breaking news
Kamareddy
-
ఒకటే గది.. తరగతులు ఐదు
పెద్దకొడప్గల్ : కుబ్యానాయక్ తండాలోని ప్రాథమి క పాఠశాలలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. బడిలో ఒకటే గది ఉంది. ఈ భవనం కూడా శిథిలా వస్థకు చేరింది. ఆఫీస్ రూంతోపాటు ఐదు తరగతు లకు ఇదే గది దిక్కు. కాగా గతేడాది వరకు ఈ బడి లో 39 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఉ పాధ్యాయులు బడిబాటలో భాగంగా ఇంటింటికి వె ళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధిస్తామని, విద్యార్థుల్లో మార్పు రాకపోతే మళ్లీ ప్రైవేట్ పాఠశాలకే పంపించుకోండని చెప్పారు. దీంతో తండావాసులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తుండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య 70కి చేరింది. ప్ర స్తుతం మొదటి తరగతిలో 15 మంది విద్యార్థులుండగా.. రెండో తరగతిలో 19 మంది, మూడో తరగతిలో 14 మంది, నాలుగో తరగతిలో 8 మంది, ఐ దో తరగతిలో 14 మంది విద్యార్థులున్నారు. గదుల కొరతతో ఇబ్బంది.. పాఠశాలలో 70 మంది విద్యార్థులుండగా.. ఒక్క గది మాత్రమే ఉంది. దీంతో ఆ గదిలోనే ఐదు తరగతుల పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. దీంతో కొంతమందిని చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. అలాగే బడిలో ఉపాధ్యాయుల కొరత ఉంది. 60 మందికన్నా ఎక్కువ విద్యార్థులుంటే నిబంధనల ప్రకారం ముగ్గురు టీచర్లు ఉండాలి. విద్యార్థులకు సరిపడా తరగది గదులు నిర్మించాలని, మరో టీచర్ను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం కుబ్యానాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటే గది ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి, తరగతి గదుల మంజూరు కోసం కృషి చేస్తాం. ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగినందున మరో టీచర్ను కేటాయించే ఏర్పాట్లు చేస్తాం. – ప్రవీణ్ కుమార్, ఎంఈవోపాఠశాల ఆవరణలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఐదు తరగతుల్లో 70 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఉన్నది ఇద్దరు టీచర్లే.. చదువుకోవడానికి ఉన్నది ఒకే ఒక్కగది. దీంతో కొంతమందిని గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతుండగా.. మరికొందరికి చెట్టు కింద బోధిస్తున్నారు. 70 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు చెట్ల కింద బోధన.. కుబ్యానాయక్ తండా బడిలో ఇదీ పరిస్థితి అదనపు గదులు నిర్మించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు -
వసతుల కల్పన నా బాధ్యత
నస్రుల్లాబాద్: పాఠశాలలో వసతులను కల్పించడం నా బాధ్యత .. చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నెమ్లి గ్రామంలో సోమవారం పీఎంశ్రీ పాఠశాలలో రూ.40.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రజలకు విద్య, వైద్యం చేరువ అవ్వాలనే పని చేస్తున్నానన్నారు. ప్రత విద్యార్థి ఉన్నతంగా చదవాలంటే సౌకర్యాలు ఉండాలన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు చదవడానికి అదనపు గదులను నిర్మించామన్నారు. ఎడ్యుకేషన్ అనేది గేమ్ చేంజర్: సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో గేమ్ చేంజర్ అని బాన్సువాడ సబ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. ఉన్నతంగా చదివుతేనే జీవితంలో విజయం సాధిస్తామన్నారు. అరకొర వసతుల మధ్య విద్యను చదువుకున్న రోజుల్లోనే ఎంతో మంది తమ జీవితాలను మార్చుకున్నారని కాని ప్రభుత్వం ప్రస్తుతం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వాటిని ఉపయోగించుని ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ సువర్ణ, ఎంఈవో చందర్ నాయక్, ఎంపీడీవో సూర్యకాంత్, ఏఎంసీ చైర్మన్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అదనపు తరగతి గదుల ప్రారంభం -
సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్/రాజంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నేడు నిర్వహించే లంబాడ హక్కుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) విజయోత్సవ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి గుగ్లోత్ వినోద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎల్హెచ్పీఎస్ 28 ఏళ్లు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, నేతలు శంకర్, రూప్సింగ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ తదితరులున్నారు. -
అంధకారంలో పట్టణం
సిరిసిల్లరోడ్లో వెలగని లైట్లుకామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో వీధీ దీపాలు, ప్రధాన రోడ్లపై సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో కొన్ని కాలనీల్లో సాయంత్రం కాగానే చీకట్లు అలుమకుంటున్నాయి. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లపైనా పలుచోట్ల వీధిదీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్కు బకాయిలను చెల్లించకపోవడంతో నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాది దాటినా.. కామారెడ్డి బల్దియాలో 500లకుపైగా కాలనీలున్నా యి. లక్షకుపైగా జనం నివసిస్తున్నారు. పట్టణంలో ప్రధాన రోడ్లపై డివైడర్లలో ఏర్పాటు చేసిన 890 విద్యుత్ దీపాల నిర్వహణ బల్దియానే చూసుకుంటుంది. కాలనీలలో 12,434 వీధి దీపాలు ఉండగా వీటి నిర్వహణ బాధ్యతను ఈఎస్ఎన్ అనే కంపెనీ కి టెండర్ ద్వారా అప్పగించారు. ప్రతినెలా వీటి ని ర్వహణకు రూ. 10 లక్షలకుపైగా కంపెనీకి చెల్లించా ల్సి ఉంటుంది. అయితే మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ. 3.40 కోట్లకు చేరాయి. బకాయిల భారం పెరగడంతో కాంట్రాక్ట్ పొందిన సంస్థ వీధిదీపాల నిర్వహణను గాలికి వదిలేసింది. పాడైపోయినవాటి స్థానంలో నూతన దీ పాలను కొనుగోలు చేయకపోవడంతో చాలా కాలనీలలో వీధిదీపాలు వెలగక రాత్రి వేళలో అంధకా రం అలుముకుంటోంది. శివారు కాలనీలలో పరిస్థి తి మరింత దారుణంగా ఉంది.సమస్య పరిష్కరిస్తాం పట్టణంలో వీధి దీపాల నిర్వహణ కంపెనీకి బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలో చెల్లిస్తాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమస్యను నివేదిస్తున్నాం. త్వరలో నూతన విద్యుత్ దీపాలను కొనుగోలు చేస్తాం. సమస్య ఉన్న కాలనీలలో వాటిని బిగిస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి సెంట్రల్ డివైడర్లలోనూ.. ప్రధాన రోడ్లపై సెంట్రల్ డివైడర్లలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను బల్దియా చూసుకుంటోంది. అయితే నిర్వహణను బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంతో హౌజింగ్బోర్డు, మున్సిపల్ కార్యాలయం ముందు, రైల్వే బ్రిడ్జి, సిరిసిల్లరోడ్, స్టేషన్రోడ్, టేక్రియాల్ రోడ్, దేవునిపల్లి రోడ్లలో చాలావరకు లైట్లు వెలగడం లేదు. దీంతో పట్టణంలోని చాలాచోట్ల రాత్రి వేళలో చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. అధ్వానంగా వీధి దీపాల నిర్వహణ ఏడాదినుంచి బల్బుల కొరత.. కాలనీల్లో వెలగని లైట్లు పట్టించుకోని అధికారులు -
సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టే
మాచారెడ్డి: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టేనని మాచారెడ్డి ఎస్సై అనిల్ అన్నారు. సోమవారం పాల్వంచ మండలం వాడిలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతర్జిల్లా దొంగల ముఠా రిమాండ్● 12 తులాల బంగారం, బైక్ స్వాధీనం వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను రిమాండ్కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్ పీఎస్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్సింగ్, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్, నిజామాబాద్, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు అనిల్కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సమియుద్దీన్ను అభినందించారు. -
పట్టు సాగుకు ముందుకు రావాలి
బీబీపేట: పట్టు పరిశ్రమ ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి జ్యోతి సూచించారు. సోమవారం యాడారంలో మల్బరీ మొక్కల మెగా వనమహోత్సవం నిర్వహించారు. గ్రామానికి చెందిన నవీన్రావు పది ఎకరాల్లో మల్బరీ సాగుకు ముందుకు రావడంతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 120 ఎకరాలలో మల్బరీ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి సంతోషిరాణి, సెరికల్చర్ అధికారి అయిలయ్య, అసిస్టెంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బోధన్రూరల్: మండలంలోని బండార్పల్లికి చెందిన సాయికుమార్(28) చేపల వేటకు వెళ్లి ప్రవమాదవశాత్తు వల చుట్టుకుని నీటి మునిగి మృతిచెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అర్గుల్లో ఒకరి అదృశ్యంజక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్లో నివాసముంటున్న లింగంపేట గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు జక్రాన్పల్లిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. అశోక్ తండ్రి ప్రభురాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోచంపాడ్లో పిచ్చికుక్కల స్వైర విహారం బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటంనిజామాబాద్ రూరల్: కంఠేశ్వర్ బైపాస్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరిఫ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నీవు లేని జీవితం నాకొద్దని..
వర్ని: ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతుని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఎరుకల పోశెట్టి(25) వడ్డేపల్లిలో ఉండే తన బంధువుల ఇంట్లో చిన్న నాటి నుంచి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అనితను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని పోశెట్టి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య -
‘అప్పు తీరినా.. సబ్సిడీ మంజూరు కాలేదు’
కామారెడ్డి అర్బన్: మూడేళ్ల క్రితం బ్యాంకు రుణం ద్వారా ట్రాక్టర్ను కొనుగోలు చేయగా పరిశ్రమల శాఖ ద్వారా రావాల్సిన సబ్సిడీ ఇంకా విడుదల కాలేదని కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామస్తుడు కుర్మకులానికి చెందిన దివ్యాంగుడు దొంతల శివరాజు వాపోయారు. 2022లో దాదాపు రూ.12 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, భూమి దున్నడానికి అవసరమయ్యే నాగళ్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేయగా.. పరిశ్రమల శాఖ ద్వారా రూ.3లక్షల 9వేల 750 లు సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వి.లాలు.. 2022లో సబ్సిడీ ఉత్తర్వులు ఇచ్చారు. ట్రాక్టర్పై కామారెడ్డి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం వాయిదాలు చెల్లించినప్పటికి పరిశ్రమల శాఖ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ కోసం రూ.30 వేలు మధ్యవర్తులకు ఖర్చు చేశానని దొంతల శివరాజు వాపోయాడు. -
దరఖాస్తుల గడువు పొడగింపు
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించడానికి ఈనెల 5వరకు గడువు పొడిగించినట్టు జిల్లా సంక్షేమాధికారి ఏ.ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయం పొందాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈగా మోహన్ కామారెడ్డి క్రైం: రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పి.మోహన్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ ఈఈగా పని చేసిన రవిశంకర్ పదోన్నతిపై రంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. బాన్సువాడ డిప్యూటీ ఈఈగా పనిచేసిన మోహన్.. కామారెడ్డి ఈఈగా పదోన్నతిపై వచ్చారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
జుక్కల్ అభివృద్ధే నా మొదటి ధ్యేయం
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే నా మొదటి ధ్యేయమని దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. డోంగ్లీ మండలంలోని ఇలేగావ్ నుంచి మదన్హిప్పర్గా వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు చాంద్ పటేల్, నాగేశ్ పటేల్, యూనుస్ పటేల్, బండు పటేల్, నాయకులు, కార్యకర్తలున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం బిచ్కుంద(జుక్కల్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండి ఒకొక్క హామీ నెరవేర్చుతున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మెక్కా గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి బీటీ రోడ్డు కోసం మెక్కా ప్రజలు ఎదురుచూస్తున్నారు నేటితో వారి కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ పటేల్, విఠల్రెడ్డి, నాగ్నాథ్, వెంకట్రెడ్డి, సయ్యద్ మసూద్, గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ పనుల పరిశీలన బిచ్కుందలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రెండు వైపులా డ్రైనేజి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను సూచించారు. చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ నిజాంసాగర్(జుక్కల్): చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటా మొక్కలు నాటి కాపాడాలన్నారు. కాంగ్రెస్ నేతలు రమేష్ దేశాయ్, సాయాగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు -
ధరణి నిండా సమస్యలే!
● సర్కారు టౌన్షిప్లో ప్లాట్లు విక్రయించి రెండున్నరేళ్లు ● ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించని ప్రభుత్వం ● మోసపోయామంటున్న ప్లాట్లు కొనుగోలు చేసినవారు ● సౌకర్యాలు కల్పించాలని వినతి కామారెడ్డి అర్బన్ : ధరణి టౌన్షిప్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, జనాలను ఆకర్షించి ప్లాట్లు విక్రయించిన పాలకులు.. ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయాయి. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2009 సంవత్సరంలో కామారెడ్డిలోని44న నంబర్ జాతీయ రహదారి పక్కన రాజీవ్ స్వగృహ ఏర్పాటు చేశారు. ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో అడ్లూర్ శివారు 501/3 సర్వే నంబర్లో 50.29 ఎకరాల విస్తీర్ణంలో 40 అడుగుల ప్రధాన రోడ్లు, 30 అడుగుల అంతర్గత రోడ్లతో వివిధ పరిమాణాల్లో మొత్తం 543 ప్లాట్లు చేశారు. 313 ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 230 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం అప్పట్లో అసక్తిగలవారినుంచి డీడీలు తీసుకున్నారు. అయితే రాజశేఖరరెడ్డి మరణానంతరం ఇళ్ల నిర్మాణం మరుగున పడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అప్పట్లో రాజీవ్ స్వగృహలో ఇళ్ల కోసం డీడీలు చెల్లించినవారికి మూడేళ్ల క్రితం డబ్బులు వాపస్ ఇచ్చారు. రాజీవ్ స్వగృహను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్లాట్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, అడవిలా మారింది. అందమైన బ్రోచర్లు ముద్రించి.. గత ప్రభుత్వం వృథాగా ఉన్న రాజీవ్ స్వగృహను 2022లో కాస్త అభివృద్ధి చేసి ధరణి టౌన్షిప్గా పేరు మార్చింది. అందమైన బ్రోచర్ ముద్రించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఐదు విడతల్లో ప్లాట్లను విక్రయించింది. సర్కారే ఎలాంటి హామీ లేకుండా ప్లాట్ల మార్టిగేజ్తో కెనరా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించింది. టౌన్షిప్లోని ప్లాట్లను వేలం వేయడం ద్వారా సర్కారుకు సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వేలం వేసిన తర్వాత టౌన్షిప్ను నిర్లక్ష్యం చేసింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన చెందుతున్నారు. అందమైన బ్రోచర్లు, హామీలతో సర్కారు మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ధరణి టౌన్షిప్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇటీవల టౌన్షిప్ బాధితులు సమావేశమై వెంచర్ వరకు ర్యాలీ తీశారు. సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టౌన్షిప్ అభివృద్ధికి దాదాపు రూ. 14 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారని, సర్కారు వెంటనే నిధులు మంజూరు చేయాలని ‘ధరణి’ బాధితుల సంఘం ప్రతినిధి రాజనర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. టౌన్షిఫ్లో ఇంకా 14 ఎకరాలు ఖాళీగా ఉందని, అభివృద్ధి చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరో రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయని, దీనిని పరిశీలించాలని కోరారు. -
‘యూరియా కొరత పేరుతో దోచుకుంటున్నారు’
గాంధారి: యూరియా కొరత పేరుతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి ఆరోపించారు. సోమవారం బీకేఎస్ నాయకులు మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. ఎరువుల నిల్వల గురించి తెలుసుకున్నారు. యూరియా బస్తాతోపాటు ఇతర రసాయనాలను అంటగడుతున్నారని రైతులు ఆరోపించారు. లేదంటే యూరియా లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్ కార్యదర్శులు శంకర్రావు, రావుసాహెబ్రావు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దని, మండలంలో యూ రియా కొరత లేదని ఏవో రాజలింగం తెలిపారు. యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. నా నో యూరియా పిచికారి చేస్తే ఖర్చు తగ్గడమే కాకుండా భూమి సారవంతం అవుతుందన్నారు. వ్యాపారులు యూరియా బస్తాలతో పాటు ఇతర రసాయనాలు ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, తని ఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 141 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత సమస్యలు, ఇబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో తీసుకున్న చర్యల సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియపరచాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
పల్లెల్లో సందడి
రిజర్వేషన్లపై ఉత్కంఠమంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లెల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మూ డు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయ త్నాలు చేస్తున్నారు. జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4,656 వార్డులు ఉన్నాయి. పంచాయతీల్లో 6,51,422 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,13,280 మంది పురుషులు, 3,38,126 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లిపోయాయి. అప్పట్లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశించినవారు.. ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుండడంతో నీరుగారిపోయా రు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో పంచాయ తీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ప్ర భుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతుండడంతో ఈసారి ఎన్నికలు జరుగుతాయన్న భావనలో ఉన్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఆశావహులు బలాన్ని, బలగాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. ముఖ్యంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈసారి ఎక్కువ మంది పోటీపడే అవకాశాలున్నాయి. పాత వారే కాకుండా కొత్త తరం కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు కొందరు అప్పుడే ఖర్చులూ మొదలుపెట్టారు. కుల సంఘాలు, యువజన సంఘాల మ ద్దతు కూడగట్టుకుంటున్నారు. మహిళల ఓట్లపైనా కన్నేసి వారి మద్దతు సంపాదించే ప్రయత్నాలు చే స్తున్నారు. ఇప్పటి నుంచే అందరినీ మేనేజ్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో భూముల క్రయవిక్రయాల తో నాలుగు డబ్బులు సంపాదించిన వారే ఎక్కువ గా ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ఖర్చు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. న్యూస్రీల్ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు వేడెక్కుతున్న రాజకీయాలు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం కులగణన కూడా నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి న బిల్లుపై స్పష్టత లేదు. ఎ న్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కో ర్టు ఆదేశాల నేపథ్యంలో గ తంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకా రమే ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.యంత్రాంగం రెడీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను గతంలోనే పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు చేయించడంతో పాటు రంగులు వేయించారు. ఓటరు తుది జాబితాలు రెడీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ షురూ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. -
‘బాల్య వివాహాలు చేయొద్దు’
మాచారెడ్డి : బాల్య వివాహాలు చేయొద్దని జి ల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి. నాగరాణి సూచించారు. సోమవారం గజ్యానాయక్ తండా చౌరస్తాలో న్యాయసేవాధికా రి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టం, పిల్లల సంరక్షణ, బ్యాంకు రుణాలు, ఉచిత న్యాయ సలహాలపై అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో మాచారెడ్డి, గ జ్యానాయక్ తండా పంచాయతీ కార్యదర్శు లు ఆస్మా బేగం, జీవన్, న్యాయసేవాధికార సంస్థ సభ్యుడు ఖాన్ ఉన్నారు. జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు కామారెడ్డి క్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలాఖరు వరకు జిల్లాలో 30, 30 (ఏ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లే కుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధ ర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ని బంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. రేపు జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో బుధవా రం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇస్కా న్ కామారెడ్డి ఇన్చార్జి వెంకటదాస్ తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ ఆలయంలో రథయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ యాత్ర విద్యానగర్ కాలనీ లోని పాత సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమై సిరిసిల్ల రోడ్లోని శ్రీ కన్యకా ప రమేశ్వరి ఆలయం వద్ద ముగుస్తుందని పే ర్కొన్నారు. యాత్రలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు. పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కామారెడ్డి టౌన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఈవో రాజు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నేత ప్రసాద్ రూ. 25వేల విలువైన 56 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అందించారు. అనంతరం దాతను సన్మానించారు. చేపల వేట నిషిద్ధం నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తున్నా మని ఎఫ్డీవో డోలిసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల ప్రసవ కాలం కావడంతో మత్స్యకారు లు చేపలను వేటాడవద్దని సూచించారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి టౌన్: నిజాంసాగర్లోని నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 29లోపు http://navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కారులో వచ్చి.. హిజ్రాల ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: కారులో వచ్చిన దుండగులు తాళం వేసి ఉన్న హిజ్రాల ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. వారు శనివారం రాత్రి సెకండ్షో సినిమాకు వెళ్లారు. 10.45 గంటల ప్రాంతంలో హిజ్రాల ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హిజ్రాలు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. చోరీకి పాల్పడిన దుండగులు ఓ కారులో వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లో దాచి ఉంచిన 7 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. -
మన విశ్వాసం.. సంప్రదాయం.. పసుపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతీయులకు శుభప్రదమైన పసుపు మసాలా కాదని.. మన విశ్వాసం, సంప్రదాయమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్షా అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం ప్రారభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూరు రైతుల పోరాటం గుర్తించి, రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదే జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డికి చైర్మన్ పీఠం ఇచ్చామన్నారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుతో నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. మంగళదాయకమైన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్గా పనిచేసే పసుపును భారతీయులు వేల ఏళ్లుగా వంటల్లో వాడుతున్నారన్నారు. పాశ్చాత్యులు మాత్రం క్యాప్సుల్స్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. బోర్డు ద్వారా రైతులే అంతర్జాతీయ ఎగుమతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ సంస్థలను నెలకొల్పిందని, నిజామాబాద్లో ఈ సంస్థల శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. 2030కల్లా అంతర్జాతీయ స్థాయిలో బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగు మతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క), ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర కోఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాస మేణుగోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇందూర్లో భారత్ ఆర్గానిక్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బ్రాంచ్ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం.. లోగో ఆవిష్కరణ సమావేశంలో అమిత్షా -
ముగిసిన తొలివిడత పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న పాలిసెట్ తొలిదశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఈ విషయాన్ని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. మూడు రోజుల్లో 416 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థులు ఒకటో తేదీలోగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. నాలుగో తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, శ్రీలత, అఫ్రీన్ ఫాతిమా, పవన్కుమార్, నాగరాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జీగా ఐకే రెడ్డి భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, రామేశ్వర్పల్లికి చెందిన బద్దం ఇంద్రకరణ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆధిష్టానం ఆదివారం నియామకపు ఉత్తర్వులను జారీచేసింది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. 3న గురు పూజోత్సవం కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని సత్య కన్వెన్షన్లో మూడో తేదీన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ కొత్తోల్ల శివరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మొలకలతో కళకళ మద్నూర్: మండలంలో ముందస్తుగా కురిసిన వర్షాలతో ఆయా పంటల విత్తనాలు వేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో మొలకలు వస్తున్నాయి. దీంతో భూమి పచ్చగా కళకళలాడుతోంది. ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో సోయాబీన్, పత్తి, కంది, పెసర, మినుము పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు పేర్కొంటున్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం సంద ర్భంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి తెలిపారు. ఆలయంలో ఆదివారం గ్రామస్తులతో ఆయన సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఏటా నిర్వహించినట్లుగానే ఈసారి కూడా వైభవంగా బోనాల జాతర నిర్వహించాలని తీర్మానించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ, వ్యాపార సంబంధిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రభు, ఆలయ ప్రధాన అర్చకులు శరత్ శర్మ, ధర్మకర్తలు ఎల్లం, రమేష్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
భిక్కనూరు/సదాశివనగర్: సదాశివనగర్ మండలం కల్వరాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల రాంచంద్రం (48) మృతి చెందాడు. రాంచంద్రం నిజామాబాద్లోని తన కుమార్తె ఇంటికి బోనాల పండుగకు వెళ్లి తిరిగి భిక్కనూరుకు వస్తుండగా కల్వరాల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రాంచంద్రం అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.పశువుల కాపరి మృతదేహం లభ్యంమాక్లూర్: చెరువులోకి చొరబడిన గేదెలను బయటకు తీసే క్రమంలో శనివారం సాయంత్రం గుత్ప చెరువులో ప్రమాదవశాత్తు మునిగి గల్లంతైన పశువుల కాపరి బాబన్న (60) మృతదేహాం ఆదివారం లభించింది. మాక్లూర్ పోలీసుల కఽథనం మేరకు వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాబన్న అతని భార్య కలిసి గ్రామస్తులందరి గేదెలను కూలీ లెక్కన మేపుతారు. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం గేదెలను గ్రామంలోనికి తెచ్చే ముందు నీరు తాగించేందుకు సమీపంలో ఉన్న చెరువులోనికి దించాడు. అవి ఎంతకూ బయటికి రాకపోవటంతో బాబన్న చెరువులోనికి దిగి వాటిని బయటకు తీసే క్రమంలో మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న మాక్లూర్ పోలీసులు శనివారం సాయంత్రం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం బాబన్న శవం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లైన్మన్పై దాడి.. పోలీసులకు ఫిర్యాదురెంజల్(బోధన్): విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని రెంజల్ లైన్మన్ శ్రీనివాస్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆదేశాల మేరకు సాటాపూర్ గ్రామంలో కరెంట్ బిల్లులను వసూలు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన మన్మథ స్వామి, మన్మథ మహేశ్ అనే వ్యక్తులు దురుసుగా మాట్లాడుతూ చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. రెంజల్ శివారులోని వారి పొలంలో అక్రమంగా స్తంభాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ను వినియోగిస్తుండటంతో ఏఈ ఆదేశాల మేరకు కరెంట్ కనెక్షన్ తొలగించినట్లు తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకొని తనపై దాడి చేసి గాయపర్చారని పేర్కొన్నారు. పొలంలోకి దూసుకెళ్లిన కారుబోధన్: పట్టణ శివారు నుంచి రాయ్కూ ర్ గ్రామానికి వెళ్లే మార్గంలో ఆదివారం స్థానిక కర్నె రాజశేఖర్ అనే రైతు వరి నాటు వేసిన పొలంలోకి కారు దూసుకెళ్లిందని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఏడుగురు వ్యక్తులు ఆకతాయి చేష్టలు చేస్తూ అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో కారు పంట పొలంలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. వరి పంటకు నష్టం జరిగిందని రైతు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
రైతులంతా బీజేపీ వెంటే
తెలంగాణ రైతులంతా బీజేపీ వెంటే ఉన్నారు. పసుపు ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. అలాంటి పసుపు పంటపై ఇక్కడి ప్రాంత రైతులు ఆధారపడి ఉన్నారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నుంచి నక్సల్ ముక్త్ భారత్ వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ చూపిన తెగువను ప్రపంచ దేశా లు అభినందిస్తున్నాయి. ఉగ్ర వాదుల అంతం కోసం కేంద్రం చేస్తున్న కృషి ఎనలేనిది. పసు పు రైతులపై ప్రేమతోనే జిల్లా రైతు బిడ్డను జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎంపిక చేశారు. – అర్వింద్ ధర్మపురి, ఎంపీ -
దశాబ్దాల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
సాక్షి నెట్వర్క్: చిన్ననాటి మిత్రులందరూ దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పది, ఏడో తరగతుల పూర్వ విద్యా ర్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించా రు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. పాల్వంచ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు బడి అభివృద్ధి కోసం సుమారు రూ.77వేలు అందజేశారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన స్నేహితులు -
పసుపు రాజధాని
నిజామాబాద్ ఇక ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతిబీజేపీకి అధికారం ఇవ్వండి రాష్ట్రంలో అందరికీ అవకాశం ఇచ్చారు.. బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా ప్రజలు గొప్ప వారు.. కొట్లాడి పసుపు బోర్డును సాధించుకున్నారు. ఇందూరు రైతుల పోరాటం మామూలుది కాదు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ధర్మపురి అర్వింద్ కాస్త పసుపు అర్వింద్ అయ్యారు. రైతును రాజు చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కారు నినాదం. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన అమిత్ షాకు అందరం నిల్చొని చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నాం. (సభాప్రాంగణంలోని వారంతా నిల్చుని చప్పట్లు కొట్టారు.) – బండి సంజయ్, కేంద్ర సహాయమంత్రి ● పంటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ● పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం నా అదృష్టం ● రైతులకు ఇచ్చిన హామీని మోదీ నెరవేర్చారు ● జిల్లాలో రీసెర్చ్ సెంటర్లు.. ● ఆర్గానిక్ పసుపు ఉత్పత్తి, మార్కెటింగ్కు ప్రభుత్వ కృషి ● రైతు సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుభాష్నగర్: నిజామాబాద్ పసుపు రాజధానిగా కాబోతోందని, ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే పసుపు ఎగుమతి అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రైతు సమ్మేళనం బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. రైతు సమ్మేళనంలో షా ప్రసంగం సాగిందిలా.. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. ఇందూరు రైతుల పోరాటం, ఎంపీ అర్వింద్ రైతులకు ఇచ్చిన హామీమేరకు మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. బోర్డు ఏర్పాటుతో రాబోయే రెండుమూడేళ్లలో ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఏళ్లుగా రైతులు పసుపు సాగు చేస్తున్నా.. మార్కెట్లో అనుకున్న ధర, గుర్తింపు రాలేదని.. ఇక నుంచి ధర పెరుగుతూనే ఉంటుందన్నారు. జిల్లాలో పసుపు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, బోర్డు ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ బ్రాంచ్ను, భారత్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితోపాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది క్వింటాల్ పసుపు ధర రూ.19వే లు పలికిందని.. రానున్న మూడేళ్లలో రూ.7వేలు అదనం అవుతుందని పేర్కొన్నారు. రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చేసి ఇక్కడి ప్రజలకు గుర్తింపు ఇచ్చామని అన్నారు. సభలో ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.రైతు పక్షపాతి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నా రు. రైతు ఉద్యమాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డును ప్రకటించి వారి కలను సా కారం చేసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పసుపు సాగవు తున్నా.. ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ప్ర ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిజామా బాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏ ర్పాటు చేశారు. కేంద్రంరై తు పక్షపాతి. గతంలో వి ద్యుత్ కోతలతో పంటలు ఎండు ముఖం పట్టేవి. ప దేళ్ల బీజేపీ పాలనలో వి ద్యుత్ కోతలు లేని భారత్ ను నిర్మించాం. సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ డబ్బులు ఇస్తు న్నారు. అయినా రైతాంగానికి మోదీ ఏం చేస్తున్నారని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీ ఆర్ ఇలాగే ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు. – కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్షా
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ రూ.44 లక్షల వ్యయంతో 14 అడుగుల డీఎస్ కాంస్య వి గ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్తోపాటు కుటుంబ సభ్యులు, రాజ్య సభ్యుడు లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రతినిధుల నివాళులు డీఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నుడా చై ర్మన్ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీఎస్ సోదరుడు ధర్మపురి సురేందర్, మా జీ జెడ్పీటీసీ పుప్పాల శోభ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. డీఎస్ అభిమానులు, నాయకులు విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకున్నారు. -
స్నేహానికి షష్టి పూర్తి
నార్కట్పల్లి: స్నేహానికి షష్టి పూర్తి.. మరువలేని అనుభూతి అని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్రెడ్డి 1965లో నిజామాబాద్లోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఆయన క్లాస్మెట్. పదో తరగతి పూర్తి చేసి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు పోచారం శ్రీనివాస్రెడ్డి, మరికొందరు మిత్రులు ఆదివారం శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పెళ్లికి షష్టి పూర్తి, వయసుకు షష్టిపూర్తి ఉంటాయని, స్నేహానికి షష్టి పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
స్థానిక సమరానికి సిద్ధం కావాలి
మాచారెడ్డి: బీఆర్ఎస్ యూత్ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధ కావాలని బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ సోషల్ మీడియా, యూత్ వింగ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. నాయకులు రామ్మూర్తిగౌడ్, లస్కర్నాయక్, దేవరాజు తదితరులున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మాచారెడ్డి: పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై అనిల్ సూచించారు. పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఉంటే పోలీసులు ఉన్నట్టేనన్నారు. గ్రామస్తులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టర్పై ఫిర్యాదు బాన్సువాడ రూరల్: కాంట్రాక్టర్ చిన్న రాంపూర్ మజీద్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మజీద్ వద్ద షట్టర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేశారని, కాంట్రాక్టర్ సగం పనులు చేసి వదిలేశారని ఆరోపించారు. మిగిలిన పనులను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ అక్బర్, గ్రామస్తులు షేక్ అజీమ్, అజీజ్, మహిమూద్, నజీర్, అస్లాం, అఫ్రోజ్, ఇల్యాస్, సజ్జద్, మంజూర్, ఇర్షాద్ జావిద్ తదితరులు పాల్గొన్నారు. హద్దు స్తంభాల ధ్వంసం భిక్కనూరు: మండల కేంద్రంలోని వీడీసీకి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన హద్దు స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం వేకువజామున ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అఖిల పక్షం నేతలు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మాజీ సర్పంచ్ తున్కి వేణు, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు తదితరులు ఉన్నారు. -
ముందుకు సాగని ఫార్మర్ రిజిస్ట్రీ
● అవగాహన లోపంతో ముందుకురాని రైతులు ● ఆపై సాంకేతిక సమస్యలు.. ● జిల్లాలో ఇప్పటి వరకు 35 శాతమే నమోదుత్వరలో పూర్తి చేస్తాం.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ న మోదు జరుగుతోంది. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. త్వ రలోనే ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తాం. రైతులు స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను నేరుగా సంప్రదించి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – తిరుమల ప్రసాద్, డీఏవోకామారెడ్డి క్రైం : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. రెండునెలలు కావస్తున్నా జిల్లాలో 35 శాతం మాత్రమే నమోదు పూర్తయ్యింది. రైతుల గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మ ర్ రిజిస్ట్రీని తీసుకువచ్చింది. గతనెల 5వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రైతు నుంచి వివ రాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం ద్వా రా ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 నంబర్లతో కూడిన ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేస్తారు. జి ల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. 23 మండలాల పరిధిలో 104 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఒక ఏఈవో ఉన్నారు. మే 5 న జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు ల పంట పొలాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, భూమి విస్తీర్ణం, భూమి రకం, పండిస్తున్న పంటలు, ఆధార్ నంబర్తో లింక్ అయిన రై తు మొబైల్ నంబరు తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత రైతుకు 11 నంబర్లు గల డిజిటల్ ఫార్మర్ ఐడీ జారీ అవుతుంది. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ కీలకం కానుందని భావిస్తున్నారు. అ యితే ఫార్మర్ రిజిస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పని ఒత్తిడిలో అధికారులు రైతు భరోసా, పంటల నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర పనుల్లో ఇప్పటికే వ్యవసాయ అధికారులు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో క్షేత్ర స్ధాయిలో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయాల్సి రావడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లిన సమయాల్లో నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్ మొరాయించడం లాంటివి జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పలువురు రైతుల వద్ద ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతున్నారు. రైతులు నేరుగా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించి తమ వివరాలు ఇవ్వడం ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సైడ్లైట్స్..
సుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవం, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ, కిసాన్ సమ్మేళనం బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఆయన పర్యటన సైడ్లైట్స్.. ● 2.30 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. ● 2.45 గంటలకు బోర్డు కార్యాలయంలో ప సుపు రైతులతో ముఖాముఖి, పసుపు పంట ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. ● 3.28 నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ. ● 3.35 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ వేదికపైకి చేరుకున్నారు. వేదికపైకి రాగానే పసుపు రైతులు, ప్రజలకు అభివాదం చేశారు. ● 3.50 గంటలకు అమిత్ షా ప్రసంగం ప్రా రంభించి, 18 నిమిషాల్లో ముగించారు. ● ప్రసంగం మధ్యలో పసుపు బోర్డు ప్రకటన, జిల్లా కేంద్రంలో జాతీయ కార్యాలయం ఏర్పాటుపై ప్రజలందరూ నిల్చొని కరతాళధ్వనులతో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపాలని కోరడంతో.. ప్రజలు, రైతులు ఆయనను అనుకరించారు. ● భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరాం అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు. ● అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి శాలువా, జ్ఞాపికతో అమిత్ షాను సత్కరించారు. ● కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు, రైతులు ఈలలు, కేకలు వేశారు. -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలం లింబూర్ గ్రామానికి చెందిన కిస్వే సంజయ్(45) శనివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబూర్కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని పుణె నగరంలో కుటుంబసభ్యులతో కలిసి కూలీ పని చేసేవాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సంజయ్.. చికిత్స కోసం చాలా ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం సొంతూరికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు. కడుపునొప్పి తీవ్రం కావడంతో శనివారం లింబూర్ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ..ఖలీల్వాడి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ఎస్సై చెప్పిన ప్రకారం.. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్ శివతేజ(19) శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్లి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మృతుడు నగరంలోని తిలక్గార్డెన్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లోని అశోక్ టీ పాయింట్లో పని చేసేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు
రామారెడ్డి: వర్షాకాలం వచ్చినా వానదేవుడు కరుణించడం లేదు. దీంతో చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతోపాటు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోరుబావులు ఎత్తిపోతున్నాయి. నారుమడికి నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కొందరు రైతులు ట్యాంకర్తో నారుమడిని తడుపుతుంటే, మరికొందరు నీటి బిందలు చేతపట్టి నారు మడిని కాపాడుకునే యత్నం చేస్తున్నారు. వానదేవుడు కనికరించి సకాలంలో వర్షాలు కురిస్తేనే వ్యవసాయ పనులు ముందుకు సాగుతాయని రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. అధికారులను సంప్రదించేదెలా? నస్రుల్లాబాద్: మండలంలోని విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారి నెల రోజులు గడుస్తున్నా, సంబంధిత కార్యాలయంలోని బోర్డుపై ఇంకా పాత నంబర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో కార్యాలయనికి వచ్చిన ప్రజలు అధికారుల పాత నంబర్లకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు నంబర్లను మార్చకుండా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో అధికారుల నూతన నంబర్లను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్షాపుల తనిఖీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు చిట్యాల గ్రామంలోని రేషన్ దుకాణా లను శనివారం సివిల్ సప్లయ్ డీసీఎస్వో మల్లికార్జున బాబు తనిఖీ చేశారు. షాపులకు సంబందించిన స్టాక్ బియ్యం, రికార్డులను పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి ఇంకొక జిల్లాకు ఆధార్ కార్డుల చిరునామాలు మారినట్లయితే ఒక్క దగ్గరనే బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో రెండు ఆధార్ కార్డులు ఉన్న వాటిని గుర్తించి, వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించినట్లు తెలిపారు. డీటీ సురేష్కుమార్, రేషన్ షాపుల డీలర్లు ప్రమీల, సవిత, లబ్ధిదారులు ఉన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక మాచారెడ్డి: మండలంలోని గజ్యా నాయక్ తండా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోనె శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా గుడ్ల నరేష్, కోశాధికారిగా అల్లె బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా గోనె చంద్రమౌళి, కార్యదర్శిగా గోనె ఆంజనేయులు, సలహాదారులుగా గాజుల శ్రీధర్, గోనె సత్యనారాయణ, తుమ్మ రాజేశం, అల్లె రాజేశం, ఇప్పలపల్లి శ్యామ్, ఈరబత్తిని ప్రసాద్, గుండ్లపల్లి నరేష్, గోనె సురేష్ ఎన్నికయ్యారు. -
నేడు ఇందూరుకు అమిత్ షా
సుభాష్నగర్: జిల్లా కేంద్రానికి నేడు (ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్, సీపీ సహా పసుపు బోర్డు అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ఎంపీ అర్వింద్ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం బీజేపీ శ్రేణులు, రైతు సంఘాలతో చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటనను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలతోపాటు నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులను తరలించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా పసుపు రైతులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు సమ్మేళన కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకవేళ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బైపాస్ చౌరస్తాలో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ విగ్రహావిష్కరణ.. పాలిటెక్నిక్ మైదానంలో కిసాన్ సమ్మేళన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పర్యటన షెడ్యూల్.. అహ్మదాబాద్(గుజరాత్) ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం బయల్దేరి హైదరాబాద్లోని బేగంపేట్కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీక్యాప్టర్ ద్వారా జిల్లాకేంద్రానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం బస్వాగార్డెన్లో పసుపు బోర్డు అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభాప్రాంగణం నుంచి హెలీప్యాడ్ వద్దకు బయల్దేరుతారు. -
అంగన్వాడీలకు ఫోన్లు అందేదెప్పుడు?
ఎల్లారెడ్డి: అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు కార్యకర్తలకు అధునాతనమైన ఆండ్రాయిడ్ ఫోన్లను 5జీ సౌకర్యంతో అందజేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలో ప్రకటించింది. ఈక్రమంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును పైఅధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు యాప్లను ప్రవేశ పెట్టారు. అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఆన్లైన్ నమోదుతో ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి, నూతన ఫోన్లను అందిస్తామని మంత్రి ప్రకటన చేయడంతో ఇక్కట్లు తీరుతాయని భావించారు. కానీ ఇంతవరకు ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేయక పోవడంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 1193 అంగన్వాడీ కేంద్రాలు.. కామారెడ్డి జిల్లాలో 1193 అంగన్వాడి కేంద్రాలు ప నిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 30,846, 3నుంచి 6ఏళ్ల వయస్సు గల చిన్నారులు 20,502 మంది ఉన్నా రు. అంతేగాక ఈ కేంద్రాల పరిధిలో 6,388 గర్భిణులు, 5,957 మంది బాలింతలకు పలు రకాల సే వలు అందజేస్తున్నారు. పూర్వ ప్రాథమిక కేంద్రాలు గా ఆధునీకరించిన ఈ అంగన్వాడీ కేంద్రాల సేవ లను డిజిటలైజేషన్ చేసి అనుక్షణం పైఅధికారుల పర్యవేక్షణ చేసేందుకు పలు యాప్లను ప్రభుత్వం ఏర్పరిచింది. కానీ అంగన్వాడీ సిబ్బందిలో చాలామంది పాత ఫోన్లను వాడటంతో అప్డేట్ కాకపోవడంతో యాప్లో వివరాల నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పలువురు కార్యకర్తలు అంటున్నారు. ఎవరో కొద్దిమంది వద్ద తప్ప మిగితా అందరి వద్ద అధునాతన ఫోన్లు లేకపోవడంతో నమోదు ప్రక్రి య ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. చాలీచాలని జీతాన్ని పొందుతున్న తమకు వేలకు వేలుపోసి అధునాతన ఫోన్లను కొనడం ఎలా సాధ్యపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రకటించినట్లు నూతన ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంగన్వాడీలు కోరుతున్నారు. వివరాల నమోదు కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నెలలు గడుస్తున్నా జాడలేని ప్రభుత్వ హామీ పాత ఫోన్లతో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది -
క్యూసెక్కు, టీఎంసీ అంటే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్కుల వరద నీరు, టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటారు. అసలు క్యూసెక్కు, టీఎంసీ అనే పదాల పూర్తి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ● క్యూసెక్కు అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్(క్యూసెక్). ఒక సెకను కాలంలో 28 లీటర్లు నీరు వచ్చి చేరడం, లేదా విడుదలవ్వడం. ● క్యూసెక్కును ప్రాజెక్ట్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలో వినియోగిస్తారు. ● టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (శత కోటి ఘనపుటడుగులు) అని అర్థం. ● ఒక్క టీఎంసీకి 2831 కోట్ల లీటర్ల నీరు. ● ప్రాజెక్ట్లోకి వచ్చే నీటిని, వదిలిన నీటికి క్యూసెక్కుల్లో తెలుపుతారు. పూర్తి నీటి నిల్వ, నీటి విడుదలను టీఎంసీల్లో చూపుతారు. ● వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు ఒక టీఎంసీ అవుతుంది. ● 2300 ఎకరాల్లో ఒక్క అడుగు నీరు నిల్వ ఉంటే టీఎంసీకీ సమానం. – బాల్కొండ మీకు తెలుసా? -
సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి
భిక్కనూరు: విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను సకాలంలో అందజేయాలని టీజీవీపీ నేతలు కోరారు. ఈమేరకు వారు శనివారం భిక్కనూరు తహసీల్దార్ సునితకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్, నేతలు సమీర్, యోగేష్, నరేందర్ పాల్గొన్నారు. జిల్లా కోర్టు జీపీగా శ్యామ్గోపాల్రావు కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కోర్టులకు గవర్నమెంట్ ప్లీడర్(జీపీ)గా సీనియర్ న్యాయవాది కావేటి శ్యామ్గోపాల్రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. పట్టణానికి చెందిన ఆయన 1994 నుంచి న్యాయవాదిగా, సివిల్, క్రిమినల్ కేసులను వాధిస్తూ ఇక్కడ పని చేస్తున్నాడు. ఆయన నియామకంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్లో నాలుగు కేసుల పరిష్కారం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పలు కారణాల వల్ల విడాకులకు సిద్ధమైన జంటలకు డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. యువత పెడదారి పట్టొద్దు రామారెడ్డి: యువత డ్రగ్స్, గంజాయి వంటివి సేవించి పెడదారి పట్టొద్దని ఎస్సై రాజారాం అన్నారు. రామారెడ్డి హైస్కూల్లో శనివారం పోలీస్ కళాబృందం సైబర్ క్రైం షీటీమ్స్ పని తీరుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. షీటీమ్స్ సహాయం కోసం 8712686094ను సంప్రదించాలని విద్యార్థినులు, ఉపాధ్యాయినులకు సూచించారు. హెచ్ఎం ఆనంద్, ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం, తిరుపతి, శేషారావు పాల్గొన్నారు. -
పాఠశాలల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): పాఠశాలల పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఎంఈవో షౌకత్అలీ అన్నారు. లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన మండలంలోని ప్రభుత్వ బడుల హెచ్ఎంలకు ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య యూడైస్ ప్లస్లో నమోదు చేయాలన్నారు. అలాగే విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, ఏకరూప దుస్తువులు, మధ్యాహ్న భోజనం బిల్స్, పాఠశాలల నిధులు, ఉపాధ్యాయుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఐఎస్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. -
పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదు
లింగంపేట: పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రాంబాయి తెలిపారు. దీంతో శనివారం తండాలో వైద్య శిబిరం నిర్వహించి, తండావాసులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందించారు. ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. తండాలో పిచ్చిమొక్కలు, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. డెంగీ బాధితురాలికి లింగంపేట ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో వైద్య చికిత్సలు అందిస్తున్న ట్లు వైద్యురాలు తెలిపారు. వైద్య శిబిరంలో ఎంపీవో మలహరి, కార్యదర్శి రాజ్యలక్ష్మి, వైద్య సిబ్బంది యాదగిరి, ఫరీదా, రాధిక, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ‘విద్యుత్ సమస్యలుంటే తెలపండి’ కామారెడ్డి టౌన్ : జిల్లాలో పంట పొలాల ప రిధిలో విద్యుత్ సమస్యలపై రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ శనివా రం ఒక ప్రకటనలో సూచించారు. వదులు గా, తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు తక్కువ ఎత్తులో ఉ న్నా, స్తంభాలు వంగిపోయినా తక్షణమే సె క్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్, గ్రామ స్థాయిలో ఉండే లైన్మన్లకు తెలియజేయాలని కోరారు. భారీ వర్షాలు, గాలి దు మారాల వల్ల విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే స్థానిక ఏఈలకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటిలోకి వచ్చే స ర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల మీదుగా వెళ్లకుండ చూసూకోవాలని పేర్కొన్నారు. రెతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రత ప్రమాణాలు పాటించాలని, ఏ సమస్య తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎలుగుబంట్ల సంచారంతో గాలింపు చర్యలు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం సోమరేగడి తండా శివారులో ఎలుగుబంట్లు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులోని పొలాల వద్ద రెండు ఎలుగుబంటి పిల్లలు తరచూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎలుగుబంట్లు కనిపించలేదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామ శివారులో బోన్లను ఏర్పాటు చేసి ఎలుగుబంట్లను పట్టుకోవాలని గ్రామస్తులు కోరారు. ‘అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి’ భిక్కనూరు: యువత దేశం గర్వించేలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. శనివారం భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, మొబైల్ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, ఎన్వైకే ఉమ్మడి జిల్లా అధికారి శైలి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు అంజయ్య, హరిత, అధ్యాపకులు రాజేశ్వరి, లలిత, సబిత, మోహన్బాబు, యాలాద్రి, నరసయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ శనివారం వారు అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డుపై చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నూతన రోడ్డు వేయాలని కోరారు. మాజీ కౌన్సిలర్ అర్కల ప్రభాకర్యాదవ్, జగదీష్యాదవ్, శ్రీనివాస్, రాజే్ష్, మల్లేష్ తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ట్రయథ్లాన్ అండర్–14, 12, 10 బాలబాలికలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో 250 మందికిపైగా ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 19 మందిని ఆయా అంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు. వీరు వచ్చేనెల 6న హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలలో పాల్గొననున్నారు. ఎంపికై ంది వీరే.. డి.యోగి, ఎన్.శాన్విత్రెడ్డి, బి.శ్రీవల్లిక, జె.ఈశ్వర్, పి.అశ్విని, ఎ.అర్చన, ఎం.రాణాప్రతాప్, సీహెచ్.నిహారిక, ఎన్.దేవీదాస్, ఎం.కృష్ణమూర్తి, ఎం.రాంచరణ్, ఎన్.పండరి, ఎస్కె.జోయ, డి.గీతమ్, కె.సింధు, వి.శ్రీగణేష్, కె.కార్తికేయ, డి.విహాన్రెడ్డి, డి.ధనశ్రీ. -
● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్ ప్రాంతం ● పండుగలు, శుభకార్యాలలో టోపీ తప్పనిసరి
బిచ్కుంద వర్షాల కోసం భజన చేస్తున్న భక్తులు(ఫైల్)సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. దీంతో జుక్కల్, పెద్దకొడప్గల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని చాలా గ్రామాల ప్రజలు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ ప్రాంతం భిన్న సంస్కృతుల నిలయం. చాలా మంది తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడతారు. ఈ ప్రాంత ప్రజలు సంప్రదాయాలకు విలువ ఇస్తారు. కట్టు, బొట్టు ఆకట్టుకునేలా ఉంటాయి. మహిళలు చీర గోచీ కట్టుకుని, కొంగును తలపై కప్పుకుంటారు. పురుషులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అలాగే టోపీలు పెట్టుకుంటారు. వాటిని వార్కారీ టోపీలని, గాంధీ టోపీలని వ్యవహరిస్తారు. జుక్కల్ ప్రాంతంలో చాలా గ్రామాల్లో విఠలేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఏటా పండరిపూర్కు పాదయాత్రగా వెళుతుంటారు. అందరూ టోపీ ధరించి ఆలయాల దర్శనానికి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ సప్తాహాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. వారం రోజులపాటు భజనలు సాగుతుంటాయి. ఆయా కార్యక్రమాలలో తప్పనిసరిగా వార్కారీ టోపీ ఉంటుంది. శాకాహార భోజనానికే ప్రాధాన్యం.. చాలా ప్రాంతాల్లో పండుగల సందర్భంగా మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తుంటారు. కానీ జుక్కల్ ప్రాంతం అందుకు భిన్నం. ఇక్కడ పండుగల సందర్భంగా శాకాహార భోజనాలే ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలోనూ శాకాహారమే వడ్డిస్తారు. కొద్ది మంది మాత్రమే మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఇళ్లల్లో కూడా చాలామంది మాంసాహారం వండుకోరు. పాత తరం వారైతే మాంసం ముట్టరు.నిత్యం ధరించే వారెందరో.. జుక్కల్ ప్రాంతంలో కొంతమంది నిత్యం టోపీ ధరిస్తారు. పొద్దున స్నానం చేయగానే సంప్రదాయంగా పూజలు చేస్తారు. నుదుట బొట్టు తప్పనిసరి పెట్టుకుంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా టోపీ ధరించి వెళ్లేవారు చాలా మంది కనిపిస్తారు. పండుగల సందర్భంగా దాదాపు అందరూ టోపీ ధరించి కనబడుతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ టోపీలు పెట్టుకుంటారు. క్వాలిటీని బట్టి రూ. 10 నుంచి రూ. వంద వరకు వివిధ ధరల్లో ఈ టోపీలు లభిస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో బంధుమితులను టోపీలతో సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ కట్టు, బొట్టు, ఆహార్యం అన్నీ భిన్నమే.. ప్రత్యేక రోజులలో మహిళలు చాలా వరకు చీర గోచీతో దర్శనమిస్తారు. కొంగును తలపై కప్పుకుంటారు. నుదుట పెద్ద బొట్టు ధరిస్తారు. పురుషులు తెల్లని ధోతీ, తెల్లటి చొక్కాతోపాటు తలపై టోపీ పెట్టుకుని కనిపిస్తారు. నిత్యం టోపీ ధరించడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. జుక్కల్ ప్రాంతంలో టోపీ ధారణపై సండే స్పెషల్.. -
‘రాజ్యాంగమే బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో’
కామారెడ్డి అర్బన్: భారత రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా కలిగిన ఏకై క పార్టీ బీఎస్పీ అని పార్టీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఎస్పీ జిల్లా కార్యాలయలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ హాజరయ్యారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కోసం బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా పరుశరామ్ను నియమించారు. జిల్లా అధ్యక్షుడు మా లోత్ హరిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, రోహిత్దాస్, నత్తి జీవన్, ప్రవీణ్, ప్రభాకర్ దాస్, సంతోష్, మనోహర్ పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మండలంలోని మాచారెడ్డి, చుక్కాపూర్, ఎల్లంపేట, సోమారంపేట, గజ్యానాయక్ తండా గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. తన సొంత నిధులతో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నాయకులు బూస సురేష్, పొన్నాల వెంకట్ రెడ్డి, పుట్టకొక్కుల నర్సింలు, పండ్ల ప్రవీణ్, భరత్, కృష్ణగౌడ్, కళ్యాణ్, రవి పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు
నిజాంసాగర్(జుక్కల్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మహమ్మద్ నగర్ ఏవో నవ్య అన్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో శనివారం ఆయిల్ పామ్ సాగుపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత తక్కువగా ఉన్న భూస్వాములు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. వరి, ఆరుతడి పంటలకు దీటుగా ఆయిల్ పామ్ ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. గున్కుల్ సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, గంగారాం, భూమాగౌడ్, అంజయ్య, పెద్దసాయాగౌడ్, ఏఈవో మదుసూధన్, పంచాయతీ కార్యదర్శి బలరాముడు, కారోబార్ ప్రభాకర్ ఉన్నారు. -
కాలేజీల అభివృద్ధికి నిధులు
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా 16 జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లు మంజూరయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన బీబీపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బీర్కూర్ కళాశాలలకు మాత్రం నిధులు మంజూరు కాలేదు. మంజూరైన నిధులతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్, నీటి సరఫరా, ప్లంబింగ్ తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాకు ఈ స్థాయిలో నిధులు మంజూరవడం ఇదే తొలిసారి. ఈ నిధులతో పంచాయతీరాజ్ శాఖతో పనులు చేయించనున్నారు. సమస్యలను పరిష్కరిస్తాం జిల్లాలోని జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. వీటితో అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తాం. నెలరోజుల్లో పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. – షేక్ సలాం, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి, కామారెడ్డి కళాశాలల వారీగా నిధుల వివరాలు.. (రూ. లక్షలలో) కళాశాల మంజూరైన నిధులు బిచ్కుంద 43.00 మద్నూర్ 36.50 ఎల్లారెడ్డి 27.00 గాంధారి 22.00 మాచారెడ్డి 22.00 జుక్కల్ 21.00 పిట్లం 21.00 దోమకొండ 21.00 భిక్కనూరు 20.00 లింగంపేట 18.00 సదాశివనగర్ 16.00 బాన్సువాడ 16.50(బాయ్స్) కామారెడ్డి 15.00 తాడ్వాయి 10.50 రామారెడ్డి 13.00 బాన్సువాడ 06.00గర్ల్స్ మౌలిక వసతులు, మరమ్మతుల కోసం.. జిల్లాకు రూ. 3.28 కోట్లు మంజూరు -
అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ పట్టివేత
సిరికొండ: సిరికొండ అటవీ రేంజ్ తూంపల్లి సెక్షన్ గుడిలింగాపూర్ తూర్పు బీట్ పరిధిలో అటవీభూమిని దున్నుతున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రేంజర్ రవీందర్ తెలిపారు. గుడిలింగాపూర్కు చెందిన మలావత్ మంగికి చెందిన ట్రాక్టర్ను సీజ్ చేసి సిరికొండ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమంగా దున్నడం నేరమని ట్రాక్టర్ యజమానికి గతంలో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులను బేఖాతరు చేస్తూ అటవీ భూమిని దున్నుతుండటంతో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. దాడిలో డిప్యూటీ రేంజర్ గంగారం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు నాగేశ్, రీజేందర్, నవీన్, హరీశ్ పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల బారులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా ఎరువుల కోసం శనివారం రైతులు బారులు తీరారు. గోదాంకు యూరియా ఎరువుల లారీలు వచ్చాయని తెలియగానే ఉదయం నుంచే సొసైటీ పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు వచ్చి క్యూలో నిల్చొని యూరియా ఎరువులను తీసుకున్నారు. ప్రస్త్తుం మొక్కజొన్న, పత్తి, సోయ పంటలకు ఎరువులు వేసే సమయం వచ్చిందని రైతులు తెలిపారు. ఏఈవో శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికీ 9666 సంచుల యూరియా ఎరువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. -
స్కూటీ, బైక్ ఢీ..
● నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మూడో ప్లాట్ఫామ్ రోడ్డుపై శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నిలిచే మూడో నెంబరు ప్లాట్ఫాం వెంబడి కోర్టు రోడ్డు నుంచి అశోక్నగర్ వరకు వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును నిర్మించారు. కొంతకాలంగా ఈ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇదే దారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వేగంగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్నాయి. రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన శ్రీధర్, మురారి, బొంతల లెనిన్, లోకేశ్గా గుర్తించారు. వారిలో లెనిన్, లోకేశ్లు మైనర్లుగా తెలుస్తోంది. శ్రీధర్, మురారిల కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఐకేపీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, గ్రామాల్లో ఐకేపీ ద్వారా చేపట్టనున్న వివిధ కార్యక్రమాల్లో మరింత ప్రగతి సాధించాలని అదనపు జిల్లా గ్రామీణాధివృద్ధి అధికారి విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. మండల సమాఖ్య అధ్యక్షులు బెస్త శాంత, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహానికి స్థలం కేటాయించండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో మున్నూరు కాపు బాలబాలికల కోసం కావలసిన వసతి గృహానికి రెండు ఎకరాల స్థలము కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మున్నూరు కాపు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్రావు కోరారు. శుక్రవారం ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హాస్టల్కు స్థలం, భవన నిర్మాణానికి కావాల్సి నిధులు మంజూరు చేయించాలని కోరారు. జూలై 2న జగన్నాథ రథయాత్ర కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో జూలై 2న మధ్యాహ్నం 2 గంటలకు 3వ జగన్నాథ రథయాత్ర ఉత్సవం నిర్వహించనున్నట్టు స్థానిక ప్రతినిధి వెంకటదాస్ ప్రభు తెలిపారు. జగన్నాథ రథోత్సవం సాయిబాబా ఆలయం చౌరస్తా నుంచి జీవదాన్ మీదుగా సిరిసిల్లరోడ్డు శ్రీకన్యాక పరమేర్వరి ఆలయం వరకు కొనసాగుతుందని, సాయంత్రం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమానికి బరోడా ఇస్కాన్ అధ్యక్షుడు వాసుగోష్ ప్రభు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వంద రోజుల కార్యాచరణ అమలు బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బాన్సువాడలో వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మురికి కాలువల్లో దోమల మందు పిచికారీ చేయించారు. అనంతరం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, సిబ్బంది హన్మండ్లు, సతీష్, లక్ష్మణ్, సురేందర్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: మే డ్చల్ జిల్లా దుండిగల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రూరల్ మండలం కేశాపూర్కు చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. బాలుడి పై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ మండలం కేశాపూర్కు చెందిన గుడిపల్లి రాజ్కుమార్ నిహారిక భార్యాభర్తలు. వీరు మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట్లో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి అభిమాన్షు(6) కుమారుడు, ఓ పాప ఉన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం తన తల్లి నిహారికతో కలిసి ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో పల్లవి స్కూల్ జంక్షన్ దగ్గరికి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ స్కూటీని తాకింది. దీంతో బాలుడు స్కూటీపై నుంచి టిప్పర్ చక్రాల కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయనంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. దీంతో బాధిత కు టుంబ సభ్యులు స్వగ్రామమైన కేశాపూర్లో సా యంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి తల్లితండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటితడి పెట్టించింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఘటన -
వసతి గృహం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రం భవానీనగర్లోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూవో) సతీష్ యాదవ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి నవీన్ పాల్గొన్నారు. సదాశివనగర్లో గ్రంథాలయం.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న నెలవారి మేగజైన్లు, వార్తా పత్రికలు, పుస్తకాల గురించి ఆరా తీశారు. నిరుద్యోగులకు స్టడీ కుర్చీలను తెప్పించాలని కోరారు. సంబంధిత వివరాలను జిల్లా కార్యాలయానికి పంపించాలని గ్రంథపాలకుడు శ్రీనివాస్కు సూచించారు. సమ్మె నోటీసు అందజేత కామారెడ్డి టౌన్: జులై 9న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మె నోటీసును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డికి అందజేశారు. సమ్మెలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు అయాజ్బేగ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, కార్మికులు పాల్గొన్నారు. తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం బాన్సువాడ: బాన్సువాడ నుంచి తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం సరితాదేవి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, ఘనగపూర్, వేములవాడ, మెదక్ చర్చి, రహమాతాబాద్ దర్గా తదితర ప్రాంతాలకు బస్సు సర్సీసు అందుబాటులో ఉంటాయన్నారు. డీలక్స్ బస్సులో కనీసం 35 సీట్లు బుక్ చేయాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని సూచించారు. -
రైతు వేదిక.. భారం కాదిక
ఎల్లారెడ్డి: ప్రారంభించిన నాటి నుంచి నిర్వహణకు ఎలాంటి నిధులు మంజూరు కాక, వ్యవసాయ శాఖకు గుదిబండలుగా మారిన రైతు వేదికల దశ తిరగనుంది. రైతు వేదికలపై సోలార్ ప్లాంటులను ఏర్పాటు చేసి వాటికి సాలీనా రూ.25 వేల వార్షికాదాయం వచ్చేలా ప్రభుత్వం పథక రచన చేయనుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వ్యవసాయ అధికారులు తక్షణం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ఏర్పాటుకు నడుం కట్టింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా గుర్తించి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో ఈ క్రమంలో 104 రైతు వేదికలను నిర్మించారు. రైతు వేదికల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కోసం ఒకే ఒక మారు నిధులు మంజూరైనట్లు తెలిసింది. నాటి నుంచి నేటి వరకు నిర్వహణ నిధులు రాక రైతు వేదికలు వ్యవసాయ విస్తరణాధికారులకు(ఏఈవో) భారంగా మారాయి. రైతు వేదికల నిర్వహణలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విద్యుత్ బిల్లుల చెల్లింపులు. నిర్వహణ నిధులు రాకపోవడంతో రైతు వేదికలలో ఏళ్ల తరబడి విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం పథకం కోసం రైతు వేదికల విద్యుత్ బకాయిల చెల్లింపునకు కొద్దో గొప్పో నిధులు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. రైతు వేదికల నిర్వహణ ఖర్చులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వాటికి సోలార్ ప్లాంటులను అమర్చి స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన కింద రైతు వేదికలతో పాటు మార్కెట్యార్డులు, రైతు బజార్లలోనూ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది యంత్రాంగం. ప్రతి రైతు వేదికపై 5 కిలో వాట్ల సోలార్ ప్లాంట్ అమర్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సోలార్ యూనిట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్లో వేదిక అవసరాలకు వాడుకుని మిగితా విద్యుత్ను విద్యుత్శాఖకు అమ్ముకుని ఆదాయం పొందేలా ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోంది. విద్యుత్ శాఖకు మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా ఏటా రూ.25 వేల వార్షికాదాయం రైతు వేదికలకు కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేయనున్న ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టారని అధికారులు అంటున్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రణాళికలు ఆ దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలువిధి విధానాలు రావాల్సి ఉంది రైతు వేదికలను స్వయం సమృద్ధి పరిచేందుకు వాటిపై సోలార్యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు యూనిట్లు ఏర్పాటు చేశారు. త్వరలో రెడ్కో అధికారులతో అనుసంధానం చేసి యూనిట్ల ఏర్పాటుకు వ్యూహ రచన చేస్తున్నారు. – తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి -
నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లకు అధికారులు నిర్ణయించిన ధరతోనే ఇసుక విక్రయించాలని, అధిక ధరతో విక్రయిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో ఆమె స్పందించారు. మండల తహసీల్ కార్యాలయంలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎంవీఐ శ్రీనివాస్ ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. బిచ్కుంద మండలానికి రూ.2,500, జుక్కల్, మద్నూర్, పెద్దకొపడ్గల్, పిట్లం మండలాలకు రూ.3,500, నిజాంసాగర్ మండలానికి రూ.4,000 ధరతో ఇసుక వేయాలన్నారు. ఒక్కో లబ్దిదారుని అవసరాన్ని బట్టి రెండు, మూడు ట్రాక్టర్ ఇసుక కోసం పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బిచ్కుంద తహసీల్ కార్యాలయంలో అంటెడర్గా పని చేసిన హన్మండ్లు పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొని సన్మానించారు. భూ సమస్యలు త్వరగా పరిష్కరించండి పెద్దకొడప్గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని అకస్మాతుగా తనిఖీ చేశారు. దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని.. స్థానిక రెవెనూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్, సిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి -
స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఎల్లారెడ్డి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి చేపట్టాల్సిన వ్యూహం గురించి దిశా నిర్దేశాలు జారీ చేశారు. నూతన మండల పార్టీ అధ్యక్షుల స్థానం కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, సిరిసిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
మోర్తాడ్: మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడగా తీవ్ర గాయాలపాలైన ఒకరు మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలం దొన్కల్లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నందిగుట్టకు చెందిన షేక్ రహమాన్(42) అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అలాగే ఇంటి నిర్మాణ కార్మికునిగా కూడా పని చేస్తున్న అతను నాలుగు రోజుల క్రితం అల్లెపు రాజు అనే వ్యక్తితో దొన్కల్లో పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ పని చేస్తున్న రాజు, రహమాన్లు గురువారం అర్ధరాత్రి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా రాజు రహమాన్పై దాడి చేశాడు. ఈ దాడిలో రహమాన్ తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ముత్యం అనే వ్యక్తి అంబులెన్స్లో శుక్రవారం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మద్యం మత్తులో కాలువలో పడి ఒకరి మృతి బీబీపేట: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేటకు చెందిన శ్యాగ గణేశ్(45) మద్యానికి బానిస కావడంతో ఎలాంటి పనిచేయకుండా తిరుగుతుండే వాడు. మద్యం తాగుతూ బస్టాండ్ ఆవరణలో పడుకునేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి స్థానిక వైన్స్ షాప్ దగ్గర ఉన్న మురికి కాలువ వద్ద పడుకున్నాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి జైలు ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరికి ట్రాఫిక్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. పది మందికి రూ. పదివేను వేల జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు సీఐ పేర్కొన్నారు.పోలీసుల అదుపులో ఇద్దరు ఆకతాయిలు ఖలీల్వాడి: నగరంలోని రెండవ టౌన్ పీఎస్లో పరిధిలోని ఉన్న దర్గా వద్ద ఇద్దరు ఆకతాయి యువకులను షీటీం సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని షీటీమ్ సభ్యులు స్థానిక పీఎస్కు తరలించారు. విచారణ చేపట్టి వీరిపై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. బాత్రూమ్ విషయంలో గొడవరామారెడ్డి: బాత్రూమ్ విషయంలో ఇద్దరు అన్నాదమ్ముళ్లు, వారి కుమారుల మధ్య జరిగిన గొడవలో పలువురు గాయపడినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన నర్సయ్య, రాజయ్య ఇద్దరు అన్నాదమ్ముళ్లు. కాగా వీరికి చెందిన బాత్రూం విషయంలో గొడవ జరుగుతోంది. శుక్రవారం వారి మధ్య మళ్లీ గొడవ చోటు చేసుకుంది. మొదట రాజయ్యను తన అన్న నర్సయ్య కుమారుడు శ్రీకాంత్ గొడ్డలితో గాయపర్చాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు శ్రీధర్ సైతం రాజయ్యను అతని కుమారుడు నరేశ్పై దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 2024–25 సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. సక్రమంగా పనిచేసిన కూలీలకు తక్కువ డబ్బులు ఇప్పించడం, పనులకు రాని కూలీలకు డబ్బులు వచ్చేలా చేయడం, మస్టర్లలో సరిగా కూలీల హాజరు వేయకపోవడం వంటి తప్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీ ఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. నిధులను పక్కదారి పట్టించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, డబ్బులను రికవరీ చేస్తామన్నారు. ఎర్రాపహాడ్ ఫీల్డు అసిస్టెంటు బాలురాజును సస్పెండ్ చేశారు. మండల ప్రత్యేక అధికారి శివకుమార్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఎస్ఆర్పీ సాంబశివచారీ, ఇన్చార్జి ఏపీవో కృష్ణ గౌడ్, జీపీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి టౌన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక కోసం ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎస్.రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి జులై 13 వరకు https://national awardstoteachers.education.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక మార్గదర్శకాల కోసం ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ https://www.education.gov.in ను సంప్రదించాలన్నారు. లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలి బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఎంపీడీవో ముజాహిద్ అన్నారు. బోర్లం గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ముజాహిద్ పర్యటించారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తికాగానే రూ.లక్ష బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామన్నారు. పంచాయతి కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరూ వెంటనే పనులు ప్రారంభించాలని హన్మాజీపేట్ పంచాయతీ కార్యదర్శి రాజేష్ అన్నారు. గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఖాళీ స్థలంలో ముగ్గుపోసి భూమిపూజ చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మాజీ సర్పంచ్ బోనాల సుభా ష్, నాయకులు వడ్ల శేఖర్, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులు విక్రయించే సమయంలో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ వినియోగదారుల ఫోరం సభ్యులు రాజాగౌడ్ హెచ్చరించారు. శుక్రవారం లింగంపేట రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. డీఏపీ, యూరియా బస్తాలు ప్రతి ఫర్టిలైజర్ షాపులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలన్నారు. లింగంపేటలోని ఓ దుకాణం యజమాని రైతులు కొనుగోలు చేస్తున్న డీఏపీకి కార్బన్ ప్యాకెట్లు కొంటేనే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అలాగే ఎల్లారెడ్డిలోని గ్రోమోర్ సెంటర్లో రైతులకు అవసరం లేని మందులు బలవంతంగా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారికి వివరించగా.. రైతులకు బలవంతంగా కార్బన్ ప్యాకెట్లు అంటగడితే వెంటనే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తామని చెప్పారని అన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్, మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
గాంధారి: పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డులో పిచ్చి కుక్క వీధుల్లో తిరుగుతూ కనబడిన వారందరిపై దాడి చేసి గాయపర్చింది. అమల, అమిక, పాపవ్వ, అనితతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న అమిక అనే చిన్నారిని గాయపర్చింది. పక్కింట్లో ఉండే పాపవ్వ అనే మహిళ కుక్క నుంచి చిన్నారిని విడిపించే ప్రయత్నం చేయగా ఆమైపె కూడా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారందరిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్ ప్రసన్న చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా పిచ్చి కుక్క పశువులు, దూడలపై దాడి చేసి గాయపర్చింది. కాలనీ వాసులు వెంబడించి పిచ్చికుక్కను చంపేశారు. -
పోచంపాడే.. శ్రీరాంసాగర్
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముందుగా పోచంపాడ్ ప్రాజెక్ట్గా పిలిచేవారు. ● 1978లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వ చ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పో చంపాడ్ను శ్రీరాంసాగర్గా పేరు మార్చారు. ● పోచంపాడ్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోచంపాడ్ను పాడ్ అనడం బాగుండదని సీఎంకు విన్నవించడంతో పేరు మార్పు జరిగింది. ● పోచంపాడ్లో గోదావరి తీరాన కోదండ రామాలయం ఉండటంతో ఆ ఆలయం పేరు మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్గా పేరు మార్చారు. ● పోచంపాడ్ ప్రాజెక్ట్కు 1963లో నాటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1978లో పూర్తయింది. ● శ్రీరాంసాగర్ ప్రధాన కాలువలకు కూడా అప్పుడే కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నామకరణం చేశారు. – బాల్కొండమీకు తెలుసా? -
‘స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి’
కామారెడ్డి అర్బన్ : ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన్ ప్రముఖ్ జగదీశ్ కోరారు. శుక్రవారం లింగాపూర్లోని ఎస్పీఆర్ హైస్కూల్లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘స్వదేశీ విధానాలు, స్వావలంభి భారత్ అభియాన్లో విద్యార్థుల పాత్ర’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీశ్ మాట్లాడుతూ పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఎన్నో విదేశీ వస్తువులను వినియోగిస్తున్నామన్నారు. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. ప్రధానంగా చైనా, తుర్కియే, అమెరికా వస్తువుల వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లోనే స్వదేశీ కంపెనీ వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ రాహుల్కుమార్, జిల్లా సంఘర్షణ ప్రముఖ్ సంతోష్గౌడ్, కాలేజ్ ప్రిన్సిపల్ కొమిరెడ్డి మారుతి, ప్రతినిధులు అంజనేయులు, సాహిత్, మనీష్, విశ్రాంత అధ్యాపకులు రంజిత్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పౌర హక్కులను కాలరాసిన ఘనత కాంగ్రెస్దే’
కామారెడ్డి టౌన్: భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు నియంత పాలన సాగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయమన్నారు. ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించారని విమర్శించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన రోజు దేశమంతా చీకటితో నిండిన రోజని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ వ్యాఖ్యానించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర నాయకులు మురళీధర్గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, నాయకులు వేణు, రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ లేట్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం గురుకు ల విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అన్ని కులాల విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేలా సమీకృత గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు నిర్మించి ప్రారంభించాలని ని ర్ణయించింది. తొలి విడతలో జిల్లాలోని జుక్కల్ ని యోజక వర్గానికి స్కూల్ మంజూరైంది. మద్నూర్ మండల కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించేందుకు గతేడాది డిసెంబర్ 7న అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు, సౌకర్యాల కల్పన కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశారు. ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదలయ్యాయి. నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాల నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అలాగే రెండో విడతలో ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాలకు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో లింగంపేట మండలం మోతె గ్రామంలో, బాన్సువాడ నియోజక వర్గానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పరిధిలో స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఇక మిగిలింది కామారెడ్డి నియోజకవర్గం మాత్రమే. మరో విడతలో కామారెడ్డికి మంజూరవుతుందని భావిస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. మద్నూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచాయి. ఇప్పటికీ టెండర్లు కూడా పూర్తవలేదు. తొలి విడతలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మంజూరైన ఇతర జిల్లాల్లో టెండర్లు పూర్తవడం గమనార్హం. రెండేళ్లలో భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించాలన్నది సర్కారు లక్ష్యం. అయితే మద్నూర్లో ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ అగ్రిమెంట్ ప్రాసెస్కు కూడా సమయం పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.ఎన్నో ఆశలు..అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా కార్పొరేట్ను తలదన్నే రీతిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్కూల్పై ఆశలు పెట్టుకున్నారు. అందులో సీటు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నారు. తొలివిడతలో జుక్కల్ నియోజక వర్గానికి మంజూరు శంకుస్థాపన చేసి ఆరు నెలలు.. ఇప్పటికీ టెండర్ల దశ దాటని ప్రక్రియ -
‘నాణ్యమైన భోజనాన్ని అందించాలి’
మాచారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. శుక్రవా రం ఆయన మాచారెడ్డిలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, పీహెచ్సీని పరిశీలించారు. మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ సర ళ, ఎంపీడీవో గోపిబాబు, ఏపీవో సాయిబా బా, ఎంపీవో సురేందర్, ఏపీఎం శ్రీనివాస్, బీసీ హాస్టల్ వార్డెన్ చక్రధర్ ఉన్నారు. ‘కేజీబీవీలో నూతన కోర్సులు ప్రారంభం’ రాజంపేట : మండల కేంద్రంలోని కేజీబీవీ లో ఇంటర్లో ఫార్మా టెక్నాలజీ, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం పా ఠశాల ఆవరణలో సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, జీఈసీవో సుకన్య, ఎంపీడీవో రఘురాం, త హసీల్దార్ జానకి పాల్గొన్నారు. సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన దేవరాజ్ గౌడ్ కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్: ఫోన్ ట్యా పింగ్ కేసులో డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ శుక్రవారం వాంగ్మూలం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలోని పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు సిట్ విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో దేవరాజ్ గౌడ్ ఒకరు. సిట్ అధికారులు ఫోన్ చేసి ఆయనను వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన శుక్రవా రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని సిట్ అధికారులను కోరానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రామా గౌడ్, నంద రమేశ్, దర్శన్, రాజు ఉన్నారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లాకు గుర్తింపు కామారెడ్డి క్రైం : పోలీసు శాఖకు సంబంధించిన సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కా రంలో జిల్లా మంచి పనితీరుతో గుర్తింపు తెచ్చుకుందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ జితేందర్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. ఇందులో కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో లేకపోవడంతో జిల్లా నోడల్ అధికారి ఏఎస్పీ నరసింహారెడ్డికి ప్రశంసాపత్రం అందించారని ఎస్పీ తెలిపారు. ఎస్సెస్సీ సప్లిమెంటరీలో 90.67 శాతం ఉత్తీర్ణత కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. జిల్లాలో 675 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 612 మంది పాస్ అయ్యారు. 90.67 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 422 మంది పరీక్ష రాయగా 376 మంది, బాలికలు 253 మందికిగాను 236 మంది పాసయ్యారని డీఈవో రాజు తెలిపారు. -
‘అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం’
పెద్దకొడప్గల్: అటవీ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించబోమని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత హెచ్చరించారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూములు కబ్జా అవుతున్న విషయమై ఈనెల 2న సాక్షిలో ప్రచురితమైన కథనంపై డీఎఫ్వో నిఖిత స్పందించారు. శుక్రవారం ఆక్రమణకు గురైన అటవీ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ భూముల జోలికి వెళ్లవద్దన్నారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఆ భూమిలో త్వర లో అటవీశాఖ తరఫున మొక్కలు నాటేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం తండా వాసులు మాట్లాడుతూ తమ తండా పరిధిలో అటవీ భూములను ఫారెస్ట్ అధికారులు గుర్తించిన విధంగానే ఇతర ప్రాంతాలలో కూడా కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటేనే తాము కబ్జా చేసిన భూములను వదులుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారి సునీత, పిట్లం ఎఫ్ఆర్వో రవికుమార్, కౌలాస్ డీఆర్వో అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
వణుకు పుట్టిస్తున్న
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఎ స్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చే పట్టిన తర్వాత దాదాపు అన్ని పో లీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఏ స్టేషన్కు వెళ్లినా అక్కడి రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలను క్షు ణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేని ఠాణాల్లో అక్క డి అధికారులకు ఎలా నిర్వహించాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ పద్ధతి మా ర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆయా పో లీస్ స్టేషన్లలో పనిచేసే రైటర్లు, కోర్టు డ్యూటీ నిర్వహించే కానిస్టేబుళ్ల నుంచి మొదలుకుని అన్ని విభాగాల సిబ్బందితో పలుమార్లు సమీక్షలు నిర్వహించి అక్రమాలకు, అవినీతికి తావులేకుండా పనిచేయాల ని ఆదేశిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినా, కేసుల పరిశోధన సరిగా లేకపోయినా, డబ్బుల వసూళ్లకు పాల్పడినా, ఫిర్యాదుదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారికి సరైన గౌరవం ఇవ్వకపోయినా చ ర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో విధి ని ర్వహణలో బాగా పనిచేసేవారిని అభినందిస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలు.. జిల్లాలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల బదిలీలు నిర్వహించారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఏఎస్సైలను వారు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు కూడా స్థానచలనం కల్పించారు. 63 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, ఏడుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు, 79 మంది హోంగార్డులను కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశారు. బాధ్యతగా పనిచేసే వారికి ప్రశంసలు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎప్పటికప్పుడు ప్రశంసిస్తున్నారు. వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో చురుకుగా పనిచేసిన ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందిని ఆయన సన్మానించారు. తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో వారిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజాయితీగా, బాధ్యతగా పనిచేసి పోలీసు శాఖకు పేరు తేవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొంటున్నారు. న్యూస్రీల్ విధుల్లో నిర్లక్ష్యం, తప్పుడు పనులపై సీరియస్ జిల్లాలో పదిమందిపై సస్పెన్షన్ వేటు ఇందులో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు..మూడున్నర నెలల్లో.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ప ది మందిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు బాధి తులు, ఫిర్యాదుదారులు, నిందితుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారి పై చర్యలకు ఉపక్రమించారు. రామారెడ్డి ఎస్సై రమేశ్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. దీంతో వారి ద్దరినీ సస్పెండ్ చేశారు. అలాగే ఇద్దరు హెడ్ కా నిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపైనా సస్పెన్షన్ వేటు పడింది. బాన్సువాడ లో తాగి న్యూసెన్స్ చేసిన వ్యక్తి విషయంలో వ చ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ దురుసుగా ప్రవర్తించడాన్ని ఎస్పీ సీరియస్గా పరిగణించా రు. వారిద్దరినీ సస్పెండ్ చేశారు. జుక్కల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అంబర్సింగ్ పోలీ సు స్టేషన్కు వచ్చిన బాధితులు, నేరస్తులతో చ నువుగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తానని డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం ఎస్పీ దృష్టికి రాగా ఆయనపై చర్యలు తీసుకు న్నారు. నిజాంసాగర్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ మోహన్సింగ్ అనైతిక ప్రవర్తనపై సీరియ స్ అయి సస్పెండ్ చేశారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రాకేశ్గౌడ్ మ ద్యం సేవించి వాహనం నడిపినందుకు సస్పెన్షన్కు గురయ్యాడు. పాస్పోర్టు జారీ విషయంలో క్లియరెన్స్ ఇచ్చే విషయంలో దొర్లిన తప్పిదానికి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణపై చర్యలు తీసుకున్నారు. -
పోచారం నీరే ఆధారం
నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్స్టోరేజీలో ఉంది. వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది. పనులు ప్రారంభించని రైతులు పోచారం ఆయకట్టుకు ప్రాజెక్టు నీరే ఆధారం. ప్రాజెక్టునుంచి వచ్చే నీటిపై ఆధారపడే పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడి ఏటా వానాకాలంలో అధికారికంగా 10,500 ఎకరాలలో, అనధికారికంగా మరో 5 వేల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీలో ఉండడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. నీరు లేకపోవడంతో సాగు పనులు మొదలు పెట్టలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు పరిధిలో భూములు చాలావరకు బీడుగానే కనిపిస్తున్నాయి.వెలవెలబోతున్న పోచారం ప్రాజెక్టునీళ్ల కోసం ఎదురుచూస్తున్నం పోచారం ప్రాజెక్టు ఆయక ట్టు కింద నాకు ఎకరంనర భూమి ఉంది. ప్రాజెక్టులోకి నీరు ఎప్పుడు వస్తుందా అ ని ఎదురు చూస్తున్నాం. ప్రా జెక్టులోకి వరదరాక ప్రారంభంకాగానే పంటల సాగు పనులు మొదలుపెడతాం. – అంతన్నగారి రవి, ఆయకట్టు రైతు, వాడి నీరొస్తేనే సాగు పనులు.. నాకు ఎకరం భూమి ఉంది. ప్రాజెక్టు నీటితోనే పంటలు పండిస్తాం. ఈ యేడు ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ప్రాజెక్టులోకి వరదనీరు వస్తేనే మాకు పంటల సాగు మీద నమ్మకం కలుగుతుంది. – లక్ష్మయ్య, ఆయకట్టు రైతు, గోలిలింగాల వర్షాలు లేక.. జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసే వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. జూన్, జూలై మాసాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. ఈసారి జూన్ నెల ముగింపునకు వస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు కూడా రాలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీ(0.199 టీఎంసీ)లో ఉంది. ఈ యేడు ముందస్తుగా కురిసిన వర్షాలతో పోచారం ఆయకట్టు రైతులు సంబరపడ్డప్పటికీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం మొదలై మూడువారాలు వానలు లేక.. చుక్క నీరు రాక.. డెడ్స్టోరేజీలోనే ప్రాజెక్టు నీటిమట్టం ఆయకట్టు భూముల్లో మొదలు కాని పంటల సాగు -
పసుపు బోర్డు కేంద్రం ఇచ్చిన బహుమతి
సుభాష్నగర్ : పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి గురువా రం ఆయన వీక్షించారు. అనంతరం విలేకరులతో కిషన్రెడ్డి మాట్లాడారు. పసుపు బోర్డు కావాలనే 40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం ప్రకటించిందని, ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయపార్టీ నిర్ణయం, ప్రధాని మో దీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పడిందన్నారు. పసుపు బోర్డు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలు అడిగాయని, మోదీ చివరకు నిజామాబాద్లోనే ఏ ర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన రైతుబిడ్డనే నియమించారన్నారు. ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం పూర్తిస్థా యిలో కార్యరూపం దాల్చనుందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు సమ్మేళనానికి హా జరై విజయవంతం చేయాలని కోరారు. పసుపు బో ర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బోర్డు లోగో ను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపా రు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కూడా షా ఆవిష్కరిస్తారని తెలిపారు. రైతు సమ్మేళనానికి తరలిరావాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన బహిరంగ సభకు హాజరవుతారని, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పిలుపు నిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది నిజామాబాద్ జిల్లా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువు అమిత్ షా సభను జయప్రదం చేయాలని పిలుపు -
‘సాగర్’లోకి ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువన కుండపోతగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1392 అడుగుల (5.2 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు జాబ్ మేళాకామారెడ్డి క్రైం: ప్రైవేట్ రంగంలో యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో 20 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు అన్ని సర్టిఫికెట్లతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 70975 25933, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రమశిక్షణతో మెలగాలికామారెడ్డి అర్బన్: క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్ సూచించారు. పట్టణ పరిధిలోని దేవునిపల్లి వాసవీకాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల జూనియర్ కళాళాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఆర్ఎల్సీ కిరణ్గౌడ్, ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలీ, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. సాహస అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి అర్బన్: టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2024 అవార్డు కోసం సాహస కృత్యాలు చేసిన వారి నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా క్రీడలు, యువజన అధికారి కేఎస్ జగన్నాథన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో భూమి, ఆకాశం, సముద్రంలో సాహస కృత్యాలు చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు..కామారెడ్డి అర్బన్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులాల్లో గ్రూప్–1లో ఐదు సీట్లు, గ్రూప్–2లో పది సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తిగల వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలిబాన్సువాడ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాన్సువాడ కోర్టు జడ్జి భార్గవి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యువత పెడదారి పట్టకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఆల్కహాల్, సిగరేట్, బీడీ, గుట్కా వంటివి సేవించడం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణమూర్తి, మోహన్రెడ్డి, భూషణ్రెడ్డి, రమాకాంత్, ఆనంద్, హైమద్, అజీం, హర్షద్, కోర్టు సిబ్బంది, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. -
నీరు వృథా రైతు వ్యథ
బాన్సువాడ : మంజీర నది ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పైపులైన్ లీకేజీలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ, తాడ్కోల్, చింతల్నాగారం శివార్లలోని పంట పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో మంజీర నది ప్రాంతంలో ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, నిర్వహణ బాధ్యత కోసం రైతులే ఓ కమిటీని ఏర్పాటు చేసి పైపులైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు చేయిస్తారు. పంటలు చేతికొచ్చిన తర్వాత ఎకరానికి 70 కిలోల ధాన్యం బస్తాను కమిటీకి చెల్లిస్తారు. ఇలా వసూలైన ధాన్యాన్ని విక్రయించి మోటార్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీలు, కాలువల మరమ్మతులు చేయిస్తారు. ఎత్తిపోతల పైపులైన్ వేసి చాలా ఏళ్లు కావడంతో పైపులైన్కు లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. నీరు వృథాగా పోతున్న ప్రాంతంలో భారీగా జమ్ము మొలవడమే కాకుండా నీరు పొలాల్లోకి చేరుతోంది. దీంతో పొలాలు జాలుపట్టి పంటలు సరిగా పండడం లేదు. సుమారు 200 ఎకరాల్లో ఎప్పుడూ నీరు ఉంటుండడంతో పొలాలు ఆరడం లేదు. పంట కోతకు వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పైపులైన్ నుంచి లీకవుతున్న నీరు బురదనీటితో పొలాలు.. పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్న రైతులు కొత్త పైపులైన్ వేస్తేనే శాశ్వత పరిష్కారం -
ఎల్లారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ మహ్మద్ ఇర్షాదుద్దీన్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తూ, ఎమ్మెల్యేగా మదన్మోహన్రావు గెలుపు కోసం కష్టపడ్డానని లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా తనలాంటి నాయకులను అవమానిస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులకు కీలక భాద్యతలు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏల పెత్తనంతో విసిగిపోయానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్అలీని గానీ, మరే ఇతర నాయకులను గానీ కలిస్తే చాలు తమ దగ్గరకు రావొద్దని ఆంక్షలు పెడుతున్నారని, వాట్సాప్ గ్రూప్ల నుంచి తొలగించి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏల వ్యవహారాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో రామారెడ్డి మండల నేతలుఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో పీఏల పెత్తనంపై ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు ఇప్పటికీ ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. పార్టీకి సీడీసీ చైర్మన్ ఇర్షాద్ రాజీనామా ఎమ్మెల్యే పీఏల పెత్తనంపై మండిపాటు -
డ్రగ్స్ రహిత సమాజం కోసం ఉద్యమించాలి
కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అ న్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో గురువారం సంక్షేమ శాఖ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ ఽఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొ న్నారు. చర్చి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కళాభారతి ఆడిటోరియం వరకు ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి వరప్రసాద్ అన్నారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్ కోసం శ్రమించాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్ధానాల్లో నిలవాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించే వారి వివరాలను తమ దృష్టికి తీసుకునిరావాలన్నారు. 1908, 1933, 1446 టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.1908కి సమాచారం ఇవ్వాలిమత్తు పదార్థాలు సేవించడం కారణంగా చాలామంది విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ‘డ్రగ్స్ వాడము – ఇతరులను వాడనివ్వము’ అనే నినాదంతో యువత ముందుకు నడవాలన్నారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్ధాల సమాచారం తెలిస్తే 1908 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి నాగరాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, డీఈవో రాజు, ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ తనిఖీ
● మెడికల్ కళాశాల, జీజీహెచ్ను సందర్శించిన బృందం ● మొక్కుబడిగా ముగించారని విమర్శలుకామారెడ్డి టౌన్: కామారెడ్డి వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం గురువారం తనిఖీ చేపట్టింది. కమిటీ ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) రవీందర్ నాయక్, సభ్యులు కలెక్టర్ అశిష్ సంగ్వాన్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్తో పాటు అధికారులు మధ్యాహ్నం మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మెడికల్ కళాశాల, హస్టల్ భవనాల పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి అప్పగించాలని ఇంజినీర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు, పరికరాలు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనంగా మరో 100 పకడలతో హాస్టల్ నూతన భవనం కావాలని కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ డీపీహెచ్ను కోరారు. గైర్హాజరైన సూపరింటెండెంట్ ఎంసీఎంసీ బృందం తనిఖీ సమయంలో జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫరీదా గైర్హాజయ్యారు. ఉదయం హాజరు రిజిస్టర్లో సంతకం చేసిన ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఆరోగ్యశ్రీ నిధులు హెచ్డీఎస్ కమిటీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వినియోగించారని, ఈ వ్యవహారంలో కల్టెకర్ సూపరిండెంట్పై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనిఖీ సమయంలో ఉంటే ఉన్నతాధికారులకు విషయం తెలిసిపోతుందనే ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారని ఆస్పత్రి సిబ్బంది, కొంత మంది వైద్యులు గుసగుసలాడారు.40 నిమిషాల్లోనే..జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి చేరుకున్న బృందం.. సాయంత్రం 4.20 నుంచి 4.35 మధ్య తనిఖీ చేసింది. ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం సూపరింటెంటెండ్ చాంబర్లో వైద్యాధికారులతో 4.38 నిమిషాలకు సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 5 గంటలకు బయటకు వచ్చిన బృందం సభ్యులు 5 గంటల 6 నిమిషాలకు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. రోగులతో మాట్లాడకపోవడం, ఆస్పత్రి ఆవరణను పరిశీలించకపోవడంతో మొక్కుబడిగా తనిఖీ ముగించారని పలువురు విమర్శించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ చందర్నాయక్, టీఎంఎస్ఐడీసీ నిజామాబాద్ ఈఈ కుమార్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు ఉన్నారు. -
తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా
మాచారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిని, తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.9వేలకోట్ల రైతు భరోసా ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండల కేంద్రంలోని శివబాలాజీ ఫంక్షన్ హాలులో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ మురుగన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, పరిశీలకులు కత్తి వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పేదల కోసం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని, ధనికులు తినే సన్న బియ్యం పేదలకు అందించి వారి కడుపు నింపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదని షబ్బీర్ అలీ ఘాటుగా విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చూస్తోందన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.కులగణన దేశానికి ఆదర్శంరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ అన్నారు. రేవంత్రెడ్డి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా చేసి చూపించారని అన్నారు. ఎంపీ సురేశ్ షెట్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అనుబంధ సంఘాల మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
ఇసుక పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులకు ఇసుక ఇవ్వకుండా పక్కదారిపట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. తహసీల్, మున్సిపల్ కార్యాలయాలను గురువారం ఆమె సందర్శించారు. సబ్ కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. 10 ట్రాక్టర్ల ఇసుకకు ఒకేసారి పర్మిట్లు ఇస్తున్నారని, స్థలం లేక రెండు, మూడు ట్రాక్టర్ల ఇసుక తాము వేసుకుంటుండగా, మిగతా ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కమిషనర్ ఖయ్యూంను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా.. ఆరుగురు సిబ్బంది కొత్తగా విధుల్లో చేరారని, వార్డు అధికారులతోపాటు మరి కొంత మంది సిబ్బంది అవసరం ఉందని కమిషనర్ సమాధానమిచ్చారు. సిబ్బంది నియామకంతోపాటు ఇతర అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ కలెక్టర్ అన్నారు. -
వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ/తాడ్వాయి/ఎల్లారెడ్డి రూరల్: మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బాన్సువాడ విద్యార్థి నిఖిల్గౌడ్, తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి పాఠశాలకు చెందిన కుమ్మరి తరణి, ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల జెడ్పీ పాఠశాల విద్యార్థిని సౌమ్య ప్రతిభా కనబర్చడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. గురువారం కామారెడ్డిలో వీరికి సర్టిఫికెట్లు, మెమోంటో అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి కామారెడ్డి టౌన్: మూడు నెలల జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతి శీల జీపీ వర్కర్స్ యూనియన్ నేత రమేశ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలన్నారు. జీవో– 51 రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. -
ప్రేమ వ్యవహారంలో బెదిరింపులు: యువకుడి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఒంటర్పల్లి గ్రామంలో ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించగా, విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాపర్తి సాయిలు–అంజవ్వ దంపతులకు ఓ కూతురు, కొడుకు శ్రీకాంత్(21) ఉన్నారు. వారం రోజుల క్రితం కూతురును తీసుకొని దంపతులిద్దరూ హైదరాబాదుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. కొడుకు ఒక్కడే ఒంటర్పల్లిలో నివాసం ఉంటున్నాడు. శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి మామ శ్రీకాంత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం యువతి కుటుంబ సభ్యులే అని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. గ్రామానికి ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్రావు, పోలీసులు చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కారు బోల్తా: ఐదుగురికి గాయాలు
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ రహదారిపై కారు బోల్తా పడటంతో డ్రైవర్తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు బుధవారం కారులో సాటాపూర్లోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం అదే రాత్రి తిరిగి నగరానికి బయలుదేరారు. సాటాపూర్ రహదారిపై వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్తోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ సర్పరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. -
ఆలయ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: వీర హనుమాన్ వేంకటేశ్వర ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండలంలోని వీర హనుమాన్ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా షబ్బీర్ అలీ, ఏఐసీసీ ఇన్చార్జి విశ్వనాథన్ మురుగన్, ఎంపీ సురేష్ షెట్కార్ హాజరయ్యారు. నూతన కార్యవర్గంతో దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ చైర్మన్గా శనిశెట్టి రాజమౌళి, డైరెక్టర్లుగా రాజేశం, శాంతి, సత్యనారాయణ, దేవయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. మాజీ ఎంపీపీ నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నౌసీలాల్, నాయకులు లక్ష్మారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గణేష్ నాయక్, కమలాకర్రెడ్డి, ఈవో ప్రభు సిబ్బంది ఉన్నారు. -
‘పార్టీకి సేవ చేసిన వారికి తగిన గుర్తింపు’
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు సేవ చేసిన వారికి తగిన గుర్తింపును ఇచ్చి పదవులను కట్టబెడుతుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. గురువారం పీసీసీ కార్యదర్శిగా నియమితులైన ఇంద్రకరణ్రెడ్డిని ఆయన భిక్కనూరు సమీపంలోని ఫామ్హౌస్లో సన్మానించారు. ఈ సందర్భంగా షెట్కార్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, యూత్ కాంగ్రెస్ నేత ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నేతలు బల్యాల సుదర్శన్, కుంట లింగారెడ్డి, భీంరెడ్డి, బాగారెడ్డి పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
బైక్ను ఢీకొన్న బస్సు : ఒకరి మృతి ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్లో బైక్ను ఓ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కోటార్మూర్కు చెందిన మామిడి మహేష్ (38) గురువారం ఉదయం తన బైక్పై తన భార్య లావణ్యను మహిళా ప్రాంగణ సమీపంలో ఓ పనికి దించి ఇంటికి బయలుదేరాడు. కాగ కోటార్మూర్లోని తిరుపతి ఆస్పత్రి వద్ద అతడి బైక్ను జగిత్యాల డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేష్కు తీవ్రమైన గాయాలవ్వడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. పాముకాటుతో ఒకరు.. కామారెడ్డి క్రైం: గుడిసెలో నిద్రిస్తుండగా పాము కా టు వేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కా మారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన భుక్యా కపుర్యా (30) వ్యవసాయం, కూలీ పనులు చేసుకునేవాడు. అతనికి గతంలో వివాహం జరుగ గా భార్యతో విడాకులు అయ్యాయి. అతడు బుధ వారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రించాడు. వేకువజామున మెలకువ వచ్చి చూసుకోగా పాము కాటుకు గురైనట్లు గుర్తించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. అర్ధరాత్రి విషసర్పం కాటు వేసి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
సామాజిక అంశాలపై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం మహిళా సంఘాలకు సామాజిక అంశాలపై ఎంపీడీవో నరేష్ అవగాహన కల్పించారు. వన మహోత్సం, సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకం అమలు తదితర విషయాల గురించి వివరించారు. అలాగే సంఘాల బలోపేతం, సభ్యుల ఆదాయ వ్యయాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని, సంఘాల లావాదేవీలు ఆడిట్ చేయించాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు సులోచన, ఏపీఎం శ్రీనివాస్, ఎంపీవో మలహరి, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ స్లాబ్ పనుల పరిశీలన నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ స్లాబ్ పనులను హౌసింగ్ డీఈఈ సుభాష్, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. నిబంధనల మేర కు స్లాబ్ పనులు చేపట్టేలా కాంట్రాక్టర్కు సూచనలు చేశారు.క్రమం తప్పకుండా ప్రతిరోజూ స్లాబ్ క్యూరింగ్ పనులు చేపట్టాలని వారు సూచించారు.హౌసింగ్ ఏఈ సందీప్ ఉన్నారు. ఈ–కేవైసీ తప్పనిసరి నస్రుల్లాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయం కోసం రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని ఏఈవో గ్రీష్మ అన్నారు. అందులో భాగంగా మిర్జాపూర్ క్లస్టర్కు సంబందించి 34 మంది చేసుకోలేదని తెలిపారు. ఈసందర్భంగా గురువారం కామిశెట్టిపల్లిలో ఫేసియల్ యాప్ ద్వారా కేవైసీ చేశామన్నారు. డబ్బులు పడుతూ కేవైసీ చేసుకోని వారు ఉన్నా కూడా తప్పకుండా ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించారు. ‘పద్మశాలి’ కార్యవర్గం ఎన్నిక బీబీపేట: మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం మండల నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తుమ్మ మచ్చేందర్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, కోశాధికారిగా బాలే సహదేవ్, ఉపాధ్యక్షుడిగా శంకర్, ఉప కార్యదర్శిగా అల్వాల నర్సింలు, కార్యవర్గ సభ్యులుగా రాజేందర్, అంకాలం నరేందర్, గణేష్, వేణు, భాస్కర్, లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులుగా జమున, ఉషశ్రీ, లావణ్య ఎన్నికయ్యారు. నేతలు చందుపట్ల విఠల్, జనార్దన్, పురుషోత్తం, సందీప్, రాజు, కిష్టయ్య, రామచంద్రం పాల్గొన్నారు. స్టాఫ్ నర్సుకు అభినందనలు లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక పీహెచ్సీలో బుధవారం రాత్రి కష్టతరమైన డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు ప్రతిభను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. వివరాలు.. సురాయిపల్లి తండాకు చెందిన గర్భవతిని బుధవారం రాత్రి పీహెచ్సీకి తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న నర్సు గర్భవతిని పరీక్షించగా.. గర్భంలో మాయ ఎక్కువగా ఉంది.. బిడ్డ మెడచుట్టూ బొడ్డుతాడు(పేగు) చుట్టుకొని ఉన్నట్లు గమనించారు. అయినా సాహసం చేసి స్టాఫ్ నర్సు ప్రతిభ నార్మల్ డెలివరీ చేసినట్లు పీహెచ్సీ వైద్యులు రాంబాయి తెలిపారు. బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. సెర్ప్లో బదిలీలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో బదిలీలు జరిగా యి. ఏపీడీగా పనిచేస్తున్న మురళీకృష్ణ హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి వచ్చారు. అలాగే డీపీఎంలు సుధాకర్ సంగారెడ్డి జిల్లాకు, రమేశ్బాబు జనగామ జిల్లా కు, రవీందర్రావ్ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. కాగా నిజామాబాద్ నుంచి నూకల శ్రీనివాస్, మేకల సాయిలు, సిద్దిపేట నుంచి జి.రాజయ్య జిల్లాకు వస్తున్నారు. -
మతిస్థిమితం లేని యువకుడి వీరంగం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ సంతోష్ అనే యువకు డు మతిస్థిమితం కోల్పోయి గత కొద్ది రోజులుగా తండాలో వీరంగం సృష్టిస్తున్నాడు. ఈక్రమంలో గు రువారం అతడికి ఎదురువచ్చిన తండావాసులను రాళ్లతో, కర్రలతో కొడుతూ అసభ్యకరమైన మాటల తో దూషించాడు. తండాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో కి చొరబడి ఫర్నిచర్, టీవీ, వంటపాత్రలు, రెండు బైక్లను ధ్వంసం చేశాడు. దీంతో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు తెలి పారు. సంతోష్ చేష్టలతో విసిగిపోయిన తండావాసులు అతడిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో సైతం రాళ్లు రువ్వుతూ అతడు దాడి చేశాడు. వెంటనే సీఐ రవీందర్నాయక్ ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆ స్పత్రి వైద్యులను పిలిపించి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. గంట తర్వాత సంతోష్ అరవడం మానేశాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం అతడిని ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తరలించారు. బాబాయ్ మృతితో కుంగిపోయి.. సంతోష్ వింత చేష్టలతో ఎల్లారెడ్డి సీఐ అతడిపై ఆరా తీశారు. సంతోష్ బాబాయి అయిన దేవసోత్ పకీరాను గత నెల 24న కన్న కొడుకు ప్రకాష్ గొడ్డలితో నరికి చంపాడు. పకీరా మృతి చెందిన సమయంలో అక్కడే ఉన్న సంతోష్ ఇంట్లో పడిన రక్తాన్ని తొలగించి శుభ్రం చేశాడు. అప్పటి నుంచి సంతోష్ మానసికంగా కుంగిపోయి మతిస్థిమితం కోల్పోయినట్లు తండావాసులు తెలిపారు. మంచి భవిష్యత్ ఉన్న యువకుడు మతిస్థిమితం కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. -
గుంతల రోడ్డుకు మోక్షం
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): ఒకప్పుడు రోడ్డు వెంబడి నడవాలంటే ప్రజలు నరకయాతన అనుభవించారు. ఎన్నికల్లోనే ఈ రోడ్డు గురించి చర్చ జరిగేది.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చి పోయేవారు. గత 40 ఏళ్లుగా మెటల్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని ఇరు గ్రామాల ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందిస్తూ వచ్చారు. అయినా సమస్య తీరలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కొన్ని రోజులుగా విన్నపాలు అందిస్తూ వచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే స్పందించి మెటల్ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చడానికి ఎన్ని నిధులు అవసరపడతాయో సంబంధిత అధికారులను ఆదేశించి నివేదికను తెప్పించుకున్నారు. మండలంలోని వజ్జపల్లి, ఉత్తనూర్ గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.కోటి 30 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులకు ఇటీవల ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గతంలో ఈ రోడ్డు వెంబడి పాదచారులు నడవాలంటే ఇబ్బందికరంగా ఉండేది. తరచూ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి కింద పడడంతో గాయాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇరు గ్రామాలకు దూర భారం తగ్గనుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా అవస్థలు పడ్డ గ్రామస్తులు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.కోటి 30 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ఇరు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం గత పాలకులు బీటీ రోడ్డు నిర్మిస్తామని ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకుంటూ అధికారంలోకి రాగానే ఆ రోడ్డు మాట పక్కన పెట్టేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన మదన్మోహన్రావు గత ఎన్నికల్లో రోడ్డు నిర్మాణం చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాడు. ఎమ్మెల్యేకు ప్రజలు రుణపడి ఉంటారు. రోడ్డు నిర్మాణంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది – హరీష్ రావు, వజ్జపల్లి ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేది ఎన్నికలు రాగానే ప్రచారానికి వచ్చే ప్రజాప్రతినిధులకు మా రోడ్డు గుర్తుకు వచ్చేది. మేము గెలవగానే రోడ్డును బాగు చేయిస్తాం అంటూ మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునేవారు. ఆ తర్వాత రోడ్డు మాటే మర్చిపోయేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు ప్రత్యేక దష్టి సారించి రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. – కలిగోట స్వామి, వజ్జపల్లి -
ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభం
మీకు తెలుసా? బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ పార్టీ వారైనా ఎన్నికల ప్రచారాన్ని మండలంలోని శ్రీరాంపూర్గల చిలుకల చిన్నమ్మ ఆలయం నుంచే ప్రారంభిస్తారు. ఈ అమ్మ ఆలయం నుంచే ప్రచారం ప్రారంభించడం సెంట్మెంట్గా భావిస్తారు. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన శ్రీరాంపూర్ గ్రామం అదే పేరుతో 1963లో బాల్కొండ మండలంలో నూతన గ్రామంగా వెలిసింది. ముంపు గ్రామం నుంచి చిలుకల చిన్నమ్మను తీసుకువచ్చి ఇక్కడ స్థాపించారు. ● భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవతగా ఈ ఆలయంలోని చిలుకల చిన్నమ్మ ప్రసిద్ధి చెందింది. ● ప్రతి ఆదివారం, గురువారం ఆలయం వద్ద సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ● ప్రతి సంవత్సరం మాఘ ఆమావాస్య రోజున ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ● చిలుకల చిన్నమ్మ పేరున గ్రామాల్లో చిన్నయ్య, చిన్నమ్మ నామకరణం చేసుకుంటారు. -
ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆర్బాస్ ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈవో దేవీసింగ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రయివేట్ పాఠశాల్లో ఇష్టానుసారంగా పుస్తకాలు, టై, బెల్టుతో వ్యాపారం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. సరైన అర్హత లేని వారితో విద్యా బోధన చేపిస్తున్నారన్నారు. విద్యార్థులకు ఆడుకోవ డానికి సరైన ఆట స్థలం కూడా లేదన్నారు. అధికారులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేతలు శేఖర్, ప్రసన్న, శివ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం పాల్వంచ మండలంలోని భవానిపేట్ తండా, సింగరాయపల్లి, ఇసాయిపేట, మంథని దేవునిపల్లి, ఎల్పుగొండ, వాడి గ్రామాలల్లో పర్యటించి తన సొంత నిధులతో నిర్మించిన కుల సంఘ భవనాలు, ఆలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పోసు అనిల్, నాయకులు పండ్ల ప్రవీణ్, సురేష్, వెంకటరెడ్డి, బాలరాజు, నరసింహాచారి, శ్రీనివాసాచారి, నరేష్, నారాయణ, బాల్ నర్సు ఉన్నారు. -
ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
