breaking news
Kamareddy
-
దుబాయిలో లక్కంపల్లి యువకుడి మృతి
నందిపేట్: బతుకు దెరువు కోసం దుబాయి వెళ్లిన నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన పస్కరాజు(25) గుండెపోటు తో మృతి చెందాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఆదివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పస్కరాజు తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. దీంతో కుటుంబ బారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లిన అతను బుధవారం ఉదయం బాత్రూంకు వెళ్లి గంట అయిన బయటకు రాకపోవడంతో తోటి పని చేసే వారు ఎంత పిలిచినా పలకకపోవడంతో వాష్రూంలు క్లీన్ చేసే వారికి సమచారం అందించారు. వారు బాత్రూం తలుపులు పగుల గొట్టి చూడగా నోటిలో బ్రష్తో కుప్పకూలి చనిపోయి ఉన్నాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాజు కుటుంబీకుల రోదనలు మిన్నంటుతున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని జాన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన హరిచంద్(40) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. హరిచంద్ ఉపాధి నిమిత్తం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల శివారులో పడకల్ గ్రామానికి ఆరు నెలల క్రితం వెళ్లాడు. శనివారం రాత్రి పడకల్ గ్రామ శివారులో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటన స్థలిలో మృతి చెందాడు. -
అన్నీ హస్తగతం!
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకోసం సోమవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ముందుగా నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. సింగిల్ నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే చేతులెత్తే పద్ధతిన ఎన్నిక నిర్వహిస్తారు. బీజేపీకి నిరాశేనా? కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. మున్సిపల్ చైర్మన్ పీఠం కై వసం చేసుకునేందుకు 25 మంది సభ్యుల బలం అవసరం. 19 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్లో ముగ్గురు స్వతంత్రులు చేరడంతో వారి బలం 22కు పెరిగింది. మరో ముగ్గురు సభ్యుల బలం అవసరం కావడంతో చైర్మన్ పీఠంపై పీఠముడి ఏర్పడింది. బీజేపీకి 16 సీట్లు, బీఆర్ఎస్కు 11 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీలు మద్దతుకోసం బీఆర్ఎస్ను సంప్రదించాయి. అయితే కాంగ్రెస్తో అవగాహనకే బీఆర్ఎస్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ తీసుకుంటుండగా.. వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే రెండుచొప్పున కోఆప్షన్ పదవులు పంచుకోవడానికి ఆ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీకి నిరాశ ఎదురయ్యే అవకాశాలున్నాయి.బాన్సువాడ చైర్పర్సన్గా కాసుల విజయ! బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ భార్య విజయను ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైస్ చైర్మన్ పదవిపై స్పష్టత రాలేదు. రేష్మ బేగంతో పాటు ఖాలెక్ ఈ పదవిని ఆశిస్తున్నారు. బిచ్కుంద చైర్పర్సన్గా సీమా షెట్కార్! కొత్తగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీ తొలి చైర్పర్సన్గా సీమా షెట్కార్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవి భాగ్యలక్ష్మి, గంగాధర్లలో ఒకరికి దక్కవచ్చంటున్నారు. ఉమారాణికామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. చైర్మన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ను, వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ను ఎన్నుకోనున్నట్లు సమాచారం. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యత ఉండడంతో ఆ పార్టీకి చెందినవారే చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నిక కానున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి12 వార్డులున్న ఎల్లారెడ్డి బల్దియాలో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. అయితే చైర్మన్ పదవిని ఇద్దరు ఆశిస్తుండడంతో పదవిపై స్పష్టత రాలేదు. మొదటినుంచి మాజీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పేరు వినిపిస్తోంది. అయితే ఈ పదవిని మత్తమాల భాగ్యమ్మకు ఇవ్వాలని ఒత్తిడి రావడంతో నిర్ణయాన్ని సస్పెన్స్లో ఉంచారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు కౌన్సిలర్లతో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. వైస్ చైర్మన్ పదవి విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. కామారెడ్డిలో బీఆర్ఎస్తో అవగాహన చైర్మన్ పదవి కాంగ్రెస్కు, వైస్ చైర్మన్ బీఆర్ఎస్కు.. మిగతా మూడు చోట్ల పదవులన్నీ అధికార పార్టీ ఖాతాలోకే... -
నేడే ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లు హాజరు కాగానే వారితో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు. చైర్మన్ అభ్యర్థిని కౌన్సిలర్లు ఒకరు ప్రతి పాదిస్తారని, మరొకరు బలపరుస్తారన్నారు. అనంతరం చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక జరుగుతుందని తెలిపారు. పదవులన్నీ కాంగ్రెస్ పార్టీకే... ఎల్లారెడ్డి మున్సిపల్లో 12 వార్డులకు 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవి వారికే దక్కనుంది. బీఆర్ఎస్ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందడంతో వారి బలం అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పదవులను సొంతం చేసుకోనుంది. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. క్యాంపు నుంచి నేరుగా సోమవారం వారు మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని నస్రుల్లాబాద్–లింగంపల్లి రహదారిపై ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిపోయింది. నస్రుల్లాబాద్ నుంచి బైరాపూర్ వైపునకు బైక్పై వెళ్తున్న ఇద్దరు మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో పొలంలోకి పడిపోయారు.వాహనదారులు పొలంలో పడిన బైక్ను బయటకుతీశారు.బైక్పై ఉన్న వారికి స్వల్పగాయాలయ్యాయి. ఇసుక అక్రమ నిల్వల జప్తు రెంజల్: మండలంలోని నీలా శివారులో అక్రమంగా డంప్ చేసిన 18 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను జప్తు చేసినట్లు తహసీల్దార్ శ్రావణ్కుమార్ తెలిపారు. శనివారం బోధన్ మండలం కొప్పెర్గా గ్రామం నుంచి తీసుకొచ్చి రెంజల్ మండలం నీలా పెద్ద వాగు వద్ద నిల్వలు చేసినట్లు అందిన సమాచారం మేరకు ఆదివారం రెవెన్యూ సిబ్బంది చేరుకుని పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎస్సై చంద్రమోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ కార్యాలయానికి తరలించారని తెలి పారు. మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. -
యూరియా పంపిణీపై రైతుల ఆందోళన
రుద్రూర్: మండల కేంద్రంలోని సింగిల్ విండో పరిధిలోని రైతులకు యూరియా పంపిణీ చేయడంలో సహకార సంఘం సిబ్బంది పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆదివారం ఆందోళన చేశారు. కొందరు రైతులకు మాత్రమే యూరియా పంపిణిలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం విండోకు యూరియా చేరుకున్నప్పటికీ, ఆదివారం పండుగ రోజు సైట్ను తెరిచి కొందరికి మాత్రమే పంపిణీ చేయాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా స్టాక్ ఉన్నట్లు శనివారం యాప్లో ఎందుకు చూపలేదని కార్యదర్శి గంగాధర్ను నిలదీశారు. సన్నిహితులకు మాత్రమే పంపిణీ చేయడానికి సెలవు రోజున కొందరిని పిలిపించి ఇస్తున్నారని మండిపడ్డారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, మండల వ్యవసాయ అధికారి తక్షణమే వచ్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే అవసరం లేని మందులను అంట గట్టి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. యూరియా అందని రైతులు పేర్లు నమోదు చేసుకుని మరో విడత రాగానే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అంగీకారం మేరకు రైతులు శాంతించారు. -
అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి సంగమణి(49) అనే మహిళ కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. కుమారుడు రాజు ఇటీవల ఆమెకు ఆస్పత్రిలో వైద్యం చేయించి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. జీవితంపై విరక్తితో శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామంలో నివాసపు గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన ముత్యంగారి శకుంతల శనివారం రాత్రి తన నివాసపు గుడిసెకు తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లిందన్నారు. అర్ధరాత్రి ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో గుడిసెలో ఉన్న బియ్యం, బట్టలు, నగదు, ఇతర వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాంలో రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
క్రికెట్ క్రీడా సామగ్రి వితరణ
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లోని గ్రామ యువజన సంఘానికి ఆదివారం సర్పంచ్ బైకాని జమున, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్ క్రికెట్ క్రీడా సామగ్రిని వితరణ చేశారు. కార్యక్రమంలో ముఖేష్, తిరుపతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జమున మహేశ్ మాట్లాడుతూ యువకులకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో యువజన సభ్యులు వంకాయల తిరుపతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘ట్రావెల్ సేఫ్’!
కామారెడ్డి క్రైం: సమాజంలో మహిళలు, బాలికలకు భద్రత కరువవుతోంది. బస్సు, క్యాబ్, మరేదైనా అద్దె వాహనంలో మహిళలు, బాలికలు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడాల్సిన పరిస్థితులున్నాయి. వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేదాకా కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకుండదు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా టీ–సేఫ్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర రాజధానిలో ఇప్పటికే అమలవుతున్న ఈ యాప్ సేవలపై జిల్లాలోనూ విస్తృతంగా అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. షీటీం బృందంలోని మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో వీడియోను సైతం రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. భద్రతా కవచంలా.. మహిళల ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే ఉద్దేశంతో 2024 మార్చి 12న టీ–సేఫ్ (ట్రావెల్ సేఫ్) అనే అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆమె తన గమ్యస్థానానికి క్షేమంగా చేరుకునే వరకు తోడుగా ఉండటమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. దీనిని మహిళలందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యాప్ పనిచేస్తుందిలా.. ప్లేస్టోర్నుంచి టీ–సేఫ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ● ప్రయాణం మొదలుపెట్టే ముందు ఎక్కడికి వెళ్లాలో ఎంచుకుని, తాము ఎక్కిన వాహనం(ఆటో, బస్సు, కారు, రైలు) వివరాలను యాప్లోని సిటిజన్ విభాగంలో నమోదు చేయాలి. ఆ వెంటనే ప్రయాణికురాలి మొబైల్కు ఒక మెసేజ్ అలర్ట్ వస్తుంది. ● ప్రయాణం మొదలైనప్పటి నుంచి పోలీసుల పర్యవేక్షణ ప్రారంభమవుతుంది. మీ లొకేషన్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి వాయిస్ కాల్ వస్తుంది. ప్రయాణికురాలు సురక్షితంగా ఉంటే ’1’ అని, ఏదైనా ప్రమాదం గానీ, అసౌకర్యం గానీ అనిపిస్తే ’2’ అని నొక్కాలి. ఆ తర్వాత భద్రత నిశ్చయం కోసం ముందుగా సెట్ చేసుకున్న 4 అంకెల పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. ఒకవేళ ప్రతిస్పందన సరిగ్గా లేకపోయినా, అన్సేఫ్ అని బటన్ నొక్కినా వెంటనే కంట్రోల్ రూమ్ అప్రమత్తమై సహాయం అందిస్తుంది. ● ఒకవేళ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ట్రిప్ పూర్తయిందని మొబైల్కు ఎస్సెమ్మెస్ రావడంతో ఆ ప్రయాణం విజయవంతంగా ముగుస్తుంది. ఈ విధంగా టీ–సేఫ్ యాప్ మహిళల ప్రతి ప్రయాణంలో ఒక అదృశ్య రక్షణ కవచంలా పర్యవేక్షిస్తుంది. నేటి కాలంలో ప్రతిఒక్కరూ సెల్ఫోన్ వాడుతున్నారు. కాబట్టి ప్రతి మహిళ యాప్ వాడకంపై అవగాహన పెంచుకోవాలనీ, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేలా జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు.ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులకు భద్రత కల్పించే ఉద్దేశంతో గతేడాది నుంచి పోలీసు శాఖ ‘ట్రావెల్ సేఫ్’ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. ఆటోలు, క్యాబ్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఈ యాప్ సేవలను వినియోగించుకోవాలి. పోలీస్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో ఉండే ఈ యాప్ను ఉపయోగిస్తే సురక్షితంగా గమ్య స్థానాలకు చేరేలా భద్రత ఉంటుంది. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి మహిళల భద్రతకు ప్రత్యేక యాప్ మహిళలు, యువతుల సురక్షిత ప్రయాణానికి భరోసా విస్తృతంగా ప్రచారం చేస్తున్న జిల్లా పోలీసు శాఖ -
ఆ నలుగురు కాంగ్రెస్లోకి.. వెళ్లలేదు!
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో బీఆర్ఎస్ టికెట్టుపై గెలిచిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరినట్లు ఆదివారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది పట్టణంలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్కు చెందిన 18వ వార్డు కౌన్సిలర్ మిర్జా హఫీజ్ బేగ్, 45, 46, 47 వార్డుల కౌన్సిలర్లు పిట్ల వేణు, గెరిగంటి లక్ష్మీనారాయణ, స్వప్న కాంగ్రెస్ గూటికి చేరారన్న వార్త వైరల్ అయ్యింది. అయితే వెంటనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు రంగంలోకి దిగారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పష్టత ఇచ్చారు. పార్టీ మారారని ప్రచారం జరిగిన నలుగురు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్లతో కలిసి ఉన్న వీడియోలను విడుదల చేశారు. -
కొనసాగుతున్న నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,800 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలవుతోంది. నీటిని సద్వినియోగం చేసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులు కోరారు. ● 49 వార్డుల్లో 30 మంది మొదటిసారి ఎన్నిక కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీ ఈసారి సరికొత్త శోభను సంతరించుకోనుంది. మార్పును కోరుకున్న ఓటర్లు.. కొత్తవారికి అవకాశం ఇచ్చారు. దీంతో ఈసారి ఏకంగా 30 మంది మొదటిసారి కౌన్సిల్లో అడుగుపెట్టబోతున్నారు. వీరి కుటుంబ సభ్యులెవరికీ గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులున్నాయి. ఇటీవల నిర్వహించిన ఎన్నికలలో 30 మంది కొత్తవారు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బీజేపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 11 మంది, బీఆర్ఎస్ నుంచి ఐదుగురు, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి.. ధరావత్ మోతీలాల్ (2వ వార్డు), షేక్ జావీద్ (4), నిట్టు గంగాధర్ (6), లలిత కొత్తపల్లి (13), హర్షిత (14), కల్లెం సావిత్రి (20), ఆఫ్రీన్ సుల్తానా (22), సుల్తానా బేగం (23), అబ్దుల్ వాజిద్ (24), ఫాతిమ (30), గ్యార అఖిల (32). బీజేపీ నుంచి.. ఏనుగు శ్రీధర్రెడ్డి (8వ వార్డు), బండారి నరేందర్రెడ్డి (9), కాసర్ల మాధవి (10), యాడారం ప్రియాంక (16), భానుప్రకాష్ (19), దాకి అరవింద్ రాజ్ (25), గంట మధు (26), కుంట లక్ష్మారెడ్డి (33), వినోద (35), కై ర రాహుల్ (36), వంశీకృష్ణ (43), ప్రీతి ఘోరావత్ (44). బీఆర్ఎస్ నుంచి.. ఫరీన్ ఖాతూన్ (7వ వార్డు), లోలం శ్రీనివాస్ (17), గోపు బాలమణి (27), మామిండ్ల లక్ష్మణ్ (28), అజీజ్ హుస్సేన్ (31). స్వతంత్రులు : షేక్ బబ్లూ (3వ వార్డు), ఇప్ప ఉమారాణి (38వ వార్డు). ప్రశాంతంగా ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్ష ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లాలోని 12వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ పరిధిలో ఆదివారం ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ పరీక్షను నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. 247 మంది క్యాడెట్స్ పరీక్షకు హాజరయ్యారు. నిజామాబాద్ గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రాజేశ్ కపూర్ మాట్లాడుతూ ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ సాధించిన క్యాడెట్లకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ఎన్సీసీ దోహదపడుతుందన్నారు. -
సేవాలాల్ బోధనలు అనుసరణీయం
సంత్ సేవాలాల్ మహారాజ్ సందేశం, బోధనలు, సూచనలు ప్రజలందరికి అనుసరణీయమని బంజారా సేవ సంఘం నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు తండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సేవాలాల్ అందరికి ఆదర్శ ప్రాయుడని, మహారాజ్ వ్యక్తి కాదు శక్తి అని, ఆయన అద్భుతాలు చేశారని తెలియజేశారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణాల్లో భోగ్ భండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
ఎవరి ప్రయత్నాలు వారివే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. సోమ వారం ఎన్నికకు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామా బాద్ కార్పొరేషన్తోపాటు బోధన్, కామారెడ్డిలో హంగ్ నెలకొనడంతో ఎవరు మేయర్, చైర్పర్సన్లు అవుతారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బోధన్ విషయంలో కొంతమేర ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఆదివారం రాత్రికి కొలిక్కి వచ్చినట్లు తె లుస్తోంది. కాంగ్రెస్తో కలిసి వెళ్లేందుకు ఎంఐఎం అభ్యర్థులు వ్యతిరేకించగా, దారుస్సలాం నుంచి వ చ్చిన ఆదేశాల మేరకు అంగీకరించారు. చైర్మన్గా శరత్రెడ్డిని మొదట అంగీకరించకపోయినా.. ఎంఐఎం అధినాయకత్వం సూచనల మేరకు చివరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నిజామాబాద్ మేయర్ విషయంలో మాత్రం ఎనలేని ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. మేయర్ కోసం నలుగురు మహిళా ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. ఎవరి స్థాయిలో వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తున్నప్పటికీ మ్యా జిక్ ఫిగర్కు సమీపంలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూ హం అనుసరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఉంది. అయితే చైర్పర్సన్లుగా ఎవరు అవుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.ఇందూరు మేయర్ ఎవరో? కొనసాగుతున్న ఉత్కంఠ కాంగ్రెస్కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం బోధన్లోనూ కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కౌన్సిల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ ఆర్మూర్, భీమ్గల్లలో అధికార పార్టీకే అన్ని పదవులు -
ఉత్సాహం లేని వనమహోత్సవం
బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రా ధాన్యమిస్తూ గత ప్రభుత్వం పదేళ్లపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్ర స్తుతం నీరుగారిపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడిన తర్వాత హరితహారం పేరను వనమహోత్సవంగా మార్చారు. అయితే ప్రతి ఏటా మొక్కలు నాటే లక్ష్యాన్ని తగ్గించుకుంటూ పోతున్నారని, ఈ కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, కూలీలకు ఉపాధి దొరకడం లేదని పలువురు పేర్కొంటున్నారు. నత్తనడకన పనులు గతంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి వేలాది మొక్కలను సిద్ధం చేసేవారు. పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు, మూడుచోట్ల నర్సరీలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం వనమహోత్సవ లక్ష్యం తగ్గిపోవడంతో ఉమ్మడి గ్రామ పంచాయతీల వారీగా నర్సీరీలు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నుంచే ఎర్రమట్టి సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్, సీడ్ బిడ్డింగ్ లాంటి పనులు ప్రారంభం అయ్యేవి. ఈసారి అనుమతులు ఆలస్యంగా రావడంతో నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. జూన్నాటికి సిద్ధమయ్యేనా? జనవరి నెలాఖరుకు వచ్చినా సీడ్ బిడ్డింగ్, గ్రీన్నెట్ ఏర్పాటు, వనసేవకుల నియామకం తదితర పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వనమహోత్సవంలో భాగంగా జూన్ వరకు జిల్లాలోని 527 నర్సరీల్లో సుమారు 14లక్షల 46వేల మొక్కలను సిద్ధంగా ఉంచాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతినర్సరీలో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ, ఉసిరి, అల్లనేరేడు, చింత, మామిడి, సీతాఫలం, దానిమ్మ, బాదం, కర్జూరవంటి మొక్కలను పెంచాలని నిర్ణయించారు. పండ్లమొక్కలతోపాటే గులాబీ, మల్లె, మందారం తదితర పూల మొక్కలను అందుబాటులో ఉంచాలని ప్రణాళిక చేశారు. కాలం సమీపిస్తున్న తరుణంలో జూన్నాటికి మొక్కలు సిద్దమై వనమహోత్సవ లక్ష్యం నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే. సగానికి తగ్గిన లక్ష్యంగతేడాదితో పోలిస్తే వనమహోత్సవంలో భా గంగా నాటే మొక్కల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది. గతేడాది జిల్లాలోని 527 గ్రామ పంచాయతీల్లో 23లక్షల 22వేల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని మొక్కలు నాటించారు. కానీ ఈసారి అధికారులు లక్ష్యాన్ని 14 లక్షల 46 వేలకు కుదించారు. గతేడాది ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు 4వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న అధికారులు ఈసారి 2వేల మొక్కలకే పరిమితం చేశారు. ఏటేటా తగ్గుతున్న ప్రభుత్వ లక్ష్యం నర్సరీల్లో ప్రారంభానికి నోచుకోని పనులు ఈ ఏడాది జిల్లా లక్ష్యం 14లక్షల 46వేల మొక్కలే.. -
క్రైం కార్నర్
● మహిళకు తీవ్ర గాయాలు రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని రైస్ మిల్లులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళా కూలికి తీవ్ర గాయాలైనట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులమ్మ మిల్లులో కూలి పని చేస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మిల్లును ఊడుస్తుండగా ఆమె చీర యంత్రంలోని బెల్ట్కు చిక్కుకుంది. దీంతో ఆమె బెల్ట్పై పడిపోయి యంత్రంలోకి లాగబడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లకు, కుడి చేతికి గాయాలయ్యాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
టెన్త్ విద్యార్థులకు ఉపశమనం
● నేటి నుంచి అల్పాహారం ప్రారంభం బాన్సువాడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వం వారికి సోమవారం నుంచి అల్పాహారం అందించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఏటా 3 నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. గత ఏడాది 38 రోజుల పాటు విద్యార్థులకు అల్పాహారం అందించగా ఈ సంవత్సరం ప్రత్యేక తరగతులు ప్రారంభమై నెలలు గడిచినా అల్పాహారం అందించలేదు. దీంతో ఉదయం సాయంత్రం విద్యార్థులు అర్థాకలితో ప్రత్యేక తరగతులకు హాజరయ్యారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇంటి వద్ద టిఫిన్ తింటే తరగతులకు ఆలస్యం అవుతుందని తినకుండా వచ్చేస్తుంటారు. దీంతో చదువుకునే సమయంలో ఆకలి వేస్తుండటంతో చదువు ఒంటపట్టడం లేదని అల్పాహారం అందించాలని విద్యార్థులు కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి అల్పాహారం అందించేందుకు సిద్ధమైంది. పోషక విలువలతో కూడిన స్నాక్స్.. విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం ఉడికించిన శనగలు, పెసర్లు, బెబ్బర్లు, వేరుశనగ పల్లీలతో పాటు బెల్లం వంటి పోషకాలతో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిపాయ పకోడి, ఆలు బజ్జీ వంటివి రోజుకోరకం అందించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది. టెన్త్ విద్యార్థులు 13,225 మంది.. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకులాలు, ప్రయివేట్ పాఠశాలల్లో కలిపి మొత్తం 13వేల 225మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. కాని వాటిలో 182 జెడ్పీ హైస్కూల్స్లో చదువుకునే విద్యార్థులు సుమారు 7 వేల మంది ఉన్నారు. వీరికి మాత్రమే సాయంత్రం స్నాక్స్ స్కీం వర్తించనుంది. మార్చి 10 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఒక్కో విద్యార్థికి ప్రతిరోజూ రూ.15 ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేశారు. అల్పాహారం అందించే రోజులు తగ్గించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కనీసం ఫిబ్రవరి 1 నుంచైనా ప్రారంభించి పరీక్షలు పూర్తయ్యే వరకు అమలు చేయాల్సిందని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఘనంగా ఉత్సవాలు ప్రారంభం
● బిచ్కుందలోని సద్గురు బస్వలింగప్ప స్వామి మఠానికి 1058 ఏళ్ల చరిత్ర ● మూడు రెండు రోజుల పాటు..బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ప్రాచీన సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం శివభక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా మారి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. మూడు రోజులు కొనసాగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు ప్రతీ ఏటా వేలాది మంది భక్తులు వస్తున్నారు. అంగరంగ వైభవంగా కొనసాగనున్న ఉత్సవాలకు మఠం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి స్టేజ్ను కై లాస పర్వతంగా అలంకరించారు. 17 వరకు ఉత్సవాలు జరగనున్నాయి మఠం పీఠాధిపతిసోమలింగ శివాచార్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం, మహారుద్రాభిషేకం, రథోత్సవం, లింగదీక్ష పూజలు, అన్నదానం చేపట్టనున్నారు. 968లో సంస్థాన్ స్థాపన.. దక్షిణ కాశీగా పిలువబడే సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం సంస్థాన్, శివాలయానికి పెద్ద చరిత్ర ఉంది. 968వ సంవత్సరంలో ఈ మఠం కొలువుదీరింది. నేటికి 1,058 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆనాడు సంస్థాన్ పీఠానికి మూల పురుషుడు గురులింగప్ప పట్టాచార్యమూర్తి 968వ సంవత్సరంలో ప్రథమ ఫీఠాధిపతిగా ఉన్నారు. రెండో పీఠాధిపతి వీర బస్వయ్యప్ప పట్టాచార్యమూర్తి. నేడు 30వ పీఠాధిపతిగా సోమలింగ శివాచార్య స్వామి కొనసాగుతున్నారు. బిచ్కుంద, బాన్సువాడ బోర్లం గుట్ట శివాలయం, నారాయణ్ఖేడ్ బోరంచ గ్రామంలో నల్లపోచమ్మ దేవాలయం, సికింద్రాబాద్లో శంకర్ మఠం్, శివాలయ దేవస్థానాలు వెయ్యి ఏళ్ల నుంచి బిచ్కుంద మఠం్ సంస్థాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. నేడు రథోత్సవం.. ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల పాటు అంగరంగా వైభవంగా జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు శివ పార్వతుల కల్యాణ మహోత్సవం, రుద్రాభిషేకం, భక్తి సాంస్కృతిక, దీక్ష కార్యక్రమాలు, సోమవారం అంగరంగ వైభవంగా రథోత్సవం, అన్నదానం, దీపాల అలంకరణ, మంగళవారం లక్ష బిల్వార్చన, కుస్తీపోటీలు, తీర్ధప్రసాదాలతో ఉత్సవాల ముగింపు ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్, నారాయణ్ఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల నుంచి లక్షల మంది భక్తులు బిచ్కుంద మఠం సంస్థాన్, శివాలయ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అంగరంగా వైభవంగా మూడు రోజులు మఠంలో మహా శివరాత్రి, జాతర ఉత్సవాలు 1,054 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. ఈ మఠం స్థాపన జరిగి వెయ్యేళ్లు అయినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. నేను 30వ పీఠాధిపతిగా కొనసాగుతున్నాను. ఈ మఠం అత్యంత పవిత్రంగా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. భక్తులు అందరు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – సద్గురు సోమలింగ శివాచార్య స్వామి, బస్వలింగప్ప స్వామి మఠం పీఠాధిపతి, బిచ్కుంద -
దోమకొండలో ఉర్దూ కవి సమ్మేళనం
దోమకొండ: దోమకొండ పోర్ట్ అండ్ విలేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం గడికోటలో ఉర్దూ కవి సమ్మేళనం నిర్వహించారు. ఆధునిక ఉర్దూ సాహిత్యం, ఆధునిక కవులు వారి రచనలు, సమాజంపై వాటి ప్రభావం అంశాలపై అమెరికాలోని విలియం ప్యాటర్సన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మీర్ అమీర్ హుస్సేన్ మాట్లాడారు. మంజీర కాలేజీ ఉ ర్దూ విభాగం విద్యార్థులు కవితలు చెప్పారు. చివరలో ఖవాలి నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ఇంటెక్ కన్వీనర్ షాహద్ షాహిద్, హైదరాబాద్ ఇంటెక్ కన్వీనర్ అనురాధారెడ్డి, కవులు వినయ్వర్మ, యాసిర్ మ హమ్మద్ రేపాయ్, అలీనా తర్జీన్, మోహిన్ర హీ, రహీల్ కరీంనగరీ, గడీకోట వారసులు కామినేని అనిల్కుమార్, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, సర్పంచ్ నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్లోకి స్వతంత్రులు.. కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలో గెలుపొందిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదా రు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 40వ వార్డునుంచి పోటీ చేసిన నాగమణి, 38వ వార్డు నుంచి గెలిచిన ఇప్ప ఉమారాణి, మూడో వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న షేక్ బబ్లూలకు షబ్బీర్ అలీ కాంగ్రెస్ కండువాలు కప్పారు. డిచ్పల్లి పోలీస్ సబ్ డివిజనల్కు ఆమోదం! నిజామాబాద్అర్బన్: డిచ్పల్లి కేంద్రంగా పోలీస్ సబ్ డివిజనల్ ఆఫీసు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జిల్లా పోలీస్ శాఖ డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలను పంపించింది. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉండడంతో సబ్ డివిజనల్ ఏర్పాటు కు సంబంధించిన ప్రక్రియను పోలీస్ శాఖ పూర్తి చేసింది. ప్రస్తుతం నిజామాబాద్ డివి జన్ పరిధిలో ఉన్న 15 పోలీస్ స్టేష న్లలో నుంచి ఏడింటిని డిచ్పల్లి సబ్ డివిజనల్కు కేటాయించారు. ఇందులో మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్పల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లు న్నాయి. ఇటీవల జిల్లాకు డీజీపీ శివధర్రెడ్డి వచ్చిన సందర్భంలో సబ్ డివిజనల్ ఏర్పాటుపై సీపీ చర్చించగా ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. డీఎస్పీగా రాజా వెంకటరెడ్డి! డిచ్పల్లి పోలీస్ సబ్ డివిజనల్ ఏర్పాటుకు డీఎస్పీగా రాజావెంకటరెడ్డి నియమితుల య్యే అవకాశం ఉంది. నిజామాబాద్ ఏసీపీ గా పని చేసిన ఆయనను ఇటీవల బదిలీ చే స్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే నూతన డివిజనల్ ఏర్పాటుతోపా టు డీఎస్పీ నియామకం ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
నాడు పతుల్.. నేడు సతుల్..
