నిధుల కోసం షబ్బీర్ అలీ ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిశారన్నారు. ప్రొటోకాల్ పేరిట అభివృద్ధిని అడ్డుకోవద్దు.. ప్రొటోకాల్ పేరిట నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కామారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కామారెడ్డిని అభివృద్ధి చేయడం మాత్రం ఆపనన్నారు. గత ప్రభుత్వం పంటల నష్ట పరిహా రం కోసం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం జిల్లాకు రూ. 74 లక్షలు విడుదల చేసిందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, పార్టీ జిల్లా పరిశీల కులు సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయ కులు ఎడ్ల రాజిరెడ్డి, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, పండ్ల రాజు, గోనె శ్రీను తదితరులు పాల్గొన్నారు.ఎన్ని ఇబ్బందులున్నా.. బాన్సువాడ : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తున్నామ ని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. గురువారం బాన్సువాడలో పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసంలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రా లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఒక్క బాన్సువాడలోనే 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. పిల్లలు పక్కదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. దయ్యాలను పెంచి పోషించిన బీఆర్ఎస్ అధినేత దేవుడెట్ల అవుతాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. దయ్యాలకు నాయకత్వం వహించినప్పుడు దయ్యాల నాయకుడే అవుతాడని పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్యాకేజీని పూర్తి చేస్తాం ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
యూరియా తక్కువ మోతాదులో వాడాలి
సదాశివనగర్ : పంటల సాగులో తక్కువ మోతాదులోనే యూరియా వాడాలని ఏరువాక శాస్త్రవేత్త అనిల్రెడ్డి సూచించారు. గురువారం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్రెడ్డి మాట్లాడుతూ భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వాడాలన్నారు. అవసరం మేరకు మాత్రమే రసాయన ఎరువులను వినియోగించాలని సూచించారు. అధికారులు సిఫారసు చేస్తేనే పురుగు మందులను స్ప్రే చేయాలన్నారు. పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కార్యక్రమం కోఆర్డినేటర్ రేవంత్, ఏడీఏ రత్న, ఏవో ప్రజాపతి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.టీబీ వ్యాధిపై అవగాహనకామారెడ్డి అర్బన్: ఎవరైనా రెండు వారాలకన్నా ఎక్కువగా దగ్గు, జ్వరం, చాతినొప్పిలతో బాధపడడం, తెమడలో రక్తం వస్తే క్షయ వ్యాధి (టీబీ)గా అనుమానించాలని జిల్లా కార్మిక సహాయ కమిషనర్ కోటేశ్వర్లు పేర్కొన్నారు. టీబీ వ్యాధి ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని బీడీ ప్యాకింగ్ కార్మికులు, మునీమ్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో కోటేశ్వర్లు మాట్లాడుతూ టీబీ లక్షణాలున్నవారు ఆశ వర్కర్లను సంప్రదిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీబీ పరీక్షలు చేయడంతో పాటు వ్యాధి నిర్ధారణ తర్వాత ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. ఈ విషయాన్ని బీడీ కార్మికులకు బీడీ మునీమ్లు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆశ వర్కర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలికామారెడ్డి క్రైం : పండుగలను ప్రశాంత వా తావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి ఏ ఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. కామారెడ్డి డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉ న్న హిందు, ముస్లిం మత పెద్దలతో గురువా రం జిల్లా కేంద్రంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు వి ఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరి రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో షబ్బీర్కు చోటుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) రాజకీయ వ్యవహారాల కమిటీని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం గురువారం ప్రకటించింది. కామారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఈ కమిటీలో చోటు కల్పించారు.పారితోషికం చెల్లించాలికామారెడ్డి అర్బన్ : గతేడాది నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వెంటనే పారితోషికం చెల్లించాలని ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్ కుమార్ గౌడ్, రాజేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం జిల్లా ప్రణాళిక అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇతర జిల్లాల్లో పారితోషికం చెల్లించారని, కామారెడ్డి జిల్లాలోనూ చెల్లించి న్యాయం చేయాలని కోరారు. -
రేవంతన్నా కామారెడ్డి వైపు సూడన్నా!
ముఖ్యమంత్రులుగా గెలుపొందిన వారు తమ నియోజకవర్గాలకు కాస్త ఎక్కువగా నిధులు కేటాయించుకోవడం పరిపాటే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కొడంగల్లో గెలిచి కామారెడ్డిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి సీఎం కేసీఆర్ను ఓడించి తీరుతా అన్న రేవంత్ రెడ్డి శపథం మాత్రం నెరవేరింది. కామారెడ్డిలో ప్రభావిత ఓట్లు ఇచ్చిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కొడంగల్ మాదిరిగా కామారెడ్డిని సొంత నియోజకవర్గంగా భావించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘కామారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ను ఓడించి తీరుత. కేసీఆర్ను ఓడించేందుకే ఇక్కడ పోటీ చేస్తున్న’ అని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి తన లక్ష్యాన్ని సాధించారు. తాను గెలవలేకపోయినా, కేసీఆర్ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కొడంగల్ నుంచి వచ్చిన రేవంత్రెడ్డిని ఇక్కడి ఓటర్లు ఆదరించిన నేపథ్యంలో సీఎం హోదాలో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో నియోజకవర్గంలో ఐదారు పర్యాయాలు పర్యటించిన రేవంత్రెడ్డికి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై అవగాహన ఉందని, అలాగే ఇక్కడి వివిధ వర్గాల ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్కు నిధులిచ్చినట్టే కామారెడ్డిపై కరుణ చూపాలని కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మిగతా మూడు నియోజకవర్గాలకు వచ్చినా, కామారెడ్డికి మాత్రం ఇప్పటికీ మంజూరు కాలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇరుకు రోడ్లతో ఇబ్బందులు.. జిల్లాకేంద్రంలో ప్రధాన రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రోడ్లను విస్తరించడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాల్సిన అవస రం ఉంది. పట్టణాన్ని రెండుగా విభజించే రైల్వే లైనుపై వంతెనలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఉన్న ఒక్క వంతెన ఇరుకుగా మారింది. అశోక్నగర్లో రైల్వే గేటు మాటిమాటికీ వేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.జిల్లాకు మూడు సమీకృత గురుకులాలువిద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున మంజూరు చేస్తోంది. తొలి విడతలో జుక్కల్కు మంజూరవగా.. మద్నూర్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా బాన్సువాడ, ఎల్లారెడ్డిలకు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాన్సువాడకు మంజూరైన పాఠశాలను పొతంగల్లో ఏర్పాటు చేయనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. అలాగే ఎల్లారెడ్డికి స్కూల్ మంజూరైనట్టు ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ తెలిపారు. రూ.200 కోట్లు విడుదలయ్యాయని, టెండర్లు మిగిలాయని పేర్కొన్నారు. కానీ కామారెడ్డికి గతంలో మోడల్ స్కూల్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయకుండా హ్యాండిచ్చారని స్థానిక నేతలు, విద్యార్థులు వాపోతున్నారు.సాగునీరే పెద్ద సమస్య.. కామారెడ్డి నియోజక వర్గంలో ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతాంగం భూగర్భజలాలపైనే ఆధారపడి సేద్యం చేస్తుంటారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి సంబంధించి 22వ ప్యాకేజీ పనుల కోసం కామారెడ్డిలో శంకుస్థాపన చేశారు. ఆయన మరణంతో పనులు ఆగిపోయాయి. 22వ ప్యాకేజీ పనులకు సంబంధించి భూసేకరణకు ఇటీవల కేవలం రూ.23 కోట్లు మంజూరయ్యాయి. అవి ఏమాత్రం సరిపోవు. దాదాపు మూడు వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మరో రూ.200 కోట్లు అవసరమవుతాయి. అలాగే ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేయాలంటే రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంటున్నారు. 22వ ప్యాకేజీ పనులపై సీఎం రివ్యూ చేసి అవసరమైన నిధులు కేటాయిస్తేగానీ పనులు ముందుకు కదిలే పరిస్థితి లేదు.విద్యారంగంలో వెనకడుగే.. నాలుగైదు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి పట్టణంలో ఐదు దశాబ్దాల కిందటే డిగ్రీ కాలేజీ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఎక్కడాలేని బీటె క్ డెయిరీ, బీఎస్సీ ఫిషరీ బీఎస్సీ ఫారెస్ట్రీ వంటి కోర్సులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానా ల్లో ఉన్నారు. అయితే మారిన పరిస్థితులకు అ నుగుణంగా ఉన్నత విద్య అవకాశాలు మెరుగపడలేదు. ము ఖ్యంగా డెయిరీ కోర్సుకు సంబంధించి పీజీ కో ర్సులు రాష్ట్రంలో కూడా ఎక్క డా లేవు. ఇక్కడ ఎంటెక్ డెయిరీ కోర్సులు ప్రా రంభించడానికి కావల్సిన సౌకర్యాలన్నీ ఉన్నా యి. పీజీ కోర్సులు తీసుకురావలసిన అవసరముంది. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇక్కడ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. భిక్కనూరు సౌత్ క్యాంపస్లో మరిన్ని కోర్సు లు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆదరించిన ప్రజలకు మేలు చేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి వచ్చి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఎంతో ఆదరించారు. తక్కువ సమయంలో కూడా మంచి ఓట్లు వచ్చాయి. నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంది. ఇక్కడి డిగ్రీ కాలేజీకి వందల ఎకరాల స్థలం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఈ నియోజకవర్గం నాలుగైదు జిల్లాలకు కూడలి. – క్యాతం సిద్దరాములు, న్యాయవాది, కామారెడ్డియూనివర్సిటీ కావాలి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కావలసినంత భూమి ఉంది. అన్ని సౌకర్యాలున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అప్పటి సీఎం కేసీఆర్ ఎడ్యుకేషన్ హబ్ చేస్తాననన్నారు. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, లా, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డి గురించి ఆలోచించాలి. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. –ఎల్ఎన్ ఆజాద్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
నకిలీ విత్తనాలతో జాగ్రత్త!
కామారెడ్డి క్రైం : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ప్రతి సీజన్ ప్రారంభంలో అన్నదాతలకు నకిలీ, నాసిరకం విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకోవాలనే కంపెనీలు, వారికి సహకరించే వ్యాపారులు లేకపోలేరు. మాయమాటలతో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం.. కామారెడ్డి జిల్లా పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రధాన పంటగా వరి సాగవుతుంది. ఈసారి జిల్లా వ్యాప్తంగా 5.24 లక్షల ఎకరాల్లో వివధ రకాల పంటలు సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత ప్రధానంగా 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో పత్తి, 21 వేల ఎకరాల్లో కంది, 5 వేల ఎకరాల్లో మిరప, కూరగాయల పంటలు సాగు కావచ్చనే అంచనాలున్నాయి. ముఖ్యంగా పత్తి, మిరప, కూరగాయల విత్తనాల కొనుగోలు చేసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు ప్రవేశించే అవకాశం ప్రతి యేటా ఉంటుంది. పక్కనే ఉన్న నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన ఘటనలు ప్రతి సీజన్లోనూ వెలుగుచూస్తున్నాయి. మన జిల్లాలో కూడా చాప కింద నీరులా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతుంటాయనే ఆరోపణలున్నాయి. గతేడాది సైతం జిల్లాలోని పలు చోట్ల వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు నకిలీవి రావడంతో రైతులు నష్టపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. జిల్లా యంత్రాంగం పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లాలో 5 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు నిరంతరం నకిలీ విత్తనాలపై నిఘా ఉంచుతూనే క్రమం తప్పకుండా వ్యాపారుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు పెడతామని ఇటీవలే కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సైతం ఓ సమావేశంలో హెచ్చరించారు. నిరంతరంగా తనిఖీలు ప్రత్యేక టాస్క్ఫోర్ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను నిరంతరంగా పరిశీలిస్తున్నాం. మండలాల అధికారులు కూడా క్రమం తప్పకుండా దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైనా నకిలీ వితనాలు విక్రయిస్తే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలి. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి మార్కెట్లో నకిలీ, నాసిరకం విత్తనాల బెడద మార్కెట్లో పొంచి ఉన్న మోసపూరిత కంపెనీలు రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు -
సెల్ఫోన్ల రికవరీలో జిల్లాకు ప్రథమ స్థానం
కామారెడ్డి క్రైం: సెల్ఫోన్ల రికవరీలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళనకు గురికావద్దన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉందని పే ర్కొన్నారు. జిల్లాలో వారం రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 107 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3,150 సెల్ఫోన్లను రికవరీ చేశామని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని కమీషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్లు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (8712686114)ను సంప్రదించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు. 107 మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి -
షట్టర్లు లేక చెరువు నీరు ఖాళీ
నిజాంసాగర్(జుక్కల్): వరుణుడు కరుణించినా.. అధికారులు కరుణించకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువు నీళ్లు ఆయకట్టు భూములను ముంచెత్తుతూ పరుగులు తీస్తుండటంతో బుధవారం నర్వ గ్రామ రైతులు కదం తొక్కారు. ఇసుక బస్తాలను అడ్డుకట్టగా వేసి సాగు నీరు వృఽథా కాకుండా కాపాడుకున్నారు. మహమ్మద్ నగర్ మండలం నర్వ శివారులోని పాత చెరువు తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరు ఖాళీ అవుతోంది. చెరువులోకి వచ్చిన వరద నీరు.. వచ్చింది వచ్చినట్లుగా తూముల ద్వారా వృథాగా పోతోంది. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా రైతులు సొంతంగా ఇసుక బస్తాలను అడ్డు కట్టగా వేసుకున్నారు. నర్వ పాత చెరువు కుడి, ఎడమ పంట కాలువల తూములకు షట్టర్లు లేకపోవడంతోనే సాగు నీరు వృథాగా పోతోందని అధికారులు స్పందించి షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు.● ఆయకట్టును ముంచెత్తిన చెరువు నీళ్లు ● తూములకు ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేసిన రైతులు -
తండ్రి, కూతుళ్ల మధ్య వివాదం పరిష్కారం
బోధన్: పట్టణ కేంద్రంలోని దళిత వాడకు చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు పరమేశ్ కుమార్తె వైష్టవి రెండేళ్లుగా జిల్లా కేంద్రంలోని బాల సదన్లో ఉంటోంది. తన తండ్రి ఆలనా, పాలన పట్టించుకోవడం లేదని బోధన్ పట్టణ కేంద్రంలోని మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆశ్రయించి ఆదుకోవాలని కోరింది. బుధవారం ఈ కేంద్ర నిర్వాహకులు తండ్రి, కూమార్తెను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. తన నెలసరి వేతనంలో సగభాగం, ఉన్న ఎకరం పొలంలో సగభాగం కుమార్తెకు ఇచ్చేందుకు తండ్రి పరమేశ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టులో అదనపు న్యాయమూర్తి శ్రీనివాస్ వద్దకు ఇరువురిని తీసుకెళ్లగా ఇరువురి అంగీకారం మేరకు అవార్డు ప్రకటించి వారికి అందించారు. ప్రస్తుతం వైష్టవి తండ్రి మేనత్త వద్ద ఉంటోందని కేంద్ర నిర్వాహకులు, పారలీగల్ వలంటీర్ పద్మాసింగ్ తెలిపారు. జీజీహెచ్ ఏడీగా శ్రీనివాస్ప్రసాద్ నిజామాబాద్నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏడీగా శ్రీనివాస్ప్రసాద్ జిల్లాకు రానున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఏవోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ పదోన్నతిపై జీజీహెచ్ ఏడీగా రానున్నారు. ప్రస్తుతం జీజీహెచ్ ఇన్చార్జి ఏడీగా డాక్టర్ రాజశేఖర్ విధులు నిర్వర్తిస్తున్నరు. జూన్ మొదటి వారంలో పూర్తిస్థాయి ఏడీ రానున్నారు. -
సేంద్రియ ఎరువుకు డిమాండ్
మద్నూర్(జుక్కల్): సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువులకు డిమాండ్ పెరగడంతో అధిక ధర పలుకుతుంది. సేంద్రియ ఎరువుల్లో మొక్కకు అవసరమైనా అనేక పోషకాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారి రాజు రైతులకు సూచిస్తున్నారు. పశువుల ఎరువులను రసాయన ఎరువులతో పోల్చి చూడగా ఏడాదికి ఒక్క గేదె నుంచి 7 టన్నుల పేడ, 2500 లీటర్ల మూత్రం వస్తుంది. ఒక గేదె పేడలో సాలీనా 27.21 కిలోల నత్రజని (55 కిలోల యూరియాతో సమానం), 13.60 కిలోల భాస్వరం (85 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్తో సమానం), 6.8 కిలోల పోటాష్ (12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో సమానం), గేదె మూత్రంలో 29.16 కిలోల నత్రజని, 39.56 కిలోల పొటాష్, కోద్ది మొత్తంలో భాస్వరం ఉంటాయి. ఏ పంటకై నా ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండానే పశువుల ఎరువు ఉపయోగించి దిగుబడి అధికంగా పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లారీ కోడి ఎరువు రూ.12–14 వేలు రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో లారీ కోడి ఎరువు రూ.12–14 వేల మధ్య ఉంది. పశువుల ఎరువు లారీకి రూ.15 వేల నుంచి 16 వేల పైగా చేరింది. గొర్రెల ఎరువు సైతం రూ.9–10 వేల వరకు ఉంది. ప్రస్తుతం పశువుల స్థానంలో ఆధునిక యంత్రాలు రావడంతో ఎరువు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతి రైతు బయటి ప్రాంతాల నుంచి తీసుకవచ్చే సేంద్రియ ఎరువులపైనే ఆధారపడడంతో డిమాండ్ ఏర్పడింది. పొలాలకు తరలిస్తున్న రైతులు వ్యవసాయాధికారుల సూచన -
నాలుగేళ్లకే నూరేళ్లు..
మాచారెడ్డి: ఇంటి బయట ఆడుకుంటు న్న నాలుగేళ్ల బాలుడు నీటి గుంతలో పడి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన భూమ శ్రీలత–సందీప్ల రెండో కుమారుడైన యశ్వంత్(4)ను రెండు రోజుల క్రితం అమ్మమ్మ బరిగె నర్సవ్వ కొత్తపల్లెకు తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రం బాలుడు ఆడుకుంటూ నీటి గుంతలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని గుండెలవిసేలా విలపించారు. కొడుకా నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ ఆ తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ● అమ్మమ్మ ఇంటికి వచ్చి కానరాని లోకాలకు.. ● కొత్తపల్లిలో నీటి గుంతలో పడి బాలుడి మృతి -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
సిరికొండ: మండలంలోని కొండూర్లో విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై ఎల్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన వేల్పూర్ నవీన్(29) అనే యువకుడు వడ్రంగి పని చేయానికి తన మామ అయిన రవి వద్దకు కొండూర్ గ్రామానికి వచ్చాడు. బుధవారం గ్రామ సమీపంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. కిందికి వేళాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరి చేయాలని ట్రాన్స్కో అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందని గ్రామస్తులు వాపోయారు. వారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తు గ్రామస్తులు రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి వచ్చిన ఏఈ చంద్రశేఖర్, ట్రాన్స్కో సిబ్బందిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై ఎల్ రామ్ గ్రామస్తులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లారీ ఢీకొని ఒకరు.. ఖలీల్వాడి: నగరంలోని దుబ్బ ప్రాంతంలో లారీ ఢీకొని ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బకు చెందిన సుంకరి నర్సయ్య(68) బుధవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిరుపయోగంగా కంపోస్ట్ షెడ్
మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంపోస్ట్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. కంపోస్ట్ షెడ్లను పంచాయతీ సిబ్బంది వాడకపోవడంతో గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శమిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో అవి వృథాగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతలయంగా రోడ్డు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామం నుంచి దేమికలాన్కు వెళ్లే రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 10 ఏళ్ల క్రితం వేసిన తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతల మయంగా మారింది. ప్రతి రోజు ఈ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డు గుండా మండలంలోని కరడ్పల్లి, కన్కల్, దేమికలాన్ గ్రామాలకు చెందిన ప్రజలు ఎర్రాపహడ్కు వెళ్తుంటారు. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
లింగంపేట: మండలంలోని పొల్కంపేట శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను బుధవారం సాయంత్రం పట్టుకొని సీజ్ చేసినట్లు ప్రొబేషనరీ ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. ఎక్కపల్లి గ్రామానికి చెందిన నీల శంకర్, ల్యాగల గోపాల్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా పట్టున్నట్లు పేర్కొన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో జైలు శిక్ష మోపాల్: మండల కేంద్రంలో ఈనెల 25న నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో మద్యం సేవించి వాహనం నడిపిన కులాస్పూర్ తండాకు చెందిన మూడ్ గణేశ్కు రెండోరోజుల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జహాన్ బేగం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ బుధవారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఎస్సై సూచించారు. -
బీబీపేట బస్టాండ్లో తాగుబోతుల వీరంగం
బీబీపేట: మద్యం మత్తులో ఇద్దరు అన్నాదమ్ముళ్లు వీరంగం సృష్టించిన ఘటన బీబీపేట బస్టాండ్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాంరెడ్డిపల్లికి చెందిన గణేశ్, రమేశ్కు గ్రామంలో ఎలాంటి స్థలం లేకపోవడంతో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో తల్లితో కలిసి ఉంటున్నారు. వారి తల్లి భిక్షాటన చేస్తూ అన్నం పెడుతోంది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న వీరు బస్టాండ్లో ఘర్షణ పడ్డారు. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. ఈ ఘటన చూసిన ప్రయాణికులు భయంతో కొద్ది దూరం పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. నిత్యం మద్యంలో బస్టాండ్కు వచ్చే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, వారిని వేరే చోటుకు తరలించాలని స్థానికులు కోరారు. మద్యం మత్తులో ఇద్దరు అన్నాదమ్ముళ్ల ఘర్షణ ప్రయాణికులకు ఇక్కట్లు -
గ్రామాల్లో కేంద్రం బృందం పర్యటన
డిచ్పల్లి/ ఎడపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి ప్రయోజనాలను ప్రజలను అడిగి తెలుసుకునేందుకు కేంద్ర బృందాల సభ్యులు జిల్లాలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించారు. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి మేజర్ గ్రామం, ఘన్పూర్ గ్రామాలను సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీసెస్ ఆఫీసర్లు భానుప్రతాప్ సింగ్, జైపాల్ మౌర్య, దివ్య సింగాల్, హర్విందర్ పర్యటించారు. స్వచ్ఛభారత్ మిషన్, తడి, పొడి చెత్త నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణపై ప్రజలకు ఉన్న అవగాహన, రైతు బీమా పథకాల అమలుపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎడపల్లి మండలం జానకంపేటలో కేంద్ర బృందం సభ్యులు గ్రామంలోని మహిళా సంఘం సభ్యులతో వారికి అందుతున్న రుణాలపై ఆరా తీశారు. -
బాన్సువాడ కాంగ్రెస్లో భగ్గుమన్న వర్గ పోరు
బాన్సువాడ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గం నిరసన గళం ఎత్తారు. పోలీసుల పహారాలో అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందుకు బాన్సువాడ శ్రీనివాస గార్డెన్ వేదికగా నిలిచింది. సమావేశానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహాన్రెడ్డి, కై లాస్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల అబ్జార్వర్లు వేణుగోపాల్ యాదవ్, సత్యనారాయణగౌడ్లు హాజరయ్యారు. ఈ కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గంలో ఉన్న పార్టీ మండల అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్, సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వలేదని ఆ వర్గం కార్యకర్తలు మార్కెట్ కమిటీలో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులకు ఈ విషయాన్ని తెలిపి మార్కెట్ కమిటీకి రావాలని ఏనుగు వర్గం సూచించారు. మానాల మోహాన్రెడ్డి, కై లాస్ శ్రీనివాస్లు నేరుగా శ్రీనివాస్గార్డెన్కు వచ్చారు. విషయం తెలుసుకున్న ఏనుగు రవీందర్రెడ్డి వర్గం నేతలు మార్కెట్ కమిటీ నుంచి నేరుగా శ్రీనివాస్ గార్డెన్కు వచ్చారు. గార్డెన్ వద్ద భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు ఏనుగు వర్గం నేతలు సమావేశానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు గేటు ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీనియర్ నేతలు ఏనుగు రవీందర్రెడ్డి వర్గం వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారు తమను అవమానిస్తున్నారని ఏనుగు వర్గం నేతలు ఆరోపించారు. చివరికి వారిని సముదాయించి పంపించేశారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గం నిరసన పోలీసుల పహారాలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం -
విభేదాలు విడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలి
బాన్సువాడ : విభేదాలు విడిచిపెట్టి కార్యకర్తలందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ శ్రీనివాస గార్డెన్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపు అధి ష్టానం నిర్ణయం మేరకు గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాలను ఎన్నుకుంటామన్నారు. 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే గ్రామ, మండల అధ్యక్ష పదవులు కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ భరతం పట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ అన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరాకే తెలంగాణ ఉద్యమం ఉధ్రుతమైందని మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బాన్సువాడకు వచ్చినప్పుడు పోచారం శని పుత్రుడని విమర్శలు చేయడంపై మండిపడ్డారు. పోచారంను విమర్శిస్తే నాలుక చీరేస్తానమని ఆగ్రహాం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అబ్జార్వర్లు వేణుగోపాల్యాదవ్, సత్యనారాయణగౌడ్, నాయకులు అంబర్సింగ్, అలిబిన్అబ్దుల్లా, రత్నకుమార్, ఖలేక్, అసద్, కూనీపూర్రాజిరెడ్డి, శంకర్, సురేష్బాబా, మన్సూర్, మదుసూదన్రెడ్డి, బిట్ల సురేష్, దాసరి శ్రీనివాస్, ఎజాస్, శ్రీనివాస్గౌడ్, అజీం, అప్రోజ్ తదితరులు ఉన్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలకే పదవులు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అన్నదమ్ములా మెదలాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కై లాస్ శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, గ్రామాల్లో పాత, కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు అన్నదమ్ముల మెదలాలని సూచించారు. –కై లాస్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు కామారెడ్డి. -
లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: రాజీవ్ వికాసం పథకంలో రూ.50 వేలు, రూ.లక్ష రుణాలకు లబ్ధిదారుల ఎంపిక బుధవారం లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీవోలతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వనమహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
కాలువతో భక్తులకు ఇబ్బందులు
