breaking news
Kamareddy
-
మహిళను నమ్మించి రూ.15 వేల అపహరణ
కామారెడ్డి క్రైం: బ్యాంకులో డబ్బులు లెక్కపెట్టుకునే విషయంలో ఓ మహిళను నమ్మించిన ఇద్దరు దుండగడులు రూ.15 వే లు కాజేసిన ఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన చింతకింది పూజ తన తండ్రితో కలిసి మధ్యాహ్నం స మయంలో మున్సిపల్ కార్యాలయ సమీపంలోని ఎస్బీఐ బ్యాంకుకు వచ్చారు. రూ.50 వేలు విత్డ్రా చేసుకున్నారు. డ బ్బులు లెక్కబెట్టుకునేటప్పుడు అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తుల్లోంచి ఒకరు తాను సహాయం చేస్తానని నమ్మించాడు. డబ్బులను లెక్కబెట్టిన తర్వాత తిరిగి ఇచ్చి వెంటనే అక్కడి నుంచి జారుకున్నారు. అనుమానం వచ్చి మళ్లీ లెక్కించగా నోట్ల కట్టలో రూ.15 వేలు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు.పోడు భూముల్లో మొక్కలు నాటిన అధికారులు -
జిల్లాలో దంచికొట్టిన వాన
నాగిరెడ్డిపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో వాన దంచికొట్టింది. జుక్కల్లో 89.5 మిల్లీ మీటర్లు, మహ్మద్నగర్లో 80.8, పిట్లంలో 79.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నాగిరెడ్డిపేట మండలంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షం పడింది. సోమవారంరాత్రి సుమారు రెండుగంటలపాగు జోరువాన కురిసింది. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి సైతం భారీ వర్షం కురియడంతో పొలాల్లో నీరు నిలిచింది. పోచారం ప్రధానకాలువ జలకళ సంతరించుకుంది. ‘పోచారం’లోకి కొత్తనీరు పోచారం ప్రాజెక్టులోకి మంగళవారం నుంచి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో లింగంపేటవాగు ద్వారా 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని నీటిపారుదలశాఖ ఏఈ అక్షయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీ (0.110 టీఎంసీ)లోనే ఉందన్నారు. నిజాంసాగర్లోకి 1,207 క్యూసెక్కుల ఇన్ఫ్లో నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంగళవారం 1,207 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,394.62 అడుగుల (6.582 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. వాగుల్లో జలకళ.. నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రధానంగా శేర్ఖాన్పల్లి శివారులోని మత్తడిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుండడతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
మద్నూర్ మండల పీఆర్టీయూ కార్యవర్గం ఎన్నిక
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల పీ ఆర్టీయూ నూతన కా ర్యవర్గాన్ని ఎన్నుకున్న ట్లు జిల్లా అధ్యక్షుడు కు శాల్ మంగళవారం ఒ క ప్రకటనలో తెలిపారు. మద్నూర్ మండల పీ ఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా శివరాం, ప్రధా న కార్యదర్శిగా శివశంకర్, అసోసియేట్ అధ్యక్షులు పండరీనాథ్, శివప్రభ, ఉపాధ్యక్షులు శి వాజీ, మారుతి, మహిళ ఉపాధ్యక్షులుగా అని త, పార్వతి, కార్యదర్శిగా రాజు, మహిళ కార్యదర్శిగా సరస్వతి, మహిళ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పట్టాభి, పీఆర్టీయూ నాయ కులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్ : విద్యార్థుల్లో పుస్తక పఠనశక్తిని పెంచడానికి జిల్లాలోని 11 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.చంద్రకాంత్రెడ్డి అన్నారు. పాఠశాల గ్రంథాలయాల ఏర్పాటుకు ఒక్కో పాఠశాలకు రూ.15వేలతో పాటు ప్రతినెల నిర్వహణకు రూ. 1000 చెల్లిస్తారన్నారు. నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం ఖండెబల్లూర్ గ్రామంలో ఫాంపాండ్ నిర్మాణానికి మంగళవారం జెడ్పీ సీఈవో చందర్, ఎంపీడీవో శ్రీనివాస్ భూమిపూజ చేశారు. వర్షపు నీటి నిల్వకోసం ఇంకుడు గుంతలతో పాటు ఫాంపాండ్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఎంపీవో రాము, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్పేట్ రైతువేదికలో మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. ఈ ఖరీఫ్లో ఆరుతడి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపాలన్నారు. ధర్మారావ్పేట్, అమర్లబండ సర్పంచ్లు ఉమర్, బాల్రాజ్, మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, ఏఈవోలు లిఖిత్ రెడ్డి, కవిత, కల్యాణి, సురేందర్, సులోచన , రైతులు తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి (ఎల్లారెడ్డి): సమాచార హక్కు చట్టాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల ని స.హ. చట్టం మండల అధ్యక్షుడు మోషన్పల్లి ప్రశాంత్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో తహసీల్దార్ ఉమాలత, ఎస్ఐ ముర ళిలను స.హ. చట్టం సభ్యులు కలిశారు. అనంతరం అధికారులను సన్మానించారు.ఉపాధ్యక్షులు పందిరి శ్రీకాంత్, జనరల్ కార్యదర్శి దండబోయి బాల్రాజు, జాయింట్ కార్యదర్శి నో ముల పరశురామ్, సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ : ప్రయివేటు పాఠశాలలో పుస్తకాలు, యూనిఫాంలు అమ్ముతున్నారని వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని లంబాడి స్టూడెంట్ అర్గనేషన్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ప్రకాష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బాన్సువాడలో మీడియాలో మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు జైపాల్రెడ్డి, అజయ్, రమేష్, మోహాన్, రవి, అర్జున్ తదితరులు ఉన్నారు. -
దుర్కిలో కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి శివారులో ఓ కారు అదుపుతప్పి మంగళవారం బోల్తా కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్కు చెందిన రవీందర్రెడ్డి అతని భార్య, తండ్రి బాన్సువాడ మీదుగా హైదరాబాద్కు కారులో వెళ్తున్నారు. దుర్కి శివారులో కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై రాఘవేంద్రను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. పిట్లం: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో మంగళవారం ఓ మేక పిల్లపై వీధి కుక్కలు దాడి చే సి పిక్కుతిన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చిన్నారులు ఎవరైనా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కామారెడ్డి క్రైౖం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు మంగళవారం ఒకే రోజు 71 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టుల్లో హాజరుపర్చగా పది మందికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 71 మందికి రూ.81,500 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు. నిజామాబాద్ అర్బన్: ఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు. ఇంద్రపూర్ కాలనీకి చెందిన రమేశ్ ఫోన్లో మట్కా ఆడుతుండగా పట్టుకున్నామని అన్నారు. రమేశ్కు శాంతినగర్కు చెందిన షేక్అస్రాప్ మట్కా ఆడిస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. రమేశ్ నుంచి రూ.5,070 నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
ఏడాదిగా ఖాళీగా హిందీ టీచర్ పోస్ట్
● ఇబ్బందులు పడుతున్న భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ● రెగ్యులర్ హిందీ ఉపాధ్యాయుడిని నియమించాలని వినతిభిక్కనూరు : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 355 మంది విద్యార్థులు ఉన్నారు. గతే డాది ఆగస్టులో హిందీ ఉపాధ్యాయుడు దేవేంద్రకుమార్ పదవీ విరణ పొందాడు. అప్పటి నుంచి హిందీ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఈవో రాజగంగారెడ్డి గతేడాది డిప్యూటేషన్పై ఒక ఉపాధ్యాయు డిని నియమింపజేశాడు. డిప్యూటేషన్ ముగియడంతో హిందీ ఉపాధ్యాయుడు లేకుండా పోయాడు. ఈఏడాది పాఠశాల ప్రారంభం నుంచి టీచర్లు స్వ చ్ఛందంగా విద్యార్థులకు హిందీ పాఠాల ను బోధిస్తున్నారు. ప్రభుత్వం పీటీఎఫ్ ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్ల పోస్టులను రద్దుచేసింది. పీటీఎ ్ఫ్ సి బ్బంది ఒక్కరే ఉండడంతో పని భారం అధికంగా ఉంటుంది. విద్యాశాఖాధికారుల స్పందించి రె గ్యులర్ హిందీ ఉపాధ్యాయుడితో పాటు స్కావెంజర్లను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
దడ పుట్టించిన బెబ్బులి
చుట్టంలా వచ్చి..ఉమ్మడి జిల్లాలో ఏడాదిగా పెద్దపులి కదలికలుఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడాదిగా పెద్దపులి సంచారం కనిపిస్తోంది. ఇటు కాచాపూర్ నుంచి అటు కమ్మర్పల్లి దాకా.. పలుమార్లు సంచరించిన బెబ్బులి పలు ప్రాంతాల్లో మూగజీవాలపై పంజా విసిరి తన ఆకలి తీర్చుకుంది. గతేడాది జూలైలో పులి సంచారం వెలుగు చూసింది. సిరికొండ, రామారెడ్డి, మాచారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మూగజీవాలపై పంజా విసిరింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో ‘కెమెరా ట్రాప్స్’ ఏర్పాటు చేయగా.. పులి కదలికలు నిర్ధారణ అయ్యాయి. తర్వాత మళ్లీ డిసెంబర్లో దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పులి హల్చల్ చేసింది. అంబారిపేట, సంగమేశ్వర్, కాచాపూర్ గ్రామాల శివారులోని పంట చేల వద్ద పలు పశువులపై దాడి చేసి చంపేసింది. అక్కడి నుంచి తిరిగి పాల్వంచ మండలం ఇసాయిపేట మీదుగా రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో సంచరించింది. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మాచారెడ్డి, సిరికొండ అటవీ రేంజ్ల పరిధిలో పులి కదలికలు కనిపించాయి. చివరిసారిగా కమ్మర్పల్లి అటవీ ప్రాంతంలో తిరిగినట్టు అధికారులు నిర్దారించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లిందన్నది తేలలేదు.ఏప్రిల్లో మాచారెడ్డి అటవీ రేంజ్ పరిధిలో పులి సంచరించిన ప్రాంతాల మ్యాప్ (ఫైల్)ఉమ్మడి జిల్లాలో పలుమార్లు సంచరించిన పులి.. ఎక్కడా మనుషుల మీద దాడి చేయలేదు. ఆకలి తీర్చుకునేందుకు అక్కడక్కడా పశువుల మీద పడుతోంది. సిరికొండ, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, కమ్మర్పల్లి తదితర మండలాల్లో పశువులను చంపినట్లుగా గుర్తించారు. అటవీ ప్రాంతంలోనే కాదు మైదాన ప్రాంతమైన బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోనూ సంచరించిన పులి.. ఎక్కడ కూడా మనుషులపై పంజా విసరలేదు.సొంత పరిధి విస్తరించుకునేందుకు, తోడుకోసం పులి కొత్త ప్రాంతాలను ఎంచుకుంటుంది. అడవిలో సహజ ఆహారమైన జింకలు, దుప్పులు, అడవి పందులు లభించకపోతేనే అవి పశువులను వేటాడతాయి. పులులు శాశ్వతంగా స్థిరపడాలంటే విస్తారమైన అడవులు, తగినంత సహజ ఆహార జంతువులు, నీటి లభ్యత, మానవ జోక్యం తక్కువగా ఉండడం, తోడును వెతుక్కునే అవకాశం ఉండాలి. ఈ పరిస్థితులు లేకపోతే మరో అనువైన ప్రాంతానికి వెళ్తుంది. పులి రావడం అనేది ప్రమాద సంకేతం కాదు. – కొమిరె శంకర్, సీనియర్ బయాలజిస్ట్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద అడవులు లేనప్పటికీ పొరుగున ఉన్న ఆదిలాబాద్, మహారాష్ట్ర అడవులతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాయి. ఈ అనుసంధాన అటవీ ప్రాంతాల ద్వారా పులులు సహజంగా సంచరించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని తడోబా–అంధారి, తిప్పేశ్వర్ వంటి పులుల ఆవాసాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినపుడు కొత్త నివాస ప్రాంతాలు, సొంత పరిధి (టెరిటరీ), జత(మేట్), తగినంత ఆహారం కోసం తమ జన్మస్థలాన్ని విడిచి కొత్త ప్రాంతాలకు వలస వెళతాయి. ఇది ప్రతి పులి జీవితంలో సహజమైన ప్రక్రియ. మహారాష్ట్ర నుంచి పెన్గంగ నది దాటి అనేక పులులు ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించాయి. కొన్ని ఆదిలాబాద్ అడవుల్లో స్థిరపడగా, మరికొన్ని కొత్త ప్రదేశాల కోసం ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలల్లో సంచరిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పలుమార్లు సంచరించాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఐదారు దశాబ్దాలుగా పులుల సంచారం అనేది అరుదుగా నమోదవడంతో ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్శించింది. జనం భయాందోళనలకు గురయ్యారు. అయితే పులి సంచారం ఆందోళన కలిగించే విషయం కాదని.. ప్రకృతి సమతుల్యతకు సంకేతమని వన్యప్రాణి శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పులి సంచారం అసాధారణ ఘటన కాదని, దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నందనడానికి ఇది ఒక సానుకూల సంకేతంగా భావించవచ్చని అంటున్నారు. కాచాపూర్ నుంచి కమ్మర్పల్లి దాకా.. వనాల్లోనే కాదు.. మైదాన ప్రాంతాల్లోనూ సంచారం ప్రకృతి సమతుల్యతకు సంకేతం అంటున్న వన్యప్రాణి శాస్త్రవేత్తలు నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం -
‘వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం’
● భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు ముదుగంటి శ్రీధర్రెడ్డి కామారెడ్డి అర్బన్: వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకమని భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు ముదుగంటి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లింగాపూర్ బృందావన్ ఫంక్షన్ హాల్లో బీకేఎస్ ఆధ్వర్యంలో కుటుంబాల సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం, ఉత్పత్తి రంగాలలో మహిళ పాత్ర 70 శాతానికిపైగా ఉందన్నారు. అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. రసాయనిక ఎరువులను వినియోగించకుండా ఆధునిక వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్పు చేసే ప్రయత్నంలో మహిళలను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో కుటుంబాల సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందని వక్తలు పేర్కొన్నారు. వ్యవసాయంలో అనేక సమస్యలున్నాయని వాటిని అధిగమించాలని పిలుపునిచ్చారు. సమ్మేళనంలో బీకేఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి దోనూరి రాము, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి, ప్రతినిధులు మోహన్రెడ్డి, లావణ్య, నగేశ్, ఆనందరావు, మాణిక్యరెడ్డి, పెద్ద అంజన్న, ఎల్.ప్రముఖ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి
● జల సంరక్షణ చర్యలు చేపట్టాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్దోమకొండ: రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దోమకొండనుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి వర్షపాతం తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగయ్యే పెసర్లు, కందులు, మినుములు, నూనెగింజల పంటలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ ఎంపిక చేసిన జిల్లాలోని ముగ్గురు ఉత్తమ రైతులతోపాటు ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి జ్యోతి, ఏడీఏ అపర్ణ, కామారెడ్డి ఏవో పవన్కుమార్, దోమకొండ ఇన్చార్జి ఏవో నరేందర్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో మధురిమ, ఎంఈవో విజయ్కుమార్, ఎంపీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలి : కలెక్టర్
దోమకొండ : విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు పక్షులు, పర్యావరణ స్పృహ అంశంపై సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలని కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. విద్యార్థులతో మాట్లాడారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. సంఖ్యాశాస్త్రాన్ని నిత్య జీవితంలో అన్వయించుకోవాలన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ను సమర్థవంతంగా వినియోగించుకొని శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, మరుగుదొడ్లు, ప్రయోగశాలలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డీఈవో మల్లికార్జున్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, ఎంఈవో విజయకుమార్, ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువును తవ్వి.. 30 ఎకరాలలో సాగు..
‘నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని శ్రీనివాస క్యాంప్నకు చెందిన రైతు పుట్ట బాబు నీటి సంరక్షణ కోసం రెండెకరాల విస్తీర్ణంలో చిన్నపాటి చెరువునే తవ్వించారు. 15 ఏళ్ల క్రితం ముందుచూపుతో తవ్వించిన చెరువు.. ఇప్పుడు కష్టకాలంలోనూ నీటిచింతను తీరుస్తోంది. తన భూమిలో కురిసిన వర్షపు నీరంతా ఈ చెరువులోకే చేరేలా పల్లపు ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నారు. సహజ పద్ధతిలో భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు డ్రిప్ ఏర్పాటు చేసుకుని వరితో పాటు ఆయిల్పాం వంటి వినూత్న పంటలను పండిస్తున్నారు. మొదట తనకున్న 15 ఎకరాల్లో పంటలు సాగుచేస్తూ.. మూడేళ్లుగా మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. సొంతంగా నిర్మించుకున్న చెరువు గట్టుపై కొబ్బరి, మామిడి, సీతాఫలం, సపోటా వంటి పండ్ల మొక్కలను పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. -
సీడ్ బాల్స్ వేసిన లయన్స్ సభ్యులు
పిట్లం(జుక్కల్) : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామేశ్వర గుట్ట వద్ద సీడ్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ చిన్న కొడప్గల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సహకారంతో 1500 సీడ్ బాల్స్ వేశామన్నారు.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, కార్యదర్శి మారుతిరెడ్డి, సభ్యులు, సర్పంచ్ రెడ్డి కిరణ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
‘అతివేగంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి’
కామారెడ్డి క్రైం: అతివేగంగా ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అతివేగ నియంత్రణ, జిల్లాలోని ఎన్హెచ్–44, ఎన్హెచ్–161 జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణల అంశంపై చర్చించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను నూతనంగా ఏర్పాటు చేసిన హైవే టాస్క్ఫోర్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎన్హెచ్–44 లోని సదాశివనగర్ వద్ద జరుగుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను జనవరి నాటికి పూర్తయ్యేలా చూస్తామని జాతీయ రహదారుల అధికారులు తెలిపారు. ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వివిధ శాఖల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సంగ్వాన్ సమావేశం ఏర్పాటు చేసి ఆయా అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్, వైద్యం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ తదితర శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, డీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ దరఖాస్తులను సకాలంలో సమర్పించాలి
కామారెడ్డి టౌన్ : ప్రత్యేక ఓటరు నమోదు (సర్) ప్రక్రియ దరఖాస్తులను ఇంకా సమర్పించని ఓటర్లు ఆగస్టు 1వ తేదీలోపు సంబంధిత అధికారులకు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రవితేజ తెలిపారు. జిల్లా కేంద్రంలోని 46, 47వ వార్డుల్లో జరుగుతున్న సర్ ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సేకరించిన సర్ ఫారాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్ హిమబిందు, కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణల, ఆర్ఐ ప్రసన్న, జీపీవో సూరజ్, నితీష్, బీఎల్వోలు కాశీరాం, వెంకటలక్ష్మి, రేఖ, బబిత, జమున తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్లను పరిశీలించిన ఆర్డీవో నస్రుల్లాబాద్ : మండలంలోని అంకోల్తండాలో గల పోలింగ్ బూత్ను మంగళవారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకోల్తండాలో 1200 మంది ఓటర్లకు ఒకే బూత్ ఉందని, మరో పోలింగ్ బూత్ ఏర్పాటుకు నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాలలో గల సదుపాయాలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. తహసీల్దార్ సువర్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. రాఘవపూర్లో వందశాతం ఎస్ఐఆర్ పూర్తి కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో మంగళవారం నాటికి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్) వంద శాతం పూర్తయినట్లు సర్పంచ్ ఎడ్ల వినీల నరేష్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేష్, గ్రామ కార్యదర్శి మాధవిలత, బీఎల్ఓ బలరాం, వీవోఏ లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ గెజిటెడ్ సంతకానికి రూ.5 వేలు
కామారెడ్డి క్రైం : అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తులు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మూడు రోజుల క్రితం వెలుగు చూసిన భిక్క నూర్ నకిలీ ధ్రువపత్రాల తయారీ కేసును పోలీసు లు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫో ర్జరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాడుతు న్నారని నాలుగు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా జ నరల్ ఆస్పత్రి ఆర్ఎంవో సంతోష్ పట్టణ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసు లు సాంకేతిక ఆధారాలతో విచారణ ప్రారంభించా రు. భిక్కనూరులో జిరాక్స్, ఆన్లైన్ సెంటర్ నడిపించే తోడెంగల రాజా నరేందర్, రాజలింగంలు జి ల్లా జనరల్ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా ప నిచేసే బోయిని ప్రసాద్లు కలిసి ముఠాగా ఏర్పడి గెజిటెడ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రభు త్వ సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. జిరాక్స్ కేంద్రంలో తనిఖీలు చేపట్టిన కామారెడ్డి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితులు ముందుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి వివాహ పత్రికలు, ఆధార్ కార్డులు, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తారు. ప్రతి దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తూ, గెజిటెడ్ సంతకాల ఫోర్జరీతో ఆన్లైన్ చేసేవారని విచారణలో వెల్లడైంది. అవసరమైతే ఇతర పత్రాలను సైతం నకిలీవి త యారు చేసేవారు. ఇందుకోసం జిరాక్స్ కేంద్రంలో కంప్యూటర్, నకిలీ రబ్బరు స్టాంపులు, స్టాంప్ ప్యా డ్లు, పేపర్లు, ధ్రువీకరణకు సిద్ధం చేసిన పత్రాల తో పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. వాటన్నింటినీ పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు భిక్కనూర్ మండలానికి చెందిన 52 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల దరఖాస్తులను ఆన్లైన్ చేసినట్లు విచారణలో తేలింది. వా టిలో 34 మందికి ఇప్పటికే చెక్కులు అందాయి. మ రో 18 ఫైళ్లు ప్రాసెసింగ్ దశలో ఉన్నాయి. ఈ 52 మంది లబ్ధిదారుల వివరాలను తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అందజేస్తామని అన్నారు. నకిలీ ధృవపత్రాలతో ఈ పథకాలకు దరఖాస్తులు చేయడం భిక్కనూర్ మండలానికే పరిమితమైందా, లేక ఈ వ్యవహారం ఇత ర ప్రాంతాలకు విస్తరించిందా అనే వాటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగి స్తామని ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బందిని అఽభినందించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, అధికారులు పాల్గొన్నారు. అడ్డదారిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు భిక్కనూర్ నకిలీ ధ్రువపత్రాల కేసులో ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
‘మనోన్యాయ్’ స్కీమ్పై ఉపాధ్యాయులకు అవగాహన
కామారెడ్డి టౌన్ : మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం అందించి వారి హక్కులను పరిరక్షించడమే నల్సా ‘మనోన్యాయ్’ స్కీమ్–2024 ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో జిల్లా ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ఈ పథకంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి కుటుంబాలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక పిల్లల సమస్యలను గుర్తించి, న్యాయ సహాయం కోసం సంస్థతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సహాయం కావాల్సిన వారు నేరుగా లేదా టోల్ఫ్రీ నంబర్ 15100 ను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు శ్రీచైతన్య, నాగవేందర్, ఐఈఆర్పీలు, ప్రత్యేక ఉపాధ్యాయులు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులను, కళాశాలలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ సతీష్, సిబ్బంది శ్రీనివాస్చారి తదితరులున్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర పంచాయతీరా జ్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శుక్రవా రం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స ర్)పై జిల్లా అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంతోపాటు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి అర్బన్/కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో బాలబాలికల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ సీజన్–1 పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు రాజు, జగదీశ్, గణేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాట్పై జరిగే ఈ పోటీలలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచినవారికి వరుసగా రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.3 వేలు బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు. బెస్ట్ రైడర్, డిఫెండర్, ఆల్రౌండర్లకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామని తెలిపారు. ఆసక్తిగల జట్లు 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 99892 15251, 93987 23882 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కలెక్టరేట్ మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చీకట్లో ఉండిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కార్యాలయాల్లో అంధకారం నెలకొంది. కంప్యూటర్లు పనిచేయక పనులు జరగలేదు. -
చిన్నపాటి వర్షానికి నిలిచిపోతున్న రాకపోకలు
● అసంపూర్తిగా గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు ● ఇబ్బందులు పడుతున్న వాహనదారులురామారెడ్డి : రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే ప్ర ధాన రహదారిలో గంగమ్మ వాగు బ్రిడ్జి పనులు అ సంపూర్తిగా ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికే రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇ బ్బందులు పడుతున్నారు. 2023లో రూ.3.08కోట్ల ఎఫ్డీఆర్ నాన్ప్లాన్ నిధులతో గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. గంగమ్మవాగుపై నుంచి భీమ్గల్కు ఆర్టీసీ బస్సు 3 ట్రిప్పులు, కామారెడ్డి నుంచి దొన్కల్ వయా నిజామాబాద్, సిరిసిల్ల నుంచి మాచారెడ్డి మీదుగా కామారెడ్డికి ప్రయాణాలు కొ నసాగిస్తారు. బురదలో ఇరుక్కుపోయిన బస్సు, లారీ సోమవారం రాత్రి రామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కురిసిన ఓ మోస్తరు వర్షానికే గంగమ్మ వాగు వద్ద ప రిస్థితి ఘోరంగా తయారైంది. బ్రిడ్జి వద్ద వేసిన మొ రం వర్షానికి కరిగిపోవడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉండటంతో రామారెడ్డి పోలీసులు ముందస్తు చర్యగా రాత్రి రాకపోకలను పూర్తిగా నిలిపివే శారు. మంగళవారం ఉదయం వర్షం తగ్గుముఖం పట్టడంతో రహదారిని పునరుద్ధరించినప్పటికి, బ్రి డ్జి వద్ద పేరుకుపోయిన బురదలో ఒక ఆర్టీసీ బస్సు, లారీ ఇరుక్కుపోయాయి. చివరకు జేసీబీ సహాయంతో అధికారులు, స్థానికులు శ్రమకోర్చి ఆ వాహనాలను బయటకు తీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించని పక్షంలో కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడిస్తామని రామారెడ్డి, చుట్టుపక్కలా గ్రామాల ప్రజలు హెచ్చరించారు. -
ఎస్సారెస్పీలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
వేల్పూర్(మెండోరా): మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో గల్లంతైన నలుగురిలో ఆదివారం ఆచూకీ లభించని అజీమ్ఖాన్ మృతదేహం సోమవారం లభించినట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. నిజామాబాద్ ఆటోనగర్కు చెందిన అజీమ్ఖాన్(24)తోపాటు కలీం, సయ్యద్ నజవత్, మహారాష్ట్ర బోకర్కు చెందిన అర్హన్ అనే యువకులు ఆదివారం ఎస్సారెస్పీలో విహారయాత్రకు వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైన విషయం విదితమే. వీరిలో కలీం, నజవత్, అర్హన్ మృతదేహాలు ఆదివారం రాత్రి లభించాయి. పూర్తిగా చీకటి పడడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. తిరిగి సోమవారం గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు చేపట్టి పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని వెలికితీసిన బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.. డిచ్పల్లి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని లక్ష్మీ కెనాల్ బ్యాక్వాటర్స్ వద్ద యువకుడు గల్లంతు కావడంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) టీజీఎస్పీ బృందం సహాయక చర్యలను చేపట్టింది. ఏడో బెటాలియన్లోని 23 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) రమేష్ నాయకత్వం, పర్యవేక్షణలో సవాలుతో కూడుకున్న బ్యాక్వాటర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి, యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక అధికారులకు అప్పగించారు. -
ప్రేమ పేరుతో మోసం చేశాడు.. న్యాయం చేయండి..
● బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బాధితురాలి ధర్నా బోధన్టౌన్(బోధన్): ప్రేమ పేరు చెప్పి సహజీవనం చేసి, మోసం చేశాడని, నాకు న్యాయం చేయండని బాధిత మహిళ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బోధన్లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. పోతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లు సహజీవనం చేశాడన్నారు. వివాహం చేసుకుంటానని పలుమార్లు వాయిదా వేయడంతోపాటు, తను వేరే వారిని పెళ్లి చేసుకుంటే విడాకులు ఇప్పించాడన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుందామని నమ్మించి బోధన్లో అద్దె ఇంట్లో ఉంచి నాలుగేళ్లు సహజీవనం చేశాడన్నారు. తనకు రెండు సార్లు అబార్షన్ చేయించాడని పేర్కొంది. సర్పంచ్తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ ఇలియాస్పై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. విషయం తెలిసిన సర్పంచ్, ఆర్ఎంపీ డాక్టర్ ఇద్దరు పారిపోయారని, సర్పంచ్ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. -
కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కారు
ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను జీపీ అధికారులు తుంగలో తొక్కుతున్నారని, అక్రమార్కులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ భిక్కనూర్ వాసులు మహేందర్రెడ్డి, నరేందర్ రెడ్డిలు మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదన్నారు. జీపీ కార్యదర్శి మహేశ్ కుమార్పై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మరోసారి కలెక్టర్కు విన్నవించినట్లు పేర్కొన్నారు. -
ఎల్లారెడ్డి ప్రజావాణికి రెండు ఫిర్యాదులు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. ఈకార్యక్రమానికి రెవెన్యూ, మున్సిపాలిటికి సంబంధించి ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరైనట్లు తెలిపారు. కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావెలిన్ డే సందర్భంగా సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో 5వ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ కిడ్స్ ఎంపికలు నిర్వహించారు. క్రీడల్లో ఎంపికై న 40 మంది క్రీడాకారులు ఆగస్టు 7,8 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్లు తెలిపారు. ఎంపికై న వారికి పతకాలు అందజేశారు. అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు నవీన్, దత్తాద్రి, శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, శివాగౌడ్, నరేశ్రెడ్డి, రేణుక, భాస్కర్రెడ్డి, అరుణ, విజయ, సరిత తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శిగా ఈ.శ్రీధర్ నియమితులయ్యారు. గత బుధవారం డీఈవో మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా డి.హన్మంత్రెడ్డి ఎన్నిక కాగా ఆయన తాను అ పదవిలో కొన సాగలేనని తెలపడంతో సీనియర్ పీఈటీ శ్రీధ ర్ నియమాకం అనివార్యమైంది. ఎస్జీఎఫ్ జి ల్లా కార్యదర్శిగా శ్రీధర్ ఏడాది కాలంపాటు కొ నసాగుతారని డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికా రి వెంకటేశ్వరగౌడ్, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి హీరాలాల్, పేటా టీఎస్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శు లు మధుసూదన్రెడ్డి, భాస్కర్రెడ్డి, టీజీ పేటా అధ్యక్షుడు స్వామిగౌడ్, పీఈటీలున్నారు. కామారెడ్డి అర్బన్: భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్య కార్యకర్తల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు లింగాపూర్ బృందావన్ ఫంక్షన్హాల్లో నిర్వహించనున్నట్టు సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మేళానానికి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
సంక్షిప్తం..
కుటుంబ సమ్మేళనానికి హాజరు కావాలి లింగంపేట : భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కుటుంబ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని సీజీఆర్ఎఫ్ మెంబర్ రా జాగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం లింగంపేట మండలం బాణాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బృందావన్ గార్డెన్లో కు టుంబ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధుసూదన్రెడ్డి, వెంకటేశ్వర్గౌడ్, సంగమేశ్వర్, గోపాల్, దర్శన్, లక్ష్మినారాయాణ,సాయన్న, తదితరులు పాల్గొన్నారు. పిట్లం కేజీబీవీలో అభివృద్ధి పనులు ప్రారంభం పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం సర్పంచ్ శేఖర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిపోయిన భవన నిర్మాణ పనుల కోసం రూ. 44.91 లక్షలు మంజూరు కావడంతో పనులు ప్రారంభించమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిప్పాపూర్లో సిమెంట్రోడ్డు నిర్మాణ పనులు.. భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో సోమవారం సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, సర్పంచ్ కుంట లింగారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 15 లక్షలు మంజూరు కావడంతో పనులను ప్రారంభించామన్నారు. పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి ఉపసర్పంచ్ జీవన్, విండో చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీ ద్యావరసాయిరెడ్డి, నేతలు చిన్న నర్సరెడ్డి, ధర్మస్వామి, కోక స్వామి, తాటిపల్లి సిద్దరాములు, దయాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర ఆలయంలో భక్తుల పూజలు నస్రుల్లాబాద్:మండలంలోని దుర్కి గ్రామ శివారు లో గల సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు.రెండు వారాలుగా అన్నదానం చేస్తు న్నామని ఆలయ కమిటీ సభ్యులు దు ర్గం మహేశ్ తెలిపారు.అన్నదానం చేసే భక్తులు రూ. చెల్లిస్తే ఆ లయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నా రు. ఈ సందర్భంగా అన్నదాతలు సుంకరి యుద్దం రూప ప్రకాష్ దంపతులను సన్మానించారు.ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు. -
పాత స్థలాలకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
గతంలో ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన స్థలాలకు సంబంధించి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ పెద్దకొడప్గల్ లోని హరిజనవాడకు చెందిన పలువురు ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు సర్వే నంబరు 510లో ఇంటి స్థలాలను కేటాయించిందన్నారు. అప్పటి నుంచి కొందరు బేస్మెంట్ వరకు నిర్మించుకుని పశువుల పాకలుగా, గడ్డివాములుగా, గుడిసెలుగా వాడుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 88 దరఖాస్తులు కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 88 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టాలు ఇప్పించండి.. లింగంపేట: మండల కేంద్రం శివారులోని 983 సర్వే నంబర్లో గల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. సోమవారం కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఆర్వోఎఫ్ఆర్ భూములుగా చూపిస్తుండడంతో ఇబ్బందిపడుతున్నామన్నారు. ఆ భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. రైతులు సాయిలు, పోచయ్య, సత్తవ్వ, తదితరులున్నారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి బీబీపేట: ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా అదుపు తప్పి బోల్తాపడి యువకుడు మృతి చెందిన ఘటన మాందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్చంద్ర తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాజెల్లిపేట శ్రీధర్ (26) అనే వ్యక్తి సోమవారం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాక్టర్తో భూమి దున్నడానికి వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ పొలంలో బోల్తా పడగా, శ్రీధర్ కిందపడి బురదలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. డిచ్పల్లి: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన గణపురం గౌతమ్ (26)కు జనవరిలో వివాహం జరుగగా, ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గౌతమ్ క్షణికావేశంలో వారం రోజుల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొక్కలు నాటుతూ జారిపడి కూలీ .. నిజాంసాగర్ (జుక్కల్): మండలంలోని మాగి గ్రామ శివారులో ఓ ఉపాధి కూలీ మొక్కలు నాటుతుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతిచెందాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మామిళ్ల భద్రయ్య (64) అనే ఉపాధి కూలీ సోమవారం ముత్యపువాని కుంట వద్ద గుంతలు తవ్వి మొక్కలు నాటే పనులకు వెళ్లాడు. ఈక్రమంలో అతడు కూలీలతో కలిసి గుంతలు తవ్వి, మొక్కలు నాటుతున్న క్రమంలో అస్వస్థతకు గురై, కాలు జారి కింద పడి మృతి చెందినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజ్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని విజ్ఞారాజ్ అపార్టమెంట్లోగల పేకాట స్థావరంపై దాడిచేసినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ సోమవారం తెలిపారు. ఈ దాడిలో పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.1930 నగదు, 4ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
ఐదు కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రుద్రూర్: మండల కేంద్రంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వా ధీనం చేసుకున్నట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. రుద్రూర్లోని పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రుద్రూర్ శివారులోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఈనెల 26న మధ్యాహ్నం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, మోటార్సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరిని ఆపి తనిఖీ చేశారు. ఒకరి వద్ద మూడు కిలోలు, మరొకరి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం ఐదు కిలోల గంజాయి, రెండు మోటార్సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లను వారి నుంచి స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50వేలుగా ఉంటుందని ఏసీపీ తెలిపారు. నిందితులు కోటగిరి మండలానికి చెందిన కర్కెల్లి సంజీవ్, బిహార్ రాష్ట్రానికి చెందిన బల్వంత్ కుమార్ సింగ్గా గుర్తించారు. బిహార్కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తెప్పించుకుని, స్థానిక రైస్మిల్లుల్లో పనిచేసే హమాలీలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుంచి గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఏడుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఏసీపీ, చీతా ఫోర్స్, రుద్రూర్ సీఐతోపాటు పోలీసు సిబ్బందిని సీపీ అభినందించినట్లు పేర్కొన్నారు. రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్పైలు మనోజ్ కుమార్, శ్రీనివాస్, చీతాఫోర్సు ఎస్సై శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
‘డెయిరీ కళాశాలకు తోడ్పాటు అందిస్తాం’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి కావాల్సిన తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ జ్ఞాన ప్రకా ష్, రిజిస్ట్రార్ శరత్చంద్ర పేర్కొన్నారు. సోమవారం వారు యూనివర్సిటీ పరిధిలోని కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలను సందర్శించారు. కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి నాణ్యమైన విద్య అందించాలని, నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీన్ ఉదయ్కుమార్, విద్యార్థి విభాగం అధిపతి సతీష్కుమార్, అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) జిల్లా కార్యవర్గం ఎన్నికలను సోమ వారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు గా రమేష్గౌడ్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా జే.శివకుమార్ (ఎల్లారెడ్డి కళాశాల), ప్రధాన కార్యదర్శిగా ఎన్.రాములు (కామారెడ్డి కళాశాల) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు జయప్రకా ష్, ముస్తఫా, యాసిన్, శ్రీనివాస్రావు, శ్రీవల్లి, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూనె గింజల పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖాధికారి జ్యోతి సూచించారు. కాచాపూర్లో ఉప సర్పంచ్ తొగరి దశరథం సాగుచేస్తున్న ఆయిల్పామ్ ప్లాంటేషన్ను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకూ నూనెలకు డిమాండ్ పెరుగుతోందని, ఆయిల్ పంటల సాగుకు ముందుకొచ్చి లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ ఉద్యాన అధికారి సుమన్, హెచ్ఈవో బాపురెడ్డి, హెచ్యూఎల్ సీనియర్ మేనేజర్లు శ్రీనివాస్గౌడ్, ప్రమోద్, క్లస్టర్ మేనేజర్ హేమకుమార్, క్లస్టర్ అధికారులు సత్యనారాయణ, అరుణ్ కుమార్, శివ, మురళి తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండాలని అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరులో నిర్వహించిన మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత మహిళా సభ్యులు సంఘంలో లేనివారిని గుర్తించి వారిని సైతం పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని జయశంకర్ కాలనీలోగల యోగా భవన్లో వచ్చేనెల 2న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ అంశాలలో అండర్–10 నుంచి అండర్–55 వరకు బాలబాలికలు, మహిళలు, పురుషులకు వేరువేరుగా పోటీలుంటాయని పేర్కొన్నారు. వివరాలకు 99121 87508, 94400 37948, 96664 70472 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
● రోగులు కోలుకునేలా పర్యవేక్షించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వైద్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టీబీ నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ జరిగిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందేలా చూడాలన్నారు. వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. టీబీ రోగులతో సన్నిహితంగా ఉండే వారందరికీ పరీక్షలు చేయాలన్నారు. హెచ్ఐవీ, మధుమేహంలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా టీబీ స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా, వందశాతం కోలుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పౌష్టికాహార సహాయం కోసం ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నిధులు అర్హులైన రోగుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమయ్యేలా చూడాలన్నారు. జలసిరి పనులు వేగవంతం చేయాలి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిర్ణయించిన జలసిరి పనులను వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంపొందించడమే జలసిరి పనుల ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చేనెల 15 నాటికల్లా జిల్లాలోని ఒక్కో జీపీ పరిధిలో 20 చొప్పున జిల్లాలో మొత్తం 10,640 ఇంకుడు గుంతలు, జీపీకి 2 చొప్పున మొత్తం 1,064 పంట కుంటలు, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 1,638 బోరుబావుల రీచార్జ్ పిట్లు, ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున ఊటకుంటల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీబీ జీ రామ్జీ పథకం కింద చేపట్టే ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి 60 మంది కూలీలను సమీకరించి వారికి పనుల ప్రాధాన్యతను వివరించాలని ఎంపీడీవోలకు సూచించారు. -
అభివృద్ధికి ఆమడదూరం!
జిల్లా ఏర్పాటు కాకముందే కామారెడ్డి పట్ట ణం ఎంతో విస్తరించింది. తర్వాత పల్లెల నుంచి ఎంతోమంది వలస వచ్చారు. దీనికితోడు చుట్టుపక్కల గ్రామాలైన టేక్రియాల్, రామేశ్వర్పల్లి, అడ్లూర్, ఇల్చిపూర్, సరంపల్లి, లింగాయపల్లి, పాత రాజంపేటలను బల్దియాలో విలీనం చేసిన తర్వాత పట్టణ పరిధిలో మరింతగా పెరిగింది. వ్యాపార అభివృద్ధి కూడా జరిగింది. మాస్టర్ ప్లాన్ అటకెక్కడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆహ్లాదం కరువు... పట్టణంలో ఉన్న రాజీవ్ పార్కు నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను పట్టించుకునేవారు లేక కనుమరుగయ్యాయి. పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు ప్రజలకు ఎలాంటి ఆహ్లాదం పంచడం లేదు. పట్టణం విస్తరిస్తున్న కొద్దీ అవసరమైన పార్కులు అభివృద్ది చేయాల్సి ఉన్నా దానిపై ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిర్మాణాలు పూర్తయ్యేదెప్పుడో? తాగునీటి సౌకర్యం కోసం అమృత్–2 పథకం ద్వారా చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. నీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.. ఎస్సారెస్పీ ద్వారా అందిస్తున్న తాగునీరు రోజు విడిచి రోజు అందుతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లు ఎత్తిపోయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడం లేదు. సర్వేలకే పరిమితం... జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణం సర్వేలకే పరిమితమైంది. రైలు గేటు పడినపుడల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణం మీదుగా రోజూ యాభైకిపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో గేటు వేసినపుడల్లా పది నిమిషాల వరకు ఆగాల్సి వస్తోంది. గేటు పడినప్పుడల్లా ట్రాఫిక్ తిప్పలు సాధారణమయ్యాయి.కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని రద్దీగా ఉండే నిజాంసాగర్ చౌరస్తా బస్టాప్లో ప్రయాణికులకు నీడ సౌకర్యం లేదు. దీంతో వానొస్తే గొడుగు.. ఎండకాస్తే చెట్టు నీడే దిక్కవుతున్నాయి. ఈ బస్టాప్లో షెడ్డు లేక, కూర్చోవడానికి కుర్చీలు, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో.. పాతబస్టాండ్లో ప్రయాణికులకు నిలువ నీడలేదు. వానొచ్చినా, ఎండొచ్చినా ప్రయాణికులు రోడ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి.. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ఇందిరా చౌక్ వద్ద రోడ్డుపైనే ఆగుతున్నాయి. అక్కడ ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లే బస్సులు పాత బస్టాండ్ లోపలికి వెళతాయి. అక్కడా సౌకర్యాలులేవు.జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. దీంతో ఇరుకు రోడ్లపై ప్రయాణానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి రైల్వే బ్రిడ్జీ వరకు ఉన్న స్టేషన్ రోడ్డులో వర్షపు నీరు రోడ్డు మీదే నిలిచిపోతోంది. ఇందిరాచౌక్ నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న సిరిసిల్ల రోడ్డుపై డివైడర్లు నిర్మించి, రోడ్లను విస్తరించలేదు. ఈ రోడ్డుపై పలుచోట్ల వర్షపు నీరు, డ్రెయినేజీ నీరు రోడ్డుపై నిలిచిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు రోడ్డుపై డివైడర్లు నిర్మించినా డ్రెయినేజీలు లేకపోవడంతో వర్షపు నీరంతా రోడ్డుపైకి చేరుతోంది. జన్మభూమి రోడ్డు, ఆర్కే లాడ్జీ రోడ్డు, అశోక్నగర్ రోడ్డు ఎనభై ఫీట్లుగా విస్తరణ జరగలేదు. పాత బస్టాండ్ నుంచి దర్శన్ టాకీస్, పంచముఖి హనుమాన్ ఆలయం మీదుగా అడ్లూర్ రోడ్డు 80 అడుగుల విస్తరణ అటకెక్కింది. నిజాంసాగర్ చౌరస్తా, అశోక్నగర్ చౌరస్తా, ఇందిరా చౌక్, రామారెడ్డి చౌరస్తాలను జంక్షన్లుగా అభివృద్ధి చేయడానికి గతంలో నిధులు మంజూరైనా పనులు జరగలేదు. దీంతో పట్టణంలోని పలు జంక్షన్లు, కూడళ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్నాయి.అటకెక్కిన మాస్టర్ ప్లాన్ విస్తరణకు నోచుకోని రోడ్లు, జంక్షన్లు సర్వేలకే పరిమితమైన రైల్వే ఓవర్ బ్రిడ్జీలు నత్తనడకన అమృత్–2 స్కీం పనులు పాత బస్టాండ్లో ప్రయాణికులకు నీడకరువు వానొస్తే చెరువులను తలపించే ప్రధాన రోడ్లు అందరూ ఉన్నా అనాథలా కామారెడ్డి పట్టణం -
తహసీల్ ఆఫీస్ ఫర్నిచర్ జప్తునకు ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, కామా రెడ్డి : భూ యజమానులకు రూ. 2.82 లక్షల పరిహారం ఇవ్వని విషయంలో తహసీల్ కార్యాలయ ఫర్నిచర్ను జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన రాజులు, శ్రీనివాసులు అనే వ్యక్తులు పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన భూమికి పరిహారం కోసం 1987లో బోధన్ కోర్టులో కేసు వేశారు. వారికి పరిహారం ఇవ్వాలని అప్పట్లో తీర్పు వెలువడింది. అయితే అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో గతేడాది సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి.. తహసీల్ ఆఫీసు ఫర్నిచర్ జప్తు చేయాలని ఆదేశించారు. నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 899 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 1,394.48 అడుగుల (6.489 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
మందు.. వద్దే వద్దు!
● ఆజామాబాద్, గండిమాసానిపేటలలో మద్య నిషేధం ● మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా ● ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన ప్రజలుఎల్లారెడ్డిరూరల్: యువత మేలు, ఊరి బాగు కోసం ఆ గ్రామాలు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. యువ త మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయని భావించిన గ్రామపెద్దలు.. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ తీర్మానించారు. తద్వారా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్, గండిమాసానిపేట గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అతిక్రమిస్తే రూ.50 వేలు.. పట్టిస్తే రూ.5 వేలు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట, మండలంలోని ఆజామాబాద్ గ్రామాల్లో గతంలో విచ్చలవిడిగా మద్యం దొరికేది. దీంతో యువత తాగుడుకు బానిసలయ్యారు. పనులు చేయకుండా ఉంటుండడంతో తరచూ కుటుంబాలలో తగాదాలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు చాలామంది పనులకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులూ తీవ్రమయ్యాయి. దీనంతటికీ కారణం మద్యమేనని గ్రహించిన గ్రామపెద్దలు.. యువకులతో చర్చించి మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీనిని అతిక్రమించిన వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా కట్టుబడి ఉండాలనే నిబంధన విధించారు.ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో 2024 సెప్టెంబర్లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానం చేశారు. తాజాగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామంలో రెండురోజుల క్రితం మద్యం విక్రయించొద్దని నిర్ణయం తీసుకున్నారు.మద్య నిషేధం తర్వాత గ్రామంలో చాలా వరకు గొడవలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఎవరి పనులు వారు చేసుకుంటుండడంతో ఇతరుల మీద ఆధారపడే బాధ తప్పింది. గ్రామంలో కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటున్నాయి. – పండరి, ఆజామాబాద్యువత మద్యం మత్తులో ఉంటున్నారని గ్రామంలో మద్య నిషేధం విధించాం. గ్రామస్తులతోపాటు యువత కూడా గ్రామ పెద్దల నిర్ణయానికి సహకరిస్తూ కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నారు. – వహీద్, గండిమాసానిపేట -
నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని కర్షక్ బిఎడ్ కళాశాలలో ఆదివారం డీటీఎఫ్ జిల్లా ఐదవ వార్షిక కౌన్సిల్ సమావేశం, జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్ హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా పీఆర్సీ అమలు చేయకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలు విస్మరించడమేనన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దేవులా, ఉపాధ్యక్షులుగా శ్యాంకమార్, సునంద, రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా రాములు, కార్యదర్శులుగా వినోద్, గంగారాం, చిన్నరాజయ్య, గఫర్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎన్సీ ప్రభాకర్, సరోజిని, ఆడిట్ కన్వీనర్గా వంశీధర్, కార్యవర్గ సభ్యులుగా భాగ్యలక్ష్మి, చిన్నస్వామి, అకడమిక్ సెల్ కన్వీనర్లుగా విజయరామరాజు, బాబురావు, లలిత ఎన్నికయ్యారు. -
పేదింట పెనువిషాదం
వేల్పూర్(మెండోరా)/నిజామాబాద్ అర్బన్: సరదాగా పిక్నిక్కు వెళ్లిన చేతికొచ్చిన కొడుకులు నీటమునిగి మృత్యువాతపడడంతో కన్నవారు కన్నీటి పర్యంతమవుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాల రెక్కలు తెగిపోయాయి! నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్కు చెందిన అమ్ము అలియాస్ నజువత్(24), అజీమ్(24), అర్సపల్లికి చెందిన కలీం(23), మహారాష్ట్రలోని భోకర్కు చెందిన అర్హాన్(17)తోపాటు మరో యువకుడు కలిసి ఆదివారం ఎస్సారెస్పీ ప్రాంతానికి పిక్నిక్కు వెళ్లారు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని లక్ష్మీకాలువ హెడ్రెగ్యులేటరీ వద్ద కాలువలో నలుగురు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అర్హాన్ ఆచూకీ లభించలేదు. సీపీ సాయిచైతన్య గాలింపు చర్యలను పర్యవేక్షించారు. అజీమ్ఖాన్ డిచ్పల్లిలోని ఓ ప్రైవేట్ షోరూమ్లో ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్న అజీమ్ను స్నేహితులు వచ్చి వెంట తీసుకెళ్లారని తెలిసింది. అతడి తండ్రి ఉస్మాన్ఖాన్ బియ్యం దుకాణంలో పని చేస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో తండ్రి షాక్లోకి వెళ్లాడు.అజీమ్, కలీం, నజువత్, అర్హాన్ (ఫైల్)వేల్పూర్(మెండోరా) : ఎస్సారెస్పీలో యువకులు గల్లంతైన సమాచారం అందుకున్న సీపీ సాయిచైతన్య హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డితో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. సుమారు 8.30గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్న సీపీ.. మరో యువకుడి ఆచూకీ గుర్తింపు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. మెండోరా ఎస్సై సుహాసిని, స్థానిక సిబ్బంది, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. ఎస్సారెస్పీ ప్రాంతానికి సరదాగా పిక్నిక్కు వెళ్లి కానరాని లోకాలకు లక్ష్మీకాలువలో నలుగురు యువకుల గల్లంతు మగ్గురి మృత్యువాత.. లభించని మరొకరి ఆచూకీ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్, అర్సపల్లిలో విషాదఛాయలు -
ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాలి
● నీటిని పొదుపుగా వాడాలి ● ఎల్నినో ప్రభావంపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త జేకే రేవంత్ నాథన్ సూచననాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఎల్ని నో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టిసారించాలని నాగిరెడ్డిపేట మండ లం మాల్తుమ్మెదలోని తెలంగాణ రైతు విజ్ఞానకేంద్రం(టీఆర్వీకే) సమన్వయకర్త డాక్టర్ జేకే రేవంత్ నాథన్ సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసు కుంటున్న మార్పుల కారణంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభా వం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో ఆదివారం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. లోటు వర్షపాతం.. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణ స్థా యి కంటే తక్కువగా ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణశాఖ సూచించిన గణాంకాల ప్రకారం జిల్లాలో సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే సుమారు 18శాతం తక్కువగా ఉంది. జిల్లాలో వాస్తవ వర్షపాతం 278.0మిల్లీమీటర్లు ఉండగా సాధారణ వర్షపాతం 337.5మిల్లీమీటర్లుగా నమోదయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో సాగునీటి కొరత ఏర్పడి పంటల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. చెరువులు, రిజర్వాయర్లతోపాటు భూగర్భజలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలి. బోరు మోటార్లు ఎక్కువ సమయం పనిచేస్తే విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడి రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం కష్టతరమవుతుంది. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో తక్కువనీటితో సాగయ్యే ప ప్పుధాన్యాలు, నూనెగింజలతోపాటు ఇతర ఆరుతడి పంటలను సాగుచేయడం ఉత్తమం. వరికి బదులుగా మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, వేరుశనగవంటి తక్కువ నీటితో పెరిగే పంటలను సాగుచేయడం ద్వారా దిగుబడి నష్టాలను తగ్గించు కోవచ్చు. పశుగ్రాస పంటలను కూడా సాగులో భాగంచేయడం వల్ల పశుసంపదకు మేలు కలుగుతుంది. వర్షపాతం లోటు ఉన్నప్పుడు వరి సాగు కోసం బోర్ల పై పూర్తిగా ఆధారపడకూడదు. ఒకేపంట కాకుండా పంటమార్పిడి చేపట్టాలి. నీటిలభ్యత ఆధారంగా అధికనీటి వినియోగ పంట లు, మధ్యస్థ నీటి వినియోగ పంటలు, తక్కువ నీటివియోగ పంటలను ప్రణాళిక చేసుకోవాలి. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలిపి నేల తేమను సంరక్షించాలి. వీలైనచోట్ల మల్చింగ్ షీట్ల వినియోగం, అంతరపంటల సాగు, పంటమార్పిడి, వర్షపునీటి సంరక్షణ పద్ధతులను పాటించాలి. బోరునీటిని విచక్షణారహితంగా వినియోగించకుండా నీటిబడ్జెట్ ఆధారంగా పంటప్రణాళిక రూపొందించుకోవాలి. స్థానిక వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వాతావరణ సూచనల ఆధారంగా రైతులు పంటసాగు నిర్ణయాలు తీసుకోవాలి. -
చెక్డ్యామ్తో మంజీరకు జలకళ
బాన్సువాడ : బీర్కూర్ పరిధిలోని మంజీర నది చెక్డ్యామ్ నిర్మాణంతో జలకళను సంతరించుకుంది. అడపాదడప కురిసిన వర్షాలకు నదిలో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. మంజీర నదిలో చెక్డ్యాం నిర్మాణానికి అప్పటి స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రూ.28.29 కోట్ల నిధులను మంజూరు చేసి, 2021 జనవరి 28న అప్పటి మంత్రి ప్రశాంత్రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. ప్రసుత్తం పనులు పూర్తికావస్తుండడంతో మంజీరలో పారే నీరు చెక్డ్యాం వద్ద నిల్వ ఉంది. సుమారు కిలోమీటర్ మేరకు నీరు నిల్వ ఉండటంతో మంజీర ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరుణుడిపై ఆశలు పెట్టుకుని వరి నాట్లు వేశారు. వర్షాలు కురవకపోవడంతో మంజీర ప్రాంతంలో చాలా బోర్లు ఎత్తిపోయాయి. చెక్డ్యాం కారణంగా నీరు నిల్వ ఉండటంతో భూగర్బజాలాలు వృద్ధి చెంది బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తదని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