బాన్సువాడ : రాజకీయాలలో వారసత్వాలు సా ధారణమయ్యాయి. పలుచోట్ల గత కౌన్సిల్లో భర్తలు ప్రాతినిధ్యం వహించగా ఈసారి వారి భార్యలకు అవకాశం దక్కింది. 2020 ఎన్నికలలో 5వ వార్డునుంచి గెలిచిన కాసుల బాల్రాజ్కు ఈసారి రిజర్వేషన్ అనుకూలించలేదు. దీంతో ఆయన భార్య విజయ బరిలో నిలిచి గెలిచారు. ఎనిమిదో వార్డుకు గతంలో దొన్కంటి వెంకటి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి ఆయన భార్య శ్యామల పోటీ చేసి విజయం సాధించారు. 14 వార్డు కౌన్సిలర్గా వ్యవ హ రించిన నార్ల నందకిషోర్కు ఈసారి రిజర్వేషన్ కలసిరాలేదు. దీంతో ఆయన భార్య వసంత పోటీ చేసి గెలుపొందారు. గత కౌన్సిల్లో జంగం గంగాధర్ చైర్మన్గా వ్య వహరించారు. ఈసారి ఆయన కుమారుడు జంగం రాజశేఖర్ 2వ వార్డునుంచి పోటీ చేసి గెలిచారు. బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఇ ద్దరు కౌన్సిలర్లు వరుసగా రెండోసారి విజయం సాధించారు. 4వ వార్డు నుంచి గైక్వాడ్ రుక్మిణి పోటీ చేసి గెలిచారు. ఆమె గత కౌన్సిల్లోనూ సభ్యులుగా ఉన్నారు. 11వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికై న గడుమల లింగమేశ్వర్ కూడా గత కౌన్సిల్ సభ్యుడే.. గడుమల లింగమేశ్వర్ రుక్మిణి గైక్వాడ్ కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలోని 45వ వార్డులో పిట్ల వేణు కుటుంబానికి గట్టి పట్టు ఉంది. రెండు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి చెందినవారే ఇక్కడ కౌన్సిలర్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2005లో పిట్ల వేణు తల్లి చంద్రకళ పోటీ చేసి గె లిచారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల లో ఆయన భార్య విద్య కౌన్సిలర్గా ఎన్నిక య్యారు. పిట్ల వేణు 2020లో గెలిచి.. తాజా ఎన్నికలలోనూ గెలిచి మరోసారి కౌన్సిల్లో అడుగు పెట్టబోతున్నారు.కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో ఎన్నిక ల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులకు కనీ సం ఒక్క ఓటు కూడా పడలేదు. ఆరో వార్డునుంచి బరిలో నిలిచిన రాజు, 19వ వార్డు నుంచి పోటీ చేసిన మహ్మద్ ఇక్రమ్, మూడో వార్డునుంచి పోటీపడిన మహిపాల్లకు సున్నా ఓట్లు నమోదయ్యాయి. వీరంతా స్వతంత్ర అభ్యర్థులు. కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియా ఎన్నికలలో పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్థులకు అతిస్వల్ప ఓట్లు వచ్చాయి. ఓ అభ్యర్థికి ఒక్కటే ఓటు రావడం గమనార్హం. మరో అభ్యర్థికి రెండు ఓట్లు పడ్డాయి. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. 254 మంది ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలపగా.. బీజేపీ 48 వార్డుల్లో, ఎంఐఎం 8 చోట్ల, జనసేన 7, టీఆర్ఏపీ 6, సీపీఎం 3, బీఎస్పీ, ఏఐఎఫ్బీ, ఆప్ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. స్వతంత్రులు 81 మంది బరిలో ఉన్నారు. కాగా ఈ ఎన్నికలలో ఆప్ అభ్యర్థికి ఒక్క ఓటు పోలవగా.. బీఎస్పీ అభ్యర్థికి రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఏపీకి పోలైన మొత్తం ఓట్లు 35 మాత్రమే. ఏఐఎఫ్బీకి 54 ఓట్లు, జనసేనకు 247 ఓట్లు, సీపీఎంకు 357 ఎంఐఎంకు 806 ఓట్లు వచ్చాయి. 81 మంది స్వతంత్రులకు కలిపి 6,435 ఓట్లు రాగా.. 580 ఓట్లు చెల్లుబాటు కాలేదు. నోటాకు 1,414 మంది ఓటేశారు. -
ఓటరు దేవుడు.. అందరివాడు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పురపోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సంపాదించినప్పటికీ.. ఓటర్లు ప్రతిపక్షాలకూ తగిన ప్రాధాన్యతనిచ్చా రు. నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 92 వార్డు లు ఉండగా కాంగ్రెస్ ఖాతాలో 50 స్థానాలు చే రాయి. బీజేపీ 19, బీఆర్ఎస్ 17 వార్డుల్లో గెలుపొందాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. కామారెడ్డిలో మాత్రం హంగ్ ఏర్పడింది. కాగా నాలుగు మున్సిపాలిటీలలో కలిపి 1,03,896 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్కు 37.46 శాతం ఓట్లు వచ్చా యి. బీఆర్ఎస్ పార్టీకి 26.69 శాతం, బీజేపీకి 22.31 శాతం ఓట్లు రావడం గమనార్హం. కామారెడ్డిలో పోటాపోటీగా.. జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 32.98 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 28.36 శాతం ఓటర్ల మద్దతు లభించింది. బీఆర్ఎస్కు 26.06 శాతం మంది ఓటేశారు. బాన్సువాడలో మూడింటికి.. బాన్సువాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 38.80 శాతం ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్కు 25.97 శాతం, బీజేపీకి 17.44 శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది. ఎల్లారెడ్డిలో వన్సైడ్! ఎల్లారెడ్డి బల్దియాలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చారు. ఇక్కడ పోలైన ఓట్లలో 58.34 శాతం అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. బీఆర్ఎస్కు 28.21 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి నామమాత్రంగా 6.20 శాతమే ఓట్లు పోలయ్యాయి. బిచ్కుందలో కాంగ్రెస్కు భారీగానే.. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 42.33 శాతం ఓటర్ల మద్దతు లభించింది. బీఆర్ఎస్కు 30.52 శాతం, బీజేపీకి 8.38 శాతం ఓట్లేశారు. మున్సిపాలిటీలవారీగా పార్టీలకు పోలైన ఓట్ల వివరాలు.. బల్దియా మొత్తం పోలైన కాంగ్రెస్ శాతం బీజేపీ శాతం బీఆర్ఎస్ శాతం ఓట్లు ఓట్లు కామారెడ్డి 99,313 65,483 21,598 32.98 18,571 28.36 17,069 26.06 ఎల్లారెడ్డి 13,265 10,581 6,173 58.34 665 6.20 2,985 28.21 బాన్సువాడ 24,188 17,818 6,914 38.80 3,109 17.44 4,625 25.97 బిచ్కుంద 12,759 10,014 4,239 42.33 840 8.38 3,057 30.52 మొత్తం 1,49,525 1,03,896 38,924 37.46 23,185 22.31 27,739 26.69మూడు పార్టీలకూ ఆదరణ నాలుగు మున్సిపాలిటీల్లో 92వార్డులు కాంగ్రెస్కు 50, బీజేపీకి 19, బీఆర్ఎస్కు 17 స్థానాలు అన్ని పార్టీలకు గణనీయంగా ఓట్లు -
చిత్తడి నేలలో ప్రకృతి సోయగాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చిత్తడి నేలల్లోని ఈ దృశ్యాలు కనురెప్ప కొట్టేందుకు వీలులేకుండా దృష్టిని కట్టిపడేస్తున్నాయి. నీలి వర్ణంతో ఆకాశం, ఆ సాగరం కలిసిపోగా.. పచ్చని ప్రకృతిలో ఎక్కడ చూసినా నిలువెత్తున నిలిచిన తాటిచెట్లు కనువిందు చేస్తున్నాయి. డొంకేశ్వర్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్దులవుతున్నారు. ఈ దృశ్యాలను నికాల్పూర్ గోదావరి వద్ద ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
వీడని చిక్కుముడి!
కామారెడ్డి పట్టణ ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించడంతో హంగ్ ఏర్పడింది. దీంతో బల్దియా పీఠం ఎవరి పరం అవుతుందన్నది చిక్కు ప్రశ్నగా మారింది. స్వతంత్రుల చేరికతో కాంగ్రెస్ బలం 22 కు చేరినా చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి మరో ముగ్గురి మద్దతు అవసరం. ఎక్స్అఫీషియో ఓటుతో కలిపి బీజేపీ బలం 17 కు చేరినా మ్యాజిక్ ఫిగర్కు దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో 11 మంది సభ్యులున్న బీఆర్ఎస్ నిర్ణయం కీలకంగా మారింది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణ ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పు పురపీఠం చిక్కుముడిగా మారింది. చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా యి. తమ సభ్యులను ఇప్పటికే క్యాంపులకు తరలించాయి. బల్దియాను కైవసం చేసుకునేందుకు మూ డు ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దీంతో మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న దా నిపై క్లారిటీ రావడం లేదు. 19 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఇండిపెండెంట్ కౌన్సిలర్లకు పార్టీలో చేర్చుకుంది. దీంతో వారి బలం 22 కు చేరింది. ఇదే సమయంలో 16 మంది కౌన్సిలర్ల ను గెలుచుకున్న బీజేపీ పార్టీకి ఎక్స్ అఫీషియో స భ్యునిగా స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఓటు కలిపితే వారి సంఖ్య 17 అవుతుంది. అయితే 11 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందా? లేదా బీ జేపీతో జత కడుతుందా అన్నదానిపై రకరకాల ఊ హాగానాలు నడుస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉప్పునిప్పుగా వ్యవహరిస్తుండడంతో స్థానికంగా ఆ పార్టీతో బీఆర్ఎస్ నాయకులు జతకట్టే పరిస్థితులు కనబడడం లేదు. ఇదే సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలూ తక్కువేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకు ల్లో వ్యక్తమవుతోంది. క్యాంపుల్లో మూడు పార్టీల కౌన్సిలర్లు ఫలితాలు వెలువడగా నే విజేతలందరినీ ఆ యా పార్టీలు క్యాంపులకు తరలించా యి. ఏ ఒక్కరూ చే జారిపోకుండా ఆ యా పార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నా రు. క్యాంపుల్లో ఉన్న వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. కాగా ఈనెల 16న బల్దియాల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ని ర్వహిస్తారు. ప్ర మాణ స్వీకారం అనంతరం అధికారులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సింగిల్ నామినేషన్ దాఖలైతే ఏ ఇబ్బందీ ఉండదు. అంతకుమించి నామినేషన్లు వస్తేనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈలోపు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై ఆయా పార్టీల నేతలు సమాలోచనలు జరిపి, నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఫలితా లు వెలువడగానే స్వతంత్రులు ముగ్గు రిని తమవైపు తిప్పుకుని, వారికి కాంగ్రెస్ కండువా కప్పేసింది. చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.వేచి చూసే ధోరణి..ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17 ఓట్ల బలం ఉన్న బీజేపీ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ముఖ్యనాయకుడొకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. బల్దియాను కైవసం చేసుకోవాలంటే బీజేపీకి మరో ఎనిమిది మంది మద్దతు అవసరం. అన్ని పార్టీల కౌన్సిలర్లు క్యాంపులలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వేచిచూసే ధోరణిలో బీజేపీ ఉంది.కామారెడ్డి బల్దియాను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. చైర్పర్సన్గా ఎవరికి అవకాశం ఇద్దామన్న విషయమై సమాలోచనలు జరుపుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదలు శనివారం హైదరాబాద్లో షబ్బీర్ అలీ ఇంట్లో సమావేశమయ్యారు. చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని క్యాంపులో ఉన్న కౌన్సిలర్లకు తెలిపి పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని సూచించినట్లు సమాచారం.బీఆర్ఎస్తో రాయబేరాలు కాంగ్రెస్, బీజేపీలు బల్దియా పీఠాన్ని కై వసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాయి. అయితే ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో 11 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్గా మారింది. వారి మద్దతు కోసం ఇరు పార్టీలు రాయ‘బేరాలు’ నడుపుతున్నట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమై వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. ‘కారు’ దారెటో? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ను ఎదుర్కొంటున్న ప్రస్తుత కీలకమైన సమయంలో ఆ పార్టీలతో అవగాహన చేసుకోవడం అంత ఈజీ కాదని అంటున్నారు. లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కామారెడ్డి బల్దియాలో రసవత్తరంగా రాజకీయం ఇండిపెండెంట్ల చేరికతో 22కు చేరిన కాంగ్రెస్ బలం ఎమ్మెల్యే ఓటుతో బీజేపీ బలం 17 కు చేరిక కీలకం కానున్న బీఆర్ఎస్ నిర్ణయం -
సీఎం కప్ బేస్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఆర్మూర్టౌన్: పట్టణంలో మినీ స్టేడియం, జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల క్రీ డా మైదానంలో శనివారం సీఎం కప్ బేస్బాల్ జిల్లా మహిళ, పురుషుల జట్ల ను ఎంపిక చేసినట్లు జిల్లా క్రీడాధికారి పవన్ కుమార్ తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం జరగనున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శులు సుజాత, చిప్ప నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగభూషణం, రమేశ్, స్వప్న, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా ఐకేపీ సీసీలకు శిక్షణ
● ఎస్హెచ్జీలకు ఆర్థిక రుణ చేకూర్పు అంశాలపై... డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు (సీసీలు) సెర్ప్ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని న్యాక్ ట్రైనింగ్ సెంటర్లో జరుగుతున్న ఈ శిక్షణకు బ్యాచ్ల వారీగా ఓరియంటేషన్ ఇస్తున్నారు. ఆర్థిక రుణ చేకూర్పు అనే అంశాలపై ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ రుణాలు, రికవరీ, ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు, పెట్టుబడులు తెలుసుకునేందుకు సీసీలకు కూలంకషంగా చెప్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో వీవోఏల ద్వారా మహిళా సంఘాల వరకు తీసుకెళ్తారు. శిక్షణ పొందిన సీసీలకు డీఆర్డీవో సాయాగౌడ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 277 మందికి ఈ నెల 17 వరకు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఏపీఎంలు కూడా ఇవే అంశాలపై ఇటీవల రాష్ట్రస్థాయిలో శిక్షణ పొంది వచ్చినట్లు డీఆర్డీవో తెలిపారు. -
దాతల దయతో గట్టెక్కిన సీఎం కప్ పోటీలు!