కంటోన్మెంట్/ ఉప్పల్/మద్నూర్ (జుక్కల్): ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్టీఓ చెక్పోస్టులో కూడా సోదాలు చేశారు. గురువారం ఉదయం తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు.. అక్కడ తచ్చాడుతున్న సుమారు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక్కో ఏజెంట్ వద్ద 50 వాహనాలు, లైసెన్సులు, రెన్యూవల్స్కు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నట్లు గుర్తించారు.ఇన్చార్జి ఆర్టీఓ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని సూచించారు. ఆర్టీఓ సిబ్బందిని కూడా విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగాయి. ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి రూ.3,450 నగదు, మొబైల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఏసీబీ సోదాలను ముందుగానే పసిగట్టిన కొందరు అధికారులు సెలవులు పెట్టి వెళ్లినట్లు ఒక ఏసీబీ అధికారి అనుమానం వ్యక్తంచేశారు. సోదాల విషయం లీకవ్వడం వల్లనే ఆశించిన విధంగా పట్టుకోలేక పోయినట్లు తెలిపారు. ఆర్టీఓ చెక్పోస్టులో సోదాలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆర్టీఓ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. అక్కడ లెక్కలోకి రాని రూ.91 వేల నగదును గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకున్న సమయంలో చెక్పోస్టు వద్ద ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కనిపించారు.విధుల్లో ఉండాల్సిన ఏఎంవీవై కవిత, కానిస్టేబుల్ మొయినొద్దీన్ నిద్ర పోతున్నారు. ఏసీబీ అధికారులను గుర్తించిన మరికొందరు ప్రైవేటు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. చెక్పోస్ట్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఏర్పాటుచేసిన ఒక డబ్బాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీల డ్రైవర్లు డబ్బులు వేస్తూ వెళ్తున్నారు. ఏసీబీ అధికారుల ముందే డ్రైవర్లు నగదును డబ్బాలో వేశారు. మొత్తం రూ.91 వేల అక్రమ నగదు లభించిందని డీఏస్పీ తెలిపారు. -
మాదకద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలి
బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడ: మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి చేయాలని బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐ అశోక్, తహసీల్దార్ వరప్రసాద్, ఉపాధ్యాయులు నరహరి తదితరులున్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎల్లారెడ్డి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. బుధవారం ఎల్లారెడ్డిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసులు అంబేడ్కర్ చౌరస్తా నుంచి బాలాగౌడ్ ఫంక్షణ్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్, ఎంఈవో రాజులు, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట మోడల్స్కూల్లో బుధవారం మాదకద్రవ్యాల నిషేధంపై నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీంతోపాటు మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులను పోలీసులు శాలువాతో సత్కరించి వారికి బహుమతులను అందజేశారు. మోడల్స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ జోత్స్యరాణి, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ
బీబీపేట: పామాయిల్ సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి వారిని సాగు చేసేందుకు సన్నద్ధం చేశాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు పామాయిల్ సాగు చేసేందుకు ఇప్పటికే చాలా మంది ముందుకు వచ్చారు. సాగుకు అనువైన పరిస్థితులు ఉండడంతో అధికారులు కూడా రైతులను పూర్తిగా అవగాహన కల్పించారు. అంతే కాకుండా ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రచారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 1,706 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం మరో 2,500 ఎకరాల్లో పామాయిల్ తోటలను పెంచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. పామాయిల్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనువైన జిల్లాగా కామారెడ్డిని గుర్తించింది. దీంట్లో భాగంగానే గత సంవత్సరం నుంచే రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికై తే సాగు చేయాలనే ఉద్దేశం ఉందో ఆ రైతుల వద్ద నుంచి సంబంధిత పత్రాలను సేకరించారు. జిల్లాలో పామాయిల్ కంపెనీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. అందుకు అనుగుణంగా 10 ఎకరాల స్థలం కోసం అధికారులు, పామాయిల్ కంపెనీ వారు చూస్తున్నారు. స్థలాన్ని కేటాయించినట్లయితే కంపెనీ నిర్మాణానికి కూడా ముందుకు రానున్నట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ.. బిందు సేద్య పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, సన్న చిన్న కారు రైతులకు 90 శాతం, మిగతా రైతులకు 80 శాతం రాయితీ ఉంటుంది. అయితే యూనిట్ ధరపై 7 శాతం లేదా, రూ.5 వేలు జీఎస్టీని రైతులే చెల్లించాలి. జనరల్, బీసీ రైతుకు 90 శాతం రాయితీ పోను మిగిలిన మొత్తంతో పాటు జీఎస్టీని చెల్లించాలి. డ్రిప్పై హెక్టారుకు యూనిట్ ధర రూ. 47,065 (మైక్రోజెట్స్), కాగా ఎమిటర్స్, మైక్రోజెట్స్ కలిపి యూనిట్ ధర రూ. 47,805 ఉంటుందని అధికారులు తెలిపారు. మొక్కలపై రాయితీ.. పామాయిల్ సాగుకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. సాగుకు బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీలకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ రైతులు.. పామాయిల్ మొక్క ఖరీదు రూ.400 కాగా వారు మొక్కకు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో నాటాల్సిన మొక్కలు 50 కాగా రూ. వెయ్యి బ్యాంకు డీడీ తీయాల్సి ఉంటుంది. అలాగే పంట సాగు చేసిన నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది. పామాయిల్ సాగుకు ముందుకు వస్తున్న రైతులు జిల్లాలో ఇప్పటికే సుమారు 1,706 ఎకరాల్లో సాగు పామాయిల్తో పాటు అంతర పంటలకు అవకాశం జిల్లాలో పామాయిల్ కంపెనీ ఏర్పాటుపై రైతుల ఆశలు పామాయిల్ తోటలు పెంచుకోవాలి జిల్లాలో పామాయిల్ సాగుపై రైతులకు ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించాం. అంతే కాకుండా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఎక్కువ సంవత్సరాలు ఆదాయం పొందేందుకు ఆయిల్పామ్ సాగు రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 50 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు రైతులు నాలుగేళ్ల పాటు తీసుకుంటే తర్వాత ఆదాయం వస్తుంది. – జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కామారెడ్డి -
కుమ్మర్ల తొలి బోనం జాతర కరపత్రాల ఆవిష్కరణ
బాన్సువాడ : ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే కుమ్మర్ల తొలి బోనం జాతరకు సంబంధించిన కరపత్రాలను జిల్లా శాలివాహన కుమ్మర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు దుర్కి నారాయణ బుధవారం బాన్సువాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాడమాసం పురస్కరించుకుని కనకాల కట్టమైశమ్మ గుడి లోయర్ ట్యాంకు బండ్ హైదరాబాద్లో నిర్వహించే జాతరను విజయవంతం చేయాలని కోరారు. కుమ్మరులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్, మండల అధ్యక్షులు దత్తు, నాయకులు పాపయ్య, మోహన్, సుభాష్, తదితరులున్నారు.సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలిదోమకొండ: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తీర్మల్ గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశానికి అతిథులుగా ఏఐసీసీ ఇంచార్జి విశ్వనాథన్, మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ హాజరవుతారని తెలిపారు. నేతలు నర్సారెడ్డి, శంకర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.నాణ్యమైన మెటీరియల్ వాడాలిపెద్దకొడప్గల్(జుక్కల్): నాణ్యమైన మెటీరియల్తో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి సూచించారు. బుధవారం చా వుని తండాలో నూతన జీపీ భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నేతలు శామప్ప పటేల్, గోపాల్ పాల్గొన్నారు.‘కంటికి అభివృద్ధి కనపడకపోవడం బాధాకరం’బిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని, అభివృద్ధి బీజేపీ నాయకుల కంటికి కనపడకపోవడం బాధాకరమని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్రెడ్డి అన్నారు. బుధవారం బిచ్కుంద ఏఎంసీ కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడారు. 11 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉంది.. జిల్లా, నియోజకవర్గ నాయకులు జుక్కల్ అభివృద్ధి కోసం చిల్లి గవ్వ నిధులు ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షం నాయకులు కండ్లు మండుతున్నాయని ఎద్దేవా చేశారు. నాయకులు జీవన్, లజయ్ పటేల్, నారాయణ, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ఇన్సూరెన్స్ కేసులో నిందితుల అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): అమాయకులను మోసం చేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ చేయిస్తున్న నిందితులను పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన సుప్పాల రాజు కొన్నేళ్ల క్రితం తన ఆటోను తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన దూదేకుల మౌళానాకు అమ్మాడు. మౌళానా కొనుగోలు చేసిన ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో ఆయన ఇన్సూరెన్సు కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీకి దరఖాస్తు చేసుకున్నాడు. 2019–20లో హైదరాబాద్ కంపెనీ మేనేజర్ గురువర్దన్ బీమా పత్రాలు నకిలీవిగా గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఇన్యూరెన్స్ చేయిస్తున్న తండ్రీకొడుకులు తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన ఏనుగు సాయిరెడ్డి, శ్రవణ్రెడ్డిపై 2019–20లో కేసు నమోదైనట్లు తెలిపారు. దీంతో వీరిని రిమాండు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులు సుమారు 500లకు పైగా నకిలీ బీమా పత్రాలు తయారు చేసి వాహనదారులకు అందజేసి రూ.లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. 2019–20 సంవత్సరానికి ముందు ఇన్సూరెన్సు పత్రాలు పొంది మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎల్లారెడ్డి సీఐ 8712686159 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. లింగంపేట ఎస్సై వెంకట్రావు, సిబ్బంది ఉన్నారు. -
కరెంట్ షాక్తో స్తంభంపైనే ఒకరి మృతి
బోధన్: విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగుల లాగుతుండగా ఓ వ్యక్తి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందాడు. నవీపేట ఎస్సై వినయ్ కుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట మండలం లింగాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో గ్రామానికి చెందిన దినసరి కూలి రెంజర్ల పోశెట్టి (44) బుధవారం ఇదే గ్రామానికి చెందిన రైతు కళ్లెం శివ పొలంలో కరెంట్ బోరుబావి వద్ద పనికి వెళ్లాడు. బోరుబావికి సంబంధించిన సర్వీస్ వైర్ను 11కేవీ లైన్ తీగలున్న స్తంభంపైకి ఎక్కి లాగుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాముకాటుతో మహిళ.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని చర్ల చిన్నమ్మ (52) అనే మహిళ బుధవా రం వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఇది గమనించిన బంధువులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త భూమయ్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు.. రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులో బుధవారం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలి కడారి చిన్న సాయిలు (37) మృతదేహం లభ్యమయింది. పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి రుద్రూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా రుద్రూర్కు చెందిన కడారి చిన్న సాయిలుగా గుర్తించారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల అతడు మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య బాలామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
లింగంపేట/నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో నెలకొన్న అధ్యాపకుల కొరతను తీరుస్తూ గెస్ట్లెక్చరర్లను నియమించామని ఇంటర్ విద్య నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. నాగిరెడ్డిపేట, లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు.విద్యార్థులతోపాటు అధ్యాపకులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని ప్రభత్వు జూనియర్ కళాశాలల్లో 5 వేల మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 20 జూనియర్ కళాశాలున్నాయని, వాటిల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇప్పటివరకు 2,500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారన్నారు. అనంతరం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు రాజశేఖర్రెడ్డి ఉన్నారు. -
మా భూములను మాకు ఇప్పించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): అబ్దుల్లానగర్ శివారులో ఉన్న మా భూములను మాకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ బ్రహ్మాజీవాడికి చెందిన రైతులు బుధవారం తహసీల్ కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబ్దుల్లానగర్ శివారులో గల 89, 95, 106, 122 సర్వే నంబర్లలో 32 మందికి 40 ఎకరాల భూమి ఉందని, 43 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని అన్నారు. గతంలో ఉన్న తహసీల్దార్ల తప్పిదం వల్ల కొందరు దొంగ పత్రాలు సృష్టించి కోర్టుకు వెళ్లి ఆ భూము లు మావేనని అంటున్నారని వాపోయారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ శ్వేతకు వినతి పత్రాన్ని అందజేశారు. -
ఉపాధ్యాయుడిపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ మందిర్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘ నేత దాడి చేయడం హేయమైన చర్య అని కామారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. తక్షణమే ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దేవులా, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు రాము, తదితరులు పాల్గొన్నారు. దాడి హేయమైన చర్య ఉపాధ్యాయుడిపై దాడి చేయడం హేయమైన చర్య అని తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని బాన్సువాడ డీఎల్పీవో వెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కోనాపూర్లో పర్యటించారు. గ్రామ పంచాయతి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి కార్యదర్శి భరత్కుమార్ను అభినందించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దోమకొండ: తాగునీరు కలుషితం కాకుండా గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. ముత్యంపేట గ్రామపంచాయతీలో బుధవారం తాగునీటి పైపులు చెడిపోగా మరమ్మతులు చేయించి మాట్లాడారు. గ్రామంలోని పలు వాటర్ట్యాంకులు, పైపులైన్లను పరిశీలించారు. వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి బాన్సువాడ రూరల్: సీజన్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హన్మాజీపేట్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ సూచించారు. బుధవారం హన్మాజీపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీజనల్ వ్యాఽధులపై అవగాహన కల్పించారు. అన్నం తినే ముందు, మల మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాసాన్పల్లిలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శి సుభాష్రెడ్డి, పాఠశాల హెచ్ఎం నిహారిక ఉన్నారు. ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఆయన శెట్పల్లిలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామాల్లో కార్యదర్శులు ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఏపీవో నరేందర్, శివరాం ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి భిక్కనూరు: రాజన్న–సిరిసిల్ల జిల్లా అగ్రహారం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒంటెద్దు శేఖర్ (23) మూడేళ్లుగా వేములవాడలోని ఓ పెట్రోల్ బంక్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం టిఫిన్ చేసేందుకు అగ్రహారం వద్దకు బైక్పై వెళ్లి, తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం బస్వాపూర్ గ్రామానికి రాత్రి తీసుకవచ్చారు. మృతుడికి తల్లి కళావతి ఉండగా, తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి లంబాడి యువసేవ తరపున ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. -
ఉపాధి అవకాశాలుండే విద్య అవసరం
తెయూ(డిచ్పల్లి): స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్తోపాటు ఉపాధి అవకాశాలుండే విద్య అవసరమని, అలాంటి విద్యా విధానం అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (టీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కాలేజ్ సెమినార్ హాల్లో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా సరైన మార్గదర్శనం చేయడానికి యూనివర్సిటీలు కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చూస్తున్నారని, ఆయన ఆశయాలను మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన విద్య ఉన్న వారికి సముద్ర అంతర్భాగాల నుంచి ఆకాశం వరకు అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంతో పోటీపడే విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. తెయూ వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంతో కో–ఆపరేటివ్ ఫెడరలిజం వల్ల అవినీతి తగ్గి ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సదస్సు కార్యదర్శి రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ.. జాతీయ సదస్సులో మానవ వనరుల నిర్వహణ, అకౌంటింగ్, ఆర్థికం, మార్కెటింగ్, పన్నులు, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చెయిన్, బిగ్ డేటా, ఆటోమేషన్పై పరిశోధకులు, విద్యావేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి విచ్చేసి పత్ర సమర్పణ చేసినట్లు తెలిపారు. విదేశాల నుంచి 4, భారత్లోని 8 రాష్ట్రాల నుంచి 174 పత్రాలు వచ్చినట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (ఐపీఈ) డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పురుషోత్తమరావు, అధ్యక్షుడు చెన్నప్ప, జనరల్ సెక్రెటరీ రవికుమార్ జాస్తి, రిజిస్ట్రార్ యాదగిరి ప్రసంగించారు. అనంతరం సదస్సులో ‘వికసిత్ భారత్–2047, ట్రాన్స్ఫార్మటివ్ రోల్ అఫ్ కామర్స్’ సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, సదస్సు కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్లు గంగాధర్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు కృషితెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల వసతులు ఉన్నాయని, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. తెయూలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు తగిన సౌకర్యాలు, ఫ్యాకల్లీ ఉందన్నారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరిలతో కలిసి తాను క్యాంపస్లోని భవనాలను, వసతి సౌకర్యాలను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే యూజీసీ ఆదేశాల ప్రకారం ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కళాశాలల్లో 20 శాతం స్కిల్ బేస్డ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇతర టెక్నికల్ కోర్సులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కిల్ (నైపుణ్యం) అత్యంత అవసరమని, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఉన్నట్లే థర్డ్ లాంగ్వేజ్ ఇకనుంచి స్కిల్ కోర్సులు ఉండాలని ఆయన వివరించారు. అలాగే కళాశాలలు కంపెనీలతో ఎంవోయూ చేసుకుని ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. సిలబస్లో మార్పులు చేస్తున్నామని, ఇందుకు వేర్వేరు రెగ్యులేటరీ కమిటీలు అనుమతులు అవసరమన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను గుర్తించి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెయూలో ‘వికసిత్ భారత్–2047’ జాతీయ సదస్సు -
చదివింది పీజీ.. చేస్తోంది పారిశుధ్య పని
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆమె ఉన్నత విద్యావంతురాలు.. పీజీ, బీఈడీ పూర్తి చేసింది. తండ్రి పారిశుధ్య కార్మికుడు.. ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ పోషణకు కూతురు ఆ పనిలో చేరింది. ఉన్నత విద్యనభ్యసించిన ఆమె ప్రస్తుతం పారిశుధ్య పనులు చేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లికి చెందిన శ్యామల దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. కామారెడ్డిలోనే ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ, బీఈడీ కూడా చదివింది. శ్యామల తండ్రి నాగయ్య మూడు దశాబ్దాలపాటు పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాడు. ఆయన అనారోగ్యానికి గురవగా.. 2021లో ఆయన స్థానంలో శ్యామలను కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగంలో చేర్చుకున్నారు. కొద్దిరోజులకే శ్యామల తండ్రి నాగయ్య చనిపోయాడు. కాగా పీజీతో పాటు బీఈడీ చదివిన శ్యామల పారిశుధ్య కార్మికురాలిగా పనిచేయడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, గడ్డి తీయడం వంటి పనులన్నీ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో మున్సిపల్ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. మురికి కాలువలు శుభ్రం చేయడం మూలంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని శ్యామల ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చదువును చూసి మున్సిపాలిటీలో ఏదైనా రాత పని ఇప్పించాలని వేడుకుంటోంది. తండ్రి స్థానంలో పారిశుధ్య కార్మికురాలిగా.. చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న శ్యామల -
అక్రమ కట్టడాల కూల్చివేత
మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట తండా పాఠశాల స్థలంలో చేపట్టిన అక్రమ కట్టడాలను మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాల్వంచ తహసీల్దార్ హిమబిందు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన గుగులోతు జమున, బానోత్ పింటు పాఠశాల స్థలాన్ని ఆక్రమించి బాత్రూమ్, ప్రహరీలు నిర్మించుకున్నారు. పాఠశాల హెచ్ఎం రమ్య ఫిర్యాదు మేరకు అక్రమార్కులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఖాతరు చేయకపోవడంతో మాచారెడ్డి ఎస్సై అనిల్, ఆర్ఐ శ్రీనివాస్రెడ్డి మంగళవారం సిబ్బందితో వెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారని తహసీల్దార్ తెలిపారు. -
కలిసి పోరాడితేనే డ్రైపోర్టు సాధ్యం
● తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం ● పవర్పాయింట్ ప్రజెంటేషన్తో కేంద్రమంత్రి అమిత్షాను కలుద్దాం ● జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటైతే రూ.వెయ్యి కోట్ల ఎకానమీ ● విలువ ఆధారిత పంట ఉత్పత్తులతో రైతులే ఎగుమతిదారులవుతారు ● ‘సాక్షి’ చర్చ వేదికలో వక్తల అభిప్రాయాలు ● పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్, రైతు ఉత్పత్తిదారుల సంస్థల బాధ్యులు ● జేఏసీ ఏర్పాటుకు తీర్మానం -
క్రైం కార్నర్
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్యవర్ని: మండలంలోని జాకోరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కమ్మరి సతీష్ (40) ఫొటో గ్రాఫర్గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అతడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట మండలంలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మున్నూరుపల్లి సాయిలు–అనసుజ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు మున్నూరుపల్లి అశోక్(22) ఇంటర్ వరకు చదివి, గొర్లను కాస్తున్నాడు. కొంత కాలంగా దుబాయి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పగా వారు వద్దని వారించారు. పెళ్లి చేసుకొమ్మని చెప్పగా తర్వాత చేసుకుంటానన్నాడు. మనస్తాపం చెందిన అశోక్ మంగళవారం ఉదయం తెల్లవారుజామున దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఖతార్లో ఆర్మూర్వాసి అదృశ్యంఆర్మూర్: పట్టణంలోని కాశీ హనుమాన్ గల్లీకి చెందిన కా నూర్ నాగరాజు ఖతార్లో అ దృశ్యం అయ్యాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపా రు. అతడి ఆచూకీ కనుగొనా లని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణి లో తండ్రి కానూర్ నారాయణ వినతిపత్రం సమ ర్పించారు. ఆరు నెలల క్రితం నాగరాజు ఖతార్కు వెళ్లి విధుల్లో చేరాడని, గత నెల 26 నుంచి ఫోన్లో అందుబాటులో లేడని అతడి తండ్రి ఆందోళన వ్య క్తం చేశారు. ఏదో క్రిమినల్ కేసు విచారణ కోసం పో లీసుల అదుపులో ఉన్నట్లు అనుమానంగా ఉందంటూ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూ ర్ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి చొరవ చూపాలని వారికి అభ్యర్థనలు పంపారు. ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను సందర్శించిన జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబులకు నారాయణ తన గోడును వెళ్లబోసుకున్నారు. చికిత్స పొందుతూ ఒకరి మృతిభిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన చెట్లపల్లి రవి (42) ఈనెల 14న తాటికొండ అశోక్ అనే వ్యక్తికి జ్వరం రావడంతో చికిత్స కోసం అతడిని బైక్పై ఎక్కించుకొని భిక్కనూరు ప్రభుత్వాస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో వారి బైక్ను కామారెడ్డి వైపు నుంచి భిక్కనూరుకు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్కు తరలించారు. అక్కడ రవి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
బస్డిపోపై సీఎంతో చర్చిస్తా
పేదోడి ఎయిర్పోర్ట్..– 9లో uబుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025‘నాటిన మొక్కలను సంరక్షించాలి’ కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి ని సంరక్షించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నషా ముక్త్ భారత్ వారం రోజుల కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ క ళాశాల ఆవరణలో మంగళవారం కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్లో భాగంగా జిల్లా సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పర్యావర ణ పరిరక్షణ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల పాల్గొన్నారు.‘ప్రతి చిన్నారికి టీకాలు వేయాలి’ భిక్కనూరు: ప్రతి చిన్నారికి తప్పనిసరిగా క్రమం తప్పకుండా టీకాలను వేయాలని రాష్ట్ర ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి అఖిల్ సూచించారు. మంగళవారం భిక్కనూరు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఎవరైనా చిన్నారులు టీకాలు తీసుకోవడంలో క్రమం తప్పితే వారిని గుర్తించి టీకాలు వేయాలని సూచించారు. దీనిపై తల్లిదండ్రులను అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని వ్యాక్సిన్ స్టోర్ రూమ్ను, వ్యాక్సిన్లను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పరిశీలకులు శ్రీనివాస్, నగేష్, వైద్యురాలు యెమిమా, పార్మసిస్ట్ అధికారి స్వామి, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటరమణ, డాటా ఎంట్రీ అధికారి సిద్ధార్థ ఉన్నారు. ‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’ కామారెడ్డి అర్బన్: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని టీ ఎన్జీవోస్ హాల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీ ఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు, బి ల్లులు మంజూరు చేయాలని, హెల్త్కార్డుల జారీ చేయాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రమోషన్ పొంది మెదక్ జిల్లాకు బ దిలీ అయిన సహకార శాఖ ఉద్యోగి సాయి లును సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ముల్కరాజు, అసో సియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ప్రతినిధులు లక్ష్మణ్, పోచయ్య, మ హిపాల్, శరణ్, సృజన్రెడ్డి, రమేష్, అజీమొద్దీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 30న హైదరాబాద్లో యాదవుల ఆత్మగౌరవ సభ కామారెడ్డి టౌన్: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 30న నిర్వహించే యాదవుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయా లని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ, కులపాలన చేస్తూ యాదవులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. యాదవులతోపాటు మున్నూరు కాపు, ఎంబీసీలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్కల ప్రభాకర్ యాదవ్, నాయకులు మల్లేశ్ యాదవ్, జగదీశ్ యాదవ్, కృష్ణ యాదవ్, వాసు యాదవ్, కొమరయ్య, రాజు, పవన్, కిరణ్, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు జిల్లా కేంద్రంలో ర్యాలీ కామారెడ్డి క్రైం: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించడానికి గురువారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలి పారు. ఉదయం 9 గంటలకు సీఎస్ఐ చర్చి గ్రౌండ్ నుంచి కళాభారతి వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, వాటితో కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : ఎల్లారెడ్డిలో బస్డిపో ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారని, ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డికి విచ్చేసిన మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం ఎల్లారెడ్డిలో రూ. 5 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్, విచారణ కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రేషన్కార్డులపై సన్నబియ్యం పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందని ద్రాక్షగానే మిగిలాయన్నారు. తాము ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు. తొమ్మిది రోజులలో రూ. 9 వేల కోట్లు.. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేశామని మంత్రి తెలిపారు. తొమ్మిది రోజులలో రూ.9 వేల కోట్లు అందించామన్నారు. 126 మహిళా సంఘాలకు మంజూరైన రూ. 10 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సంఘాలకు అందించారు.ఎల్లారెడ్డిలో నిర్మించిన బస్టాండ్ ను పేదోడి ఎయిర్పోర్టుగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు అభివర్ణించారు. ఎల్లారెడ్డి వెనకబడిన ప్రాంతమన్నారు. గత ప్రభుత్వంలో బస్టాండ్ నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయిందని, తాను రూ. 3.5 కోట్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణాన్ని పూర్తి చేయించానని పేర్కొన్నారు. రూ. 40 లక్షలతో ఫ్లడ్లైట్లు, 200 ఫీట్ల సీసీ రోడ్డు వేయించామని తెలిపారు. రూ. 74 కోట్లతో నిర్మించే ఏటీసీ సెంటర్కు భూమిపూజ చేశామన్నారు. ఈ ప్రాంతవాసుల ఎన్నో ఏళ్ల కల అయిన బస్డిపోను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యేల క్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, డీఆర్డీవో సురేందర్, అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, ఏఎంసీ చైర్మన్ రజిత, మున్సిపల్ మా జీ చైర్మన్లు పద్మ శ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, నాయకులు ప్రశాంత్గౌడ్, సాయిబాబా, నారాగౌడ్, శ్రీధర్గౌడ్, వినోద్గౌడ్, లింగాగౌడ్ పాల్గొన్నారు.