లింబాద్రిగుట్టపై హైకోర్టు న్యాయమూర్తుల పూజలు
కమ్మర్పల్లి(భీమ్గల్) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ లింబాద్రి గుట్టపై లక్ష్మీనృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. న్యాయమూర్తులు తంగిరాల మాధవీదేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, గడి ప్రవీణ్కుమార్తోపాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి గుట్టపైకి రాగా.. ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆర్మూర్ సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి శ్రీదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరళారాణి, అడిషనల్ కోర్టు జడ్జి, భీమ్గల్ కోర్టు ఇన్చార్జి భవ్యశ్రీ, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్చందర్, న్యాయవాదులు గజ్జెల చైతన్య, సూర సురేశ్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్ : టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం కోసం అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023, 24, 25 సంవత్సరాల్లో సాహస క్రీడాకారులు, పర్వతారోహకులు, ట్రెక్కర్లు, రివర్రాఫ్టింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, స్కైడైవింగ్ తదితర సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారు ఆగస్టు 20 లోపు భారత ప్రభుత్వ కామన్ అవార్ుడ్స పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీ్త్రనిధి డైరెక్టర్ పోటీలో స్రవంతి బీబీపేట: సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్ పదవి పోటీలో మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం మండలాధ్యక్షురాలు సాదల స్రవంతి బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 20 మంది డైరెక్టర్ పదవులకు గానూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా జిల్లాలను కలిపి ఒక డైరెక్టర్ పదవి కేటాయించారు. దీంతో కామారెడ్డి జిల్లాలోని ప్రతి మహిళా సంఘం మండల అధ్యక్షులు ఓటు వేయనున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి స్రవంతి నామినేషన్ వేయగా రాజన్న సిరిసిల్లా నుంచి లింగారెడ్డిగారి భాగ్య నామినేషన్ వేశారు. వీరిద్దరికి ఇప్పటికే గుర్తులు కూడా కేటాయించారు. స్రవంతికి బ్యాట్ గుర్తు రాగా భాగ్యకు బీరువా గుర్తు వచ్చింది. దీంతో ఈనెల 28న సంబందిత నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలోనే అత్యధిక మండలాలు ఉండి డైరెక్టర్ పదవి దక్కించుకునేందుకు అవకాశాలు ఉండగా రాజన్న సిరిసిల్లాలో తక్కువ మండలాలు ఉన్నప్పటికీ నామినేషన్ వేయడం గమనార్హం. సీనియర్ బాల్బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక ఖలీల్వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పురుషుల, మహిళా క్రీడాకారుల ఎంపికలను నిజామాబాద్ నగరంలోని క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఎంపికలకు ముఖ్యఅతిథిగా అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం శ్రావణ్రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలగ్రౌండ్స్లో నిర్వహించే 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని శ్యామ్ తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, కోశాధికారి రాజేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు నరేంద్రచారి, సులోచన, భాగ్యశ్రీ, రూప తదితరులు పాల్గొన్నారన్నారు. -
రోడ్డు ఇలా.. వెళ్లేదెలా
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులోని రోడ్డు అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా బురదమయంగా మా రడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలోనే ప్రభుత్వ వృద్ధాశ్రమంతో పాటు పాత జాతీయ రహదారి నుంచి అశోక్నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదా రి ఉంది. ఆదివారం వృద్ధాశ్రమానికి తాగునీరు తీసుకెళ్తున్న ఆటో బురదలో ఇరుక్కుపోవడంతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
ముగిసిన సీబీఎస్ఈ ఖోఖో పోటీలు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీబీఎస్ఈ క్లస్టర్–7 ఖోఖో బాలికల టోర్నీ ఆదివారం ఘనంగా ముగిసింది. కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ ఆతిథ్యంలో నిర్వహించిన ఈ క్రీడా సమరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అండర్ 14, 17, 19 విభాగంలో 104 జట్లు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అండర్–19 విభాగంలో శ్రీ ప్రకాశ్ విద్యానికేతన్, అండర్–17లో మాంటిస్సోరి ఎలైట్ స్కూల్, అండర్– 14లో ఏకశిల హైస్కూల్ జట్లు విజేతలుగా నిలిచా యి. విజేత జట్లకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి ట్రోపీలు, మెడల్స్ ప్రదానం చేశారు. సీబీఎస్ఈ పరిశీలకుడు భరత్ కుమార్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫరీ బోర్డు కన్వీనర్ వంగపల్లి సూర్య ప్రకాశ్, భారత మహిళా ఖోఖో జట్టు కోచ్ నరేశ్, అంతర్జాతీయ రెఫరీ రవీందర్, షఫీ, ఎస్కె మొయినొద్దీన్, వేల్పుల సురేందర్ పాల్గొన్నారు. -
సర్పై అప్రమత్తంగా ఉండాలి
● 10న ప్రచురించే ఓటర్ల జాబితాను పరిశీలించాలి ● కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి టౌన్/దోమకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మండల, పట్టణ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్వోలు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను సరిగ్గా పూర్తి చేయించి సకాలంలో అందజేసేలా చూడాలని సూచించారు. వచ్చేనెల 3వ తేదీ నాటికి పూర్తి చేసిన ఫారాలను బీఎల్వోలకు అందజేయాలని, 10వ తేదీన ప్రచురించే ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమావేశంలో పట్టణ మాజీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, లోలం శ్రీనివాస్, నాయకులు కాసర్ల స్వామి, గోపు నర్సింలు, బల్వంత్ రావు, హన్మాండ్లు, కృష్ణాజి రావు, శశికాంత్, పుల్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దోమకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, నాయకులు గజవాడ శ్రీకాంత్, అరుట్ల అనిల్కుమార్, పాల నాగరాజు, బోరెడ్డి కిషన్రెడ్డి, తిరుపతిగౌడ్, రాజిరెడ్డి, ఐరేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పలువురికి పరామర్శ భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత గడ్డం మల్లారెడ్డి అత్తమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్త అమృత ఇటీవల ప్రమాదంలో కాలు విరగడంతో పరామర్శించి ఆర్థికసాయం అందించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ భాగ్యమ్మ నీలంరెడ్డి, నేతలు అందె మహేందర్రెడ్డి, రమేశ్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రమాదాల హైవే
నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులు నత్తేనయం అన్నట్లుగా సాగుతున్నాయి. ఏడాదిన్నర కిందట మహమ్మద్నగర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇళ్లను కూల్చి, గుంతలు తవ్వి వదిలేశారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ శాఖ నుంచి అనుమతులు రాక నిలిచిన పనులు హైదరాబాద్– బోధన్ ఎన్హెచ్ (765 డి)లో రూ.313 కోట్ల నిధులతో ఎల్లారెడ్డి– రుద్రూర్ వరకు 51.6 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, బాన్సువాడ మండలాల్లోని అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు అటవీ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచాయి. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు రెండు వైపులా డ్రెయినేజీ నిర్మించారు. మధ్యలో ఒక పక్కన బీటీ సింగిల్ లేయర్ వేసి వదిలేశారు. తద్వారా క్రాస్గా ఉన్న బీటీ లేయర్తో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తరుచుగా యాక్సిడెంట్స్ ● ఈ నెల 18న మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన పెద్దగొళ్ల సందీప్ (22) అనే యువకుడు ఈ నెల 23న మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బూర్గుల్ గ్రామానికి చెందిన తండ్రి కుమ్మరి రాజు, అతని కూతురు శివాణి నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ● ఈ నెల 17న మహమ్మద్ నగర్ మండల కేంద్రం శివారులోని పెద్ద వాగు వంతెన వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ● గతేడాది కాలంలో ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్ మండలాల్లో రోడ్డు విస్తరణ పనులతో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నర్వ, గాలీపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ఎల్లారెడ్డి– రుద్రూర్ రహదారి విస్తరణ పనులు ఇప్పటి వరకు 70శాతం పూర్తయ్యాయి. రూ. 210 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాం. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో విస్తరణ పనులు ఆలస్యం అవుతున్నాయి. మహమ్మద్ నగర్ నగర్లో రెండు, మూడు రోజుల్లో సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభిస్తాం. – వినోద్, ఏఈఈ, నేషనల్ హైవే ప్రధాన రహదారికి రెండు వైపు లా సర్వీస్ రోడ్లు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడతున్నాం. ప్రధాన రహదారిపై వాహనాలు పార్కింగ్ చేస్తే, ప్రమాదాలు జరుగుతున్నా యి. సర్వీస్ రోడ్ల కోసం ఇళ్లను కూల్చి, గుంతలు తవ్వినా రోడ్లు వేయలేదు. – ఒడిగే గణపతి, హోటల్ నిర్వాహకుడు,మహమ్మద్నగర్ హైదరాబాద్– బోధన్ ఎన్హెచ్ (765 డి) రహదారి విస్తరణ పనుల్లో జాప్యం మహమ్మద్నగర్లో గుంతలు తవ్వి, ఇళ్లను కూల్చినా నిర్మించని సర్వీస్ రోడ్లు పట్టించుకోని అధికారులు -
వీహెచ్పీ ఇందూర్ విభాగ్ సత్సంగ్ ప్రముఖ్గా రాజు
కామారెడ్డి అర్బన్: విశ్వహిందూ పరిషత్ ఇందూర్ విభాగ్ సత్సంగ్ ప్రముఖ్ గా వీహెచ్పీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి బొల్లిరాజు నియమితులయ్యారు. వేములవాడలో శని,ఆదివారాల్లో నిర్వహించిన వీహెచ్పీ తెలంగాణ రాష్ట్ర సమావేశంలో వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహమూర్తి ప్రకటించారు. వీహెచ్పీ ఇందూర్ విభాగ్లో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలుండగా వీటిని సమన్వయం చేసే బాధ్యత తనకు నమ్మకంతో అప్పగించారని రాజు అన్నారు. హిందూ ధర్మ ప్రచారం, సమాజ హితం కోసం పని చేస్తానన్నారు. ● ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సదాశివనగర్(ఎల్లారెడ్డి): సైబర్ మోసగాళ్ల ఉ చ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. ఆదివారం సదాశివనగర్ మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. యువత సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాల్లో బెట్టింగ్ యాప్ల వినియోగం, మత్తుపదార్థాలకు బానిస కావడం వల్ల యువత పెడదారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, నియమాలు పాటించాలన్నారు. ఎవరైనా సైబర్మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజు, ఏఎస్సై జగదీశ్, సర్పంచేలు శిరీష, సంగారావు, నరేందర్, నాయకులు, యువకులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొత్తాబాది గ్రామంలోని బుడిమి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త రోడ్డు , కల్వర్టు నిర్మించిన అధికారులు వర్షపు నీళ్లు వెళ్లిపోయేలా నిర్మించలేదు. దీంతో భారీవాహనాలు వెళ్ళినపుడు నీళ్ళు పాదాచారులపై, ద్విచక్రవాహన చోదకులపై చిత్తుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బీబీపేట: మండలంలోని యాడారం శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నవీన్ చంద్ర ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పక్కా సమాచారం మేరకు యాడారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దాడి నిర్వహించగా నలుగురు పేకాట ఆడుతున్నట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.7,662 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. -
‘ఆర్యసమాజాలు ధర్మరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి’
కామారెడ్డి అర్బన్: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆర్య సమాజాలు ధర్మరక్షణ కార్యక్రమాలు విస్తృ తంగా నిర్వహించాలని, ప్రతి నెల నాలుగో ఆదివారం సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ఆచార్య సత్యమిత్ర అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్య సమాజంలో జిల్లా ఆర్యసమాజాల సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో ఇందూరు ఆర్యసమాజం అధ్యక్షుడు విజయ్కుమార్, కామారెడ్డి అధ్యక్షుడు కంకణాల కిషన్ మాట్లాడుతూ.. సమాజ ధర్మరక్షణ కోసం దయానందుడు చూపిన మార్గంలో కృషి చేయాలన్నారు. మోతే, చిన్నమల్లారెడ్డి, బ్రహ్మణపల్లి, జంగంపల్లి, ఎర్రపహాడ్, రామారెడ్డి తదితర ఆర్యసమాజాల ప్రతినిధులు మాట్లాడారు. ఆర్యసమాజం ప్రతినిధులు అరుణ, కవిత, అర్వపల్లి రమేష్, హరినాథ్, నాగరాజు, సరస్వతమ్మ, వినోద ఆర్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పౌరుడికి సమ న్యాయమే లక్ష్యం
● ప్రజల వద్దకే వేగవంతమైన న్యాయసేవలు ● రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తంగిరాల మాధవీదేవికమ్మర్పల్లి(భీమ్గల్): సమాజంలో ప్రతి పౌరుడికి సమ న్యాయం చేయడం, ఉచితంగా న్యాయ సహా యం అందించడం న్యాయవ్యవస్థ లక్ష్యమని హైకో ర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీదేవి అన్నారు. భీమ్గల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి–కమ్–జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును జస్టిస్ మాధవీదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేయడమే కోర్టు ఏర్పాటు ప్రధాన ఉద్ధేశమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఏ ప్రకారం ప్రతి పౌరుడికి సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని అన్నారు. ఒక కోర్టు గొప్పతనం దాని భవనం పరిమాణంపై కాకుండా, అక్కడ లభించే న్యాయం యొక్క నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు సహనం, నిష్పక్షపాతం, నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయవ్యవస్థలో బెంచ్, బార్ రెండు సమాన భాగస్వాములని, సంస్థ ప్రగతికి న్యాయవాదుల సహకారం ఎల్లప్పుడూ అవసరమని ఆకాంక్షించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులతో మండల మహిళా సమాఖ్య భవనాన్ని తక్కువ సమయంలో కోర్టు భవనంగా తీర్చిదిద్దిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 1600 కేసుల బదిలీ ఆర్మూర్, నిజామాబాద్ కోర్టుల నుంచి భీమ్గల్ కోర్టుకు సుమారు 1,600 కేసులు (300 సివిల్, 1,300 క్రిమినల్) బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. కేసుల బదిలీతో పాత కోర్టులపై భారం తగ్గడంతోపాటు విచారణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తొలి జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీభీమ్గల్ కోర్టు తొలి జూనియర్ సివిల్ జడ్జిగా భవ్యశ్రీని నియమిస్తున్నట్లు జస్టిస్ ప్రకటించారు. కోర్టు భవ్యంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఆదివారం నుంచే కోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించారు. భవ్యశ్రీ న్యాయమూర్తి స్థానంలో కూర్చోని జ్యుడీషియల్ పరిధిలోని ఆరు కేసులకు కాల్ వర్క్ నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీ నా రాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారత లక్ష్మి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. ప్రవీణ్ చందర్, న్యాయవాదులు జి. చైతన్య, సూర సురేష్, బార్ అసోసియే షన్ ప్రతినిధులు, జిల్లా న్యాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వాహన దొంగల ముఠా గుట్టురట్టు
● పది మంది అరెస్ట్.. ఆరుగురు పరారీ ● రూ.17 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం ● ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో కొద్ది నెలలుగా వాహన చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠా గుట్టును రట్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మొత్తం 16 మంది నిందితులపై కేసు నమోదు చేసి, పది మందిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 21న రిమ్స్ ఎదురుగా పలువురు ఆటో దొంగతనానికి యత్నించిన అనంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. 24న కుప్టి ఘాట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు పోలీసులపై కత్తితో బెదిరింపులకు పాల్పడి కారులో పరారయ్యారు. 25న వాంకిడి చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు అదే కారును గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధాన నిందితులు యాసర్ అహ్మద్, సోహైల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ దొంగతనానికి అనువైన వాహనాలను గుర్తించి ముఠా సభ్యులకు సమాచారం అందించేవారు. అనంతరం సభ్యులు కారును అద్దెకు తీసుకుని పార్కింగ్లో ఉన్న వాహనాలను దొంగిలించి ఇఫ్తేఖార్, షేక్ అబూతలాహకు విక్రయించేవారు. అరెస్టు చేసిన పది మంది నిందితుల నుంచి 7 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారు, 8 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. నిందితుల వివరాలు.. నిర్మల్లోని రామ్నగర్కు చెందిన యాసర్ అహ్మద్, సోఫీనగర్కు చెందిన అక్బర్ఖాన్, మహ్మద్ అద్నా న్, ఆజామ్ ఖాన్, ఉమర్ ఖాన్, గుల్జార్ మార్కెట్ కు చెందిన అబ్దుల్ ఫారూక్, బుధవార్పేట్కు చెందిన అర్బాస్ ఖాన్, ఆదర్శ్నగర్కు చెందిన నాసిర్ బిన్ జావీద్, షేక్ అబూతలాహ, మదీనా కాలనీకి చెందిన షేక్ ఇఫ్తేఖార్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిర్మల్కు చెందిన ఇమ్రాన్, నిజామాబాద్కు చెందిన జైన్, ఆదర్శ్నగర్కు చెందిన జునైద్, బుధవార్పేట్కు చెందిన సోఫియాన్, ఫర్దీన్, అద్నాన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తాం
● జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం ● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్(జుక్కల్):అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని పబ్లిక్ టాయిలెట్ల భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నా రు. మద్నూర్లో రూ. 2 కోట్లతో నూతన తహసీల్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందిరనగర్ కాలనీలో మురికికాలువలు, రోడ్డు, కమ్యునిటీ భవనానికి త్వరలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. తహసీల్దార్ ముజీబ్, సర్పంచ్ ఉషసంతోష్, సలాబత్పూర్ హ నుమాన్ ఆలయ చైర్మన్ రాంపటేల్, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలి నిజాంసాగర్(జుక్కల్): క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు తమవంతు కృషి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం మండలంలోని నర్సింగ్రావ్వుపల్లి చౌరస్తా వద్ద హోటల్లో చాయ్ తాగుతూ చర్చిస్తుండగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌలాస్ కోట నిర్వాహకులు, నాయకులు ఉన్నారు. -
క్రైం కార్నర్
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండల శ్రీని వాస్ (46) అ నే వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తన స్వంత పొలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వేల్పూర్(బాల్కొండ): బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చిందేకర్ గంగాధర్ బైకు నుంచి రూ.20 వేలు మాయంపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ అనే వ్యక్తి ఈనెల 20న యూనియన్ బ్యాంకు నుంచి రూ. 20 వేలు డ్రా చేసుకొని బైకు కవర్లో పెట్టుకొని ఇంటికి వెళ్తూ స్థానిక మెడికల్ షాపు వద్ద మందులు కొనేందుకు వెళ్లాడు. మందులు తీసుకొని వచ్చేసరికి బైకులో ఉన్న డబ్బులు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిజాంసాగర్: గొర్రెల మందపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేయ డంతో మూడు గొర్రెలు మృత్యువాత పడగా మరో 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వాగ్మరే హన్మంతు తన గొర్రెలను కొట్టంలో ఉంచగా 20కి పైగా వీధికుక్కలు ఆదివారం వేకువజామున మూకుమ్మడిగా దాడి చేశాయి. గొర్రెల అరుపులు విన్న రైతు హన్మంతు తోటి రైతులతో కుక్కలను తరిమివేశారు. దాడిలో మూడు గొర్రెలు మృతి చెందగా 5 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన గొర్రెలకు పశువైద్య సిబ్బంది చికిత్సలు చేశారు. కుక్కల దాడితో బాధిత రైతుకు రూ. 40 వేల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. -
అన్నాచెల్లెలికి ‘లయన్స్’ చేయూత
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని గుమస్తా కాలనీకి చెందిన కల్యాణ్, హరికలు పుట్టుకతో అంధులు. వారిని అంధుల పాఠశాలలో చేర్పించి మంచి భవిష్యత్తు అందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతినిధులు ప్రయత్నించారు. అందులో భాగంగా శనివారం నిజామాబాద్కు చెందిన స్నేహ సొసైటీ అంధుల పాఠశాల వీరిని దత్తత తీసుకుంది. పిల్లలకు చదువు చెప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ప్రతినిధులు వారికి ఆర్థిక చేయూత అందించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు లింబాద్రి, ప్రదీప్కుమార్, పీవీ నర్సింహం, దామోదర్రెడ్డి, మల్లే శ్, గంప మహేశ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం కామారెడ్డికి విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవీ లత, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.ముక్తిదా, జిల్లా న్యాయాధికారులు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్లు ఘన స్వాగతం పలికారు. వారికి పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదివారం హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వివిధ న్యాయస్థానాల పనితీరు, న్యాయ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాల న్యామూర్తులు, రెవెన్యూ, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : జిల్లా న్యాయ సేవా సంస్థ విజ్ఞప్తి మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ ఎక్స్టెన్షన్ సెంటర్) ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సేవలు అందిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ పి. ముక్తిదా తెలిపారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మొత్తం 181 ఎస్ఐఆర్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు, కక్షిదారులు, సాధారణ ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దోమకొండ: గతంలో పాత సమితి, తాలుకా కేంద్రంగా కొనసాగిన దోమకొండలో సబ్కోర్టు ఏర్పాటు చేయాలని సర్పంచ్ ఐరేని నర్సయ్య హైకోర్టు న్యాయమూర్తులకు శనివారం గడికోటలో వినతిపత్రం ఇచ్చారు. తాలుకా పరిధిలోని మూడు మండలాలకు సంబంధించిన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. హైకోర్టు జడ్జిలు మాధవిదేవి, అలిశెట్టి లక్ష్మినారాయణ, గాడి ప్రవీణ్కుమార్, నిజామాబాద్ జిల్లా జడ్జిలు భరతలక్ష్మి, హరీష, మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్, వార్డు సభ్యులు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్దరాములు, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ తదితరులు ఉన్నారు. -
ఘనంగా తొలి ఏకాదశి
బీర్కూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డి తాడ్వాయిలోని వేంకటేశ్వరాలయంలో ...సాక్షి నెట్వర్క్: తొలి ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహావిష్ణు ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరు కొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో వేదమంత్రోచ్చరణలు, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, హారతులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది. దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆల య నిర్వాహకులు తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణాలు -
కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జనగణన హ్యాండ్బుక్ తయారీపై శిక్షణ కామారెడ్డి క్రైం : జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీలో కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హ్యాండ్బుక్ తయారీ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. సమాచార సేకరణలో నాణ్యత, కచ్చితత్వం, పారదర్శకతను పాటించాలని ఆదేశించారు. జిల్లా సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పరిపాలనా వివరాలకు ప్రామాణిక ఆధార గ్రంథంగా హ్యాండ్బుక్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి సమాచారాన్ని సంబంధిత రికార్డులతో సరిపోల్చి, పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలన్నారు. మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్, హైదరాబాద్కు చెందిన జనగణన అధికారి రమణ, సీపీవో రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి జిల్లాను 2030 నాటికి టీబీ (క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతి మండలంలో టీబీ నిర్మూలన కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకాధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గిరి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, డీఎంహెచ్వో వెంకట్, ప్రోగ్రాం అధికారులు ప్రదీప్, రాజు, రోహిత్ కుమార్, డీఈవో మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్లుపై విజిలెన్స్ కేసు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కస్టం మిల్లింగ్ రై స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చ ర్యలతో మిల్లర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో పౌరసరఫరాల శా ఖకు సంబంధించిన విజిలెన్స్ విభాగం అధికారులు గురువారం కామారెడ్డిలో ఓ రైస్మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.7.50 కోట్ల విలువైన స్టాక్ లేదంటూ మిల్లుపై కేసు నమోదు చేశారు. దీంతో రైస్మిల్ వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తమను ఇబ్బందులకు గురిచేయవద్దంటూ రైస్మిల్లర్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. యువత ‘మై భారత్’ పోర్టల్లో నమోదు చేసుకోవాలి కామారెడ్డి అర్బన్ : యువత ‘మై భారత్’ పో ర్టల్ తమ పేర్లను నమోదు చేసుకోవాలని యువజన, క్రీడల జిల్లా అధికారి ఆర్.వెంక టేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. యువతకు స్వచ్ఛంద సేవా, నాయకత్వ వికాసం, బ్లాక్, జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాలు, నై పుణ్యాభివృద్ధి, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యం, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలను కల్పించేందుకు ‘మై భారత్’ పోర్టల్ను కేంద్ర యువజన, క్రీడల శాఖ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరింత సమాచారం, పోర్టల్ నమోదులో సహాయం కోసం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు గురుకుల విద్యార్థిని కామారెడ్డి టౌన్ : అంతర్జాతీయ స్థా యి సెయిలింగ్ అండ్ యాచింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని అజాంపుర మహా త్మా జ్యోతీబాఫూలే బాలికల గురుకుల పాఠ శాల పదో తరగతి విద్యార్థిని ఎస్.రిశ్విత ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పి మాధవి శనివారం తెలిపారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 7 వర కు జరగనున్న ఇంటర్నేషనల్ యాచింగ్ చాంపియన్షిప్–2026లో పాల్గొని భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పేర్కొన్నా రు. గతంలో జరిగిన జాతీయ స్థాయి పోటీ ల్లో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్, సిల్వర్ పతకాలను సాధించినట్లు తెలిపారు. అంత ర్జాతీయ వేదికపై ప్రతిభ చూపి దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తానని విద్యార్థిని రిశ్విత తెలిపింది. డిగ్రీ ప్రవేశాలకు నేడు చివరి రోజు కామారెడ్డి అర్బన్ : డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ ఆదివారం ముగుస్తున్నందున విద్యార్థుల సౌకర్యం కోసం తమ కళాశాల కార్యాలయం పని చేస్తుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కే విజయ్కుమార్ తెలిపారు. డిగ్రీ ప్రవేశం కోరే విద్యార్థులు ఈ చివరి అవకాశం వినియోగించుకోవాలని ఆయన కోరారు. బీజేపీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోండి ● కలెక్టర్కు మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ కౌన్సిలర్ల వినతి కామారెడ్డి టౌన్ : మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీజేపీ కౌన్సిలర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల ని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ కౌన్సిలర్లు కోరారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం, మౌ లిక వసతుల కల్పన లక్ష్యంగా నిర్వహించే కౌన్సిల్ సమావేశాలను కొందరు బీజేపీ కౌ న్సిలర్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నార ని ఆరోపించారు. సభలో ‘దొంగ ఎజెండా‘ అని ఆరోపిస్తూ తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, మైకులను పగలగొట్టడం, అధికారిక ఎజెండా పత్రాలను చించివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీంతో నిరంతరం జరగాల్సిన అత్యవసర అభివృద్ధి పను లు, నిధుల వినియోగం పూర్తిగా స్తంభించి పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశాల వీడియో రికార్డింగ్లను పరిశీలించి, కౌ న్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షేరు, అంజాద్, వాజీద్, సుల్తానా, లలిత, కళ్లెం సావిత్రి, త హసున్నుసా, అఫ్రీన్ సుల్తానా, మహేశ్, బ బ్లు, జావీద్, గంగాధర్, అఖిల పాల్గొన్నారు. -
ఎట్లయితే అట్ల..