● గ్రామ, మండల స్థాయిలో నిర్వహణకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ● ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతోనే ముగించిన నిర్వాహకులు మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో దాతల దయపైనే ఆధారపడాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండ్రోజుల క్రితం నియోజకవర్గ స్థాయి పోటీలను నిర్వహించగా త్వరలోనే జిల్లా స్థా యి పోటీలు జరగనున్నాయి. పోటీలపై విస్తృత ప్రచారం నిర్వహించినా నిధుల కేటాయింపులో ప్ర భుత్వం విఫలం కావడంతో నిర్వాహకులు దాతల సహకారం కోరారు. స్పందన లేని ప్రాంతంలో కేవలం ఎంపికలతోనే క్రీడా పోటీలను మమ అనిపించారు. అయితే, మండల స్థాయిలో పోటీలను నిర్వహించడానికి కేవలం రూ.2 వేల చొప్పున నిధులను కేటాయించడం గమనార్హం. పోటీల నిర్వహణకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుంది. గ్రామ స్థాయిలోనైతే కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు ఉత్సాహంగానే క్రీడాపోటీల నిర్వహణకు ముందుకొచ్చారు. వారు సొంతంగా నిధులు ఇవ్వకపోయినా స్థానిక పంచాయతీలపై ఆర్థిక భారం పడింది. బహుమతుల ఖర్చులను మాత్రమే కొందరు సర్పంచ్లు సొంతంగా భరించారు. మరికొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చి బహుమతులను కొనుగోలు చేసి ఇచ్చారు. వచ్చే ఏడాది నిర్వహించే సీఎం కప్ పోటీల వరకై నా నిధుల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మాచారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు అన్నారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి–సిరిసిల్ల రహదారిపై పాల్వంచ, భవానీపేట గ్రామాల మధ్య బ్లాక్ స్పాట్స్ వద్ద 9 రేడియం డ్రమ్ములను ఏర్పాటు చేశారు. గతంలో సైతం 12 డ్రమ్ములను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పాల్వంచ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సత్యం ఉన్నారు. మాక్లూర్: మండలంలోని మాణిక్బండార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం బెస్ట్ రన్నర్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు డీఈవో అశోక్ ఆధ్వర్యంలో రూ. లక్షా 20 వేలు విలువ చేసే సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా సైకిళ్లను అందించటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, సంస్థ సభ్యులు దొడ్లె శేఖర్, సతీశ్, శ్రీనివాస్, గౌతమి, చిరంజీవి, కిశోర్, రజిని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న విద్యార్థులకు వ్యాసరచ న, డ్రాయింగ్తోపాటు ఇతర పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ నాయకులు కోయేడి నర్సింహులు,గుర్రం వెంకటమల్లయ్య శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు.నగరంలోని నాందేవ్వాడలో ఉన్న మల్లు స్వరాజ్యం కార్యా లయంలో ఆదివారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణ,ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వ హిస్తున్నామన్నారు.ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలనివారు కోరారు. మోపాల్: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి, సెలవుదినంగా ప్రకటించాలని ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్ బాలు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా బిడ్డల ను భక్తి మార్గంలో నడిపించారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేశారని కొని యాడారు. పార్లమెంట్లో సేవాలాల్ మహరా జ్ గురించి మాట్లాడిన ఎంపీ అర్వింద్ ధర్మపురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలకు అధికారికంగా సెలవుదినంగా ప్రకటించా లని కోరారు. మండల ప్రధానకార్యదర్శి జలంధర్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరేశ్, నాయకులు ఇందల్, ఓం సింగ్, జోర్సింగ్ పాల్గొన్నారు. రుద్రూర్: పొతంగల్ మండలంలోని హంగర్గాలో హరినామ స్మరణతో మారుమ్రోగుతోంది. గ్రామంలో కొనసాగుతున్న సప్తాహం కార్య క్రమానికి శుక్రవారం రాత్రి చైతన్య మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ప్రవచనం చేశారు. అనంతరం భక్తులు మహరాజ్ను ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో కీర్తనకారులు, భజన బృందం సభ్యులు, భక్తులు, సర్పంచ్ ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
బంజారాల మార్గదర్శి
● నేడు సేవాలాల్ మహరాజ్ జయంతి నిజామాబాద్ రూరల్: బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించి, భక్తిని ప్రేరేపించి, సమాజాన్ని సంఘటితం చేసిన గొప్ప సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్. ఆదివారం సేవాలాల్ మహరాజ్ జయంతిని బంజారాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో భోగ్ బండార్, ఖీర్ (పాయసం)తో నైవేద్యం సమర్పించి ఉపవాసాలు చేస్తారు. బంజారా యువకులు సేవాలాల్ దీక్షను స్వీకరిస్తారు. సన్మార్గంలో నడిచేలా.. భీమానాయక్, ధర్మిణియాడ దంపతులకు 1739లో ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించాడు. సేవాలాల్ మహరాజ్ దేవిమాతకు పూజలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు.అటవీ ప్రాంతంలో జీవిస్తున్న బంజారాలంతా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారని,దాని కోసం ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించేవారు.బంజారాలంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే సమాజ వికాసం జరుగుతుందని చెప్పేవారు. అలా చీకటిలో ఉన్న బంజారాలను వెలుగులోకి తీసుకొచ్చిన సేవాలాల్ మహరాజ్ దైవ స్వరూపుడుగా, ఆధ్యాత్మిక చైతన్యకారుడిగా ప్రసిద్ధి చెందారు. చివరకు మహారాష్ట్రలోని పౌరాఘడ్లో స్వర్గస్తులైనట్లు పూర్వీకులు చెబుతారు. మహరాజ్ సమాధి ఉన్న వీరఘడ్ ప్రాంతం ప్రసిద్ధ బంజారా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి. సేవాలాల్ జయంతి ఉత్సవాలకు మంజూరు చేస్తున్న నిధులను పెంచాలి. సేవాలాల్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. – బానోత్ ప్రేమ్లాల్, బంజార కవి, రచయిత -
నాడు విద్యార్థినేత.. నేడు ప్రజానేత
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన గడ్డమీది అంజగౌడ్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించిన విష యం తెలిసిందే. ఈయన బాన్సువాడలో ఏబీవీపీ నాయకుడిగా 2007లో అడుగుపెట్టి అంచలచెలుగా ఎదిగి 2015లో ఏబీవీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు. తర్వాత ఏబీవీపీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు జిల్లా కన్వీనర్గా మూడేళ్లు పని చేశారు. తెలంగాణ యూనివర్సీటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అంజగౌడ్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో 2020లో జరిగిన బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పట్లో ఈ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. రెండవ స్థానంలో అంజగౌడ్కు 215 ఓట్లు వచ్చాయి. ఈసారి మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ అంజగౌడ్కు బీఆర్ఎస్ టికె ట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా 12వ వార్డు నుంచి పోటీలో నిలిచి, గెలిచారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో విజయం సాధించిన ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థిగా అంజగౌడ్కు గుర్తింపు వచ్చింది. గతంలో వచ్చిన ఎయిర్కండిషనర్ గుర్తే ఈ సారి కూడా రావడంతోనే విజయం సాధించినట్లు అంజగౌడ్ తెలిపారు. -
పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు
● కలపను అమ్ముకున్న సర్పంచ్లు ● పట్టించుకోని అధికారులు ● అవెన్యూ ప్లాంటేషన్లదీ అదేగతి రెంజల్(బోధన్): పల్లెలు, పట్టణాల్లో పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచాలనే బృహత్తర ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గ త ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టింది.అంతటి ప్రాధాన్యం కలిగిన పథకానికి కొందరు తూట్లు పొడుస్తున్నారు.గత పాలకవర్గాలు ప్రతి గ్రా మంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయ గా, మొక్కల సంరక్షణకు గత ప్రభుత్వం రూ. లక్ష లాది నిధులు విడుదల చేసింది. మొక్కలు ప్ర స్తుతం చెట్లుగా ఎదిగాయి. వాటిని కాపాడాల్సిన ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాలు కొన్ని పచ్చని చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి వేస్తున్నాయి. సర్పంచ్లకు అవగాహన లేక చెట్లను నరికి కలపను అమ్ముకుంటున్నా అధికార యంత్రాంగంలో చలనం లేదు. ఆహ్లాదం అందనంత దూరం జిల్లాలోని పల్లె ప్రకృతి వనాలు చాలా వరకు గ్రా మాలకు దూరంగా ఏర్పాటు చేయడంతో నిరుపయోగంగా మారాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భా గంగా రోడ్లకు ఇరు వైపులా నాటిన మొక్కలు చె ట్లుగా మారినా రహదారుల వెంట పచ్చదనం కరువైతుంది. ప్రయాణికులకు ప్రాణవాయువును అందించి వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ని వారించే చెట్ల పాలిట విద్యుత్ తీగలు శాపంగా తయారయ్యాయి.10–15 అడుగులు పెరిగిన చె ట్లను విద్యుత్ సిబ్బంది అడ్డంగా నరికేస్తున్నారు. ప చ్చందంతో కనిపించాల్సిన చెట్లు మోడు వారికి కనిపిస్తున్నాయి.రెంజల్ మండలంలోని మౌలాలితండా, కళ్యాపూర్ గ్రామాల సర్పంచ్లు ఇటీవల ప చ్చని చెట్లను నరికి కలపను అమ్ముకున్నారు. వీరన్నగట్ట శ్మశాన వాటికలో పెరిగిన చెట్లను సైతం నరికి వేయించారు. -
క్రైం కార్నర్
డొంకేశ్వర్(ఆర్మూర్): మండల కేంద్రంలో రేఖాదేవి (32) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. మృతిరాలి తండ్రి మీసాలి గంగాధర్ ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన రేఖాదేవికి 13 ఏళ్ల క్రితం దేవిదాస్తో వివాహం జరుగగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన భర్త దేవిదాస్ తన భార్య గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో అనుమానించి నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన రేఖాదేవి గదిలోకి వెళ్లి టవల్తో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాని ఎస్సై పేర్కొన్నారు. వర్ని: కుటుంబ కలహాలతో సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన ఎత్తరి సాయిబాబా, రాంబాబు అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం వీరి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, తల్లి మృతికి అన్న సాయిబాబే కారణమని రాంబాబు భావించినట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి కర్రతో సాయిబాబా(32) తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తన అన్న సాయిబాబాను హత్య చేసినట్లు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నికాల్పూర్లో పావురాల కలకలం
● కాళ్లకు రింగ్ చూసి ఆందోళనకు గురైన గ్రామస్తులు డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శుక్రవారం ట్యాగ్ కలిగిన పావురాలు కలకలం సృష్టించాయి. వాటి కాళ్లకు ఉన్న పసుపు రంగు ట్యాగ్ (రింగు), దానిపై నంబర్లను చూసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామ శివారులోని జంగం చెరువు ప్రాంతంలో మత్స్యకారులు ఉంచిన చేపల వలకు మూడు పావురాలు చిక్కుకున్నాయి. స్థానిక వ్యవసాయదారులు గమనించి పావురాలను వల నుంచి తీసే ప్రయత్నం చేశారు. కాళ్లకు ఉన్న రింగు లాంటి పరికరాన్ని చూసి ఏంటోనని ఆందోళనకుగురయ్యారు. గ్రామస్తులకు సమాచారం అందించగా వారు కూడా వచ్చి పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. గూఢచారి పావురాలని ఒకరు, జీపీఎస్ ట్రాకింగ్ చేసేవని మరొకరు, రేసింగ్ పావురాలని ఇంకొకరు చర్చించుకున్నారు. పావురాల కాలికి ఉన్న రింగ్పై ‘702’ నంబరుతోపాటు కేఎల్ఆర్పీసీ, కేవోఎల్ఏఆర్ 2025–ఇండియా అని రాసి ఉంది. ఇలాంటివి సాధారణంగా రేసింగ్ పావురాలకే ఉంటాయని లేదా ప్రభుత్వాలు కూడా పావురాల కదలికలు, సంచార సమాచారం తెలుసుకోవడానికి ఇలాంటి ట్యాగ్లు కడుతారని అవగాహన కలిగిన ఒకరిద్దరు అధికారులు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నికాల్పూర్ బ్యాక్ వాటర్కు ఆనుకొని ఉన్న గ్రామం కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి దారితప్పి వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వలలో చిక్కుకున్న ఆ మూడు పావురాలను గ్రామస్తులు వదిలిపెట్టారు. మూడు ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు మూడు చోట్ల ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఆయిల్, కాపర్ వైర్ చోరీ అపహరణకు గురైనట్లు రైతులు పురుశోత్తం, గజానంద్, శంకర్ తెలిపారు. పోలీసులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ దుండగులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కరపత్రాల ఆవిష్కరణ బోధన్టౌన్: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బోధన్లో హిందువాహిని ఆధ్వర్యంలో ఈ నెల 19న చేపట్టే భారీ ర్యాలీ కరపత్రాలను ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ బోధన్ నగ ర కార్యవాహ్ దులిశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ జయంతిని సందర్భంగా చేపడుతున్న ర్యాలీని హిందువులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో హిందూవాహిని జిల్లా ఉపాధ్యక్షుడు పులి సాయిలు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
చేయిచేయి కలిపి.. విరాళాలు సేకరించి..
● పడావు భూమిని మైదానంగా మార్చారు ● లింగంపేటలో యువకుల చొరవ లింగంపేట(ఎల్లారెడ్డి): ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని’ ఎదురు చూడకుండా ఏళ్ల తరబడి పడావుగా ఉన్న క్రీడా ప్రాంగణాన్ని యువకులు బాగుచేసుకున్నారు. లింగంపేట మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు చేయి చేయి కలిపి, రూ. 1.50 లక్షలు విరాళాలు సేకరించారు. క్రీడా ప్రాంగణాన్ని చదును చేసుకొని క్రీడలకు అనుకూలంగా మార్చుకున్నారు. ఐదేళ్ల క్రితం కేటాయింపు.. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణానికి స్థలం కేటాయించి బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి పనులు చేపట్టలేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మండలంలో క్రీడా మైదానం లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈక్రమంలో లింగంపేట గ్రామానికి చెందిన రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రఫియోద్దీన్, మాజీ సర్పంచ్ అఫ్రోజ్లు సుమారు యాబైవేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు చేసి క్రీడా ప్రాంగణాన్ని బాగుచేయడానికి నడుం బిగించారు. వారితో పాటు పలువురు యువకులు క్రాంతికుమార్, ఆశోక్, యుసుఫ్ఖాన్, బాషు, అర్షద్, ఖజా, అశ్వక్, రఘునందన్, వాసి, రియాజ్, వేణుగౌడ్, ఉమేష్, రవితేజ, సకి, ఉవేజ్అదనాన్, ఫారూక్, ఇంమ్రాన్, నవీద్, సాయితేజ, గ్రామ పెద్దలు సహకరించి స్థలంలో పనులు చేయడంతోపాటు విరాళాలు సేకరించారు. ప్రస్తుతం క్రీడా ప్రాంగణం అందుబాటులోకి రావడంతో మండలంలోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బాన్సువాడలో బీజేపీ, ఎంఐఎం బోణీ
బాన్సువాడ: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఫ లితాలు ఉత్కంఠ రేపాయి. మున్సిపల్ ఎన్నికల ఓ ట్ల లెక్కింపు శుక్రవారం ఉండడంతో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు ఉద యాన్నే చేరుకున్నారు. ఎన్నికల అధికారులు 19 వా ర్డుల ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపట్టడడంతో ఫలితా లు ఒకేసారి ప్రకటించారు. మొదటి సారిగా ఎంఐ ఎం ఒక వార్డులో విజయం సాధించి, పాగ వేయగా బాన్సువాడలో బీజేపీ పార్టీ బలంగా ఉందని ఓట ర్లు నిరుపించారు. గతంలో ఒక్క సీటు రాని బీజేపీ ఈసారి మూడు కౌన్సిలర్ల స్థానాలను కై వసం చేసుకుంది. మరొ నాలుగు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో ఒడిపోయారు. 19 వార్డులకు గాను 11 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. మెజారిటీ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్కు గట్టి దెబ్బతగిలింది. -
బామ్మర్దుల దాడి.. బావ ఆత్మహత్య
మాచారెడ్డి: బావపై బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో మనస్థాపానికి గురైన బావ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. బండరామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన సుంకు ప్రవీణ్కు దోమకొండ మండల కేంద్రానికి చెందిన హారికతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. గత కొద్దిరోజులుగా ప్రవీణ్ పనిలేకుండా తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. గురువారం సైతం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయమై హారిక దోమకొండలోని తండ్రి, సోదరులకు సమాచారం అందించింది. దీంతో వారు బండరామేశ్వర్పల్లికి చేరుకొని ప్రవీణ్ను మందలించారు. దీంతో మాటామాట పెరిగి బావపై బామ్మర్దులు దాడి చేసి హారికను వారి వెంట తీసుకెళ్లారు. దీంతో మనస్థాపం చెందిన ప్రవీణ్ సొంతింట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మద్నూర్(జుక్కల్): పోతంగల్ మండలంలోని కోడిచెర్ల మంజీర పరివాహక ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా తరలుతున్న రెండు ఇసుక ట్రాక్టర్లు, ఒక బొలేరో వాహనాలను శుక్రవారం వేకువజామున డోంగ్లీ మండలం కుర్లా సమీపంలో పట్టుకోని సీజ్ చేసినట్లు డోంగ్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. పోతంగల్ మంజీరా శివారులోని కోడిచెర్ల నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు, ఒక బొలేరో వాహనంతో ఇసుక లోడుతో ఎలాంటి అనుమతులు లేకుండా డోంగ్లీ గుండా వెళ్తుండగా పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇసుక తరలిస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశామని ఆయన తెలిపారు. మంజీర వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు సిబ్బంది బాల నర్సయ్య, బాలరాజు ఉన్నారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు 146 మందికి శిక్షలు విధించాయి. పోలీసులు ఇటీవల జరిపిన వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని జిల్లాలోని వివిధ కోర్టులలో హాజరుపర్చగా 13 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 146 మందికి గాను రూ.2 లక్షల వరకు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
చెరువులో ఒకరి మృతదేహం లభ్యం
బీబీపేట: రెండు రోజుల క్రితం చెరువులో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతవగా శుక్రవారం మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు ఇలా.. బీబీపేట గ్రామానికి చెందిన మద్దూరి దేవరాజు (40) చాకలి వృత్తి నిర్వహిస్తుండేవాడు. బుధవారం ఎప్పటిలాగే బట్టలు ఉతికిన తర్వాత స్నానానికి చెరువులోకి దిగాడు. ఈదుకుంటూ కొంత దూరం వెళ్లిన తర్వాత నీటిలో మునిగి పోయాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా రెండు రోజుల నుంచి గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం దేవరాజు మృతదేహం నీటిపైకి తేలింది. వెంటనే పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నస్రుల్లాబాద్: మండలంలోని సంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సదాశివనగర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సంగం గ్రామానికి చెందిన పూల్ సింగ్(26)కు 8 నెలల క్రితం బీపీఎంగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్య మణిపూర్ రాష్ట్రంలో ఉన్న అతడు నెలరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇటీవల ఎంబీఏ సెమిస్టర్ పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లాడు. రెండు రోజులు వరుస సెలవులు రావడంతో శుక్రవారం హైదరాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి శివారులో అతడి బైక్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
అధికారం వైపే!
● మూడు మున్సిపాలిటీలు ‘హస్త’గతం ● కామారెడ్డిలో అన్ని పార్టీలకు ఆదరణ ● గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ● ఉనికి చాటుకున్న బీజేపీబాన్సువాడ కౌంటింగ్ హాల్ వద్ద కాంగ్రెస్ నేతల విజయోత్సవాలుజిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా మూడు చోట్ల అధికార పార్టీ జయకేతనం ఎగురవేసింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కామారెడ్డి ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుతో హంగ్ ఏర్పడింది. ● బాన్సువాడలో 19 వార్డులకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి బోణీకొట్టిన బీజేపీ.. ఏకంగా మూడు స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ మూడు స్థానాలకు పరిమితమయ్యింది. ఒక వార్డులో ఎంఐఎం, ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలుపొందారు. ● ఎల్లారెడ్డిలో 12 స్థానాలుండగా.. 10 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో బీఆర్ఎస్, మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ● బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులకుగాను 10 వార్డుల్లో కాంగ్రెస్, రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ● కామారెడ్డి పట్టణంలో 49 వార్డులకుగాను 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 16 వార్డుల్లో బీజేపీ, 11 వార్డుల్లో బీఆర్ఎస్, మూడు వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. పెరిగిన బీజేపీ బలం... మున్సిపాలిటీలలో బీజేపీ బలం పెరిగింది. గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం ఉంది. గతంలో 8 వార్డులు కలిగి ఉన్న బీజేపీ.. ఈసారి తన బలాన్ని రెట్టింపు చేసుకుని చైర్పర్సన్ రేసులో నిలిచింది. కొన్ని వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. బాన్సువాడ బల్దియాలో బోణీ కొట్టింది. ఆ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది. ఎల్లారెడ్డి, బిచ్కుందలలో మాత్రం సీట్లు దక్కలేదు. అత్యధిక, అత్యల్ప మెజారిటీలు.. కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో అత్యధిక మెజారిటీ 22 వ వార్డులో నమోదయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆఫ్రీన్ సుల్తానా 701 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాగా కామారెడ్డి బల్దియాలో అత్యధిక ఓట్లు కూడా ఆమెకు పడ్డాయి. 1,098 ఓట్లు సాధించారు. 38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి మూడు ఓట్ల తేడాతో గెలిచారు.మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. కామారెడ్డి పట్టణంలో 49 వార్డుల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలుపొందడంతో పాటు పలు వార్డుల్లో గౌరవ ప్రదమైన ఓట్లు సాధించింది. ఎల్లారెడ్డిలో ఒకే సీటు వచ్చింది. బాన్సువాడలో మూడు వార్డుల్లో, బిచ్కుందలో రెండు వార్డుల్లో గెలుపొందింది. అయితే కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు.పుర ఓటర్లు అధికార పార్టీకి అండగా నిలిచారు. మూడు బల్దియాలను కాంగ్రెస్ ఖాతాలో వేశారు. కామారెడ్డి ఓటర్లు మాత్రం విభిన్నంగా ఓటేసి, ఎవరికీ మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. కాగా జిల్లాలోని నాలుగు బల్దియాల పరిధిలో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. బీజేపీ బలాన్ని గణనీయంగా పెంచుకుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
బాన్సువాడ చైర్పర్సన్గా కాసుల విజయ!
బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ చైర్పర్సన్గా కాసుల విజయ ఎన్నిక లాంఛనం కానుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ సతీమణి విజయ గెలిస్తే చైర్పర్సన్ అవుతారని ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. బల్దియాలో 19 వార్డులుండగా కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచింది. దీంతో చైర్పర్సన్గా ఆమె ఎన్నిక లాంఛనమేనని భావిస్తున్నారు. కాగా వైస్ చైర్పర్సన్గా ఎవరిని నియమిస్తారన్న అంశంపై పట్టణంలో చర్చ నడుస్తోంది. గతంలో బాన్సువాడ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరు సర్పంచ్గా గెలిచినా ఉప సర్పంచ్ పదవి మాత్రం మైనారిటీలకు ఇచ్చేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైస్ చైర్పర్సన్ స్థానాన్ని మైనారిటీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. 18వ వార్డునుంచి గెలిచిన మాజీ ఎంపీపీ రేష్మబేగంతోపాటు 13వ వార్డులో విజయం సాధించిన అబ్దుల్ ఖలేక్లలో ఒకరికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. -
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో శుక్రవారం సీఎం కప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్, రెజ్లింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్గౌడ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.నిజాంసాగర్: జుక్కల్ మండల ప్రజలను చిరుత భయపెడుతోంది. గురువారం రాత్రి శక్తినగర్ గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్ద చిరుత పులి రోడ్డు దాటుతూ వాహనదారుల కంటపడింది. రోడ్డు దాటివెళ్తున్న చిరుత పులిని వాహనదారులు వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో శక్తినగర్, సావర్గావ్, ఖండెబల్లూర్ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతకు బంధించాలని కోరుతున్నారు. సదాశివనగర్: రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ప్రతి రైతు సభ్యత్వం పొందాలని జిల్లా సహకారశాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎఫ్పీవోపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకోవడానికి ఎఫ్పీవోలు మంచి అవకాశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, విండో చైర్మన్ కమలాకర్రావు, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్, సీఈవో విఘ్నేశ్గౌడ్, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియాలో దంపతులిద్దరు కౌన్సిలర్లుగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. పట్టణంలోని 46వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెరికంటి లక్ష్మీనారాయణ మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఆయన భార్య స్వప్న 47 వార్డునుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయతీరాలకు చేరారు. కాగా స్వప్న గత కౌన్సిల్లోనూ సభ్యురాలిగా పనిచేశారు. భార్యాభర్తలిద్దరూ విజయం సాధించడం గమనార్హం. కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆరో వార్డు కౌన్సిలర్గా నిట్టు గంగాధర్రావు ఎన్నికయ్యారు. ఆయన పాతికేళ్ల క్రితం సరంపల్లి సర్పంచ్గా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా ఉన్నారు. ఆ గ్రామం 2018లో కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమయ్యింది. తాజాగా నిర్వహించిన ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీనుంచి పోటీ చేసి కౌన్సిలర్ అయ్యారు. నిజామాబాద్ రూరల్: గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈనెల 22న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డీసీవో విజయలలిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో ప్రవేశాల కోసం జిల్లాలోని 23 కేంద్రాల్లో మొత్తం 8,901 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు 22వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్లు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. -
క్యాంపు రాజకీయాలు షురూ..