మారుమూల గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత గాంధారి(ఎల్లారెడ్డి): మారుమూల గ్రామాల్లో వి ద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని పల్లెల మడుగు తండాలో మంగళవారం ఎంఈవో శ్రీహరితో కలిసి డీఈవో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా తండావాసులు డీఈవో రాజు, ఎంఈవో శ్రీహరిలను సన్మానించారు.వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్కామారెడ్డి క్రైం : వన మహోత్సవం లక్ష్యాలను సా ధించాలని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ సూచించారు. మంగళవారం రాష్ట్ర ప్రభు త్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి హై దరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ వన మహోత్సవం నిర్వహించాలన్నారు. రోజూ ఒక శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటాలన్నారు. అటవీ ప్రాంతాల్లో కోతులకు అవసరమై న పండ్ల మొక్కలను పెంచాలన్నారు. ఆగస్టు 15 లో గా భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షాలు కురవకముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రతి పట్టణంలో కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్లకు సూ చించారు. ఆయిల్పాం పంట విస్తరణకు చర్యలు తీ సుకోవాలన్నారు. 32,592 దరఖాస్తులు.. భూ భారతి రెవెన్యూ సదస్సులలో జిల్లాలో 32,592 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వాటిలో 27,223 దరఖాస్తులను ఆన్లైన్ లో పొందుపరిచామన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి 7,269 నోటీసులు జారీ చేశామన్నారు. ఆయా దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీసీలో డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, హౌసింగ్ పీడీ జ్యోతి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఆర్డీవో సురేందర్ పాల్గొన్నారు.నిజామాబాద్లీగల్/డొంకేశ్వర్: జిల్లాలో డ్రైపోర్టు సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పో రాడుదామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బాధ్యులు, ఇతర సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇందుకోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్షాను కలిసి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ఢిల్లీ వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్ర కాష్ హ్యుందయ్ షోరూంలో నిజామాబాద్ జిల్లా లో డ్రైపోర్టు ఏర్పాటు కోరుతూ చర్చ వేదిక జరిగింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పండుతున్న పసుపు, ధాన్యం, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్న, పత్తి, మామిడి పంటలకు అదనపు విలువ జోడించడంతో పాటు సిరిసిల్ల జిల్లాల్లో నేతన్నల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు నేరుగా ఎగుమతి చేసేందుకు డ్రైపోర్టుతో అవకాశం కలుగుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. పైగా ఈ ప్రాంతంలో రూ. వెయ్యి కోట్ల ఎకానమీ సాధ్యమవుతుందన్నారు. అన్నిరంగాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటై యువత కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నా రు. డ్రైపోర్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తి డి పెంచేందుకు కచ్చితమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని తీర్మానం చేశారు. చర్చ వేదిక సమన్వయకర్తగా సాక్షి బ్యూరో ఇన్చార్జి తుమాటి భద్రారెడ్డి వ్యవహరించారు. అన్ని పార్టీలు మద్దతు తెలపాలి ఇందూరులో డ్రైపోర్ట్ ఏ ర్పాటు కోసం చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న పోరాటానికి రాజకీయా లు అతీతంగా మద్దతు తెలపాల్సి ఉంది. దీని సాధన కోసం తెలంగాణ ఉద్య మం స్ఫూర్తిగా ముందుకెళదాం. డ్రైపోర్ట్ ఏర్పాటైతే జిల్లా అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. – రాజశేఖర్రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారిన్యూస్రీల్ఆర్టీసీకి రూ. 6 వేల కోట్లు చెల్లించాంరాష్ట్రంలో ఆర్టీసీలో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినప్పటినుంచి ఇప్పటివరకు మహిళలు 190 కోట్ల సార్లు ఉచితంగా బస్సులలో ప్రయాణించారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 6,008 కోట్లు చెల్లించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉంటుందా, మూసివేస్తారా అన్న పరిస్థితి ఉండేదని, అప్పటి ప్రభుత్వ ధోరణితో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఏళ్లనాటి సమస్యలను పరిష్కరించి వారి జీవన స్థితిగతులు మారుస్తోందన్నారు. జిల్లా కేంద్రాలైన ములుగు, పెద్దపల్లి పట్టణాల్లో బస్ డిపోలను ఏర్పాటు చేశామన్నారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటాలి వీసీలో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ -
డ్రైపోర్టుకు అన్నివిధాలుగా అనుకూలం
డ్రైపోర్టు ఏర్పాటుకు ని జామాబాద్ జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. గతంలో జిల్లాలో 85 వేల ఎకరాల్లో పసుపు, 45 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. తగిన మార్కెటింగ్ వ్యవస్థ, ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో పసుపు సాగు తగ్గిపోగా, చెరుకు సాగు లేకుండా పోయింది. అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నాణ్యమైన పంటలు పండించే రైతులున్న జిల్లాలో డ్రైపోర్టు అత్యవసరం. జిల్లా కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పంట, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్చు. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు ఎగుమతి చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. డ్రైపోర్టు కోసం గతంలో కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలను కలిసి వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం. సంకల్ప బలంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. డ్రైపోర్టు ఏ ఒక్కరి కోసమో కాదు, ముందు తరాల భవిష్యత్తు కోసం.. – నల్ల దినేష్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు -
చరిత్రకు సాక్షిగా నిలిచిన శివాలయం
మీకు తెలుసా? పట్టణంలోని అపురూపమైన ఏకచక్రేశ్వర శివాలయం చరిత్ర కు సాక్షిగా నిలుస్తోంది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ జిల్లాలోనే విశిష్టత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ● 13వ శతాబ్దంలో కాకతీయులు బోధన్ ప్రాంతాన్ని పాలించిన కా లంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు శివలీలామృతం అనే ప్రాచీన సంస్కృత గ్రంథంలో పేర్కొనబడింది. ● కాకతీయ పాలనలో ముష్కరులు దక్షిణ భారతదేశ దండయాత్రకు పూనుకున్న సమయంలో ఆలయాన్ని రక్షించుకునేందుకు ఈ ప్రాంతం వారు మట్టితో ఆలయాన్ని కప్పివేసి ఉంటారని ప్రచారంలో ఉంది. ● 1959లో గుంటూరు వాస్తవ్యుడైన రామిరెడ్డి అనే వ్యక్తి బోధన్లో స్థిరపడటానికి ఒక మట్టికోటను చదును చేస్తుండగా (పుష్య బహుళ అమావాస్య రోజు) ఈ ఆలయం బయల్పడినట్లు బోధన్ పూర్వీకులు చెబుతుంటారు. ● సముద్రంలో అరుదుగా లభించే ప్రత్యేకమైన సాలాగ్రామము శిలతో చేయబడిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపన చేయడం అత్యంత విశేషమైనది. ● ఆలయంలోని శివలింగానికి నిత్యం పూజలు చేసేవారికీ ధనధాన్యాలకు లోటు ఉండదని శివపురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతంలో ప్రజలకు తిండికి, నీటికి కొదవుండదు. ● ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో శివరాత్రి, కార్తీకమాసం, శ్రావణమాసంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలతోపాటు, భక్తులకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. – బోధన్రూరల్ -
రైతులే తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చు
వ్యవసాయ ఉత్పత్తుల్లో దేశంలోనే పేరుగాంచిన ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటైతే రైతులే ఎగుమతిదారులు గా తయారవుతారు. దేశంలోనే భారీ పసుపు మార్కెట్లలో నిజామాబాద్ మొదటి వరుసలో ఉంది. పంట ఉత్పత్తు లకు అదనపు విలువ జోడించకుండా వచ్చిన వెంటనే అమ్మేస్తే రైతులకు ఆశించిన ధర దక్క డం లేదు. ఈ క్రమంలో జక్రాన్పల్లి మండలంలో ఐదు గ్రామా ల రైతులం కలిసి తెలంగాణలోనే మొదటి పసుపు క్లస్టర్ను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటతో ఆర్గానిక్ పసుపు పౌడర్ను తయారుచేసి విక్రయిస్తున్నాం. డ్రైపోర్టు ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించబడతా యి. గల్ఫ్ దేశాలకు వెళ్లి పనిచేసే అవసరం ఉండదు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాకు డ్రైపోర్టును సాధించుకోవాలి. అందరం కలిసి పిడికిలి బిగిస్తేనే డ్రైపోర్టు కల సాకారమవుతుంది. ఎంపీ అర్వింద్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లను కలుద్దాం. – పాట్కూరి తిరుపతిరెడ్డి, పసుపు ఎఫ్పీవో చైర్మన్ -
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి
కామారెడ్డి టౌన్: విద్యార్థులను మందలించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేసి చితకబాదిన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ మందిర్ పాఠశాలలో జరిగింది. వివరాలు ఇలా.. హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 21న 5వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు బయటకు వెళ్లి, కొద్దిసేపటికి తిరిగి వచ్చారు. దీంతో వారిని ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఓ బాలిక ఈ విషయాన్ని ఆమె తండ్రి ఓ విద్యార్థి సంఘ నాయకుడు వడ్ల సాయి కృష్ణతో చెప్పింది. దీంతో వడ్ల సాయి కృష్ణ మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకుని బాలకృష్ణపై దుర్భాషలాడుతూ చితకబాదాడు. అనంతరం సదరు ఉపాధ్యాయుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తనపై అకారణంగా దాడి చేసిన సాయికృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుడు బాలకృష్ణ కోరారు. తన కూతురుని ఉపాధ్యాయుడు బెదిరించాడని సాయికృష్ణ తెలిపారు. ఘటనపై ఎంఈవో ఎల్లయ్య విచారణ జరిపి డీఈవోకు తెలిపారు. -
‘డబుల్’ ఇళ్ల బిల్లులు నొక్కేశారు
బిచ్కుంద(జుక్కల్): గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని, అధికారులు, నాయ కులు, కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శించి లబ్ధిరులకు తెలియకుండా బిల్లులు నొక్కేశారని ఆరోపిస్తూ మంగళవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుందలో ఎంపీడీవో గోపాల్కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘2023 సెప్టెంబర్లో గోపన్పల్లిలో కొట్టె పు ష్పలత, సందుల గంగవ్వ, నీరుడి నాగమణి, ఎం. సురేఖ, ఖాజాబీ, వడ్ల గీత, పొట్టి భూమవ్వ, శెట్పల్లి లక్ష్మి, నాయని శోభలకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో మద్నూర్ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఇళ్ల నిర్మాణ ం కోసం పనులు ప్రారంభించారు. బేస్మెంట్ వరకు కట్టి వెళ్లి పోయాడు. ఎన్నికలు ముగిశాక పనులు చేయలేదు. లబ్ధిదారులు సొంత డబ్బులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బిల్లులు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. అప్పట్లో పంచాయతిరాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో కుమ్మకై ్క మాకు తెలియకుండానే రూ.3 లోలు బిల్లులు నొక్కేశారు’ అని ఆరోపించారు. అప్పటి గృహలక్ష్మి పథకం జాబితాలో పరిశీలిస్తే ఇళ్ల నిర్మాణం పూర్తయింది.. రూ.3 లక్షల చెల్లించినట్లు జాబితాలో ఉందన్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
సర్వర్ డౌన్.. నిలిచిన రిజిస్ట్రేషన్లు
లింగంపేట(ఎల్లారెడ్డి): సర్వర్ డౌన్తో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వచ్చిన రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్ కార్యాలయం వద్ద నిరీక్షించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూభారతి చట్టం అమలు కోసం లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా రెండు నెలల పాటు రిజిస్ట్రేషన్లు అధికారులు నిలిపివేశారు. జూన్ 3 నుంచి తిరిగి రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. గత 15 రోజులగా ఆన్లైన్లో అంతరాయం ఏర్పడుతుండడంతో రైతులు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్ కారణంగా రోజుకు 4 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయమై తహసిల్దార్ను వివరణ కోరగా.. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ డౌన్ సమస్య ఉందన్నారు. -
ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేరుస్తా
మాచారెడ్డి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒ క్కొక్కటిగా నెరవేరుస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రత్నగిరిపల్లి, గణ్పూర్, కాకులగుట్ట తండా, లచ్చాపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తన సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు మూడేళ్లలో కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మాచారెడ్డి మండల అధ్యక్షుడు బూస సురేష్, జిల్లా సీనియర్ నాయకులు పొన్నాల వెంకటరెడ్డి, మండల ఇన్చార్జి పండ్ల ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, నాయకులు భరత్ యాదవ్, ఓదేలు, రమేష్, కిషన్ గౌడ్, తదితరులున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ -
సర్కారు బడిలో సాంకేతిక పాఠాలు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) పాఠాలు వేగవంతం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 5 పాఠశాలలో ప్రత్యేక తరగతుల నిర్వహణ జరుగుతోంది. ఇంకో వైపు ప్రభుత్వం 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలలకు 5 కంపూటర్లు మంజూరు చేయాలని నిర్ణయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో దాదాపు 800పైగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 214 పాఠశాలల్లో 50 మందికిపైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏఐ బోధనతో కంప్యూటర్పై అవగాహన.. ఏఐ వినియోగంతో ప్రాథమిక దశలోనే విద్యార్థులకు కంప్యూటర్లపై అవగాహన కలుగనుంది. కంప్యూటర్ విద్యపై భయం తొలగనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టిన సాంకేతిక బోధనతో విద్యార్థులు చతుర్విద ప్రక్రియలు నేర్చుకుంటున్నారు. తొలిసారిగా ఏడు పాఠశాలల్లో కంప్యూటర్లతో పాఠాలు నేర్చుకునే అవకాశం దక్కింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్లో పదాలు, వాక్యాలు, కూడికలు, తీసివేతల సామర్థ్యాలను అంచనా వేసి కేటగిరీలుగా విభజించారు. ఒక్కో విద్యార్థికి రోజుకు 20 నిమిషాలు చొప్పున వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాలు నేర్చుకునే అవకాశమిస్తున్నారు. అంతే కాకుండా ఏఐ విద్యను రెండు రకాలుగా బోధించనున్నారు. జిల్లాలో 27 పాఠశాలలో ఏఐ ద్వారా తెలుగు, గణితం బోధించడం ఓ పద్దతి అయితే గణితంను ఛాప్టర్–5 గా సిలబస్లో భాగంగా నేర్పించడం రెండో పద్ధతిగా బోధకులు చెబుతున్నారు. ఐదు పాఠశాలల ఎంపిక.. జిల్లాలో ఏఐ కంప్యూటర్ విద్యకోసం పైలట్ ప్రాజెక్టు కింద ఐదు పాఠశాలలను ఎంపిక చేశారు. శెట్పల్లి, కోమలంచ, బోర్లం, రామారెడ్డి, బావాపూర్ ఎంపీపీఎస్లను ఎంపిక చేసి ఏప్రిల్ 21 నుంచి విద్యనందిస్తున్నారు. 50 మంది విద్యార్థులు ఎక్కువున్న స్కూళ్లకు 5 కంప్యూటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐ విద్య పైలట్ ప్రాజెక్టుగా 5 పాఠశాలల్లో ప్రారంభం జిల్లాలో 214 పాఠశాలల విద్యార్థులకు మేలుపాఠాలు సులువుగా నేర్చుకోవచ్చు ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఏఐ ద్వారా పాఠాలు బోధించడం ద్వారా గణితం, ఆంగ్లం, కోడింగ్, డీకోడింగ్లను విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చు. దీని వల్ల క్రమం తప్పకుండా విద్యార్థులు పాఠశాలలకు వస్తారు. అంతే కాకుండా చిన్నతనంలోనే కంప్యూటర్పై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో కంప్యూటర్ విద్య అలవాటుగా మారుతుంది. – అయ్యాల సంతోష్, ఉపాధ్యాయుడు, బోర్లంఏప్రిల్ 21 నుంచి ప్రారంభించాం విద్యార్థులకు ఏఐ ద్వారా విద్యను నేర్పించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పైలెట్గా 5 పాఠశాలలో ఏప్రిల్ 21 నుంచి ప్రారంభించాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలో ప్రారంభించడానికి పనులు సాగుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం. మరి కొన్ని రోజుల్లో కంప్యూటర్ విద్య ప్రారంభమవుతుంది. – వేణుగోపాల్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, కామారెడ్డి -
జవాబుదారీగా విధులు నిర్వర్తించాలి
కామారెడ్డి క్రైం: అధికారులు జవాబుదారీగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 151 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, ఇబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. విచారణ జరిపి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో తీసుకున్న చర్యల సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియపరచాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రైలు ఢీకొని మహిళ మృతి
ఆర్మూర్టౌన్/నందిపేట్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివారులో గల రైల్వేట్రాక్పై మహిళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీబాయి(50) ఆదివారం పెర్కిట్లోని తన కూతురు ఇంటికి వచ్చింది. కూరగాయల వ్యాపారం చేస్తుండేది. కూతురి ఇంటి నుంచి రాత్రి బయల్దేరిన లక్ష్మీబాయిని గుర్తు తెలియని రైలు ఢీకొంది. ఉదయం గూడ్స్ రైలు వస్తుండగా ట్రాక్పై తీవ్రగాయాలతో ఉన్న ఆమె చేతు ఊపడంతో లోకో పైలెట్ గమనించి రైలును నిలిపారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిందన్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.రైలు నుంచి జారిపడి యువకుడు..ఖలీల్వాడి: నగరంలోని శాంతినగర్కు చెందిన అబ్దుల్ వాజీద్ (29) గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే మేనేజర్ సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. -
మహిళా అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న హిస్టరీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను బోధించటానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. 26న డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి నిరాహార దీక్షబాన్సువాడ: బాన్సువాడ పట్టణానికి చెందిన జర్నలిస్టు మేకల సాయిలు తనను కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సోమవారం ఎస్సీ వార్డులో గల శ్రీనివాస కల్యాణ మండపం వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. గ్రామాని చెందిన పానాదిని ఒక వ్యక్తి కబ్జా చేసి అమ్మడానికి ప్రయత్నించగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడంతో కుల సంఘం సభ్యులతో కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చర్యలు తీసుకునేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు. డబుల్ ఇళ్ల బిల్లుల కోసం పోలీసులకు ఫిర్యాదునిజాంసాగర్(జుక్కల్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ బిల్లులు ఇప్పించాలని మహమ్మద్ నగర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సోమవారం ఎస్సై శివకుమార్కు ఫిర్యాదు చేశారు. గిర్ని తండా, దూప్సింగ్ తండా, తెల్గాపూర్ గ్రామాల్లోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో తమకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కావడంతో ఇళ్లు నిర్మించామని తెలిపారు. రెండు విడతల్లో బిల్లులు ఇచ్చారని, మూడో విడత బిల్లులు రావాల్సి ఉందని, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తు న్నాడని ఆరోపించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసినా తమకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. -
డబ్బుల కోసం తల్లి హత్య
పోలీసుల అదుపులో కొడుకుబోధన్రూరల్: డబ్బులు, నగల కోసం కన్నతల్లిని కొడుకు గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన బోధన్ మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామానికి చెందిన అంబం చంద్రకళకు మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్ వెంకటితో 40 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కొడుకులు భూషణ్, సురేశ్, కూతురు జ్యోతి పుట్టిన తర్వాత చంద్రకళ భర్తకు దూరమై సుమారు 20 ఏళ్ల నుంచి పెంటాకుర్దులోనే ఒంటరిగా జీవిస్తోంది. పిల్లలందరికీ పెళ్లిళ్లు కాగా అప్పుడప్పుడు వారు తల్లి వద్దకు వెచ్చివెళ్తుంటారు. చిన్న కుమారుడు సురేశ్ నిత్యం తల్లి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వకపోతే గొడవ పడుతుండేవాడు. నాలుగు రోజుల కిత్రం తల్లి వద్దకు వచ్చిన సురేశ్ పెంటాకుర్దులోనే ఉంటూ ఆదివారం డబ్బుల కోసం గొడవకు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో చంద్రకళ (59)ను కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె కాలికి ఉన్న సుమారు 50 తులాల వెండి కడియాన్ని ఎత్తుకెళ్లాడు. సోమవారం చంద్రకళ రక్తపుమడుగులో ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
బోధన్: నవీపేట మండల కేంద్ర శివారులోని బాసర–నిజామాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. స్థానికులు, కుటుంబసభ్యుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నవీపేట మండలంలోని బినోలా గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ కొన్నేళ్లుగా మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. గంగాధర్కు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు బైండ్ల తేజశ్విని (16) ఇటీవల పదో తరగతి పూర్తి చేయగా, ఇంటర్ కోసం నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. కళాశాల హాస్టల్కు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం గంగాధర్ కూతురు తేజశ్వినితో కలిసి బైక్పై ఇంటి నుంచి బయల్దేరారు. మండల కేంద్ర శివారులో బాసర వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ.. బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోగా తీవ్రగాయాలైన తేజశ్విని అక్కడిక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కూతురు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గంగాధర్ ఫిర్యాదు మేరకు నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
నస్రుల్లాబాద్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమ వారం దుర్కి గిరిజన గురుకుల బాలికల పాఠ శాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో అకస్మాత్తుగా మరణించిన స్వప్న మరణానికి సంతాపం తెలిపారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే 108కు ఫోన్ చేయాలన్నారు. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సూపర్ వైజర్ను ఆదేశించారు. ప్రిన్సిపాల్ శ్యామలాదేవి, తదితరులున్నారు.ఇసుక ట్రాక్టర్ల తనిఖీలుబిచ్కుంద(జుక్కల్): ఇందిర మ్మ ఇళ్ల కోసం ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్లు ప్రయివేటు వ్యక్తులకు ఇసుక అమ్మ కుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా పోలీస్ అధికారులు సోమవారం బిచ్కుందలో తనిఖీలు చేపట్టారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘ఇసుక మేమే సరఫరా చేస్తాం..’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి అధికారులు స్పందిచారు. ఎస్సై మోహన్రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు వెళ్తున్నాయా లేదా అని ట్రాక్టర్లను ఆపి వేబిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆ గ్రామ ట్రాక్టర్ల యజమానులు ఇతర మండలాల ట్రాక్టర్లను క్వారీలోకి రాకుండా అడ్డుకుంటున్న విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల సహకారంతో ఇతర మండలాల ట్రాక్టర్లకు ఇసుక కోసం వే బిల్లులు ఇస్తామని తెలిపారు.రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇసుక అవసరం ఉన్నవారు అధికారుల అనుమతితోపాటు ట్రాక్టర్లకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. -
చెట్టును ఢీకొన్న మోపెడ్.. ఒకరి మృతి
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్నగర్ గ్రామశివారులో సోమవారం ఉదయం మోపెడ్ వాహనం చెట్టును ఢీకొని మహమ్మద్ గని(36) అనే వ్యక్తి మృతి చెందాడు. మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన గని పాన్షాపు డబ్బా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెట్రోల్ కోసం మోపెడ్పై వెళ్తున్న గని సుల్తాన్నగర్ శివారులో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొన్నాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సైనాజీ, తల్లి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ కేసులో ఒకరి అరెస్టునిజాంసాగర్(జుక్కల్): చోరీ కేసులో ఒకరి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ నెల 8 మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న మన్నె అంజవ్వ ఇంట్లో అత్రం ప్రశాంత్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ద్విచక్రవాహన చోరీలో.. నిజాంసాగర్(జుక్కల్): మాగి గ్రామంలో గత నెల 28న నిర్వహించిన కుస్తీ పోటీల ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు రవిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన పొట్లోళ్ల సాయిరాం మాగి గ్రామంలో కుస్తీ పోటీలు తిలకించేందుకు పల్సర్ బైక్పై వచ్చాడు. వాహనాన్ని పార్కింగ్ చేసి, కుస్తీపోటీలను తిలకించాడు. అనంతరం వెళ్లి చూడగా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింగ్రావ్పల్లి చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్పై వెళ్తున్న రవిని పట్టుకొని విచారించామని ఎస్సై తెలిపారు. బైక్ను తానే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశామన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీరామారెడ్డి: మండలంలోని పోసానిపేట గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై రాజారాం తెలిపిన వివరాల ప్రకారం.. పోసానిపేట గ్రామానికి చెందిన బచ్చు బలరాం ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం తిరిగి ఇంటికి రాగా, సామగ్రి చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు మూడు తులాల బంగారం, 15 తులాల వెండిని అపహరించినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. బస్టాండ్ ప్రహరీని ఢీకొట్టిన బస్సు● ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే ఘటన ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందే అనుకోని ఘటన ఏర్పడింది. మెదక్ డిపోకు చెందిన డీలక్స్ బస్సు సోమవారం బస్టాండ్లో రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనక వైపు ఉన్న ప్రహరీని తాకడంతో కూలిపోయింది. సమీపంలో ఉన్న విద్యుత్ స్థంభానికి బస్సు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు ఆందోళన చెందారు. కాగా, మంగళవారం మంత్రి చేతుల మీదుగా బస్టాండ్ ప్రారంభోత్సవం ఉండడంతో సిబ్బంది కూలిన ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి
లింగంపేట(ఎల్లారెడ్డి): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతోందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సోమవారం ఆయన బాయంపల్లి, అన్నారెడ్డిపల్లి, లింగంపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. బాయంపల్లిలో రూ. 20 లక్షల నిధులతో జీపీ భవనం నిర్మించినట్లు తెలిపారు. అలాగే లింగంపేట పానాది రోడ్డు స్థానిక పెద్దమ్మ ఆలయం ముందు నుంచి పోస్టాఫీసు వరకు రూ. కోటితో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్నారెడ్డిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయించినట్లు తెలిపారు. లింగంపేట మండల రైతులు భూ సమస్యలతో ఇబ్బందులు పడుతుండడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో మాట్లాడి భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి రఫియోద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, నేతలు శ్రీనివాస్రెడ్డి, సంతోష్రెడ్డి, కాశీరాం, ఎల్లమయ్య, అట్టెం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో బీటీ రోడ్లకు..ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మౌలాన్ఖేడ్, వెంకటాపూర్ అగ్రహారం, వెల్లుట్లతాండా, వెల్లుట్ల వెంకటాపూర్, సోమర్యాగడితాండా గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. మల్లయ్యపల్లి, శివాపూర్, అల్మాజీపూర్లలో నిర్మించిన నూతన జీపీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబా, సొసైటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, తదితరులున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు -
అధికారుల సంతకాలు ఫోర్జరీ
● కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు కామారెడ్డి క్రైం: విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. కే రవి కుమార్ అనే కానిస్టేబుల్ ఇటీవలే బదిలీపై దేవునిపల్లి పీఎస్కు వచ్చాడు. ఇది వరకు పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్సై సంతకాలు ఫోర్జరీ చేసి బస్సు వారంట్లను దుర్వినియోగం చేశాడు. విధులకు గైర్హాజరు కావడం, బదులుగా ఎస్సై సంతకాన్ని ఫోర్జరీ చేసి పై అధికారులకు నివేదికలు పంపించాడు. పలు విషయాల్లో రవికుమార్పై ఆరోపణలు రావడంతో బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి విచారణ జరిపి ఎస్పీ రాజేశ్చంద్రకు నివేదిక సమర్పించారు. దీంతో రవికుమార్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యంనిజామాబాద్ సిటీ: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర తొలి మహాసభ విజయవంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కే సూర్యం, కార్యదర్శిగా ఎస్ఎల్ పద్మ, ఉపాధ్యక్షులుగా ఎం నరేందర్, ఎం హన్మేష్, జీ రామయ్య, కే రాజన్న, సీ వెంకటేశ్, సహాయ కార్యదర్శిగా ఎం వెంకన్న, ముత్తన్న, వీ ప్రవీణ్, అరుణ్ కుమార్, యాకుబ్ షావలి, కోశాధికారిగా కిరణ్, సభ్యులుగా 26 మందిని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 15 తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణలోని కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని, పీఎఫ్, పెన్షన్ రూ.9వేలు చెల్లించాలని. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం నరేందర్, సహాయ కార్యదర్శులు ఎం ముత్తెన్న, ఎం వెంకన్న, జిల్లా కార్యదర్శి ఎం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేశ్వర్, మల్లేశ్, జిల్లా నాయకులు కిరణ్, రవి, సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
డిపో స్థలం వేదికగానే హామీలు..