వద్దన్నా.. వరి నాట్లు వరి నారు తీస్తున్న రైతులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతాంగం వరి సాగు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. వరి వద్దని ప్రభు త్వం స్పష్టం చేస్తున్నా రైతులు మాత్రం నాట్లు వేస్తూ నే ఉన్నారు. ఈ నెల 24 నాటికి జిల్లాలో లక్షా 70 వేల ఎకరాల్లో వరి నాట్లు పడినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరో లక్షా 20 వేల ఎకరాలకు సరిపడా నారుమడులు సిద్ధంగా ఉన్న ట్టు పేర్కొంటున్నారు. మరో వారం, పది రోజుల్లో ఇంకో లక్ష ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఒక వైపు వర్షాభావం, మరోవైపు భూగర్భజలమట్టం పడిపోతుండడం, చెరువులు, కుంటలు వెలవెలబోతున్న పరిస్థితుల్లో ఎక్కువ నీటి వాడకం ఉండే వరి సాగు వద్దని ప్రభుత్వం చెబుతోంది. అయితే, నారుమడులు పోసిన రైతు లు ఎట్లయితే అట్లా అన్నట్టు నాట్లేసేస్తున్నారు. దీంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లా లో అత్యధికంగా భిక్కనూరు మండలంలో 16,523 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బాన్సువాడలో 14,955 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. తర్వాతి స్థానంలో బీర్కూర్ ఉండగా, భూగర్భజలాలపైనే ఆధారపడిన లింగంపేట, పిట్లం, నాగిరెడ్డిపేట, గాంధారి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ తదితర మండలాల్లో నాట్లు వేస్తూనే ఉన్నారు. వెనక్కి తగ్గని రైతాంగం జిల్లాలో ఇప్పటికే 1.70 లక్షల ఎకరాలకుపైగా సాగు ప్రత్యామ్నాయ పంటలు పండించాలంటున్న ప్రభుత్వం -
వారసత్వ సంపద కాపాడటం అభినందనీయం
● హైకోర్టు న్యాయమూర్తులు ● దోమకొండ గడికోట సందర్శనదోమకొండ: వారసత్వ సంపదను చెక్కు చెదరకుండా కాపాడటం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తులు టి మాధవిదేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, గాడి ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ గడికోటను జడ్జీలు సందర్శించారు. మొదట కోటలోని మహదేవుని ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గడికోట చరిత్రను జడ్జీలకు ట్రస్టు మేనేజర్ బాబ్జీ వివరించారు. కోటలోని వెంకటపతి భవన్, అద్దాల మేడ, నాట్యశాల, క్లాక్ బంగ్లా తదితర కట్టడాలను జడ్జీలకు చూపించి వాటి ప్రత్యేకతను తెలిపారు. ఇటీవల చారిత్రక వారసత్వ సంపద కింద యునెస్కో అవార్డు వచ్చినట్లు తెలిపారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ గడికోటకు కామినేని వారసులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తూ గతంలో మాదిరిగా తీర్చిదిద్దడంపై అభినందించారు. వారి వెంట నిజామాబాద్ జిల్లా జడ్జి భారతలక్ష్మి, హరీష, కామారెడ్డి జిల్లా జడ్జి ముక్తిద, సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో మధురిమ, ఎంపీవో రవికుమార్, ఎస్ఐ ప్రభాకర్ ఉన్నారు. -
క్రైం కార్నర్
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి ● మరొకరి పరిస్థితి విషమం బోధన్ టౌన్: బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బోధన్ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాకాసిపేటకు చెందిన శ్రావణ్(35), అతని మిత్రుడు రాకేశ్ ఇద్దరు కలిసి బైక్పై పెగడపల్లి బైపాస్ రోడ్డు నుంచి రాకాసిపేట్కు పనినిమిత్తం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్నది. ఈ ఘటనలో శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందగా రాకేశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని స్థానికులు మొదట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాన్సువాడ: బీర్కూర్ మండలంలోని బీర్కూర్ తండాకు చెందిన మూడు శ్రీనివాస్(19) అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాములు శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ తండాకు చెందిన శ్రీనివాస్ కూలీ పని చేస్తుండేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మృతుడి తల్లి మీరాబాయి రెండు వారాల క్రితం ఇంట్లో శ్రీనివాస్ను ఒక్కడినే వదిలేసి ఎడపల్లి మండలం దుబ్బాలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి పని నిమిత్తం వెళ్లింది. ఈ నెల 23న తిరిగి ఇంటికి వచ్చిన మీరాబాయికి కుమారుడు శ్రీనివాస్ స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించింది. చుట్టుపక్కల వారి సహాయంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందాడు. మృతుడి తల్లి మీరాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాములు తెలిపారు. -
అట్టహాసంగా కబడ్డీ పోటీలు ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా శనివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సీబీఎస్ఈ క్లస్టర్–7 బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్ఈ పాఠశాలల నుంచి 160 జట్లు.. సుమారు 1,400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రెటరీ – రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్ కలిసి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్రావు పోటీలను ప్రారంభించారు. విజేత, రన్నరప్ జట్లకు నగదు పారితోషికం అందజేస్తామని రాజేందర్ రావు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొనగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్ ఖోఖో పోటీలు కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాలలో రెండు రోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్7 ఖోఖో పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన పోటీలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. పలు జట్ల క్రీడాకారిణులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరుగగా అండర్ 14, 17 విభాగంలో లీగ్ దశ, ప్రీ క్వార్టర్స్ ముగించుకొని క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. నేడు అండర్ 14, 17 విభాగంలో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. నేటితో పోటీలు ముగియనుండగా సాయంత్రం విజేతలకు ట్రోపీలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న 160 జట్లు కరీంనగర్లో మూడు రోజుల పాటు కొనసాగనున్న సీబీఎస్ఈ క్లస్టర్ –7 బాల, బాలికల కబడ్డీ టోర్నమెంట్ -
తెలంగాణ తిరుమలలో అభివృద్ధి పనులు
● ప్రారంభించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డిబాన్సువాడ : బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద లైనింగ్ వాల్ పను లను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆలయానికి కాలినడకన వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షల తో మెట్ల మార్గం, రూ.50 లక్షలతో లైనింగ్వాల్ ని ర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పోచా రం మాట్లాడుతూ తెలంగాణ తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో మెట్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బాన్సువాడలోని ఇస్లాంపూర కాలనీని ఆయన సందర్శించారు. -
సంక్షిప్తం..
గోడ గడియారాల పంపిణీ భిక్కనూరు: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బహూకరించిన గోడ గడియారాలను సర్పంచ్ బల్యాల రేఖ శనివారం పంపిణీ చేశారు. లబ్ధిదారులు వెంటనే తమ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలన్నారు. ఉపసర్పంచ్ దుంపల మోహన్రెడ్డి,ఈవో మహేష్గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, నేతలు అందె దయాకర్రెడ్డి, ద్యాగల కిరణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ బిల్లుల కోసం ఆందోళన నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ బిల్లులకు చెల్లించాలని కోరుతూ శనివారం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ గేటు వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. బేస్మెంట్, రూప్ లెవల్ వరకు బిల్లులు ఇచ్చారని, శ్లాబ్ బిల్లులకు జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు పరిశీలన కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శనివారం తొలి దశలో పిల్లర్ గుంతల తవ్వకం పనులను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మల్లేష్ మాట్లాడారు. ఉపసర్పంచ్ సిద్ధం స్వామి, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవో బ్రహ్మానంందం పరిశీలించారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు ఎంపిక చేసిన స్థలం పరిశీలించారు. కార్యదర్శి, లబ్ధిదారులు ఉన్నారు. ఎల్లారెడ్డి ఫైర్ ఆఫీసర్ వినోద్కుమార్కు సన్మానం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఫైర్ ఆఫీసర్గా వినోద్కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్లోనే ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఫైర్ ఫైటర్ వినోద్కుమార్కు పదోన్నతి రావడంతో పాటు ఎల్లారెడ్డిలోనే పోస్టింగ్ కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఫైర్ ఆఫీసర్ను మైనారిటీ వెల్ఫేర్ నాయకులు గయాజుద్దీన్, ముకర్రం, ముబీన్లు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎస్సైకి... ఎల్లారెడ్డి ఎస్సై రాజును మైనారిటీ వెల్ఫేర్ నాయకులు శనివారం సన్మానించారు. ఎల్లారెడ్డి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజును మైనారిటీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఎంపీ సురేశ్ షెట్కార్ని కలిసిన నేతలు నిజాంసాగర్(జుక్కల్): జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేశ్ షెట్కార్ను శనివారం హైదరాబాద్లో ఆగ్రో మాజీ చైర్మన్ కాసుల బాల్రాజ్, కాంగ్రెస్నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాలాభివద్ధికి నిధులు ఇవ్వాలని ఎంపీని కాంగ్రెస్ నాయకులు కోరినట్లు చెప్పారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రాజ్ మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఊరూరా జలసిరి కార్యక్రమాలు చేపట్టాలి
● వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకామారెడ్డి క్రైం : ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీవో, జెడ్పీ సీఈవో, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీచార్జ్ ఫిట్ల నిర్మాణాలు విరివిగా చేపట్టి కూలీలకు పని కల్పించాలన్నారు. గ్రామసభలను నిర్వహిస్తూ పనుల ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని గ్రామాలలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. ‘జలసిరి’ పనుల పరిశీలనకు మండల స్థాయిలో గ్రామీణ నీటి సరఫరా ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవోలతో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. వన మహోత్సవంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని దిశా నిర్దేశం చేశారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, డీపీవో మురళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిలిచిన పాఠశాల గదుల నిర్మాణం
● రేకుల షెడ్లు, వరండాల్లో తరగతుల నిర్వహణ ● గాంధారి మండలంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి అవసరం ఉన్న చోట అదనపు గదులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను మంజూరు చేసింది. గాంధారి మండలంలో మన ఊరు–మన బడి పథకంలో భాగంగా 27 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాల, నేరల్ తండా ప్రాథమికోన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణాలు చేపట్టారు. నిధులు విడుదల కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, బూర్గుల్, గుర్జాల్ తండాల్లో గదుల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నేరల్తండాలో బేస్మెంట్కే పరిమిత మైంది. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, నేరల్ తండాలో రేకుల షెడ్డుతో పాటు వరండాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నేరల్తండాలో బేస్మెంట్లో నిలిచిన పాఠశాల భవన నిర్మాణ పనులు గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు గదులు టెండర్ పనుల బిల్లులు రావడం లేదు. కొన్ని పాఠశాలల పనులను నామినేటెడ్ చేశారు. ఈనామినేటెడ్ పనుల బిల్లులు విడతల వారీగా వస్తున్నాయి. మండలంలోని బూర్గుల్, గుర్జాల్ తండా పాఠశాలకు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కొన్ని మాత్రమే వచ్చాయి. – శ్రీహరి, ఎంఈవో, గాంధారి -
ఆధ్యాత్మికం..
శ్రీఅర్ధ చాతుర్మాస్య మహా వ్రతం ప్రారంభం కామారెడ్డి అర్బన్: ఆధ్యాత్మిక సాధనకు చాతుర్మాస్యం ఎంతో అనుకూలమైందని కామారెడ్డి శ్రీకృష్ణ గీతా మందిరం కార్యదర్శి అర్వపల్లి రమేశ్ అన్నారు. ఏకాదశి సందర్భంగా శనివారం తొలిరోజు కాషాయ పతాకాన్ని ఆవిష్కరించి 44వ శ్రీఅర్ధ చాతుర్మాస్య మహా వ్రతం ప్రారంభించారు. ప్రతినిధులు పాత అశోక్, వెంకటేశం, రమేష్, లక్ష్మిపతి, కృష్ణమూర్తి, మహిళా ప్రతినిధులున్నారు. అక్కంపల్లిలో లక్ష పుష్పార్చన నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు అభిలాష్ శర్మ గణపతి పూజ యజ్ఞం నిర్వహించారు. వర్షాల కోసం ఈద్గాల వద్ద ప్రార్థనలు భిక్కనూరు: మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు వర్షాల కోసం శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం మసీద్లో ప్రార్థనలు చేసిన అనంతరం వారందరూ ఈద్గ వద్దకు వెళ్ళి అక్కడ అరగంట పాటు వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. ముస్లింలు పాల్గొన్నారు. వందవారాల హనుమాన్ చాలీసా భిక్కనూరు: మండలంలోని జంగంపల్లిలోని దాసాంజనేయస్వామి ఆలయంలో వంద వా రాల హన్మాన్చాలీసా పఠనం కార్యక్రమం శనివారం జరిగింది. తొలి ఏకాదశితో పాటు వంద వారాల నిరంతర హన్మాన్ చాలీసా కార్యక్రమం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు 108 పర్యాయాలు హన్మాన్చాలీసా పఠించారు. -
ఆర్టీసీలో ‘యూనియన్’ ఎన్నికల సందడి
● త్వరలో రానున్న నోటిఫికేషన్ ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కార్మికులు కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో సుదీర్ఘ విరామం తర్వా త మళ్లీ యూనియన్ ఎన్నికల నగారా మోగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం జాయింట్ లేబర్ కమిషనర్ను ప్రధాన నిర్వహణ అధికారిగా నియమించగా, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక శాఖ అధికారులు బూత్ల ఏర్పాటు, పోలింగ్ వివరాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో నిజామాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఉత్కంఠ, ఉత్సాహం నెలకొన్నాయి. రీజియన్ పరిధిలో 2 వేల మంది కార్మికులు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్–1, నిజామాబాద్–2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ ఆరు డిపోలు ఉన్నాయి. వీటిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, ఏడీసీ, సూపర్వైజర్లు, డీఎం ఆఫీస్ స్టాఫ్, తదితరులు సుమారు మొత్తం 2వేలకు పైగా మంది ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఔట్ సోర్సింగ్ కార్మికులు మరో వెయ్యి మందికి పైగా ఉన్నారు. కానీ రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే ఓటును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరగనుంది. కొందరు నాయకులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తూ, కార్మికులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల విషయమై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ను ‘సాక్షి’ సంప్రదించగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని, ఇంకా అధికారికంగా ఉత్తర్వులు, నోటిఫికేషన్ రావాల్సి ఉందని తెలిపారు. -
అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం
● జిల్లా వెల్ఫేర్ అధికారిణి ప్రసన్న నిజాంసాగర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రా ల్లో త్వరలోనే ‘తొలిముద్ద’ కార్యక్రమం ద్వా రా చిన్నారులకు అల్పాహారం అందిస్తామని జిల్లా వెల్ఫేర్ అధికారిణి ప్రసన్న పేర్కొన్నా రు. మహమ్మద్నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలోని అంగన్వాడీ 1,2 కేంద్రాలతోపాటు వడెర్డ కాలనీ కేంద్రాన్ని ఆమె శనివా రం తనిఖీ చేశారు. చిన్నారుల హాజరుతోపా టు పౌష్టికాహారం పంపిణిని తెలుసుకున్నా రు. జిల్లాలోని మొత్తం 1,195 కేంద్రాలకు 64,580 మంది చిన్నారులు వస్తున్నారని తెలిపారు. ఆమె వెంట అంగన్వాడీ టీచర్లు రమ, పార్వతి ఉన్నారు. -
వీధి కుక్క దాడిలో తల్లి కుమారుడికి గాయాలు
బీబీపేట: మండలంలోని తుజల్పూర్ గ్రామంలో వీధికుక్క భీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన శరత్ తేజ్ అనే నాలుగేళ్ల బాలుడు ఇంటి ఎదుట ఆడుకుంటుండుగా వీధికుక్క దాడిచేసింది. గమనించిన తల్లి మమత వచ్చి కుక్కను తరిమేయగా ఆమైపె కూడా దాడి చేసి గాయపర్చింది. శరత్కు చేతులు, కాళ్లకు గాయాలు కాగా, మమతకు కూడా చేతికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య నిజామాబాద్ అర్బన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు అశోక్సాగర్లో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరో టౌన్ ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సారంగపూర్కు చెందిన లివింగ్ స్టోన్ కూలీ పని చేస్తూ జీవించేవాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో శుక్రవారం అర్ధరాత్రి అశోక్సాగర్లో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మొక్కల సంరక్షణ బాధ్యత అందరిది
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మొక్కల సంరక్షణ అందరి బాధ్యత అని మండలంలోని వజ్జపల్లి తండా సర్పంచ్ సంధ్య సూచించారు. శనివారం వనమహోత్సవంలో భాగంగా తండాలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు.ఉప సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీజ, వార్డు సభ్యులు అశోక్, లక్ష్మణ్, లక్ష్మి, లలిత, పన్ని, నాజీ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి: వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో భరత్కుమార్ అన్నా రు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రతి గ్రామంలో బోర్వెల్ పనులను రీచార్జి చేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాఽ దులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో సవితారెడ్డి, ఏపీవో తిరుపతి, ఏవో నర్సింలు, ఏఈవోలు, జీపి కార్యదర్శులు పాల్గొన్నారు. -
మా ఊరికి బస్సొచ్చిందోచ్!
● పోచారం గ్రామస్తుల్లో ఆనందంపెద్దకొడప్గల్: మండలంలోని పోచారం గ్రామానికి శుక్రవారం ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభమైంది. దశాబ్దాల కల నెరవేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి బస్సు సర్వీస్ లేకపోవడంతో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీవో అభినవ్ చందర్ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు బాన్సువాడ డిపో మేనేజర్తో మాట్లాడారు. దీంతో స్పందించిన డీఎం.. పెద్దకొడప్గల్ నుంచి పోచారం గ్రామానికి బస్సు సర్వీస్ను ఏర్పాటు చేశారు. బస్ సర్వీస్ ప్రారంభంలో సర్పంచ్ బాలాజీ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శామప్ప పటేల్, నాయకులు మహేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
కామారెడ్డి టౌన్/మద్నూర్/బీబీపేట/బాన్సువాడ రూరల్ : నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ శుక్రవారం విజయవంతమైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, బీవీఎం, ఏఐవైఎఫ్ నాయకులు శివప్రసాద్, జబ్బార్, ముదాం ప్రవీణ్, అరుణ్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. మద్నూర్, బీబీపేట, బాన్సువాడలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. -
గోవు లేకుండా ధర్మమే లేదు
● గో సంరక్షణ గొప్పదనాన్ని ప్రకటించేందుకే వేంకటేశ్వరుడి అవతరణ ● ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గోవు లేకుండా సనాతన ధర్మమే లేదని ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సమస్త భూతాలకు పరదేవత గోవు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ‘గోమాత వైభవం’ కార్యక్రమంలో మాట్లాడారు. కలియుగంలో గో సంరక్షణ ప్రాధాన్యతను ప్రకటించేందుకే వేంకటేశ్వరుడు అవతరించాడని చెప్పారు. గో సంరక్షణ చేసే వారికి ఆయన ప్రసన్నుడవుతారని వివరించారు. ధర్మం, దైవం, గోవు ఈ మూడు ఒక్కటేనని చెప్పారు. శైవం, వైష్ణవం, శాక్తేయం, కౌమారం తదితర ఆరాధకులు ఎవరైనా అందరికీ గోమాతే ప్రధానమని చెప్పారు. ధర్మపురి శేషప్ప కవి తన పద్యాల్లో గోవు గొప్పతనాన్ని చెప్పిన అంశాలను వివరించారు. ఆవు నెయ్యి, పాలు, పెరుగు లేకుండా యజ్ఞం, యాగం ఉండదని చెప్పారు. సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులతోపాటు పంచమ వేదమైన భారతంలో గోవు ప్రాముఖ్యతను వివరించారని చెప్పారు. గోవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ కూరగాయల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
రామ నామస్మరణ చేయాలి
బాన్సువాడ : ప్రతి ఒక్కరూ శ్రీరామ నామ స్మర ణ చేయాలని సద్గురు స్వామి సమర్థ మహరాజ్ సూచించారు. గురువారం రాత్రి బాన్సువాడలో ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటి వద్ద స్వామీజీ శ్రీరామ నామ స్మరణ గురు వందనం కార్యక్రమం నిర్వహించా రు. బాన్సువాడ ప్రాంతంపై తనకు అభిమానం ఎక్కువని, భక్తుల కోరిక మేరకు ఇక్కడికి ఐదు సార్లు వచ్చానని పేర్కొన్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి దంపతులు, పోచారం శంభురెడ్డి దంపతులు, పోచారం సురేందర్రెడ్డి, పోచారం భాస్కర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో బరువు తక్కువతో శిశువు జననం
● అత్యవసరంగా నిజామాబాద్కు తరలింపు కామారెడ్డి టౌన్ : అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన హన్మండ్ల సంతోషి శుక్రవారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దీంతో మెరుగైన చికిత్స కోసం రాత్రి ప్రత్యేక నియోనాటల్ 108 అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మార్గమధ్యలో 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ మహేశ్ సమయస్ఫూర్తితో పాపకు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ నిజామాబాద్ తరలించారు. 108 సిబ్బందికి శిశువు తండ్రి నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. -
రెడ్డి ఐక్యవేదిక మండల కార్యవర్గం ఎన్నిక
దోమకొండ: రెడ్డి ఐక్యవేదిక దోమకొండ మండల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి అధ్యక్షతన మండలకేంద్రంలో మండలరెడ్డి సంఘాల సమావేశం నిర్వహించారు. రెడ్డి ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా పన్యాల రామ్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ధర్పల్లి సంజీవరెడ్డి, పుర్ర బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాయిని సంతోష్రెడ్డి, సహాయ కార్యదర్శిగా నాయిని రాజిరెడ్డి, కోశాధికారిగా పందిరి సంజీవరెడ్డి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జూకంటి మోహన్ రెడ్డి, సభ్యులు కొప్పుల గంగారెడ్డి, ప్రతాపరెడ్డి, రావులపల్లి నర్సారెడ్డి, అండెం శంకర్ రెడ్డి, సిద్ధారెడ్డి, పన్యాల నాగరాజు రెడ్డి, మన్నే సాయిరెడి,్డ తదితరులు పాల్గొన్నారు. -
వెల్డింగ్ మిషన్ల చోరీ నిందితుల అరెస్ట్
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై పర్యాటక ప్రాంత కాటేజీ నిర్మాణ పనుల వద్ద నుంచి వెల్డింగ్ మిషన్లను చోరీ చేసిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాకు చెందిన గట్టు రాకేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని లక్ష్మణ్రావు కాటేజీల వద్ద కూలీ పనులు చేశారు. అయితే బెట్టింగ్లు, మద్యం తాగుడుకు బానిసైన ఇద్దరిని సదరు కాంట్రాక్టర్ పనుల నుంచి తొలగించాడు. ఈ మేరకు ఇద్దరు కలిసి ఈ నెల 4న అర్ధరాత్రి కాటేజీ పనుల వద్దకు చేరుకొని సామగ్రిని భద్రపర్చే గదికి వేసిన తాళాన్ని రాయితో పగుల గొట్టారు. అందులో భద్రపర్చిన రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక బాక్స్ను ఎత్తుకు వెళ్లారు. చోరీ విషయమై పనుల వద్ద ఉన్న సూపర్వైజర్ మహేశ్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై శివకుమార్ సాంకేతిక ఆధారంగా విచారణ చేపట్టారు. ఇద్దరు నిందుతులను పట్టుకొని వారి నుంచి మిషన్లు, కారు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మకై ్క పాలన సాగిస్తున్నాయని బీజేపీకి చెందిన కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్రవారం వారు పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పదవులు, పంపకాల కోసమే ఒక్కటయ్యాయన్నారు. పంపకాల ఒప్పందంలో భాగంగానే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను, అలాగే కోఆప్షన్ పదవులను పంచుకున్నారని గుర్తుచేశారు. పంపకాలలో వచ్చిన తేడాల వల్లే గురువారం బల్దియా సాధారణ సమావేశాన్ని వాయిదా వేశారన్నారు. పట్టణాభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ అడ్డంకి కాదని, దొంగ బిల్లులను మంజూరు చేయడానికే అడ్డుగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత కౌన్సిల్ ఎజెండాలో అనేక అంశాలు తీవ్ర అవినీతికి తావిచ్చేలా ఉన్నాయని, గతంలో తిరస్కరించిన బిల్లులనే మళ్లీ ఎజెండాలో చేర్చి ఆమోదించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. గడువు ముగిసినప్పటికీ పట్టణంలో తైబజార్ పేరిట యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, వెంటనే ఆ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ సిబ్బందికి అందించే పరికరాల కొనుగోలు వ్యవహారంలో సుమారు రూ. 8 లక్షల స్కామ్ జరిగిందని ఆరోపించారు. అధికారులు చెల్లించిన అనేక బిల్లుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్నాయని, వీటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలను ఎవరైనా డబ్బులకోసం బెదిరిస్తే భయపడొద్దని, స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వస్తే న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నరేందర్రెడ్డి, శ్రీకాంత్, వంశీకృష్ణ, మధు, అరవింద్, లక్ష్మారెడ్డి, ప్రీతి, రేవతి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవినీతి, దొంగ బిల్లులనే అడ్డుకుంటున్నాం బల్దియాలో అవినీతిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేస్తాం మీడియాతో బీజేపీ కౌన్సిలర్లు -
పేద కుటుంబానికి అండగా షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్ : ఆపదలో ఉన్న పేద కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ అండగా నిలిచారు.జిల్లా కేంద్రానికి చెందిన నూర్ జహాన్ షే క్ గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.మిగితా రూ.1.31 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని యాజమాన్యం కుటుంబీకులకు స్పష్టం చేసింది.ఈ విషయమై బాధిత కు టుంబ సభ్యులు షబ్బీర్ అలీని గురువారం అర్ధరా త్రి ఆశ్రయించారు. స్పందించిన ఆయన వెంటనే ఆస్పత్రి సీఈవో శశికాంత్తో ఫోన్లో మాట్లాడి, మానవతా దృక్పథంతో మిగిలిన బిల్లును మాఫీ చే యాలని విజ్ఞప్తి చేశారు.అలాగే మృతురాలి కుటుంబానికి తన వ్యక్తిగత నిధుల నుంచి రూ. 50వేల ఆ ర్థిక సాయం అందించారు. తన సిబ్బందిని ఆస్ప త్రికి పంపి జాప్యం లేకుండా మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. -
సమస్యల ప్రాంగణం
● శిథిలావస్థకు చేరిన బాన్సువాడ బస్టాండ్ ● ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్న ప్లాట్ఫారాలు బాన్సువాడ రూరల్: గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అనంతరం డివిజన్ కేంద్రంగా రూపాంతరం చెందినా, బాన్సువాడలో బస్టాండ్ మాత్రం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విస్తరించబడలేదు. దీంతో ప్లాట్ఫారాలు సరిపోవడం లేదు. నిత్యం ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసి ఉంటోంది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మాణం.. ప్రస్తుతం బాన్సువాడలో ఉన్న ప్రయాణ ప్రాంగణాన్ని 1988 మే 5న అప్పటి ఎమ్మెల్యే ఎస్.వీ.యల్ నరసింహరావు ప్రారంభించారు. తర్వాత ప్లాట్ఫారాలు విస్తరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. భవనం పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. పైపెచ్చులు ఊడిపడిన పలుచోట్ల అధికారులు మరమ్మతులు చేయించినా, మరోచోట పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంది. టాయిలెట్లు సరిపడా లేవు. నిర్వాహణ లోపంతో దుర్వాసన వెదజల్లుతోంది. తాగునీరు సౌకర్యం అంతంతే ఉంది. వర్షం పడితే బస్టాండ్ ప్రాంగణం చెరువును తలపిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన బస్టాండ్ నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాన్సువాడ బస్టాండ్ శిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే. పై పెచ్చులు ఊడుతుంటే మరమ్మతులు చేయిస్తున్నాం. సమస్యను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. –రవికుమార్, డిపో మేనేజర్, బాన్సువాడ -
‘హోంగార్డు కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుంది’
కామారెడ్డి అర్బన్: అంకితభావంతో సేవలు అందిస్తున్న హోంగార్డు కుటుంబాలకు కష్ట కాలంలో పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గతేడాది మృతి చెందిన హోంగార్డు శ్రీనివాస్ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియాను పోలీసుశాఖ ఆయన భార్య రేఖ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. దీంతో రేఖ శుక్రవారం సాయంత్రం ఎస్పీని కలిసిన కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్పీ రేఖకు ధైర్యం చెప్పారు. కామారెడ్డి టౌన్ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న చేపడుతున్న జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాటాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు, నాయకులు వెంకటి, దశరథ్, రాజనర్సు, నర్సింగరావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
మైనారిటీ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలకు 5, క్రైస్తవులకు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, ఓసీలకు 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 897884 7884 నంబర్కు సంప్రదించవచ్చన్నారు. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన కామారెడ్డి టౌన్ : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, పార్టీ శ్రేణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముజీబొద్దీన్ కామారెడ్డి క్రైం: బీఆర్ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. 50 వసంతాలు పూర్తిచేసుకున్న కేటీఆర్కు పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరా పార్కు ధర్నాకు తరలిన బీఆర్ఎస్ నేతలు బాన్సువాడ రూరల్/లింగంపేట: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనకు బాన్సువాడ నుంచి తరలివెళ్లామన్నారు. విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందన్నారు.అలాగే లింగంపేట నుంచి బీఆర్ఎస్ నాయకులు ఈధర్నాకు తరలి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముదాం సాయిలు మాట్లాడారు. బోర్బావుల వద్ద ఇంకుడు గుంత బాన్సువాడ రూరల్: సింగూరు ప్రాజెక్టులో నీటిసామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండటానికి గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద ఉపాధిహామీ (వీబీజీ ఆర్ఏయంజీ) నిధులతో ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని సోమ్లానాయక్ తండా, సంగోజీపేట్ గ్రామ పంచాయతీ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మార్కవుట్ ఇచ్చారు. జీపీ కార్యాలయ ఆవరణలో, పాఠశాల ఆవరణలో ఎంపీడీవో ఆనంద్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. మండల పంచాయతీ అధికారి మహిబూబ్, టెక్నికల్ అసిస్టెంట్ గోపి, సర్పంచ్ మీరిబాయి చందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలి బాన్సువాడ రూరల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటలను ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షించాలని మండల అభివృద్ధి అధికారి ఆనంద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని సంగోజీపేట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థిపై యువకుల దాడి బీబీపేట: మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై శుక్రవారం నలుగురు యువకులు దాడి చేశారు. వివరాలు ఇలా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి స్థానిక హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి హాస్టల్కు రోడ్డుపై నుంచి వెళ్తున్న క్రమంలో నలుగురు గ్రామానికి చెందిన యువకులు ఏదో పాఠశాలలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థిపై దాడి చేశారు. విద్యార్థి ముఖానికి గాయాలయ్యాయి. హెచ్ఎం వెంటనే అక్కడికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సదరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యునికి చూయించారు. -