ఎల్లారెడ్డి – 1210● కౌన్సిలర్లను తరలించిన పార్టీలు ● కామారెడ్డి కాంగ్రెస్ శిబిరంలోకి స్వతంత్రులు!01కాంగ్రెస్స్వతంత్రబీఆర్ఎస్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను శిబిరాలకు తరలించాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఆయా రాజకీయ పార్టీలు కౌన్సిలర్లందరినీ క్యాంపులకు తీసుకువెళ్లాయి. కామారెడ్డి బల్దియాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. ముగ్గురు ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్ శిబిరంలో చేరినట్లు తెలిసింది. వారంతా కలిసి క్యాంప్నకు వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లతో సమావేశమైన స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి.. వారిని క్యాంపునకు తరలించారు. మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నికలలో కీలకంగా మారిన బీఆర్ఎస్ సైతం జాగ్రత్త పడుతోంది. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ చైర్మన్, వైస్చైర్మన్ ఎన్నిక విషయంలో పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. చైర్మన్ పదవిని పద్మ శ్రీకాంత్తో పాటు భాగ్యవతి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు పార్టీ తరఫున ఎన్నికై నవారినందరినీ క్యాంపునకు తరలించారు. బాన్సువాడలో 19 వార్డులకుగాను కాంగ్రెస్ 11 చోట్ల గెలిచింది. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్రెడ్డిల ఆధ్వర్యంలో వీరంతా క్యాంపునకు వెళ్లారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు క్యాంపునకు తీసుకువెళ్లారు.10నూతన కౌన్సిలర్ల ప్రమాణస్వీకారంతో పాటు చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక కోసం ఈనెల 16న ఆయా బల్దియాలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. ఈలోపు ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై క్యాంపుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం, మద్దతు లభించని పక్షంలో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంటుంది. -
కామారెడ్డి ‘పురం’ ఎవరి పరమో?
కామారెడ్డి ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. ప్రధాన పార్టీలను అన్నింటిని ఆదరించిన ఓటర్లు.. ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా చిక్కుముడి వేశారు. ఏవైనా రెండు పార్టీలు కలవాల్సిన పరిస్థితిని సృష్టించారు. దీంతో ఏ రెండు పార్టీలు కలుస్తాయన్న అంశంపై పట్టణంలో జోరుగా చర్చ నడుస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డికామారెడ్డి బల్దియాలో 49 వార్డులున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవగా.. బీజేపీ 16 వార్డుల్లో బీఆర్ఎస్ 11 వార్డుల్లో గెలుపొందాయి. మరో మూడు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. కాగా చైర్పర్సన్ పదవి దక్కాలంటే 25 స్థానాలు అవసరం. అయితే ఏ ఒక్క పార్టీ మ్యాజిక్ ఫిగర్కు చేరుకోకపోవడంతో బల్దియా పీఠం చేజిక్కించుకోవడంతో అన్ని పార్టీలకు పరీక్షగా మారింది. కింగ్మేకర్ బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను గెలుచుకుంది. చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఆ పార్టీకి మరో ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం. ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు ఇచ్చినా సరిపోదు. 16 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో ఉన్న బీజేపీకి చైర్పర్సన్ పీఠం దక్కాలంటే మరో తొమ్మిది మంది మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో 11 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్ కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్తో యుద్ధం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డిలో ఆ పార్టీకి మద్దతు ఇస్తుందా, లేక 16 స్థానాలు గెలిచిన బీజేపీ వైపు నిలుస్తుందా అన్న అంశంపై చర్చ నడుస్తోంది. 2020లోనూ హంగే! 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ 23 వార్డులలో గెలుపొందగా.. కాంగ్రెస్ 12, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. మరో ఆరు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. అయితే స్వతంత్రులను కలుపుకుని బల్దియాపై బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. తర్వాతి కాలంలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. అప్పటి బల్దియా చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టి పదవినుంచి దింపేశారు. వైస్ చైర్మన్గా ఉన్న ఇందుప్రియ కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గెలుపు.. 33వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కుంబాల రవియాదవ్, బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డిలకు 472 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నాలుగు బీజేపీ అభ్యర్థికి రావడంతో ఆయన నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు విలక్షణ తీ ర్పు ఇచ్చారు. అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా బల్దియాను కై వసం చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది. గత కౌ న్సిల్లో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి తన బలాన్ని 16 కు పెంచుకున్నా మ్యా జిక్ ఫిగర్కు దూరంగానే ఉండిపోయింది. కాగా గత ఎన్నికలలో గెలిచి బల్దియాను గెలుచుకున్న బీఆర్ఎస్కు ఈసారి 12 స్థానాలు తగ్గినప్పటికీ.. చైర్పర్సన్ ఎన్నికలలో కీలకంగా మారింది.పార్టీ సాధించిన ఓట్లు గెలిచిన సీట్లు కాంగ్రెస్ 21,598 19 బీజేపీ 18,571 16 బీఆర్ఎస్ 17,069 11సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డిలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. కామారెడ్డి చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తే చైర్పర్సన్ కావాలని చాలామంది ఆశించారు. 9వ వార్డు నుంచి పోటీ చేసిన ఉర్దొండ వనిత, 35 వ వార్డు నుంచి పోటీ చేసిన నిట్టు వినోద, 19వ వార్డు నుంచి పోటీ చేసిన గుడుగుల సవిత, 10వ వార్డు నుంచి పోటీ చేసిన నీలం కలావతి, 31వ వార్డు నుంచి పోటీ చేసిన పాక జ్ఞానేశ్వరి, 34 వ వార్డు నుంచి పోటీ చేసిన పాండ్రె మమత, 16వ వార్డు నుంచి బరిలో ఉన్న దీక్షిత చైర్పర్సన్ పీఠాన్ని ఆశించినా.. వారు ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 15వ వార్డు నుంచి రెండో పర్యాయం విజయం సాధించిన సురోజ్ వనిత, 14 వ వార్డు నుంచి గెలుపొందిన పిన్న వయస్సురాలైన రాంశెట్టి హర్షిత, రెండోపర్యాయం విజయం సాధించిన తాటి లావణ్య పేర్లు చైర్మన్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ వర్గానికి చెందిన ఏడుగురు మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో ఎవరికై నా అవకాశం ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయితే కాంగ్రెస్లో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఇప్ప ఉమారాణికి పదవి దక్కవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీనుంచి.. బీజేపీకి అవకాశం దక్కితే ఆ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య తక్కువేం లేదు. 34 వ వార్డు నుంచి రెండోసారి విజయం సాధించిన ఉన్నత విద్యావంతురాలైన గాండ్ల సుజిత రేసులో ఉన్నారు. 42వ వార్డు నుంచి గెలిచిన పెద్దబోయిన స్వప్న, 35వ వార్డు నుంచి గెలిచిన భోజన్నగారి వినోద, 11వ వార్డు నుంచి గెలిచిన కాసర్ల రాణి, 16వ వార్డు నుంచి గెలిచిన యాడవరం ప్రియాంకలు సైతం పదవిని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్లో బీసీ మహిళా కౌన్సిలర్లు కాసర్ల గోదావరి, గోపు బాలమణి, గెరిగంటి స్వప్న తదితరులు చైర్పర్సన్ రేసులో ఉంటారని తెలుస్తోంది. పార్టీలకు పరీక్ష పెట్టిన ఓటరు మ్యాజిక్ ఫిగర్కు దూరంగా అన్ని పార్టీలు 19 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ పదహారు సీట్లతో సత్తా చాటిన బీజేపీ కీలకంగా మారిన బీఆర్ఎస్ -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి భిక్కనూరు: విద్యుత్షాక్తో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన గౌనిభూమయ్య (60) భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పొలంలో బోర్ మోటర్ను ప్రారంభించేందుకు వెళ్లాడు. అక్కడ స్టార్టర్ బాక్సుకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గమనించని భూమయ్య దానికి తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ లీగల్/ నిజాంసాగర్: కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండువేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి (ఎస్సీ, ఎస్టీ కోర్టు) టి. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పిప్పిరేగడి తండాకు చెందిన కేతావత్ పరశురాం, తమ గ్రామ శివారులోని హసన్పల్లిలో కురుమ భూమయ్యకు చెందిన ఎకరం ఇరవై గుంటల వ్యవసాయ భూమి కొనుగోలుకు రూ. రెండు లక్షల ఇరవై వేల నగదును మొదట బయానాగా ఇచ్చాడు. మిగతా డబ్బులు పట్టా అయ్యాక చెల్లిస్తానని ఒప్పందం కుదిరింది. ఈ వ్యవహారంలో 16.07.2021న పిప్పిరియగడి తండాకు పెద్దమనిషి ఇత్యా నాయక్ పిలుపు మేరకు పరశురాం తన మామతో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో భూమి అమ్మిన కురుమ భూమయ్య అల్లుడు బోయిన ప్రవీణ్కుమార్, హసన్పల్లి మాజీ సర్పంచ్ సంగమేశ్వర్గౌడ్, కురుమ భద్రయ్యలు కలిసి డబ్బులు వద్దు.. మా భూమి మాకు కావాలి అంటు వివాదం సృష్టించారు. అనంతరం పరశురాంను కులం పేరుతో దూషించి, బెదిరించి చేతులతో, చెప్పులతో దాడి చేశారు. దీంతో బాధితుడు పరశురాం తన మామతో కలిసి దాడి విషయమై నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులు, దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి(ఎస్సీ, ఎస్టీ కోర్టు) టీ శ్రీనివాస్ నిందితులు కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): లింగంపల్లిలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. గురువారం గ్రామంలో నీటి సమస్య ఉన్న వీధులను పరిశీలించి నివేది కలు తయారు చేశారు. ఉప సర్పంచ్ ఎడ్ల గంగారాం,వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. పోల్కంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేట గ్రామ పంచాయతీలో గురువారం పాలక వర్గం వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసినట్లు సర్పంచ్ దివిటి రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వేసవిలో గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రజినీకాంత్, కార్యదర్శి అశ్వక్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అన్నాసాగర్లో.. ఎల్లారెడ్డిరూరల్: గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నాసాగర్ సర్పంచ్ స్రవంతి అన్నారు. గురువారం అన్నాసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి పాలకవర్గ సభ్యులతో చర్చించారు. నీళ్లను వృథా చేయొద్దు తాడ్వాయి(ఎల్లారెడ్డి): ట్యాంకులు, నల్లల ద్వారా వచ్చే నీటిని వృథా చేయవద్దని కాలోజీవాడి సర్పంచ్ చంద్రారెడ్డి అన్నారు. ఆయన గురువారం కాలోజీవాడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నల్లాలను తనిఖీ చేశారు. నల్లల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు అవసరం ఉన్నంత మేరకు పట్టుకొని వెంటనే వాటిని బంద్ చేయాలన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులను కోరారు. ఉపసర్పంచ్ సాయికుమార్, జీపి సిబ్బంది ఉన్నారు. -
కాసుల బాల్రాజ్ను విమర్శిస్తే ఊరుకోం
బాన్సువాడ: ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీర్కూర్ మాజీ ఎంపీపీ విజయప్రకాష్ అన్నారు. కాసుల బాల్రాజ్పై రుద్రూర్ సర్పంచ్ చంద్రశేఖర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ చంద్రశేఖర్ 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున డబ్బులు పంచుతుండగా స్వయంగా కాసుల బాల్రాజ్ పట్టుకుని పోలీసులకు అప్పగించాడని, కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాసుల బాల్రాజ్ను విమర్శించే స్థాయి చంద్రశేఖర్కు లేదని అన్నారు. నాయకులు బోయిని శంకర్, యామ రాములు, బస్వరాజ్, దొంతురాం కాశీరాం, సందీప్, శశికాంత్ తదితరులున్నారు. -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
బాన్సువాడ రూరల్: బోర్లం గ్రామ పంచాయతీలో గురువారం కెనరాబ్యాంకు, ఎస్ఎస్టీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకులు, అవి అందించే సేవలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఏటీఎం, డిజిటల్స్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ బస్వయ్య, కార్యదర్శి సాయికుమార్, ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ మణిశంకర్, సీఎఫ్ఎల్ కౌల్సిలర్స్ పర్వయ్య, అనుదీప్, సుధీర్కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. -
బృందావన్ కాలనీలో భారీ చోరీ
● 16 తులాల బంగారం అపహరణ కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్డు బృందావన్ కాలనీలో గురువారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీలేఖ తన ఇంటికి తాళం వే సి బుధవారం రాత్రి దేవునిపల్లిలోని తన తల్లిగారింటికి వెళ్లారు. ఉదయాన్నే వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, సీసీఎస్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇంట్లో దాచి ఉంచిన 16 తులాల బంగారం, 5 తులాల వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలి పారు. పోలీసులు విచారణ చేపట్టారు. కామారెడ్డి అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి యోగా పోటీలు గురువారం జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో నిర్వహించగా డీఈవో రాజు, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డిలు ప్రారంభించారు. అన్ని క్రీడల్లోనూ యోగా అత్యంత కఠినమైన్పటికి పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనడంపై డీఈవో రాజు సంతోషం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించారు. యోగా పోటీ ల నిర్వహణ, న్యాయనిర్ణేతలు బి.రఘుకుమార్, పెట్టిగాడి అంజయ్య, అనిల్కుమార్, బాల్రాజు, రాజ్కుమార్, గురుచరణ్, బాల్లింగం, భరత్, వాసు, శ్రీలత, గోమతి, వీణ, లలిత, లావణ్య, హిమబిందులు వ్యవహరించగా, సాంకేతిక ప్రతినిధులు గంగాప్రసాద్, రమేష్, యోగాచార్యులు అంజయ్యగుప్తా ఉన్నారు. మాచారెడ్డి: లచ్చాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పూస నితీష రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఈవిషయమై గురువారం పాఠశాలలో ఆమెను సత్కరించారు. పాఠశాల హెచ్ఎం నాగేశ్వర్రెడ్డి, పీఈటీ నర్సింలు, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు.. పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పా ఠశాలకు చెందిన ఖోఖో జట్టు రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. కా మారెడ్డి జిల్లా స్థాయిలో గురువారం జరిగిన సీఎం కప్ పోటీల్లో ఈ జట్టు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికై ందని పాఠశాల హెచ్ఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు. పీడీ అతీక్లతో పాటు ఎంపికై న జట్టును అభినందించారు. పాస్లు ఉంటేనే అనుమతి నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు వి ధించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి 5 కి లోమీటర్ల వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆదేశాలు జారీ చేశారు. దారి మళ్లింపు: నిజామాబాద్ నగరంలో వాహనాల దారి మళ్లింపు ఉంటుందని సీపీ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ఆర్టీసీ బస్సు లు, ఇతర వాహనాలు బైపాస్ రోడ్డు గుండా కలెక్టరేట్ మీదుగా కాలూరు, ఖానాపూర్ జంక్షన్ నుంచి దుబ్బ చౌరస్తా వరకు, అక్కడి నుంచి శివాజీ విగ్రహం, రైల్వే ఫ్లైఓవర్ మీ దుగా బస్టాండ్కు చేరుకోవాలని పేర్కొన్నా రు. బోధన్, బాన్సువాడ నుంచి వచ్చే వాహనాలు రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. -
ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి సంకల్ప ఆయుర్వేద ఆస్పత్రిలో మహా శివరాత్రి సందర్భంగా గురువారం మూడు రోజుల ఉచిత ఆయుర్వేద శిబిరం ప్రారంభం కాగా విశేష స్పందన లభించిందని వైద్యుడు మృత్యుంజయ శివాచార్య తెలిపారు. కీళ్లు, వెన్ను, మెడ నొప్పులతో ఉచిత శిబిరానికి వచ్చిన వారికి రూ.2,800 విలువైన ఉచిత వైద్యాన్ని అందించారు. ఉచిత శిబిరం శుక్ర, శనివారాల్లోనూ కొనసాగుతుందని వైద్యులు పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే వారు ముందుగా 99491 57912, 99854 28897 నంబర్లకు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. దోమకొండ: ముత్యంపేటలో గల రేణుక ఎల్ల మ్మ తల్లి బోనాల పండుగతో పాటు కల్యాణోత్సవం పురస్కరించుకొని గురువారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు ఆహ్వాన పత్రిక అందజేసినట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. సర్పంచ్ అరుట్ల కవి త, ఉప సర్పంచ్ సత్తయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు రంగోల్ మైసాగౌడ్, రాజాగౌడ్, సొసైటీ మాజీ వైస్ చైర్పర్సన్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి తదితరులున్నారు. నస్రుల్లాబాద్: అంకోల్ గ్రామానికి చెందిన సాయి మూడు రోజుల క్రితం వర్నిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబానికి గ్రామ యువకులు చందాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.63,500 అందించారు. భిక్కనూరు: దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ చేయూతనందించాలని సిద్ధరామేశ్వరాలయం మహంత్ సదాశివ మహంత్ అన్నారు. గురువారం తిప్పాపూర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న కాకిగండి శివాలయంలో ఆయన మాట్లాడారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిప్పాపూర్ సర్పంచ్ కుంట లింగారెడ్డి, ఆలయం అభివృద్ధి కమిటీ ప్రతినిదులు తెలిపారు. సైంటిస్టు ఆకిటి రాజిరెడ్డి.. ఆలయంలో టైల్స్ వేసేందుకు రూ.43 వేలు విరాళంగా అందజేశాడన్నారు. -
ఎవరి రాత ఎట్లుందో..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. కాగా ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలు కానుంది. ఉదయం 11 గంటల కల్లా పూర్తి ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించిన అన్ని వార్డుల ఓట్ల లెక్కంపు ఏకకాలంలో జరుగనుంది. కామారెడ్డిలో 49 వార్డులు ఉండడంతో మొదట 32 వార్డులను లెక్కించి, తరువాత మిగతా 17 వార్డులను లెక్కించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆశిష్ సంగ్వాన్ పర్యవేక్షణలో నాలుగు చోట్ల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు లెక్కలు.. సీటు చర్చలు పోలింగ్ ముగిసిన తరువాత ఆయా రాజకీయ పార్టీ ల నేతలు పోలైన ఓట్లు, పోలింగు సరళిపై చర్చించుకుని తమకు ఎన్ని వస్తాయో లెక్కలేసుకున్నారు. మెజారిటీ స్థానాలు దక్కితే చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ సరిపడా వార్డులు గెలుచుకోని పక్షంలో ఎవరి మద్దతు కూడగట్టుకోవాలన్న దానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. చైర్మన్ పీఠంపై కన్నేసిన పలువురు వార్డు సభ్యులు అప్పుడే ముఖ్య నేతలతో మంతనాలు మొదలుపెట్టారు. కొందరైతే ఎంత ఖర్చయినా పెట్టుకుంటామని తమకే అవకాశం ఇవ్వాలంటున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఆయా పార్టీల్లో ముందుగానే క్లారిటీతో ఉన్నారు. అయితే కామారెడ్డి మున్సిపల్కు సంబందించి చైర్మన్ అభ్యర్థి ఎవరన్నదానిపై ఏ పార్టీలోనూ స్పష్టత లేదు. గెలుపొందిన అభ్యర్థుల్లో నుంచి ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అయితే ఒకరిద్దరు మహిళా కౌన్సిలర్లు ముందస్తుగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, స్ట్రైకింగ్ ఫోర్స్ను సిద్ధం చేసి ఉంచారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం, ర్యాలీలు ఊరేగింపులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.ఓట్ల లెక్కింపు కోసం నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 261 మందిని నియమించారు. వీరిలో 87 మంది సూపర్వైజర్లు కాగా, 174 మంది అసిస్టెంట్లు ఉంటారు. కామారెడ్డిలో 49 వార్డులకు సంబందించి ఓట్ల లెక్కంపు కోసం 114 మంది, బాన్సువాడలో 63 మంది, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో 42 మంది చొప్పున నియమించారు. లెక్కింపు కోసం నియమించిన సిబ్బందికి పలు దఫాల్లో శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ పత్రాలు కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించారు. కౌంటింగ్ ఏజెంట్ల సమయంలో ఓట్లను లెక్కిస్తారు.మున్సిపాలిటీ వార్డులు కౌంటింగ్ కేంద్రం కామారెడ్డి 49 ఏఎంసీ గోడౌన్ (జిల్లాపోలీసు కార్యాలయం) ఎల్లారెడ్డి 12 మోడల్ డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి బాన్సువాడ 19 ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీ, బాన్సువాడ బిచ్కుంద 12 మార్కెట్ కమిటీ, బిచ్కుంద నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు నాలుగు పట్టణాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోననే ఉత్కంఠ పుర పీఠంపై పలువురికి ఆశలు -
మార్చిలో ఎకో టూరిజం పనులు!