ఎల్లారెడ్డి: పట్టణంలోని అయ్యప్ప ఆలయం ముందు తవ్విన కాలువతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందు తవ్విన కాలువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. కుక్కల దాడిలో జింక మృతి రుద్రూర్: పొతంగల్ మండలం టాక్లీ శివారులో బుధవారం జింకల గుంపు నుంచి దారి తప్పి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేశ్ గ్రామానికి చేరుకొని జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఇటీవల జింక పిల్లలు మృతి చెందుతున్నాయి. వారం రోజుల్లో సోంపూర్, టాక్లీ, యాద్గార్పూర్ గ్రామాల్లో కుక్కల దాడిలో నాలుగు జింకలు మృత్యువాత పడ్డాయి. మంద నుంచి దారి తప్పిన జింక పిల్లలు గ్రామ శివారుల్లోకి రావడంతో కుక్కలు దాడి చేస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు పొలాల్లో బురద ఉండడం వల్ల జింక పిల్లలు పరిగెత్తలేకపోతున్నాయి. దీంతో అవి కుక్కల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. మూగ జీవాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
అనుమతి ఒకచోట.. తవ్వకం మరో చోట
బిచ్కుంద(జుక్కల్): మొరం తవ్వకాలకు అనుమతి ఒక చోట పొంది తవ్వకం మరో చోట చేస్తూ బిచ్కుంద మండలంలో మొరం మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా మొరం తవ్వకాలు జరిపి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో ప్రభుత్వ భూమి బిచ్కుంద శివారు తక్కడ్పల్లి రోడ్డు లో తవ్వకాలు జరుపుతున్నారు. బుధవారం స్థానికులు తహసీల్దార్ వేణుగోపాల్కు ఫిర్యాదు చేయడంతో ఆర్ఐ రవీందర్, సిబ్బందిని పంపించారు. ఒక జేసీబీ, 6 మొరం ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. బిచ్కుంద శివారులో పెరుగు కిష్టారెడ్డికి చెందిన సర్వే నంబర్ గల 653, 666 పట్టా భూమి 54 గుంటలలో వేయి టన్నుల మొరం తవ్వకాల కోసం మైన్స్ శాఖకు శ్రీరాం అనే వ్యక్తి రూ.20 వేలు సీనరేజ్ చార్జీలు చెల్లించారని తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. మొరం తవ్వడానికి జూన్ 14 వరకు అనుమతి ఉందన్నారు. గతవారం రోజుల నుంచి అక్కడ తవ్వకుండా తక్కడ్పల్లి రోడ్డు ప్రభుత్వ భూమి సర్వేనంబర్ 814లో మొరం తవ్వి విక్రయిస్తున్నాడు. ఫిర్యాదుతో వెంటనే పరిశీలించగా అనుమతి ఉన్న చోట మొరం తవ్వకుండా, అధికారులను పక్కదారి పట్టించి ప్రభుత్వ భూమిలో మొరం తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. పట్టా భూమిలో పొందిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని మైన్స్ అధికారులు, బాన్సువాడ సబ్ కలెకర్ట్కు నివేదిక పంపించినట్లు తహసీల్దార్ తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు రెచ్చిపోతున్న మొరం మాఫియా బిచ్కుందలో జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు -
ప్రభుత్వాస్పత్రిలో కుమారుడికి టీకా వేయించిన సబ్ కలెక్టర్
బాన్సువాడ : బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో బుధవారం తన కుమారుడికి టీకా వేసి సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకు బూ స్టర్ డోస్ టీకా వేయించినట్లు తెలిపారు. ప్ర జలు ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్య సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఏఎన్ఎం అమృత తదితరులున్నారు. కొనసాగుతున్న అడ్వాన్స్డ్ ఇంటర్ పరీక్షలు కామారెడ్డి అర్బన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. ఫస్టియర్ బ్రిడ్ట్ కోర్సు పరీక్షలకు 33 మంది హాల్టికెట్లు పొందగా 24 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలకు 9 మంది హాల్ టిక్కెట్లు పొందగా ముగ్గురు మాత్రమే పరీక్ష రాశారు. నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నేడు జరి గే కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ష బ్బీర్ అలీ హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యుత్ అధికారులకు సమాచారమివ్వాలి కామారెడ్డి అర్బన్ : విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్లను వేస్తున్న ఆపరేటర్లు విద్యుత్ అ ధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్ ఈ శ్రావణ్కుమార్ సూచించారు. బుధవా రం ఎస్ఈ తన కార్యాలయంలో వివిధ కేబు ల్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. వైర్లు, కేబుళ్లకు సంబంధించి వివరాలను కచ్చితంగా పేర్కొనాలన్నారు. వి ద్యుత్ ఆపరేషన్స్ అధికారులు రాజశేఖర్, గో పాల్రెడ్డి, కల్యాణ్ చక్రవర్తి తదితరులు పా ల్గొన్నారు. ఈ–శ్రమ పోర్టల్పై అవగాహన బాన్సువాడ: భవన నిర్మాణ కార్మికులకు ఈ–శ్రమ పోర్టల్పై బుధవారం బాన్సువాడలో కార్మిక శాఖ బాన్సువాడ డివిజన్ సహాయ అధికారి ఇబ్రహీం జుబేర్ అవగాహన కల్పించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు ఈ–శ్రమ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, కార్మిక శాఖ నుంచి గుర్తింపు కార్డులు పొందాలని అన్నారు. పోర్టల్లో నమోదు చేసుకుంటే కార్మికులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. బీడీ కార్మికులకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సతీష్రెడ్డి ఉన్నారు. సాగర్లోకి 581 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్(జుక్కల్): రెండు, మూడు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకల్లో వరద నీటి ప్రవాహాలు ప్రారంభమయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి బుధవారం 581 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. 17.8 టీఎంసీలకు గాను 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహమ్మద్నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్లోకి స్వల్ప ఇన్ఫ్లో వస్తోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.5 మీటర్లు కాగా.. 408 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. -
ఆయుష్ ఆస్పత్రుల వద్ద హరిత యోగా కార్యక్రమాలు
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయుష్ డీపీఎం ఆకుల శ్రీకాంత్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని ఆయుష్ ఆస్పత్రి వద్ద హరిత యోగా కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడారు. వైద్యులు వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యులు గుండేల దేవయ్య, మల్లికా జనైడీ, సిబ్బంది రాజలక్ష్మి, సాయినీల, లింగామూర్తి తదితరులు పాల్గొన్నారు. రక్తదానంపై అపోహలు తొలగించుకోవాలి బాన్సువాడ రూరల్: రక్తదానం చేయడంపై ఉన్న అపోహాలను తొ లగించుకుని, ప్రతి 3 నెలలకు ఓసారి యువకులు రక్తదానం చేయాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ అన్నారు. బుధవారం బాన్సువాడలోని బ్లడ్బ్యాంకులో ఫౌండేషన్ నా యకులు చేసిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొ ని మాట్లాడారు.ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. యువకుల రక్తదానం కామారెడ్డి అర్బన్: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగీతో బాధపడుతున్న రహేనా బేగం అనే మహిళకు తెల్లరక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ ప్లేట్ లెట్లు అవసరం కాగా లింగంపేట్కు చెందిన రాజు, రమేష్లు స్పందించి మానవత ధృక్పథంతో రక్తదానం చేశారని రెడ్క్రాస్ సోసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. సకాలంలో ఏ పాజిటివ్ రక్తం ఇవ్వడంతో ప్లేట్లెట్లు ఎక్కించారని, ప్రాణాపాయం తప్పిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలి ఎల్లారెడ్డి: భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు హాజరు కావాలన్నారు. -
చివరి గింజా కొనుగోలు చేయాలి
తుజాల్పూర్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్బీబీపేట: రైతుల వద్దనున్న చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని నిర్వాహకులకు కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం ఆయన బీబీపే ట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. తుజాల్పూర్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేశారు. ప్రభు త్వం అనుమతించిన విత్తనాలు, ఎరువులనే అమ్మాలన్నారు. బీబీపేట్లో స్వరూప ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి, మంజూరు పత్రాన్ని అందించారు. ఎంపీడీవో కార్యాలయంలో చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. బీబీపేట పీహెచ్సీని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. పలువురు సిబ్బంది హాజరు రిజిష్టర్లో సంతకాలు చేయకపోవడంతో విధుల్లో లేనివారి వివరాలు తెలుసుకున్నారు. సూపర్వైజర్ సత్యానంద్ అనధికార సెలవు లో ఉండడాన్ని గమనించి అతడిని సస్పెండ్ చేయా లని డీఎంహెచ్వోను ఆదేశించారు. అదనపు డీఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్స్ విధుల్లో లేకపోవడంతో వారికి నోటీస్లు జారీచేయాలని సూచించారు. ఖాళీ స్థలంలోని చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. ఆయన వెంట డీసీవో రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, హౌసింగ్ పీడీ విజయపాల్రెడ్డి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ భానుప్రియ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో పూర్ణచందర్ తదితరులున్నారు. -
నీళ్ల ట్యాంకుల వద్ద పిచ్చి మొక్కలు తొలగించాలి
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని కాకతీయ నగర్, దేవునిపల్లి నల్లపోచమ్మ మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకుల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో విష పురుగులు, తేళ్లు, పాములు సంచరించడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కాకతీయనగర్ నీళ్ల ట్యాంక్ వద్ద స్థానికులు ఓ పామును చంపేశారు. కాగా ట్యాంక్ నుంచి నీళ్లు వదలడానికి ఎంతో భయపడాల్సి వస్తుందని వాటర్ మెన్ మీసాల రవి వాపోయారు. ట్యాంకుల వద్ద పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మొరం పోసి చదును చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
సాగర్ భూముల పరిరక్షణకు పోరుబాట
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు భూములను పరిరక్షించాలని మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. నిజాంసాగర్ భూ ములను ఇతర ప్రాజెక్టుల ముంపు బాధితులకు కేటాయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్నవారికి నిజాంసాగర్ భూముల్లో పునరావాసం కల్పించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బస్టాండ్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. నిజాంసాగర్ భూములను కాపాడాలంటూ తహసీల్దార్ భిక్షపతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మ ల్లికార్జున్, రవీందర్రెడ్డి, దుర్గారెడ్డి, గైని విఠల్, న ర్సింహారెడ్డి, రమేష్యాదవ్, లోక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.నిజాంసాగర్లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ధర్నా చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తహసీల్దార్కు వినతి -
బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్
భిక్కనూరు: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలన్న డిమాండ్తో మంత్రిని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో పలువురిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సిద్ధరామేశ్వర్నగర్ మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్తోపాటు గుర్జకుంట, పెద్దమల్లారెడ్డిలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కందడి రమేశ్రెడ్డి, సత్తూరి రాజలింగం ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందన్నారు. ఇప్పటికీ బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. -
యంగ్ ఇండియా స్కూల్ మంజూరు
బాన్సువాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైనట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో వివరాలను వెల్లడించారు. సుమారు రెండు వందల కోట్లతో నిర్మించనున్న స్కూల్ కోసం పొతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్ గ్రామం సోంపూర్ శివారులో స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రభుత్వం ద్వారా టెండర్లు ఖరారు కాగానే పనులు పూర్తిచేయిస్తామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు, ఈప్రాంత విద్యార్థులకు అమూల్యమైన వరం అందించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి బాన్సువాడ నియోజక వర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రానున్న వానాకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలు, ఎరువులపై మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్ననేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ గోపితో పలు అంశాలపై చర్చించారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు రైతాంగానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని ఎరువుల కొరత రాకుండా చూడాలని సూచించారు. అలాగే బాన్సువాడలో నూతనంగా నిర్మించిన నర్సింగ్ కళాశాల మిగులు పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆర్ఆండ్బీ సీఈ రాజేశ్వర్కు సూచించారు. వ్యవసాయ ఆధారితమైన నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు చేపడుతన్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ను ఆదేశించారు. సుమారు రూ.258కోట్లతో ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్తో 14వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. ఈకార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం సోంపూర్ శివారులో స్థలం ఎంపిక వివిధ శాఖల అధికారులతో సమీక్షలో పోచారం శ్రీనివాస్రెడ్డి -
భూ తగాదాలో మహిళ..
నిజాంసాగర్(జుక్కల్): భూ తగాదాలో ఓ మహి ళ దారుణ హత్యకు గురైన ఘటన జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై భువనేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అన్నదమ్ము లు జాదవ్రావ్ సాబ్ పటేల్, పండిత్ రావు మధ్య కొన్నిరోజులుగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం జాదవ్ రావ్ సాబ్ వేసిన జొన్న చేనును పండిత్రావు కొడుకు బాలాజీరావ్ కోస్తుండగా రావ్ సాబ్ భార్య జా దవ్ లక్ష్మీబాయి(45) అడ్డుకున్నది. భూమి తమ దంటే తమదని ఇరుకుటుంబాల వారు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో బాలాజీరావ్.. లక్ష్మీబాయి మెడపై గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దాడిలో లక్ష్మీబాయి చిన్న కొడుకు శుభంరావు కాలు, చెయి విరగడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహిళ దారుణ హత్య నందిపేట్(ఆర్మూర్): నిర్మానుష్య ప్రాంతంలో మహిళను హత్య చేసిన ఘటన నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలంలోని శాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత (42) 20 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కూలీ పని చేసుకుంటూ తన కుమారుడితో కలిసి జీవిస్తుంది. సోమవారం మధ్యాహ్నం నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో తొట్లె ఫంక్షన్కు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి నందిపేట వారాంతపు సంతకు వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా సుమలత ఇంటికి రాకపోవడంతో కొడుకు సాదా సంజయ్, బంధువులు కలిసి చుట్టు పక్కల వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం అయిలాపూర్ శివారులోని గుత్ప లిఫ్ట్ కాలువ పక్కన పొలం పనుల నిమిత్తం ఎర్రటి రవి వెళ్లగా బండరాళ్ల వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి సాదా సుమలతగా గుర్తించారు. అత్యాచారం చేసి.. సాదా సుమలతను తెలిసిన వ్యక్తులే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి మద్యం సేవించిన అనంతరం అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి, క్లూస్ టీం బృందం చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పక్కన మద్యం బాటిల్తోపాటు గ్లాసులు, వాటర్ బాటిల్ ఉన్నాయి. ఉరి వేసి చంపినట్లు మృతురాలి మెడకు గాట్లు ఏర్పడ్డాయి. పక్కనే వైరు తాడు సైతం పడేసి ఉంది. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టగా.. అది నందిపేటలోని వివేకానంద చౌరస్తా వద్దకు వచ్చి ఆగిపోయింది. మృతురాలి కొడుకు సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అత్యాచారం చేసి అంతమొందించినట్లు అనుమానం -
నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ కొలతలకు అనుగుణంగా, నిబంధనల మేరకు నిర్మించుకోవాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని వదల్పర్తిలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ ఇచ్చి లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు.కార్యక్రమంలో మాల్తుమ్మెద సొసైటీ మాజీచైర్మన్ రాంచందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అజీమోద్దీన్, కాంగ్రెస్ గ్రామకమిటీ అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఎంపీవో మలహరి సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నల్లమడుగు గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలించారు. అనంతరం గ్రామ శివారులోని కంపోస్టు షెడ్డును పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి కంపోస్టు ఎరువు తయారు చేయాలని కార్యదర్శికి సూచించారు. ఎరువులకు పంట చేనులకు తరలించాలని సూచించారు. అలాగే నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. కార్యదర్శి ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించిన ప్రత్యేక అధికారి బిచ్కుంద(జుక్కల్) : ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావాలని మండల ప్రత్యేక అధికారి మైన్స్ పీడీ నగేశ్ అన్నారు. మంగళవారం బిచ్కుంద, హజ్గుల్, పెద్దదేవాడ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత జీపీ కార్యదర్శిపై ఉందన్నారు. ఆయన వెంట ఎంపీవో కృష్ణ ఉన్నారు. -
ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
ఎల్లారెడ్డి:ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని తరగతి గదులను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసుల విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ నిజాం తదితరులున్నారు.ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలిబాన్సువాడ రూరల్: అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని, ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కొత్తాబాది గ్రా మానికి చెందిన పలువురు దరఖాస్తుదారులు కోరారు. పాత పెంకుటిళ్లు, పూరిగుడిసెలు కూలిపోయాయని తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వెంటనే పనులు ప్రారంభించుకుంటామన్నారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, త్వర లో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు అందజేస్తా మని షావలీ, లింగయ్య, ధరావత్ గంగారాం, మంగ్యా, విజయ్కుమార్, బీబీలు తెలిపారు.భవనం నిర్మించారు.. ప్రహరీ వదిలేశారుబాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల భవనం నిర్మించారు. ప్రహరీ నిర్మాణం వదిలేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో రూ. 6.70 కోట్ల వ్యయంతో బీర్కూర్లో బీసీ బాలుర గురుకుల పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని వసతులతో భవనం నిర్మించారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, పందులు పాఠశాల ఆవరణలోకి వచ్చి స్వైర్య విహారం చేస్తున్నాయి. వర్షకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.మైనారిటీ స్కూల్లో అన్ని వసతులుబిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలోని మై నారిటీ బాలుర స్కూల్లో అన్ని సౌకర్యాలున్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బో ధన కొనసాగుతుందని ప్రిన్సిపాల్ సునీతా భండారి అన్నారు. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మైనారిటీ స్కూల్లో చేర్పించాలని కోరారు. మైనారిటీలకు 5వ తరగతిలో 37 సీట్లు,6లో 5సీట్లు,ఎస్సీ, ఓసీల సీట్లు 2 ఖాళీ ఉన్నాయి. అలాగే 8వ తరగతిలో 9సీట్లు, 9వ తరగతిలో 22 సీట్లు, 10 వ తరగతిలో 35 సీట్లు మైనారిటీలకు, ఎస్సీ 4, ఓసీ 1 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈఅవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర పెద్దకొడప్గల్(జుక్కల్): జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశించారు. పెద్దకొడప్గల్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 760 దొంగతనాలు జరిగాయని, వచ్చే ఏడాదిలో చోరీలు జరగకుండా చూస్తామన్నారు. 150 మేజర్ చోరీ కేసుల్లో 82 పరిష్కరించామన్నారు. 161 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హైవే అథారిటీ వారితో మాట్లాడి త్వరలో స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయిస్తామని అన్నారు. చౌరస్తాల వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు చోరీ కాకుండా పెట్రోలింగ్ పెంచడంతోపాటు విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో గస్తీ ముమ్మరం చేస్తామన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా సీసీ టీవీల ప్రాముఖ్యత, డయల్ 100 వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలన్నారు. డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐ నరేశ్, ఎస్సై మహేందర్ ఉన్నారు. -
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
డిచ్పల్లి: మండలంలోని డిచ్పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు (34) మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్చార్జి ఎస్సై సుహాసిని తెలిపారు. కొద్దిరోజులుగా ధర్మరాజు అప్పులతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన పెద్ద కూతురు అనారోగ్యం బారినపడింది. దీంతో మనస్తాపానికి గురైన ధర్మరాజు ఉదయం తన పొలంలోని చెట్టు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఎర్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై సుహాసిని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇసుక ట్రాక్టర్లు పట్టివేత బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పుల్కల్, హజ్గుల్ సమీపంలో మంజీర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఉదయం 6 గంటలకు పట్టుకున్నట్లు తహసీల్దార్ వేణుగోపాల్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానా విధిస్తామన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ వర్ని: మోస్రా మండలం గోవూర్ శివారులో మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాయిల్స్, ఆయిల్ను దుండగులు చోరీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు స్థానిక రైతులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. -
కాలభైరవుడి సేవలో హరీశ్రావు
రామారెడ్డి: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు మంగళవారం ఇసన్నపల్లి(రామారెడ్డి)లోని శ్రీకాలభైరవ స్వా మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి మొదటిసారి వచ్చిన ఆయనకు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకు లు, ఆలయ ఈవో ప్రభుగుప్తా తీర్థప్రసాదాల ను అందించారు. హరీశ్రావు వెంట మాజీ ఎంపీపీ దశరథ్రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీశ్ గుప్తా, నాయకులు సత్యంరావు, పడిగెల శ్రీనివాస్ తదితరులున్నారు.అటవీ భూముల ఆక్రమణకు చెక్లింగంపేట: అటవీ భూముల ఆక్రమణకు అధికారులు చెక్ పెడుతున్నారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికిన ప్రాంతాల్లో పొక్లెయిన్లతో కందకాలు తవ్విస్తున్నారు. బోనా ల్, మెంగారం శివారులోని అటవీ భూము లు ఆక్రమణకు గురవుతున్న వైనంపై ఇటీవల ‘సాక్షి’లో ‘అటవీ భూములు ఆన్యాక్రాంతం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో అటవీ భూముల ఆక్రమణలను నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్విస్తున్నారు. రెండు రోజులుగా సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ ఆఫీసర్ పర్వీన్ పర్యవేక్షణలో కందకాల తవ్వకాలు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పుతో కందకాలు తవ్విస్తున్నట్లు వారు తెలిపారు.విద్యుత్ సమస్యలపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చుకామారెడ్డి అర్బన్: వినియోగదారులు తమ ఫిర్యాదులను తెలియజేయడానికి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వి ద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్కుమార్ తెలిపా రు. వినియోగదారులు 79016 28348 నంబర్కు హాయ్ అని మెస్సేజ్ చేయగానే టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్కు స్వాగతం అని రిప్లై వస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఆప్షన్లను ఎంచుకుని తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చని వివరించారు. టోల్ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.సామర్థ్యాలను పెంపొందించాలికామారెడ్డి రూరల్: విద్యార్థుల్లో సామర్థ్యాల ను, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని డీఈవో రాజు పేర్కొన్నారు. జిల్లాలోని 15 మండలాల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం దేవునిపల్లి జెడ్పీ హైస్కూల్లో ఐదు రోజుల శిక్షణను డీఈవో ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు ప్రతి ఉపాధ్యాయుడి బోధన తీరును పరిశీలించాలన్నారు. స్టాఫ్లో సమన్వయం సాధించారు. అందరూ చక్కగా పనిచేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని సూచించా రు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ గంగాకిషన్, కోఆర్డినేటర్ వేణు శర్మ, ఆర్పీలు సాయిరెడ్డి, లోకేశ్వర్రెడ్డి, కృష్ణప్రసాద్, అంజల్రెడ్డి పాల్గొన్నారు.‘ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’కామారెడ్డి అర్బన్: జిల్లాలోని గిగ్, ప్లాట్ ఫా రం వర్కర్స్ ఈ –శ్రమ్ పోర్టల్లో పేర్లను న మోదు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్, కొరియర్ సర్వీసెస్, హోమ్ సర్వీసెస్, ఏసీ టెక్నిషియన్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్లు, రాపి డో, ఉబర్, ఓలా, జొమాటో, స్విగ్గి, అర్బన్ కంపెనీ, ఈకామ్ ఎక్స్ప్రెస్, లాజిస్టిక్స్, పో ర్టల్ లాజిస్టిక్స్ వంటి సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఈపీఎఫ్ లేనివారందరు పేర్లు న మోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ– శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ గుర్తింపు కార్డుతో పాటు శాఖ అమలు చేసే సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఇతర వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 14434 లో సంప్రదించాలని సూచించారు. -
వేడుకలను ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేనెల 2 న జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్య అతిథి సందేశం సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే విధంగా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి ఈ ఏడాది చివరికల్లా టీబీ వ్యాధి నిర్మూలన జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక వాడలు, రైస్మిల్లులు, సిమెంట్ దుకాణాల్లో పనిచేసే కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు చేయించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించాలని సూచించారు. టీబీ ఉన్న వారికి ఉచితంగా మందులు, పౌష్టికాహారం తీసుకునేందుకు సహకారంగా నెలకు రూ.500 ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరగా ఇంటింటి సర్వే ప్రారంభించాలన్నారు. టీబీ వ్యాధిని నిర్ధారించే పరీక్షా కేంద్రాలు కామారెడ్డి, ఎల్లారెడి, బాన్సువాడ, బిచ్కుంద ఆస్పత్రుల్లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, టీబీ ప్రోగ్రాం అధికారి రాధిక రాణి, ఎన్సీడీ పీవో శిరీష, డీప్యూటీ డీఎంహెచ్వో విద్య, పీఆర్, మున్సిపల్, కార్మిక, ఐకేపీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన శకటాలను ప్రదర్శించాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ యూనిఫాంలు సిద్ధం చేయాలి దోమకొండ : పాఠశాలల పునఃప్రారంభానికి ముందే విద్యార్థులకు అందించేందుకు యూనిఫాంలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం దోమకొండలోని యూనిఫాం కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన యూనిఫామ్ల వివరాలు తెలుసుకున్నారు. సకాలంలో స్టిచ్చింగ్ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణలోని బోర్వెల్ రీచార్జి స్ట్రక్చర్స్ను, ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో సురేందర్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, డీపీఎం రమేష్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఐకేసీ ఎంపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా నుంచి..
● సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన నీల స్వామి ఎనిమిదేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. రెండేళ్లకోసారి ఇంటికి వచ్చి రెండు మూడు నెలలు ఉండి వెళుతుంటాడు. నాలుగు నెలల క్రితం అతడి ఆరోగ్యం దెబ్బతింది. అక్కడే వైద్యం చేయించుకున్నాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన మృతదేహం ఇంటికి చేరడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లున్నారు. ఇంటి పెద్ద దిక్కు ను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది.● రామారెడ్డి మండలం గోకుల్ తండాకు చెందిన మాలోత్ భాస్కర్ అనే యువకుడు పది నెలల కింద దుబాయి వెళ్లాడు. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్నేహితులు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ విషయమై సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో మృతుడి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. శవాన్ని అక్కడి నుంచి రప్పించడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నీల స్వామి (ఫైల్), తిర్మన్పల్లిమాలోత్ భాస్కర్ (ఫైల్), గోకుల్ తండాసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గల్ఫ్లో ఉపాధి.. అదో రంగుల కల. ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేనివారికి ప్రత్యామ్నాయంగా కనిపించేది ప్రాంతం.. అక్కడికి వెళితే నాలుగు డబ్బులు సంపాదించగలమన్న నమ్మకం.. నూనూగు మీసాల వయసులోనే చాలా మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. కొన్ని కుటుంబాల్లో అయితే రెండు, మూడు తరాల వాళ్లూ గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఇప్పటికీ వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది గల్ఫ్ బాట పడుతున్నారు. వీసాల కోసం కొందరు అప్పులు చేస్తుంటే, మరికొందరు ఉన్న భూమిని అమ్ముకుంటున్నారు. భార్య మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి వెళ్లేవారూ ఉన్నారు. కామారెడ్డి ప్రాంతంనుంచి ఐదు దశాబ్దాల కిందటే వలసలు మొదలైనా మూడు దశాబ్దాల నుంచి గల్ఫ్ వలసలు పెరిగాయి. వరుస కరువు కాటకాలతో పంటలు పండక వ్యవసాయాన్ని వదిలేసి వెళ్లిన వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే భార్య, పిల్లల్ని వదిలి గల్ఫ్ దేశాలకు వెల్లిన వారు అక్కడ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవలి కాలంలో పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లోనూ పలువురు చనిపోతున్నారు. సరైన సంపాదన లేక, అప్పులు తీర్చే దారి కానరాక కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల నుంచి నెలకో చావు వార్త వస్తోంది. ఎడారి దేశంలో చనిపోయిన వ్యక్తి శవం రావడానికి ఒక్కోసారి రెండు మూడు నెలలు కూడా వేచిచూడాల్సిన పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యుల వేదన అంతాఇంతా కాదు. ఐదేళ్లలో యాభైమందికిపైగా మృతి జిల్లాలో ప్రధానంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, కామారెడ్డి, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, తాడ్వాయి, గాంధారి, లింగంపేట తదితర మండలాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ఐదేళ్ల కాలంలో జిల్లాకు చెందిన యాభై మందికిపైగా ఆయా దేశాల్లో వివిధ కారణాలతో చనిపోయారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. నెలకో చావు వార్త వస్తుండడంతో గల్ఫ్ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నాలుగు డబ్బులు సంపాదించడానికి వెళ్లిన వ్యక్తి శవపేటికల్లో ఇంటికి చేరుతుండడంతో ఆ కుటుంబాలకు తీరని వేదన మిగులుతోంది. కారణాలెన్నో..బతుకుదెరువు కోసం ఎన్నో ఆశలతో గల్ఫ్ బాటపట్టిన ఎందరి జీవితాల్లో అర్ధంతరంగా ఆరిపోతున్నాయి. ఎన్నో ఆశలతో లక్షలు ఖర్చుచేసి గల్ఫ్ దేశానికి వెళ్లినా అక్కడి కంపెనీలు సరైన వేతనాలివ్వక పోవడంతో వీసా కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పనులకు వెళ్లే సమయంలో రోడ్డు దాటుతూ ప్రమాదాల్లో కొందరు.. పనిలో ఉండగా పెద్దపెద్ద భవనాలపై నుంచి పడిపోయి కొందరు చనిపోయారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడంతో మానసికంగా నలిగిపోయి పలువురి గుండెలు ఆగిపోయాయి. బతుకుదెరువుకోసం ఎడారి దేశాలకు వలస వివిధ కారణాలతో నెలకో చావు వార్త రోడ్డున పడుతున్న కుటుంబాలుఉమ్మడి నిజామాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా దుబాయి, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండగా.. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 1.50 లక్షల మంది ఉంటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వారు 4 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా. -
సాగుకు రైతును సన్నద్ధం చేయాలి
కామారెడ్డి క్రైం : వర్షాలు పడుతున్న నేపథ్యంలో ముందస్తు సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయం తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. రైస్ మిల్లులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. వర్షాలు ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ తన ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. 3 నుంచి రెవెన్యూ సదస్సులు.. వచ్చేనెల 3 నుంచి 20 వ తేదీ వరకు అన్ని మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. పైలట్ మండలాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుల అనుభవాల ను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవె న్యూ సదస్సుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. వీడి యో కాన్ఫరెన్స్లో బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవోలు వీణ, ప్రభాకర్, పౌరసరఫరాలు, వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
ఇందూరు అక్షరలక్ష్మి అభినందనీయం
నిజామాబాద్అర్బన్: స్వయం సహాయక సంఘాల్లో ని సభ్యుల విద్యార్హతలను గుర్తించడంతోపాటు నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించాలనే సంకల్పంతో ‘ఇందూరు అక్షరలక్ష్మి’ యాప్ రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అన్నారు. సంపూర్ణ అక్షరాస్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా, అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సెర్ప్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, సమగ్ర శిక్ష, వయోజన విద్యా శాఖ ల ఆధ్వర్యంలో ‘ఇందూరు అక్షరలక్ష్మి’ పేరుతో రూపొందించిన యాప్ను ఐడీవోసీ కార్యాలయ కాన్ఫరెన్స్హాల్లో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో సు మారు 3.40 లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారన్నారు. సీసీలు, వీవోఏల సహాయంతో వారి విద్యా సంబంధిత వివరాలను సేకరించి ఇందూరు అక్షరలక్ష్మి యాప్లో నమోదు చేస్తామన్నారు. అక్షరాస్యతా కేంద్రాలను ఏర్పాటు చేసి వలంటీర్ల ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, పదో తరగతిలోపు చదువుకున్న వారితో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు, ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన వారితో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయిస్తామని తెలిపారు. గణాంకాల ప్రకారం జిల్లాలో మహిళల అక్షరాస్యత 55 శాతంగా ఉందని, సంపూర్ణ అక్షరాస్యత కార్యక్ర మం అమలు ద్వారా నూటికి నూరు శాతం మహిళా అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ సూచించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సాయాగౌడ్, ఏపీడీ రవీందర్, డీఈవో అశోక్, డీడబ్ల్యూవో రసూల్బీ, డీఎంహెచ్వో రాజశ్రీ, వయోజన విద్యా సంయుక్త సంచాలకులు గోవింద్రావు, స్వయం సహాయక మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారి యాప్ రూపకల్పన ఆవిష్కరించిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు -
పరిరక్షణ కోసం పోరుబాట
నిజాంసాగర్ : కరువు కోరల్లో చిక్కిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగు, తాగు నీటిని అందించడం కోసం మంజీర నదిపై 1923–31 మధ్యకాలంలో జ లాశయం నిర్మించారు. మూడు కిలోమీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆనకట్ట కట్టారు. నిర్మాణ సమయంలో నీటి నిల్వ సామర్థ్యం 29.72 టీఎంసీ లు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యం 17.80 టీ ఎంసీలకు తగ్గిపోయింది. వందేళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 560 ఎకరాల భూమి.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు అప్పటి పాలకులు 560 ఎ కరాల భూములను అప్పగించారు. ఆ భూముల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకు ల కోసం గుల్దస్తా, సమ్మర్ బాగ్, గోల్ బంగ్లా, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్ను కట్టించారు. అయితే నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న భూములు మాత్రం రోజురోజుకు కనుమరుగు అవుతున్నాయి. అచ్చంపేట శివారులో ఉన్న భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. మరికొందరు వ్యక్తులు నీటిపారుదలశాఖ ఆధీనంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు భూముల్లో ఇళ్ల నిర్మాణాలు, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ప్రభుత్వ కార్యాలయాలకు నిలయాలుగా మారాయి. 598 సర్వే నంబరులో పోలీస్ స్టేషన్కు 3 ఎకరాలు, వైర్లెస్ కార్యాలయం, ఆరోగ్య కేంద్రానికి 3.5 ఎకరాలు కేటాయించారు. తహసీల్ కార్యాలయానికి 5 గుంటలు, బస్ స్టేషన్కు 2.4 ఎకరాలు, ట్రాన్స్కో కార్యాలయానికి 0.25 ఎకరాలు, బృహత్ పల్లె ప్రకృతి వననానికి 10 ఎకరాలు, అటవీశాఖ ప్లాంటేషన్కు 6 ఎకరాలు, నిజాంసాగర్ పల్లె ప్రకృతి వనానికి 1.38 ఎకరాలు, ఎంపీడీవో కార్యాలయానికి 0.25 ఎకరాలు, జవహర్ నవోదయ విద్యాలయానికి 30 ఎకరాలు, మోడల్ పాఠశాలకు 10 ఎకరాలు, నీటిపారుదలశాఖ స్టోర్ రూమ్కు ఎకరం చొప్పున అప్పగించారు. కొయిల్సాగర్ బాధితులకూ.. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజె క్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి కూ డా ఇక్కడే భూములు కేటాయించారు. కోయిల్ సా గర్ ముంపు బాధితుల కోసం నిజాంసాగర్ ప్రాజె క్టు పరిధిలోని 8 ఎకరాల భూమిని అప్పగించారు. అలాగే అటవీ శాఖ నుంచి రోడ్లు వేయడంతో ని జాంసాగర్ నవోదయ సమీపంలో 5 ఎకరాల భూ ములను అప్పగించారు. ఇలా ఇష్టమొచ్చినట్లుగా ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు తగ్గిపోతున్నాయి. సిద్దాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ఇవ్వాలనుకుంటున్న సాగర్ భూమివర్ని మండలం సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ ముంపు బాధితులకు నిజాంసాగర్ ప్రాజెక్టు భూములు ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అఖిల పక్షంగా ఏర్పాటయ్యారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూముల పరిరక్షణ కోసం పోరుబాటకు సిద్ధమవుతున్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు భూములను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి
కామారెడ్డి రూరల్: విత్తనాలు కొనుగోలు చే సే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ సూచించారు. ఈ విషయ మై ఆయన సోమవారం ఒక ప్రకటన విడు దల చేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని పేర్కొన్నారు. అధీకృత లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే విత్తనాలు కొనాలని సూచించారు. పంటకాలం ముగిసే వరకు బిల్ను భద్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నా రు. బిల్లో తప్పనిసరిగా విత్తన కంపెనీ పేరు, విత్తనం రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, ఖరీదు వివరాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్యాకెట్స్పై తప్పనిసరిగా తయారైన తేది, కాలం ముగి సిన తేది ఉండాలని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలపై 89777 46219 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల రెండో, నాలుగో సెమిస్టర్(రెగ్యులర్), ఒకటో, మూడో(బ్యాక్లాగ్) సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి సంపత్కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఐదుగురు విద్యార్థులు పది జీపీఏ, 50 మంది 9.5 జీపీఏ, 25 మంది 9 జీపీఏ సాధించారని ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అదనపు పరీక్షల నియంత్రణ అధికారి శాంతాబాయి, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు రాములు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక కామారెడ్డి అర్బన్: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చేనెల ఒకటో తేదీనుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ అండర్–8, 10, 12 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే జిల్లా క్రీడాకారులను సోమవారం ఎంపిక చేశారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 110 మంది క్రీడాకారులు పాల్గొనగా ఒక్కో విభాగంనుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన 24 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వారికి పతకాలు, ప్రశంస పత్రాలు అందించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, ప్రతినిధులు నవీన్కుమార్, శివాగౌడ్, నరే ష్, నరేష్రెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, మల్లేష్, నవీన్, సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎంపికై ంది వీరే.. శ్రీహన్, టి.శ్రేయాస్, కే.సాయి సిద్ధార్థ్, ఆర్.శ్రద్ధ,ఎ.సాయిశ్రేష్ట, సి.కార్తికేయ, ఎం.సుశాంక్, కే.కార్తికేయ, వి.మంజుల, బి.నిశిగ్నా, ఎం.శరణ్య, బి.స్నితిక, బి.సిద్ధు, బి.చైతన్య, పి.వరుణ్, ఎం.విహన్రెడ్డి, పి.నిర్విల్, ఎం. భార్గవ్రెడ్డి, డి.సాత్విక, పి.పోచవ్వ, బి.స్నే హిత, డి.గీతం, బి.రితిక, ఎం.సాయిప్రియ. ఇంట్లో నుంచి పారిపోయిన బాలుడు ● స్థానికుల సహకారంతో గుర్తించిన పోలీసులు కామారెడ్డి క్రైం: అల్లరి చేస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు ఓ బాలుడు. స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఓ చోట బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిల్లాలవారి కృష్ణమూర్తి కొడుకు విశ్వేశ్వర చారి (12) తల్లిదండ్రులు తిట్టారని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి ఎస్సై రాజు సిబ్బంది, స్థానికుల సహకారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు నాలుగు గంటలపా టు గాలింపు చర్యలు చేపట్టి పట్టణంలో ఓచోట బాలుడి ఆచూకీ గుర్తించారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రతి అంశంపై పట్టు సాధించాలి
కామారెడ్డి క్రైం : లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణలోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపికై న వారికి రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తోందని పేర్కొన్నారు. మొదటి విడతలో 131 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. రోజూ ఉదయం థియరీ, మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. భూములకు సంబంధించిన కొలతలు, మ్యాప్లు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని తెలిపారు. అనంతరం శిక్షణ మెటీరియల్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ సర్వేయర్లు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: బ్యాంకర్లతో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎంపీడీవోలు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్క్ అవుట్ త్వరగా ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను తొందరగా పూర్తిచేసేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి -
ఆ కార్డులు రద్దయినట్లే!
అనుమానాస్పద రేషన్కార్డులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరు నెలలుగా బియ్యం తీసుకోని వారి లెక్కలు తీసిన సర్కారు.. వాటిపై విచారణ చేపట్టింది. జిల్లాలో అధికారులు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన 1,620 కార్డులపై విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రక్రియ పూర్తయ్యాక జాబితాలోని చాలా రేషన్ కార్డులను తొలగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కామారెడ్డి క్రైం : వివిధ రకాల కారణాలతో అనుమానాస్పదంగా అనిపించిన రేషన్ కార్డులు, వాటిలో నమోదైన వ్యక్తుల జాబితాలను పక్షం క్రితం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించింది. కొంత కాలంగా రేషన్ తీసుకోకపోవడం, రెండు చోట్ల కార్డు కలిగి ఉండడం, 18 ఏళ్లలోపు వయసున్న కార్డు యజమానులు, నకిలీ ఆధార్తో ఉన్న కార్డులు, చనిపోయి చాలా రోజులు గడుస్తున్నా జాబితాలోంచి తొలగించకపోవడం వంటి కారణాలతో వేలాది కార్డులను అనుమానాస్పద జాబితాలో చేర్చింది. వాటిలో కామారెడ్డి జిల్లాకు సంబంధించినవి 1,620 కార్డులు ఉన్నాయి. వాటి పరిధిలో 2,669 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాటిలో చనిపోయిన వారు, చాలా కాలంగా రేషన్ తీసుకోని వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు రేషన్ కార్డుల విషయంలో అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కార్డుల్లో నకిలీ ఆధార్లు కూడా ఉన్నాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదిస్తాం.. అనుమానాస్పద రేషన్ కార్డుల జాబితా పక్షం రోజుల క్రితమే వచ్చింది. వాటిని సంబంధిత తహసీల్దార్లకు పంపించాం. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో విచారణ పూర్తి చేశారు. ఆన్లైన్ ద్వా రా నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. – మల్లికార్జున్ బాబు, డీఎస్వో, కామారెడ్డి నివేదికల తయారీ.. పక్షం రోజుల క్రితం వచ్చిన అనుమానాస్పద రేషన్కార్డుల జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులు తహసీల్దార్లకు పంపించారు. వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. విచారణ నివేదికలను సైతం చాలా మంది తహసీల్దార్లు ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు సమర్పించినట్లు తెలిసింది. మరికొన్ని మండలాల నుంచి నివేదికలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. మండలాల వారీగా వచ్చిన నివేదికలను రాష్ట్రానికి, అక్కడ నుంచి కేంద్రానికి పంపుతారు. ఆ తర్వాత అనర్హులుగా గుర్తించిన కార్డులను గానీ, కార్డులోని సభ్యులను గానీ తొలగించే అవకాశాలు ఉంటాయి. ప్రక్రియ మెత్తం ప్రభుత్వ వెబ్సైట్లోని లాగిన్లో పూర్తి చేస్తున్నారు. అనుమానాస్పద జాబితాలో వచ్చిన చాలా కార్డులను తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికలు ప్రభుత్వానికి చేరిన తర్వాతత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జిల్లాలో 1,620 అనుమానాస్పద రేషన్ కార్డులు వాటిలో 2,669 మంది లబ్ధిదారులు పూర్తయిన విచారణ, త్వరలోనే తొలగించే అవకాశం -
రేపటితో ముగియనున్న జొన్న కొనుగోళ్లు
బాన్సువాడ రూరల్: జిల్లాలో జొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మంగళవారంతో కొనుగోలు కేంద్రాలను మూసి వేయాలని మార్క్ఫెడ్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో యాసంగి సీజన్లో 71,223 ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. పెట్టుబడి, కూలీల ఖర్చులు తక్కువ కావడం, జొన్నలకు డిమాండ్ పెరుగుతుండడంతో మంచి ఆదాయం వస్తుందన్న ఆశతో ఈ పంట వేశారు. అడవి పందుల బెడదను తట్టుకునేందుకు పలువురు రైతులు పొలాల వద్ద సోలార్ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. పంటను సేకరించేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా క్వింటాలుకు రూ. 3,371 మద్దతు ధర చెల్లించి రైతులనుంచి జొన్నలను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11,275 వేల మంది రైతుల నుంచి సుమారు 29,215 మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దళారులను ఆశ్రయించే బాధ తప్పిందని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో జిల్లాలో సుమారు నెలన్నర క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మూసి వేయాలని మార్క్ఫెడ్ నిర్ణయించింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాలను మూసివేయనున్నారు.సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో ఏర్పాటు చేసిన 24 జొన్న కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే నాలుగింటిలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. వాటిని మూసి వేశాం. మిగిలినవాటిని 28 నుంచి మూసివేస్తాం. ఇంకా ఎవరి వద్దనయినా జొన్నలు మిగిలి ఉంటే మిగిలి ఉన్న ఒక్క రోజును సద్వినియోగం చేసుకోవాలి. – మహేష్కుమార్, డీఎం, మార్క్ఫెడ్ -
కూలిన చారిత్రక కట్టడం
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చారిత్రక కట్టడమైన ఏడంతస్తుల భవనం కూ లిపోయింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా భవనం కుప్పకూలింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన భవనం కూలిపోవడం బాధగా ఉందని ఉత్తూర్ లచ్చయ్య మనుమడు పాలకుర్తి శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేశాడు. 1942లో నిర్మాణం.. కుద్వాన్పూర్ నిజాం కాలంలో ఆస్థానంగా ఉండేది. గ్రామానికి చెందిన ఉత్తూర్ లచ్చయ్య వృత్తి రీత్యా ప్రజలకు వైద్యం చేసేవాడు. కాగా, తనకు ఉండే భవనం మరెవరికీ ఉండొద్దని ఉద్దేశంతో 1942 సంవత్సరంలో ఏడంతస్తులు నిర్మించాడు. అప్పట్లోనే హైదరాబాద్ సంస్థానం నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సొంతంగా కట్టడం ప్లాన్ చేసుకొని, డంగు సున్నాన్ని ఎడ్లతో తొక్కించి సిమెంట్లా తయారు చేసి ఇంటిని నిర్మించినట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలో ఏడంతస్తుల భవనం ఎ క్కడా లేకపోవడంతో అప్పట్లో ఈ భవనాన్ని చూ సేందుకు తరలివచ్చేవారని చెపుతారు. కాలక్రమేనా లచ్చయ్య ఇష్టంతో కట్టుకున్న ఈ భవనాన్ని కూ తురు ప్రభావతికి ఇచ్చిన కొన్ని రోజులకు కన్నుమూశాడు. కాగా, ప్రభావతి తన కుటుంబంతో ఇదే భవంతిలో నివాసం ఉండేది. కుమారులు ఇతర ప్రాంతాలకు వెళ్లగా గత పది సంవత్సరాల నుంచి ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. నెల రోజుల క్రితం వరకు ఈ భవనంలో జనాలు నివసించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రామాయంపేట్లో రోడ్డు ప్రమాదం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నారు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. వారాంతపు సెలవుల్లో కలిసే గ్రామానికి వచ్చి రెండు రోజులపాటు కుటుంబసభ్యులు, మిత్రులతో సంతోషంగా గడిపి తిరిగి ఉద్యోగానికి వెళుతుంటారు. అలాంటిది సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఒక యువకుడు అక్కకడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన బూస లింబాద్రి, లక్ష్మి దంపతులు కొడుకు నిఖిల్ (24), మల్లాపురం నర్సయ్య, సునీత దంపతుల కొడుకు నితీశ్ మంచి స్నేహితులు. ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్లోని అర్కబ్రాంకమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. శని, ఆదివారం వీకెండ్ సెలవుల్లో భాగంగా గ్రామానికి వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటలకు ఇద్దరూ కలిసి మోటార్ బైక్పై హైదరాబాద్కు బయలుదేరారు. మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ క్రాసింగ్ వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వీరి బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నిఖిల్ అక్కడిక్కకడే మృతి చెందగా నితీశ్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకొని రామాయంపేట్కు చేరుకున్న కుటుంబసభ్యులు నితీశ్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నితీశ్ పరిస్థితి విషమంగా ఉంది. అందరితో కలిసి మెలిసి ఉండే నిఖిల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, నితీశ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరడంతో ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. సాయంత్రానికి గ్రామానికి చేరుకున్న నిఖిల్ మృతదేహానికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీళ్లతో అంత్యక్రియలు నిర్వహించారు. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ఖిల్లా డిచ్పల్లిలో విషాదం -
అధ్వానంగా పోచారం కాలనీ
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీ అధ్వానంగా మారింది. కాలనీలోని డ్రెయినేజీలో వ్యర్థాలు పేరుకుపోయి, మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే రోడ్ల పక్కన చెత్తాచెదారం పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
బస్సుల ఫిట్నెస్ బాధ్యత స్కూల్ యాజమాన్యాలదే
ఖలీల్వాడి: స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని, బస్సుల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ పేర్కొన్నారు. నాగారంలోని జిల్లా రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. యాజమాన్యాలు బస్సులను సరిగా పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కొత్తగా వచ్చిన డ్రైవర్లకు రూట్లు తెలియకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. పీపీ–1 నుంచి ఆరో తరగతి వరకు చదివే పిల్లలు స్కూల్కు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తల్లిదండ్రులు లేదా కుటుంబసభ్యులు బస్సుల వద్ద వేచి ఉండి తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీ పరిమళ, డీటీవో ఉమామహేశ్వర్రావు, రోడ్డు రవాణా సభ్యులు రాజరాజనరేందర్, ఏంవీఐలు వివేకానందరెడ్డి, కిరణ్, రాహుల్, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ -
తల్లిగారింటికి వస్తూ అనంతలోకాలు..