గడువు సమీపిస్తోంది సర్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి ఓటర్లు అందుకున్న ఎన్యుమరేషన్ ఫారాలు(ఈఎఫ్) పూరించి బీఎల్వోలకు అందజేయడానికి గడువు ఆరు రోజులే మిగిలి ఉంది. ఈ నెలాఖరులోపు పత్రాలను బీఎల్వోలకు అందజేస్తే వాటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఆలస్యమైతే డిజిటలైజ్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఈ నెలాఖరులోగా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేయాలని సూచిస్తున్నారు. ‘సర్’ ప్రారంభమైన నాటి నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వేగంగా ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో)లు మరింత వేగంగా పనిచేస్తున్నారు. కాస్త వెనకబడిన కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో మూడు నియోజకవ ర్గాలున్నాయి. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ 88 శాతాని కిపైగా పూర్తవ్వగా... కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం 80 శాతమే పూర్తయ్యింది. పట్టణ ఓటర్లు పలువురు సొంత గ్రామాల్లో సర్ ప్రక్రియలో పాల్గొనడంతో లక్ష్యానికి కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నూరు శాతం లక్ష్యం దిశగా.. జిల్లాలో ఓటర్లకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ వంద శాతం లక్ష్యాన్ని సాధించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 85.54 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 14.46 శాతం జరగాల్సి ఉంది. జిల్లాలో 4 వందల బూత్లలో నూరు శాతం డిజిటలైజ్ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇంకో వారం రోజలు సమయం ఉండడంతో మిగిలిపోయిన వాటిపై దృష్టి సారించారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించి, వాటిని వెంటవెంటనే డిజిటలైజ్ చేస్తున్నారు. కాగా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇచ్చే గడువు సమీపిస్తుండడంతో పలువురు ఓటర్లు అయోమయంలో ఉన్నారు. ఓటరు జాబితా ఫారాలు నింపి ఇచ్చిన వారు ఊపిరి పీల్చుకుంటుండగా ఇంత వరకూ ఫారాలు నింపని వారు ఆందోళన చెందుతున్నారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి 25 లింగంపేట 17 నాగిరెడ్డిపేట 11 రాజంపేట 13 రామారెడ్డి 19 సదాశివనగర్ 26 తాడ్వాయి 24 ఎల్లారెడ్డి 33 మొత్తం 168 కామారెడ్డి నియోజకవర్గం భిక్కనూరు 30 బీబీపేట 13 దోమకొండ 12 కామారెడ్డి 21 మాచారెడ్డి 13 పాల్వంచ 20 రాజంపేట 03 రామారెడ్డి 12 మొత్తం 124 జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద 21 డోంగ్లీ 12 జుక్కల్ 14 మద్నూర్ 11 మహ్మద్నగర్ 06 నిజాంసాగర్ 12 పెద్దకొడప్గల్ 13 పిట్లం 19 మొత్తం 108 నియోజకవర్గం పోలింగ్ బూత్లు మొత్తం ఓటర్లు ఈఎఫ్ పత్రాల డిజిటలైజేషన్ శాతం పంపిణీ శాతం జుక్కల్ 255 2,06,343 100 1,82,566 88.49 ఎల్లారెడ్డి 274 2,28,503 100 2,03,318 88.98 కామారెడ్డి 267 2,61,160 100 2,09,482 80.21 మొత్తం 796 6,96,006 100 5,95,366 85.54 ఫారాలు తిరిగివ్వడానికి మిగిలింది ఆరు రోజులే ఇప్పటి వరకు 4 వందల బూత్లలో వంద శాతం పూర్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు -
నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్
కామారెడ్డి క్రైం: నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ముగ్గురిని దేవునిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ మధుసూదన్ కేసు వివరాలను వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ సర్వే నం 210/1లో గంభీరావుపేటకు చెందిన ముక్తావరం వెంకటయ్యకు 200 గజాల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెంకటయ్య దేవునిపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. కేసులో ప్రధాన నిందితుడు రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తనకున్న అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలంపై కన్నేశాడు. స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని విక్రయించేందుకు కుట్ర పన్నాడు. అందులో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా, విక్రయదారుగా యజమాని వెంకటయ్య స్థానంలో తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామానికి చెందిన తన మామ గుండ్రెడ్డి సంగారెడ్డిని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరుపరిచాడు. నకిలీ గుర్తింపు పత్రాలు, ఆధారాలతో అక్రమంగా ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో తేలింది. అసలు విషయాన్ని దాచిపెట్టి అనంతరం అదే ప్లాటును ఇతరులకు విక్రయించగా ఇప్పటివరకు ఆ స్థలం పలువురి పేర్లపై వరుసగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ రెడ్డిని విచారించగా నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. అతనితో పాటు అతని భార్య, మామ లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. భూములు, స్థలాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ లను అభినందించారు. ముగ్గురి నిందితుల అరెస్ట్ -
‘తొలిముద్ద’కు ఏర్పాట్లు
● ఆగస్టు 1 నుంచి అంగన్వాడీల్లో అమలు ● చిన్నారులకు రోజూ అల్పాహారం ● పోషకాహార లోపం నివారణకు ప్రణాళికసదాశివనగర్(ఎల్లారెడ్డి): చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఆగస్టు మొదటి వారం నుంచి జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 81 వేల చిన్నారులు.. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూర్, దోమకొండలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1195 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 0–6 సంవత్సరాల వయసు పిల్లలు 81,260 మంది ఉన్నారు. చిన్నారులతోపాటు గర్భిణులు, బాలింతలకు నిత్యం పౌష్టికాహారం అందజేస్తున్నారు. అయితే, కొందరు చిన్నారులు పౌష్టికాహార లోపంతోపాటు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉండటం లేదు. ఉదయం వేళ ఇంటి వద్ద సరైన ఆహారం తీసుకోకపోవడమేనని అందుకు కారణంగా గుర్తించిన ప్రభుత్వం తొలిముద్ద పథకాన్ని ప్రారంభించింది. పథకంలో భాగంగా చిన్నారులకు అల్పాహారంగా కిచిడీ, ఉప్మా పెట్టనున్నారు. దీంతో అటు పిల్లల్లో పోషక లోపాన్ని నివారించడమే కాకుండా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు పథకం దోహదపడనుంది. -
కలెక్టర్ను కలిసిన డీసీహెచ్ఎస్
కామారెడ్డి టౌన్ : జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)గా, అలాగే బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, ఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.శ్రీనివాస్గౌడ్ శుక్రవారం కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. బాన్సువాడ రూరల్: ఎరువుల లైసెన్సు గడువు ముగిసిన డీలర్లు వెంటనే వాటిని పునరుద్ధరించుకోవాలని ఐఎఫ్ఎఫ్సీవో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ నరేష్ సూచించారు. శుక్రవారం దేశాయిపేట్ రైతువేదికలో బాన్సువాడ డివిజన్లోని ఎరువుల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిజికల్ స్టాక్, ఈ–పాస్లో నమోదైన స్టాక్ మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీ ఎరువుల కోసం సమగ్ర ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించనుందన్నారు. ప్రస్తుతం యూరియాకు మాత్రమే ఉన్న యాప్ త్వరలో అన్ని సబ్సిడీ ఎరువులకు వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ, నస్రుల్లాబాద్ మండల వ్యవసాయాధికారులు ఫయాజుల్లా, భవాని, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. కామారెడ్డి రూరల్: మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ముకుంద్రెడ్డి కోరారు. రాఘవపూర్లో శుక్రవారం 4 వేల ఈతమొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వినీల, కామారెడ్డి ఏపీవో అన్నపూర్ణ, ట్రైనింగ్ ఏఈఎస్ అరుణ్ చంద్ర, ఎకై ్సజ్ సీఐలు సంపత్ కృష్ణ, సుందల్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్, రచన, పంచాయతీ కార్యదర్శి మాధవీలత తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం బస్వాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందన్నారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులు, బెదిరింపులకు పాల్పడినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నాగిరెడ్డిపేట: బ్యాంకులింకేజీ, సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. గోపాల్పేట, లింగంపల్లి కలాన్, మాసాన్పల్లి గ్రామాల్లో శుక్రవారం బకాయి రుణాల వసూళ్ల కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఆమె పాల్గొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించి ఆదర్శ మండలంగా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గౌరవ్ షిండే, ఇన్చార్జి ఏపీఎం దత్తయ్య, సీ్త్రనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల, సీసీలు నజీర్, సాయిలు, సావిత్రి, గ్రామ సంఘాల అధ్యక్షులు పద్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
● యజమానుల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిధిలో చేపడుతున్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. పట్టణంలోని కలెక్టర్ ఛాంబర్లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూ యజమానుల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, నీటిపారుదల, రెవెన్యూ, భూసేకరణ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ సాగుపై అవగాహన కల్పించాలి ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల లభ్యతలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో వెంటనే నిర్ధారించి అప్డేట్ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, డీఏవో మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి రామ్మోహన్. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ క్రాంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్ను కలిసిన జనగణన సంయుక్త సంచాలకులు
కామారెడ్డి క్రైం: జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీకి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్లో శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ జనగణన సంచాలకుల కార్యాలయం నుంచి సంయుక్త సంచాలకులు డి.వి రమణ, రాజేశ్వర్, సిబ్బంది జిల్లాకు విచ్చేశారు. ముందుగా వారు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీలో కచ్చితత్వం, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా సమాచార సేకరణ, డేటా నమోదు ప్రక్రియలను నిర్వహించాలన్నారు. శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి ఆగస్టు 4 వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన అధికారులు, సీపీవో రఘునందన్, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహించొద్దని గ్రామసభలో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ జ్యోతి సంతోష్గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో గ్రామంలో బెల్ట్షాపులతో కలిగే ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బెల్ట్షాపులను నిర్వహించొద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉపసర్పంచ్ బైండ్ల ధశరథం,వార్డు సభ్యులు పాల్గొన్నారు. దోమకొండ: స్థానిక ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ‘మొక్క లు నాటుదాం..మనవి చేద్దాం’ అనే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్య విధాన పరిషత్కు రెగ్యులర్ కమిషనర్ను నియమించకపోవడంతో ఆయా వైద్య శాలల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడింది. ఈ విషయమై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతో వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ‘మొక్కలు నాటుదాం..మనవి చేద్దాం’ అనే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వై ద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్ట ర్ వెంకటేశ్వర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కారును ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు మాక్లూర్: రాంగ్ రూట్లో వచ్చిన ప్యాసింజర్ ఆటో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలైనట్లు మాక్లూర్ ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం భీంగల్కు చెందిన షేక్ అహ్మద్ అతని స్నేహితుడు రఫిక్ కలిసి కారులో నిజామాబాద్ నుంచి మధ్యప్రదేశ్కు వెళ్తుండగా ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న ప్యాసింజర్ ఆటో చిన్నాపూర్ గండి వద్ద రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొన్నది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు గాయాలు కాగా 108లో ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కారు నడుపుతున్న అహ్మద్ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ అర్పాత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కుక్క దాడిలో చిన్నారికి.. వర్ని: మోస్రా మండలం గోవురు గ్రామంలో ఏడాది వయస్సు గల చిన్నారిపై కుక్క శుక్రవారం దాడి చేసి గాయపరిచింది. గ్రామానికి చెందిన సంగెపొల్ల రమేశ్ కుమార్తె ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి.. తాడ్వాయి: మండలంలోని కరడ్పల్లి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు గ్రామస్తులు, పోలీసులు తెలిపారు. కరడ్పల్లికి చెందిన కుర్మరాజు తన బైక్పై జనగాం వైపు వెళ్తుండగా.. గాంధారి మండలం గుజ్జల తండాకు చెందిన సావేరం తన బైక్పై కరడ్పల్లి వైపు వస్తుండగా రెండుబైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు బైక్లపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
యూనిఫాంల తయారీకి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: విద్యార్థులకు యూనిఫాంల తయారీ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం అందించాలన్నారు. ఆగస్టు 30 లోపు రెండు జతలు ఇవ్వాలని సూచించారు. డీఈవో మల్లిఖార్జున్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అనువైన పంటలను సాగు చేయాలి
కమ్మర్పల్లి(మోర్తాడ్): ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రస్తు వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి రైతులకు సూచించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన పంటల వైవిధ్యీకరణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ నీటి తడులు అవసరమయ్యే కంది, సజ్జ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటలు తక్కువ వర్షపాత పరిస్థితుల్లో కూడా మెరుగైన దిగుబడిని అందించే అవకాశం ఉండటంతోపాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, వ్యవసాయ శాఖ సూచనలను అనుసరించి పంటలను ఎంపిక చేసుకోవాలని, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను పాటించాలని కోరారు. జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్, ఏవో హరీశ్, మండల హర్టికల్చర్ ఆఫీసర్ రాజాగౌడ్, ఏఈవోలు శ్రీలత, లకపతి, మహేశ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాడెడ్లను వదిలేసి..
యాంత్రీకరణకు జై కొట్టి.. ఆర్మూర్:వర్షాకాలం వచ్చిందంటే గతంలో జిల్లా లోని పొలాల్లో ఎడ్లు, నాగళ్లతో పల్లెలు సందడి గా మారేవి. ఆ పచ్చదనంలో ఎడ్లతోపాటు రైతు కష్టం కూడా కనిపించేది. ఇప్పుడు ఆ దృశ్యం క నుమరుగవుతోంది. సంప్రదాయ వ్యవసాయా న్ని పక్కన బెట్టి యాంత్రీకరణవైపు రైతులు మొ గ్గు చూపుతుండటంతో ఎడ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చి చేరాయి. వ్యవసాయ విధానంలో మార్పు రావడం మంచిదే. కానీ సంప్రదాయం, మాన వ, జంతు అనుబంధం కూడా ఎక్కడో ఒకచోట బతికి ఉండాలి. లేకపోతే వచ్చే తరానికి ‘ఎడ్లతో దున్నడం‘ అంటే పుస్తకంలో ఫొటోలా మిగిలిపోతుంది. నాటి కాలం వృద్ధ రైతులు పశువులతో రైతులకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటే నేటి తరం యువ రైతులు మాత్రం యాంత్రీకరణకే పెద్దపీటవేస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ కేజ్వీల్స్తో వేగంగా పొలం దున్నుతున్న రైతు ఆర్మూర్ శివారులో ఎడ్ల నాగలితో పొలం దున్నుతున్న రైతు (ఫైల్) -
బాధితులకు భరోసా కల్పించాలి
ఎస్పీ రాజేశ్ చంద్ర తాడ్వాయి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ వారి సమస్యలను ఓర్పుగా విని చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. ఎస్పీ గురువారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అధికారులకు ఇచ్చిన సూచనలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్, కోర్టు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిపై ఎస్హెచ్వోను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అలాగే పీఎస్లో కేసుల నమోదు విధానం, ఆన్లైన్ సీసీటీఎన్ఎస్ వ్యవస్థ పనితీరు, ఫిర్యాదులను స్వీకరించే విధానం, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. ప్రతి పిటిషనన్ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలను గ్రామాల్లో నిర్వహించాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, సస్పెక్ట్ వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహక కమిటీలతో సమన్వయం, తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్హెచ్వో నరేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రసాభాసగా బల్దియా సమావేశం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం తీవ్ర గందరగోళం, నిరసనల నడుమ ఎ జెండా అంశాలపై చర్చలు జరగకుండానే వాయిదా పడింది. చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన సా ధారణ సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 35 అంశాలతో సిద్ధం చేసిన ఎజెండాపై చర్చను ప్రారంభించగానే బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఎజెండా అంశాలలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంట్రాక్టర్ల బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తూ ప్రతిపక్ష తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శానిటైజేషన్, చెత్త ట్రాక్టర్ల కొనుగోలు, రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు, నిర్వహణ అంశాలపై ముందుగా చర్చించాలని పట్టుబట్టారు. పోడియం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కాసేపు అధికార పక్షం కాంగ్రెస్, మిత్రపక్షం బీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు గంటలపాటు ఎజెండా అంశాలపై కాకుండా సమావేశం రసాభాసగా సాగింది. ఎజెండా అంశాలపై చర్చిద్దామని, పట్టణాభివృద్ధికి సభ్యులు సహకరించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. భోజన విరామం అనంతరం సమావేశం ప్రారంభంతో బీజేపీ కౌన్సిలర్లు మళ్లీ నిరసన తెలపడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతునాయక్, టీపీవో వినిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వదిలేసి బిల్లులకే ప్రాధాన్యం ఇచ్చారన్న బీజేపీ కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసన వాయిదా వేసినట్లు ప్రకటించిన చైర్పర్సన్ ఉమారాణి -
ప్రభుత్వ వైద్యుడి సంతకం ఫోర్జరీ
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో విధులు నిర్వర్తించే ఆర్ఎంవో (వైద్యుడు) పేరిట నకిలీ స్టాంప్, సంతకం ఫోర్జరీతో సంక్షేమ పథకాలు, ఇతర సర్టిఫికెట్లు పొందేందుకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వైద్యుడు ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పట్టణ సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. ఈ నెల 22న మధ్యాహ్నం ఆస్పత్రిలోని కొన్ని ధ్రువపత్రాలను ఆర్ఎంవో డాక్టర్ సంతోష్ పరిశీలించగా, వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని గుర్తించారు. తన అనుమతి లేకుండా అధికారిక సీల్ను దుర్వినియోగం చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రయోజనాల కోసం నకిలీ పత్రాలు, సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు, ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంతకం ఫోర్జరీ వ్యవహారంలో ఆస్పత్రి సిబ్బంది సహకారం ఏమై నా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ స్టాంప్తో సంక్షేమ పథకాలు, ఇతర సర్టిఫికెట్ల కోసం వినియోగం డాక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు విచారణ చేస్తున్న పట్టణ పోలీసులు అదుపులో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు! -
ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపురసుందరి ఆలయంలో ఈనెల 15న ప్రారంభమైన వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు లాటరీ ద్వారా 11 మందికి అమ్మవారి చీరలు, ఇతర భక్తులకు కనుములను అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సిద్ధారెడ్డి, దామోదర్, శ్రీనివాస్, అర్చకులు ప్రదీప్, వినోద్కుమార్ శర్మ, రామారావు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: సింగూరు ప్రాజెక్టులో నీటిసామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండటానికి జీపీ బోరు బావుల వద్ద ఉపాధి హామీ నిధులతో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నట్లు ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. గురువారం మండలంలోని సోమేశ్వర్, పోచారం జీపీ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మార్కవుట్ ఇచ్చామన్నారు. మండల పంచాయతీ అధికారి మహిబూబ్, టెక్నికల్ అసిస్టెంట్ గోపి, జీపీ కార్యదర్శులు రవి, యోగేశ్వర్, క్షేత్రసహాయకుడు బీమరాము తదితరులు ఉన్నారు. -
అడియాసేనా?
యాసంగిలో బోనస్..క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామన్న సర్కారు ప్రకటనతో చాలామంది రైతులు సన్నరకం వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వానాకాలంలో ప్రోత్సాహకాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. యాసంగికి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. రెండేళ్లుగా బోనస్ రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. – కామారెడ్డి క్రైంజిల్లాలో గతంలో రైతులు సన్నరకాల సాగుకు ఆసక్తి చూపేవారు కాదు. తక్కువ దిగుబడి రావడం, చీడపీడల బాధ ఎక్కువగా ఉండడంతో దొడ్డు రకాలనే పండించేవారు. 80 శాతానికి పైగా దొడ్డు రకాలే పండేవి. అయితే ప్రభుత్వం బోనస్ ఇచ్చామని ప్రకటించడంతో రైతులు సన్నరకాలు సాగు చేస్తున్నారు. గత యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2,52,785 ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇందులో 1,50,470 ఎకరాల్లో దొడ్డు రకాలు, 1,00,315 ఎకరాల్లో సన్న రకాలు ఉన్నాయి. గత యాసంగిలో రూ. 90 కోట్లు.. యాసంగిలో ప్రభుత్వం 400 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించింది. మొత్తం 74,894 మంది రైతుల నుంచి 4,66,38.68 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 45,835 మంది రైతుల నుంచి 2,85,450.96 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 29,059 మంది రైతుల నుంచి 1,80,937.72 మెట్రిక్ టన్నులు సన్న రకం వడ్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం విలువ రూ.1,114.20 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాలలో జమ చేసింది. సన్నరకాలు పండించిన రైతులకు బోనస్ కింద రూ. 90.47 కోట్ల వరకు రావాలి. 2024–25 యాసంగి సీజన్లోనూ సర్కారు బోనస్ చెల్లించలేదు. ఆ సీజన్కు సంబంధించి రైతులకు రూ. 89 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఖరీఫ్లో సక్రమంగా బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. యాసంగికి వచ్చేసరికి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తారన్న ఆశతోనే సన్నాలు సాగు చేశామని పేర్కొంటున్నారు. రెండేళ్లకు సంబంధించిన నిధులను త్వరగా విడుదలచేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. ప్రోత్సాహకం ఆశతోనే సన్నాల సాగుపై ఆసక్తి రెండేళ్లుగా మొండిచేయి చూపిస్తున్న సర్కారు నిరాశ చెందుతున్న అన్నదాతలు -
టీచర్లు సమయపాలన పాటించాలి
మోపాల్: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, బడుల్లో సెల్ఫోన్లను వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా ఎస్జీటీలకు కొనసాగుతున్న శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టాలని, వారి హాజరుశాతం పెరిగేలా చూడాలని తెలిపారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందేలా చూడాల్సిన బాధ్యత హెచ్ఎంలదేనని స్పష్టంచేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఎంఈవో సాయిలు, రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ వన్టైం చాన్స్ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ వన్టైం చాన్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 60 మంది విద్యార్థులకు గానూ 57 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 94 మంది విద్యార్థులకు గానూ 91 మంది హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 66 మంది విద్యార్థులకు గానూ 4గురు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 14 మంది విద్యార్థులకు గానూ ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ) 4, 5వ సెమిస్టర్లు, ఏపీఈ, ఐపీసీహెచ్ 7, 9వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు ఆరుగురు విద్యార్థులకు గానూ ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 24 మంది విద్యార్థులకు గానూ ఒకరు గైర్హాజరైనట్లు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బీపెడ్ 1, 2, 3, 4వ సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలకు గురువారం 16 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 52 మంది విద్యార్థులకు గానూ 36 మంది హాజరు కాగా 16 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఇద్దరు విద్యార్థులకు గానూ ఇద్దరు హాజరైనట్లు ఆయన తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఈడీ, బీపెడ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరుగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి సంఘాలు తలపెట్టిన తెలంగాణ విద్యాసంస్థల బంద్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు వివరించారు. శనివారం నుంచి జరగాల్సిన తదుపరి పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. వాయిదా పడిన పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. క్యాంపస్ కబుర్లు -
అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ నైజం
● మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణిపట్టణాభివృద్ధిని అడ్డుకోవడం, మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో దౌర్జన్యానికి దిగడమే ధ్యేయంగా బీజేపీ కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి విమర్శించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధి కోసం 35 అంశాలతో సమన్యాయంగా ఎజెండా రూపొందించినా వాటిపై చర్చించకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. సమావేశం ప్రారంభం కాకముందే బీజేపీ కౌన్సిలర్లు ఎజెండా ప్రతులను చించివేసి, మైకులు విసిరేస్తూ హంగామా చేశారన్నారు. మహిళా చైర్పర్సన్ అని చూడకుండా పోడియంపైకి వచ్చి దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతి సమావేశాన్ని కావాలనే రసాభాస చేస్తూ పట్టణాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా బీజేపీ సభ్యులు తమ తీరును మార్చుకోవాలని, పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు షేరు, మహేశ్, మోతీలాల్, బబ్లూ, జావేద్, తహసీనున్నిసా, గంగాధర్, వనిత, లలిత, సావిత్రి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని హైవే వద్ద గల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందినట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి తండాకు చెందిన శివకుమార్(32) అనే వ్యక్తి బైక్పై తన వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అతడు గురువారం రాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా టోల్ప్లాజా సమీపంలో బైక్ అదుపు తప్పడంతో కిందపడి మృతి చెందాడు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది వచ్చి సీపీఆర్ చేసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
‘నీట్’గా అశాంతిని సృష్టిస్తున్నారు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ● జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనంకామారెడ్డి టౌన్ : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆందోళనల ముసుగులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశంలో అశాంతి నెలకొల్పాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పార్లమెంట్, ప్రధానమంత్రి నివాస ముట్టడికి యత్నించడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో అసలు నీట్ విద్యార్థులకంటే అల్లరిమూకలు, బీజేపీ వ్యతిరేకులే ఉన్నారన్నారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామన్న ఆలోచనను రాహుల్ గాంధీ విరమించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు నరేందర్రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, వంశి, మధు, భరత్, సుజిత, ప్రీతి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ను బైండోవర్ చేయడం సరికాదు
తాడ్వాయి: గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్న సర్పంచ్ మైలాం రవీందర్రెడ్డిని బైండోవర్ చేయడం ఎంతవరకు సమంజసమని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జంగం మంగారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలంలోని కన్కల్ సర్పంచ్ మైలాం రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ మహేశ్ను ఎలాంటి విచారణ చేపట్టకుండా తహసీల్దార్ శ్వేత, ఎస్సై నరేశ్ కలిసి బైండోవర్ చేయడం సరైంది కాదన్నారు. మండల సర్పంచులు, నాయకులు పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలకు తరలివచ్చారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్లను పోలీసులు బైండోవర్ చేయడం వల్ల సర్పంచుల హక్కులను కాలరాయడేమని ఆరోపించారు. బైండోవర్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో భరత్కుమార్, ఎంపీవో సవితారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్రావులకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు రవీందర్రెడ్డి, తాజొద్దీన్, చంద్రారెడ్డి, నర్సింలు, పోచయ్య, నాయకులు కపిల్రెడ్డి, రాజిరెడ్డి, సంజీవ్, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో ఫిర్యాదు.. ఇక ఫోన్లోనే..