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అనుకున్నట్లుగా అన్ని జరిగితే రానున్న మార్చిలోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం, గాదేపల్లి వద్ద బ్యాక్వాటర్ ప్రాంతాన్ని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ రంజిత్ నాయక్ డీఎఫ్డీవో వికాస్ మీనా, అర్కిటెక్చర్ పృథ్వీలతో కలిసి గురువారం పరిశీలించారు. వాచ్టవర్లు, రిసా ర్టులు, విశ్రాంతి గదులు, పార్కింగ్ ఏరియా ఎక్కడెక్కడ పెట్టాలో మరోసారి చర్చించారు. మ్యాపులు, ప్లాన్లు అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చన్నారు. స్థానిక గ్రామాలకు ఉపాధి కల్పించేలా నేచర్ గైడ్ల నియామకానికి కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకు కొంతమంది యువకులను పిలిచి వారితో మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్లో 20 రోజులపాటు శిక్షణ ఉంటుందని, ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. పనుల్లో కూడా స్థానికులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. వన సంరక్షణ కమిటీలో కూడా స్థానికులనే ఉంచుతామని ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్ కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారన్నారు. ఆరు నెలల్లో ఎకో టూరిజం పూర్తిగా ఏర్పడి పర్యాటకుల సందడి నెలకొంటుందని చెప్పారు. అధికారుల వెంట ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్డీసీ అధికారులు శ్రీనివాస్, శిరీష, డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, గాదేపల్లి సర్పంచ్ చిన్నారెడ్డి ఉన్నారు. కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు అధికారుల వెల్లడి గాదేపల్లి బ్యాక్వాటర్ ప్రాంతాన్ని పరిశీలించిన ఎఫ్డీసీ డైరెక్టర్ రంజిత్ నాయక్ -
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి
కామారెడ్డి టౌన్: విద్యార్థుల కోసం సరిపడా బస్సులు కల్పించాలని ఏబీవీపీ నాయకులు గురువారం కామారెడ్డి డిపో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణమూర్తిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. బస్సులు సకాలంలో రాకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అదనపు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా విద్యార్థులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏబీవీపీ నగర కార్యదర్శి సంజయ్, నేతలు అల్తాఫ్, స్వస్తిక్, తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ స్టాప్లు పెంచాలి బీబీపేట: జనగామలో ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్లను పెంచాలని కోరుతూ గురువారం గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. అలాగే గతంలో జనగామ నుంచి కామారెడ్డి కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉదయం షెట్విన్ బస్ అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం అది రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిని గమనించి విద్యార్థుల కోసం ఉదయం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
శివస్వాముల ఆధ్వర్యంలో పల్లకీసేవ భిక్కనూరు: మండల కేంద్రంలో శివస్వాముల ఆధ్వర్యంలో గురువారం పల్లకీ సేవ నిర్వహించారు. సిద్ధరామేశ్వరాలయం మహంత్ సదాశివమహంత్ ఆద్వర్యంలో చేపట్టిన శివస్వాముల పల్లకీ సేవకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కొండగట్టుకు తరలిన హన్మాన్ స్వాములు భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన 26 మంది హనుమాన్స్వాములు మండల దీక్ష పూర్తి చేసుకుని గురువారం కొండగట్టు హన్మాన్ దేవాలయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుని దీక్ష విరమణ చేస్తామని స్వాములు తెలిపారు. హన్మాన్ గురుస్వాములు నాగభూషణం, గజ్జెవేణు, గంగారాం, శంకర్లతో పాటు హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. క్రిస్టియన్ మైనార్టీ ఫౌండేషన్ డే వేడుకలు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో గురువారం క్రిస్టియన్ మైనార్టీ ఫౌండేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి బహుమతులను ప్రదానం చేశారు. ప్రిన్సిపల్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలి భిక్కనూరు: ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవాలని కంటివైద్యుడు రవీందర్ పటేల్ అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ ఫోన్లను వీలైనంత తక్కువగా చూడాలన్నారు. కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. కంటి వైద్యులు సాధన, ఎంపీహెచ్ఈవో వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ సతీష్, తదితరులు పాల్గొన్నారు. వశిష్ట విద్యాసంస్థల వార్షికోత్సవం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డె న్లో వశిష్ట విద్యాసంస్థల 23వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా టీయూ ప్రొఫె సర్ సంపత్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థా యికి ఎదగాలని పిలుపునిచ్చారు. సీఈవో హరిస్మర ణ్ రెడ్డి విద్యార్థులకు నైపుణ్యాల ఆవశ్యకతను వివ రించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా, టాపర్లకు బహుమతులు అందజేశారు. కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ ● దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డిలో కార్మికుల భారీ ర్యాలీకామారెడ్డి టౌన్: కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థాని క మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించా రు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దారు ణమన్నారు. దీని కారణంగా 8 గంటల పనిదినం మృగ్యమవుతాయని, కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు కందారపు రాజనర్సు, కన్వీనర్ అరుణ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన, మున్సిపల్ కార్మికులను కనీసం కార్మికులు గా కూడా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్ యూ నియన్ నాయకులు మహబూబ్, దీవెన, శివరాజు, ఆశ వర్కర్ల ప్రతినిధులు రాజశ్రీ, ఇంద్ర, అంగన్వాడీ నాయకులు బాబాయ్, లక్ష్మి, మధ్యాహ్న భోజనం వర్కర్ల సంఘం నాయకులు వెంకటేశ్, గ్రామపంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు బాలనర్సు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటహైస్కూ ల్కు చెందిన నలుగురు విద్యార్థులు సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై నట్లు పీడీ సభాత్ కృష్ణ గురువారం తెలిపారు. హైస్కూల్కు చెందిన నీలిమ, పవిత్ర బాలికల విభాగంలో, మనోహార్, ఆంజనేయులు బాలుర విభాగంలో సీఎం కప్ జిల్లా స్థాయి నెట్బాల్ పోటీల్లో ఉత్తమప్రతిభ కనబర్చారని ఆయన చెప్పారు. విద్యార్థులను హెచ్ఎం వెంకట్రాంరెడ్డితోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన కస్తూర్భా పాఠశాలకు చెందిన విద్యార్థినులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్స్పాల్ సత్యశీల గురువారం తెలిపారు. అలాగే కరాటే పోటీల్లో కస్తూర్భా పాఠశాలకు చెందిన సంధ్య జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిందని ఆమె వెల్లడించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): కల్వరాల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస సైన్స్ టాలెంట్ సెర్చ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ప్రసన్న, స్నేహలు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఈ నెల 17, 18వ తేదీలలో జాతీయ సైన్స్ ఫెయిర్.. పూణెలో జరుగనున్నాయన్నారు. పాల్గొనడానికి అవసరమైన ట్రైన్ టికెట్తో పాటు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని హెచ్ఎం విష్ణువర్ధన్ రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్, పూర్ణారావులు అందించారు. విద్యార్థులను డీఈవో రాజు, ఎంఈవో యోసెఫ్ అభినందించారు. వీడీసీ చైర్మన్ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రం తనిఖీ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ (సీఎస్ఈ, ఏఐ) మొదటి సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 71 మందికి 71 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్తో కలిసి ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్: సైబర్ మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం కాకతీయ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సెబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలని, అపరిచిత కాల్స్ను నమ్మకూడదని సూచించారు. -
డ్రైవర్ ఉన్నా.. బస్సు లేదు!
నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆటోల్లో నుంచి దిగుతున్న విద్యార్థినులునస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోల్లో చేరుకున్న వీరంతా బీఎస్సీ నర్సింగ్కళాశాల విద్యార్థినులు. సుమారు 200 మంది వరకు ప్రతి రోజూ ఒక్కొక్కరు రూ.50 ఖర్చు పెట్టుకుని ప్రతిరోజూ మండల కేంద్రానికి వచ్చి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. కళాశాలకు బస్సు లేకపోవడంతో వీరిపై ఆర్థికభారం పడుతోంది. ప్రాక్టికల్స్ కోసం గ్రామాలకు వెళ్లాల్సి ఉన్నా నర్సింగ్ విద్యార్థినులకు రవాణా సౌకర్యం లేదు. దుర్కిలోని కళాశాల నుంచి బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులు నిత్యం తమ సొంత ఖర్చుతో వెళ్తున్నారు. నర్సింగ్ కళాశాలలో డ్రైవర్, క్లీనర్ పోస్టులు భర్తీ అయినా బస్సు లేకపోవడంతో వారిని కార్యాలయ పనులకు వినియోగించుకుంటున్నారు. – నస్రుల్లాబాద్ -
క్రీడలతో మానసికోల్లాసం
కామారెడ్డి క్రైం: క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 జిల్లాస్థాయి క్రీడలను కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చీఫ్ మినిస్టర్స్ కప్ వంటి పోటీలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర్లుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ విజేత ఎల్లారెడ్డి కామారెడ్డి అర్బన్: సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో ఖోఖో బాలికల విభాగంలో కామారెడ్డి నియోజకవర్గం జట్టు ప్రథమ, ఎల్లారెడ్డి నియోజకవర్గం ద్వితీయ స్థానం పొందాయి. ఖోఖో బాలుర విభాగంలో జుక్కల్ నియోజకవర్గం ప్రథమ, ఎల్లారెడ్డి ద్వితీయ స్థానం పొందాయి. కబడ్డీ మహిళల విభాగంలో బాన్సువాడ ప్రథథమ, కామారెడ్డి ద్వితీయ స్థానం పొందాయి, కబడ్డీ పురుషుల విభాగంలో ఎల్లారెడ్డి ప్రథమ, జుక్కల్ ద్వితీయ స్థానం పొందాయి. వాలీబాల్ బాలికల విభాగంలో కామారెడ్డి ప్రథమ, బాన్సువాడ ద్వితీయ, బాలుర విభాగంలో బాన్సువాడ ప్రథమ, ఎల్లారెడ్డి ద్వితీయ స్థానాలు పొందాయి. విజేతలకు అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ కప్లను అందజేశారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చీఫ్ మినిస్టర్స్ కప్ –2025 జిల్లాస్థాయి క్రీడల ప్రారంభం -
ప్రజావ్యతిరేక విధానాలను వీడాలి
పిట్లం(జుక్కల్): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పిట్లం ఏఎంసీలోని గోదాం ముందు గురువారం హమాలీలు సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బుర్రెం బాల్రాజ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. కార్మిక ప్రజా వ్యతిరేకత విధానాలను విడనాడాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వమే కార్మికులకు జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మకాలు ఆపాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అసంఘటిత రంగ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకోకపోతే ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామన్నారు. హమాలీలు శ్రీనివాస్. రాజేష్, పీరయ్య. శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలపై ఉత్కంఠ
బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయన్నా ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. వార్డుల్లో ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయోనని అంచనాలు వేసుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో స్వతంత్రులు గట్టీ పోటీ ఇవ్వడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫలితాలపై పట్టణంలో అందరి నోటా అదే చర్చ కొనసాగుతుంది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు వెలవడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉన్నాయి. పట్టణంలో 24,188 మంది ఓటర్లు ఉంటే 17,817 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్డుల్లో ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గట్టీ పోటీ ఇస్తే మరి కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు భారీగా ఓట్లను ప్రభావితం చేశారు. ఒక్కటి రెండు వార్డుల్లోనైతే స్వతంత్ర అభ్యర్థులు గెలుపు అంచుల్లో ఉన్నట్లు తెలిసింది. ఓటర్ల నాడి తెలుసుకోవడంలో అభ్యర్థులు పడుతున్న పాట్లు అంతాఇంతా కాదు. గెలుపొటములపై ఒక్కొక్కరు ఒక్కలా సమాధానం చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన కలుగుతోంది. అభ్యర్థులు గెలుపు ధీమాతో ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. పెట్టిన ఖర్చులకు ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలేసుకుంటున్నారు. అభ్యర్థుల అనుచరులు మాత్రం అన్నా మనదే గెలుపు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న అభ్యర్థులు ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారడంతో ఈ ఎన్నికల్లో ఖర్చులు తలకు మించి భారమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రచార అస్త్రాలుగా మారాయి. ఈ ఫలితాల్లో ఎంత ప్రభావం చూపుతాయో అనేదే ప్రశ్న. ఫలితాల ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది. కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్మన్గా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ సతీమణి విజయను ఇది వరకే ప్రకటించారు. దీంతో అందరి చూపు 5వ వార్డుపైనే ఉంది. బాన్సువాడ పుర పీఠం ఎవరికి వరించునో నేటి ఫలితాల లెక్కింపుతో తేలిపోనుంది. గెలుపు ధీమాలో అభ్యర్థులు ఓట్లపై అంచనాలు వేసుకుంటున్న పోటీదారులు ఫలితాలపై స్వతంత్రుల ప్రభావం పట్టణంలో కొనసాగుతున్న చర్చ -
రాయకూర్ గ్రామసభలో గందరగోళం
● పోలీస్స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు రుద్రూర్: మండలంలోని రాయకూర్ గ్రామ పంచాయతీలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామసభలో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని మొదలైన వివాదం చివరకు పోలీస్స్టేషన్లో పరస్పరం ఫి ర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు రాయకూర్ పంచాయతీ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులపై చర్చించేందుకు బుధవారం గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో టార్పాలిన్ కవర్లు వేయడంతో కుర్చీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెంట్, కుర్చీలు వేసి సభ ఏర్పాటు చేయా లని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పాలకవర్గం, ప్రత్యర్థి వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి సభ గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. వివాదంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై జీపీ పాలకవర్గ సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సైతం ఫిర్యాదు చేయగా, మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
ఉత్సవాలకు శివరాంమందిరం ముస్తాబు
దోమకొండ: మండల కేంద్రంలోని శివరాంమందిరం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య తెలిపారు. శివుడు, రాముడు కొలువైన ఆలయంగా శివరాంమందిరానికి పేరు ఉంది. దోమకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు ఉత్సవాలకు తరలివస్తారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని రంగులు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నేటి నుంచి సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు దోమకొండ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 31వ వార్షికోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. నేడు , రేపు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అన్నదానం ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్ తెలిపారు. ఆలయాన్ని అందంగా అలంకంరించారు. -
ఆయిల్పాం సాగు అంతంతే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్పాం సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2025–26లో ఆయిల్పాం పంట సాగు చేయాల్సిన లక్ష్యంలో ఇప్పటి వరకు సగం లక్ష్యం సైతం పంట సాగు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆయిల్పాం సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం కూ ఛ్ఛి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆయిల్పాం సాగుచేసే రైతులకు నాలుగేళ్ల తర్వాతే దిగుబడులు ప్రారంభమవుతాయి. జిల్లాలో ఎక్కువగా వరిపంటతో పాటు ఇతర ఆరుతడి పంటలను సాగుచేసి సీజన్ల వారీగా వచ్చే దిగుబడులకు అలవాటుపడిన రైతులు ఇప్పుడు ఆయిల్పాం సాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో ఈ యేడాది 2,500 ఎకరాల్లో ఆయిల్పాం పంటను సాగు చేయాల్సి ఉండగా 1,300 ఎకరాల్లో పంటసాగుకు అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు పొందారు. ఇప్పటి వరకు జిల్లాలో 711ఎకరాల్లో మాత్రమే ఆయిల్పాం పంటను రైతులు సాగు చేశారు. గడిచిన నాలుగేళ్లల్లో జిల్లాలో 2,700 ఎకరాల్లో ఆయిల్పాం పంటను సాగు చేశారు. కాగా సుదీర్ఘకాలం పాటు వచ్చే లాభాలతోపాటు ప్రభుత్వం అందించే రాయితీలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే జిల్లాలో ఆయిల్పాం సాగు లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేధిస్తున్న సిబ్బంది కొరత.. కాగా జిల్లాలోని ఉద్యాన శాఖలో తలెత్తిన సిబ్బంది కొరత వల్ల వివిధ రకాల ఉద్యాన పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం ఏడుగురు ఉద్యానశాఖ అధికారులు(హెచ్వో) ఉండాల్సిండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజకవర్గాలలో ఉద్యాన శాఖ అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంది. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రానికి ఒక హెచ్వో, జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో ఇద్దరు హెచ్వోలు విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ప్రస్తుతం జిల్లాలో నలుగురు హెచ్వోలు మాత్రమే ఉండడంతో వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిపై అదనపు భారం పడి జిల్లాలో ఉద్యానపంటలసాగు లక్ష్యం వెనకపడుతోంది. జిల్లాలో ఈ యేడాది 2,500 ఎకరాల్లో ఆయిల్పాం పంట సాగవుతుందని అంచనా వేసుకున్నాం. జిల్లాలో 1,300 ఎకరాల్లో ఆయిల్పాం పంటను సాగు చేయించేందుకు ఇదివరకే కలెక్టర్ నుంచి అనుమతులు పొందాం. అందులో ఇప్పటికే 711 ఎకరాల్లో పంట సాగు పూర్తయింది. మిగిలిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోపు నెరవేరుస్తాం. – జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి, కామారెడ్డి ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం 1,300 ఎకరాల్లో సాగుకు కలెక్టర్ అనుమతులు ఇప్పటివరకు 711 ఎకరాల్లో సాగు పూర్తి -
మానవత్వం చాటిన లింగంపల్లి గ్రామస్తులు
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి గ్రామానికి చెందిన బోదెల శేఖర్ దంపతుల కూతురు రుచిత(1.8 సంవత్సరాలు) ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండటంతో మంగళవారం హైదరాబాదు కొంపల్లిలోని సాయి సిద్ధార్థ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో శేఖర్ దంపతులు ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ప్రత్యూషకు వివరించారు. సర్పంచ్ పిలుపు మేరకు గ్రామస్తులు విరాళాలు సేకరించారు. రూ.లక్ష జమ చేసి చిన్నారి తల్లికి అందజేశారు. మంగళవారం రాత్రి ఆపరేషన్ చేశారు. చిన్నారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్కు సహకరించి బిడ్డ ప్రాణాలు కాపాడిన గ్రామ సర్పంచ్ ప్రత్యూష, సాయిరాం, ఉపసర్పంచ్ దాసారం సంతోష్, భానుచందర్గౌడ్, లక్ష్మణ్, ఆనంద్, నవీన్, అనిల్తో పాటు గ్రామస్తులకు శేఖర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోలింగ్ @ 69.48%
జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్.. తర్వాత వేగం పుంజుకుంది. కలెక్టర్, ఎస్పీ తదితరులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి బాన్సువాడలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ఓటర్లుజిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో ఓటర్లు పెద్దగా రాకపోవడంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఓటర్లు పోటెత్తారు. తర్వాత కంటిన్యూగా వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్య తదితరులు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పలు వార్డుల్లో ఘర్షణ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ● జిల్లా కేంద్రంలోని 8వ వార్డులోని ఆర్అండ్బీ పోలింగ్కేంద్రం వద్ద దొంగ ఓట్ల విషయంలో గొడవ జరిగింది. ఇతర మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు ఓటు వేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ● 9వ వార్డులోని ఎస్ఆర్కే కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. బీజేపీ వాళ్లే దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ గొడవలో ప్రత్యర్థులు రాళ్లు రువ్వడంతో బీజేపీ కార్యకర్త శ్యాంరెడ్డి తలకు గాయమయ్యింది. ● 24 వ వార్డులోని 73, 74, 75 పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంచుతున్నారంటూ మిగతా పార్టీలకు చెందిన వారు ఆందోళనకు దిగారు. ఓటర్ల ఫోన్ నంబర్లు తీసుకుని యూపీఐ ద్వారా నగదు బదిలీ చేస్తున్నట్లు గుర్తించిన ఇతర పార్టీల నేతలు పోలీసులను, అధికారులను నిలదీశారు. దీంతో సదరు అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఆందోళనకారులు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అరగంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ● 46, 47 వార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ● ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు తిరుగుతుంటే అడ్డుకోవలసిన పోలీసులు సహకరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారినందరినీ అరెస్టు చేసి నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ● బాన్సువాడలోని 9వ వార్డులో కాంగ్రెస్కు ఓటేయాలని ఓ కానిస్టేబుల్ చెప్పారని బీజేపీ నాయకులు ఆరోపించారు. 18 వ వార్డులో దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నవారిని బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నోటిఫికేషన్ వెలువడకముందే ఆశావహులు ప్రచారం మొదలుపెట్టారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ప్రచారాన్ని ఉధృతం చేశారు. విజయం కోసం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీ లతో పాటు కొన్ని వార్డుల్లో స్వతంత్య్ర అభ్యర్థులు కూడా అడ్డగోలుగా ఖర్చు చేశారు. వారి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. అందరిలోనూ గెలుపు ధీమా పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, పార్టీల నేతలు ఓట్ల లెక్కలు వేసుకున్నారు. పోలైన ఓట్లలో ఎవరి ఓట్లు తమకు వస్తాయో, ఎవరి ఓట్లు రావో అంచనాలు వేసుకున్న అభ్యర్థులు.. చాలామంది గెలుపు ధీమాలో ఉన్నారు. 15న వారి భవితవ్యం తేలనుంది. బల్దియా వార్డులు మొత్తం ఓటేసిన ఓటేసిన ఓటేసిన పోలయిన ఓటర్లు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం ఓట్లు కామారెడ్డి 49 99,313 30,822 34,653 08 65,483 ఎల్లారెడ్డి 12 13,265 5,110 5,470 01 10,581 బాన్సువాడ 19 24,188 8,540 9,272 06 17,818 బిచ్కుంద 12 12,759 4,921 5,092 01 10,014 మొత్తం 92 1,49,525 49,393 54,487 16 1,03,896బల్దియా పోలింగ్ కేంద్రాలు 9 గంటలు 11 గంటలు 1 గంట 3 గంటలు 5 గంటలు కామారెడ్డి 152 3.69 23.87 43.79 56.03 65.94 ఎల్లారెడ్డి 24 8.91 30.60 52.92 69.16 79.77 బాన్సువాడ 39 9.49 30.68 50.51 64.43 73.66 బిచ్కుంద 24 14.34 38.98 60.69 71.82 78.49 మొత్తం 239 6.00 26.86 47.13 59.90 69.48 కామారెడ్డి టౌన్ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజున జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రొబెల్స్ స్కూల్ నుంచి అడ్లూరు వెళ్లే మార్గంలో కలెక్టర్ ఆఫీస్ మూల మలుపు నుంచి వాహనాలకు అనుమతిలేదన్నారు. అలాగే రామారెడ్డి రోడ్డులోని గుమస్తా కాలనీ మూలమలుపు నుంచి కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ ముందున్న 100 ఫీట్ల రోడ్డులోనూ రాకపోకలను పూర్తిగా నిలిపివేశామన్నారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూరు–పోసానిపేట వరకు, కామారెడ్డి నుంచి గర్గుల్ –రామారెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వాహనాలు యథావిధిగా వెళ్లవచ్చని పేర్కొన్నారు. మందకొడిగా ప్రారంభమై.. ఊపందుకున్న పోలింగ్ బిచ్కుంద బల్దియాలో అత్యధికం.. జిల్లాకేంద్రంలో అత్యల్పం.. జిల్లాలో చెదురుమదురు సంఘటనలు -
కేసులు నమోదు
● ఎంపీ అర్వింద్పై ఒకటో టౌన్లో.. ● రెండో టౌన్లో 15 మంది బోగస్ ఓటర్లపై..నిజామాబాద్ అర్బన్: నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాల పోలింగ్ బూత్లోకి నిబంధనలకు విరుద్ధంగా దూసుకెళ్లారని, పోలీసులను దుర్భాషలాడారని ఎంపీ అర్వింద్తోపాటు మరో ఏడుగురు బీజేపీ నాయకులపై ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే దొంగ ఓట్లు వేసేందుకు యత్నించిన 14 మంది మహిళలపై రెండో టౌన్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గోల్డెన్జూబ్లీ పాఠశాల, నేషనల్ స్కూల్, వాటర్ ట్యాంక్ పాఠశాల పోలింగ్కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం నాయకుల మధ్య గొడవ జరగడంతో ఆరో టౌన్ పోలీస్లో ఎంఐఎం నాయకులు నలుగురిపై కేసులు నమోదయ్యాయి. బాబాసాహెబ్పహాడ్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటేసేందుకు యత్నించి పట్టుబడగా అతడిపై కేసు నమోదైంది. ● బోధన్ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన 12 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ● మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఒకటో డివిజన్ పరిధిలోని ఖానాపూర్లో మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు 20 మందిపై కేసులు నమోదు చేశారు. -
పట్టణ ఓటర్లలో తగ్గుతున్న చైతన్యం
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు ఊరూరా జనం పోటెత్తగా.. బుధవారం జరిగిన బల్దియా పోరులో పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో పోల్చినా ఈసారి తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యింది. 2020 నాటి మున్సిపల్ ఎన్నికలలో మూడు మున్సిపాలిటీల పరిధిలో సగటు పోలింగ్ శాతం 70.73 శాతం నమోదవగా.. ఈసారి 69.48 శాతానికి తగ్గింది. జిల్లాకేంద్రంలో మరీ తక్కువగా.. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి క్రితం సారి ఎన్నికల్లో 67.53 శాతం పోలింగు నమోదయ్యింది. ఈసారి ఓటర్లు మరింత బద్ధకించడంతో అది 65.94 శాతం వద్దే ఆగిపోయింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 80.35 శాతం మంది ఓటేస్తే ఈసారి 79.77 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్సువాడలో గతంలో 77.03 శాతం పోలింగ్ రికార్డు కాగా.. ఈసారి 73.66 శాతం మంది ఓటేశారు. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారి బిచ్కుందలో జరిగిన ఎన్నికల్లో 78.49 శాతం పోలింగ్ నమోదయ్యింది. -
రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులకు సన్మానం
బీబీపేట: జనగామ నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్, పాత జెన్నీక, చాకలి మనోజ్, డాకూరి వరుణ్, డాకూరి భానులను బుధవారం గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో జరిగిన సీఎం కప్ పోటీలలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డ్ సభ్యులు నర్సింహాచారి. బెల్లే వంశీ, డాకూరి శ్యామల, గ్రామస్తులు పాల్గొన్నారు. జనతా పాలసీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేతభిక్కనూరు: బస్వాపూర్ గ్రామానికి చెందిన వంక లింగం అనే రైతు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, సింగిల్ విండో సొసైటీలో సభ్యత్వం ఉన్నందున జనతా పాలసీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్య రాజవ్వకు సొసైటీ కార్యదర్శి మహేశ్వరి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సొసైటీలో రుణాలు తీసుకున్న వారు రెన్యువల్ చేసుకోవాలని, రెన్యువల్ చేసుకున్న వారికి వడ్డీ వాపస్ వస్తుందని ఆమె వివరించారు. సొసైటీ సిబ్బంది భగవంత్ రెడ్డి తదితరులున్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ మొదటి సెమిస్టర్, పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల మొదటి సెమిస్టర్, ఐఎంబీఏ ఏడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు. సమ్మెను విజయవంతం చేయండి నిజామాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామ్మోహన్రావు అన్నారు. నాందేవ్వాడలోని పెన్షనర్స్ భవనంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రిటైర్డ్ ఉద్యోగులందరూ పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రతినిధులు శిర్ప హనుమాండ్లు, ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, ప్రసాద్రావు పాల్గొన్నారు. -
ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తుక్కోజీవాడిలో బుధవారం మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 155 మందికి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సర్పంచ్ సంగారావు, వైద్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రత్నగిరిపల్లిలో కంటి వైద్య శిబిరం మాచారెడ్డి: రత్నగిరిపల్లిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన అశ్విని ఆస్పత్రి వైద్యులు సత్యనారాయణస్వామి, అభినయ్ ఆధ్వర్యంలో బుధవారం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 40 మందిని పరీక్షించారు. అవసరమైన వారికి మోతి బిందు ఆపరేషన్ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. కంటి అద్దాలను అందించారు. నేత్ర వైద్యుడు నవనీత్, సర్పంచ్ అనిత, ఆస్పత్రి సిబ్బంది మహేష్, సతీష్ పాల్గొన్నారు. -