ఎల్లారెడ్డి బస్ డిపో కోసం సేకరించిన స్థలంసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఎల్లారెడ్డి పట్టణం మధ్యలో ఉంటుంది. ఎల్లారెడ్డి మీదుగా జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తయితే ఎల్లారెడ్డి పట్టణం మరింతగా విస్తరించే అవకాశాలున్నాయి. డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డి పట్టణానికి నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, లింగంపేట, గాంధారి తదితర మండలాల నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. చుట్టుపక్కల మండలాల ప్రజలు జుక్కల్ ప్రాంతంతోపాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వెళ్లాలంటే ఎల్లారెడ్డిని దాటాల్సిందే.. ఈ ప్రాంతంలో బాన్సువాడ, మెదక్, హైదరాబాద్ల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులన్నీ ఎల్లారెడ్డి గుండానే తిరుగుతాయి. ఎల్లారెడ్డికి చుట్టుపక్కల వందలాది గ్రామాలున్నాయి. ఎల్లారెడ్డి బస్టాండ్ ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. డిపో లేక.. బస్సులు తిరగక... ఎల్లారెడ్డిలో బస్ డిపో లేకపోవడంతో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండాపోయింది. కొన్ని రూట్లలో కామారెడ్డి డిపో బస్సులు, మరికొన్ని రూట్లలో బాన్సువాడ డిపో బస్సులు నడుస్తున్నాయి. అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఇప్పటికీ బస్సు నడవని గ్రామాలు ఎన్నో ఉండడం గమనార్హం. ఇతర డిపోల అధికారులు ఎల్లారెడ్డి గ్రామాలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా బస్ డిపో ఉంటే చుట్టుపక్కల గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా బస్సులు నడిపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటనతో మళ్లీ ఆశలు.. ఎల్లారెడ్డి పట్టణంలో బస్ డిపో ఏర్పాటు కోసం రెండున్నర దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేశారు. ఏడు ఎకరాల స్థలం సేకరించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రతి ఎన్నిక సందర్భంలోనూ ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు అంశం తెరమీదికి వస్తుంటుంది. నాయకులు హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత మర్చిపోవడం షరామామూలుగా మారిపోయింది. చాలామందికి బస్సు డిపో ఏర్పాటవుతుందన్న ఆశ కూడా పోయింది. ఎన్నో ఏళ్లుగా బస్ డిపో పేరుతో ఓట్లు దండుకున్నారు తప్ప డిపో ఏర్పాటు చేయడం లేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బస్ డిపోలు రావడం లేదంటూ తప్పించుకున్నారని, పొరుగు జిల్లాల్లో బస్ డిపోలు ఏర్పాటవుతున్న విషయాన్ని గుర్తుచేస్తే ఏవేవో కారణాలు చెబుతారని పేర్కొంటున్నారు. బస్ డిపో ఏర్పాటు కోసం ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి విన్నవించారు. ఎల్లారెడ్డిలో బస్టాండ్ ప్రారంభోత్సవానికి మంగళవారం రవాణా శాఖ మంత్రి వస్తుండడంతో మళ్లీ ప్రజల్లో ఆశలు చిగురించాయి. బస్ డిపో ఏర్పాటు చేసి ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డిలో బస్డిపో ఏర్పాటు అంశం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. డిపో ఏర్పాటు అన్నది కాంపౌండ్ వాల్కే పరిమితమైంది. రెండున్నర దశాబ్దాలు దాటినా అడుగులు ముందుకు పడకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందుతున్నారు. మంగళవారం ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తున్న నేపథ్యంలో డిపో అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.నేడు ఎల్లారెడ్డి బస్టాండ్ ప్రారంభోత్సవం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో రూ. 4.25 కోట్ల మున్సిపల్ నిధులతో నిర్మించిన నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హైదరాబాద్ నుంచి మెదక్ వరకు హెలికాప్టర్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎల్లారెడ్డికి చేరుకుంటారని పేర్కొన్నారు. పాతికేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిన అంశం నెరవేరని ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్ష నేడు రవాణాశాఖ మంత్రి పొన్నం రాక డిపో ప్రకటించాలని కోరుతున్న నియోజకవర్గవాసులుబస్ డిపో ఏర్పాటు కాకపోవడంతో దానికోసం సేకరించిన ఏడెకరాల స్థలం ఖాళీగా ఉంటోంది. దీంతో ఆ స్థలాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ పార్టీల సభలకు, అధికారిక సభలకు ఉపయోగించుకుంటున్నారు. ఆ స్థలం వేదికగానే ఎందరో నాయకులు ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలు కాకపోవడం గమనార్హం. బస్డిపో ఏర్పాటు చేయాలి ఎల్లారెడ్డిలో బస్డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. డిపో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వం స్పందించి డిపో ఏర్పాటు చేయాలి. – చింతకుంట బాలయ్య, ఎల్లారెడ్డి ఇబ్బందులు తీరుతాయి నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, మెదక్ డిపోల బస్సులే ఆధారం. ఆ బస్సులు వచ్చేంతవరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఎల్లారెడ్డిలో డిపో ఉంటే రవాణా ఇబ్బందులు తీరుతాయి. – ఒడ్డె నర్సింలు, ఎల్లారెడ్డి -
29న అమిత్షా రాక
సుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈనెల 29వ తేదీన నిర్వహించే రైతు సమ్మేళనానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. కార్యక్రమానికి రైతు లు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాల ని కోరారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వల్లే కశ్మీర్ దేశంలో అంతర్భాగమైందని, ఆయన త్యాగాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు మర్చిపోలేరని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాల పసుపు రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అమిత్ షా నిజామాబాద్కు వస్తున్నారన్నా రు. పసుపు, ఇతర పంటల రైతుల భవిష్యత్ తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశముందని తెలిపారు. అదేరోజు మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తన వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఆయన కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరిస్తారన్నారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి శాశ్వత భవనం కోసం జెడ్పీ వెనక ప్రాంతంలో రెండెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించామని, ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన, ఉద్యమాలకు ఊపిరిలూదిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లను కోరింది తానేనన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, నాయకులు మోహన్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పేద విద్యార్థులకు వరంలా గురుకులాలు’
బాన్సువాడ : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు వరంలా మారాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ. 26 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరై ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులను అందించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్యామల, ఆర్సీవో సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ లత, పాఠశాల ప్రిన్సిపల్ శివకుమార్, నాయకులు యామ రాములు, శశికాంత్, శ్రీనివాస్గౌడ్, బస్వరాజ్, రఘు, బోయిని శంకర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ.. బాన్సువాడ నియోజకవర్గంలోని పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాన్సువాడలో సోమవారం పోచారం శ్రీనివాస్రెడ్డి అందించారు. 107 మందికి రూ. 35.41 లక్షల విలువ చేసే చెక్కులను అందించినట్లు తెలిపారు. -
మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు
కామారెడ్డి టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు, అనుబంధ బోధనాస్పత్రుల అభివృద్ధి, అత్యుత్తమ సేవలు అందేలా చూసేందుకు మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలవారీగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఆయా కళాశాలల్లో తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కమిటీలో ఎవరున్నారంటే.. నిజామాబాద్, కామారెడ్డి మెడికల్ కాలేజ్ మానిటరింగ్ కమిటీ ఇన్చార్జిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) రవీందర్ నాయక్కు బాధ్యతలు అప్పగించారు. తనిఖీ కమిటీలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు వినయ్కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్లకు చోటు కల్పించారు. వీరు ఆయా జిల్లాల పరిధిలో బాధ్యులుగా ఉంటారు. కమిటీ సభ్యులుగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిజామాబాద్ ఈఈ కుమార్లను నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి 29 మధ్య కమిటీ ప్రతినిధులు ఆయా కళాశాలల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఇబ్బందులు, లోపాలు, సమస్యలపై నివేదికలను సిద్ధం చేసి ఈనెల 30న ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది. తనిఖీలలో భాగంగా కళాశాలకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ను కూడా రూపొందించనున్నారు. రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై ఎన్ఎంసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మానిటరింగ్ కమిటీల పర్యవేక్షణలో కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు అంశాలపై తనిఖీలు..ప్రధానంగా ఆరు అంశాలపై ఈ కమిటీ దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి అంశంలో మౌలిక సదుపాయాలు, భవనాలు, లెక్చరర్ హాళ్లు, ల్యాబ్లు, హాస్టళ్లు, పడకల సంఖ్య, వైద్య పరికారాలు, నీటి సరఫరా, శానిటేషన్ ఉన్నాయి. రెండో అంశంలో అధ్యాపకులు, సిబ్బంది పోస్టులు, ఖాళీలు, మూడో అంశంలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు బోధన ప్రణాళిక అమలు, నాలుగో అంశంలో విద్యార్థుల సంక్షేమం, మోడికోలకు వసతి, సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, ర్యాగింగ్ నిరోధ చర్యలు, విద్యార్థుల ఫిర్యాదులున్నాయి. ఐదో అంశంలో ఆర్థికపరమైన అంశాలు, అవసరమైన నిధులు, ఆరో అంశంలో డిజిటల్ వ్యవస్థలో భాగంగా హాజరు అమలు, సీసీ టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యం వంటివి ఉన్నాయి. ఆయా అంశాలపై కమిటీ తనిఖీలు చేసి నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని కాలేజీల బాధ్యతలు డీపీహెచ్కు.. కమిటీలో కలెక్టర్లకు చోటు -
‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చాలి’
కామారెడ్డి టౌన్ : భారతీయ జనసంఘ్ వ్య వస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కార్యకర్తలు నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఆయన దేశ సమైక్యత కోసం ప్రా ణాలను అర్పించిన మహానేత అని కొనియాడారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఉద్యమించిన ఆనాడే ఉద్యమించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయన ఆశయాన్ని నెరవేర్చారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 28న ట్రయాథ్లాన్ జిల్లా స్థాయి ఎంపికలు కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 28న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి ట్రయాథ్లాన్ ఎంపిక పో టీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షు డు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్– 10, 12, 14 బాలబాలికల విభాగాల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, బ్యాక్ త్రో, 600 మీటర్ల కిడ్స్ జావెలిన్ త్రో, స్టాండింగ్ బోర్డ్ జంప్ అంశాల్లో ఎంపిక పో టీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు. ‘కొత్త పెన్షన్ చట్టాన్ని రద్దు చేయాలి’ కామారెడ్డి అర్బన్ : కొత్త పెన్షన్ చట్టాన్ని ర ద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు హన్మంత్రెడ్డి, విజయరామరాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ని రసన తెలిపిన అనంతరం పెన్షనర్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ వినతిని ప్రధానమంత్రికి పంపా లని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో అ సోసియేషన్ రాష్ట్ర సలహాదారులు లచ్చ య్య, ప్రతినిధులు గంగారాం, రవీందర్, రా జలింగయ్య, సత్యనారాయణ, విశ్రాంత ఉ పాధ్యాయులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయలలో విలేకరులతో మాట్లాడారు. ప్రొటోకాల్ పేరిట ఎమ్మెల్యే అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వెంకటరమణారెడ్డి సొంత మెనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్రెడ్డి, గోనె శ్రీనివాస్, సందీప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ ఎస్హెచ్వోగా నరహరి కామారెడ్డి క్రైం : కామారెడ్డి పట్టణ ఎస్హెచ్వోగా రెండేళ్లుగా పనిచేస్తున్న చంద్రశేఖర్రెడ్డి బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1 పరిధిలో ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కామారెడ్డి ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి మల్టీ జోన్–1 కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్నారు. ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న నరహరి రానున్నారు. -
జిల్లాలో హాట్ టాపిక్గా ‘ఫోన్ ట్యాపింగ్’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డిలోనూ హాట్టాపిక్గా మారింది. స్థానికంగా పలువురు నేతలకు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసు అధికారులు ఫోన్లు చేసి ట్యాపింగ్ జరిగిన విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కామారెడ్డి హాట్సీట్గా మారిపోయింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఇద్దరు కీలక నేతలను కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించారు. అయితే ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగిందన్న ప్రచారం జరిగింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కామారెడ్డికి చెందిన పలువురికి ఫోన్లు చేసి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సమాచారం కోసం పిలుస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకుడు దేవరాజ్గౌడ్కు సిట్ అధికారుల నుంచి ఫోన్ రాగా ఆయన మూడు నాలుగు రోజుల్లో వస్తానని వారికి సమాచారం ఇచ్చారు. అలాగే ఇటీవలే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్రెడ్డికి కూడా సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి కూడా అధికారులు ఫోన్ చేసి హైదరాబాద్కు రావాలని సూచించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న అంశంపై వివరాలు సేకరించిన పోలీసులు వారిని వాంగ్మూలంకోసం పిలుస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 11 గంటలకు సిట్ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నట్లు గడ్డం చంద్రశేఖర్రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. బాధితులు ఎందరో..జిల్లాలో ఫోన్ ట్యాపింగుకు గురైనవారు ఎందరున్నారో అన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలన్నీ కామారెడ్డి నియోజకవర్గం చుట్టే తిరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ను ఓడిస్తానంటూ ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి చాలెంజ్ చేసి వచ్చి బరిలో నిలిచారు. ఇద్దరు ఉద్దండులను వెంకటరమణారెడ్డి ఓడించడం అప్పట్లో సంచలనం కలిగించింది. కాగా కామారెడ్డిలో ఎందరి ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయన్న దానిపై చర్చ నడుస్తోంది. సిట్ అధికారుల వద్ద ఉన్న జాబితాలో ఉన్న వారికి ఫోన్లు వస్తుండడంతో ఇంకా ఎవరెవరున్నారోనని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. పలువురికి సిట్ అధికారుల నుంచి ఫోన్లు కాంగ్రెస్ లీగల్ సెల్ నేత దేవరాజ్గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిలకు పిలుపు -
‘పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి’
కామారెడ్డి అర్బన్ : చిన్ననాటి నుంచే క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశా ల కోసం సో మవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ని ర్వహించారు. క్రీడలు, యువజన శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో మొక్కను నా టారు. విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించి 10 మంది చొప్పున బాలబాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో వచ్చేనెల 2న నిర్వహించే ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపేవారు ఆ యా క్రీడా పాఠశాలల్లో ప్రవేశం పొందనున్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడలు, యువజన శాఖ అధి కారి జగన్నాథన్, స్కూ ల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానం కామారెడ్డి క్రైం: రక్తదానం ప్రాణదానంతో సమాన మని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఎస్బీఐ 71 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలోని ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 100 మందికిపైగా ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఓ నిండు ప్రాణాన్ని కాపాడినవారం అవుతామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రయివేటు నుంచి ప్రభుత్వానికి మారిన కళాశాల
మీకు తెలుసా? ఆర్మూర్ పట్టణ శివారులోని పిప్రి రోడ్డులోగల 105 ఎకరాల విస్తీర్ణంలో కేవీ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో 1966లో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి కళాశాలను ఏర్పాటు చేశారు. డాక్టర్ లక్ష్మణ్రావ్ ఈ కళాశాలకు మొట్ట మొదటి ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. ● 1967 జూలై 3న యూజీసీ పరిధిలోకి తీసుకొని యూజీసీ యాక్ట్ 2ఎఫ్ (12బీ) గుర్తింపును ఇచ్చారు. 1969–70లో ఇంటర్మీ డియట్ విధానాన్ని ప్రారంభించారు. ● 1981లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కళాశాలను స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా పిలవడం ప్రారంభించారు. ● 1996లో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రెండుగా వేరు చేశారు. ● 2006లో ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ (ఎన్ఏఏసీ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) మొదటి ఫేస్ గుర్తింపు వచ్చింది. ● జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనంతరం జిల్లాలో నాక్ గుర్తింపు ఉన్న ఏకై క ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్ కళాశాల. – ఆర్మూర్ -
భూ తగాదాలతోనే వస్త్రల వ్యాపారిపై దాడి
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణం యజమానిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భూ తగాదాల కారణంగానే దాడి జరిగినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సై మోహన్రెడ్డి ఆదివారం వివరాలను వెల్లడించారు. ఈనెల 15న బిచ్కుందలోని ఓ వస్త్రాల షాపులో యజమాని శేక్ ఖలీల్పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో అతడి కి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణా ల్లో విచారణ చేపట్టారు. ఖలీల్కు అతడి బంధువులైన షేక్ అమన్ కుటుంబ సభ్యుల మధ్య కొన్నేళ్ల నుంచి భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఖలీల్ను చంపి భూమి స్వాధీనం చేసుకోవాలని షేక్ అమన్, కుటుంబ సభ్యులు ప్లాన్ వేశారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన ముబీన్, రితేష్, వైభవ్, సుషాంత్ నలు గురు వ్యక్తులకు రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చి ఖలీల్ ను హత్య చేయాలని ఒప్పందం చేసుకున్నారన్నా రు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. షేక్ అమన్ కుటుంబ సభ్యులు పారారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన బిచ్కుంద ఎస్సై మోహన్రెడ్డి -
‘ధరణి’లో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధి లోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని టౌన్షిప్ బాధితులు డిమాండ్ చేశారు. ఆదివారం టౌన్షిప్ సమీపంలోని గెలాక్సీ ఫంక్షన్లో హాల్లో టౌన్షిప్లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు సమావేశమయ్యారు. అనంతరం టౌన్షిప్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అధికారులు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పడంతో ధరణి టౌన్షిప్లో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క నీస వసతులు కూడా లేకపోవడంతో నివాసం ఉండలేకపోతున్నామని, కొత్తగా ఇళ్లు కట్టుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే కనీస వసతులు క ల్పించాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని హె చ్చరించారు. సమావేశంలో ధరణి టౌన్షిప్ బాధితుల సంఘం ప్రతినిధులు పి.రాజనర్సింహారెడ్డి, న రాల వెంకట్రెడ్డి, జశ్వంత్రావు, కై లాస్ రాజేశ్వరరా వు, బి.అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బోనస్ ఎప్పుడిస్తరో?
సర్కారు గత ఖరీఫ్ సీజన్లో సన్నరకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వడంతో చాలామంది రైతులు రబీలోనూ సన్నరకాలు పండించారు. అయితే కొనుగోళ్లు పూర్తై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ ఊసెత్తడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.కామారెడ్డి క్రైం : రైతులు పండించిన వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని పేర్కొంది. దీంతో పలువురు రైతులు బోనస్పై ఆశతో సన్నరకాల సాగుకు మొగ్గు చూపారు. గత ఖరీఫ్ సీజన్లో సర్కారు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందించింది. ధాన్యం డబ్బులతో పాటే ఒకటి రెండు రోజులు అటూఇటుగా బోనస్ కూడా రైతుల బ్యాంకు ఖాతాలలో జమయ్యింది. దీంతో బోనస్పై ఆశతో అన్నదాతలు రబీలోనూ సన్నరకాలు పండించారు. జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వడ్ల సేకరణ పూర్తై నెల రోజులు కావొస్తోంది. ఇప్పటికీ బోనస్ డబ్బులు రైతులకు అందలేదు. 72,852 మంది రైతుల ఎదురుచూపు.. జిల్లాలో ప్రధాన పంట వరి. గతంలో రైతులు ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. యాసంగిలో సన్నాల సాగుకంటే దొడ్డు రకాలే దిగుబడి ఎక్కువగా వస్తాయి. కానీ బోనస్పై ఆశతో సన్నరకాలు వేశారు. జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగి సీజన్లో 2,61,110 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో దాదాపు 60 వేల ఎకరాల్లో సన్నాలున్నాయి. ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో 63 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నరకం ధాన్యం సేకరణకే కేటాయించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. దొడ్డు, సన్నరకాలు కలిపి 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. దీంట్లో 1,78,416 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి (మద్దతు ధర) రూ. 886 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బులు రూ. 89 కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లు విక్రయించిన మొత్తం 72,852 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం బోనస్ చెల్లించకపోతే రైతులు మళ్లీ పాత పద్ధతిలో దొడ్డు రకాల సాగుపైనే దృష్టి పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. యాసంగి ‘భరోసా’ రాలే!ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి పూ ర్తిస్థాయిలో రైతు భరోసా చెల్లించలేదు. నాలుగెకరాలలోపు రైతులకు మాత్రమే పెట్టుబడి సా యం అందింది. నాలుగెకరాలపైన భూమి ఉ న్న రైతులకు ఇప్పటికీ రైతు భరోసా ఇవ్వలేదు. జిల్లాలో 56 వేల మంది రైతులకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడి సాయం రా వాల్సి ఉంది. ఓవైపు యాసంగి పెట్టుబడి సా యం అందక, మరోవైపు సన్నాలకు బోనస్ రా క సదరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై వారిలో అసహనం వ్యక్తమవు తోంది. ఇప్పటికై నా సర్కారు స్పందించి రైతు భరోసాతోపాటు బోనస్ డబ్బులు ఖాతాలలో జమ చేయాలని కోరుతున్నారు. ధాన్యం సేకరణ పూర్తై నెల.. ఇప్పటికీ పత్తాలేని ప్రోత్సాహకం జిల్లాకు రావాల్సింది రూ. 89 కోట్లు నిరాశలో అన్నదాతలు -
పనితీరు అంతంతే..