మాచారెడ్డి : తల్లిగారింటికి వస్తున్న ఓ గృహిణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఐదు నిమిషాల్లో ఇళ్లు చేరుతుందనగా మృత్యువు కబలించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామానికి చెందిన సులోచన (36) సోమవారం ఇద్దరు కుమారులు అన్వేష్, శివాన్స్లతో కలిసి బస్సులో వచ్చి మాచారెడ్డి చౌరస్తాలో దిగింది. తండ్రి నారాయణకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో నారాయణ తన టీవీఎస్ మోపెడ్పై ఇద్దరు మనుమలు, కూతురు సులోచనను తీసుకొని లచ్చాపేట గ్రామానికి వెళుతుండగా స్టేజీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్రగాయాలైన సులోచనను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి నారాయణ, ఇద్దరు కుమారులు చికిత్స పొందుతున్నారు. కాగా, సులోచన భర్త మహేందర్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు..నందిపేట్ (ఆర్మూర్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన నిర్మల్ జిల్లాకు చెందిన జాదవ్ సుందా బాయి(70) చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లి తాండకు చెందిన రాథోడ్ సంతోష్ తల్లి రాథోడ్ యమునాబాయి ఆరోగ్యం బాగోలేదని అత్తమ్మ జాదవ్ సుందబాయితో కలిసి సోమవారం ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి డాక్టర్ వద్దకు ఆటోలో వస్తున్నారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామ సమీపంలో ఎదురుగా బైక్ పై అతివేగంగా వచ్చిన పెద్ద అంజన్న ఆటోని ఢీకొట్టాడు. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలుకావడంతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ జాదవ్ సుందబాయి మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. -
ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని స ముందర్ తండాలో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడంతో చిన్నపిల్లలకు అందేవిధంగా ఉందని తండావాసులు ఆరోపించారు. కనీసం చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఎత్తును పెంచి, దాని చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెళ్లి కావడం లేదని ఆత్మహత్యాయత్నం రామారెడ్డి: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రామారెడ్డి మండలం స్కూల్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మోతీలాల్ అనే యువకుడు తండ్రి దేవ్సింగ్తో కలిసి వ్యవసాయం చేసే వాడు. ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు మోతీలాల్ను ఆస్పత్రికి తరలించారు. చుట్టాకు వాహనం స్వాధీనం లింగంపేట(ఎల్లారెడ్డి): అక్రమంగా చుట్టాకును తరలిస్తున్న వాహనా న్ని సోమవా రం అటవీ శాఖ బీట్ అధి కారి సంరీన్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాపూర్ గ్రామంలో చుట్టాకును సేకరించి మెదక్కు తరలిస్తుండగా పొల్కంపేట శివారులో అడ్డగించి పట్టుకున్నామన్నారు. వాహనంలో సుమారు రూ. 60 వేల విలువ చేసే చుట్టాకు ఉన్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ స్వామిని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. దుబాయ్లో యువకుడి మృతి రామారెడ్డి: మండలంలోని గోకుల్ తండాకు చెందిన మాలోత్ భాస్కర్(26) అనే యువకుడు దుబాయ్లో అనారోగ్యంతో మరణించినట్లు స్నేహితుల ద్వారా తెలిసింది. ఇంట్లో ఆర్థిక ఇ బ్బందులతో ఉపాధి కోసం గత పది నెలల క్రి తం భాస్కర్ దుబాయ్ వెళ్లాడు. నాలుగు రోజు ల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతి వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. బాన్సువాడ ఆస్పత్రి తనిఖీ బాన్సువాడ: పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని సోమవారం కాయకల్ప బృందం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆయా వార్డు ల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవ లపై ఆరా తీసారు. అనంతరం ఆస్పత్రి ఆవర ణలో మొక్కలు నాటారు, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సీఎస్ఎస్ రఘు, సీనియర్ టెక్నిక ల్ మేనేజర్ ఐసీహెచ్హెచ్ఏ మేహెర్ వాణీ, ఎస్–క్యూ ఏ వినయ్పాల్సింగ్, నర్స్ సాయి శీల తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికి ప్రహరీ నిర్మించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం గ్రామంలోగల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ పునర్నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జాతీయ రహదారి ఏర్పాటు పను ల్లో భాగంగా ఇటీవల గ్రామంలో నూతనంగా ని ర్మించిన డ్రెయినేజీ ద్వారా వరదనీరు రావడంతోతో పాఠశాల ప్రహరీ కూలిపోయిందన్నారు. అలాలే పాఠశాల ఆవరణలోకి వరదనీరు చేరి చెరువులా మారిందన్నారు. వెంటనే హైవే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ పాఠశాల ప్రహరీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో,కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందితో మాట్లా డారు. పాఠశాల ఆవరణలో నిలిచిన నీటిని జేసీబీ సహాయంతో సంస్థ సిబ్బంది తొలగింపజేశారు. ప్రహరీ నిర్మాణ విషయం తన పరిధిలో లేదని సంస్థ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు ప్రహరీ విషయమై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాడ్వాయిలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని హరిజనవాడలోగల ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ పూర్తిగా లేకపోవడంతో పశువులు, విష పురుగులు బడి ఆవరణలో సంచరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. వంటగది కూడా లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనాన్ని వండుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాలలు ప్రారంభం కాకాముందే బడికి ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం శివారులోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 86 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో కలెక్టర్తోపాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 409 ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దోమకొండలో.. దోమకొండ: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో ప్రవీన్కుమార్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ రేఖ, ఐకేపీ ఏపీవో రాజు, ఈజీఎస్ ఏపీఏం రజని, ఏవో మణిదీపిక తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారు.. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్దంగా తమ సొంత వాహనాలను ప్రభుత్వ విధులకు నడిపిస్తూ నిరుద్యోగుల ఉపాధికి గండి కొడుతున్నారని హైర్ వెహికల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధులు ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు రాజాగౌడ్ మాట్లాడుతూ.. 48 ప్రభుత్వ శాఖల్లో ఒక్కోశాఖకు కనీసం 5 అద్దె వాహనాలు అవసరం ఉంటాయన్నారు. వాటిని నిరుద్యోగులైన వాహనదారుల నుంచి అద్దెకు తీసుకుని నడిపించుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ అధికారులు తమ సొంత వాహనాలను నడిపిస్తూ అడ్డదారిలో బిల్లులు చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నడిపిస్తున్న అద్దె వాహనాలకు సంబంధించిన 15 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలి.. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నివాసాలు వేసుకున్న వారికి విద్యుత్, మంచినీటి సౌకర్యాలను కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. ఆ స్థలాలను కాజేయాలనే ఉద్దేశంతో కొందరు అధికారులను బెదిరిస్తూ కాలనీకి మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి కాలనీకి తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకకులు దేవరాజ్, నర్సింలు, నారాయణ, లక్ష్మీ, రమణ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 86 ఫిర్యాదులు -
తండ్రి హత్య కేసులో కొడుకు రిమాండ్
లింగంపేట(ఎల్లారెడ్డి): తండ్రిని హత్య చేసిన కొడుకును రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ ఫకీరా భార్య, పిల్లలు ఉండగా రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఫకీరా ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలుపగా వారు నిరాకరించారు. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని కొడుకు దేవసోత్ ప్రకాశ్.. ఫకీరాను గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు. ఫకీరా సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ ఎస్సై రాఘవేంద్ర, ఏఎస్సై ప్రకాశ్ నాయక్, సిబ్బంది మదన్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంకర్లతో నీటి సరఫరా
పిట్లం: పిట్లం జీపీ పరిధిలోని పలు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా జీపీ సిబ్బంది నీటిని సరఫరా చేస్తున్నారు. జీపీ కార్యదర్శి బల్రాం మాట్లాడుతూ.. పంచాయతీ పరధిలోని రాజీవ్గాంధీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే బుడజంగం, ఎస్సీ కాలనీలో సైతం నీటి ఎద్దడి ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించినట్లు తెలిపారు. ఎల్లారెడ్డిలో తిరంగా ర్యాలీ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బీజేపీ నాయకులు ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, బాణాల లక్ష్మారెడ్డి, బాపురెడ్డి, రాంరెడ్డి, నేరేళ్ల ఆంజనేయులు, రవీందర్రావు, నర్సింలు, రాజేశ్, దేవేందర్, బాలకిషన్, నక్కగంగాధర్, ప్యాలాల రాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మీజవాన్కు సన్మానం ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ఆర్మీ జవాన్ క్యాస దేవేందర్ను ఆదివారం సన్మానించారు. ఎల్లారెడ్డిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా చైనా బార్డర్లో విధులు నిర్వర్తించి ఇటీవల స్వగ్రామమైన సోమార్పేట్కు వచ్చిన దేవేందర్ను వారు శాలువాతో సన్మానించారు. జై భారాత్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, నేరేల్ల ఆంజనేయులు, బాపురెడ్డి, రాంరెడ్డి, నర్సింలు, రాజేశ్, దేవేందర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. సంతలో కూరగాయల కొరత భిక్కనూరు: మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంతలో కూరగాయల కొరత ఏర్పడింది. రామేశ్వర్పల్లిలో బోనాల పండుగను ఆదివారం నిర్వహించినందున ఆగ్రామానికి చెందిన రైతులు అంగడికి రాలేదు. ప్రతి వారం ఆ గ్రామానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో భిక్కనూరు సంతకు వచ్చి కూరగాయలను విక్రయిస్తుంటారు. ఈ ఆదివారం వారు రాకపోవడంతో కూరగాయల కొరత ఏర్పడింది. దీంతో సంతకు వచ్చిన కొనుగోలు దారులు ఇబ్బందులు పడ్డారు. -
విద్యుదాఘాతంతో నాలుగు గేదెలుమృతి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో ఆదివారం విద్యుదాఘాతంతో నాలుగు గేదెలు మృతిచెందాయి. కోటార్మూర్ లోని జనార్దన్ గౌడ్ అనే పాడి రైతుకు చెందిన నాలుగు గేదెలు ఆదివారం గ్రామ శివారులో మేతకు వెళ్లగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు వాటికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న జిల్లా పశువైద్యాధికారి రోహిత్ రెడ్డి, మండల పశువైద్యాధికారి లక్కం ప్రభాకర్ ఘటన స్థలాన్ని సందర్శించారు. సుమారు రెండు లక్షల రూపాయల వ రకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు జనార్దన్ గౌడ్ అధికారులకు తెలిపా రు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు రైతు ఆరోపించారు. పోచారం తండాలో ఆవు.. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని పోచారం తండాలో కరెంట్ షాక్ తగిలి ఆవు మృతి చెందింది. పోచారం తండాలోని విఠల్ నాయక్ చెందిన ఆవు ఆదివారం మేతకు వెళ్లగా సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్కు ఎలాంటి కంచె నిర్మించకపోవడం వల్లనే ఆవు మృతిచెందినట్లు స్థానికులు ఆరోపించారు. ఇప్పటికై నా విద్యుత్శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మరకు కంచె నిర్మించాలని, బాధితుడికి నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మద్యంమత్తులో వీరంగం ఖలీల్వాడి: నగరంలో పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సదరు వ్యక్తి బ్రీత్ ఎనలైజ్ చేయడానికి యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్కు గాయం అయింది. వివరాలు ఇలా.. నగరంలోని పాలిటెక్నిక్ వాటర్ ట్యాంక్ వద్ద ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నగరానికి చెందిన గౌతమ్ రెడ్డి మద్యం తాగి బైక్ నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయడానికి ట్రాఫిక్ పోలీసులు యత్నించగా సహకరించలేదు. అసభ్య పదజాలంతో సిబ్బందిని దూషించాడు. ఆర్ఎస్సైలు సుమన్, వినోద్లు అతడిని సముదాయించినా, మత్తులో రోడ్డుపై పొర్లుతూ హంగామా చేశారు. బ్రీత్ ఎనరైజ్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్ శేఖర్ బాబు కంటికి గాయం అయింది. దీంతో పోలీసులు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. -
అందుబాటులో జీలుగ విత్తనాలు
లింగంపేట/ నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ కోసం జీలుగ(పచ్చిరొట్టె) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు లింగంపేట మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్ ఆదివారం తెలిపారు. మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి, నల్లమడుగు, లింగంపేట సొసైటీల్లో వంద బస్తాల చొప్పున జీలుగ విత్తనాలు నిలువ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కో బస్తా 30 కిలోలు 50 శాతం సబ్సిడీతో రూ. 2137.50కు అందిస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు అవసరం ఉన్న రైతులు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సులతో ఏఈవోలను సంప్రదించాలన్నారు. రైతులు సాగు చేసేందుకు అవసరమైన జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందించనున్నట్లు నాగిరెడ్డిపేట ఏవో సాయికిరణ్ తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద సోసైటీకి వంద బస్తాలు, తాండూర్ సొసైటీకి వంద బస్తాల చొప్పున మండలానికి మొత్తం సరఫరా అయినట్లు పేర్కొన్నారు. జీలుగ విత్తనాలు అవసరమైన రైతులు వారి పట్టాపాస్ పుస్తకంతోపాటు ఆధార్కార్డ్ జిరాక్స్లతో సంబంధిత ఏఈవోను సంప్రదించాలన్నారు. మహమ్మద్నగర్లో విత్తనాల పంపిణీ నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండల కేంద్రంలో జీలుగ విత్తనాలను సొసైటీ చైర్మన్ చేతుల మీదుగా అధికారులు రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి నవ్య, ఏఈవో రేణుక, సొసైటీ సీఈవో రాములు, సిబ్బంది సాయి తేజ, భాస్కర్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1995–98 మధ్య చదివిన బీకాం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు -
విద్యార్థులు మంచి నడవడిక అలవర్చుకోవాలి
నిజామాబాద్రూరల్: విద్యార్థులు మంచి నడవడికను అలవరుచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. నగరంలో విద్యార్థులకు గత నెలలో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయగా ఆదివారం ముగిసింది. ఈసందర్భంగా గంగాస్థాన్ ఫేజ్–2లోని రామకృష్ణ వివేకానంద ధ్యాన మందిరంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో హాజరై, మాట్లాడారు. రామకృష్ణ సేవా సమితి వేసవి శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తునందుకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు శిక్షణతోపాటు మహనీయుల బోధనలను అనుసరించాలన్నారు. అనంతరం రెడ్క్రాస్లో జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్, ఉపాధ్యాయులను సత్కరించారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సమితి ప్రతినిధులు, ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్, సాయి ప్రసాద్, యోగా రాంచందర్, బొచ్చు గోపాల్, తోట రాజశేఖర్, వసంత్ పాటిల్, దీపక్, నాయక్, వినోద్, స్వరూప్, నర్సయ్య, గంగా ప్రసాద్, వినోద్, శ్రీనివాస్, శ్రీలేఖ, రమేష్, హనుమాండ్లు రాజేంద్రప్రసాద్, రాజ్కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడికోసం ఏకమైన ఊరు
కామారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లలను సర్కార్ బడికే పంపాలని నిర్ణయించుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామస్తులు. తమ గ్రామానికి చెందిన పిల్లలు ప్రైవేటు బడికి పంపకుండా సర్కార్ బడికి పంపాలని తీర్మాణం చేశారు. గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల బాధ్యతను గ్రామస్తులంతా తమ భుజాలపై వేసుకున్నారు. తాము ప్రభుత్వ బడిలోనే చదివి ప్రయోజకులమయ్యాం కాబట్టి మా పిల్లలను కూడా ప్రైవేట్ స్కూల్కి పంపకుండా, ప్రభుత్వ బడిలోనే చదివిస్తామని నిర్ణయం తీసుకున్నారు. నలుగురు ప్రభుత్వ టీచర్స్తో పాటు కొత్తగా ఇద్దరు విలేజ్ వలంటీర్లను, ఒక ఆయాను, ప్రస్తుతం ఉన్న టీచర్స్కు అనుసంధానం చేస్తూ బడిని బాగు చేశారు. ప్రస్తుతం నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లో బోధన జరుగుతోంది. గ్రామస్తులు దాతల సహకారంతో దాదాపు రూ. 7 లక్షల వరకు కొత్తగా మూడు గదుల నిర్మాణంతో పాటు డ్యూయల్ బెంచీలు, ఫ్యాన్స్, కరెంట్, రూమ్కి రంగులు, డిజైన్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. ఇంకా బడిలో కావాల్సిన అవసరాల కోసం, ఫ్యాన్లు, బెంచీలు, అదనపు తరగతి గదులు, వాటికి రంగు రంగుల బొమ్మలు, ఇతర ఖర్చులకు రూ. 3 లక్షలు అవుతాయని అంచనా వేశారు. వాటిని చందాలు వేసి సేకరించేందుకు పాఠశాల యాజమాన్యంతో కలిసి ప్రణాళిక సిద్ధం చేశారు. ఉన్న టీచర్లకు అనుసంధానంగా మరో ఇద్దరు వలంటీర్లను జత చేసి ఇంగ్లిష్ మీడియం బోధించే దిశగా చర్యలు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. మన బడి మన బాధ్యత అంటూ ప్రభుత్వ పాఠశాలకు మద్దతుగా నిలిచిన తీరు మండలంలో హాట్ టాపిక్గా మారింది. గతేడాది స్కూల్లో 27 మందే ఉండగా ఈసారి 132 మంది అయ్యారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఈ సంఖ్యను 200 చేర్చేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు కుర్మిండ్ల ప్రభాకర్గౌడ్, ఆనంద్గౌడ్, భూపతి, సంగి రాజు తదితరులు స్కూల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. క్యాసంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించేది లేదని గ్రామస్తుల నిర్ణయం చేయిచేయి కలుపుతూ ఐక్యంగా ముందడుగు ప్రభుత్వ బడిలోనే చదివాం తాము ప్రభుత్వ బడిలోనే చదివి ప్రయోజకులమయ్యాం. మా పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా ఊరంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. చందాలు వసూలు చేసి మూడు అదనపు తరగతి గదులు, రంగులు, బెంచీలు, వలంటీర్లను ఏర్పాటు చేశాం. – కుర్మిండ్ల ప్రభాకర్గౌడ్, క్యాసంపల్లి -
హైవేపై ఢీకొన్న లారీలు
డిచ్పల్లి: మండలంలోని దేవుపల్లి క్యాంప్ గ్రామం సమీపంలోగల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. హైదరాబాద్ వైపు నుంచి నాగ్పూర్ వైపు రెండు లారీలు బయలుదేరాయి. దేవుపల్లి క్యాంప్ సమీపంలో ముందున్న లారీని వెనుకున్న లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో రహదారిపై చాలా సేపు ట్రాఫిక్ స్తంభించింది. పో లీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన లారీలను క్రేన్ సాయంతో పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్దీకరించారు. రెండు లారీలు ఢీకొన్న సమయంలో వాటిలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు వాటిని ఢీకొన్నట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొరం ట్రాక్టర్లు, పొక్లెయిన్ సీజ్ నిజాంసాగర్ (జుక్కల్): మండల కేంద్రం శివారులో మొరం తవ్వకాలు చేపడుతున్న పొక్లెయిన్ను, మొరం తరలిస్తున్న ట్రాక్టర్లను ఎస్సై శివకుమార్ ఆదివారం పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేపడుతూ, రవాణా చేయడంతో వాహనాలను సీజ్ చేసి, స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. -
మండుటెండల్లో నీటి ఊటలు
బీబీపేట: ప్రతి ఏడాది వేసవిలో గుక్కెడు నీటి కోసం మనుషులతో పాటు పశువులు సైతం అల్లాడిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండిపోయాయి. అంతే కాకుండా వర్షాలు వరుసగా కురవడంతో గుట్టల నుంచి నీటి ఊటలు పారుతున్నాయి. యాడారం గ్రామంలోని గుట్టల్లో నీటి ఊటలు పారుతున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. గ్రామాల్లో నీరు నిండడంతో పశువులకు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంది. మండే ఎండల్లో వర్షాలు పడుతుండడంతో వ్యవసాయం చేసే రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది పంటలు సైతం ముందుగానే వేసే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ● నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండిన కుంటలు -
మేకుఎన్ ఐడియా సర్జీ!
బీబీపేట(కామారెడ్డి): కోతులు తమ సహజమైన చేష్టలతో కిష్కిందకాండ సృష్టిస్తుంటాయి. పంటలనుంచి ఇళ్ల వరకు అన్నింటికి నష్టం చేకూరుస్తుంటా యి. వాటి బాధ తప్పించుకోవడానికి ప్రజలు రకరకాల ఏర్పాట్లు చేసుకుంటుంటారు. కోతుల బాధ తప్పించుకోవడానికి బీబీపేటకు చెందిన నర్సింలు కొత్త ఆలోచన చేశాడు. ఆయన ఇంటికి డీటీహెచ్ కనెక్షన్ ఉంది. కోతులు తరచూ డిష్ యాంటెన్నాపైకి దూకుతుండడంతో సెట్టింగ్ పోతోంది. దీంతో రిపేర్ చేయించడానికి వందలాది రూపాయలు ఖ ర్చు అవుతున్నాయి. ఈ సమస్యనుంచి బయటపడ డానికి నర్సింలు ఓ ఆలోచన చేశాడు. డిష్ యంటె న్నా చుట్టూ సైకిల్ సైకిల్ టైర్ చుట్టి మేకులు కొట్టా డు. సిగ్నల్ రిసీవర్ వద్ద కూడా ఇలాగే చేశాడు. డిష్ మధ్యలోనూ మేకులు కొట్టాడు. కోతులు దూకితే మేకులు గుచ్చుకునేలా వాటిని అమర్చాడు. ఇది స త్ఫలితాలు ఇస్తోంది. కోతులతోపాటు రిపేర్ల బాధ తప్పిందని నర్సింలు పేర్కొంటున్నాడు. కోతి చేష్టలకు మేకు విరుగుడు -
చదువుకు పేదరికం అడ్డుకావొద్దు
రుద్రూర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్, రైడ్స్ గౌరవ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఉద్బోధించారు. మండల కేంద్రంలో రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నెల రోజులపాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ పేదరికం చదువుకోవడానికి అడ్డం కావొద్దని, అలాంటి వారికి రైడ్స్ చేయూత అందిస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు సహకారం అందిస్తుందని, అందుకు మా మిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన బో ధన్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం క ల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైడ్స్ సభ్యుల ప్రోత్సాహాన్ని వినియోగించుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించా రు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రుద్రూర్, వర్ని ఎంఈవోలు కట్ట శ్రీనివాస్, డీ సాయిలు, సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరరావ్ దేశాయ్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, ఇందూరు, వంశీ విద్యా సంస్థల అధినేతలు కిశోర్ కుమార్, పద్మజ, రైడ్స్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలి హైదరాబాద్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ -
రైతుపై పచ్చిరొట్ట భారం
బాన్సువాడ రూరల్: భూసారం పెంచేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పచ్చిరొట్ట ఎరువులకు సంబంధించిన విత్తనాలు అందిస్తోంది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహిస్తోంది. అయితే ఈసారి ధరలను అమాంతం పెంచడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. వరి సాగుకు నెలరోజుల ముందు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సంబంధించిన విత్తనాలను భూమిలో చల్లుతారు. ఏపుగా పెరిగిన తర్వాత 35 నుంచి 40 రోజుల మధ్యలో భూమిలో కలియ దున్నుతారు. దీంతో ఎకరాకు 5 టన్నుల వరకు ఎరువు తయారవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతారు. ఇందులో 8 కిలోల భాస్వరం, 20 కేజీల పొటాష్, 35 కేజీల నత్రజని ఉంటుందని అధికారులు పేర్కొంటారు.బస్తాపై వెయ్యికిపైనే.. ఎకరాకు 15 కేజీల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. కాగా గతంలో 60 శాతం సబ్సిడీ అందించగా.. ఈసారి దానిని 50 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా ధర సైతం భారీగా పెంచారు. గతేడాది 30 కేజీల జీలుగ విత్తనాల బస్తా ధర రూ. 1,116 ఉండగా ఈసారి రూ. 2,137 కి చేరింది. అంటే రైతులపై ఒక బస్తాకు రూ. 1,021 అదనపు భారం పడుతోందన్న మాట. అలాగే పిల్లి పెసర 20 కేజీల బస్తా ధర రూ. 1,084 నుంచి రూ. 2,055 కు పెరిగింది. జనుము 40 కేజీల బస్తా ధర గతేడాది రూ. 1,448 ఉండగా ఈసారి రూ. 2,510 కు చేరింది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. నాట్లపై ప్రభావం?వరి సాగుకు నెలరోజుల ముందే పచ్చిరొట్ట సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మే 15 వరకు జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువుల సాగుకు సంబంధించిన విత్తనాలను భూమిలో చల్లుతారు. కానీ ఈసారి కొంత ఆలస్యంగా విత్తనాలు రావడంతో రెండు రోజుల క్రితం పంపిణీ ప్రారంభించారు. దీంతో రోహిణి కార్తెలో పోయాల్సిన నార్లు పక్షం రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. అమాంతం పెరిగిన ధరలు 30 కేజీల జీలుగ బస్తా రూ. 2,137 గతేడాది బస్తా ధర రూ. 1,116 -
మొరాయిస్తున్న తూము షటర్లు
నిజాంసాగర్: వరుణుడు కరుణిస్తున్నా.. చెరువులో నీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొనడంతో నర్వ, అన్నాసాగర్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తూములకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. మహమ్మద్నగర్ మండలంలోని నర్వ గ్రామ శివారులోగల పాత చెరువు కింద 456 ఎకరాల ఆయకట్టు ఉంది. అన్నాసాగర్, నర్వ గ్రామాల మధ్య పాత చెరువు ఉండడంతో కుడి, ఎడమ వైపులా రెండు తూములు ఏర్పాటు చేశారు. అయితే గతంలో మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువును బాగు చేయగా తూముల షటర్లు నాసిరకంగా బిగించారు. దీంతో వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం ధాటికి చెరువుకు రెండు వైపులా ఉన్న తూముల షటర్లు కిందకు దిగడం లేదు. అవసరమైనప్పుడు వెంటనే పైకి కూడా లేవడం లేదు. రైతులు నానా తంటాలు పడుతూ తూములను పైకి ఎత్తుతున్నారు. యాసంగి సీజన్లో ఇలా కష్టపడి లేపిన షటర్లు కిందికి దిగడం లేదు. అంతేకాకుండా అన్నాసాగర్ వైపు ఉన్న తూము షటర్ మాయమయ్యింది. దీంతో పాత చెరువు రెండు తూముల ద్వారా నీరు వృథాగా వెళ్తోంది. వర్షాలతో చెరువులోకి కొత్త నీరు వచ్చి చేరుతున్నా నీరు నిలవడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. షటర్ల విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల తూములకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, నీరు నిల్వ ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఖాళీ అవుతున్న పాత చెరువు నీరు ఆందోళన చెందుతున్న రైతులు -
ట్రాన్స్కో.. మేలుకో!
బిచ్కుంద: మండల కేంద్రంలోని పలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ప్రమాదం పొంచి ఉంది. గ్రామ పంచాయతీ వెనకనున్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మురికి నీరు నిల్వ ఉండగా.. కోర్టు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ చుట్టు పిచ్చి మొక్కలు పెరిగాయి. ఆయా ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎలాంటి రక్షణ కంచెలు లేవు. గతంలో మండలకేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి ఓ మహిళ మృతి చెందింది. మూగ జీవాలు సైతం మృత్యువాతపడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. ఈ విషయాన్ని ఏఈ పవన్కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా.. కొన్ని ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించామన్నారు. జీపీ వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మారుస్తామని, రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
నువ్వులేక.. నేనుండలేను
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్కు, పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్లో సునీల్ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
కుక్కల దాడిలో గాయపడిన మహిళ మృతి
దోమకొండ: కుక్కల దాడిలో గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చింపల్ల రేణమ్మ(38) పదిహేను రోజుల క్రితం ఉదయం ఇంటిముందు వాకిలి శుభ్రం చేస్తుండగా వీధి కుక్కలు కరిచాయి. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతిచెందింది. మృతురాలికి భర్త రాజు, ఇద్దరు కూతుళ్లు దేవిక, దివ్య, కుమారుడు సందీప్ ఉన్నారు. చికిత్స పొందుతూ వృద్దురాలు.. బాల్కొండ: కరెంట్ షాక్తో గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివ రాలు ఇలా.. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన దాస పద్మ(50) ఈ నెల 18న తన ఇంట్లో బోర్ మోటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా, కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు శనివారం ఉదయం మృతి చెందింది. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు. -
చోరీకి పాల్పడిన వ్యక్తి..