భయం భయంగా విధులు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ గది, కార్యాలయం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. నిత్యం భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోందని సబ్ స్టేషన్లో పని చేసే ఆపరేటర్లు, విద్యుత్శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. స్థానిక సబ్స్టేషన్లో నిత్యం లైన్లను మార్చుతూ, ఎల్సీలు ఇస్తూ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. సబ్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరి స్లాబ్ పెచ్చులూడి మీద పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో భవనం ఊరుస్తుందని వారు తెలిపారు. నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను నిరోధించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో 8 చోట్ల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం, మాల్తుమ్మె ద గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను బుధవారం హౌసింగ్ డీఈఈ సుష్మ, ఏఈ అస్మా తబస్సుమ్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం కొలతలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు వారు సూచించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. మాల్తుమ్మెద ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు ఉన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో బుధవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కత్తుల లక్ష్మి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలోని కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కార్యదర్శి, క్షేత్రసహాయకులకు సూచించారు. కుంటలో పూడికతీత పనులు వేగవంతం చేయాలని సూచించారు. కూలీలు సమయపాలన పాటించాలన్నారు. ఉపసర్పంచ్ నీల రాజు, అంజయ్య, క్షేత్రసహాయకుడు సతీష్, కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నా యని పోచారం గ్రామ సర్పంచ్ బాలాజీ పటేల్ పేర్కొన్నారు. బుధవారం పోచారం గ్రామానికి చెందిన సాయిలు కుటుంబానికి రూ.60 వేల విలువైన చెక్కులను అందజేశారు. ఉప సర్పంచ్ మేత్రి రాజు, తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): కుప్రియాల్ గ్రామానికి చెందిన కాలభైరవ భజన మండలి సభ్యులు తిరుమలలో భజన కీర్తనలు ఆలపించారు. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో భాగంగా కీర్తనలు ఆలపించినట్లు వారు పేర్కొన్నారు. -
ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ధర్పల్లి: మండల కేంద్రంలో కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మల్లయ్య ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ధర్పల్లి: ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. -
నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
బాన్సువాడ రూరల్/బిచ్కుంద: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, నిష్పక్షపాతంగా పనిచేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. మంగళవారం ఆమె బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, బిచ్కుందలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు గుర్తింపుపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల కేంద్రాల్లో ఏ పొరపాటు జరిగినా రిటర్నింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రి సకాలంలో, సురక్షితంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. -
తాగునీటి వృథాను అరికట్టాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో తాగునీటి వృథాను అరికట్టాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ప్రవీణ్రెడ్డి సూచించారు. రాఘవపల్లి, అక్కంపల్లి, గోపాల్పేట గ్రామాల్లో తాగునీటి సరపరాపై మంగళవారం స్థానిక అధికారులతో కలిసి వారు స్పెషల్డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్లతో కలిసి వారు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు వారు సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజ్కుమార్, రాఘవపల్లి, అక్కంపల్లి సర్పంచ్లు గంగామణి, వెంకాగౌడ్, కార్యదర్శులు జానకి, కిష్టయ్య, రాజు తదితరులున్నారు. -
అక్రమాలపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవులు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. బిచ్కుందలో స్థానిక ఎమ్మెల్యే స్వయంగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని, వార్డుల్లో మద్యం, మటన్ విందులు భారీగా సాగుతున్నాయని ఆరోపించారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే బిచ్కుందకు ప్రత్యేక అధికారిని నియమించి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని పెద్ద టాక్లీ శివారులో కుక్కల దాడిలో మంగళవారం జింకకు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులో జింకను కుక్కలు చుట్టుముట్టి కరిచాయి. గమనించిన గ్రామస్తులు కుక్కలను తరమికొట్టి జింకకు సపర్యలు చేసి కాపాడారు. జింకకు గాయాలైన విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ప్రథమ చికిత్స చేసి తీసుకెళ్లారు. పిట్లం(జుక్కల్): బుర్నాపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నున్న స్థలాన్ని, కమ్యూనిటీ భవనాన్ని కబ్జా కాకుండా చూడాలని కోరుతూ ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు.. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆ స్థలంలోకి రాకుండా బుర్నాపూర్ సర్పంచ్ కంచె వేయించారని ఆరోపించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు తమ్మడి స్వామి, రాజు, నేతలు బట్ట రాజు, కనగాళ్ల రాములు, లక్ష్మణ్, బి. ప్రకాష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. మంగళవారం ఆయన కన్నాపూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సర్పంచ్ సంజీవులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
అయ్యప్ప ఆలయానికి విరాళం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఉత్తర శబరి అయ్యప్ప ఆలయానికి స్థానిక నాయకులు వంజరి ఎల్లమయ్య రూ.2.11 లక్షల విరాళం అందజేశారు. మంగళవారం ఆలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విరాళం ప్రకటించి ఆలయ ధర్మకర్త రవీందర్గౌడ్కు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు చంద్రమౌళి, శ్రీకాంత్, రాజిరెడ్డి, అరుణ్, గౌతమ్, వినోద్, సందీప్, సేవ్యానాయక్, రాజు పాల్గొన్నారు. భిక్కనూరు: వృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రెడ్డి వృద్ధుల సంఘం అధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవునిపల్లిలో వృద్ధుల సంఘం సమావేశం నిర్వహించారు. అనంతరం వృద్ధులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. సంఘం సభ్యులు నర్సారెడ్డి, తిరుమలరెడ్డి, రాజిరెడ్డి, మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దోమకొండ: గ్రామ పంచాయితీల పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం ముత్యంపేటలో నర్సరీని పరిశీలించి అనంతరం మొక్కలకు నీటిని పోశారు. ఆయన వెంట మండల విద్యాధికారి విజయ్కుమార్, ఎంపీవో రవికుమార్, గ్రామ సర్పంచ్ ఆశబోయిన అక్షర, కార్యదర్శి అంజయ్య, ఉపసర్పంచ్ మహేందర్గౌడ్, నాయకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. హాజీపూర్లో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్లో నర్సరీని ఎంపీడీవో తాహేరాబేగం మంగళవారం పరిశీలించారు. నర్సరీలో మొక్కలు బాగా పెరిగేందుకు మంచి విత్తనాలు బ్యాగులలో నాటాలని అన్నారు. ప్రతి రోజు నీరు పట్టి వాటిని సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు. -
సంక్షిప్తం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి మద్నూర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం శేఖాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామ శివారులోని నర్సరీని పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీడీవో రాణి, మద్నూర్ పంచాయతీ కార్యదర్శి సందీప్ ఉన్నారు. కూలీలు సమయ పాలన పాటించాలి మాచారెడ్డి: ఉపాధి హామీ కూలీలు సమయ పాలన పాటించాలని ఫరీదుపేట గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన ఉపాధిహామీ పనులను ప్రారంభించారు. కూలీలు కొలతల ప్రకారం పనులు చేస్తూ ఉపాధి పొందాలని సూచించారు. ఉప సర్పంచ్ బాలాగౌడ్, వార్డు సభ్యులు జనపాల శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, కారోబార్ రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్ భూమేష్ ఉన్నారు. మోతెలో ఉపాధి పనులు ప్రారంభం లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ సుజాతాబాయి తెలిపారు. గ్రామంలోని కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. క్షేత్రసహాయకుడు సరిచంద్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఎర్రాపహాడ్ పీహెచ్సీలో ఆరోగ్య మహిళ కార్యక్రమం తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్ పీహెచ్సీలో మంగళవారం ఆర్యోగ్య మహిళా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేశారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఽవైద్యాధికారి కాశిం, హోమియోపతి డాక్టర్ విజయలక్ష్మి, హెచ్ఈవో నారాయణ, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దివ్యాంగులకు ఫిజియోథెరపి భిక్కనూరు: మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం ఏడుగురు విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఫిజియోథెరపీతో మానసిక ఉపశమనం కలుగుతుందని ఫిజియోథెరపిస్ట్ నవీన్ సాయి పేర్కొన్నారు. మండల విద్యాధికారి రాజగంగారెడ్డి, హెచ్ఎం శ్రీమతి, స్పెషల్ ఎడ్యుకేటర్స్ స్వప్న, ఐఆర్పీ మహేందర్, తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులతో ఆర్థిక భరోసా పెద్దకొడప్గల్(జుక్కల్):సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పే దకుటుంబాలకు ఆర్థిక భరోసా వస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బేగంపూర్ గ్రామానికి చెందిన సాయిగొండకు, పెద్దకొడప్గల్ గ్రామానికి చెందిన సేరేష్ కుమార్కు చెక్కులను మండల కేంద్రంలో పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ నాగరాజ్, నాయకులు పండరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి భిక్కనూరు: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవా లని మండల పీహెచ్సీ వైద్యాధికారి దివ్య సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రిలో అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ల్యాబ్ టెక్నిషియన్ వనశ్రీ, సిబ్బంది పూజ, హేమలత, యశోద తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి పెద్దకొడప్గల్(జుక్కల్): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎంఈవో ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని అంజని, శివాపూర్, తలాబ్ తండా పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో దంపతుల అరెస్టు
● సీసీటీవీ ఫుటేజీతో కేసును ఛేదించిన పోలీసులు సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీ కేసులో దంపతులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. ఈ నెల 7న మండలంలోని పద్మాజివాడి చౌరస్తాకు చెందిన యాళ్ల సురేశ్ రెడ్డి ఇంట్లోకు చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు మూడు పట్టగొలుసుల జతలు, రూ.15 వేల నగదు, రెండు గ్రాముల బంగారు దుద్దులు అపహరించారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ సంతోష్కుమార్, ఎస్సై పుష్పరాజ్ ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. బాలె నర్సింలు అలియాస్ చింటూ(చిన్నా), బొల్లిపల్లి రేణుకా అలియాస్ మైలారం రేణుక కలిసి ఆటోను నేర సాధనంగా ఉపయోగించి చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను మర్కల్ మల్లన్నగుట్ట వద్ద పట్టుకొని వారి నుంచి ఆటో, మొబైల్, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్కుమార్, ఎస్సై పుష్పరాజ్, కానిస్టేబుల్ రవి, అజర్ ఫారూక్, అబ్దుల్ హమీద్, శశికాంత్, స్వర్ణలత, నరేశ్, శ్రీకాంత్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు. -
క్రైం కార్నర్
ఒంటరి జీవితాన్ని భరించలేక ఆత్మహత్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వృద్ధుడు మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. తిమ్మోజివాడి గ్రామానికి చెందిన దుబ్బాక బాలయ్య(60)కు రామారెడ్డికి చెందిన సత్తవ్వతో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 15 సంవత్సరాలుగా గొడవల కారణంగా భర్తను వదిలి రామారెడ్డిలోని పుట్టింట్లో కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తుంది. అప్పటి నుంచి బాలయ్య ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. దగ్గి గ్రామశివారు 44వ జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి కూతురు స్రవంతి, కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు రెంజల్(బోధన్): రెండు బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సోమవారం రాత్రి సాటాపూర్ సమీపంలోని ఫంక్షన్ హాల్లో శుభకార్యం ముగించుకొని అదే గ్రామానికి చెందిన ఆవుల సాయిలు, లంబాడి బంతి తమ టీవీఎస్ ఎక్సెల్పై గ్రామానికి వచ్చేందుకు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో బోధన్ వైపు నుంచి పల్సర్ బైక్పై వస్తున్న దేవేందర్ టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెదగేట్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిద్దిగారి భూమయ్య తన ఎక్సెల్ వాహనంపై రోడ్డును దాటుతుండగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడీల రవీందర్రెడ్డి తన కారుతో ఢీకొట్టాడు. ప్రమాదంలో భూ మయ్య తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భూమయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. -
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఎల్లారెడ్డి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్డీవో పార్థసింహారెడ్డి తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 పోలింగ్ కేంద్రాలకు గాను 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, 72 మంది ఓపీవోలు, ఆరుగురు మైక్రో అబ్జర్వర్లు, 22 మంది రిజర్వు సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు. సరిపడా వాహనాల ఏర్పాటు ఎల్లారెడ్డిరూరల్: పోలింగ్ సిబ్బందితో పాటు సామగ్రిని తరలించేందుకు సరిపడా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ఏఎంవీఐ మహ్మద్ రఫీక్ మంగళవారం తెలిపారు. 7 బస్సులు, రెండు కార్లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. -
ప్రలోభాల హోరు..!
● యథేచ్ఛగా నగదు, మద్యం పంపిణీ ● ఓటుకు నోటు.. గడప గడపకూ మద్యం బాటిళ్లు ● గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చు కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల సమరం ముగుస్తున్న వేళ కామారెడ్డిలో ప్రలోభాల పర్వం పరాకాష్టకు చేరింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. నిన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన నేతలు, ఇప్పుడు ‘నగదు.. మద్యం’ పంపిణీపై దృష్టి సారించారు. పట్టణంలోని పలు వార్డుల్లో రాత్రికి రాత్రే నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు చేతులు మారినట్లు సమాచారం. గెలుపు కోసం ఎంతటి ఖర్చుకై నా వెనుకాడబోమని అభ్యర్థులు భీష్మించుకోవడంతో కామారెడ్డి వీధుల్లో ప్రలోభాల హోరు కనిపించింది. వార్డుల్లో హడావుడి.. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులు ఓటుకు ఇంత అని రేటు ఫిక్స్ చేసి పంపిణీ సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియను కానిచ్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటి సభ్యుల సంఖ్యను బట్టి కవర్లలో నగదు పెట్టి నేరుగా ఓటర్ల చేతుల్లో పెడుతున్నట్లు తెలిసింది. కొత్త పట్టణంలో చైర్పర్సన్ రేసులో ఉన్న ఓ వార్డులో ప్రధాన పార్టీల వారు ఓటుకు రూ.3 వేలకు పైగా పంపిణీ చేసినట్లు సమాచారం. అన్ని వార్డుల్లో రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్రులు సైతం పోటాపోటీగా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. వార్డు కౌన్సిలర్లుగా విజయం సాధించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రలోభాల పర్వం సామాన్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్లో కలవని చేతులు
● ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ ● బాన్సువాడలో అర్ధరాత్రి ఉద్రిక్తతబాన్సువాడ/రుద్రూర్ : హస్తం పార్టీలోని నేతల మధ్య సయోధ్య కరువయ్యింది. తన భార్యను ఓడించడానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆంగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాసుల బాల్రాజ్ భార్య విజయ 5వ వార్డునుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమెకు చైర్ పర్సన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆమెను ఓడించడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని సోమవారం అర్ధరాత్రి సమాచారం అందడంతో కాసుల బాల్రాజ్ అక్కడికి బయలుదేరారు. ఎదురుగా కారులో వస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ను ఆయన తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. అనంతరం చంద్రశేఖర్ కాలర్ పట్టుకుని తన భార్యను ఓడించడానికి బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయ్యావంటూ దుర్భాషలాడారు. అర్ధరాత్రి సమయంలో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్ను తాడ్కోల్లో ఎందుకు కలిశావంటూ నిలదీశారు. కారులో డబ్బులున్నాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అక్కడికి చేరుకుంది. వారికి చంద్రశేఖర్ కారులో రూ. 52 వేలు లభించాయి. అయితే అవి తనవి కావని, కాసుల బాల్రాజ్ అనుచరులే పెట్టారని చంద్రశేఖర్ ఆరోపించారు. వైరల్గా మారిన వీడియోలు.. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రశేఖర్ తాడ్కోల్లోని వెంకట్రాంరెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నాయకుడు యలమంచలి శ్రీనివాస్తో సమావేశమై తిరిగి వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలతోపాటు.. చంద్రశేఖర్పై కాసుల బాల్రాజ్ దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది. -
ఎన్నికలకు భారీ బందోబస్తు
● 722 మందితో ఐదంచెల భద్రత ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 722 మంది పోలీసులు ఎన్నికల భద్రత విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ముగ్గురు డీఎస్పీల పర్యవేక్షణలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 10 మంది సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, 21 రూట్ మొబైల్ పార్టీలతో పాటు మరో ఐదుగురు ఎస్హెచ్వోలతో పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా బృందాలు నిరంతరం భద్రతా చర్యల్లో పాల్గొంటాయన్నారు. జిల్లాలో గుర్తించిన 17 క్రిటికల్, 8 సెన్సిటివ్, 8 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని సూచించారు. పోలింగ్ బూత్లో సెల్ఫీలు దిగడం నిషిద్ధమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ను సజావుగా నిర్వహించాలి
● సమస్యలు తలెత్తితే సమాచారం ఇవ్వండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వ హించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని ఏఎంసీ గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ సమయంలో ఏవైనా సమస్య లు తలెత్తితే విధులు నిర్వహించే అధికారులు వెంట నే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూ చించారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారు లు తమ కేంద్రాలకు తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ పూర్తి చేసి రిసెప్షన్ కేంద్రానికి చేరుకునే వ రకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ తప్పకుండా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సి బ్బందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతులు, బస్సు సౌకర్యం కల్పించామని తెలిపా రు. పోలింగ్, భద్రత సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహ న్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల అ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండో విడత ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. కౌంటింగ్ సూపర్వైజ ర్లు, అసిస్టెంట్లకు రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులు నిర్వహించాల్సిన బల్దియాలను కేటాయించారు. కౌంటింగ్కు మొత్తం సూపర్వైజర్లుగా 89 మందిని, అసిస్టెంట్లుగా 178 మంది సిబ్బందిని కేటాయించామని కలెక్టర్ తెలిపారు. వారికి ఆయా మున్సిపాలిటీల్లో ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సీపీవో రఘునందన్, స్టాటిస్టికల్ ఆఫీసర్ శివకుమార్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. లెండి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కామారెడ్డి క్రైం: లెండి అంతరాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని మంగళవా రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించా రు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఉన్న జలసౌధ భవనం నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సమావేశంలో చర్చించారు. ‘రేపటి బంద్లో ఆటో జేఏసీ పాల్గొనట్లేదు’ కామారెడ్డి అర్బన్: ఈనెల 12న చేపట్టే రాష్ట్ర బంద్కు కామారెడ్డి జిల్లా ఆటో జేఏసీ మద్ద తు ఇవ్వడం లేదని ఆటో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు ఒక ప్రకటనలో తె లిపారు. వామపక్ష యూనియన్లు, పార్టీలు తమ ఉనికి కోసం బంద్ పాటిస్తున్నాయని ఆరోపించారు. బంద్తో ఆటో కార్మికులకు ఒరిగేది ఏమీ లేదని పేర్కొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, అందుకే బంద్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం : సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్కు సమీపంలోని ఈవీఎం గో దాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవా రం సందర్శించారు. రికార్డులు, భద్రతా చ ర్యలు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవె న్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, ఎ న్నికల డిప్యూటీ తహసీల్దార్ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల తనిఖీ మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియాతోపాటు అవసరమైన ఇతర ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేయాలని సూచించారు. ఈ యాప్ ద్వారా రైతులు కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో ఎక్కడైనా యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి మాచారెడ్డి : ప్రతి ఒక్కరు బ్యాంక్ల సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎల్డీఎం చంద్రశేఖర్ సూచించారు. పాల్వంచ మండలం భవానీపేటలో మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ల సౌజన్యంతో స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంక్ ఖాతాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎస్ఎస్టీ ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, కౌన్సిలర్ ప్రవీణ్, పాల్వంచ టీజీబీ మేనేజర్ వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పోలింగ్కు వేళాయె!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు వేళయ్యింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 447 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,49,525 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటరు ఎటువైపో? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ గతనెల 27న వెలువడింది. అదే రోజునుంచి మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమను గెలిపించాలని కోరారు. ఆయా పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, సభలు, సమావేశలు నిర్వహించారు. కొందరైతే ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించారు. కులాలు, సంఘాలు, సిండికేట్లు, సొసైటీల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వారి డిమాండ్లు నెవరేర్చారు. కొందరు అభ్యర్థులు సొంత డబ్బులతో కొన్ని గల్లీల్లో బోర్లు తవ్వించారు. అధికార పార్టీకి చెందిన వారు పలుకుబడి ఉపయోగించి బోర్లు వేయించి మోటార్లు బిగించారు. నోటిఫికేషన్ రాకముందే సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కట్టించారు. మరికొన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. అభ్యర్థులు పలువురు ఓటర్లను ఆకట్టుకోవడానికి విందులు ఏర్పాటు చేశారు. తాయిలాలూ అందించారు. గెలుపుకోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. పలువురు డబ్బును నీళ్లలా ఖర్చు చేశారు. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తం కానుంది. ఓటర్లు ఎవరిని ఆదరించారో శుక్రవారం తేలనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కామారెడ్డిలో 17 మంది, ఎల్లారెడ్డిలో నలుగురు, బాన్సువాడలో ఏ డుగురు, బిచ్కుందలో నలుగురు విధులు నిర్వహిస్తున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 1,398 మంది సిబ్బందిని నియమించారు. కామారెడ్డిలో 883 మంది, ఎల్లారెడ్డిలో 142 మంది, బాన్సువాడలో 229 మంది, బిచ్కుందలో 144 మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. నాలుగు మున్సిపాలి టీల పరిధిలోని 92 వార్డుల్లో ఏర్పాటు చేసిన 239 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలు నిఘా నీడలో ఉన్నాయి. అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ప్రత్యేక బృందాల ద్వారా ఆయా కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.522 బ్యాలెట్ బాక్సులు..కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల కోసం 522 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఇందులో కామారెడ్డి బల్దియాకు అత్యధికంగా 364, బాన్సువాడకు 60, ఎల్లారెడ్డికి 58, బి చ్కుందకు 40 బాక్సులు కేటాయించారు. వీటి ని పోలింగ్ కేంద్రాలకు పంపించారు. పోలింగ్ పూర్తవగానే స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు.మున్సిపాలిటీలలో వార్డులు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు..బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.. పురపోరు చివరి దశకు చేరుకుంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఓటరు తన తీర్పును బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేయనున్నాడు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులు ఎన్నికల బరిలో 447 మంది అభ్యర్థులు 239 పోలింగ్ కేంద్రాల్లో ఓటేయనున్న 1,49,525 మంది ఓటర్లు ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరిన సిబ్బంది నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ -
రక్తదానం ప్రాణదానంతో సమానం
కామారెడ్డి క్రైం: రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలోని యూనియన్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. శిబిరంలో 153 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రతినిధులు మధుసూధన్రెడ్డి, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి మంగళవారం ఉదయం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలో ఏఎంసీ గోడౌన్ (ఎస్పీ ఆఫీస్ దగ్గర), బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బిచ్కుందలో మార్కెట్ యార్డ్లలో సామగ్రి పంపిణి కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఉదయం 8 గంటలకు చేరుకోవాలని సూచించారు. కామారెడ్డి క్రైం : ‘సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగు – కేవైసీ’ అనే నినాదంతో 13 వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవా లను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ కేవైసీ సంబంధిత మోసాలను నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజ ల్లో ఈ–కేవైసీ, సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి ‘ఒక బ్యాంకు శాఖ–ఒక గ్రామసభ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వినోద్, రాకేష్ కుమా ర్, సుజిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. దోమకొండ: రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఆర్చరీ కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. సోమవారం దోమకొండ గడికోటలో సీఎం కప్ ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండలో నిర్వహించినట్లు ఆర్చరీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్గౌడ్ తెలిపారు. బాలికల విభాగం(30 మీటర్లు)లో సహస్ర, బాలుర విభాగంలో ఎస్కే. రెహన్ ఎంపికయ్యారు. అదేవిధంగా బాలిక విభాగం(40 మీటర్లు)లో ఎన్.భావన, బాలుర విభాగంలో పీఆర్ రామచరణ్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్లో బాలికల విభాగంలో బి.వర్షిణి, పి.నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్.స్నేహిత్లు ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్లలో శ్రీ వైష్ణవి ఎంపికయ్యా రని కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. గ్రామ స ర్పంచ్ ఐరేని నర్సయ్య, పీడీ నరసింహారెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, మార్కెట్ కమి టీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖ ర్, సిద్ధ రాములు, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. నిబంధనల ప్రకారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు కేంద్రాలను కేటాయించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సీపీవో రఘునందన్, అధికారులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడున్నా.. వచ్చి ఓటేయన్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపాలిటీల పరిధిలో ఓటు ఉండి స్థానికంగా ఉండని ఓటర్ల వివరాలు సేకరించిన అభ్యర్థులు.. వారికి ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడున్నా వచ్చి ఓటేసి వెళ్లాలని కోరుతున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నపుడు వారి ఓట్లు అక్కడ నమోదు చేసుకుని, తర్వాత సొంత ఇళ్లు కట్టుకుని వేరే చోటుకు వెళ్లారు. మరికొందరు వేరే అద్దె ఇంట్లోకి మారారు. ఇలా చాలా మంది ఓట్లున్నాయి. ప్రతి వార్డులో వందల సంఖ్యలో స్థానికంగా ఉండని ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున పోల్ మేనేజ్మెంట్ చేస్తున్న వారు స్థానికంగా ఉండని వారిపై ఫోకస్ చేసి వారి వివరాలను సేకరించారు. వలస వెళ్లిన వారిలో తమకు వచ్చే ఓట్లు ఎన్ని అన్న లెక్కలు వేసుకుని, అనుకూలంగా ఉన్న వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తమవారు కాదనుకున్న వారికీ ఫోన్లు చేస్తున్నారు. ఈనెల 11న జరిగే ఓటింగ్కు రావాలని కోరుతున్నారు. రాకపోకలకు అయ్యే ఖర్చులను భరిస్తామని, కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా ఓటుకు ఇంత ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. స్థానికంగా వేరే వార్డుల్లో ఉన్న వారికి మద్యం, డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. కొందరికి ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న వారు ఓటేయడానికి రావచ్చని భావిస్తున్నారు. అడ్రస్ లేని వారెందరో... ఓటరు జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో కొందరికి సంబంధించిన సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. కొన్ని కుటుంబాల ఫోన్ నంబర్లు కూడా ఎవరి వద్దా లేవు. కాంటాక్ట్ నంబర్లు దొరక్కపోవడతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. స్థానికంగా ఉండని ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు పోలింగ్ రోజు రావాలంటూ వేడుకోలు ఎంత ఖర్చయినా ఇస్తామంటున్న పలువురు.. -
‘నిర్భయంగా ఓటు వేయండి’
కామారెడ్డి క్రైం: ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. కొత్త పట్టణంలోని శిశుమందిర్ పాఠశాల నుంచి ప్రారంభమైన పోలీసుల కవాతు బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, బడా మజిద్, పాంచ్రస్తా, డెయిలీ మార్కెట్, భరత్ రోడ్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్ మీదుగా రాజీవ్ పార్క్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందన్నారు. అభ్యర్థులు గానీ, వారి మద్దతుదారులు గానీ ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దన్నారు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హోరెత్తిన ప్రచారం!