ఎల్లారెడ్డి: చిన్నారులపై లైంగిక వేధింపులు లేదా దాడులు జరిగితే బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు ఇకపై నేరుగా ఫోన్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పోక్సో ఈ బాక్స్ అనే ప్రత్యేక యూప్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) ఆధ్వర్యంలో పని చేస్తుంది. బాధిత కుటుంబ గోప్యత కాపాడుతూ.. ఈ మధ్య కాలంలో బాలలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు తరు చూ వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా, కఠినమైన శిక్షలు విధిస్తున్నా బాధితుల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు ఏమి చేయలేకపోతున్నారు. బాధిత కుటుంబాలకు నిందితుల నుంచి బెదిరింపులు, లేదా కేసు పెడితే ఎక్కడ తమ పరువు పోతుందనే భావనతో చాలామంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లకుండానే, వారికి రక్షణ కల్పిస్తూ,వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ ‘పోక్సో ఈ బాక్స్’ను ప్రభుత్వం తీసుకువచ్చింది. బాధితులు ఫిర్యాదు చేసిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతారు. యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను జాతీయ స్థాయి అధికారులు నేరుగా పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు ఇలా.. ● గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోక్సో ఈ బాక్స్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ● ఎన్సీపీసీఆర్ అధికారిక వెబ్సైట్లోని పోక్సో ఈ బాక్స్ లింక్ను ఓపెన్ చేయాలి ● ఇందులో పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా అక్కడ కొన్ని యానిమేషన్ చిత్రాలు ఉంటాయి. బాధితులు జరిగిన వేధింపుల రకాన్ని (ఉదా: స్పర్శ, మాటలు, ఆన్లైన్ వేధింపులు మొదలైనవి) ఆ చిత్రాల ద్వారా ఎంచుకోవచ్చు ● బాధితుల పేరు తెలిపే అవసరం లేదు. వయస్సు, నిందితుడి వివరాలు, సంఘటన జరిగిన ప్రాంతం నమోదు చేయాలి. ● ఫిర్యాదు నిర్ధారించడానికి లేదా తదుపరి కేసు అప్డేట్స్ కోసం మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది. ● వివరాలన్నీ నమోదు చేశాక సబ్మిట్ బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు నేరుగా ఎన్సీపీసీఆర్ గ్రూప్నకు చేరుతుంది. ● ఫిర్యాదు నమోదైన రోజు నుంచి 1 సంవత్సరంలోగా కోర్టు విచారణ పూర్తి అవుతుంది. ● బాలలపై జరిగిన వేధింపుల తీవ్రతను బట్టి నేరస్తులకు కనీసం 7 సంవత్సరాల నుంచి గరిష్టంగా ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. సమాచారంపోక్సో ఈ బాక్స్ యాప్నకు వచ్చే ఫిర్యాదుల వివరాలను ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. పోలీస్ స్టేషన్కు రాకుండానే ఇంటి నుంచే బాలలపై వేధింపులు, అఘాయిత్యాలపై ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ యాప్ వివరాలు నేరుగా పైఅధికారులకు తెలియజేయబడతాయి. కాబట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగి నిందితులకు శిక్షలు పడతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేరం గురించి తెలిసినా పోలీసులకు చెప్పక పోయినా కూడా నేరంగానే పరిగణింప బడుతుంది. –రాజిరెడ్డి, సీఐ, ఎల్లారెడ్డి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో పోక్సో ఈ–బాక్స్ యాప్ బాలలపై లైంగిక దాడులు జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఫిర్యాదు నమోదు -
ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను కోటగిరి పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురుగా వచ్చిన మూడు ఇసుక ట్రాక్టర్లను ఆపి పరిశీలించారు. ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని కోటగిరి పోలీస్స్టేషన్న్కు తరలించారు. మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి మూడు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా.. గ్రామస్తులు మాత్రం అక్రమ ఇసుక రవాణా చాలా కాలంగా కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. -
జై జగన్నాథ..
● జిల్లాకేంద్రంలో ఘనంగా రథయాత్ర ● భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తజనంకామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలో శ్రీజగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లిలో పట్టణ సీఐ నరహరి, దేవునిపల్లి ఎస్సై రంజిత్.. రథం ముందు చీపురుతో శుభ్రం చేసి రథాన్ని కదిలించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప కల్యాణ మండపం వరకు రథయాత్ర కొనసాగింది. భక్తులు జై జగన్నాథ నినాదాలతో రథాన్ని లాగుతు భక్తితో పరవశించిపోయారు. అనంతరం అయ్యప్ప కల్యాణ మండపంలో శ్రీజగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవిలకు 56 రకాల వంటకాలతో నైవేధ్యం సమర్పించారు. జగన్నాథ సంకీర్తనలు, భజనలు, నృత్యాలు చేశారు. ఇస్కాన్ ప్రతినిధులు సిద్దబలరాం ప్రభు, వెంకటదాస్ ప్రభు, అరవింద్ ప్రభు, పంతులు శ్రీను, కౌన్సిలర్ భోజన్నగారి వినోద, నాయకులు పురంశెట్టి శ్రీనివాస్, ఎస్.రాజామౌళి, ఎం.జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఉప్పల్వాయిలో ఒకరి ఆత్మహత్య రామారెడ్డి(ఎల్లారెడ్డి): మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన తాటికొండ గణేష్ (37) వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య అపర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ గురువారం ఉదయం తన తల్లి బుచ్చవ్వ, భార్య అపర్ణలతో ఉన్న భూమి అమ్మి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. వారు డబ్బులు లేవనడంతో గణేష్ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. ఈక్రమంలో అతడు ఇంట్లోకి వెళ్లి లోపల గడియపెట్టుకొని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెర్కిట్లో మరొకరు.. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినటున్ల ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపారు. వివరాలు ఇలా.. పెర్కిట్కు చెందిన పెద్దకాపు రవీంధర్రెడ్డి(45) అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్లో చికిత్స పొందాడు. గత శుక్రవారం ఆస్పతి నుంచి ఇంటికి రాగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిజాంసాగర్ (జుక్కల్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 18న ఎదురుగా వస్తున్న బైక్ను పెద్దగొల్ల సందీప్ (22) అనే యువకుడు పల్సర్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో సందీప్కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం మొదట అతడిని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్య కోసం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. గురువారం పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో బైక్పై నుంచి పడి గాయపడిన తండ్రి, కూతురు నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘ఎమ్మార్పీఎస్ ఉద్యమ బాధ్యత తీరిపోలేదు’
కామారెడ్డి అర్బన్: ఎస్సీ వర్గీకరణతో ఎమ్మార్పీఎస్ ఉద్యమ బాధ్యత తీరిపోలేదని, సమాజంలో అణగారిన ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమాలు చేయాల్సి ఉందని జిల్లా ఇన్చార్జి మంథని సామ్యెల్ అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా సామ్యెల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నాయకులు పద్మారావు, వెంకటరాములు, గంగారాం, శ్రీకాంత్, లక్ష్మి, లావణ్య, కాశీరాం, అరుణ్, పెద్ద కాశీరాం తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. కళాశాలలో ఉన్న ట్రేడ్స్, విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ రోపానాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి కళాశాలకు సరిపడా సిబ్బంది పోస్టులు సాంక్షన్ చేసేలా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని చైర్మన్ అన్నారు. సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, కౌన్సిలర్లు తిరుపతి, గఫార్, డీసీసీ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశం, రఫీక్, రాములు తదితరులు ఉన్నారు. కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అబ్బగోని మహేశ్గౌడ్, ఉపాధ్యక్షులుగా అడప శ్యామ్ల, ఎం సీతారామ్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల శ్యామ్ కుమార్, కార్యదర్శిగా చిందం మల్లేశ్, కోశాధికారిగా రాసమొల్ల రవి ఎన్నికయ్యారు. పిట్లం: మండల కేంద్రంలోని మైనారిటీ ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అవైజ్ బేగ్, మజీద్ కమిటీ సదర్ యదుల్, బసీద్, నవీన్, జుక్కల్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇమ్రోజ్, ఇమ్రాన్, జియా, అద్నాన్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం
లింగంపేట: అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన లింగంపల్లి పాముల వాగు హైలెవల్ వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 4 కోట్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం మోతె శివారులో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్, నాయకుడు నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్ రావు -
స్కూల్ యూనిఫాం కటింగ్ పరిశీలన
దోమకొండ: మండల పరిషత్ కార్యాలయంలో రెసిడెన్షియల్ స్కూల్ యూనిఫాం క్లాత్ కటింగ్ను గురువారం డీఆర్డీవో దామోదర్ పరిశీలించారు. యూనిఫాం స్టిచ్చింగ్ విషయంలో టైలర్లకు సూచనలు ఇచ్చారు. త్వరగా కుట్టి అందించాలని సూచించారు. అనంతరం మహిళా సంఘం సభ్యులు తయారు చేస్తున్న ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ను పరిశీలించి వారిని అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో మధురిమ, డీపీఎం సాయిలు, ఏపీఎం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట: సంఘాలలో లేని మహిళలను నెలాఖరులోగా సంఘాలలో చేర్పించాలని అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి సూచించారు. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో గురువారం వీవోఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మండలంలో సీ్త్రనిధి రుణాల రికవరీ కోసం ఐబీ డీపీఎం శ్రీనివాసరావును ప్రత్యేకాధికారిగా నియమించామన్నారు. మండలంలో సీ్త్రనిధి రుణాల రికవరీ నెలక్రితం 11 శాతం ఉండేదని, ఇప్పుడు 23 శాతానికి చేరుకుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మహిళలు, వృద్ధులు, వికలాంగులకు సంబంధించి మొత్తం 17,842 సంఘాలున్నాయని, వాటిలో 1,81,886 మంది సభ్యులున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సీ్త్రనిధి రీజనల్ మేనేజర్ కిరణ్కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఇన్చార్జి ఏపీఎం దత్తయ్య, సీసీలు నజీర్, సాయిలు, సావిత్రి, అకౌంటెంట్ రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట/లింగంపేట: ప్రభుత్వాస్పత్రుల్లో అందించే వైద్యసేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో వెంకట్ సూచించారు. నాగిరెడ్డిపేట, లింగంపేట పీహెచ్సీలలో గురువారం ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గర్భిణుల ప్రసవాలకు సంబంధించి హైరిస్క్ కేసులపై ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. గర్భిణుల రిజిస్ట్రేషన్, చెకప్లను సకాలంలో చేయాలని సూచించారు. అర్హులైనవారికి హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. లక్ష్యాలను వంద శాతం సాధించాలని సూచించారు. కార్యక్రమాలలో ఎల్లారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్వో నర్సింగ్ చౌహాన్, ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటస్వామి, నాగిరెడ్డిపేట పీహెచ్సీ డాక్టర్ సృజన్కుమార్, లింగంపేట మండల వైద్యాధికారి హిమబిందు, సిబ్బంది సిద్దిరామేశ్వర్, సంతోష్, విజయ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. దోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఈకేవైసీని కచ్చితంగా చేయించాలని తహసీల్దార్ స్వప్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో మండలానికి చెందిన రేషన్డీలర్లతో సమావేశం నిర్వహంచి మాట్లాడారు. ఈనెల 24 నుంచి 31 వ తేదీ వరకు ఈకేవైసీ చేయించాలని కోరారు. ప్రతి ఒక్క రేషన్ డీలర్ ప్రతి రేషన్కార్డు లబ్ధిదారుల పేర్లు ఇంతకు ముందు ఈ కేవైసీ చేయించారని వారిలో కొందరివి కాలేదని వారిని గుర్తించి పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ భిక్షపతి, ఆర్ఐ వెంకటలక్ష్మి, రేషన్ డీలర్లు తదితరులు ఉన్నారు. -
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి ● ఘనంగా సౌత్ క్యాంపస్ వార్షికోత్సవంభిక్కనూరు: విద్యార్థులు నాయకత్వ లక్షణాలను, క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి సూచించారు. బుధవారం భిక్కనూరు మండలంలోని తెయూ సౌత్క్యాంపస్లో తరంగ్ –2026 వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎదురయ్యే ఓటములకు కుంగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. సౌత్క్యాంపస్లోని వివిధ విభాగాలు సాధించిన ప్రగతిని గురించి ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ వివరించారు. క్రీడలతో పాటు సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఏపీఆర్వో సరిత, అధ్యాపకులు ప్రతిజ్ఞ, యాలాద్రి, సునీత, అంజయ్య, లలిత, హరిత, నాగరాజు, నారాయణ, కవితతోరన్, వైశాలి, శ్రీమాత, నిరంజన్, ఇంద్రకరణ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
జొన్నల పైసలు వచ్చేదెప్పుడో?
కామారెడ్డి క్రైం : యాసంగిలో జొన్నలు పండించిన రైతులకు ఖరీఫ్ పెట్టుబడులకు ఇబ్బందులు తప్పడం లేదు. జొన్నలను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించిన రైతుల ఖాతాల్లో నెలలు గడుస్తున్నా డబ్బులు జమ కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన జొన్నలకు రూ.225 కోట్లు రావాల్సి ఉంది. అతి తక్కువ మంది రైతులకు మాత్రమే ఇప్పటివరకు డబ్బులు జమ అయ్యాయి. 64 వేల టన్నులు.. పక్షుల తాకిడి, ధర తక్కువగా ఉండటం లాంటి కారణాలతో గతంలో జిల్లాలో జొన్నసాగు తక్కువగా ఉండేది. 20 వేల ఎకరాలకు మించి జొన్న పంట సాగులోకి వచ్చేది కాదు. అలాంటిది గడిచిన మూడేళ్లుగా జొన్న సాగు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అధిక దిగుబడులను వచ్చే వంగడాలు, మంచి ధర, పక్షల తాకిడి తగ్గిపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లాంటి అనుకూల పరిస్థితులు కలగడంతో జొన్నసాగుపై రైతులు దృష్టిసారించారు. 2024–25 యాసంగిలో 71,104 ఎకరాల్లో జొన్న సాగులోకి రాగా, గతేడాది యాసంగిలో 87,943 ఎకరాల్లో రైతులు జొన్నలు పండించారు. క్వింటాలుకు రూ.3,699 మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం జిల్లాలో మొత్తం 53 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత మే నెల నుంచి జూన్ వరకు కొనుగోళ్లు నిర్వహించగా, మొత్తం 64,004 టన్నుల జొన్నలను సేకరించారు. వాటి విలువ రూ.240 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.15 కోట్ల వరకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మిగిలిన రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. సకాలంలో డబ్బులు జమకాక ఖరీఫ్ సాగుకోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు.జొన్నలు విక్రయించిన రైతులందరి వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. కొందరికి డబ్బులు పడ్డాయి. ఇంకా చాలామంది రైతులకు రావాల్సి ఉంది. నిధుల విడుదల షెడ్యూల్ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ప్రకారం ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఆందోళన చెందొద్దు. – క్రాంతి, డీఎం, మార్క్ఫెడ్, కామారెడ్డినేను జొన్నలు విక్రయించి రెండు నెలలు గడిచింది. దాదాపు లక్షన్నర వరకు డబ్బులు రావాల్సి ఉంది. ఇంకా జమ కాలేదు. ఖరీఫ్ పెట్టుబడులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. – విఠల్, రైతు, పెద్దకొడప్గల్ బకాయిలు రూ.225 కోట్లు నెలలు గడుస్తున్నా ఖాతాల్లో జమకాని డబ్బులు నిధుల విడుదల నిలిపివేసిన సర్కారు పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న రైతులు -
సెల్ టవర్ కేబుల్ చోరీ కేసులో నలుగురి అరెస్ట్
కామారెడ్డి టౌన్: సెల్ టవర్ కేబుల్ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు వివరాలను కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 18న రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామ సమీపంలోని స్వయంభూశ్వరి ఆలయం వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్లో గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను దొంగిలించారు. బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం అధికారి నల్లవెల్లి శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రామారెడ్డిలో జగదాంబ తండా జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఎస్ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో రామారెడ్డి మండలం ఇసాయిపేట్కు చెందిన పుప్పాల కిరణ్ కుమార్తో పాటు మెదక్ జిల్లాకు చెందిన కల్లెం సతీశ్, పార్టం గాబ్రియల్, గంగారాం ఉన్నారు. నిందితుల నుంచి చోరీకి గురైన కేబుల్ వైర్ తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలు, విధ్వంసక చర్యలు, గ్రామాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీఐ శ్రీధర్గౌడ్, రామారెడ్డి ఎస్సై మురళీ తదితరులు ఉన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
● ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి ● సీనియర్ సివిల్ జడ్జి నాగరాణిభిక్కనూరు: సామాజిక సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి సూచించారు. బుధవారం భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, విధ్యార్థుల భద్రత, చట్టపరమైన హక్కులు, వారిపై జరుగుతున్న మోసాలు, వేధింపుల నివారణ అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు లేదా చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందిస్తుందని, అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం శ్రీమతి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీసభ్యులు సంతోష్రెడ్డి, శ్రవణ్, నరేష్ పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలి
రాజంపేట (భిక్కనూరు)/బీబీపేట: ప్రతి ఒక్కరూ ఏడాదికి రెండు మొక్కలను నాటాలని రాజంపేట ఎంపీడీవో సూర్యాజీ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గోని మొక్కలను నాటారు. బీబీపేట మండలం ఉప్పర్పల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ పుట్ట మమత మల్లేష్లతో ఎంపీడీవో నరేశ్ కలిసి మొక్కలు నాటారు. జీపీ సిబ్బంది ఉన్నారు. ఈత మొక్కలు నాటి సంరక్షించాలి నస్రుల్లాబాద్/మాచారెడ్డి : ఈత మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత గీత కార్మికులు తీసుకోవాలని బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ దిలీప్ అన్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో బుధవారం ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు ఈత మొక్కలు నాటారు. సర్పంచ్లు ఉమా, విజయ, ఎకై ్సజ్ సిబ్బంది, స్థానిక నాయకులు, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులకు మొక్కల పంపిణీ ఎల్లారెడ్డి/సదాశివనగర్ : ఎల్లారెడ్డి మండలం శివాపూర్ గ్రామంలో సర్పంచ్ పల్లె నాగరాజు గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అలా అయితేనే లక్ష్యం నెరవేరుతుందని సర్పంచ్ అన్నారు. సదాశివనగర్ మండలం తుక్కోజివాడి గ్రామంలో ఇంటింట మొక్కలను సర్పంచ్ సంగారావు పంపిణీ చేశారు. అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామీణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను వెంటనే తయారు చేయాలని ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పలుగ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణకు సంబంధించిన నిబంధనలను ఆయన వివరించారు. ఎంపీవో ప్రభాకర్చారి, ఏపీవో సక్కుబాయి తదితరులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని సీతారం తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంపీడీవో అభినవ్ చందర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ లబ్ధిరులకు సూచించారు. బుధవారం ఆయన గృహనిర్మాణశాఖ ఏఈ వినీత్తో కలిసి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి రాధికను ఆదేశించారు. సర్పంచ్ నాందేవ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిలు తదితరులున్నారు. -
‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే’
ఎల్లారెడ్డి: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమీక్ష, అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు 94 శాతం మ్యాపింగ్ పూర్తయ్యిందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో గ్రామాల్లో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బీఎల్ఏలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సర్ ప్రక్రియ ఇన్చార్జి కోఆర్డినేటర్లు యాదయ్య, ధనలక్ష్మి, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి/లింగంపేట: రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోనాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కాద్లాపూర్ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. సోయాబిన్, కంది విత్తిన 20–25 రోజుల మధ్యలో గుంటకతో అంతర కృషి చేసి మొక్కల వరుసల్లో ఉన్న కలుపును చేతితో తొలగించాలన్నారు. దీంతో నేలతో తేమ నిలిచి వేర్లకు గాలి అందుతుందన్నారు. ఎల్లారెడ్డి మండలం సాతెల్లి, అడవి లింగాల, భిక్కనూర్, తిమ్మారెడ్డి, మత్తమాల గ్రామాలలో రైతులకు ఆరుతడి పంటలపై వ్యవసాయాధికారి రాజాగౌడ్ అవగాహన కల్పించారు. లింగంపేట మండలం సురాయిపల్లి ఆరుతడి పంటలపై వ్యవసాయాధికారి అనిల్కుమార్ అవగాహన కల్పించారు. కూరగాయలు, మొక్కజొన్న, జొన్న, కంది, మినుములు, పెసర్లు తదితర పంటలు వేసుకోవాలని అధికారులు సూచించారు. డీసెంట్ నోట్ అందజేసిన బీజేపీ కౌన్సిలర్లు కామారెడ్డి టౌన్ : మున్సిపల్ కౌన్సిల్ సమావేశపు పలు ఎజెండా అంశాలపై అభ్యంతరం తెలుపుతూ బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు బుధవారం డీసెంట్ నోటీసును అందజేశారు. గురువారం నిర్వహించబోయే మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. చాలా వార్డుల్లో డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, వీధి దీపాలు, రహదారుల నిర్వహణ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌన్సిలర్లు నరేందర్రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, రేవతి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి మద్నూర్(జుక్కల్): మండలంలోని తడిహిప్పర్గలో పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశామని అన్నారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.5,400 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్లారెడ్డి ఏటీసీకి మహర్దశ!
● ‘పీఎం సేతు’కు ఎంపిక ● అత్యాధునిక హంగులు, ప్రపంచస్థాయి ప్రమాణాలతో త్వరలోనే అప్గ్రేడ్ఎల్లారెడ్డి: దేశంలో వృత్తిపరమైన శిక్షణలో నాణ్యతను, ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటి ట్రాన్సఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ (పీఎం–సేతు) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి సంగారెడ్డి క్లస్టర్ పరిధిలో ఎల్లారెడ్డి ఏటీసీని ఎంపిక చేశారు. దీనిద్వారా ఈ కేంద్రంలో అత్యాధునిక యంత్రాలు, ఆటోమేషన్ పరికరాలు, డిజిటల్ ల్యాబ్లు, ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అభివృద్ధికి రూ.40 కోట్లు.. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వేయి ఏటీసీలను ఆధునికీకరించనుంది. సంగారెడ్డి ఏటీసీ క్లస్టర్ కింద ఎల్లారెడ్డితోపాటు మెదక్, దుబ్బాక, హత్నూర్ ఏటీసీలున్నాయి. వీటిని స్పోక్ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యూ లాండ్ ఫౌండేషన్ సహకారంతో ప్రతి స్పోక్ సెంటర్కు రూ. 40 కోట్లు, హబ్గా ఉండే సంగారెడ్డికి రూ.80 కోట్లు ఇవ్వనున్నారు. మొత్తంగా రూ. 240 కోట్లను వెచ్చించి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పీఎం సేతు కింద ఎంపికై న ఏటీసీలలో పలు కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిజం, అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషీనింగ్ టెక్నిషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ అటోమేషన్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ (మెకానికల్), ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ కోర్సులు రానున్నాయి.ఎల్లారెడ్డి ఏటీసీ కేంద్రం స్పోక్ ఏటీసీగా త్వరలో అప్గ్రేడ్ కాబోతోంది. దీనిలో ప్రపంచ స్థాయి ప్రమాణా లతో అత్యాధునిక యంత్రాలు, డిజిటల్ క్లాస్రూంలు తదితర మౌలిక సదుపాయాలతో మాస్టర్ ట్రైనర్ల ద్వారా అత్యుత్తమ శిక్షణ ఇస్తాం. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్ ద్వారా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రూపానాయక్, ప్రిన్సిపాల్, ఏటీసీ, ఎల్లారెడ్డివిద్యార్థులు ఈ కోర్సులలో చేరేందుకు ఎటువంటి ఫీజు ఉండదు. శిక్షణ కాలంలో ప్రభుత్వం రూ.2 వేల చొప్పున స్టైఫండ్ లేదా స్కాలర్షిప్ ఇస్తుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి క్యాంపస్ సెలక్షన్ ద్వారా పలు కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 100శాతం ప్లేస్మెంట్ సహాయం లభిస్తుందని భావిస్తున్నారు. ఆసక్తిగలవారు టీజీ ఐటీఐ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండా సొంత జిల్లాలోనే ప్రపంచ స్థాయి నైపుణ్యాలను ఈ స్పోక్ ఏటీసీ ద్వారా పొంది మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మాచారెడ్డి ఎస్సైకి సన్మానం
మాచారెడ్డి: కొత్తగా విధుల్లో చేరిన మాచారెడ్డి ఎస్ఐ విజయ్ ని బుధవారం మండల ఆటో యూనియన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆటోవాలాలు స్వామి గౌడ్ దేవా గౌడ్, డి స్వామి గౌడ్, శర్మన్, దుజీరాం, మోహన్, ఎం. స్వామి గౌడ్, రవి, నాగరాజు, అంజయ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సై విజయ్కి శాలువా కప్పి సన్మానం చేశారు. కాంగ్రెస్ నాయకులు అలీ ఖాన్, బన్సీ నాయక్, శ్రీధర్ రావు, సీతారాం, మాణిక్ సాయి, షాదుల్, నరేష్, బాబా ఖాన్ ఉన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆరోగ్య రక్షణ, క్యాన్సర్ నివారణకు బుధవారం వ్యాక్సిన్ ఇచ్చినట్లు మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు బా లికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పించే హెచ్పీవీ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. హెచ్ఎం శోభారాణి, వైద్య సిబ్బంది శోభారాణి, భూలక్ష్మి, నౌషీన్, రజిని, తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు కోర్సు డైరెక్టర్ మండల విద్యాధికారి అంజల్రెడ్డి సూచించారు. బుధవారం ఎఫ్ఎల్ఎన్ రెమిడియోషన్పై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు షౌకత్అలీ, రిసోర్స్ పర్సన్స్ మమిపాల్, చంద్రశేఖర్, రాములు, మాధురి, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాహుల్ గాంధీ అరెస్ట్పై నిరసన
కామారెడ్డి టౌన్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటన, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలిపారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థులు పరీక్షలపై నమ్మకం కోల్పోయారన్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల హక్కులు, విద్యార్థుల భవిష్యత్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్, నాయకులు శ్రీనివాస్, రాజు, భీమ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ చేస్తేనే బోనస్
● సన్న వడ్ల బోనస్ చెల్లింపుకు కొత్త నిబంధనలు ● విత్తన కొనుగోలు సమయంలోనే వివరాల నమోదు బాన్సువాడ రూరల్: సన్నరకం వరి పండించే రైతులకు సరైన సమయంలో మద్దతుధర, సకాలంలో బోనస్ అందించేందుకు కొత్త నిబంధనలు రూపొందించింది. వర్షాకాలంలో పంటలు సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. దుకాణదారులకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ కేటాయించి వివరాలు ఆన్లైన్ చేయాలని నిర్ధేశించింది. ఈనిబంధనలు పాటిస్తేనే ప్రభుత్వం సూచించిన ఏడురకాలు సాగుచేసిన సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తుందని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. కొత్త విధానంతో సులువు.. గతంలో రైతులకు బోసన్ నగదు జమ అయ్యేందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేది. క్రాప్బుకింగ్కు సంబంధించిన ఫొటోలు, సర్టి ఫికెట్లు సక్రమంగా లేకపోతే తిరస్కరించేవారు. సిబ్బంది కొరతతో వెరిఫికేషన్కు సమయం పట్టేది. కొత్త విధానంతో రైతులకు సులువుగా మారనుంది. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఫర్టిలైజర్ దుకాణంలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. సీజన్ పూర్తికాగానే రెండు నెలలలోపు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. దీనికోసం రైతులు రిజిస్టర్డ్ ఫర్టిలైజర్ దుకాణంలో ఆధార్కార్డు, పట్టాపాస్పుస్తకం, బ్యాంక్పాస్పుస్తకం జిరాక్సులు సమర్పించి రసీదు తీసుకోవాలి. పంటకోత పూర్తికాగానే ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి నేరుగా రైతు ఖాతాలో ఎకరాకు రూ.500 చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు బోనస్ జమచేస్తుంది. ఏడు రకాల వంగడాలకు పెరిగిన డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలకు రైతుల నుంచి డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం ఆర్ఎన్ఆర్–15048, కేఎన్యం–1638, బీపీటీ–5204, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 వంగడాలకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు సాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగుచేయాలని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. -
పోక్సో చట్టం–బాల్య వివాహాలపై అవగాహన
మద్నూర్(జుక్కల్): ప్రేమలు, మోసాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిర్మూలనపై మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం చేత కళజాత కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై మోహన్రెడ్డి, కళాబృందం ఇన్చార్జి రామంచ తిరుపతి, శేషరావు, సాయిలు, ఎంఈవో రాములు, ఐసీడీస్ సీడీపీవో కళావతి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు శారత, తులసి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నియంత్రణ చర్యలు చేపడుతున్నా..