భిక్కనూరు: పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన ఒక వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నరేష్ ట్రాక్టర్, డీసీఎం వాహనాలకు చెందిన బ్యాటరీలను చోరీ చేశాడు. అంతేకాకుండా కామారెడ్డితో పాటు మండల కేంద్రంలో పలు మోటార్ సైకిల్ దొంగతనాలు చేశాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. అనంతరం అతడి నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఆరు ట్రాక్టర్ డీసీఎం బ్యాటరీలు, ఒక సీసీ కెమెరా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఓ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. వివరాలు ఇలా. 2023లో హర్షద్ అలీ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి బెంగళూరుకు బాస్మతి బియ్యంకు సంబంధించిన లోడ్ లారీతో బయలుదేరాడు. మార్గమధ్యలో యజమానికి తెలియకుండా మొత్తం బియ్యంను రూ.3.50 లక్షలకు విక్రయించి ఖాళీ లారీని దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పొందుర్తి వద్ద రోడ్డు పక్కన వదిలిపెట్టి పరారయ్యాడు. పోలీసులకు దొరక్కుండా రెండు సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ రాజేశ్ చంద్ర సూచన మేరకు పోలీసులు ఇటీవల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడు హర్షద్ ఉత్తర్ప్రదేశ్లో ఉన్నట్లు తెలుసుకొని మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్లారు. ఓ ప్రాంతంలో అతడిని గుర్తించి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువచ్చారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్ఐ బృందాన్ని శనివారం ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. బృంద సభ్యులైన దేవునిపల్లి ఏఎస్సై నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు రవికుమార్, రవికిరణ్ తదితరులు ఉన్నారు. -
ఖానాపూర్లో ఒకరి ఆత్మహత్య
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో వడ్డెపు లక్ష్మీనర్సయ్య (40)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ శనివారం తెలిపారు. లక్ష్మీనర్సయ్య భార్య రెండేళ్ల క్రితం ఇంట్లో గొడవపడి కూతురు, కొడుకుతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం చెరువులో మృతదేహం తేలడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జీలుగ విత్తనాలు సరఫరా
నిజాంసాగర్(జుక్కల్): ‘జీలుగ జాడేదీ’ శీర్షికన ఈనెల 20వ తేదీన ‘సాక్షి’లో ప్ర చురితమైన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లాకు 5 వేల క్వింటాళ్ల జీ లుగ విత్తనాలు అవసరం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారు లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా జిల్లాకు జీలుగ విత్తనా లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా జీలుగ విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేశారు. కా గా నేషనల్ సీడ్ కార్పొరేషన్ సంస్థలో జీలుగ విత్తనాల నిల్వ లు లేకపోవడం, రైతుల అవసరాలను వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా జిల్లాకు వెయ్యి క్వింటాళ్ల జీలుగ విత్తనా లు సరఫరా చేశారు. జిల్లాకు చేరిన జీలుగ విత్తనాలను మండలాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు పంపిణీ చేపడుతున్నారు. -
పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించే గ్రామ పాలన అధికారి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన చాంబర్లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 402 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. అనధికార వ్యక్తులను పరీక్షాకేంద్రంలోకి అనుమతించొద్దన్నారు. అభ్యర్థులను నిశితంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, గాడ్జెట్లకు అనుమతి లేదన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వి విక్టర్, ఆర్డీవో వీణ, చీఫ్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్, పరిశీలకులు శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, కలెక్టరేట్ ఏవో మసూద్అహ్మద్, పర్యవేక్షకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం : జిల్లాలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలని, ఇందుకోసం ఐదు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. వ్యవసాయ, పోలీసుశాఖలతో స మన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో శనివా రం నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిలా్ల్ వ్యాప్తంగా 34 వేల ఎకరాల్లో ఈ సారి పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పోలీసు అధికారులతో కూడిన జిల్లా స్థాయిలో ఒకటి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సు వాడ, బిచ్కుంద డివిజన్లలో మరో నాలుగు టా స్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్ర త్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి నకిలీ విత్తనా లు సరఫరా చేసే, విక్రయించే వారిపై కేసులు నమో దు చేయాలన్నారు. లైసెన్స్ లేని కంపెనీలు, వ్యాపారులు, గుర్తు తెలియని వ్యక్తులు, తెల్ల సంచుల్లో వి క్రయించే విత్తనాలు, గడువు ముగిసినవి, లేబుల్ సరిగా లేనివి, రాత్రికిరాత్రి గ్రామాల్లో తిరుగుతూ వి క్రయించేవి, జన్యుస్వచ్ఛత లేని వాటిని నకిలీ విత్తనాలుగా పరిగణించడం జరుగుతుందని, అలాంటి విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. గతే డాది బీజీ–3 రకం పత్తి విత్తనాలు సాగు చేసిన, నకి లీ విత్తనాలతో నష్టపోయిన రైతుల, గ్రామాల వివరాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులను చైతన్య పర్చాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మో సం చేస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని వ్యాపారులను హెచ్చరించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు వి క్రయిస్తే 89777 46219కు (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ చేసి సమాచా రం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఏవో తిరుమల ప్రసాద్, పలువురు సీఐలు, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయాలి ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులకు సంబంధించి న మోదైన కేసుల విచారణను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన చట్టాలపై వి స్తృత అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులకు చట్ట ప్రకారం పరిహారం అందేలా చూడాలన్నారు. ఎస్పీ రాజేశ్చంద్ర, ఆర్డీవో వీణ, ఎస్సీ సంక్షేమ అధికారిణి రజి త, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఎస్పీ లు, ఎన్జీవోలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తనిఖీలకు టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు రైతులను మోసం చేస్తే పీడీ యాక్టు సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
బాన్సువాడ : నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజురు పత్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో 11 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజురు చేయించామని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణలోనే బాన్సువాడ నంబర్ వన్గా నిలిచిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేసిందని బాన్సువాడ పట్టణంలో 260 మందికి, బాన్సువాడ రూరల్లో 353 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేశామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాను లబ్దిదారులకు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇప్పిస్తామని, మేసీ్త్రలను కూడా తక్కువ ధరకు ఇళ్లు కట్టెలా తాపి మేసీ్త్రల యూనియన్ నాయకులతో మాట్లాడుతామన్నారు. ఇళ్లు మంజురు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. అనంతరం కోటగల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ చందర్, సీఈవో శంకర్, ప్రత్యేకాధికారి రాజు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ బీబీపేట/లింగంపేట : ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని బీబీపేట మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి ముగ్గు పోశారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు. లింగంపేట మండలకేంద్రంతో తో పాటు ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో నరేష్ మార్కౌట్ ఇచ్చారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, నాయకులు రాజు, నాగేష్, కిరణ్ గ్రామ పెద్దలు లబ్దిదారులు పాల్గొన్నారు.అర్హులకే ఇందిరమ్మ ఇళ్లుసదాశివనగర్(ఎల్లారెడ్డి): అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తిర్మన్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావేటి సాయిలు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇప్పిస్తాం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడలో లబ్ధిదారులకు మంజురు పత్రాల అందజేత -
నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’
రుద్రూర్: నేరాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు చూపని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. స్థానికంగా అనుమానితులు, అపరిచితులు ఉంటే పోలీస్టేషన్కు సమాచారం అందించాలన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు తీసుకువస్తే వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. బోధన్, రుద్రూర్ సీఐలు కృష్ణ, వెంకట నారాయణ, ఎస్సైలు సాయన్న, మహేష్, సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. అనుమానితులు ఉంటే సమాచారం ఇవ్వండి ఖలీల్వాడి: స్థానికంగా అనుమానితులు, అపరిచితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఒకటో టౌన్ పోలీసులు తెలిపారు. నగరంలోని హబీబ్నగర్, కొజ్జాకాలనీ, మాలపల్లిలో శనివారం వారు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. కాలనీలో అనుమానితులను తనిఖీలు చేయడంతోపాటు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. కాలనీలోకి కొత్తగా వచ్చిన వారు, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. రాత్రివేళ్లలో వాహనాలపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కలగానే చేనేత.. కరువైన చేయూత
దోమకొండ: జిల్లాలో కామారెడ్డితో పాటు దోమకొండ, బీబీపేట, పిట్లం మండల కేంద్రాల్లో చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా సభ్యులు ఉన్నారు. దోమకొండలోనే 600 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరికి సరైన సౌకర్యాలు, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడం లేదు. కామారెడ్డి ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తే నేతన్నలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దోమకొండలో ఒకనాడు మగ్గాలపై చేనేత కార్మికులు నేసిన దుస్తులు హైదరాబాద్తో పాటు గుజరాత్ ప్రాంతాలకు సరఫరా చేసేవారు. మగ్గాలు మూలనపడి చేనేత కార్మికులు ప్రస్తుతం బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నారు. ఇక్కడ గతంలో ఉన్న నేతన్నలు ఉపాధి కోసం సిరిసిల్లా, మహరాష్ట్రలోని భీవండి, ముంబయి, షోలాపూర్ వంటి ప్రాంతాలకు కుటుంబాలతో వలస వెళ్లారు. దోమకొండలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో గత రెండు నెలల క్రితం మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో చేనేత కార్మికులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. సిరిసిల్లా ప్రాంతం నుంచి శిక్షకులను రప్పించి గ్రామంలో ఆసక్తి ఉన్న వారికి చేనేతలో శిక్షణ ఇస్తున్నారు. చేనేత సహకార సంఘం వారి సూచనలతో ఆసక్తి ఉన్న పలువురు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ సమయంలో కొంత నగదు కూడా ఇవ్వడంతో చాలా ముంది ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతలుగా దాదాపు 25 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు నేసిన దుస్తులను హైదరాబాద్తో పాటు ఆంధ్రా ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో గడికోట ట్రస్టు ప్రతినిధులు చొరవ చూపడంతో పలువురు నేతన్నలు ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని నేతన్నలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేనేత కుటుంబాలకు మేలు చేసినట్లువుతుంది. ఈ విషయంమై ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొవాలని నేతన్నలు కోరుతున్నారు. గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో చేనేత శిక్షణ దుస్తులు నేస్తూ ఉపాధి పొందుతున్న చేనేత కార్మికులు జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని డిమాండ్ట్రస్టు ఆధ్వర్యంలో శిక్షణ దోమకొండలో గతంలో పెద్ద ఎత్తున చేనేత మగ్గాలు ఉండేవి.ప్రస్తుతం కార్మికులందరూ సిరిసిల్లాతో పాటు మహారాష్ట్రలోని భీవండి వంటి ప్రాంతాలకు వలసపోయారు. చేనేత వృత్తి కరుమరుగైంది. ఇక్కడి ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని గడికోట ట్రస్టు నిర్వహకులు, సంస్థాన వారసులు కామినేని అనిల్ సూచించారు. చేనేత సహకార సంఘాల వారి సూచనలతో సిరిసిల్లా ప్రాంతం నుంచి శిక్షకులకు రప్పించి ఇప్పటి వరకు రెండు విడతలుగా 25 మందికి శిక్షణ ఇచ్చాము. వారు ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. – బాబ్జి, గడికోట ట్రస్టు మేనేజర్, దోమకొండ -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రంజిత్ సూచించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీటీం, కళాజాత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఎంఈవో యోసెఫ్, ఏఎస్సై సాగర్, కళాబృందం ప్రతినిధులు, షీటీమ్ సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడలో.. బాన్సువాడ: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో శనివారం పోలీసులు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. షీటీం సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టెందుకు టోల్ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేయాలని అన్నారు. సోషల్ మీడియాపై జాగ్రత్తగా ఉండాలని, మహిళల భద్రత కోసం షీటీం అందుబాటులో ఉంటుందన్నారు. మండల విద్యాధికారి నాగేశ్వర్రావు, షీటీం సభ్యులు అనీల్, సాయిలు ఉన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టిప్పర్
బిక్కనూరు: మండలంలోని అంతంపల్లి గ్రామంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగి, వైర్లు రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాలు ఇలా.. ఓ టిప్పర్ లక్ష్మీదేవునిపల్లి నుంచి అంతంపల్లి గ్రామం ద్వారా హైవే పైకి బయలుదేరింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడంతో గ్రామంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. దీంతో స్తంభం విరిగిపోయి వైర్లు తెగిపోయాయి. పెద్ద ఎత్తున మిరుగులు రావడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ట్రాక్టర్ పట్టివేత సిరికొండ: సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ భూమిలో అక్రమంగా పొదలను తొలగిస్తుండగా ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎఫ్ఆర్వో రవీందర్ శనివారం తెలిపారు. జినిగ్యాల తండాకు చెందిన సవాయిలాల్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలో పొదలు తొలగిస్తున్నందుకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యాక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి ఆలయ హుండీ ఆదాయాన్ని సహాయ కమిషనర్ విజయరామారావు, ఈవో ప్రభుగుప్తా ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. రూ.2,72,759 నగదుతోపాటు మిశ్రమ బంగారం,చ వెండి కానుకలను భక్తులు హుండీలో వేశారని సహాయ కమిషనర్ తెలిపారు. వేశారు. అర్చకులు శ్రీనివాస్శర్మ, వంశీశర్మ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, భక్తులు పాల్గొన్నారు. 28న జొన్న కొనుగోలు కేంద్రాల మూసివేతకామారెడ్డి క్రైం: జిల్లాలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఈ నెల 28వ తేదీన మూసివేయనున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10,999 మంది రైతుల నుంచి 28,498 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామని పేర్కొన్నారు. జొన్నల కొనుగోలుకు ఈ నెల 28 ఆఖరి తేదీ అని, మిగిలిపోయిన రైతులు తమ జొన్నలను 27వ తేదీలోగా కేంద్రాలకు తీసుకురావాలని స్పష్టం చేశారు. రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందించాలి కామారెడ్డి క్రైం: పదోన్నతి పొందిన పోలీసు అధికారులు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. రాజంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సంజీవులు ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన సంజీవులుకు ఆయన పదోన్నతి చిహ్నాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి బాధ్యతలను పెంచుతుందన్నారు. క్రమశిక్షణ, నిబద్దతతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. -
● పేట్సంగెం బడిలో వేసవి ప్రత్యేక శిబిరం ● పద్నాలుగేళ్లుగా శిక్షణ ఇస్తున్న లక్ష్మణ్ రాథోడ్ ● క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చదువే కాదు ఆటలు కూడా బతుకుబాట చూపుతాయని విశ్వసించే లక్ష్మణ్ రాథోడ్ గ్రామీణ క్రీడాకారులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన లక్ష్మణ్ రాథోడ్ గాంధారి మండలం పేట్సంగెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ నిత్యం విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తర్ఫీదు ఇస్తుంటారు. పాఠశాలకు సెలవులు ఉన్నా సరే తాను మాత్రం బడికి వెళ్లి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిందే. ఆయన దగ్గర ఆటల్లో నైపుణ్యాన్ని నేర్చుకున్న విద్యార్థులెందరో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా రాణించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వేసవి సెలవుల సమయంలో గ్రామీణ విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక్కోచోట ఒక్కో క్రీడాంశాన్ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగా పేట్సంగెం ఉన్నత పాఠశాలలో వాలీబాల్ ఆటకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పిల్లలకు వాలీబాల్ ఒక్కటే కాదు కబడ్డీ, అథ్లెటిక్స్లోనూ లక్ష్మణ్రాథోడ్ శిక్షణ ఇస్తున్నారు. గడిచిన 14 ఏళ్లుగా ఆయన వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థులను క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. గాంధారి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పేట్సంగెం ఉన్నత పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆదివారం రోజున ఐదు కిలోమీటర్ల రన్నింగ్ కూడా చేయిస్తున్నారు. ప్రతి రోజూ ఫిట్నెస్, డ్రిల్, వాలీబాల్ ఆటలో టెక్నిక్స్, సర్వ్, డిఫెన్స్, అలాక్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే లక్ష్మణ్రాథోడ్ తన సోదరుడి పేరుతో ఏర్పాటు చేసిన బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు ఆటవస్తువులు సమకూరుస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆయా క్రీడాల్లో శిక్షణ పొందుతూ రాణిస్తున్నారు.కర్తవ్య నిర్వహణలో మనం ఎలా మసులుకునే విధానంపై ఆ నాడు లక్ష్మణుడు దిశానిర్దేశం చేయగా ఈనాటి లక్ష్మణుడు చేసి చూపుతున్నాడు. క్రీడల్లో ఎంతో మంది క్రీడాకారులను మెరికల్లా తీర్చిదిద్దుతున్న ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మణ్రాథోడ్పై ‘సాక్షి’ సండే స్పెషల్.. -
గ్రామ పాలనాధికారులు రాబోతున్నారు..
పడకేసిన రెవెన్యూ పాలన● ఇతర శాఖల్లో భర్తీ చేసిన వీఆర్వో, వీఆర్ఏలకు నేడు ఎంపిక పరీక్ష ● మొదటి విడతలో రాష్ట్రంలో 6 వేల పోస్టుల భర్తీ ● మలి విడతలో నోటిఫికేషన్ ద్వారా కొత్త వారికి అవకాశం! ● రెవెన్యూ పాలనను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు కామారెడ్డి క్రైం : ధరణి స్ధానంలో భూభారతిని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది. గతంలో తొలగించిన వీఆర్వో, వీఆర్ఏల స్థానంలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల వ్యవస్థను తీసుకువచ్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,696 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించగా, ఇందులో కామారెడ్డి జిల్లాలోని 474 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు రానున్నారు. మొదటి విడతలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఆదివారం రోజున రాత పరీక్ష జరగనుంది. ఇందులో ఎంపికయ్యే వారికి జూన్ 2న పోస్టింగ్లు ఇవ్వనున్నారు. మొదటి విడతలో సగం మంది రాష్ట్రంలో 10,696 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో మొదటి విడతలో భాగంగా 6 వేల పోస్టులను భర్తీ చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి గతంలోనే ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలో 474 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 90వ దశకంలో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి క్లస్టర్కు ఒక రెవెన్యూ అధికారిని కేటాయించింది. ఈ లెక్కన జిల్లాలో ఇదివరకు 215 మంది వీఆర్వోలు ఉండేవారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్ధలను గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలన అధికారి పేరిట రెవెన్యూ అధికారుల నియామకం చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాలో 474 రెవెన్యూ గ్రామాలకు పోస్టింగ్లు రానున్నాయి. ఇందుకోసం గతంలో పని చేసిన వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇంటర్ ఉత్తీర్ణలై గతంలో కనీసం 5 సంవత్సరాలపాటు వీఆర్వోగా గానీ, వీఆర్ఏగా గానీ పని చేసిన అనుభవం ఉన్న వారికి తిరిగి రెవెన్యూ శాఖ లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కామారెడ్డి జిల్లాలో ఇలాంటి వారు 402 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. వారందరికీ రాత పరీక్ష నేడు (25న) జరగనుంది. అందులో ఎంపికై న వారికి జూన్ 2న గ్రామ రెవెన్యూ అధికారులుగా పోస్టింగ్లు దక్కనున్నాయి. మిగిలిన పోస్టులను రెండో విడతలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. త్వరలోనే అందుబాటులోకి సేవలు గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన 402 మంది గ్రామపాలన అధికారి పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. రాత పరీక్షలో ఎంపికై న వారికి పోస్టింగ్లు దక్కుతాయి. జూన్ మొదటి వారంలో మొదటి విడతకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావచ్చు. – మస్రూర్ అహ్మద్, కలెక్టరేట్ పాలనాధికారి. కామారెడ్డిగత ప్రభుత్వం 2015లో ధరణి పేరిట ఆన్లైన్ వెబ్సైట్ను ప్రారంభించి రెవెన్యూ రికార్డులను ఆన్లైన్ చేయించింది. ఈ ప్రక్రియ 2019 వరకు కొనసాగింది. రికార్డులను ఆన్లైన్ చేసే క్రమంలో ప్రతి జిల్లా రికార్డుల్లోనూ వేల సంఖ్యలో త ప్పిదాలు చోటుచేసుకున్నాయి. ధరణిలో వాటిని సరి చేసేందుకు ఆప్షన్లు లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే భావనతో ఉద్యోగులను ఇతర శాఖల్లో భర్తీ చేస్తూ 2022లో వీఆర్వో, 2023లో వీఆర్ఏ వ్యవస్థలను ప్రభుత్వం రద్దు చేసింది. అవినీతి వాస్తవమే అనే ఘటనలు సైతం అప్పట్లో చాలానే వెలుగుచూశాయి. కానీ వీఆర్వో, వీఆర్ఏ వ్వవస్థలను రద్దు చేశాక గ్రామాల్లో పాలన మొత్తం దాదాపుగా పడకేసింది. రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. ధరణిని రద్దు చేసి భూ భారతి సేవలు అందుబాటులోకి తేవడం, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం దొరకొచ్చని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భూ భారతితోపాటు గ్రామపాలన అధికారుల వ్యవస్థ కూడా వస్తే రెవెన్యూ సేవలు వేగవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. జవాబుదారీతనం పెరిగి పనులు వేగవంతంగా పూర్తి కావొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు
బాన్సువాడ : గుర్తింపు లేని పాఠశాలలపై చ ర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రాజు అన్నారు. శనివారం పట్టణంలో ఆయ న మాట్లాడుతూ.. బాన్సువాడలో కొన్ని పా ఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే ప్ర చారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చే ర్పించొద్దని తల్లిదండ్రులకు సూచించారు. అ నుమతి లేకుండా ప్రచారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ఆయనవెంట మండల విద్యాధికారి నాగేశ్వర్రావు ఉన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి కామారెడ్డి అర్బన్ : తలసేమియాతో బాధప డే చిన్నారుల కోసం రక్తదానం చేసేందుకు యువతీయువకులు స్వచ్ఛందంగా ముందు కు రావాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. త లసేమియా బాధిత చిన్నారుల కోసం ఈ నెల 26వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద, ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య ఆస్పత్రి (కామారెడ్డి)లో నిర్వహించనున్న రక్తదాన శి బిరానికి సంబంధించిన కరప్రతాలను ఏఎ స్పీ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, లయన్స్ అధ్యక్షుడు చి లువేరి మారుతి, కామారెడ్డి రక్తదాతల స మూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, ఉపా ధ్యక్షుడు వెంకటరమణ పాల్గొన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి బిచ్కుంద(జుక్కల్) : లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్కుమార్ అన్నారు. జూన్ 14వ తేదీన జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్న నేప థ్యంలో కోర్టు హాలులో శనివారం బిచ్కుంద, జుక్కల్, పెద్దకొడప్గల్, ఎకై ్సజ్ ఎస్సైల తో సమావేశం నిర్వహించారు. కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకునే చక్కటి అవకాశం లోక్అదాలత్ ద్వారా కలుగుతుందన్నారు. పొలీసులు ఇరువర్గాలతో మాట్లా డి అవగాహన కల్పించాలని సూచించారు. గోవులను తరలించకుండా చర్యలు చేపట్టాలి భిక్కనూరు: గోవులను అక్రమంగా తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భాస్కరన్ సూ చించారు. మండల పరిధిలోని టోల్ ప్లాజా వద్ద పోలీస్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాల్లో అక్రమంగా గోవులను తరలిస్తే వెంటనే వాటిని గోశాలలకు తరలించాలన్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ ఏడీ శ్రీనివాస్, మండల పశువైద్యాధికారి దేవేందర్, పోలీసులున్నారు. విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి కామారెడ్డి అర్బన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, వ్యవసాయ బావులు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు అత్యంత జాగ్రత వహించాలని విద్యుత్ సంస్థ ఎస్ఈ శ్రావణ్కుమార్ కోరారు. తెగిపడి న, వేలాడుతున్న, వదులుగా ఉన్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దని, అలాగే ఇళ్లలో దుస్తులు ఆరేసేందుకు ఇనుప వైర్లకు బదులుగా ప్లాస్టిక్ వైర్లను కట్టుకోవాల ని ఎస్ఈ సూచించారు. సెల్ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రతగా ఉండాలన్నా రు. ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంటల రక్షణకు విద్యుత్ కంచెల ఏర్పాటు అత్యంత ప్రమాదకరమని, వాటి కారణంగా మూగజీవాలు, రైతులు మృత్యువాత పడుతున్నారని హెచ్చరించా రు. విద్యుత్కు సంబంధించి ఎలాంటి సమ స్యలున్నా 1912 నంబర్కు ఫోన్చేసి తెలపాలని ఎస్ఈ సూచించారు. -
అకాల వర్షంతో ఇక్కట్లు