● ఆఖరి నిమిషం దాకా గల్లీలు చుట్టేసిన ముఖ్య నేతలు ● ర్యాలీలు నిర్వహించిన అభ్యర్థులుజిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిమున్సిపల్ ఎన్నికలలో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్యనేతలు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ గతనెల 27న వెలువడింది. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్కతేలింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల తరఫున పలువురు ముఖ్యనేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, బీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోలు, సభలలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి బల్దియాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఎంపీ సురేశ్ షెట్కార్లు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విస్తృతంగా ప్రచారం చేశారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బల్దియా ఎన్నికలలో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని ఆయన ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల పక్షాల ఆ పార్టీ నేతలు పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడలో.. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు పలువురు నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిచ్కుందలో.. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతం ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే వార్డులను కలియ తిరిగారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. అందరిలోనూ గెలుపు ధీమా నాలుగు మున్సిపాలిటీలలో ప్రచారం ముగిసిన తర్వాత ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తమతమ పార్టీలకు చెందిన అభ్యర్థులు మెజారిటీ వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు సైలెన్స్ పీరియడ్లో నిశ్శబ్దంగా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.కామారెడ్డి 33వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కామారెడ్డి పదో వార్డులో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతామని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు వార్డుల్లో ఓటర్ల దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత అవినీతికి అడ్డుపడిందని, అక్రమాలకు తెరపడిందని పేర్కొంటూ బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేయాలని ఓటర్లను కోరుతున్నారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
● నాలుగు మున్సిపాలిటీల్లో 239 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ప్రతి ఓటరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ‘‘జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులున్నాయి. ఓటర్లకోసం 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కలిపి 1,49,525 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డిలో 99,313 మంది, ఎల్లారెడ్డిలో 13,265 మంది, బాన్సువాడలో 24,188 మంది, బిచ్కుందలో 12,759 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులు ఉండగా.. 152 పోలింగ్ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 24, బాన్సువాడలో 19 వార్డులకు 39, బిచ్కుందలో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. బరిలో 447 మంది అభ్యర్థులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకుగాను 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 89 స్థానాల్లో పోటీలో ఉంది. ఎంఐఎం పదిచోట్ల, బీఎస్పీ నాలుగు చోట్ల, సీపీఎం మూడుచోట్ల, ఆప్ ఒక వార్డులో అభ్యర్థులను నిలిపాయి. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలనుంచి 18 మంది, స్వతంత్రులు 138 మంది పోటీలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 68 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆ యా కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అలాగే అన్ని కేంద్రాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. 1,398 మంది సిబ్బంది... పోలింగ్ నిర్వహణ కోసం 1,398 మంది సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. కామారెడ్డిలో 883 మంది, ఎల్లారెడ్డిలో 142 మంది, బాన్సువాడలో 229 మంది, బిచ్కుందలో 144 మంది సిబ్బందిని నియమించాం. ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కామారెడ్డిలో 17 మంది, ఎల్లారెడ్డిలో నలుగురు, బాన్సువాడలో ఏడుగురు, బిచ్కుందలో నలుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న జరిగే కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశాం. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఉంది. ఎల్లారెడ్డి బల్దియాకు సంబంధించి ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో, బిచ్కుందలో ఏఎంసీలో కౌంటింగ్ నిర్వహిస్తాం. -
మున్సిపల్ పీఠం బీజేపీదే
● ఎమ్మెల్యే కేవీఆర్ కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ ర్యాలీలో జై బీజేపీ.. జై జై బీజేపీ నినాదాలు మిన్నంటాయి. అభ్యర్థులతో కలిిసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా మున్సిపల్ పీఠం బీజేపీ కై వసం చేసుకుంటుందని అన్నారు. కామారెడ్డి అభివృద్ధి, అవినీతి రహిత పాలన కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల బీసీ విద్యార్థులకు విదేశాల్లోని అత్యున్నత విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అందించడానికి ఈ నెల 17న నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోగా నేరుగా నిజామాబాద్ సుభాష్నగర్లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08462–241055 నంబర్కు సంప్రదించవచ్చన్నారు. అత్తగారింటికి వెళ్తూ.. అనంత లోకాలకు నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు ఇలా.. అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయిలు(28) సోమవారం భార్య మనీషా, ఏడాది వయస్సు గల కొడుకుతో కలిసి బైక్పై బోధన్లోని అత్తగారి ఇంటికి బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం వద్ద వారి బైక్ను బోధన్ నుంచి వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను అత్తగారింటిలో దింపి,అతడు కరీంనగర్లో బతుకు దెరువు కో సం పని చూసుకొని వస్తానని పేర్కొన్నట్లు సమా చారం.కానీ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
అందరి లెక్కలు సరి చేస్తాం
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ :ఈ రెండున్నర ఏళ్లలో పోచారం శ్రీనివా స్రెడ్డి బాన్సువాడకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని, గత సర్పంచ్ ఎన్నికల్లో కోటగిరి మండల కేంద్రం తప్ప మిగతా మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులే సర్పంచులుగా విజయం సా ధించారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను బె దిరిస్తున్నారని,అందరి లెక్కలు సరి చేస్తామని హె చ్చరించారు. సోమవారం బాన్సువాడలోని 9వ అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూపకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి యువకులు పోటీ చేస్తున్నారని, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. 9వ వార్డు అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూప, 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, గాండ్ల కృష్ణ, మహేష్, బాడి శ్రీనివాస్, అక్బర్, లయక్, చందర్, సాయిబాబా తదితరులున్నారు. -
సంక్షిప్తం..
గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. మాల్తుమ్మెద గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని, నర్సరీని.. ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నెమ్మదిగా కొనసాగిస్తున్న లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శి అశోక్ను ఆదేశించారు. సృజనాత్మకతకు కళలు మూలం మద్నూర్(జుక్కల్):సృజనాత్మకతకు కళలు మూల మని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అ న్నారు. ముంబై రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వేసిన వివిధ వర్ణచిత్రాలను సోమవా రం ఆవిష్కరించారు. వివిధ రకాల చిత్రాలు వేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రముఖ పద్యకవి, చిత్రకారుడు వెంకట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి లింగంపేట(ఎల్లారెడ్డి): అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. సోమవారం ఆయన అయ్యపల్లి తండా అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల హా జరు,పాఠశాలనిర్వాహణరికార్డులను పరిశీలించారు. చిన్నటాక్లీలో.. మద్నూర్(జుక్కల్): అంగన్వాడిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మద్నూర్ ప్రాజెక్ట్ సీడీపీవో కళావతి సూచించారు. డోంగ్లీ మండలంలోని చిన్న టాక్లీ అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్లు సమయపాలన పాటించి.. నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యను అందించాలన్నారు. సూపర్వైజర్ సచిత ఉన్నారు. ఉపాధి పనులు ప్రారంభం లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు, నల్లమడుగు తండాల శివారులో సోమవారం సర్పంచులు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూలీలు సమయపాలన పాటించి కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. సర్పంచ్ దేవసోత్ కవిత, క్షేత్రసహాయకులు, మేట్లు పాల్గొన్నారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు సదాశివనగర్(ఎల్లారెడ్డి):అర్హులైన నిరుపేదలందరి కి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లు స ర్పంచ్ లాల్సింగ్, ఉప సర్పంచ్ రమేశ్రెడ్డి పేర్కొ న్నారు.సోమవారం తిర్మన్పల్లిలో ఇందిరమ్మ గృహా ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ఇంతియాజుద్దిన్, నాయకులు కావేటి సాయిలు, పెద్దొల్ల సాయిలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ను ఆశీర్వదించండి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటర్లను కోరారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు. హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. -
ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటికే చాలా పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రూ.8 కోట్లతో ఇండోర్ స్టేడియం, అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు, మార్చి నాటికి గోదావరి నీటి సరఫరా పెంపు పనులు వేగవంతం చేస్తామన్నారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని, ఎన్నికల తర్వాత ఇక్కడి ఎమ్మెల్యే కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రైలు పట్టాలు దాటుతూ వృద్ధురాలి మృతి కామారెడ్డి టౌన్: రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ఇలా.. వనపర్తి జిల్లాకు చెందిన మిరిగిల్లా సరోజమ్మ (75) ఆదివారం కామారెడ్డి రైల్వే గేట్ సమీపంలో పట్టాలు దాటుతోంది. భవానీ నగర్ నుంచి స్నేహపురి కాలనీ వైపు వెళ్తుండగా, అదే సమయంలో వస్తున్న తిరుపతి స్పెషల్ రైలును ఆమె గమనించలేదు. వేగంగా వచ్చిన రైలు సరోజమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పట్టాల పక్కన పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో మేకల కాపరి.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని వండ్రికల్ గ్రామంలో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన మేకల కాపరి మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వేముల కిషన్రావు(25) సోమవారం మేకల మేత కోసం గ్రామ శివారులో గల మత్తడి ఒర్రెవద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న మేడిచెట్టు పైకెక్కి కొమ్మలు నరికే క్రమంలో చెట్టు పైనుంచి వెళ్లిన 11కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అతడు చెట్టుపైనే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్యామ్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, 21 రోజుల వయస్సు గల కుమారుడున్నట్లు తెలిపారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగ 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి జరగడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. -
ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి
సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ: ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారం ముగియడంతో బాన్సువాడ పట్టణంలోని 19 వార్డుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని, పట్టణంలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. డబ్బుకు, మద్యానికి ఓటర్లు లోను కావవద్దని, రాజ్యంగబద్దంగా ఓటేయాలని సూచించారు. డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన బాన్సువాడ:ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమ వారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను పరిశీలించారు.ఏయే గదుల్లో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చే యాలో సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది సమయానికి రావాలని అ న్నారు.మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఉన్నారు. ఎల్లారెడ్డిలో..ఆర్డీవో పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డిరూరల్:ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆర్డీవో పార్థసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. మంగళవారం ఎన్నికలకు సంబంధించిన సామగ్రి ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ యన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. తహసీల్దా ర్ ప్రేమ్కుమార్, ఎంపీడీవో తాహేరాబేగం, మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరులున్నారు. -
‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను మార్చిలోగా ఒకే విడతలో చెల్లించకపోతే ఉద్యమిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి పీఆర్టీయూ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జిల్లాలోని 81 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లోవిజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్రెడ్డి, భిక్షంగౌడ్, జిల్లా అధ్యక్షుడు కుషాల్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
● పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సో మవారం సంబంధిత నోడల్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ సిబ్బంది కేటాయింపు (డిస్ట్రిబ్యూషన్), పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమన్నారు. ప్రతి దశను పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్నిరకాల మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు మంగళవారం ఉదయం 7 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సామగ్రిని సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, వివిధ శాఖల నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దండుపాళ్యం బ్యాచ్ను సాగనంపండి
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న దండుపాళ్యం బ్యాచ్ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయని.. అదే నిధులతో ఎల్లారెడ్డిలో పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.5 కోట్లతో బస్టాండ్ నిర్మాణం, రూ.18 కోట్లతో డబుల్ బెడ్రూంల నిర్మాణం, రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు బీఆర్ఎస్ నిధులు మంజూరు చేసి నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసి తాము అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.2 కోట్ల నిధులు కూడా తేలేదని అన్నారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లకు బీటీ వేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జలంధర్రెడ్డి, ఆదిమూలం సతీష్, మనోహర్రెడ్డి, శ్రీనివాస్నాయక్, నర్సింలు, ముదాం సాయిలు, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రసీలా, పద్మ, జీనత్ సుల్తానా, తదితరులున్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
● ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి ఎంపీ నిధులు పూర్తిగా అందిస్తాం ● జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్కే మద్దతుల పలకాలని, రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎల్లారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావుతో కలిసి ఎంపీ మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు, పార్క్లను ఏర్పాటు చేశామన్నారు. తాను గతంలో ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లారెడ్డికి మోడల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించానన్నారు. ఎల్లారెడ్డి మీదుగా రుద్రూర్ వరకు ఎన్హెచ్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే కరీంనగర్–కామారెడ్డి– ఎల్లారెడ్డి నేషనల్ హైవే పనులు జరుగుతాయని అన్నారు. దీనికి సంబంధించిన నిధులు త్వరలోనే మంజూరవుతాయని అన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే మున్సిపల్లో 12 వార్డుల్లో గెలుపే లక్ష్యమని, కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బస్టాండ్ పునర్నిర్మాణం, పెద్ద చెరువు కట్టమీద మినీ ట్యాంక్ అభివృద్ధి, పార్క్, ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. విలీన గ్రామాలలో విద్యుత్ లేక ఇబ్బందులు పడితే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ను అందించామన్నారు. మధ్యంతరంగా వదిలి వేసిన 300 ‘డబుల్’ ఇళ్లకు నిధులు మంజూరు చేయించి లబ్ధిదారులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి అర్బన్: పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, ప్రయివేట్ రంగ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అశ్లీల వ్యాఖ్యలు, అభస్య ప్రవర్తన, శారీరక వేధింపులు నేరంగా పరిగణిస్తారని, 50 శాతం మంది మహిళలతో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు. అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలు షీబాక్స్ పోర్టల్లో నమో దు చేయాలని ఆమె సూచించారు. వివరాలకు మహిళా హెల్ప్ లైన్ 181 లేదా పోలీసు హెల్ప్ లైన్ 100 సంప్రదించవచ్చన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): సోషల్ మీడియా యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్ రాజేందర్ రావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు, ప్రగతి గ్రామ సంఘాల్లో మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత కోల్పోతే కుటుంబం, పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్రామ సంఘం అధ్యక్షులు గువ్వ భూదేవి, ఎం.లలిత, సీసీ ఆంజనేయులు, పర్యవేక్షణ సమాఖ్య ప్రతినిధి లత, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉండి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్ అన్నారు. సోమవారం కళాశాలలో కళాశాల టీఎస్కేసీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. జాబ్మేళాలో ఏడుగురు విద్యార్థులు ఎంపిక కావడంపై ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్కేసీ సమన్వయకర్త రాజ్గంభీర్రావు, అధ్యాపకులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: శ్రీరాం నారాయణ ఖేడి యా ప్రభుత్వ డిగ్రీకళాశాల(అటానమస్) మొ దటి, మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సో మవారం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫె సర్ కే.సంపత్కుమార్తో కలిసి ప్రిన్సిపల్ గంగాధర్ విడుదల చేశారు. అటానమస్ హోదా లో మొదటి సెమిస్టర్లో 61శాతం, మూడో సెమిస్టర్లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నా రు. యూనివర్సిటీ అదనపు కంట్రోలర్ శాంతాబాయి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ సోమవారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరగనుండటంతో 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసి వేయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు తెలిపారు. -
యూరియా ‘యాప్’ తప్పనిసరి
● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ● స్మార్ట్ ఫోన్లతో రైతుల ఆపసోపాలు ● యూరియా కోసం గోదాముల వద్ద బారులు నిజాంసాగర్(జుక్కల్): రైతులు యూరియా బస్తాలు పొందడానికి యాప్ బుకింగ్ విధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొన్నటి వరకు పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు యూరియాను అందజేయగా, ఆదివారం యాప్ విధానం అమలు చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి స్మార్ట్ఫోన్లు లేకపోవడం, మరికొందరికి ఫోన్లు ఉన్నా బుకింగ్ విధానం తెలియక సతమతమయ్యారు. అవాక్కయిన రైతులు, సిబ్బంది.. నిజాంసాగర్ మండల కేంద్రంలోని అచ్చంపేట సొసైటీ గోదాముకు శనివారం సాయంత్రం లారీలో 444 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు గోదాము వద్దకు చేరుకొని రాత్రి అక్కడే పడుకున్నారు. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేసేందుకు సొసైటీ సిబ్బంది సిద్ధం కాగా, అధికారులు యాప్లో నమోదు తప్పనిసరి అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే బస్తాలు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రైతులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకొని సొసైటీ సిబ్బందికి ఇవ్వడంతో యాప్ నమోదు ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఎకరానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. కాగా, యాప్లో బుకింగ్ చేసుకున్నా, కొందరు రైతులకు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. -
స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి!