● కట్టడి చేస్తున్నా తగ్గని రోడ్డు ప్రమాదాలు ● అవగాహన కల్పిస్తున్నా మారని వాహనదారులు ● రోజుకొకరు చొప్పున మృత్యువాతఈనెల 15న నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పిట్లంకు వెళ్లారు. వారు బైకుపై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. వారిద్దరు వరుసకు బావ బావమరుదులు. జూన్ 26న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన ముగ్గురు దోస్తులు కామారెడ్డి నుంచి స్వగ్రామానికి కారులో వెళ్తున్నారు. మాచారెడ్డి మండలం గన్పూర్(ఎం) గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరుసటి రోజు మరొకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 21న ఇంకొకరు మృతిచెందారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగని రోజులుండడం లేదు. జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులే కాకుండా గ్రామీణ రహదారులపైనా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 161వ నంబరు జాతీయ రహదారిపై చాలా చోట్ల రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. 44వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు దాటే క్రమంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నచిన్న పొరపాట్ల కారణంగా జరిగే ప్రమాదం మొత్తం కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేస్తోంది. త్వరలో వెళ్లాలన్న ఆలోచనతో వేగంగా వాహనాలు నడుపుతుండడంతో పలువురు గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాలు నడిపేటపుడు కనీస నియమాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించక.. రహదారి భద్రత విషయంలో కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని సరిచేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నవారు కొందరైతే, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్నవారు మరికొందరు.. అధికారులు అవగాహన కల్పిస్తున్నా, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా యాక్సిడెంట్లు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.సంవత్సరం ప్రమాదాలు మరణాలు క్షతగాత్రులు 2025 454 225 443 2026(జూన్) 297 160 254రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి పోలీస్ యంత్రాంగం అనేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో దొరికినవారికి జరిమానాలతో పాటు జైలుశిక్షలూ పడుతున్నాయి. అయినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపేవారు తగ్గడం లేదు. మద్యం మత్తులో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని అవగాహన కల్పిస్తున్నా చాలా మంది మారడం లేదు. పోలీసుల తనిఖీలు జరుగుతాయన్న ఉద్దేశంతో రూట్లు మార్చి వెళుతున్నారు. -
సరిహద్దులో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి
● జిల్లా ఎకై ్సజ్ ఈఎస్ ముకుంద్రెడ్డి ● సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఎకై ్సజ్ చెక్పోస్ట్ తనిఖీ మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలం మహారాష్ట్రకు సరిహద్దున ఉండటంతో మహారాష్ట్ర నుంచి వ చ్చే వాహనాలపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్ ముకుంద్రెడ్డి ఆదేశించారు. మండలంలోని సలాబత్పూర్ వద్ద గల అంతర్రాష్ట్ర ఎకై ్సజ్ చెక్పోస్ట్ను బుధవారం ఆయన సందర్శించారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దులో నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి మత్తు, దేశిదారు మద్యం, అల్ఫాజోలం తదితర మత్తు పదార్థాలు మన రాష్ట్రంలోకి తరలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. చెక్పోస్ట్లో పని చేసే అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలో సర్పంచ్ ఉషా సంతోష్తో కలిసి మొక్కలు నాటారు. ట్రైనీ ఏఈఎస్ అరుణ్చంద్ర, సలాబత్పూర్ ఎకై ్సజ్ సీఐ జావీద్ అలీ, పవన్గౌడ్, డీటీఎఫ్ సీఐ సుందల్సింగ్, ఎస్సై నాగేశ్, సిబ్బంది ఉన్నారు. -
తరగతులు ఐదు.. ఒక్కరే టీచర్
మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్పేట్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధన జరుగుతుంది. విద్యార్థుల కోసం తరగతి గదులు ఉన్నాయి. పాఠశాలలో కేవలం ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు ఒకటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 64 మంది విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు సరిగ్గా చదువలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లచ్చన్ ప్రాథమికోన్నత పాఠశాలలో.. ఆ పాఠశాలలో కావాల్సినంత ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతి గదులు సరిపడా లేవు. మండలంలోని లచ్చన్ ప్రాథమికోన్నత పాఠశాలలో 123 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధన కొనసాగుతుంది. పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఎనిమిది తరగతులకు నాలుగు గదులు ఉండటంతో విద్యార్థులకు నిత్యం ఆరు బయట, వరండాలో కూర్చొబెట్టి చదువు చెబుతున్నారు. మండలంలోని పాఠశాలలను పర్యవేక్షించి సమస్యలను తీర్చాల్సిన సంబంధిత అధికారి పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిత్యం వరండాలోనే కూర్చొని చదువుతున్నాం. ఉపాధ్యాయులు పాఠాలు ఆరుబయటనే బోధిస్తున్నారు. పాఠశాలలో గదుల కొరత ఉంది. అధికారులు స్పందించాలి. –రమ్యశ్రీ, 4వ తరగతి, లచ్చన్ స్కూల్లో సరిపడా గదులు లేక రోజు ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలలో తరగతి గదులు నాలుగే ఉన్నాయి. తరగతులు పాఠశాల బయటే జరుగుతున్నాయి. –దుర్గ, 4వ తరగతి, లచ్చన్ సుల్తాన్పేట్ ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులకు ఒకే క్లాస్ రూం లచ్చన్లో గదులు సరిపోక వరండాలో చదువులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు
లింగంపేట(ఎల్లారెడ్డి) : విధులు సక్రమంగా నిర్వ హించకుండా అజాగ్రత్తగా ఉంటే చర్యలు తప్పవని సిబ్బందిని డీఎఫ్వో నిరజ్కుమార్ సిబ్బందిని హె చ్చరించారు. లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రా మ శివారులో ఇటీవల నాటిన హరితవనాల మొక్కలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించా రు. అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని గిరిజను లు కబ్జా చేసుకుంటే ఏం చేశారని ప్రశ్నించారు. తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నెల 14న హరిత వనాలలో భాగంగా ఉపాధి హామీ కూలీలు, అధికారులు కలిసి 1000 మొక్కలు నాటారు. అందులో గుర్తు తెలియని వ్య క్తులు 350 మొక్కల వరకు ధ్వంసం చేశారు. ఈ వి షయమై గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కా ర్యదర్శి, క్షేత్రసహయకుడు, కలిసి అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని ప రిశీలించడానికి వెళ్లగా వారిని ఆగపల్లి తండాకు చెందిన పలువురు గిరిజనులు దాడికి యత్నించి దూ షించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకొని హరిత వనాలకు రక్షణ కల్పించాలని లింగంపేట పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా తనకు స మాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను ప్ర శ్నించారు. పర్మళ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ను సస్పెన్షన్ చేస్తున్నట్లు డీఎఫ్వో నిరజ్కుమార్ ప్రకటించారు. సెక్షన్ ఆఫీసర్ విక్కీ మార్టిన్ను సస్పెన్షన్ చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ క న్సర్వెటర్ ఆఫ్ ఫారెస్ట్కు సిఫారసు చేశారు. అలాగే అటవీ భూములను కబ్జాకు పాల్పడిన ఇద్దరు గిరిజ న వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండుకు త రలించాలని ఎఫ్ఆర్వోను ఆదేశించారు. అలాగే క్షే త్రసహయకుడు లక్ష్మణ్, గ్రామ పంచాయతీ పాలకులు తమకు రాతపూర్వకంగా జరిగిన సంఘటన ను నివేదిక ఇవ్వాలని సూచించారు. గిరిజనులు ధ్వంసం చేసిన మొక్కలతో పాటు దున్నిన భూమిని పరిశీలించారు. పూర్తి నివేదికను తనకు అందజేయా లని ఎఫ్ఆర్వోను ఆదేశించారు. ఎఫ్ఆర్వో రమేశ్, ఫారెస్టు సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు. డీఎఫ్వో నీరజ్కుమార్ మొక్కలు ధ్వంసం చేసిన ప్రదేశం పరిశీలన పర్మళ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్పై సస్పెన్షన్ వేటు -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి విక్రమ్ సూచించారు. మంగళవారం మండలంలోని తిమ్మోజివాడి, తుక్కోజివాడి గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ‘ఫుడ్ సేప్టీ ఆన్ వీల్స్’ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు...పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజనం, పౌష్టికాహారం అందిస్తున్న తీరును పరిశీలించారు. సర్పంచ్ భవాని, ఉప సర్పంచ్ రవీందర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారులకు సిబిల్ కష్టాలు
● క్రెడిట్ కార్డుల ద్వారానే రుణ సౌకర్యం ● అర్హత ఉన్నా పీఎం స్వనిధి పథకానికి దూరమవుతున్న పరిస్థితిఎల్లారెడ్డి : చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారులు సిబిల్ స్కోర్ లేని కారణంగా పీఎం స్వనిధి పథకానికి దూరమవుతున్నారు. వీధి వ్యాపారులకు తాము చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకు పెట్టుబడి కోసం ఆత్మ నిర్భర్ భారత్ కింద మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకాన్ని 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం పెట్టుబడి సహాయం కోరే వీధి వ్యాపారులకు మొదటి విడతగా రూ. 15 వేలు, రెండో విడతగా రూ. 25 వేలు, మూడో విడతగా రూ. 50 వేల రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తుంది. తాము తీసుకున్న మొదటి, రెండవ విడత రుణాలను సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులకు రూ. 50 వేల రుణాలను అందించడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ రుణాలను బ్యాంకు ఖాతాలలో కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా అందించనున్నారు. రుణ సదుపాయం పొందే వీధి వ్యాపారులకు సిబిల్ స్కోర్ బాగుంటేనే క్రెడిట్ కార్డులు అందిస్తామని బ్యాంకర్లు కండీషన్ పెడుతున్నారు. 2020లో కరోనా లాక్డౌన్ కారణంగా వీధి వ్యాపారులు తాము మొదటి, రెండవ విడతలలో తీసుకున్న రుణాలను సక్రమంగా కట్టలేక పోయారు. దీంతో వీరి సిబిల్ స్కోర్ 650 దాటడం లేదని తెలిసింది. సిబిల్ స్కోర్ లేని కారణంగా స్వనిధి పథకానికి అర్హత ఉన్నా 80 శాతం మంది వీధి వ్యాపారులకు రుణాలు అందడం లేదు. పాత రుణాలను సక్రమంగా చెల్లించిన ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ పథకం అర్హత లభిస్తుంది. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలను అందించేందుకు సిబిల్ అవసరం లేదని పథకం మార్గదర్శకాలు ఉన్నాయి. కాగా, బ్యాంకర్లు మాత్రం సిబిల్ స్కోరే ప్రామాణికమని, రుణం ఇవ్వట్లేదు.ఈవిషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలి. –శ్రీధర్రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డిమార్గదర్శకాలు ఇలా.. వీధి వ్యాపారులకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి పథకానికి సిబిల్ స్కోర్ ప్రామాణికం కాదని మార్గ దర్శకాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ లేనిదే రుణాలను ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించక వారి అకౌంట్లు ఎన్పీఏ (నాన్ పెరఫార్మెన్స్) అకౌంట్లుగా మారితేనే లోన్లు తిరస్కరించొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు లోన్లు వచ్చేలా చేయాలని వీధి వ్యాపారులు కోరుతున్నారు. -
ఎర్రాపహాడ్లో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామంలోఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న చిట్యాల చిన్న మైశయ్య(45)అనే వ్యక్తి నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించిన కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో కడుపునొప్పి బాధ భరించలేక సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడికి భార్య బాలమణి, ఒక కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర కు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. -
ఇది సీసీ రోడ్డే..
మండలంలోని ఇసన్నపల్లి – రామారెడ్డిని విభజించే రోడ్డు గుంతలయంగా మారింది. ఇసన్నపల్లి హనుమాన్ దేవాలయం నుంచి రాజమ్మ తండా, దొక్కల్ మీదుగా నిజామాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఈరోడ్డు గుండా వెళ్తాయి. రోజు వందలాది మంది ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు. ఇదే మార్గంలో ఉన్న సీసీ రోడ్డుకు గుంతలు పడటంతో మొరం పోసి వదిలేశారు. దీంతో సీసీ కాస్త మట్టి రోడ్డుగా మారింది. రోడ్డుపై గుంతలతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – రామారెడ్డి -
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ 14 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని ఒడ్డేపల్లి, మల్లూర్, బ్రహ్మణపల్లి, అచ్చంపేట, బంజపల్లి, గ్రామాలకు లబ్ధిదారులకు అందజేశారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, తహసీల్దార్ సాయిభుజంగరావు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): గత మూడు రోజులుగా రాత్రి వేళ కు రుస్తున్న వ ర్షాలకు పెద్దవాగు ప్రవహిస్తుంది. సోమవారం ఉదయం నాగారం వరకు చేరుకున్న పెద్దవాగు ప్రవాహం మంగళవారం ఉదయం లింగంపేట వంతెన దాటి శెట్పల్లి శివారులోకి ప్రవేశించింది. మడుగులు నిండుకుంటూ పోచారం వైపు ప్రహిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. పెద్దవాగు ప్రవహిస్తే గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాకు వెళ్లే రోడ్డు బురదమయం కావడంతో గిరిజనులు మంగళవారం నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దశాబ్దాలుగా తమ రోడ్లు బాగు చేయాలని మొరపెట్టుకుంటున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శెట్పల్లి రోడ్డు నుంచి రెండు కిలో మీటర్ల వరకు రోడ్డు బురదతో నిండిపోయి నడవడానికి సైతం నరక యాతన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బీటీ రోడ్డు వేయాలని గిరిజనులు కోరుతున్నారు. కామారెడ్డి టౌన్ : ఈ నెల 23న జరగనున్న మున్సిపల్ సాధారణ సమావేశంలో పలు ఎజెండా అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ బీజేపీ కౌన్సిలర్లు మంగళవారం స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ ఎన్.వై. గిరికి డీసెంట్ నోట్ను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ...గురువారం నిర్వహించనున్న సాధారణ సమావేశం ఎజెండాలోని పలు అంశాలలో తీవ్ర లోటుపాట్లు ఉన్నాయని ఆరోపించారు. మున్సిపాలిటీలో రెగ్యులర్గా చెల్లించే జీతభత్యాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకే నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఇటువంటి పరిస్థితిలో ఎజెండాలోని పలు ప్రతిపాదిత అంశాలపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని, అందుకే వాటిపై అభ్యంతరం తెలుపుతూ ’డిసెంట్ నోట్’ అందజేశామని వివరించారు. ఎజెండా ప్రతులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు శ్రీకాంత్, నరేందర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, లక్ష్మారెడ్డి, నాయకులు తదితరులున్నారు. -
ప్రభుత్వ భూమి స్వాధీనం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలోని హరిజనవాడ సమీపంలో ఉన్న సర్వే నంబర్ 510లోని ప్రభుత్వ భూమిని రెవెన్యు అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రాజశేఖర్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఆభూమిని పరిశీలించి, వెంటనే చదును పనులు చేపట్టారు.గత కొంతకాలంగా ఈ స్థలంపై ఆక్రమణలు జరగకుండా నిరోధించేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టారు. మండల పరిధిలో సర్కారు స్థలాలను కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,ఆర్ఐ, సర్వేయర్ స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట(భిక్కనూరు) : రాజంపేట నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులును కామారెడ్డి రాజంపేట ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు మంగళవారం సన్మానించారు. ఈ సందర్బంగా ఎస్సై ఆంజనేయులును శాలువాలతో మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గుప్త,రాజంపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ముత్యపు సిద్దరాములు, ప్రధానకార్యదర్శి, మోగిలిపల్లి రమేష్ గుప్త, కోషాధికారి బంధం పద్మరావు, ప్రతినిదులు కొండ సురేందర్ గుప్త, మొలుగు చంద్రమౌళి, బంధం మల్లేషం, ముత్యపు చక్రపాణి, తాటి రమేష్, మొలుగు శ్రీనివాస్ల, శివుడు, బందం అనిల్లు పాల్గొన్నారు. -
వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి
కామారెడ్డి రూరల్: ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా ప్రొహిబిషన్–ఎకై ్సజ్ అధికారి ముకుంద్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈతమొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముకుంద్రెడ్డి హాజరై మొక్కలు నాటి మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. రాష్ట్రంలో ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఏఈఎస్ అరుణ్ చంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్లు విక్రమ్ కుమార్, శ్రీనివాసరావు, ఏపీవో అన్నపూర్ణ, గ్రామ సర్పంచ్ భీమయ్యల లక్ష్మీ రాజు, ఉప సర్పంచ్ స్వప్న లక్ష్మీ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాజా గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు ధర్మగోని కిషన్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృ తి
మాచారెడ్డి: మండలంలోని కాకులగుట్ట తండా వద్ద 25 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్ద రు మిత్రులు అప్పుడే మృతిచెందగా తీవ్రంగా గా యపడిన మూడో మిత్రుడు మంగళవారం వేకువజామున మృతిచెందాడు. వివరాలు ఇలా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన అనిల్(22), అన్వేష్ (22), వికాస్(22) అ నే ముగ్గురు స్నేహితులు జూన్ 26న కారులో కామారెడ్డి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కాకులగుట్ట తండా వద్ద వారి కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్క న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఒక రోజు వ్యవధిలో అన్వేష్ మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వికాస్ చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు. 25 రోజుల క్రితం కారులో వెళ్లిన ముగ్గురు మిత్రులు కాకులగుట్ట తండా వద్ద చెట్టుకు ఢీ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఇద్దరు మిత్రులు మృత్యువాత -
వైద్యసేవలు మరింత చేరువ కావాలి
కామారెడ్డి టౌన్ : పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ కావాలని డీఎంహెచ్వో వెంకట్ వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బస్తీ, యూపీహెచ్సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, క్షయ, మాతాశిశు సంరక్షణ, టీకా కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల నమోదు, ప్రసవ పూర్వ పరీక్షలు, డెలివరీ ప్లాన్, ప్రసవాలు, ప్రసవానంతరం సంరక్షణ వంటి అంశాలపై సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో రాజు, ప్రోగ్రాం అధికారులు ప్రదీప్, వెంకటస్వామి, ఎపిడెమియాలజిస్ట్ మోనిక, వైద్యాధికారులు మహేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చలపతి, సిద్ధిరామేశ్వర్, అశ్విని పాల్గొన్నారు. -
మరోసారి మూడు నెలల కోటా
● రేషన్ బియ్యం పంపిణీకి సన్నద్ధం ● ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులకు అందజేతఎల్లారెడ్డిరూరల్ : వాతావరణ పరిస్థితులు, సరఫరా నిర్వహణను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేయాలని ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఏప్రిల్ నెలలో వేసవి తీవ్రత నేపథ్యంలో లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. 19 వేల మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 577 రేషన్ దుకాణాల పరిధిలో 2 లక్షల 76 వేల 471 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మొత్తం 9 లక్షల 56 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ కార్డులు 17, 815 ఉండగా 52,531 మంది, అన్నపూర్ణ కార్డులు 825 ఉండగా 865 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 6,637 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తారు. ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించి 19 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్దుకాణాలకు సరఫరా చేయనున్నారు.ఎల్లారెడ్డి గోదాం పరిధిలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాలకు సంబంధించి 79 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీకి అలాట్మెంట్ రాగానే ప్రారంభిస్తాం. ఆగస్టు 1 నుంచి లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందజేస్తాం. – వంశి, డీటీ, సివిల్ సప్లయ్, ఎల్లారెడ్డి -
కోర్టు ప్రాంగణంలో ‘కామన్ సర్వీస్ సెంటర్’ ప్రారంభం
కామారెడ్డి టౌన్ : జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ సెంటర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్ పి.ముక్తిద మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు నమోదు చేసుకోవడంలో ప్రజలు, న్యాయవాదులు, సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. కక్షిదారులు, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సూర సుమలత, బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ ప్లీడర్ శ్యామ్గోపాల్రావు, తహసీల్దార్ హిమబిందు, కోర్టు సీఏవో రాంచందర్, సూపరింటెండెంట్లు భుజంగరావు, వెంకట్రెడ్డి, చంద్రసేన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)గా శ్రీనివాస్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం డైరెక్టర్ ఆఫ్ సెంకడరీ హెల్త్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు డీసీహెచ్ఎస్గా విధు లు నిర్వహించిన విజయభాస్కర్ ఆర్మూర్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు. జుక్కల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా విజయరాజ్ నియమితులయ్యారు. బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ఎం.శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కామారెడ్డి ఆస్పత్రినుంచి డాక్టర్ల రేషనలైజేషన్లో భాగంగా బాన్సువాడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయ్యారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బా లికల హాస్టళ్ల లో నెలకొన్న నీటి సమస్య ను పరిష్కరి స్తామని ము న్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. నీటి ఎద్దడిపై ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టళ్లను పరిశీలించారు. విద్యార్థినులతో మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వంటశా ల, గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో హాస్టళ్లలో నీటి సమస్య పరిష్కరించాలన్నారు. అనంత రం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత, మిషన్ భగీరథ డీఈ హన్మంత్రావు, హాస్టల్ వార్డెన్ స్వప్న తదితరులున్నారు. కామారెడ్డి టౌన్ : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రోడ్డు భద్రతా చర్యలపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్స్పాట్ల గుర్తింపు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్ మార్కింగ్స్, క్రాష్ బ్యారియర్లు, స్ట్రీట్ లైటింగ్ వంటి అంశాలపై చర్చించారు. రహదారి ఇంజినీరింగ్ లోపాల సవరణ, అత్యవసర వైద్య స్పందన వ్యవస్థ బలోపేతంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఎన్హెచ్ఏఐ డీజీఎం ఆర్.శాలిని, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ వినోద్, డీటీవో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రి
● ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వైద్యులు ● 85 శాతం సిజేరియన్లు నమోదు ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం సాధారణ కాన్పులే అధికంప్రసూతి కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే చాలు వెనకాముందు ఆలోచించడం లేదు.. సాధారణ కాన్పులకు అవకాశం ఉన్నా సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఐదేళ్ల కాలంలో 87,331 కాన్పులు జరగ్గా.., ఇందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70,828, ప్రైవేటులో 16,503 జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాభై శాతానికిపైగా సాధారణ కాన్పులు నమోదవుతుండగా.. ప్రైవేటులో ఇవి 15 శాతం మాత్రమే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70,828 కాన్పులకు గాను 37,390 సాధారణ, 33,438 సిజేరియన్లు జరిగాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 16,503 డెలివరీలు జరిగితే అందులో 14,082 సిజేరియన్లే కావడం గమనార్హం. 2,421 సాధారణ కాన్పులే జరిగాయి. కాసులకోసమేనా? ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో విచ్చలవిడిగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. అవసరమైతేనే సిజేరియన్ చేస్తామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. కానీ ప్రభుత్వాస్పత్రుల్లో యాౖభై శాతానికిపైగా సాధారణ కాన్పులు జరుగుతుండగా.. ప్రైవేటులో 15 శాతం మాత్రమే నార్మల్ డెలివరీ ఉండడం ఆరోపణలకు బలమిస్తోంది. సాధారణ ప్రసవం జరిగినపుడు అదే రోజు లేదా మరుసటి రోజు డిశ్చార్జీ చేస్తారు. సిజేరియన్ అయ్యిందంటే ఐదారు రోజుల వరకు ఆస్పత్రిలో ఉండాల్సిందే.. సాధారణ ప్రసవానికి రూ.15 వేల నుంచి 30 వేల వరకు ఫీజులు తీసుకుంటుండగా.. సిజేరియన్లకు రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను బట్టి చార్జీలు ఉంటున్నాయి.జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వెంక ట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడేందుకు కృషి చేస్తున్నారు. ఆయన నిత్యం ఆస్పత్రులను చుట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరగాలని, అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వైద్యాధికారులు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న కోతలపైనా దృష్టి సారించాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.కడుపులో బిడ్డ అడ్డం తిరగడం, ఉమ్మనీరు పూర్తిగా లేకపోవడం, గర్భిణీకి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి సందర్భాలలో బిడ్డను, తల్లిని కాపాడాలన్న ఉద్దేశంతో సిజేరియన్లు చేస్తుంటారు. అయితే కొన్ని ఆస్పత్రుల్లో అయితే నొప్పులొస్తున్నాయంటే చాలు అడ్మిట్ చేసుకుని సిజేరియన్ చేసేస్తున్నారు. సిజేరియన్లతో తల్లి బలహీనంగా మారడం, కనీసం నెల, రెండు నెలలు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నిసార్లు సిజేరియన్ అయిన వారికి కుట్లు సరిగా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్లు సోకడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.ప్రైవేటు ఆస్పత్రిసంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేట్ ఆస్పత్రులు సాధారణం సిజేరియన్ మొత్తం సాధారణం సిజేరియన్ మొత్తం2022–23 9,236 8,805 18,041 606 3,094 3,700 2023–24 10,445 6,109 16,554 511 3,228 3,739 2024–25 8,828 8,401 17,229 562 3,512 4,074 2025–26 7,139 8,302 15,441 605 3,312 3,917 2026–27(జూన్) 1,742 1,821 3,563 137 936 1,073 -
వీబీ జీ రామ్జీపై ఏఐ నిఘా
ఎల్లారెడ్డి: వీబీ జీ రామ్ జీ పనులపై కేంద్రం ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా నిఘా పెట్టనుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ కేంద్రం ప్రతిష్టాత్మకంగా వీబీ జీ రామ్జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా జరిగే పనులలో పారదర్శకతను పెంచేందుకు, అవకతవకలు, అవినీతి అరికట్టేందుకు డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. అవకతవకలను గుర్తించే అవకాశం వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా చేపట్టే పనులపై ఏఐ టెక్నాలజీ వాడటంతో అవకతవకలను క్షణాల్లో గుర్తించవచ్చు. కూలీలు సమయపాలన పాటించే అవకాశం ఉంటుంది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలన్నీ డిజిటల్ రికార్డుగా ఉండటంతో భవిష్యత్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఉపయోగపడతాయి. గతంలో పనుల కొలతలు తీసుకోవడానికి అధికారులు ఆలస్యం చేయడంతో బిల్లులు ఆగిపోయేవి. డ్రోన్ డేటా ఆధారంగా ఆన్లైన్ వెరిఫికేషన్ వేగంగా జరిగి కూలీలకు, పంచాయతీలకు బిల్లులు తొందరగా వస్తాయి.వీబీజీ రామ్ జీ పథకం ద్వారా చేపట్టబోయే ఉపాధి పనులను సమగ్రంగా పరిశీలించి, అవకతవకలను గుర్తించేందుకు డ్రోన్, ఏఐ టెక్నాలజీని త్వరలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు, పరికరాలు మాకు రాలేదు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్తో ఫొటోలను అప్లోడ్ చేస్తున్నాం. – వినోద్ కుమార్, ఏపీవో ఉపాధి పనులపై డ్రోన్ టెక్నాలజీతో పరిశీలన పనుల గుర్తింపు.. కూలీల హాజరు సులభం త్వరలోనే జిల్లాలో అమలు -
పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై కేసు
పిట్లం(జుక్కల్): పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాన్సువాడ నుంచి సంగారెడ్డి అంగడికి పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు పిట్లం మండలం చిన్నకొడప్గల్ గ్రామం వద్ద సోమవారం ఉదయం ట్రాలీ ఆటోను పట్టుకున్నామన్నారు. చిన్నపాటి వాహనంలో తొమ్మిది పశువులను ఇరుకు ఇరుకుగా పెట్టి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. దీంతో డ్రైవర్ సంతోష్, వాహన యజమాని పోల్కంపల్లి శేఖర్, పశువులను తరలిస్తున్న మహమ్మద్ మునీర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
క్రైం కార్నర్
కామారెడ్డి అర్బన్: విశ్రాంత పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ అల్లం ప్రభు భాస్కర్ (77) వృద్ధాప్యం, అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. అల్లం ప్రభు భాస్కర్ చాలా సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖలో కామారెడ్డి ప్రాంతంలో వివిధ హోదాల్లో పని చేశారు. భాస్కర్ మృతికి పలువురు విశ్రాంత ఉద్యోగులు, నాయకులు సంతాపం తెలిపారు. విద్యుత్ షాక్తో ఆవు.. భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన లింగాల శంకర్కు చెందిన ఆవు గ్రామ శివారులో మేత మేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో షాక్తో అక్కడి కక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ. 25 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. రెండు ట్రాక్టర్లు సీజ్ గాంధారి(ఎల్లారెడ్డి) : అటవీ భూమిని ఆక్రమించి సాగుచేస్తున్న భూమిలో దమ్ముచేస్తున్న కేజ్వీల్ ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎఫ్ఆర్వో రమేశ్ సోమవారం తెలిపారు. మండలంలోని గౌరారం బీట్ మేగిపల్లి శివారులో అక్రమంగా అటవీ శాఖ భూమిలో దమ్ము చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను అటవీశాఖ కార్యాలయానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు ● లక్ష్మీరావులపల్లిలో తప్పిన ప్రమాదం మాచారెడ్డి : మండలంలోని లక్ష్మీరావులపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఓ ఇంట్లో వర్షపు నీరు విద్యుత్ వైర్లపై పడటంతో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఇంటి యజమాని తుమ్మ సుదర్శన్ స్తంభంపై నుంచి వచ్చే సర్వీస్ వైరును కట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తన భార్య శోభ పేరుపై ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికి అధికారులు దాని ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇంట్లో ఉండాల్సి వస్తోందన్నారు. అధికారులు తనకు ఇందిరమ్మ ఇంటికయ్యే బిల్లు త్వరగా మంజూరు చేయాలని కోరారు. -
ఏటీసీని జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి
కామారెడ్డి టౌన్ : నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ని భిక్కనూరు మండలం గుర్జాకుంటలో కాకుండా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే ఈ కేంద్రాన్ని గుర్జాకుంటలో ఏర్పాటు చేస్తే ఇతర మండలాల విద్యార్థులకు రాకపోకల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జిల్లా కేంద్రం అన్ని మండలాల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. నాయకులు చందు, నోమన్, ప్రణయ్, పాషా తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులో ఇటీవల నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వారిపై సోమవారం లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ బాబాయి లావణ్య తెలిపారు. ఇటీవల పర్మళ్ల శివారులోని అటవీ ప్రాంతంలో హరిత వనాలలో భాగంగా ఉపాధి హామి కూలీలు, అధికారులు కలిసి 1000 మొక్కలు నాటారు. అందులో గుర్తు తెలియని వ్యక్తులు 350 వరకు ధ్వంసం చేసినట్లు తెలిపారు. మొక్కలను పరిశీలించడానికి వెళ్లిన జీపీ కార్యదర్శి, క్షేత్రసహయకులను దూషించిన తండావాసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు సోమవారం ధ్వంసం చేసిన మొక్కలను ఉపాధి హామీ ఏపీవో నరేందర్ పరిశీలించారు. మొరం అక్రమ తవ్వకాలపై .. భిక్కనూరు: మండలకేంద్రంలోని గోర్మిట్కుంటలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని ఆర్టీఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగల రవీందర్ సోమవారం భిక్కనూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈనెల 14న గోర్మిట్కుంటలో మొరం తవ్వుతున్నారని ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్న జేసీబీని స్వాధీనం చేసుకోకుండా వదిలివేశారని దీనిపై విచారణ జరిపాలని కోరారు. బిచ్కుంద(జుక్కల్): పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులను సోమవారం ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు పరిశీలించారు. మధ్యలో నిర్మిస్తున్న డివైడర్లో విద్యుత్ స్తంభాలు, పచ్చని చెట్లు పెట్టి అందంగా ఉండే విధంగా చూడాలని అధికారులను సూచించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులు చేసేటప్పుడు తాగునీటి పైపులు పగిలిపోకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. విఠల్రెడ్డి, నాగ్నాథ్, భాస్కర్రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
రాష్ట్ర భట్రాజు మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పద్మజ కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం మహిళా కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జిల్లా కేంద్రానికి చెందిన పద్మజ ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని భట్రాజు సంఘ భవనంలో 33 జిల్లాల మహిళా ఓటర్లతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో, ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం జిల్లా భట్రాజు మహిళా కమిటీ అధ్యక్షురాలిగా సేవలుందిస్తున్న పద్మజను రాష్ట్ర స్థాయి పదవి రావడంతో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భట్రాజు సంఘం ప్రతినిధులు, సభ్యులు హర్షం వ్యక్తం చేసి, ఆమెను ఘనంగా సన్మానించారు. 23న కామారెడ్డిలో ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర కామారెడ్డి అర్బన్: ఈనెల 23న దేవునిపల్లి భగత్సింగ్ విగ్రహం నుంచి సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప క ల్యాణ మండపం వరకు ప్రధాన వీధుల గుండా జ గన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్టు ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) కామారెడ్డి ప్రతినిధి వెంకటదాస్ ప్రభు తెలిపారు.రథయాత్రలో భాగంగా భజన కీర్తక, ప్రవచనాలు, చప్పన్ భోగ్, మహా హారతి, అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. జన జాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ లింగంపేట(ఎల్లారెడ్డి): ఉద్యోగులు ఓపీఎస్ సాధించేవరకు పోరాడాలని టీఎస్సీపీఎస్యూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి అన్నారు.కుంట ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సెంటర్ ఇన్చార్జి కోటేశ్వర్రావు చేతుల మీదుగా లింగంపేట జెడ్పీహెచ్ఎస్లో సోమవారం ఉపాధ్యాయులు జనజాగరణ యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 22న జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మోహన్, సునిల్కుమార్, రజినీకాంత్,సుధాకర్గౌడ్,రాము,దామోదర్, సంతోష్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్రభుత్వ ఈఎన్టీ వైద్యుడికి సన్మానం కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) నిపుణులు వైద్యుడు బండారి భరద్వాజ్ను సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సోమవారం ఆస్పత్రిలో ఘనంగా సన్మానించారు. ముక్కు సమస్యతో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఓ రోగికి సరికొత్త విధానంలో శస్త్రచికిత్స చేసి, ఒక్క రోజులోనే కోలుకునేలా వైద్యం అందించినందుకు గాను ఆయనను శాలువాతో సత్కరించారు. జిల్లా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్యుడిని కమిటీ ప్రతినిధులు అభినందించారు. కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం, జిల్లా ప్రతినిధి రామచందర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ఎం. సుధాకర్, రాజన్న ఉన్నారు. -
చిన్నారిపై తండ్రి, సవతి తల్లి హత్యాయత్నం
● ప్రమాదంలా చిత్రీకరించి, విఫలం ● సాంకేతిక ఆధారాలతో నిజాలు వెలికితీసిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడ : చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్కు చెందిన టేకు సతీశ్కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు. ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాసీ్త్రయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాసీ్త్రయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. -
భోజనం చేస్తుండగా గుండెపోటు..