ఒకేసారి మూడు నెలల రేషన్!బీబీపేట: గత రెండు రోజులుగా అకాల వ ర్షాలు కురుస్తుండడంతో ప్రజలు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు. మండల కేంద్రంలోని మెట్టు నర్సింలుకు చెందిన ఇళ్లు అర్ధరాత్రి కూలింది. ఇంట్లోని కుటుంబ సభ్యులు బయట గదిలో నిద్రస్తుండడంతో ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడుస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన కాంటాలు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ● జూన్ నెలలో పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులుకామారెడ్డి రూరల్: వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా రేషన్ డీలర్లు మూడు నెలలకు సంబంధించి అనగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యంను జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. జూన్ నుంచి వానాకాలం మొదలవుతుందని, వర్షాకాలంలో వరదలు, వాగులు, వంకలు పొంగటం వంటి సమస్యలు ఎదురైతే పేద ప్రజలకు ఆహారధాన్యాలు చేరవేయడం ఇబ్బందిగా మారుతుందన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ను జూన్లోనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. రేషన్ డీలర్లకు ఇబ్బందులే.. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల క్రితం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించగా అప్పటి వరకు ఉన్న దొడ్డు బియ్యం స్టాకు నిల్వలను ఇప్పటి వరకు రేషన్ షాపుల నుంచి తీసుకుపోలేదు. అంతేకాకుండా ఇప్పుడు మూడు నెలల బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలంటే మూడు నెలలకు సంబంధించిన బియ్యం నిల్వ చేసుకోవడానికి సరిపడా రూంలు అందుబాటులో ఉండవని రేషన్డీలర్లు వాపోతున్నారు. అలాగే రేషన్ లబ్ధిదారులు సైతం ఒక కార్డులో నలుగురు ఉంటే నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉండేది. ఒకేసారి మూడు నెలల బియ్యం అంటే 72 కిలోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇటు రేషన్ డీలర్లకు, అటు వినియోగదారులకు తిప్పలు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ఆర్మూర్టౌన్: అత్యంత అరుదైన గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న నరేశ్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కొండ్రపేట నరేశ్ వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఆర్మూర్తో పాటు నిజామాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూయించినా చికిత్స అందలేదు. పరిస్థితి విషమిచండంతో ఐదురోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు నరేశ్ గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో అతని కాళ్లు, చేతులు చచ్చిపడిపోయాయి. చికిత్స కోసం రూ. 2 నుంచి రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతోంది. చిన్ననాడే తండ్రిని కోల్పోపోయిన నరేశ్ తల్లితో పాటు ఇద్దరు తమ్ముళ్ల బాగోగులు చూస్తు పెద్దదిక్కుగా మారాడు. ఉన్నఫలంగా అరుదై న వ్యాధి సోకడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. నరేశ్కు మూడేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నరేశ్ ఫోన్ పే నంబర్ 8688365656, ఎస్బీఐ ఐఎఫ్సీ కోడ్ ఎస్బీఐఎన్0020894, అకౌంట్ నంబర్ 62148693494కు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
పెర్కిట్: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మామిడిపల్లి గ్రామంలోని గోవింద్పేట్ చౌరస్తాలో తడిసిన ధాన్యంతో రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. ఆలస్యంగా కొనుగోళ్లు చేపట్టడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వంగా కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాజాగౌడ్, ఎస్హెచ్వో గోవింద్పేట్ చౌరస్తాకు చేరుకొని కొనుగోళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఆర్డీవో పరిశీలించారు. -
ఆర్అండ్బీ రోడ్డు, డ్రెయినేజీ ఆక్రమణ
బిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కోసం అధికారులు రెండు వైపు లా రోడ్డు తవ్వి మురికి కాలువలు నిర్మించి రో డ్డును వెడల్పు చేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న పలు షట్టర్ల యజమానులు తమ ముందు ఉన్న ఆర్అండ్బీ స్థలం, మురుగు కాలువ ఆక్రమించి షాపులను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చారు. ఏబీఐ బ్యాంక్ ముందు తారురోడ్డు కు అనుకొని చికెన్ సెంటర్లు ఇతర దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డుకు అనుకొని 30 నుంచి 40 చదరపు అడుగుల స్థలం ఆక్రమించడంతో అక్కడ రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా రోడ్డుపై మురుగు నిలువడంతో స్థా నికులు ఇబ్బందులు పడుతున్నారు. యథేచ్ఛ గా ఆక్రమణలు జరుగుతున్నా ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో న్యా యవాదులు చికెన్ సెంటర్లు తొలగించాలని ఫిర్యాదు చేశారు. చికెన్ సెంటర్లను మాంసం విక్రయించే మార్కెట్కు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలు తొలగిస్తాం మురికి కాలువలు, రోడ్డును ఆక్రమించి వేసిన దుకాణాలను వెంటనే తొలగిస్తాం. మండల ఎంపీవో, జీపీ కార్యదర్శి పరిశీలించి సమస్య పరిష్కరిస్తారు. మురుగు రోడ్డుపై ని లువకుండా మట్టి తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తాం. – మురళి, డీపీవో, కామారెడ్డి బిచ్కుందలో రోడ్డుపై నిలుస్తున్న మురుగునీరు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
జీజీహెచ్లో పెచ్చులూడిన సీలింగ్
నిజామాబాద్ నాగారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జీజీహెచ్ మొదటి అంతస్తులో పెచ్చులూడుతున్నాయి. శుక్రవారం రూంనంబర్ 178లో బెడ్ నంబర్ 11పై నవజాత శిశువు ఉండగా ఘటన చోటు చేసుకుంది. సీలింగ్ పెచ్చులు ఊడి నాలుగు రోజుల క్రితం ఫాతిమా బేగంకు జన్మించిన పాప ముఖంపై పడ్డాయి. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందించిన సిబ్బంది శిశువును మరో వార్డుకు తరలించి చికిత్స అందించారు. ● నవజాత శిశువుకు గాయాలు ● తప్పిన పెను ప్రమాదం -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఉల్లబోయిన గంగారాం(56)కు ముగ్గురు కుమారులు. వీరు బతుకుదెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గ్రామంలో గంగారాం ఒక్కడే నివాసం ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతను గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీ కొని ఇద్దరికి గాయాలు మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తాలో శుక్రవారం టీ తాగుతున్న ఇద్దరు యువకులను మహారాష్ట్ర నుంచి వేములవాడ వెళ్తున్న కారు ఢీకొన్నది. ఈ ఘటనలో యువకులకు గాయాలు కాగా రోడ్డు పక్కన పార్క్ చేసిన నాలుగు బైకులు ధ్వంసమయ్యాయి. స్థానికులు గాయపడ్డ యువకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బ్రిడ్జి నిర్మించారు.. బీటీ రోడ్డు మరిచారు
రాజంపేట : మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల పరిధిలో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఒక్కో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3.43 కోట్లను కేటాయించారు. బ్రిడ్జీల నిర్మాణ పనులు పూర్తయినా బీటీ రోడ్డు వేయకుండా వదిలేశారు. దీంతో కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల ప్రజలు పనుల నిమిత్తం జిల్లాకేంద్రం వెళ్లడానికి, పక్కనే మెదక్ జిల్లాకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగినా.. మండలంలోని అన్నారంనికి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మించి బీటీ రోడ్డు వేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నా రు. బ్రిడ్జి వద్ద మరమ్మతులు చేయపోవడంతో ఆచోట మట్టి కృంగింది. నాలుగు నెలల క్రితం ఓ కారు అదుపు త ప్పి బోల్తా పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి బ్రిడ్జి వద్ద బీటీ రోడ్డు వేయాలని ఆయా గ్రా మాల పరిధి ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. రాజంపేట మండలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు బీటీ రోడ్డు పనులు చేపట్టాలి నూతన బ్రిడ్జీల వద్ద బీటీ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి. వర్షాలకు మట్టి కృంగిపోవడంతో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం సమీపిస్తుండటంతో బ్రిడ్జి వద్ద మట్టి కృంగిపోతుంది అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలి. – శ్రీనివాస్, ఎల్లారెడ్డిపల్లి తండా నిధులు విడుదల కాకపోవడంతోనే.. నూతన బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్లకు సకాలంలో నిధలు విడుదల కాకపోవడంతోనే బ్రిడ్జిల వద్ద పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే పనులు పూర్తిచేసి బీటి రోడ్డు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశిస్తా. – ఆర్అండ్బీ డీఈఈ, శ్రీనివాస్, ఎల్లారెడ్డి -
వేర్వేరు ఘటనల్లో బాలుడు, మరో ముగ్గురి మృతి
గాంధారి/ లింగంపేట: బంధువుల పెళ్లికి వచ్చి ఓ బాలుడు మృతి చెందిన ఘటన గాంధారి మండల పరిధిలోని ఎక్కకుంట తండాలో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొండాపూర్ తండాకు చెందిన లలిత, రాజ్కుమార్ దంపతులు వారి రెండేళ్ల కుమారుడు సాత్విక్(2)తో కలిసి బుధవారం బంధువుల పెళ్లికి ఎక్కకుంట తండాకు వచ్చారు. బయట పెళ్లి వంటలు చేసి ఉంచారు. రాత్రి వర్షం రావడంతో వండిన వంట పాత్రలను ఇంట్లో పెట్టారు. సాంబారు పాత్రపై మూత వేయడం మర్చిపోయారు. సాత్విక్ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబారులో పడిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్కు తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయమై ఎస్సై ఆంజనేయులును సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కారు ఢీ కొని ఒకరు.. మాచారెడ్డి: కారు ఢీ కొన్న ఘటనలో ఓ సైక్లిస్ట్ మృతి చెందాడు. ఎస్సై అని ల్ తెలిపిన వివరాల ప్రకారం.. పా ల్వంచ మండల కేంద్రానికి చెందిన మాస్తు చిన్న సిద్ధయ్య(57) గురువా రం రాత్రి పాల్వంచ మర్రి నుంచి సైకిల్ పై పాల్వంచకు వెళ్తుండగా కామారెడ్డి వైపు నుంచి అతి వేగం, అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొన్నది. సిద్ధయ్య తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు..భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన పోతుల రాహుల్ అనే యువకుడు బైక్పై కామారెడ్డి నుంచి భిక్కనూరు మండల కేంద్రానికి గురువారం వస్తుండగా టోల్ ప్లాజా వద్ద వెనుక నుంచి కారు ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి మరొకరు..బిచ్కుంద: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మోహన్రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతడ్గూర్కు చెందిన మంగళి సునీల్, భార్య జ్యోతి(26)తో కలిసి బైక్పై బిచ్కుందుకు వస్తున్నారు. బిచ్కుంద శివారులో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడడంతో జ్యోతి తలకు తీవ్రగాయమైంది. స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై అవగాహన
ఎల్లారెడ్డి: పట్టణంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఎల్లారెడ్డి షీ టీం ఇన్చార్జి శ్రీనివాస్ విద్యార్థినులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై అవగాహన క ల్పించారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డయల్ 100 ప్రాధాన్యతను వివరించారు. మహిళలు లైంగిక, శారీరక వేధింపులకు గురైతే షీ టీం సభ్యులను సంప్రదించాలన్నారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో షీటీం సహాయం కోసం 8712686094 నంబర్కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్కు డయల్ చేయాలని కోరారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియామాలు పాటించాలని సూచించారు. యువత డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని కోరారు. పాఠశాల ఎంఆర్వో రాజు, షీ టీం సభ్యులు పాల్గొన్నారు. లోతైన దుక్కులతో తెగుళ్ల నివారణ నవీపేట: లోతైన దుక్కులతో పంటలను ఆశించే తెగుళ్లను నివారించవచ్చని రు ద్రూర్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన రైతులకు సూచనలు చేశారు. వేసవిలో లోతైన దు క్కు లతో నేలతో సంక్రమించే పురుగులను నాశనం చేయవచ్చని వివరించారు. వ్యవసాయాధికారులు సూచించిన మోతాదులోనే యూరియా, ఎరువులను వాడాలని సూచించారు. విత్తన శుద్ధి ప్రాధాన్యతను రైతులకు వివరించారు. శాస్త్రవేత్త పద్మావతి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి పద్ధతిని అలవాటు చేసుకోవాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి
కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో నిరుపేదైన కుంట్ల వినోదకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయగా, శుక్రవారం కలెక్టర్ భూమిపూజ చేసి ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంజూరైన ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రభుత్వం నుంచి లబ్ది పొందాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇప్పటివరకు 708 ఇళ్లు మంజూరు కాగా, 74 ఇళ్లకు మార్క్ అవుట్ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో 11,153 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో కామారెడ్డి నియోజక వర్గంలో 3206, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3496, జుక్కల్ నియోజక వర్గంలో 3019, బాన్సువాడ నియోజక వర్గంలో 1432 ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందులో 2250 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాగా పనులు పలు దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతీ సోమవారం ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా విడతల వారీగా నిధులు చెల్లిస్తుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్పాల్ రెడ్డి, గ్రామస్తులు కొమిరెడ్డి పెద్దనారాయణ, చిట్టబోయిన ప్రభాకర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచన మంజూరు పత్రాల అందజేత -
జక్రాన్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జక్రాన్పల్లి: మండలంలోని వివేక్నగర్ తండా సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొనడంతో వివేక్నగర్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ (35), కేశ్పల్లి తండాకు చెందిన బాదావత్ నవీన్ (27) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. బానోత్ శ్రీనివాస్ తన అన్న శంకర్ నాయక్ పెళ్లిరోజును పురస్కరించుకొని కేక్ తీసుకురావడం కోసం జక్రాన్పల్లి మండల కేంద్రానికి వెళ్లారు. కేక్ తీసుకొని తిరిగి వస్తుండగా వివేక్నగర్ తండా సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కంటైనర్ బైక్ను ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్పై ఉన్న బానోత్ శ్రీనివాస్, బాదావత్ నవీన్ కొద్దిదూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ పల్టీ కొట్టింది. ఘటనా స్థలాన్ని ఎస్సై మాలిక్ రెహమాన్ పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ కేబుల్ టీవీ నిర్వహిస్తుండగా, భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. బాదావత్ నవీన్ ఆర్టీసీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బస్సును సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకి నిర్వహిస్తున్నారు. నవీన్కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, మృతులిద్దరూ స్వయాన బావబామ్మర్దులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ను ఢీకొట్టిన కంటైనర్ ఇద్దరు దుర్మరణం మృతులు బావబామ్మర్దులు -
పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లాకేంద్రంలో పర్యటనకామారెడ్డి టౌన్: పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, దోమల వ్యాప్తి అరికట్టేందుకు ఫాగింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. పట్టణంలోని అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, తదితర వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. సాక్షి కథనానికి స్పందన.. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఈనెల 21న సాక్షిలో ప్రచురితమైన ‘ముంచుకోస్తుంది వానాకాలం.. ముంపు సమస్యకేదీ పరిష్కారం’ కథనానికి కలెక్టర్ స్పందించారు. పలు వార్డులో పర్యటించిన అనంతరం వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. వార్డు ఇన్చార్జిలు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించాలని, అధికారులు కూడా పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, సహాయ ఇంజనీరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాగర్’లోకి ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,076 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు స్థానికంగా కురిసిన వర్షాల కారణంగా వాగుల ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం1393.04 అడుగులు (5.567 టీఎంసీల) నీరు నిల్వ ఉందన్నారు. ఈనెల 27 నుంచి యోగా కార్యక్రమాలు కామారెడ్డి అర్బన్: జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే నినాదంతో హరిత యోగా, యోగా వాక్, యోగా సంగమం, యోగా ప్రభావ అనే నాలుగు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ (డీపీఏం) ఆకుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి జూన్ 21 వరకు గ్రామ, మండల స్థాయిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల వైద్యాధికారుల పర్యవేక్షణలో యోగా శిక్షకుల చేత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. యోగా కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువతీయువకులు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. దేశ వారసత్వాన్ని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసే కృషిలో అందరు పాలుపంచుకోవాలన్నారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణతకామారెడ్డి టౌన్: ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష–2025లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి అంబీర్ జై శౌర్యదీప్ ఉత్తీర్ణత సాధించాడు. విద్యార్థి ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువున్నాడు. ఈసందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. మెరుగైన సేవలందించాలికామారెడ్డి టౌన్: ప్రజలకు అత్యవసరంలో మరింత మెరుగ్గా సేవలను అందించాలని 108 అంబులెన్స్ స్టేట్ హెడ్ హెచ్ఆర్ కిరణ్ కిషోర్ సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని 108, 102 అంబులెన్స్ సేవలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హెచ్ఆర్ రవీందర్, ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనేజర్ తిరుపతి, సిబ్బంది స్వామి, అనిల్, విజయ్, కృష్ణస్వామి, కార్తీక్, సురేష్ తదితరులు ఉన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను అకడమిక్ ఆడిట్సెల్ అడిషనల్ డైరెక్టర్ అతిక్ గోరీ సుల్తాన్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా తదితరులున్నారు. -
నిందితుడి రిమాండ్
ఖలీల్వాడి: పాత కక్షలతో ఒకరిపై దాడి చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వినాయక్నగర్కు చెందిన దోమల సాయికుమార్కు కన్నిగిడె సాయికుమార్ అలియాస్ సాయినాథ్కు పాత కక్షలు ఉన్నాయి. ఈ నెల 20న నగరంలోని బోధన్ రోడ్డులో ఉన్న మైఫిల్ హోటల్ వద్ద కనిపించిన సాయికుమార్పై సాయినాథ్ కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. వడ్ల లారీ బోల్తా లింగంపేట: మండలంలోని బూరుగిద్ద శివారులోని మూల మలుపు వద్ద శుక్రవా రం వడ్ల లారీ బోల్తా పడిననట్లు గ్రామస్తులు తెలిపారు. లింగంపేట మండలం అయిలాపూర్లో ధాన్యం లోడ్ చేసుకొని చిట్యాలలోని రైస్ మిల్లుకు వెళ్తుండగా బూరుగిద్ద వద్ద అదుపుతప్పి పడిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. -
పిట్లం ఏఎస్సై లింబాద్రికి ఎస్సైగా పదోన్నతి
పిట్లం(జుక్కల్): స్థానిక పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లింబాద్రికి ఎస్సై గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా బాన్సువాడలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి డీఎస్పీ విఠల్రెడ్డి లింబాద్రికి పదోన్నతి చిహ్నాన్ని అలకరించి అభినందనలు తెలిపారు. లింబాద్రికి పదోన్నతి లభించడంతో తోటి సిబ్బందిశుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాజేశ్ పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతం నిజామాబాద్అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ ఇంగ్లిష్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 1,867 మంది హాజరు కాగా 245 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,431మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి ఏడు పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్లు 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. -
మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యం తగదు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం తగదని నీటి పారుదల శాఖ ఈఎన్సీ(ఇంజినీరింగ్ ఇన్ ఛీప్ మెయింటెనెన్స్) శ్రీనివాస్ అధికారులు, ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ను పరిశీలించారు. వరద గేట్లను, కాకతీయ కాలువ హెడ్రెగ్యులేటర్ను, ఫ్లడ్ కంట్రోల్ రూంలో నీటి మట్టాన్ని, డ్యాం ను పరిశీలించి పలు వివరాలను అధికారులు, ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గేట్లు, డ్యాం పై మెయింటెనెన్స్ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే తలెత్తే ఇబ్బందుల గురించి వివరించారు. వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈ చక్రపాణి, డిప్యూటీ ఈఈ గణేశ్, ఏఈఈలు, సిబ్బంది ఉన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్సులు రద్దు
మద్నూర్(జుక్కల్): రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్లు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ ఏడీఏ అపర్ణ అన్నారు. మండల కేంద్రంలోని విత్తనాలను శుక్రవారం కామారెడ్డి విత్తన తనిఖీ బృందం అధికారులు, ఏడీఏ తనిఖీలు నిర్వహించారు. విత్తన దుకాణాల్లో, గోదాముల్లో దుకాణదారులు స్టోర్ చేసి పెట్టుకున్న విత్తనాల బ్యాగులను పరిశీలించారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ.. రానున్న వానాకాలం పంటలకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. విత్తనాల కంపెనీల వివరాలు, పీసీలు, బిల్లులు, ఇన్వాయిస్ ఉంచుకోవాలన్నారు. రైతులకు విక్రయించే విత్తనాలకు రసీదులు తప్పకుండా ఇవ్వలన్నారు. రైతులు లైసెన్స్లు కలిగిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ప్యాకింగ్ లేనివి, దళారుల వద్ద విత్తనాలు తీసుకోరాదన్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. విత్తన తనిఖీ బృందం కామారెడ్డి ఏవో పవన్కుమార్, బీబీపేట్ ఏవో నరేంద్ర, ఏవో రాజు, డీలర్లు పాల్గొన్నారు. ఏడీఏ అపర్ణ మద్నూర్లో విత్తన దుకాణాల తనిఖీ -
మావోళ్లు ఎట్లున్నరో..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో నక్సల్స్ ఏరివేత కొనసాగుతోంది. ఇందులోభాగంగా జరిగిన ఎన్కౌంటర్లలో నక్సల్స్ చనిపోతుండడంతో జిల్లాకు చెందిన నక్సల్స్ గురించి చర్చ నడుస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి ఐదుగురు అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. దీంతో వారి కుటుంబాలు, బంధువులు తమ వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన చెందుతున్నారు.● కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి 1995లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ● పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేష్ 2001 లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆజాద్ ప్రొటెక్షన్ టీంలో సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. ● కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి చెందిన లోకేటి రమేశ్ 2009లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈయన లోకేటి చందర్ అలియాస్ స్వామి కొడుకు. తండ్రి బాటలోనే విప్లవోద్యమంలోకి వెళ్లాడు. సౌత్ బస్తర్లో కొంటా ఏరియా కమిటీ డీసీఎంగా పనిచేస్తున్నాడు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. ● లోకేటి లావణ్య అలియాస్ శాంతి 2009లో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఈమె లోకేటి చందర్ అలియాస్ స్వామి కూతురు. ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తోంది. ఈమైపె రూ.4 లక్షల రివార్డు ఉంది. ● సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన లింబయ్యగారి వెంకట్రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నాడన్నది పోలీసులకు తెలియదు. అతనిపై రూ.లక్ష రివార్డు ఉంది.● అజ్ఞాతంలో జిల్లాకు చెందిన ఐదుగురు నక్సల్స్ ● వరుస ఎన్కౌంటర్లతో వారి కుటుంబాల్లో ఆందోళన ● తమవారి క్షేమ సమాచారంపై ఆరా!అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ వీరే..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఇటీవల దండకారణ్యంలో కేంద్ర బలగాలు జరుపుతున్న దాడుల్లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ చనిపోయారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్ గురించి జిల్లాలో చర్చ నడుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఆ ఐదుగురు దశాబ్దాల కాలంగా ఇంటిని విడిచి వెళ్లారు. ప్రస్తుతం వారు ఎక్కడున్నరో, ఎట్లున్నరో కూడా ఆయా కుటుంబాలకు తెలియదు. కానీ కాల్పుల్లో నక్సల్స్ చనిపోయారని తెలిస్తే చాలు ఆ కుటుంబాలు వణికిపోతున్నాయి. వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎలా ఉన్నారోనని వారి కుటుంబాలు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. 1990–2000లో విస్తృత కార్యకలాపాలుఉమ్మడి జిల్లాలో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్ నక్సల్స్ కార్యకలాపాలు అప్పట్లో జోరుగా సాగేవి. కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ సమాంతర పాలన సాగించారు. 1990 నుంచి 2000 మధ్య కాలంలో ఆ పార్టీ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వాలు విధించిన తీవ్ర నిర్భందంతో చాలా మంది లొంగిపోయారు. అలాగే అరెస్టులు, ఎన్కౌంటర్లతో జిల్లాలో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్ పార్టీ 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించే నాటికి జిల్లాలో అనేక నష్టాలను చవిచూసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్తోపాటు మిలిటెంట్లు, సానుభూతి పరులు 125 మంది వరకు ఎన్కౌంటర్లలో చనిపోయారు. వందలాది మంది అరెస్టయ్యారు. అలాగే వందలాది మంది లొంగిపోయారు. మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత జిల్లా కార్యదర్శిగా పనిచేసిన గంగుల వెంకటస్వామి అలియాస్ రమేశ్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు మరింతగా విస్తరించాయి. ముఖ్యంగా ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఊరూరా సాయుధ నక్సల్స్ వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించారు. అదే సమయంలో మానాల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో జిల్లా కార్యదర్శి గంగుల వెంకటస్వామితో సహా 12 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో జిల్లాలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండాపోయింది. ఏదేమైనా ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఎన్కౌంటర్ జరిగినా జిల్లాలో అజ్ఞాత నక్సల్స్ గురించి విస్తృత చర్చ జరుగుతోంది. -
అయ్యో.. రైతన్న కష్టం వృథాయేనే!