నిజామాబాద్అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల పనితీరులో ఉమ్మడి జిల్లా వెనకబడింది. కేంద్ర విద్యాశా ఖ పాఠశాలల పనితీరుపై ఇటీవల పర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(పీజీఐ) విడుదల చేసింది. బడుల్లో మౌలిక వసతుల కొరత, డిజిటల్ విద్యావిధానం లేకపోవడం, తరగతికి ఒక టీచర్ను నియమించకపోవడంతో అభ్యసన సామర్థ్యం తగ్గి గ్రేడింగ్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వెనుకబడ్డాయి. కేంద్ర విద్యాశాఖ 2023–24 విద్యా సంవత్సరానికి అన్ని రాష్ట్రాల్లో విద్యాస్థితిగతులపై అధ్యయ నం చేసి పనితీరు నివేదికలను జిల్లాలవారీగా విడుదల చేసింది. ఎన్సీఈఆర్టీ, యూ–డైస్, న్యాస్, ఎండీఎం ద్వారా వివరాలను సేకరించిన కేంద్ర విద్యాశాఖ వాటిని క్రోడీకరించి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో జిల్లాల వారీగా చూస్తే కామారెడ్డి జిల్లా 12వ, నిజామాబాద్ 18వ స్థానంలో నిలిచాయి. పర్యవేక్షణ.. ప్రక్షాళన లేక.. పాఠశాల విద్యాశాఖలో ప్రతి విద్యార్థిని పాస్ చే యించి పై తరగతికి పంపించే క్రమంలో కాగితాలు మారుతున్నా.. విద్యార్థుల సూక్ష్మ ప్రగతిని ఉపాధ్యాయులు అంచనా వేయలేకపోతున్నారు. అలాగే ప్రా థమిక స్థాయిలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడంతో ప్రా థమిక బడుల్లో విద్యార్థుల నమోదు క్రమంగా తగ్గుతోంది. చాలా పాఠశాలల్లో సరైన మరుగు దొడ్లు, మూత్రశాలలు, అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రా థమిక పాఠశాలల్లో కంప్యూటర్లు లేక విద్యార్థులకు డిజిటల్ విద్య అందడం లేదు. మధ్యాహ్న భోజన నిర్వహణలో వంట సిబ్బందికి ఇస్తున్న సొమ్ము సరిపోక విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఒక్క నిజామాబాద్ రూరల్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో ఇన్చార్జి ఎంఈవోలు ఉండడంతో పర్యవేక్షణ గాడితప్పింది. పర్ఫార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్ విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ వెనకబడిన ఉమ్మడి జిల్లా మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకంలో వెనుకంజ మెరుగైన విద్య అందిస్తున్నాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తున్నాం. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలు రాని పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నాం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – అశోక్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: పాఠశాలలపై పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ ఉపాధ్యాయులకు అ ప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభు త్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఆర్పీ ల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయ ణ డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్ర కారం ఉపాధ్యాయులను పర్యవేక్షకులుగా ని యమించే అధికారం లేదని పేర్కొన్నారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీ)లకు పూర్తి స్థాయి పాఠశాల పర్యవేక్షణ అధికారాలు ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించాలి మాచారెడ్డి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పాల్వంచ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు రాములు, మనోహర్ రెడ్డి, తిరుపతిరావు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్కు తరలిరావాలి కామారెడ్డి అర్బన్: కొత్త పెన్షన్ చట్టాన్ని వ్యతి రేకిస్తూ ప్రధాన మంత్రికి కలెక్టర్ ద్వారా అందజేసే పెన్షనర్ల మహాజరుపై సంతకం చేయడానికి విశ్రాంత ఉద్యోగులు తరలిరావాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయమై అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతురెడ్డి, విజయరామరాజు, రాష్ట్ర సలహాదారు లచ్చయ్య ఒక ప్రకటన వి డుదల చేశారు. పెన్షనర్ల సంతకంతో కూడిన లేఖను సోమవారం సాయంత్రం 4 గంటల కు కలెక్టర్కు అందించనున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల కోసం భవనం పరిశీలన బీబీపేట : మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం స్థానికంగా ఉన్న ఓ భవనాన్ని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఆదివారం పరిశీలించారు. భవన నిర్మాణం మరో వారం రోజుల్లో పూర్తవుతుందని షేక్ సలాం పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామన్నారు. కళాశాలలో ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. విద్యార్థులు సోమవారంనుంచి తరగతులకు హాజరు కావాలని సూచించారు. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చూడండి ● ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ : పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై కి రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించా రు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ముందు డ్రెయినేజీలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని ఇటీవల ఆగ్రో ఇండస్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ దగ్గరుండి తీయించారు. ప్రధాన రహదారి పక్కన డ్రెయినేజీల్లో తీసి న చెత్తాచెదారాన్ని ఆదివారం పోచారం పరి శీలించారు. డ్రెయినేజీలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రజలకు సూచించారు. రేపు చలో తెలంగాణ యూనివర్సిటీ భిక్కనూరు: చలో డిచ్పల్లి తెలంగాణ యూ నివర్సిటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు పూర్వ జేఏసీ అధ్యక్షుడు పీబీ.సత్యం తెలిపారు. ఆదివారం ఆయన భిక్కనూరులోని సౌత్ క్యాంపస్లో మాట్లాడారు. పీహెచ్డీ పూర్తి చేసినవారికి తెలంగాణ వర్సిటీ ద్వితీయ కాన్వొకేషన్ రోజున పట్టాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు భరత్, రమేష్, శ్రీనివాస్, పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సిట్’ నుంచి కాంగ్రెస్ నేతకు పిలుపు
కామారెడ్డి క్రైం : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కామారెడ్డిలోనూ కలకలం రేపుతోంది. న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం కోసం హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలంటూ సిట్ ఆయనకు ఆదివారం ఫోన్ కాల్ ద్వారా తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఉంది. ఆయన షబ్బీర్ అలీకి నమ్మకమైన వ్యక్తి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండల్రెడ్డి చూసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి సైతం కొండల్రెడ్డి వెంటే ఉంటూ పార్టీ ప్రచార, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు. అందుకే ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేసి ఉంటారని తెలుస్తోంది. రాజగోపాల్రెడ్డితోపాటు జిల్లాలోని పలువురి ఫోన్లు సైతం ట్యాపింగ్కు గురైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని కొందరు అధికారులు, నేతలు అందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే.. గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గంనుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి పోటీ చేశారు. దీంతో కామారెడ్డి ఎన్నికల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇద్దరు ముఖ్య నేతలూ కామారెడ్డిలో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తన ప్రత్యర్థి వర్గం కదలికలను తెలుసుకోవడానికి కేసీఆర్ వర్గం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఓ ట్యాపింగ్ బృందాన్ని కామారెడ్డికి పంపి ఓ హోటల్లో అడ్డా వేసి ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారని కేసు ప్రారంభంలో జరిగిన విచారణలో తేలింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నాయకుల కదలికలపై, ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగానే ఎన్నికల సమయంలో పలు ఘటనలు సైతం జరిగాయి. కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఒకరైన గూడెం శ్రీనివాస్రెడ్డికి చెందిన వ్యాపార కార్యాలయంలో జరిపిన దాడుల్లో రూ. 58 లక్షలు పట్టుబడ్డాయి. దేవునిపల్లి ప్రాంతంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి నివాసం ఉన్న ఇంట్లో కూడా ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఆయనను గృహ నిర్భంధం కూడా చేశారు. అప్పటి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ ఇంటిపైనా పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్తో వివరాలు తెలుసుకునే దాడులు చేశారని తెలుస్తోంది. కామారెడ్డిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీ రుపై విచారణ జరిపిన ఇంటెలిజెన్స్ వర్గాలు సిట్కు నివేదిక సమర్పించాయి. తాజాగా కేసులో పురోగతి రావడంతో ఇప్పుడు ట్యా పింగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట కు వస్తున్నాయి. సిట్ నుంచి ఇంకా ఎంత మందికి ఫోన్కాల్ వస్తుందోనన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది. వాంగ్మూలం ఇవ్వాలంటూ ఫోన్ కాల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా రాజగోపాల్రెడ్డి -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్దకొడప్గల్ ఇన్చార్జి విద్యుత్ మండల అధికారి పవన్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పెద్దకొడప్గల్ గ్రామ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించామని తెలిపారు. పెద్దకొడప్గల్, శివాపూర్ సబ్స్టేషన్లకు నిరంతరం విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ గతంలో ఏబీ స్విచ్ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడిందని, ఇప్పడు ఏబీ స్విచ్ పెద్దకొడప్గల్లో బిగించడం వల్ల ఆ సమస్య తీరిందని చెప్పారు. లైన్మెన్ కాశీరాం, రాజేష్ పాల్గొన్నారు. -
ఇసుక మేమే సరఫరా చేస్తాం
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులపై ఇసుక భారం పడొద్దని మంచి లక్ష్యంతో ప్రభుత్వం స్థానికంగా ఉన్న మండలాల్లో ఇసుక క్వారీల నుంచి ఉచితంగా ఇసుక తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్రాక్టర్ల యజమానుల ఇష్టారాజ్యంతో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందక భారంగా మారింది. బిచ్కుంద మండలం పుల్కల్, హజ్గుల్, శెట్లూర్, ఖద్గాంలో ఇసుక క్వారీలు ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు ఈ క్వారీల నుంచి తీసుకెళ్లవచ్చని జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇసుక తరలించాలని సూచించారు. పుల్కల్, హజ్గుల్, ఖద్గాం గ్రామాల ట్రాక్టర్ యజమానులు కొర్రీలు పెట్టి మా గ్రామం ఇసుకను మా గ్రామ ట్రాక్టర్ల ద్వారానే ఇసుక విక్రయిస్తాం.. వేరే గ్రామాల ట్రాక్టర్లను క్వారీలోకి రానివ్వమని అడ్డుకుంటున్నారు. మా గ్రామం ఇసుక మేమే అమ్ముతామంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం మండలాల ట్రాక్టర్లకు అధికారులు ఇసుక అనుమతి ఇస్తే తక్కువ కిరాయితో లబ్ధిదారులకు ఇసుక వేస్తామని ట్రాక్టర్లు యజమానులు అంటున్నారు. అధికారులు ఇతర మండలాలకు అనుమతులు ఇవ్వకుండా ఆ నాలుగు గ్రామాల ట్రాక్టర్లకు మాత్రమే ఇసుక అనుమతి ఇవ్వడంతో అధికారులకు ముడుపులు అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధరలు పెంచేశారు.. హజ్గుల్, పుల్కల్, ఖద్గాం ఒక్కో గ్రామంలో 65 నుంచి 85 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆరు నెలల క్రితం బిచ్కుందలో రూ.1,800 ట్రాక్టర్ ఇసుక ధర ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.700 నుంచి వెయ్యి పెంచేశారు. జుక్కల్ మండంలో రూ.2,700 ధర ఉండగా రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. పిట్లంలో రూ.3,200 నుంచి రూ. 4,500 ఇసుక ట్రాక్టర్ విక్రయిస్తున్నారు. ఇతర మండలాల ట్రాక్టర్లు ఈ ధర కంటే తక్కువలో ఇసుక విక్రయిస్తామని చెబుతున్నారు. ఇందిరమ్మ గృహాలకు అధికారులు సీనరేజ్ చార్జీలు లేకుండానే ఉచితంగా వేబిల్లులు ఇస్తున్నారు. ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలు, ఇందిర్మ ఇళ్లకు అదే ధరతో ఇసుక విక్రయిస్తున్నారు. ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలకు ట్రాక్టర్కు రూ.900 సీనరేజ్ చార్టీలు కట్టాల్సి ఉంటుంది. ఇందిరమ్మ పేరుతో ప్రైవేటుకు, జుక్కల్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, నారాయణ్ఖేడ్, కంగ్టి ప్రాంతాలకు అక్రమ ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పుల్కల్, హజ్గుల్, ఖద్గాం మంజీరా నుంచి ప్రతి రోజు మూడు నుంచి నాలుగు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. శనివారం సుమారు 300 ట్రాక్టర్లకు రెవెన్యూ అధికారులు వేబిల్లులు ఇచ్చినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక భారం.. ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 10 నుంచి 13 ట్రాక్టర్ల ఇసుక అవసరముందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. జుక్కల్ నియోజక వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 2,300 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉందని బిచ్కుంద తహసీల్ కార్యాలయానికి నివేదిక అందించారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక ఇందిరమ్మ పేరుతో తరలిపోతుంది కానీ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక మాత్రం అందని దాక్షలా మారింది. బిచ్కుంద మండలం చిన్నదడ్గిలో సుమారు 10 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటామని ముందుకు వచ్చారు. పిల్లర్ల గుంతలు తవ్వి 20 రోజులు అవుతున్నా ఇసుక మాత్రం అందడం లేదు. ప్రతి రోజు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇసుక ఇవ్వడం లేదు. ప్రైవేటు వ్యక్తులకు ట్రాక్టర్లు అమ్ముకుంటున్నారని లబ్ధిదారులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి ఇతర మండలాల ట్రాక్టర్లకు ఇసుక కోసం అనుమతి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. వేరే మండలాల ట్రాక్టర్లు ఇసుక కోసం రావొద్దు అడ్డుకుంటున్న పుల్కల్, హజ్గుల్, శెట్లూర్, ఖద్గాం ట్రాక్టర్ యజమానులు -
ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో ని ఎర్రాపహాడ్ గ్రా మంలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం అ యినట్లు గ్రామస్తు లు తెలిపారు. గ్రా మానికి చెందిన మైసాగౌడ్ మూడు సంవత్సరాల క్రితం ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాడు. ఆదివారం అతడు తన ఇంటి ముందు స్కూటీని నిలిపి చార్జింగ్ ఉంచారు. చార్జింగ్ పూర్తయిన అనంతరం విద్యుత్ కనెక్షన్ తీసివేశాడు. కానీ అప్పటికే చార్జింగ్ కారణంగా వేడెక్కిన స్కూటీకి ఎండలు కూడా ఎక్కువగా ఉండడంతో అందరు చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్కూటీ పూర్తిగా బూడిదయిందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
రుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆదివారం సాయంత్రం రుద్రూర్ వైపు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారితోపాటు ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లిపారంలో డబ్బుల విషయమై ఘర్షణ పడి దాడి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సునీల్ తెలిపారు. వివరాలు ఇలా.. జల్లాపల్లిపారంకు చెందిన శ్రీకాంత్, బీర్కూర్ తండాకు చెందిన సుధాకర్కు డబ్బుల విషయంలో గొడవ జరిగింది. గ్రామ పెద్దల సమక్షంలో డబ్బుల సమస్య గూర్చి శనివారం మాట్లాడుతుండగా బీర్కూర్కు చెందిన ముగ్గురు, జల్లాపల్లిపారంకు చెందిన ఇద్దరు గొడవ పడి శ్రీకాంత్, ఆయన తండ్రి ఓంకార్పై దాడి చేశారు. దీంతో బాఽధితులు ఆదివారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఈదురు గాలులకు కూలిన చెట్లు వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండు భారీ వృక్షాలు నేలకూలాయి. వర్షంతోపాటు బలమైన గాలుల కారణంగా గ్రామంలోని బీసీ హాస్టల్ ఆవరణలో ఉన్న చెట్టు నేలకూలి, రోడ్డుపై ఉన్న మరో చెట్టుపై వాలింది. అనంతరం రెండు చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్లు రహదారిపై కూలిపోవడంతో వన్నెల్ బి వైపు రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. గ్రామస్తులు చెట్లను తొలగించడంతో తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పేకాడుతున్న తొమ్మిది మంది అరెస్టునిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ఆదివారం పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేయగా పేకాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.40వేల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వృద్ధురాలి అదృశ్యం బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండలం మిర్జాపూర్కు చెందిన అంజవ్వ అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు. మిర్జాపూర్కు చెందిన అంజవ్వ ఏడాది కాలంగా బోర్లంలో నివాసం ఉంటుంది. అంజవ్వ ఈనెల 16న ఎప్పటిలాగే పింఛన్ డబ్బులు, రేషన్ బియ్యం కోసం మిర్జాపూర్ వెళ్లింది. కానీ ఇప్పటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వాట్సాప్గ్రూపులో పోస్టు చేయగా దోమకొండ బస్టాండ్లో కన్పించినట్లు తెలిసింది. కానీ అక్కడికి వెళ్ళే సరికి అమె కామారెడ్డి బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె అల్లుడు బోర్లం గ్రామానికి చెందిన కాదిరెడ్డి విజయ్కుమార్ బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కలర్ చీర, పసుపురంగు జాకెట్టు ధరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎవరికై నా కనిపిస్తే సెల్నెంబర్ 9989354036కు సమాచారం అందించాలన్నారు. గుండారంలో ఒకరు.. నిజామాబాద్రూరల్: గుండారం గ్రామ శివారులో ఉన్న క్లాసిక్ పేపర్మిల్లో పనిచేస్తున్న రాకేష్కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ ఆదివారం తెలిపారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్కుమార్ తన తమ్ముడు చోటన్కుమార్తో కలిసి ఈనెల 4న పేపర్మిల్కు ఉపాధి నిమిత్తం వచ్చాడు. కొన్ని రోజులుగా రాకేష్ కనబడకపోవడంతో బీహార్లో ఉన్న కుటుంబసభ్యులకు ఫోన్లో సంప్రదించారు. వారు ఇక్కడకు రాలేదని తెలపడంతో అతడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్షాక్తో యువకుడి మృతి
ఎల్లారెడ్డి: విద్యుత్షాక్తో యువకుడు మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తిమ్మాపూర్తండాకు చెందిన నేనావత్ రవి(32)అనే యువకుడు ఆదివారం సాయంత్రం తమ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బేస్మెంట్కు నీళ్లు పట్టడానికి వెళ్లాడు. ఈక్రమంలో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీకామారెడ్డి క్రైం: ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన జిల్లా కేంద్రంలోని గుమాస్తా కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా.. హన్మకొండకు చెందిన నయీంపాషా యేడాదిన్నరగా కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తూ గుమాస్తా కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆరోగ్య సమస్యల కారణంగా 6 నెలలుగా హన్మకొండకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఆదివారం ఉదయం అతడి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని రాజయ్య వెంటనే నయీంపాషాకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది విచారణ జరిపారు. ఇంట్లోని బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం బాన్సువాడ: పట్టణంలోని బాట చెప్పుల దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. షోరూం నిర్వాహకులు ఉదయం దుకాణం తెరిచి మధ్యాహ్నం మూసివెళ్లారు. కొద్దిసేపటికి దుకాణంలోంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి దుకాణ యజమానికి సమాచారం అందించారు. వెంటనే ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ అప్పటికే మంటల వ్యాపించి దుకాణంలోని సామగ్రి, చెప్పులు కాలిపోయాయి. దుకాణంలో పెద్ద ఎత్తున పొగ నిండిపోవడంతో లోపల ఉన్న వస్తువులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు షోరూం యజమాని తెలిపారు. -
ప్రారంభానికి ముస్తాబైన ఆర్టీసీ బస్టాండ్
ఎల్లారెడ్డి: పట్టణంలో మున్సిపల్ నిధులతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేక చొరవ తీసుకుని మధ్యలో నిలిచిపోయిన బస్టాండ్ నిర్మాణ పనులకు ప్రత్యేకంగా నిధులను తీసుకుని వచ్చి పనులు పూర్తి కావడానికి సహకరించారు. దీంతో ఎల్లారెడ్డి ప్రజల కల సాకారమైంది. బస్టాండ్కు వచ్చిన వారికి గతంలో ఇబ్బందులు తలెత్తడంతో నూతన బస్టాండ్ను మున్సిపల్ నిధులతో నిర్మించారు. ఈనెల 24న మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బస్టాండ్ను ప్రారంభింపజేసి ప్రజలకు అంకింతం చేయనున్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
బీబీపేట: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల కోసం గ్రంథాలయంలో స్టడీ మెటీరియళ్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం గ్రంథాలయాన్ని కేటాయించడం అనేది అవాస్తవమని, దానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని అన్నారు. గ్రంథాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కళాశాల కోసం కేటాయించేది లేదని స్పష్టం చేశారు. కళాశాల కోసం మరో భవనాన్ని చూస్తున్నారని అన్నారు. -
నిందితుడి అరెస్టు
ఖలీల్వాడి: రైలులో సెల్ఫోన్లను దొంగతనం చేసిన యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో సిబ్బంది ఒకటో నంబర్ ప్లాట్ఫాం మీద విధులు నిర్వహిస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని విచారించారు. నగరంలోని ద్వారకానగర్కు చెందిన సయ్యద్ మాజీద్ (27)గా గుర్తించారు. ఈ నెల 19న నాగర్సోల్, షీర్డీ సాయినగర్ రైలులో మూడు సెల్ఫోన్లను దొంగిలించినట్లు చెప్పారు. సెల్ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. దొంగను పటుకున్న హెడ్కానిస్టేబుల్ సురేందర్, గురువాస్, కానిస్టేబుల్ రాములును ఎస్సై అభినందించారు. -
యోగాతోనే ఆరోగ్య సమాజం
కామారెడ్డి అర్బన్: ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్ అన్నారు. పట్టణంలోని జిల్లా యోగా భవన్లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాచరు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి ప్రారంభించగా, ఆయుష్ ఆధ్వర్యంలో సరస్వతి విద్యామందిర్లో నిర్వహించిన కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ చందర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన పూర్వీకులు అందించిన యోగాకు ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చారన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యోగా సెంటర్లు పెరగడం ఆరోగ్యసమాజానికి నిదర్శనమన్నారు. కామారెడ్డి డివిజనల్ అటవీ అధికారి రమేష్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వంటశాల ఆరోగ్యశాల కావాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్క నాటడడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రాణవాయువు అందుతుందన్నారు. ఆయుష్ డీపీఎం శ్రీకాంత్, నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యులు దేవయ్య, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ప్రతినిధులు అంజయ్య, యెల్లంకి సుదర్శన్, యోగా గురువు అంజయ్యగుప్తా తదితరులు పాల్గొన్నారు. మోహర్బాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో యోగాకు ఆధ్యాత్మిక తోడు కావాలని పలువురు ఆశ్రమాధిపతులు అన్నారు. యోగా గురువు బండి రాములు స్వయంగా కఠినమైన ఆసనాలు వేశారు. ఆర్యసమాజంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులుతో పాటు పట్టణ, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లాకేంద్రంలో అట్టహాసంగా యోగా దినోత్సవం -
మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బోనాల్ గ్రామంలో శనివారం మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలను జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 58 మందికి వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఈత కొట్టడం, వల విసరడం, పాండ్రి వల లాగడం తదితర మెలకువలు తెలిపారు. అనంతరం శ్రీపతి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యువజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సహకార అసిస్టెంట్ శ్రీనివాస్, మత్య్స సహకార పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు గాదం సత్యనారాయణ, జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బట్టు విఠల్, బెస్త సాయిలు, మండల అధ్యక్షుడు దాసరి సాయికుమార్, మత్య్సకారులు పాల్గొన్నారు. -
బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలి
కామారెడ్డి అర్బన్: జిల్లాలో బీఎస్పీ బలోపేతం కోసం నాయకులు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. పట్టణంలో శనివారం పార్టీ జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంతోష్, మనోహర్లను బీఎస్పీలో చేర్చుకున్నారు. జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి సురేష్, కోశాధికారి సిద్ధిరాములు, రోహిదాస్, ప్రభాకర్దాస్ పాల్గొన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి బాన్సువాడ రూరల్: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తారని చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యామ్సుందర్లు అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో శనివారం ఏపీఎం రాజేందర్, పద్మలతో కలిసి డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పా రిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్పేనియర్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఈఏపీ) కృషి చేస్తోందన్నారు. పరిశ్రమలశాఖ, పేదరిక నిర్మూలన సంస్థలతో ఒకరోజు ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఔత్సాహిక మహిళల ను గుర్తించి వారికి 15రోజుల పాటు పరిశ్రమ ల నిర్వాహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెళకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. విద్యుత్ను పొదుపుగా వాడాలి బాన్సువాడ రూరల్: ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని విద్యుత్ శాఖ డీఈ ప్రభాకర్ అన్నారు. మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా డీఈ మాట్లాడుతూ.. రైతులు సొంతంగా విద్యుత్ మరమ్మతులు చేయరాదన్నారు. ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాన్ని తగ్గించడానికి, లూజ్లైన్ను తొలగించడానికి తగిన చర్యలు తీసుకున్నామన్నారు. 9మంది రైతుల బోరుబావుల వద్ద కెపాసిటర్ బ్యాంక్లను అమర్చారు. ఈడీఈ సంజీవ్రావు, ఏఈ అనిల్కుమార్, లైన్మన్ అక్తర్, ఏఎల్ఎం నవీన్ తదితరులు పాల్గొన్నారు. బడి బాగు కోసం కృషి చేయాలి మాచారెడ్డి: చుక్కాపూర్ బడి బాగుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ జెడ్పీటీసీ, పాఠశాల పూర్వ విద్యార్థి మినుకూరి రాంరెడ్డి అన్నారు. పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావడానికి త్వరలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామన్నారు. బ్రహ్మానందరెడ్డి, మమత, దేవేందర్రావు, నాగేందర్ ఉన్నారు. -
మొరం దందాకు బీజేపీ వ్యతిరేకం
బిచ్కుంద(జుక్కల్): అక్రమ మొరం దందాకు బీ జేపీ వ్యతిరేకమని పార్టీ మండల అధ్యక్షుడు శెల్పల్లి విష్ణు అన్నారు. బిచ్కుందలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిచ్కుందకు చెందిన బీ శ్రీరాం అనే వ్యక్తి బీజేపీ కార్యకర్తగా చెలామణి అవుతూ అక్రమ మొరం రవాణాకు పాల్పడుతున్నాడన్నారు. అతడి తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లెటర్ ఇచ్చినట్లు శ్రీరాం చెప్పుకుంటున్నాడన్నారు. కానీ ఇలాంటి ఫేక్ లెటర్లను నమ్మవద్దని కోరారు. నాయకులు జాదవ పండరి, శివాజీ పటే ల్, గణపతి, ధర్మనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకుంటా
దోమకొండ: ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట నిలుపుకుంటానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దోమకొండతోపాటు ముత్యపే ట గ్రామంలో శనివారం తన సొంత నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు.తన సొంత నిధులతో కుల సంఘాలకు భననాలు, ఆలయాల నిర్మాణాల కోసం ఇచ్చిన మాట నిలుపుకొని పనులు చేసినట్లు వివరించారు. అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి నరేందర్ రెడ్డి, దోమకొండ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సెక్రెటరీ అంజన్రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు మహేందర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు నరేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మనోజ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు ముత్తి బుచ్చిరాజు, సెక్రెటరీ నరేన్ గౌడ్, బాలరాజు, తిరుపతిరెడ్డి, దేవరాజు పాల్గొన్నారు. బీబీపేట: మండలంలోని ఉప్పర్పల్లి, యాడారం, మల్కాపూర్ గ్రామాల్లోని పలు ఆలయాల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. నాయకులు సంతోష్గౌడ్, రవీందర్, పోసు శివ, దేవరాజుగౌడ్, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం -
క్రైం కార్నర్
అనుమానాస్పదస్థితిలో పార్ట్టైం లెక్చరర్ మృతి ● దుర్కి బాలికల గిరిజన పాఠశాలలో ఘటన నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి గ్రామంలో గల తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పార్ట్టైం కెమిస్ట్రీ అధ్యాపకురాలు స్వప్న(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన స్వప్న దుర్కిలోని గిరిజన గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. కాగా, గురువారం సూర్యపేట్ జిల్లా కోదాడలో టెట్ రాసిన స్వప్న, శుక్రవారం విధులకు హాజరైంది. రోజంతా పని చేసినా రాత్రి డ్యూటీ వేశారు. దీంతో రాత్రి పిల్లలను చదివించి నిద్రపోయింది. విద్యార్థినులు ఎంత లేపినా లేవకపోవడంతో సిబ్బంది ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని ఎస్సై లావణ్య తెలిపారు. ఇదిలా ఉండగా స్వప్నకు ఆరోగ్యం బాగోలేక పోయినా ప్రిన్సిపల్ డ్యూటీ వేసి పని ఒత్తిడి కల్పించి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంటర్ చదివే తమ్ముడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దికై ్కన కూతురు మరణించడంతో బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతూ యువకుడు..ఇందల్వాయి: గన్నారం గ్రామానికి చెందిన నాగుల హరి(22) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగిన హరిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా శనివారం మరణించాడు. హరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియరాలేదని, మృతుడు టోల్ప్లాజా వద్ద ఫాస్ట్ టాగ్లు విక్రయిస్తుండేవాడని తెలిపారు. తండ్రి దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య బాన్సువాడ : బాన్సువాడ నాగయ్య చెరువులో దూకికొండని గంగవ్వ(70) ఆత్మహత్యకు పాల్పడింది. పాత బాన్సువాడ గూడెంగల్లీకి చెందిన గంగవ్వ అనారోగ్యంతో బాధపడుతోంది. గంగవ్వ కుమారుడు రాజు తన అత్తగారి ఊరైన దేశాయిపేట్లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. గంగవ్వ మాత్రం బాన్సువాడలోనే ఉంటుంది. వారం రోజుల క్రితం నుంచి గంగవ్వ కుమారుడు, కోడలు వచ్చి గంగవ్వ ఇంట్లోనే ఉంటున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన గంగవ్వ సాయంత్రం చెరువులో శవమై కనిపించింది. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. -
డివైడర్ను ఢీకొన్న డీసీఎం
డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామశివారు కోతి దేవుడి ఆలయం వద్ద శనివా రం అదుపుతప్పిన డీసీఎం డివైడర్ను ఢీకొట్టింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు పాత ఇనుప సామగ్రితో వెళుతున్న డీసీఎం నడిపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం ముందుభాగం ధ్వంసం కావడంతోపాటు టైరు ఊడిపోయింది.దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోలీసులు డీసీఎంను పక్కకు తొలగించారు.ప్రమాదానికి సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. బాలుడి అప్పగింత రుద్రూర్ : తప్పిపోయిన బాలుడిని రుద్రూర్ మండల కేంద్రంలో పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణంలోని కోటగల్లికి చెందిన షేక్ ఫర్హాన్ (9) అనే బాలుడు శుక్రవారం తప్పిపోయి రుద్రూర్ బస్టాండ్ పరిసర ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకొని బాన్సువాడ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు స్టేషన్కు వెళ్లడంతో పోలీసులు బాలుడిని అప్పగించారు. -
ప్రొఫెసర్ జయశంకర్కు ఘన నివాళి
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి/బాన్సువాడ/కామారెడ్డి అర్బన్/కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో శనివారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా మండలాల్లో జయశంకర్ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామారెడ్డిలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జయశంకర్, తెలంగాణ పాటల పొద్దు గూడ అంజయ్యల వర్ధంతిల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. బీఆర్ఎస్ నాయకులు, మలిదశ ఉద్యమకారులు, తెరవే ప్రతినిధులు, స్వర్ణకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి
నిందితుల రిమాండ్ ఇందల్వాయి: అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళ అటవీ భూములను చదును చేస్తున్న గిరిజనులను ఆపబోతే ఎదురు తిరిగి అటవీశాఖ అధికారుల మీద దాడి చేసిన ఘటన ధర్పల్లి మండలం కొటాల్పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్, ధర్పల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి రిజర్వ్ ఫారెస్ట్ కొటాల్పల్లి బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్–593లో కొందరు గిరిజనులు చెట్లను నరికి అటవీ భూమిని చదును చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్షన్ అధికారి భాస్కర్, బీట్ ఆఫీసర్లు ఉదయ్, ప్రవీణ్, ఖదీర్ సిబ్బందితో వెళ్లి భూమిని చదును చేస్తున్న గిరిజనులను అడ్డుకొని ట్రాక్టర్ను రేంజ్ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన బూక్య నవీన్, బాదావత్ పూల్సింగ్, బూక్య మధు, బూక్య సంగ్య తదితరులు అధికారులపై పొడికారం చల్లి దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం అధికారుల నుంచి ట్రాక్టర్ని లాక్కొని వెళ్లా రు. ఘటనపై శనివారం ధర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ భిక్షపతి, ఎస్సై రామకృష్ణ, సిబ్బందితో కలిసి కొటాల్పల్లికి వెళ్లి నిందితులను పట్టుకొని రిమాండ్కి తరలించారు. ట్రాక్టర్ని సీజ్ చేసి పోలీస్స్టేషన్లో ఉంచారు. దాడిలో పాల్గొన్న మిగితా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వివరించారు.