● పెద్దకొడప్గల్లో నాగల్గావ్ వాసి మృతిపెద్దకొడప్గల్(జుక్కల్): భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒకరు మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామానికి చెందిన కాంబ్లే భీంరావ్ (35) హైదరాబాద్లో తాపీ మేస్త్రి పని చేస్తూ జీవించేవాడు. వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. ఆదివారం తన బావ సాయిలుతో కలిసి ఇంటికి వస్తుండగా ఆకలి వేయడంతో పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని దాబా వద్ద ఆగారు. దాబాలో భోజనం చేస్తుండగా భీంరావ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అదే సమయంలో 108 అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకొని భీంరావ్కు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య కాంబ్లే జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పిట్లం(జుక్కల్): యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ విఠల్రెడ్డి అన్నారు.ఆయన సోమవారం మండలంలోని చిల్లర్గి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులకు సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాధాన్యత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులతో సమన్వయంగా పనిచేస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై అంజనేయులు, సిబ్బంది మురళి, ప్రియంకా తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడలో వివిధ బ్యాంకుల్లో అవగాహన కల్పించిన ిసీఐ బాన్సువాడ : బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ సీఐ శ్రీధర్ అన్నారు. సోమవారం పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో అవగాహన కల్పించారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను అవసరమైన మేరకు పరిశీలించి, వారి రాకపోకలపై ఆరా తీశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల వద్ద అమాయక ప్రజలను మాటల్లో పెట్టి మోసాలకు పాల్పడే వారిపై అప్రమత్తతతో ఉండాలని అన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు. -
ట్రాన్స్కో ఏఈ ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం : తాళం వేసి ఉన్న విద్యుత్శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని కాకతీయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న గంగాధర్ సదాశివనగర్ ట్రాన్స్కో ఏఈగా పని చేస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి గంభీరావుపేటకు వెళ్లారు. దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. సోమవారం వచ్చిన గంగాధర్ కుటుంబం ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్టీం బృందం ఆ ధారాలు సేకరించింది. బీరువాలో దాచి ఉంచిన 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆలయంలో .. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రం చౌడెకర్ కాలనీలో ఉన్న దుర్గామాత ఆలయంలో ఆదివారం రా త్రి దొంగలు హల్చల్ చేశారు. కాలనీవాసులు తె లిపిన వివరాలు.. అర్ధరాత్రి దుండగులు ఆలయ గే ట్ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి చొరబడ్డారు. సోమవారం ఆలయానికి వచ్చిన అర్చకులు గ మనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్టీంను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అమ్మ వారి విగ్రహంపై ఉన్న రోల్డ్గోల్డ్ వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. దొంగల భయంతో అమ్మ వారి బంగారు, వెండి వస్తువులను తీసి రోల్డ్గోల్డ్ నగలను పెట్టినట్లు భక్తుడు క్రిష్ణాగౌడ్ తెలిపారు.● 3 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణ -
ఆన్లైన్లో నమోదు చేయాలి
లింగంపేట: మండల కేంద్ర శివారులోని 983 సర్వే నంబర్లో గల అసైన్డ్ భూములను అటవీ భూములుగా చూపిస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు. ఈ విషయమై సోమవారం కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆర్వోఎఫ్ఆర్ భూములుగా చూపిస్తుండడంతో తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదన్నారు. ఈ భూముల్లో పండిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నామని, అసైన్డ్ భూములుగా ఆన్లైన్లో మార్చి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, రైతులు పోచయ్య, సత్తవ్వ, భూమయ్య, గంగయ్య, సాయిరాం, రాములు, పోచయ్య, బలరాం, భీమయ్య, నాగయ్య, సాయిలు, విఠల్, బాలయ్య, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీ భవనం నిర్మాణానికి భూమి విరాళం
నస్రుల్లాబాద్: మండలంలోని నూతనంగా ఏర్పడిన సంగం(ఏ) గ్రామ పంచాయతి భవనం నిర్మాణానికి గ్రామస్తుడు బంజె పరమేశమప్ప భూమిని విరాళం అందించినట్లు సర్పంచ్ తరుణ్ తెలిపారు. సోమవారం గ్రామ పెద్దల సమక్షంలో మూడు గుంటల భూమిని ఇస్తూ తీర్మానం చేశారు. ఈసందర్భంగా గ్రామ పెద్దలు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు పెద్దకాపు కిషన్, సాయిలు, శ్రీనివాస్, కాశీనాథ్, గ్రామస్తులు ఉన్నారు. బీరప్ప ఆలయానికి స్థలం కేటాయింపు పిట్లం(జుక్కల్): మండల కేంద్రం ఎల్లమ్మ కుచ్చలో బారడి పోచమ్మ ఆలయం వెనక భాగంలో సోమవారం బీరప్ప ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ బీరప్ప ఆలయానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరారని తెలిపారు. అడ్వకేట్ రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, కుర్మ,గొల్ల సంఘ సభ్యులు తదితరులున్నారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ విక్టర్ ● ప్రజావాణికి 121 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అధికారుల కు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు వచ్చా యి. వాటిలో భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులు లాంటి ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యా దులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పాండు, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకుంటున్నారు .. గ్రామంలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకుండా స్థానిక నాయకులు కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం గ్రామంలోని పిల్లలను సర్కారు బడికి పంపాలని గ్రామపంచాయితీ పెద్దలు నిర్ణయించారని తెలిపారు. మొదట్నుంచీ కామారెడ్డిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్న 9,10వ తరగతి పిల్లలకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలా ఇవ్వకుండా గ్రామంలోకి వచ్చే ప్రైవేటు పాఠశాలల బస్సులను ఆపడం, డ్రైవర్, క్లీనర్ లను బెదిరించడం చేస్తున్నారని తెలిపారు. ఈవిషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
బస్సుకోసం విద్యార్థుల రాస్తారోకో
కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మండలం లింగాయిపల్లి, కొటాల్పల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆర్టీసీ బస్సులను తమ స్టేజీల వద్ద ఆపడం లేదని సోమవారం కామారెడ్డి – రాజంపేట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే సమయంలో బస్సులు ఆపకపోవడంతో ఆలస్యమవుతోందని, చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు తెలిపారు. రాజంపేట మండలం వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పలుమార్లు అధికారులకు, ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్సుల ను నిలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సర్వీస్ను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రోగులతో కిక్కిరిసిన మద్నూర్ ఆస్పత్రి
● జ్వరం, డయేరియాతో చేరిక ● బెడ్లు సరిపోక ఒకే బెడ్పై ఇద్దరికి చికిత్స మద్నూర్(జుక్కల్): మండలంలోని పలు గ్రామాలకు చెందిన రోగులతో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం జ్వరం, డయేరియాతో బాధపడుతున్న రోగులు ఆస్పత్రిలో చేరారు. వర్షకాలం ప్రారంభమైనందున వాతావరణం మార్పులతో గ్రామాల్లో ప్రజలు వాంతులు, విరేచనాలతో బాదపడుతు ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు తెలిపారు. సోమవారం మండలంలోని అవాల్గావ్, పెద్ద తడ్గూర్, సోనాల, తడి హిప్పర్గా తదితర గ్రామాలకు చెందిన రోగులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రోగులు రావడంతో బెడ్లు దొరకక ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది ఒకే బెడ్పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం అందించారు. సోమవారం 200 పైగా రోగులు వైద్యం కో సం వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. డయేరియాతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. -
తాగునీటి సౌకర్యం కల్పించాలి..
● తానాజీ రావు, పెద్దకొడప్గల్ తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ పెద్దకొడప్గల్ మండలానికి చెందిన బీజేపీ నాయకుడు తానాజీ రావు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రం లోని నూతన ప్లాట్ల కాలనీలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఏడాది క్రితం కాలనీకి నీరందించే పైప్లైన్ చెడిపోయిందని తెలిపారు. మిషన్ భగీరధ నీరు కూడా రావడం లేదన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
పల్లెల్లో చైతన్యం!
● సర్కు సహకరిస్తున్న ఓటర్లు ● 96 పోలింగ్ బూత్లలో నూరు శాతం డిజిటలైజేషన్ ● ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ ఓటర్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టణ ఓటర్లకన్నా గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుంటారు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటుండడం గమనిస్తుంటాం. ఇప్పుడు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లోనూ గ్రామీణ ఓటర్లు అంతే ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 796 పోలింగ్ బూత్లు ఉండగా ఇప్పటికే 96 బూత్లలో వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాల(ఈఎఫ్)ను పూరించడంతోపాటు డిజిటలైజ్ ప్రక్రియ పూర్తవడం గమనార్హం. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఉత్సాహంగా బీఎల్వోల దగ్గరకు వెళ్లి మరీ తమ ఫారాలను నింపిస్తున్నారు. జిల్లాలో త్వరగా నూరు శాతం ఎన్యుమరేషన్ జరగాలన్న లక్ష్యంతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నిరంతరం అధికారులతో సమీక్షిస్తున్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఏ ఏ బూత్లలో పూర్తయ్యిందంటే.. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం సోమూర్ గ్రామంలోని పోలింగ్ బూత్లో 536 మంది ఓటర్లు ఉండగా 533 మందికి సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. మిగతా ముగ్గురు స్థానికంగా లేకపోవడం, ఓటు షిఫ్ట్ కావడం, చనిపోవడం వంటి కారణాలతో వాటిని మినహాయించారు. ఇదే మండలంలోని పిప్పిరిగడి తండాలో 152 మంది ఓటర్లకు గాను 149 మంది ఈఎఫ్ ప్రక్రియ పూర్తయ్యింది. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం అక్కాపూర్లో 1,217 మందికిగాను 1,187 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. మిగతా 30 మంది ఓటర్లు చనిపోవడం, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ కావడం వంటి కారణాలతో మినహాయించారు. ఇదే మండలంలోని రాజఖాన్పేటలో 555 మంది ఓటర్లకు గాను 520 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం తిప్పారంలో 895 మంది ఓటర్లకుగాను 828 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను పూరించారు. చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ చేసుకున్నవారు, స్థానికంగా లేకపోవడం వంటి కారణాలతో మిగతావాటిని తొలగించారు. ఇదే మండలంలోని బూర్గుల్లో 1,246 మంది ఓటర్లకు గాను 1,166 మంది ఓట్లు డిజిటలైజ్ అయ్యాయి. వివిధ కారణాలతో మిగతావాటిని పక్కన పెట్టారు. ఇలా మొత్తం 96 పోలింగ్ బూత్ల పరిధిలో ఎన్యుమరేషన్ పత్రాలను పూరించడంతోపాటు డిజిటలైజ్ చేయడం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.నియోజకవర్గం పోలింగ్ బూత్లు మొత్తం ఓటర్లు ఈఎఫ్ పత్రాల డిజిటలైజేషన్ శాతం పంపిణీ శాతం జుక్కల్ 255 2,06,343 100 1,74,882 84.75 ఎల్లారెడ్డి 274 2,28,503 100 1,95,900 85.73 కామారెడ్డి 267 2,61,160 100 1,95,637 74.91 మొత్తం 796 6,96,006 100 5,66,419 81.38 -
బాలింతల అస్వస్థతపై సమగ్ర విచారణ జరపాలి
● మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ ● నిమ్స్లో బాధితులకు పరామర్శబాన్సువాడ : బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలింతలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ ఎంసీహెచ్లో సిజేరియన్ వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విచారణ జరపకపోవడం శోచనీయమన్నారు. ఓ బాలింతను నిజామాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్తే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్యం కోసం మెడలో ఉన్న పుస్తెల తాడును అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాలింతలు ఒకచోట, వారి పిల్లలు మరోచోట ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు సైతం ఇన్షెక్షన్ సోకిందని తల్లులు చెబుతున్నారని, దీనిపై వెంటనే విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్, బీఆర్ఎస్ నాయకులు సాయిబాబా తదితరులున్నారు. -
అప్రమత్తతే కీలకం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో మార్పులు అనివార్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో రైతులు వేసే పంటల విషయంలో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఎల్నినో ప్రభావం, నష్ట నివారణ చర్యలపై సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా ప్రత్యేకాధికారిణి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, రాకేశ్రెడ్డి, లక్ష్మీకాంతరావుతో కలసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన, విద్యుత్, డీఆర్డీఏ, మున్సిపల్, ఇంజినీరింగ్ తదితర శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించడంతోపాటు పలువురు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులతో పాటు అలీసాగర్, మాసాని ట్యాంక్, మంచిప్ప రిజర్వాయర్ల నీటినిల్వను తాగునీటి అవసరాలకే వినియోగించాలన్నారు. ప్రాజెక్టులు ఈ సీజన్లో నిండే అవకాశం లేదని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలపై దృష్టిపెట్టాలని, అధికారులు సైతం ఆయా పంటల సాగు కోసం ప్రోత్సాహం అందించాలన్నారు. ఆయిల్పామ్, జొన్నలు, రాగులు, కంది, కొర్రలు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుతో ఎల్నినో లాంటి విపత్కర పరిస్థితులను సైతం రైతులు అధిగమించే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ రూపకల్పన నాటి నుంచే లోపాలు ఉన్నాయని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సైతం ప్రాజెక్ట్లో నీటిని నిల్వచేస్తే సమస్యలు వస్తాయని చెప్పిందన్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి నీటిని వినియోగించుకునే వీలులేకుండా పోయిందన్నారు.ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచే అతి తక్కువ వర్షపాతం నమోదైందని జిల్లా ప్రత్యేక అధికారి యోగితా రాణా పేర్కొన్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంకన్నా 48 శాతం తక్కువ వర్షం కురిసిందన్నారు. సెప్టెంబర్ నాటికి నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల మార్పిడికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 72 శాతం పంటల సాగు పూర్తికాగా మిగతా పంటల సాగుకోసం స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలని కోరారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆయిల్పామ్ వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఈ పంటల రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్ సాగుకు రైతులు మొగ్గుచూపాలన్నారు.జిల్లాలో చెరుకు సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచించారు. షుగర్ ఫ్యాక్టరీ సహకార సంఘం పునరుజ్జీవనానికి కృషిచేస్తామన్నారు. ఛత్తీస్గఢ్ తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులు వర్షాభావ పరిస్థితులను అవగాహన చేసుకుని ముందుకు సాగాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సూచించారు. ప్రస్తుత సమయంలో మిశ్రమ పంటల సాగు లాభదాయకమన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల మార్పు అవసరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోని నీరు ప్రస్తుతం తాగు అవసరాలకే.. ప్రాజెక్టులు నిండే అవకాశాలు లేవు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్రెడ్డి హాజరైన ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు -
ఆరుతడికి సాగుదాం!
● నీటి వాడకాన్ని తగ్గించాల్సిందే ● ఎల్నినో ప్రభావాన్ని అధిగమించాలి ● రైతులకు వ్యవసాయ శాఖ సూచనలుమాట్లాడుతున్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, వేదికపై జిల్లా ప్రత్యేకాధికారి యోగితారాణా, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, ధన్పాల్, రాకేష్రెడ్డి, కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, ఎస్పీ రాజేశ్ చంద్రసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ.. ఫలితంగా సాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యతనివ్వాలని రైతులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఎక్కువ నీరు అవసరం అయ్యే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సూచించనుంది. ఇప్పటికే అంకెలు, లెక్కలను సిద్ధం చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 248.5 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 172.60 మి.మీ. వర్షమే కురిసింది. దాదాపు 31 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో 25 మండలాలుండగా 19 చోట్ల లోటు, ఒక మండలంలో మరింత లోటు, నాలుగు మండలాల్లో సాధారణం, ఒక మండలంలో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయ్యింది. ఈనెలతోపాటు వచ్చే రెండు నెలల్లోనూ సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో జూన్లో భూగర్భ జలమట్టం 12.97 మీటర్ల లోతులో ఉండగా, జూలైలో 13.43 మీటర్లకు పడిపోయాయి. ఆగస్టులో 13.86 మీటర్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. తగ్గనున్న సాగు విస్తీర్ణం.. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.39 లక్షల ఎకరాలు కాగా.. 2023 సంవత్సరంలో 5.20 లక్షల ఎకరాల్లో, 2024లో 5.53 లక్షల ఎకరాలలో, 2025 సంవత్సరంలో 5.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి ఇప్పటివరకు 2.58 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గనుందని విశ్లేషిస్తున్నారు. ఏ నేలలో ఏ పంట వేయాలంటే.. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జూలై 16 నుంచి 31 వరకు తేలికపాటి నేలల్లో పత్తి, కందులు వేయాలని చెబుతున్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు కందులు సాగు చేయవచ్చంటున్నారు. మధ్యస్థం నుంచి బరువైన నేలల్లో జూలైలో పత్తి, కందులు, కూరగాయలు, ఆగస్టు 1 నుంచి 15 వరకు కందులు, కూరగాయలు సాగు చేయాలని సూచిస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగం ద్వారా తక్కువ నీటిని ఎక్కువ విస్తీర్ణానికి అందించవచ్చని పేర్కొంటున్నారు. భూగర్భజలాల వృద్ధి కోసం ఇంకుడు గుంతలు, ఫాంపాండ్లు తవ్వుకోవాలని సూచిస్తున్నారు. పంట ఎకరాలు అవసరమైన అందుబాటులో విత్తనం ఉన్నవి కంది 2,691 108 219 పెసర 299 24 25 మినుము 311 25 26 బబ్బెర్లు 342 41 14 వరి 1,47,280 36,820 –– మక్క 4,529 362 653 మేతజొన్న 184 18 17 మొత్తం 1,55,636 37,398 954 జిల్లాలో అతిలోటు వర్షపాతం నమోదైన గ్రామాలు : 14 లోటు వర్షపాతం నమోదైన గ్రామాలు : 428 సాధారణ వర్షపాతం నమోదైన గ్రామాలు : 32 వర్షాధార పంటలు : 1,83,312 ఎకరాలు నీటి సౌకర్యంతో వేసిన పంటలు : 1,68,834 ఎకరాలు మొత్తం : 3,52,146 ఎకరాలు సాగు చేయని భూమి : 2,03,534 ఎకరాలు -
ఘన కీర్తి గతమేనా?
● గతంలో దేశంలోనే నంబర్వన్ దవాఖానాగా బాన్సువాడ ఎంసీహెచ్ ● నేడు బాలింతల అస్వస్థతతో అభాసుపాలుబాన్సువాడ : గతంలో అత్యుత్తమ సేవలతో దేశంలో బెస్ట్ హాస్పిటల్గా నిలిచిన బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రి.. బాలింతల అస్వస్థత ఘటనతో అభాసుపాలవుతోంది. బాన్సువాడ ప్రాంతంలోని గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో 2018లో బాన్సువాడలో రూ.17 కోట్లతో 100 పడకల మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని నిర్మించారు. 2023లో ఆస్పత్రిలో సేవలు ప్రారంభమయ్యాయి. ఉత్తమ సేవలు అందడంతో బాన్సువాడ ప్రాంతంతో పాటు జుక్కల్, నారాయణ్ఖేడ్, ఎల్లారెడ్డి, మహారాష్ట్రలోని దెగ్లూర్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో గర్భిణులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందేవారు. ఎక్కువగా సాధారణ కాన్పులు జరిగేవి. ఆస్పత్రి ప్రారంభించిన ఏడాదిలోనే పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలను అందిస్తున్న దేశంలో ఏకై క ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1) సొంతం చేసుకుంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆస్పత్రులకే ఈ అక్రెడిటేషన్ ఉండడం గమనార్హం. ఐదుగురు బాలింతలకు అస్వస్థతతో.. ఎంతో ఘన చరిత్ర ఉన్న బాన్సువాడ ఎంసీహెచ్కు ఇటీవల జరిగిన సంఘటన మచ్చలా మారింది. ఈ నెల 9, 10 తేదీలలో బాన్సువాడ ఎంసీహెచ్లో ఆపరేషన్లు చేయించుకున్నవారిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారు. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు రావడంతో వారిని నిజామాబాద్ జీజీహెచ్కు.. అక్కడినుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అసలు బాలింతలు అస్వస్థతకు గురికావడానికి కారణాలేంటో వైద్యులు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లో వాడిన పరికరాలు, మందులను ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టు వస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. సంఘటనపై రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కమిటీ సభ్యుడు బాన్సువాడకు వచ్చి ఆపరేషన్ థియేటర్లో పరికరాలు, మందుల వివరాల రికార్డులను తనిఖీ చేసి వెళ్లారు. ఒకేసారి ఐదుగురు బాలింతలు అనారోగ్యం బారిన పడడంతో అపరేషన్ థియేటర్ను వారం రోజులు మూసి ఉంచారు. బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనతో ఇక్కడ కాన్పులు చేయించుకోవడానికి గర్భిణులు జంకుతుండడం గమనార్హం. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.