ఎల్లారెడ్డి: ఆరుగాలం కష్టించి పండించిన పంట వానల వల్ల పనికిరాకుండా పోవడంతో రైతన్న కళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. చేతికొచ్చిన పంటను సకాలంలోనే కొనుగోలు కేంద్రాలకు తరలించినా హమాలీలు లేరంటూ, లారీలు రావడం లేదంటూ నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాలలో ఎండకు ఎండి వానకు నానిన పంట మొలకలెత్తి పనికిరాకుండా పోయింది. దీంతో రైతన్న కష్టం వృథాగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. మిగిలిపోతున్న తడిచిన ధాన్యం.. ఎల్లారెడ్డి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిచి ముద్దయ్యాయి. తడిచిన ధాన్యం ఉంటే రైస్ మిల్లర్లు తిప్పి పంపడం లేదా తరుగు పేరిట చేస్తున్న లూటీని దృష్టిలో పెట్టుకుని రైతులు పొడి ధాన్యాన్ని మాత్రమే తూకం చేయిస్తున్నారు. ప్రతీ రైతు ధాన్యంలో క్వింటాల్ నుంచి ఐదు క్వింటాళ్ల వరకు మిగిలిపోతున్న తడిచిన ధాన్యాన్ని ఎవరికి కొనుగోలు చేయాలో కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలపడం లేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిచిన ధాన్యం అడుగుభాగాన మొలకలెత్తాయి. మొలకెత్తిన ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారంటూ రైతులు బావురుమంటున్నారు. తడిచిన ధాన్యాన్ని ఏదో ఒక ధరకు రైస్మిల్లర్లకు అమ్మేసుకోవాలని సిబ్బంది రైతులకు సలహా ఇస్తున్నట్లు సమాచారం. నమోదులో కూడా తీవ్ర జాప్యం.. రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వస్తాయని నాయకులు, అధికారులు చెబుతున్న ప్రకటనలు వాస్తవానికి జరగడం లేదు. ధాన్యాన్ని మిల్లుకు తరలించాక రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సిన కేంద్రం నిర్వాహకులు జాప్యం చేస్తున్నారు. దీనివల్ల అన్ని పత్రాలు ఇచ్చినా రోజుల తరబడి ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిపి, మిల్లులకు తరలించి, రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు.రైస్ మిల్లర్ల దోపిడీ.. వానలకు తడిచి, మొలకెత్తిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం సకాలంలో తూకాలు జరుగక.. లారీలు రాక.. నాశనమైన పంటమొలకెత్తిన ధాన్యాన్ని ఎవరికి అమ్మాలి.. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి తూకం జరిగినా, లారీలు రాకపోవడంతో తరలించడం జరగలేదు. గత కొద్ది రోజుల క్రితం పడిన వర్షానికి తడిచిన ధాన్యం మొలకలెత్తింది. ఇలా మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమను ఆదుకోవాలి. – సిద్దు, రైతు, లింగారెడ్డిపేట తడిసిన ధాన్యాన్ని కొంటాం.. వర్షాలకు కొనుగోలుకేంద్రాల్లో తడిసిన ధాన్యా న్ని తప్పకుండా కొనుగోలు చేస్తాం. అయితే రైతులు తడచిన ధాన్యాన్ని ఎండపెట్టి విక్రయించాల్సి ఉంటుంది. మొలకత్తిన ధాన్యం విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 594 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసాం. ఇంకా ఐదు వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా శుక్రవారం 2500 టన్నులు కొనుగోలు చేశాం. – మల్లికార్జునరావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికొన్ని రోజులు కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడ్డ రైతులు నేడు హమాలీ, లారీల సమస్యలతో పంట నాశనం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తీరా లారీలు వచ్చి కాంటాలు జరిగినా తరుగు పేరిట రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. ధాన్యంలో ఔటానా(బియ్యం శాతం) రావడం లేదంటూ రైస్ మిల్లర్లు ప్రతీ లారీకి 20 నుంచి 40 సంచుల వరకు తరుగు కింద తీసి వేస్తున్నారు. ఇటీవల ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఒక పారా బాయిల్డ్ రైసుమిల్లు వారు 680 సంచులు ఉన్న లారీ నుంచి 40 సంచులను తరుగు కింద తీసివేశారు. దాదాపు 16 క్వింటాళ్ల ధాన్యం తరుగు కింద తీసివేస్తే తాము ఎలా బతికేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా సదరు రైస్మిల్లు యజమానితో మాట్లాడి తరుగు తక్కువ చేయిస్తామని సమాధానమిచ్చారు. రైతులు జల్లెడ పట్టకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని ఇందువల్ల బియ్యం పర్సంటేజ్ రావడం లేదంటూ మిల్లర్లు కోత పెడుతున్నారని అధికారులు అంటున్నారు. -
ఆవులను ఎత్తుకెళ్లే ముఠా అరెస్టు
ఖలీల్వాడి: ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి కారుల్లో ఎత్తుకెళ్లే ముఠాను పట్టుకున్నట్లు సీసీఎస్ సీఐ సురేష్ గురువారం తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్, ముంబాయికి చెందిన ఆరుగురు ముఠా సభ్యులు సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమీర్, అబ్దుల్కలామ్, సయ్యద్ సోయాబ్, సమీర్ఆలీ, మహబూబ్అలీలు కార్లపై ప్రెస్, పోలీస్ బోర్డులు పెట్టుకుని దొంగ నెంబర్ ప్లేట్లతో నడుపుతూ ఆవులను ఇన్నోవా వెహికల్, ఇతర వాహనాలలో దొంగతనంగా తరలించేవారన్నారు. కార్లలో సీట్లు తీసివేసి ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి, ఎక్కించేవారన్నారు. నాందేడ్కు ప్రత్యేక బృందంతో వెళ్లి, రెండు రోజులు గాలించి ముఠా సభ్యులు పట్టుకున్నట్లు తెలిపారు. ముఠా సభ్యులపై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్రలోని దెగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. సీసీఎస్ సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలే్ ష, నరేష్ ఉన్నారు. -
కూలిన ఇళ్ల పరిశీలన
భిక్కనూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు మండల కేంద్రంలో రెండు నివాసపు ఇళ్లు గురువారం కూలిపోయాయి. మండల కేంద్రానికి చెందిన పోచమ్మ, బసగళ్ల ఎల్లయ్య నివాసం ఉంటున్నా ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈవిషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు, వెంటనే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ సంఘటన స్థలానికి వెళ్లి కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆస్తి నష్టం అంచనా వేసి పంచనామా నిర్వహించారు. -
పర్మళ్ల తండాలో వివాహిత అదృశ్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల తండాకు చెందిన బాదావత్ వసంత అదృశ్యమైనట్లు ఎస్సై రాఘవేంద్ర గురువారం తెలిపారు. తాడ్వాయి మండలం గుండారం పంచాయతీ పరిధిలోని హత్గుండు తండాకు చెందిన వసంతకు పర్మళ్ల తండాకు చెందిన బాదావత్ ప్రకాశ్తో ఈ నెల 4న వివాహం జరిగింది. ప్రకాశ్తో ఉండడం ఇష్టంలేదని వసంత తరుచూ చెప్పినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గత మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు తెలిపారు. భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలుడిపై కుక్కల దాడి బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రం ఎల్లమ్మ కుచ్చలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు రాంచదర్పై కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. మూడు కుక్కలు ఒకేసారి వెంటపడి దాడి చేయగా ముఖానికి, చేతికి గాయాలు అయ్యాయి. బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో కేకలు వేయగా తల్లిదండ్రులు బయటకు వచ్చి కుక్కలను తరిమి కొట్టడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కిన భార్యాభర్తలు
● ఆత్మహత్యకు యత్నం.. కాపాడిన పోలీసులు రామారెడ్డి: కుటుంబంలో నెలకొన్న సమస్యలతో భార్యాభర్తలిద్దరూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి గ్రామానికి చెందిన దంపతులు అరుణ, శంకర్ గురువారం రామారెడ్డిలోని పెద్దమ్మ దుబ్బ మిషన్ భగీరథ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు భార్యాభర్తలను సముదాయించి కిందకి దించారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలుంటే పరిష్కరించుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలతోనే వారు ట్యాంకు ఎక్కినట్టు సమాచారం. -
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి సహించం
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే సహించమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. అధికారులుగాని, కమిటీ సభ్యులుగాని అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట రైతువేదికలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరుపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వ హాయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని ఆయన చెప్పారు. అంతకుముందు మండలంలోని జలాల్పూర్, గోపాల్పేట, మాల్తుమ్మెద గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 120 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఎల్లారెడ్డి మండలంలోని దావల్ మాల్క పల్లి, సబ్దల్పూర్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే మదన్మోహన్ భూమిపూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ రజితరెడ్డి, మాజీచైర్మన్ వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, , మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్, డీఎల్పీవో సురేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మాజీచైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డిపేట మాజీసర్పంచ్ విఠల్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో ప్రభాకరచారి, పార్టీ నాయకులు తదితరులున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల అందజేత -
ధాన్యం లారీ బోల్తా : డ్రైవర్కు గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్పేటలోగల కోదండ రామాలయం వద్ద గురువారం సాయంత్రం ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జాఫర్కు గాయాలయ్యాయి. లారీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మెయిన్రోడ్డుపైకి వచ్చే క్రమంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ను స్థానికులు చికిత్స నిమిత్తం గోపాల్పేటలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. లారీలోని ధా న్యం బస్తాలు తడిచిపోకుండా లాపర్లను కప్పారు. సాంబార్లో పడి బాలుడికి.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు మథుర సాత్విక్ ప్రమాదవశాత్తు సాంబార్లో పడి తీవ్రంగా గాయపడిన ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గాంధారి మండ లం గౌరారం తండాలో గురువారం జరిగిన వివా హ వేడుకకు సాత్విక్ తల్లిదండ్రులు రాజ్కుమార్, లలితలతో కలిసి వెళ్లాడు. సాయంత్రం సాత్విక్ ఆడుకుంటూ సాంబార్లో పడిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి బాలుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. స్తంభం పైనుంచి పడి యువకుడికి.. మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లిలో విద్యుత్ మరమ్మతులు చేపడుతుండగా ఓ యువకుడు స్తంభం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. నర్సింగ్పల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు మతిన్ అనే కాంట్రాక్టర్కు అధికారులు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ వద్ద పని చేసేందుకు కందకుర్తి నుంచి ముషీర్ అనే యువకుడు వచ్చాడు. పనులు చేస్తున్న క్రమంలో ముషీర్ స్తంభం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ విషయమై ఏఈ నాగశర్వాణిని ‘సాక్షి’ వివరణ కోరగా, ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
విద్యుత్ సింగిల్ విండో ఏర్పాటు
కామారెడ్డి అర్బన్: ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు హై టెన్షన్ 11, 33 కేవీ ఆపై వోల్టేజీ సర్వీసుల మంజూరు సులభం, వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎస్ఈ ఎన్ శ్రావణ్కుమార్ గురువారం తెలిపారు. హెచ్టీ 11 కేవీ ఆన్లైన్ దరఖాస్తులను ఏడీఈ కమర్షియల్, 33 కేవీ దరఖాస్తులను ఏడీఈ కమర్షియల్ కార్పొరేట్ పర్యవేక్షించి అన్ని పత్రాలు సరిగా ఉంటే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలను రూపొందిస్తారని, మౌలిక వసతులు ఏర్పాటు చేసి అత్యంత వేగంగా సర్వీసు మంజూరు చేస్తారని ఎస్ఈ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనాస్థలం పరిశీలన పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రం సమీపంలోని 161 జాతీయ రహదారిపై గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని గురువారం సీఐ నరేష్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో డాక్టర్ పండరి అనే వ్యక్తి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మృతిచెందాడు. దీంతో ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై మహేందర్, ఎంపీడీవో లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై గుంతలో నిలుస్తున్న నీరు మాచారెడ్డి : మండలంలోని గన్పూర్(ఎం) గ్రామంలో ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. ఈగుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంందులు ఎదుర్కొంటున్నారు. ఏమరుపాటుతో వాహనాలు నడిపితే గుంతల్లో పడిపోయే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇటీవల గన్పూర్ తండాకు చెందిన ఓ వాహనదారుడు గుంతలో పడగా స్వల్ప గాయాలైనట్టు గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. సైనిక్ స్కూల్లో ప్రవేశానికి అర్హత సాధించిన రిషివంత్ కామారెడ్డి టౌన్: ఇండి యా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష– 2025లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి లక్కాకుల రిషివంత్ ఉత్తీర్ణత సాధించాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు రిషివంత్కు అభినందలు తెలిపారు. -
భాగ్యరెడ్డి వర్మకు ఘన నివాళి
కామారెడ్డి క్రైం: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జన్మదిన వేడుకలను కలెక్టరేట్లో, జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళితులు, బడుగు వర్గాల హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలను కలెక్టర్, ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారిణి రమ్య, అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వర్షంతో రోడ్లన్నీ జలమయం
బాన్సువాడ/నిజాంసాగర్/నాగిరెడ్డిపేట/లింగంపేట/పెద్దకొడప్గల్ : జిల్లావ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాన్సువాడలో కురిసిన భారీ వర్షానికి ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా భారీగా వర్షపు నీరు నిలిచింది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నీరు చేరడంతో ధాన్యం మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. లింగంపేట మండలంలో కురిసిన వర్షానికి పంట చేనుల్లో మడికట్లు నిండాయి. పెద్దకొడప్గల్ మండలంలో వర్షంతో లోతట్టు ప్రాంతాలన్ని నీటితో నిండిపోయాయి. రోడ్లపై గుంతలలో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఇబ్బందులు పడ్డ వాహనదారులు -
ఏటీసీ సెంటర్ నిర్మాణ పనుల పరిశీలన
ఎల్లారెడ్డి పట్టణ శివారులో టాటా సంస్థ సహకారంతో రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఏటీసీ (అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ) నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్థ సంయుక్త నిర్వహణలో ఎల్లారెడ్డిలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రంలో టాటా సంస్థ సహకారంతో విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. నియోజకవర్గంలో ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ,ఉపాధి కల్పనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తాను చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏటీసీ కేంద్రం మంజూరు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన అన్నారు. -
సెకండియర్ ఎగ్జామ్కు ఏక్నిరంజన్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ద్వితీయ సంవత్సరం పరీక్షను ఒక్కే ఒక్క విద్యార్థి పరీక్ష రాశాడు. అయితే ఇక్కడ ఆరుగురు అధికారులు ఎగ్జామినేషన్ విధులు నిర్వర్తించారు. ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 32మందికి గాను 30మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండీయర్ పరీక్ష కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రాశాడు. అయితే పరీక్ష నిర్వాహాణ కోసం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించారు. -
‘సాగర్’ వరద గేట్ల పరిశీలన
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు వరద గేట్లు వాటి గేర్ బాక్సులను క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ, జిల్లా నీటిపారుదలశాఖ సీఈ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ‘ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!’ శీర్షికన ఈ నెల 19వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును వారు సందర్శించి వరద గేట్లు, గేర్ బాక్స్లు, రోప్ల స్థితిగతులను తెలుసుకున్నారు. 20 గేట్లకు ఒరాలింగ్ పనులతోపాటు మిగతా గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు చేపట్టాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్, క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈ భూమారెడ్డి, ఏఈ శివప్రసాద్ తదితరులు ఉన్నారు. -
రెండో రోజూ దంచికొట్టిన వాన
నర్వ గేటు వద్ద కుండపోతగా కురుస్తున్న వర్షంసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుపాన్ ప్రభావంతో జిల్లా అంతటా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ సారి రుతుపవనాలు ముందుగానే వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి తోడు తుపాన్ ప్రభావం కూడా కలిసిరావడంతో వర్షాలు దంచికొడుతున్నాయి. నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. హసాన్పల్లిలో తడిసిన ధాన్యం మొలకెత్తింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు నిలిచింది. బాన్సువాడ పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ చెరువును తలపించింది. చెరువులను తలపించిన రోడ్లుజిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షాకాలం సీజన్ రాకముందే నాలాలు, డ్రెయినేజీలు శుభ్రం చేయించాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయి చెరవులను తలపించాయి. విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్, నిజాంసాగర్ రోడ్డు, అశోక్నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
ఆపరేషన్ కగార్ హత్యాకాండ
కామారెడ్డి టౌన్: ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండ కొనసాగిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మఢ్ అడవుల్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మందికిపైగా మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారని ఆరోపించారు. శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరిందని, ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరాం నాయక్, కొత్త నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ధనిక రైతుల నియోజకవర్గంగా మారుస్తా
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ధనిక రైతుల నియోజకవర్గంగా మారుస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్రావు అన్నారు. మండలంలోని భూంపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న కాళేశ్వరం ప్యాకేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించానని, పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రిజర్వాయర్ పనులు నిలిపి వేశారని, తాను పలుమార్లు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో చర్చించడంతోపాటు రెండు సార్లు అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించగా తక్షణమే రూ.23 కోట్లు మంజూరయ్యాయని, 14,500 ఎకరాలకు సాగునీరందించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు సూచించినట్లు తెలిపారు. కాటేవాడి, ధర్మారావ్పేట్, మోతె, రిజర్వాయర్ల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. సదాశివనగర్ మండలంలో 24,590 ఎకరాలు, గాంధారి మండలంలో 13,546 ఎకరాలు, రామారెడ్డి మండలంలో 8,664 ఎకరాలు, తాడ్వాయి మండలంలో 20,220 ఎకరాలు, రాజంపేట మండలంలో 2,593 ఎకరాలు, లింగపేట మండలంలో 22,934 ఎకరాలు, ఎల్లారెడ్డి మండలంలో 3,200 ఎకరాలు, నాగిరెడ్డిపేట మండలంలో 3,100 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. నిజామాబాద్ జిల్లా కొండెం చెరువు లింక్ ద్వారా 11.5టీఎంసీల నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా 3వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం తాను స్వయంగా రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామ గ్రామాన బోర్లు తవ్వించి తాగునీటి సౌకర్యం కల్పించానన్నారు. భూంపల్లి రిజర్వాయర్ 22వ ప్యాకేజీకి నిధుల మంజూరులో మాజీమంత్రి షబ్బీర్ అలీ కృషి ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, తాను పలుమార్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసి సమస్యను విన్నవించడంతోనే నిధులు మంజూరు అయినట్లు సమాధానమిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యే దాక పట్టువదలనని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. మూడు నుంచి ఆరు నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, వైస్ ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్రెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బాగయ్య, మాజీ సర్పంచ్ రవీందర్గౌడ్, నవీన్రావు, విండో చైర్మన్ గంగాధర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. గెలిచిన 14 రోజుల్లోనే కాళేశ్వరం పనుల పురోగతిపై సమీక్షించా పనులపై అసెంబ్లీలో రెండుసార్లు ప్రస్తావించాను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పలుమార్లు సమస్యలను విన్నవించా చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు ఇది ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు -
రూ.400 కోట్లు దాటిన బంగారు రుణాలు
సుభాష్నగర్: ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మంజూరు చేసిన బంగారు రుణాలు రూ.400 కోట్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా నిజామాబాద్ నగరంలోని బ్యాంకు ప్రధాన కార్యా లయంలో గురువారం చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. బంగారం రుణాలు రూ.400 కోట్ల మైలురాయి చేరడంలో ప్రతి ఉద్యోగి పాత్ర ఉందని, ఈ ఘనతకు సహకరించిన ఖాతాదారు లు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు తమకు తాముగా లక్ష్యాన్ని ఏర్పర్చుకొని, ఆ దిశగా ప్రయత్నించాలన్నారు. బ్యాంకు ప్రగతిని ఇదే విధంగా కొనసాగించి, రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కన్నా మెరుగైన స్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఈవో నాగభూషణం వందే, జీఎం లింబాద్రి, గజానంద్, సుమమాల, ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి -
భూ భారతి సర్వేను వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): భూ భారతి సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. లింగంపేట తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి సర్వే డెస్క్ను కలెక్టర్ గురువారం పరిశీలించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించామని, 4225 దరఖాస్తులు అందాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో 4100 దరఖాస్తులను పరిశీలించి, సర్వే చేయడం జరిగిందన్నారు. డెస్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. 26న సబ్జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8గంటలకు కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో అండర్–8, 10, 12 అథ్లెటిక్స్ (బాలబాలికల విభాగం) ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 60 మీటర్లు, 200, 300, 600 మీటర్ల స్టాండింగ్ బ్రాడ్జంప్, లాంగ్జంప్, కిడ్స్ జావెలిన్, షాట్పుట్ అంశాల్లో ఎంపికలుంటాయని, పాల్గొనే క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పని సరిగా వెంట తీసుకురావాలని సూచించారు. సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులుకామారెడ్డి టౌన్: సరస్వతి పుష్కరాల సందర్భంగా కామారెడ్డి నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. ప్రతి రోజూ సూపర్ లగ్జరీ బస్సు సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి నుంచి, తిరిగి కాళేశ్వరం నుంచి ఉదయం 6గంటలకు బయలుదేరుతుందన్నారు. పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.180 బస్సు చార్జీలు ఉంటాయని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పదోన్నతి బాధ్యతను పెంచుతుంది కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను మరింత పెంచుతాయని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. ఇటీవల ఎస్సైలుగా పదోన్నతి పొందిన 11 మంది ఏఎస్సైలకు ఎస్పీ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదోన్నతి చిహ్నాలను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాయితీగా, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిబద్దతతో పని చేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, మర్యాదలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు మదన్లాల్, యాకూబ్రెడ్డి, సీఐలు తిరుపతయ్య, సంతోష్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులు, సిబ్బందికి అగ్ని ప్రమాదాలపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటగది సిలిండర్ లీకేజీ ప్రమాదాలను తినే సోడాతో ఆర్పివేయడం, ఆయిల్ ఫైర్లను మూత కప్పడం ద్వారా ఆర్పివేయడం, పిడుగుపాటు సమయంలో పాటించాల్సిన మెలకువలు, వివిధ రకాల అగ్నిప్రమాదాల్లో ఉపయోగించే పరికరాల వాడకంపై జిల్లా ఫైర్ అధికారి సుధాకర్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పైసలిస్తే బకాయి బాధ లేదు
ట్రేడ్ లైసెన్స్ జారీలో ఇష్టారాజ్యం ● జేబులు నింపితే పాత బకాయిలు ఊసే ఉండదు ● పాత దుకాణానికి కొత్త లైసెన్స్ రెడీ ● బల్దియా ఆదాయానికి గండికొడుతున్న సిబ్బందికామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియా అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శానిటేషన్ విభాగంలో ట్రెడ్ లైసెన్స్ జారీలో బల్దియా ఆదాయాన్ని పెంచే సిబ్బంది అక్రమ సంపాదన కోసం ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పైసలిస్తేనే టెడ్ర్ లైసెన్స్లు జారీ చేస్తున్నారని కొందరు, రెన్యువల్ చేయాల్సిన లైసెన్స్లను పట్టించుకోకుండా వాటి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన లైసెన్స్లు జారీ చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా, లక్షకు పైగా జనాభా, 24,484 ఇళ్లు ఉన్నాయి. పట్టణంలో ప్రతి ఏటా 4,800కు పైగా ట్రేడ్లైసెన్స్లు జారీ చేయగా వాటి ద్వారా రూ. 36లక్షల నుంచి రూ.40లక్షల వరకు బల్దియాకు ఆదాయం సమకూరుతోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో నిబంధనల ప్రకారం వ్యాపార దుకాణాల విస్తీర్ణం, కొలతలను నిజాయితీగా తీసుకుని ట్రేడ్ లైసెన్స్లు జారీ చేస్తే మరో రూ.20 లక్షకుపైగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కానీ మున్సిపల్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ట్రేడ్ లైసెన్స్లు జారీ చేస్తున్నారు.భారీగా వసూళ్లు..!లైసెన్స్లు సంబంధించి రెన్యువల్ బకాయిలను వసూలు చేసి బల్దియా ఆదాయాన్ని పెంచాల్సిన సిబ్బంది తమ జేబులు నింపుకుంటున్నారు. పాత లైసెన్స్ల బకాయిలను వసూలు చేయకుండా వాటి స్థానంలో నూతన లైసెన్స్లు జారీ చేస్తున్నారు. గతంలో సానిటేషన్ విభాగంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి అచ్చినకాడిని దండుకుని బదిలీపై వెళ్లిన వారున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఓ అధికారి ట్రేడ్ లైసెన్స్ల జారీలో ఇదే తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు, అలాగే పైస్థాయి అధికారులను భాగస్వాములను చేస్తూ వారికి కూడా డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు విచారణ జరిపితే సానిటేషన్ విభాగంలో భారీ కుంభకోణం గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్ను వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని అడగగా.. విచారణ చేస్తామని, అక్రమవసూళ్లకు పాల్పడినట్లయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
ఇటుక బట్టీలో వలస కార్మికుల గుర్తింపు
కామారెడ్డి రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి ఇటుక బట్టీల్లో పనిచేయించుకుంటున్న యజమానిపై అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం కింద కేసు నమోదైంది. కామారెడ్డి మండలం గూడెం గ్రామ శివారులో మెస్సర్స్ కేకేఎస్ ఇటుక బట్టీపై బుధవారం దాడి చేసినట్లు సహాయ కార్మిక శాఖ కమిషనర్ ఎం కోటేశ్వర్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ఒడిశా వలస కార్మికులు పన్నెండు మందిని బట్టీలో గుర్తించామన్నారు. వారిని విచారించగా తాము సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు పేర్కొన్నారు. అనంతరం యజమానిని విచారించగా కార్మికులను తిరిగి వాళ్ల స్వగ్రామాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు ఇప్పించి కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. దాడిలో సహాయ కార్మిక అధికారి, సయ్యద్ కమ్రుద్దీన్, తహసీల్దార్ జనార్దన్, దేవునిపల్లి ఎస్సై రాజు, బాలల పరిరక్షణ అధికారిని జే స్రవంతి తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్రానికి పంపిన అధికారులు యజమానిపై కేసు నమోదు -
కంబోడియాలో దేవునిపల్లి యువకుడి మృతి
కామారెడ్డి అర్బన్: కంబోడియా రాజధాని నాంఫెన్లో కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్కుమార్ (36) ఈ నెల 14న గుండెపోటుతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం కంబోడియా వెళ్లిన కిరణ్కుమార్ నాంఫెన్లో గుండెపోటుతో మరణించిన విషయం భారతీయ రాయబార కార్యాలయం ద్వారా పోలీసులకు సమాచారం అందించగా వారు సరిగ్గా స్పందించలేదని తెలుస్తుంది. దేవునిపల్లిలోని కిరణ్కుమార్ ఇంటికి పోలీసులు నేరుగా వచ్చి వివరాలు తెలుసుకోకుండా స్టేషన్కు వచ్చి కలవాలని ఫోన్ చేయడంతో సరైనపత్రాలు లేక భయపడిన కుటుంబసభ్యులు మధ్యవర్తుల ద్వారా రెండుమూడు రోజులకు కలిశారు. కాగా, తెలిసిన బంధువుల ద్వారా కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం కౌన్సిలేట్ అబ్రహంతో మాట్లాడగా ఆయన కిరణ్కుమార్ మృతదేహం తరలింపునకు కావాల్సిన పత్రాల ఫార్మేట్ పంపినట్టు చెబుతున్నారు. మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డిల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు పత్రాలు పంపిన తర్వాత శవం ఇంటికి చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కిరణ్కుమార్కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. 14న గుండెపోటుతో మరణం కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం -
రామడుగు ప్రాజెక్టులో పడి యువకుడి మృతి
ధర్పల్లి: మండలంలోని రామడుగు ప్రాజెక్ట్లో స్నానానికి వెళ్లి ఊపిరాడక ఒక యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ (28) స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు బుధవారం మధ్యాహ్నం రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. మొదట స్నానం చేయడానికి రాజశేఖర్ గౌడ్ నీటిలో దూకాడు. ప్రాజెక్టు లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేదు. స్నేహితులు, స్థానికుల సహాయంతో రాజశేఖర్ గౌడ్ను బయటకు తీసుకురాగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సాటాపూర్లో కార్డన్ సెర్చ్ రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామంలో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. నాలుగు ఆటోలు, 80 ద్విచక్ర వాహనాలకు ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మోటారు వాహన నిబంధనలు పాటించాలని సూచించారు. లేనిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీ చేసి 45 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, ఎస్సై చంద్రమోహన్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. బైక్ల చోరీ ఖలీల్వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇంటి ఎదుట పార్క్ చేసిన రెండు బైక్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నగరంలోని షిర్డీ సాయికృపానగర్ కాలనీలో సాదుల్లా శేఖర్ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చే శారు. బోర్గాం సమీపంలోని శ్రామిక్నగర్లో రాము లు ఇంటి ఎదుట బైక్ను పార్కింగ్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
డీఈవో రాజు భిక్కనూరు/దోమకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో రాజు అన్నారు. భిక్కనూరు, దోమకొండ మండలాల్లో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష మండల స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయులు తమ సామర్థ్యాన్ని పెంపోందించుకుని బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవిధంగా కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని డీఈవో రాజు అన్నారు. కార్యక్రమంలో ఏఎంవో వేణుగోపాల్శర్మ, ఎంఈవో రాజ్గంగారెడ్డి, కోర్సు డైరెక్టర్ మాణిక్యశర్మ, ఆర్పీలు శ్రీనివాస్ శర్మ, ఆనంద్రావు, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కంటెయినర్
● డ్రైవర్ మృతి, క్లీనర్కు తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: సాంకేతిక సమస్య తలెత్తడంతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో కంటెయినర్ డ్రైవర్ మృతి చెందగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ బైపాస్కు కొద్ది దూరంలో బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్తాన్కు చెందిన ఓ లోడ్ లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. అదే దారిలో అతివేగంగా వచ్చిన ఓ మహారాష్ట్రకు చెందిన కంటెయినర్.. లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో కంటెయినర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. తీవ్రంగా గాయపడిన కంటెయినర్ డ్రైవర్ సచిన్ జవార్సింగ్(30), క్లీనర్ను కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే డ్రైవర్ సచిన్ జవార్సింగ్ మరణించాడు. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతోనే లారీ రోడ్డుపై ఆగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
అనుమానాస్పదస్థితిలో బాలింత మృతి
ఆర్మూర్టౌన్ : అనుమానాస్పద స్థితిలో ఓ బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన పూజ(27)కు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి చెందిన సాయిలుతో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు రష్మిత ఉండగా, రెండు నెలల క్రితం కొడుకు పుట్టాడు. భర్త సాయిలు నెల రోజుల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. కాగా, మంగళవారం సాయంత్రం ఇంట్లో గొడవ జరగడంతో అత్త నర్సవ్వ, మరిది అశోక్, ఆడపడుచు శైలజ రాత్రి పూజను తీవ్రంగా కొట్టినట్లు కూతురు రష్మిత తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం భర్త సాయిలు, అత్త నర్సవ్వ, ఆడపడుచు శైలజ, మరిది అశోక్ వేధింపులకు గురి చేస్తుండేవారని పూజ కుటుంబీకులు ఆరోపించారు. పూజ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వడ్డెర కాలనీకి చేరుకున్నారు. తమ కూతురును అత్తింటి వారే కొట్టి చంపారని, వారిని తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. దీంతో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. ఉద్రిక్తతల నడుమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అనంతరం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. అత్తింటి వారే కొట్టి చంపేశారని కుటుంబీకుల ఆరోపణ తీవ్ర ఉద్రిక్తత.. భారీ పోలీస్ బందోబస్తు -
వేధింపులు భరించలేక కొడుకును హత్య చేశాడు
ఏఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి క్రైం: జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం నిత్యం వేధించడంతోనే సొంత కొడుకును తండ్రి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మూడు రోజుల క్రితం కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన వడ్ల నిఖిల్ (24) హత్య కేసులో నిందితుడైన తండ్రి భాస్కర్ను రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. లింగాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గతంలో కుమార్తెకు పెళ్లి చేశారు. కొడుకు నిఖిల్ జులాయిగా తిరుగుతుండటంతో ఏడాది క్రితం గల్ఫ్కు పంపారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా తిరిగి వచ్చేశాడు. వచ్చిన నాటి నుంచి గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఏపనీ చేసేవాడు కాదు. పైగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో పలుసార్లు తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. గత ఆదివారం రాత్రి గొడవ జరిగినప్పుడు భాస్కర్ అక్కడే ఉన్న ఓ కర్రతో నిఖిల్ తలపై కొట్టాడు. బలమైన గాయం కావడంతో వెంటనే కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చారు. నిఖిల్ బతికి ఉంటే తమను ప్రశాంతంగా ఉండనివ్వడని భావించిన తండ్రి భాస్కర్ అతడిని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. సోమవారం వేకువజామున రాడ్డుతో మరోసారి నిఖిల్పై దాడి చేశాడు. తీవ్రగాయాలైన నిఖిల్ను ఆస్పత్రికి తీసుకెళ్లగానే చనిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న భాస్కర్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని అభినందించారు. -
ముదిరాజ్లు ఐక్యత చాటాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ముదిరాజ్లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పర్మళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పెద్దమ్మ ఆలయాలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు సీఎం రేవంత్రెడ్డి న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడానికి కార్యచరణ కొనసాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సొసైటీల ఏర్పాటు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్లు సత్తా చాటాలన్నారు. ఎమ్మెల్సీ కోటా నుంచి ముదిరాజ్లకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్వర్యంలో నాయకులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, వెంకట్రాంరెడ్డి, జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు బట్టు విఠల్, మండల అధ్యక్షుడు దాసరి సాయికుమార్, పర్మళ్ల మాజీ సర్పంచ్ బద్ద లక్ష్మయ్య, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్కు ముదిరాజ్ సంఘం నాయకుల స్వాగతం కామారెడ్డి అర్బన్: ముదిరాజ్ జిల్లా సంఘానికి కామారెడ్డిలో కేటాయించిన రెండు ఎకరాల స్థలానికి హద్దులు నిర్ణయించి చూపించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆర్డీవోను కోరారు. బుధవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథిలో ముదిరాజ్ సంఘం నాయకులు పున్న రాజేశ్వర్, గజ్జల బిక్షపతితో పాటు పలువురు నాయకులు బండ ప్రకాష్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్కు స్వాగతం పలికారు. సంఘం నాయకులు బల్ల సత్తయ్య, నిజ్జన రమేష్, బి.విఠల్, నాగరాజు తదితరులున్నారు. ఎమ్మెల్సీ కోటా నుంచి ముదిరాజ్లకు రూ. 10 లక్షలు మంజూరు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పర్మళ్ల పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు -
చెత్తతో నిండిన డ్రెయినేజీలు
బాన్సువాడ : పట్టణంలోని పాత బాన్సువాడ కుర్మ గల్లీలో సీసీ రోడ్డు అపరిశుభ్రంగా మారింది. హరిజనవాడ సమీపంలోని డ్రెయినేజీ చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయింది. ఈ డ్రైనేజీలో కుక్కలు, కోళ్లు పడి చనిపోతున్నాయి.మున్సిపల్ అఽ దికారులు స్పందించి డ్రెయినేజీని,సీసీ రోడ్డును శు భ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు. నేత్రదానం బోధన్: పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డులోని లక్ష్మి అపార్టుమెంట్ నివాసీ ఎన్ రమేశ్(59) బుధవారం మృతి చెందాడు. ఆయన కుటుంబసభ్యులు రమేశ్ నేత్రాలు దానం చేయాలని నిర్ణయించుకొని బోధన్ లయన్స్ కంటి ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ మేరకు మృతుడి రెండు కళ్లను వైద్యులు సేకరించారని లయన్స్ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు పోలవరపు బసవేశ్వర్ రావు తెలిపారు. -
పోక్సో చట్టంపై అవగాహన
బాన్సువాడ: పోక్సో చట్టంపై ఉపాధ్యాయులకు బుధవారం ఎస్సై మోహన్ అవగాహన కల్పించారు. పట్టణంలోని కోన బాన్సువాడ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో వివరించారు. నేరాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. మహిళల కోసం షీటీం అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వర్రావు, షీటీం సభ్యులు అనిల్, సాయిలు తదితరులు ఉన్నారు. సైబర్ నేరాలను పసిగట్టాలి మద్నూర్(జుక్కల్): సైబర్ నేరాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడాలని ఎస్సై విజయ్ కొండ సూచించారు. డోంగ్లీ మండల కేంద్రంలో బుధవారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సైబర్ నేరాలను గుర్తించాలని కుటుంబసభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కారు, ఆటో ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు నస్రుల్లాబాద్ : మండలంలోని దుర్కి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 765డీ రోడ్డుపై బుధవారం దుర్కి నుంచి బాన్సువాడ వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అతి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని పీఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. విద్యుత్ షాక్తో ఆవు మృతిమద్నూర్(జుక్కల్): మండలంలోని కోడిచిర గ్రామశివారులో బుధవారం విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందినట్లు బాధిత రైతు బేతే సంజు తెలిపారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో మేత కోసం వెళ్లిన ఆవుకు తగిలి అక్కడికక్కడే మరణించింది. ఆవు విలువ రూ.35 వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. పేకాడుతున్న నలుగురి అరెస్ట్ మద్నూర్(జుక్కల్): మండలంలోని కోడిచిరలో పేకాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. కోడిచిరలో పేకాడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై బుధవారం దాడి చేసి నలుగురితోపాటు రూ.1,670 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
రామారెడ్డి: విద్యుదాఘాతానికి ఓ రైతు బలైన ఘటన రామారెడ్డి మండలంలోని ఘన్పూర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భుక్య రాజు నాయక్(35) బుధవారం మధ్యాహ్నం పొలంలో విరిగిపోయిన చెట్లను తొలగిస్తుండగా, మంగళవారం కురిసిన వర్షానికి తెగిపడిన విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు నాయక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడికి భార్య వనీత, ఇద్దరు పిల్లలున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వానొచ్చే.. కల్యాణ వేదిక మారే!
పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షం నీరునాగిరెడ్డిపేట: భారీ వర్షం కారణంగా పోచారంలో వివాహ వేదిక మారింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యాదయ్య తన కూతురు వివాహాన్ని బుధవారం జరిపించేందుకు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాట్లు చేసుకున్నాడు. కాగా మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో పాఠశాల ఆవరణలో నీరునిండి చెరువులా మారింది. ఆ నీటిని తొలగించే పరిస్థితి లేకపోవడంతో కల్యాణ వేదికను బంజర గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్కు మార్చాడు. వేదిక మారిన విషయాన్ని యాదయ్య కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకు తెలియజేశారు. -
‘తొలకరి’కి ముందే..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంకా రోహిణి కార్తె రానే లేదు.. ఎండాకాలం పోనేలేదు.. జిల్లాను వరుణుడు పలకరించాడు. మండు వేసవిలో నిండుగా కమ్ముకొచ్చిన కారు మేఘాలు జిల్లా అంతటా విస్తారంగా వర్షించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బుధవారం ఉదయం కూడా వాన దంచికొట్టింది. సాయంత్రం కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. సాధారణంగా జూన్ రెండో వారం దాటిన తర్వాత తొలకరి జల్లులు పలకరిస్తాయి. అయితే అకాల వర్షాలు, తుపాన్లతో మరింత ముందుగా వానలు కురుస్తుండడంతో తొలకరి ముందుగానే వచ్చిందని రైతులు సంతోషపడుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్పై అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముందుగానే కురుస్తున్న వర్షాలతో దుక్కులు సిద్ధం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారం పది రోజులుగా అకాల వర్షాలు కురిసి ఇప్పటికే నేల నానింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో మరింతగా భూమి నానిందని రైతులు అంటున్నారు. కాగా కొన్నిచోట్ల ఇంకా వడ్లు కల్లాల్లోనే ఉన్నాయి. అవి తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు(మి.మీటర్లలో).. నమోదు కేంద్రం వర్షపాతంతాడ్వాయి 40.0 కామారెడ్డి 34.5 ఆర్గొండ 34.3 ఎల్పుగొండ 32.8 ఇసాయిపేట 31.3 రామారెడ్డి 29.5 సదాశివనగర్ 26.0 పెద్దకొడప్గల్ 21.8 రామలక్ష్మణపల్లి 21.8 భిక్కనూరు 20.5 పాత రాజంపేట 19.3 బీర్కూర్ 17.3 నస్రుల్లాబాద్ 16.5 బిచ్కుంద 13.8 బొమ్మన్దేవ్పల్లి 13.5 మేనూరు 13.0 పిట్లం 13.0 బీబీపేట 12.8 డోంగ్లీ 12.0 జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలు సాగు పనులకు సన్నద్ధమవుతున్న రైతులు -
గిరి పుత్రులకు సౌర జల వికాసం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆర్వోఎఫ్ఆర్–2006 యాక్ట్ ద్వారా పోడు పట్టాలు ఇచ్చిన భూములను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పోడుపట్టాలు పొందిన రైతులకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. భూమి అభివృద్ధి, బోరు/బావి తవ్వకం, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు పంటల సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించనున్నారు. ఈ పథకంలో ఏడాదికి కొంత మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులందరికీ సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో ఐదేళ్ల కాలంలో జిల్లాలో 6,492 మంది గిరిజనులకు సంబంధించి 13,346 ఎకరాల భూమికి అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఈ ఏడాది జిల్లాలో 308 మంది రైతులను ఎంపిక చేయనున్నారు. గిరిజన రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా రవాణా అధికారి, జిల్లా హార్టికల్చర్ అధికారి, విద్యుత్ ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, జిల్లా పంచాయతీ అధికారి, రెడ్కో డీఎం తదితరులు సభ్యులుగా ఏర్పాటయ్యే కమిటీ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని పర్యవేక్షించనుంది. మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్గా, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉండి క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక నుంచి పనులు పూర్తయ్యేవరకు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో పోడు పట్టాలు పొందిన రైతులందరి భూముల్లో జలసిరులు కురిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.సమగ్ర అభివృద్ధికి ప్రణాళికదశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు. పోడు పట్టాలు రావడంతో అటవీ శాఖ అధికారుల వేధింపులు చాలావరకు ఆగిపోయాయి. పోడు పట్టాలు పొందిన రైతులను ఆదుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పోడు భూములను అభివృద్ధి చేసి పంటల సాగుకు అనుకూలంగా తయారుచేస్తారు. భూగర్భ జల శాఖ ద్వారా సర్వే నిర్వహించిన అనంతరం బావులు/బోర్లు తవ్విస్తారు. బోర్లకు, బావులకు మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్యానెల్స్ బిగిస్తారు. అనంతరం ఆ భూముల్లో హార్టికల్చర్ పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రైతులను సమాయత్తం చేయనుంది. పోడు పట్టాలు పొందిన రైతులు నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధి సాధించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.పోడు భూముల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక వివరాలు.. సంవత్సరం రైతులు ఎకరాలు 2025–26 308 850 2026–27 1,546 3,124 2027–28 1,546 3,124 2028–29 1,546 3,124 2029–30 1,546 3,124 మొత్తం 6,492 13,346 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన పోడు భూముల అభివృద్ధికి చర్యలు ఐదేళ్ల ప్రణాళిక ఖరారు చేసిన ప్రభుత్వం జిల్లాలో 6,492 మంది రైతులు, 13,346 ఎకరాల భూమి.. ఈ ఏడాది 308 మందికి అవకాశం -
బాన్సువాడలో తిరంగా ర్యాలీ
బాన్సువాడ: మన సైనికుల వీరత్వం, త్యా గాలు ఎనలేనివని మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. సైన్యం పరాక్రమానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం బాన్సువాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాల యం నుంచి పాత అంగడి బజార్, తాడ్కోల్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. జాతీయ జెండాలతో పాటు ఆపరేషన్ సిందూర్ ప్లకార్డులు, మోదీ కటౌట్లతో ర్యాలీతీశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎల్లారెడ్డిరూరల్: జిల్లాలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చీఫ్ సూపరింటెండెంట్లు నిజాం, లక్ష్మణ్సింగ్ తెలిపారు. 29 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆస్పత్రి పరిశీలన బిచ్కుంద: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిచ్కుంద ఆస్పత్రిని వంద పడకలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 26 కోట్లు కేటాయించిందన్నారు. ఆస్పత్రి భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వైద్య విధాన పరిషత్ టెక్నికల్ ఈఈ కుమార్, ఏఈ సాగర్ వచ్చారన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జునప్ప శెట్కార్, నాగ్నాథ్, విఠల్రెడ్డి, డాక్టర్ కాళీదాస్ పాల్గొన్నారు. తాగునీటి కోసం ఆందోళన బాన్సువాడ : పాత బాన్సువాడలోని గూడెంగల్లీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేను రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో అన్ని కాలనీలలో మిషన్ భగరథ నీళ్ల కోసం పైపులు వేశారని, గూడెంగల్లీలో మాత్రం వేయలేదని పేర్కొన్నారు. తాగునీటి సౌక ర్యం కల్పించకపోతే మున్సిపల్ కార్యాల యం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. పాము కాటుతో బాలుడి మృతినస్రుల్లాబాద్: పాము కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. సంగం గ్రామంలో సుజాత, అశోక్ దంపతుల కుమారుడు రిషి కుమార్ బుధవారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. బాలుడి కాలు నుంచి రక్తం కారుతుండడాన్ని గమనించిన తల్లి గాయం అయి ఉంటుందని భావించి పసుపు రాసింది. కొద్ది సేపటి తర్వాత బాబు కళ్లు తేలేయడంతో భయానికి గురయ్యింది. అంతలోనే పాము కనబడడంతో పాము కరిచి ఉండవచ్చన్న అనుమానంతో బాలుడిని బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా సిబ్బంది నిజామాబాద్కు వెళ్లమన్నారు. అప్పటికే శరీరం అంతా విషం వ్యాపించడంతో బాలుడు మృతి చెందాడు. ముగ్గురు కూతుళ్ల తర్వాత ఎంతో కాలానికి కొడుకు పుట్టాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పాము ఇంట్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. -
ఎరువులను అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి క్రైం: ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల బెడద రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి ఎక్కువగా సాగు చేసే జుక్కల్ నియోజకవర్గం పరిధిలో నకిలీ విత్తనాలు రాకుండా టాస్క్ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల 193 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. వాటి వివరాలను సమర్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఈ యేడాది 3 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు జరిగేలా చూడాలన్నారు. ఇందుకుగాను ప్రణాళికలు సిద్దం చేయాలని, నివేదికలు సమర్పించాలని అధికారులను అదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన ఫాంపాండ్స్, నీటి సంరక్షణ పనులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఏడీఏలు, ఏవోలు, హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాల బెడదను అరికట్టాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
చివరి దశకు ధాన్యం సేకరణ
నిజాంసాగర్: యాసంగి సీజన్కు సంబంధించిన వ రిధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకుంటున్నా యి. 317 కేంద్రాలలో కాంటాలు పూర్తయ్యాయి. మరో 129 కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 446 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 66,788 మంది రైతులనుంచి రూ. 815 కోట్ల విలువైన 3.51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించారు. ధాన్యం విక్రయించిన రైతు లకు ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ. 766 కోట్లను రైతులకు అందించినట్లు అధికారులు తెలిపారు. తూకాలు పూర్తి కావడంతో పలు కేంద్రాలను మూసి వేశారు. ప్రస్తుతం 129 కేంద్రాల్లో కాంటాలు కొనసాగుతున్నాయి. మహమ్మద్నగర్, నిజాంసాగ ర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్దకొ డప్గల్, డోంగ్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో వరిధాన్యం కొనుగోళ్లు పూర్తికాలేదు. బోనస్ కోసం..జిల్లాలోని ఆయా కొనుగోలు కేంద్రాల్లో 24,570 మంది రైతులు సన్నరకాలను విక్రయించారు. వీరికి బోనస్ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్న రకం ధాన్యం రాగా.. వాటికి సంబంధించి రైతులకు రూ. 80 కోట్ల బోనస్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 3.54 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు 129 కేంద్రాల్లో కొనసాగుతున్న తూకాలు -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
మాక్లూర్: ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ చేయించేందుకు రూ. 18 వేలు లంచం తీసుకుంటూ గొట్టిముక్కల పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో ఆయన స్వగ్రామం ఆలూర్ మండలం రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 5 ఏళ్లుగా గంగామోహన్ గొట్టిముక్కల పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఇతను పంచాయతీ కార్యదర్శుల సంఘానికి మండల అధ్యక్షుడు కూడా. గొట్టిముక్కల గ్రామానికి చెందిన ముప్పడి రాజేందర్ ఇంటి స్థలం(ప్లాట్) రిజిస్ట్రేషన్ విషయమై పంచాయతీ కార్యదర్శి గంగామోహన్ను సంప్రదించగా అతను రూ. 25 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్య రూ.18 వేలకు ఒప్పందం కుదిరింది. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తానని గంగామోహన్ చెప్పడంతో బాధితుడు రాజేందర్ గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం ముందుగానే గ్రామానికి చేరుకొని బాధితుడికి సూచనలు ఇచ్చి పంపించారు. పకడ్బందీగా వ్యవహరించి గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో గంగామోహన్ బాధితుడు రాజేందర్నుంచి లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంగామోహన్పై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్గౌడ్ తెలిపారు. నిందితుడిని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.18 వేలు లంచం తీసుకుంటూ దొరికిన వైనం రాంచంద్రాపల్లిలోని సొంతింట్లో సోదాలు నాంపల్లి కోర్టుకు తరలింపు -
ఈ వీధి పేరు ‘సిందూర్ స్ట్రీట్’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలోని ఓ వీధికి ‘సిందూర్ స్ట్రీట్’(సిందూర్ వీధి) అని నామకరణం చేశారు. మంగళవారం ఆ వీధికి చెందిన ఇళ్ల యజమానులు సిందూర్ స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ, మన దేశ త్రివిధ దళాలకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఆ వీధి వాసులు తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని నామకరణం చేసి సైనికులకు మద్దతు తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన పోరాట పటిమను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని పేరు పెట్టినట్టు వారు పేర్కొన్నారు. -
రెండు సెల్ఫోన్ల చోరీ.. రెండేళ్ల జైలు
కామారెడ్డి క్రైం : ఓ ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్ట ణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండ్ల రాజు ఇంట్లో 2016 మే 8న వేకువ జము న చోరీ జరిగింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తిని కామారెడ్డి పట్టణానికి చెందిన సద్దుల శంకర్గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కా వడంతో కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి సు ధాకర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమా నా విధించారు. నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.కొనుగోలు కేంద్రాల సందర్శనకామారెడ్డి క్రైం : వర్షాల తో ఆగమవుతున్న రైత న్న అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కామారె డ్డి గంజ్తో పాటు దేవునిపల్లి, లింగాపూర్, అడ్లూర్, చిన్నమల్లారెడ్డి, గర్గుల్లలోని కొనుగోలు కేంద్రాలను డీఎస్వో మల్లికార్జున్ బా బు, అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడు తూ ఆయా కేంద్రాలలో నిరంతరంగా కాంటాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తెలిపారు.‘13,450 యూనిట్లు లక్ష్యం’నాగిరెడ్డిపేట: రాజీవ్ యువ వికాసం ద్వారా జిల్లాలో 13,450 యూనిట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీఆర్డీవో సురేంద ర్ పేర్కొన్నారు. మండల పరిషత్ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. బ్యాంకులకు పంపిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చే శారు. నిత్యం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవో ప్రభాకరచారిని ఆదేశించారు. మండల పరిషత్ సిబ్బందికి ఐకేపీ సీసీలు సహకరించేలా చూడాలని ఏపీఎం జగదీశ్కు సూచించారు. అనంతరం వివిధ బ్యాంకులకు వెళ్లి రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయా లని మేనేజర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి 41,547 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 12,624 దరఖాస్తులను బ్యాంకర్లు పరిశీలించారని పేర్కొన్నారు. మిగతావాటి పరిశీలన ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేస్తామన్నారు.కామారెడ్డి ఆర్ట్స్ కళాశాలకు మరో పీజీ కోర్సుకామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మరో పీజీ కోర్సు మంజూరయ్యింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పీజీ కోర్సును ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. 60 సీట్లతో పీజీ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ కోర్సును మంజూరు చేస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కళాశాలలో మొత్తం 12 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ దోస్త్ ప్రవేశాలపై సందేహాలుంటే నేరుగా కళాశాలలో గానీ 94416 21456, 91823 04067 నంబర్లలోగాని సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.పదోన్నతి పొందినవారికి జిల్లాల కేటాయింపుకామారెడ్డి క్రైం: ఎస్సైలుగా పదోన్నతి పొంది శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎస్సైలకు జిల్లాలను కేటాయిస్తూ ఉన్నతాధికారులు మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన పదకొండు మంది ఉన్నారు. జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన లచ్చీరాం, సిద్దిఖీ, సాదు లింబాద్రి, పి.గణేష్, ఉమేష్, మల్లారెడ్డి, సుబ్రహ్మణ్య చారి, సంజీవ్, నర్సింలు, రాములు, హన్మాగౌడ్లను సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కేటాయించారు. -
ఏ రోడ్డు చూసినా..
వర్షాలు కురిసినపుడల్లా పట్టణంలోని ప్రధాన రోడ్లు చెరవులను తలపిస్తుంటాయి. సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, అశోక్నగర్ రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. అప్పుడప్పుడు బల్దియా ద్వారా నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అలాగే పట్టణంలో పలు కాలనీలలో డ్రెయినేజీలు కబ్జాకు గురయ్యాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు పోయేందుకు దారి లేక నీరంతా రోడ్లపై నిలిచిపోతూ ఇళ్లలోకి చేరుతోంది. వర్షపు నీరు సులువుగా వెళ్లేలా డ్రెయినేజీలు నిర్మించినా చాలాచోట్ల వాటిని ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ కబ్జాకు గురై నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో ప్రధానోపాధ్యాయులు కీలకపాత్ర వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు నూతన బోధన పద్ధతులపై అవగాహన పెంచుకుంటూ మిగతా ఉపాధ్యాయులను దిశానిర్దేశం చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి గంగాకిషన్, ఏసీజీఈ బలరాం, పరీక్షల కార్యదర్శి లింగం తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదా రులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డు సైలా నీబాబా కాలనీలో జరీనా బేగంకు మంజూరైన ఇంటి నిర్మాణానికి మార్కవుట్ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి దశల వారీగా బిల్లులు వ స్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వనిత, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్