● నాలుగు దశాబ్దాల తన ప్రస్తానానికి అక్షరరూపం ● ఆయన మరణించిన రోజునే వెలుగులోకి ● సామాజిక మాధ్యమాల్లో వైరల్ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : Ñç³ÏÐø-§ýlÅ-Ð]l$…ÌZ çÜ$©Æý‡ƒM>ÌS… ç³°-^ólíÜ G¯ŒS-Mú…-r-ÆŠ‡ÌZ ^èl°-´ùƇ$$¯]l Ð]l*ÐøÆ‡$$çÜ$t A{VýS-¯ól™èl {糿ê-MýSÆŠ‡ AÍ-Ķæ*‹Ü ç³yýlPÌŒæ-ÝëÓÑ$, AÍ-Ķæ*‹Ü ÌZMóSsìæ ^èl…§ýlÆŠ‡ ¯éË$VýS$ §ýlÔ>»êªÌS ™èl¯]l {ç³Ýë¢-¯]l…Oò³ Æ>çÜ$-MýS$¯]l² ïÜÓĶæ$ ^èlÇ{™èl Ôèæ°-ÐéÆý‡… Æ>{† ¯]l$…_ ÝëÐ]l*hMýS Ð]l*«§ýlÅÐ]l*ÌZÏ ^èlMýSPÆý‡$Ï Möyýl$-™ø…-¨.ÝëÓÑ$ D ¯ðlÌS 6¯]l VýSyìlaÆøÍ hÌêÏÌZ fÇ-W¯]l G¯ŒS-Mú…-rÆŠ‡ÌZ Ð]l$Æý‡-×ìæ…-_¯]l ÑçÙĶæ$… ™ðlÍ-íÜ…§ól. ™èl¯]l iÑ™èl ^èlÇ-{™èl¯]l$ ÑÐ]l-ÇçÜ*¢ VýS™èl…ÌZ BĶæ$¯]l Æ>íܯ]l ïÜÓĶæ$ ^èlÇ{™èl C糚yýl$ A…§ýl-DZ ^èl¨ÑÝù¢…-¨. C{Ýùh-ÐéyîlÌZ 1969 ÌZ f°-Ã…-_¯]l సస్వÝëÓÑ$ BÆø-™èlÆý‡VýS† Ð]lÆý‡MýS$ Ð]l*{™èlÐól$ ^èl¨Ñ-¯]lr$t A…§ýl$ÌZ õ³ÆöP¯é²Æý‡$. ™èl¯]l 16Ð]l Hsê 1984ÌZ çÜ…Vøh-Ðé-yìlMìS ^ðl…¨¯]l çÜ$ÌZ-^èl-¯]l™ø ÑÐé-çßæ-OÐðl$…-§ýl-°, Ð]l¬VýS$YÆý‡$ í³ÌSÏ˰ õ³ÆöP-¯é²Æý‡$. ò³§ýlª MýS*™èl$Æý‡$ Æý‡h™èl ç³#r$t-MýS-™ø¯ól ¨ÐéÅ…-VýS$Æ>Ë$ M>Ð]l-yýl…, ç³§ýlÐ]lÊyø Hsê 1999ÌZ ^èl°-´ù-Ƈ$$…§ýl° ÑÐ]l-Ç…-^éyýl$. 1995ÌZ JMýSÝëÇ ™èl¯]l FÇMìS ÐðlãÏ ™èlÍϧýl…{yýl$-ÌS¯]l$ MýSÍíÜ Ð]l*sêÏyé-¯]l-°, A§ól BQÇ ^èl*ç³# A° ÐðlÌSÏyìl…^éyýl$. నాలుగు దశాబ్దాల నాడే విప్లవ పాఠాలు... 1986లో ఇస్రోజివ ాడి గ్రామానికి వచ్చిన విప్లవకారులతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతోనే తాను రాడికల్ యూత్ లీగ్లో చేరి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు వివరించాడు. భూస్వాముల అరాచకాలపై సంఘ సభ్యులతో కలిసి జరిపిన పోరాటాలను తెలిపాడు. ఊరును పోలీసులు చుట్టుముట్టి ప్రజల్ని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టిన విషయంలో భూస్వాములపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రజల్ని వదిలిపెట్టారని తెలిపాడు. 1991లో పూర్తిస్థాయి విప్లవకారుడిగా మారినట్టు పేర్కొన్నాడు. కామారెడ్డి లోకల్ ఏరియా దళంలో, తర్వాత సిర్నాపల్లి దళ కమాండర్గా, డివిజన్ కమిటీ మెంబర్గా, కామారెడ్డి ఏరియా కమాండర్గా సిరిసిల్లా ఏరియాకు ఇన్చార్జీగా ఉండి ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని గైడ్ చేసినట్టు తెలిపాడు. తెలంగాణ ప్లీనంలో కొంతమంది క్యాడర్ను దండకారణ్యానికి పంపాలని తీసుకున్న నిర్ణయం మేరకు 2003 డిసెంబర్లో తాను అక్కడికి వెళ్లినట్టు వివరించారు. దక్షిణ సబ్ జోనల్ బ్యూరోలోని పశ్చిమ బస్తర్లో డీవీసీఎంగా, తర్వాత కంపనీ–2 కమాండర్గా, సచీవ్గానూ, దక్షిణ్ సబ్ జోనల్ కమాండ్ మెంబర్గా పనిచేసినట్టు అందులో వివరించారు. 2006లో దండకారణ్య కాన్ఫరెన్సులో తనను ఎస్జెడ్సీలోకి తీసుకున్నారని, ఉద్యమ అవసరాల రీత్యా 2011లో పశ్చిమ సబ్ జోనల్కు బదిలీ అయి 2020 వరకు అక్కడే సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, కంపెనీ 10కు సచీవ్గా, కంపెనీ 4కు సచీవ్గా, ఉత్తర్ గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జీగా పనిచేసినట్టు తెలిపాడు. దాడులకు నాయకత్వం.. 1993లో సిరా ్న పల్లిలో పోలీస్ అవుట్పోస్టుపై దా డి, 1999లో మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్పై దాడి, రామారెడ్డి పోలీస్ అవుట్పోస్టులపై దాడికి ప్రయత్నం చేసినట్లు వివరించాడు. కరీంనగర్ జిల్లా చందుర్తిలో 1998లో అంబుష్ వేసి ఎస్సైని, 2000 సంవత్సరంలో కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ అంబూష్లో తాను పాల్గొన్నది వివరించాడు. శత్రుదాడులకు గురైన ఘటనలు ఎన్నో... 1993లో నిజామాబాద్ జిల్లా పడ్కల్లో ఆరుగురితో కూడిన దళం ఒక ఇంట్లో ఉన్న సమాచారంతో వందలాది మంది పోలీసు బలగాలు చుట్టుముట్టిన ఘటనలో హోరాహోరీగా జరిగిన పోరాటాన్ని వివరించాడు. అందరూ చనిపోయినా తాను ఎలా తప్పించుకున్నది అందులో పేర్కొన్నాడు. 1999లో ప్రాజెక్టు రామడుగులో దాడి నుంచి తప్పించుకున్నట్టు, 1997లో నల్లవెల్లిలో యూత్తో మాట్లాడుతుండగా జరిగిన దాడి, 2020–21లో జగిత్యాల మండలం గజ్జెరాళ్లగుట్టపై ఉండగా గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన దాడి, అందులో రమేశ్ అనే దళకమాండర్ చనిపోగా, మిగతా వారు తప్పించుకున్నది వివరించాడు. 1998లో సిర్నాపల్లి అడవిలో జరిగిన దాడిలో తనతోపాటు న్యాలకొండ రజిత అలియాస్ పద్మక్క తప్పించుకున్న తీరును తెలిపాడు. -
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
బాన్సువాడ: బాన్సువాడ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గడుమల లింగమేశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏ బల్దియాలో జరగని అభివృద్ధిని బాన్సువాడలో చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రుణం తీర్చుకోవాలంటే 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని అన్నారు. ప్రతి వార్డులో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత పోచారంకే దక్కిందన్నారు. గతంలో 11వ వార్డులో కౌన్సిలర్గా పని చేసిన లింగంకు ప్రజల అభిమానం ఉందని, ఈ సారి లింగంను గెలిపించుకుంటే మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామన్నారు. నేతలు కృష్ణారెడ్డి, గులేపల్లి శంకర్, జిన్న రఘు, జీవన్, మల్లారెడ్డి, లక్ష్మణ్, నారాయణ, కొంకి విఠల్, గులేపల్లి రమేష్, అనిత ఉన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
లింగంపేట/ కామారెడ్డి టౌన్: లింగంపేట మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 1970–71 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రతాప్రెడ్డి, రఘునాథ్, సుధాకర్, గురునాథ్, చంద్రశేఖర్, సరసింహరెడ్డి, సాజిద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1972–73 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ భేటీలో పూర్వ విద్యార్థులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నరాముల అశోక్(41) గత సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహమ్మద్నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంసాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘట్ జిల్లా వాలేగావ్ గ్రామానికి చెందిన రాజ్కుమార్(38) కొన్ని నెలల క్రితం మండల కేంద్రానికి వచ్చి తాపీ మేస్త్రి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ మాట్లాడుతూ గొడవ పడేవాడు. అతిగా మద్యం సేవించేవాడు. ఆదివారం స్వగ్రామానికి వెళ్తున్నట్లు తోటివారితో చెప్పిన అతను ఇంటి బయట బట్టల బ్యాగు ఉండటాన్ని తోటి మేస్త్రిలు గమనించారు. వారు ఇంట్లో అతని కోసం వెతుకగా బాత్రూమ్లో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
నేటితో ప్రచారానికి తెర
● తుది అంకానికి చేరుకున్న అభ్యర్థుల ప్రచారం ● సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు ● గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలుమున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకా నికి చేరుకుంది. నేడు సోమ వారం సాయంత్రంతో బ హిరంగ ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. గెలుపు కో సం 9, 10వ తేదీల్లో అంతర్గతంగా చక్రం తిప్పేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేయనున్నారు. గెలుపు ఓటములను నిర్ణయించే కీలకమైన 11వ తేదీ పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బహిరంగ ప్రచారానికి స్వస్తి.. బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో, చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు నియోజకవర్గాలను వీడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రలోభాలకు సిద్ధం.. ప్రచార గడువు ముగియడంతో 9, 10వ తేదీల్లో ప్రధాన పార్టీలు, స్వతంత్రులు తమ గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలతో చక్రం తిప్పనున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, సామాజిక వర్గాల వారీగా మంతనాలు జరపనున్నారు. కాగా, పోలింగ్కు ఒకరోజు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీ ల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అగ్రనేతల రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో పట్టణాలు హోరెత్తాయి. నాలుగు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం నిర్వహించారు.జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 1,49,525 ఓటర్లు ఈ నెల 11న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. -
క్రైం కార్నర్
బాన్సువాడ రూరల్: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండల కేంద్రంలోని డబుల్బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతని భార్య ఎంతలేపినా నిద్రలేవకపోవడంతో ఆమె శివకుమార్ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కొప్పర్లకు చెందిన గడిపె గోపాల్రావు కుమార్తె లక్ష్మి(14) రెంజల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు కుమార్తె లక్ష్మిని రాయించేందుకు గోపాల్రావు తన భార్యతో కలిసి కామారెడ్డికి బైక్పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో మల్లుపేట్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. బైక్పై ఉన్న వీరు కింద పడడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మద్దెల వనిత బిచ్కుంద మండలం లచ్చన్లో తమ బంధువు చనిపోవడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇంటిపక్క వ్యక్తి వనితకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. ఆమె ఇంటికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీలో బీరువాలో ఉన్న తులం బంగారం, 120 తులాల వెండిని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎరుపెక్కిన ఇస్రోజివాడి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గడ్చిరోలి ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఇస్రోజివాడి గ్రామంలో ఆదివారం జరిగాయి. ఈ నెల 6న జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆయన మృతి చెందగా, శవాన్ని ఆదివారం ఉదయం గ్రామానికి తీసుకువచ్చారు. స్వామికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఖాళీ జాగాలోనే టెంటు వేసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నక్సలైట్ ఉద్యమంలో కీలకనేతగా స్వామి బాన్సువాడ, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, కామారెడ్డి ఏరియాలతోపాటు సిరిసిల్లా ఏరియాలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేసిన వందలాది మంది మాజీలు ఆఖరి చూపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విప్లవోద్యమంలోనే కన్నుమూసిన స్వామి భార్య సులోచన అమరత్వంపై ప్రచురించిన ‘గెరిల్లా అమ్మ’ అనే పుస్తకాన్ని స్వామి కొడుకు రమేశ్తోపాటు బంధువులతో కలిసి అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సులోచన త్యాగాన్ని సైతం కొనియాడారు. పీడిత ప్రజల కోసం అడవిబాట పట్టిన స్వామి నడిచిన దారిలో సులోచన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా నడిచారని, వారిది మహోన్నత త్యాగమని పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు పలువురు స్వామి ఎదిగిన తీరును వివరించారు. స్వామి కుటుంబంలాగే దేశంలో లక్షలాది మంది పోరాడుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్న భారత ప్రభుత్వం ప్రజలపై యుద్ధం చేస్తోందని, వారి పక్షాన పోరాడుతున్న విప్లవకారులను పాశవికంగా కాల్చిచంపుతోందన్నారు. మార్చి 31 లోగా దేశంలో విప్లవకారులను ఏరివేస్తామని ప్రకటించి సైనిక దాడులకు పాల్పడిందన్నారు. ఏ దేశ ప్రభుత్వాలైనా తమ దేశ పౌరులపై యుద్ధం చేయవని, భారత ప్రభుత్వం మాత్రం ప్రజలపై, ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమకారులపై పాశవిక దాడి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎర్రజెండాల రెపరెపలు... స్వామి అంతిమయాత్రలో వందలాది మంది ఎర్రజెండాలు చేతబట్టుకొని పాల్గొన్నారు. దీంతో దారి మొత్తం ఎరుపెక్కింది. పాటలు పాడుతూ, నినదిస్తూ స్వామిని స్మరించుకున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నినదించారు. కాగా, స్వామి అంత్యక్రియల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టిలో ఉండి పరిశీలించారు. అంత్యక్రియలకు హాజరైన వారిని, వారి మాటలను రికార్డు చేశారు.స్వామి కుటుంబానికి చెందిన చేను దగ్గర ఖననం చేశారు. కొడుకు రమేశ్ చేతుల మీదుగా అంతిమక్రియలు నిర్వహించారు. ఉద్యమంలో ఉన్నపుడు తల్లి అంత్యక్రియలు నిర్వహించిన రమేశ్, ఇటీవలే ఉద్యమం నుంచి వైదొలిగి లొంగిపోయాడు. ఇదే సమయంలో చనిపోయిన తండ్రి అంత్యక్రియలు కూడా ఆయన చేతుల మీదుగా జరిగాయి. గెరిల్లా అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో తమ కుటుంబం ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది, అడవి బాట ఎందుకు పట్టిందన్న విషయాలను వివరించారు. తల్లిని గుర్తు చేస్తూ కంటతడి పెట్టాడు. అంత్యక్రియల్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఽఅధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మన్, కార్యదర్శి నారాయణరావ్, విరసం అధ్యక్షుడు పాణి, కార్యదర్శి రాజయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు పద్మకుమారి, శాంతక్క, వివిధ సంఘాల నేతలు కుమారస్వామి, విజయరామరాజు, సుదర్శన్, భవానీ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, న్యాయవాదులు క్యాతం సిద్దరాములు, ఆజాద్, విద్యార్థి నేతలు విఠల్, సురేశ్, మాజీ మావోయిస్టు నేతలు అమర్, సునీత, నరేశ్, రామకృష్ణ, జనార్దన్ తదితరులు హాజరయ్యారు. వీడియో కాల్తో ఆఖరి చూపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ జైలులో ఉన్న స్వామి కూతురు లావణ్య తన తండ్రి ఆఖరి చూపు కోసం జైలు అధికారులకు విన్నవించుకోగా వీడియోకాల్కు అనుమతించారు. దీంతో లావణ్య తన అన్న రమేశ్కు జైలు అధికారుల ద్వారా వీడియోకాల్ చేసి తండ్రి శవాన్ని చూసి కంటతడిపెట్టింది. తండ్రికి నివాళులర్పించింది. లోకేటి చందర్కు కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నినాదాలతో హోరెత్తిన అంతిమయాత్ర ఆట, పాటలతో ర్యాలీలో పాల్గొన్న జనం -
33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కుంబా రవియాదవ్ ఆదివారం వార్డులోని కాలనీలలో ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. 24 గంటల పాటు వార్డులో అందుబాటులో ఉంటానని, వార్డులోని సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. 37వ వార్డులో జోరుగా ప్రచారం కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నిట్టు కృష్ణమోహన్రావు ఆదివారం ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. నాయకులు నిట్టు వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. డప్పు కళాకారులతో వినూత్న ప్రచారం కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆదివారం వినూత్నంగా ప్రచారం చేపట్టారు. డప్పు కళాకారులతో వార్డులోని కాలనీలో ప్రచారం చేశారు. ఉదయం నుంచి కళాకారులతో ప్రభుత్వ పథకాలు, వార్డు అభ్యున్నతికి తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను పాటల ద్వారా ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తానో ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాకారులతో పాటల ద్వారా వివరించారు. కౌన్సిలర్ అభ్యర్థి కళావతి మాట్లాడుతూ.. మొదటిసారి పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాయకుడు రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
కామారెడ్డి రూపురేఖలు మారుస్తాం
కామారెడ్డి టౌన్: బీజేపీని గెలిపిస్తే రాబోయే మూడేళ్లలో కామారెడ్డి రూపురేఖలు మారుస్తామని స్థానిక శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వివిధ వార్డులలో బీజేపీ అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్ సభలో ప్రసంగించారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు రూపాయి అవినీతికి పాల్పడినా వెంటనే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని బహిరంగంగా ప్రకటించారు. కామారెడ్డిలో ఆ ప్రధాన పార్టీలు రెండు ఒక్కటేనని, ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో ఏ అభ్యర్థులు గెలిచినా అంతర్గతంగా అవినీతికి పాల్పడుతూ, కబ్జాలు, అక్రమాలతో దోపిడీకి పాల్పడతారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిని గద్దె దించి ఎవరికి దక్కించారో అందరికీ తెలుసన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయాలు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతాయని, అభివృద్ధికి ఆటంకం కలిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఆదాయం మార్గాలు పెంచి, రోడ్ల విస్తరణ, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ స్థలాలు, పచ్చదనంతో పురాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకోసం బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడితే వేటు వేస్తాం ఆ రెండు పార్టీలు ఒకటే.. దోపిడీయే వారి ఎజెండా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శలు -
మంచి పాలన అందిస్తున్నాం..
● మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ● ఎల్లారెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ప్రచారంఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్: క్రికెట్లో బ్యాటింగ్, ఫీల్డింగ్తోపాటు మంత్రిగా ప్రజలకు మంచి పాలన అందిస్తానని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి బస్టాండ్, మినీ ట్యాంక్బండ్, అర్బన్ పార్క్, ఏటీసీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎల్లారెడ్డినిలో ఈద్గా ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి సరైన అభివృద్ధిని చూడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా రూ.35 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతోందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, మత్తమాల భాగ్యవతి, గాయత్రి, మహేశ్వరీ, కౌసరున్నీసా, మంజుల, చంద్రయ్య, గఫార్, నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, స్వప్న, ఎరుకల దశరథం తదితరులు పాల్గొన్నారు. -
‘పోచారం’.. ఇక పర్యాటకం!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు వద్ద పర్యాటక పనుల నిర్వహణకు మోక్షం కలిగింది. ఎమ్మెల్యే మదన్మోహన్రావు కృషితో నిధుల మంజూరుకు మార్గం సుగమం అయ్యింది. ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు గెస్ట్హౌస్ను నిర్మించనున్నారు. ప్రాజెక్టు వద్ద యాక్సెస్ రోడ్ల నిర్మాణంతోపాటు పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. నెరవేరనున్న కల.. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని మండల ప్రజలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. వారాంతపు సెలవులతోపాటు పండగల వేళ కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు తరలివస్తారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి కిందకు జాలువారే నీటిలో తడుస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరుకొని అందులోని వన్యప్రాణుల సందడిని ఆస్వాదిస్తారు. కాగా, ప్రాజెక్టులో విహరించేందుకు బోటింగ్ సౌకర్యం లేకపోవడంపై సందర్శకులు నిరాశకు లోనవుతున్నారు. బాత్రూం, టాయ్లెట్స్ లాంటి కనీస సౌకర్యాలు లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల నిర్వహణకు రూ.3 కోట్లు మంజూరు బోటింగ్ సౌకర్యం, గెస్ట్హౌస్ నిర్మాణంతోపాటు పిల్లల ఆట పరికరాల ఏర్పాటుకు సన్నాహాలు -
త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను
మాజీ ఎంపీ బీబీ పాటిల్ బాన్సువాడ: బోధన్–బీదర్ రైల్వేలైనుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం బాన్సువాడలో బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టాణాలు అభివృద్ధి చెందాలంటే రైల్వేలైను ఉండాలని, బోధన్–బీదర్కు రైల్వేలెను కోసం గతంలో ప్రతిపాదనలు పంపితే మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, సాంకేతిక సమస్యల వల్ల పనులు ప్రారంభం కాలేదని, త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సంగారెడ్డి–అకోలా జాతీయ రహదారి విస్తరణ వల్ల హైదరాబాద్కు వెళ్లే బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజలకు దూరం తగ్గిందని, ట్రాఫిక్ లేకుండా సులువుగా హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని అన్నారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 17 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, కమలం గుర్తుకు ఓటేసి వారందరిని గెలిపించాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాలు: యెండల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. బాన్సువాడను బషీర్బాగ్గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఎన్జీవోఎస్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, వాసవికాలనీ, గౌలీగూడల పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లి వస్తుంటే గుర్రంపై పువ్వులు చల్లుతూ స్వాగతం పలికడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి తరహాలో బాన్సువాడలో కూడా బుల్డోజర్ యాక్షన్ చేయక తప్పడం లేదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇంద్రసేనా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
రూ. 15 వేల కోసం గొడవ.. హత్య
పిట్లం(జుక్కల్): కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలిల మధ్య జరిగిన వాగ్వాదమే ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. పిట్లం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును 48 గంటల్లో పిట్లం పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట సిద్ధులు అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం కొత్త ఇంటికి వచ్చిన సిద్ధులుకు ఇంటి పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేశ్(46) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఎస్సీ రాజేశ్చంద్ర రెండు బృందాలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేయగా వారు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో ఓ వ్యక్తి కిరాయి ఉన్న ఇంటికి వచ్చి ఇంటి వస్తువులను సర్దుకొని పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు బృందాలు సీసీ కెమెరాల ద్వారా గమనించాయి. అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నిందితుడు శ్రీకృష్ణ మృతుడు రాజేశ్ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. యూపీకి చెందిన మృతుడు రాజేశ్, శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పనిచేసేవారు. రాజేశ్ మిత్రుడు దిలీప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నాయని చెప్పడంతో వీరు ఇటీవల పిట్లంకు వచ్చారు. శ్రీకృష్ణతో దిలీప్ పెయింటింగ్ పనులు చేయించుకొని రూ. 15వేల నగదు ఇవ్వకుండా దిలీప్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో మృతుడు రాజేశ్తో శ్రీకృష్ణ తరచూ గొడవపడేవాడు. ఈ నెల 6న సిద్ధులు నిర్మాణం చేపడుతున్న ఇంటికి శ్రీకృష్ణ రాజేశ్ను తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహంతో అతని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతుడు రాజేశ్ జేబులో ఉన్న ఫోన్, రూ. 250 నగదు తీసుకొని పరారైనట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్ర, ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లు కే రఘు, సాయాగౌడ్, వెంకటేశ్, నవీన్, హోమ్గార్డు సంగమేశ్ను ఎస్పీ రాజేశ్చంద్ర ప్రత్యేకంగా అభినందించారని బాన్సువాడీ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. చంపింది తోటి కూలీయే.. 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు, అరెస్టు -
త్రిలింగ రామేశ్వరాలయానికి విరాళం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్ శివారులో గల త్రిలింగరామేశ్వరాలయ అభివృద్ధి కోసం హైద్రాబాద్కు చెందిన హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ పామిడిగంటం శ్రీరఘురాం రూ.70 వేలు విరాళంగా అందజేశారు. ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం శ్రీరఘురాం దంపతులను ఆలయకమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయకమిటీ చైర్మన్ దత్తు, తాండూర్, అక్కంపల్లి గ్రామాల సర్పంచ్లు భూమా యాదగౌడ్, వెంకాగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, సతీష్తోపాటు ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ఏనభైఏళ్ల చరిత్ర కల్గిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవోస్)పై అసత్య ప్రచారాలు మానుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు హితవు పలికారు. ఆదివారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా భవన్లో జిల్లా ప్రతినిధులతో కలిసి అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో టీఎన్జీవోస్ ముందుండి ఉద్యమించిందని, ఇలాంటి సంఘంపై అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు. సంఘంలో గెజిటెడ్ అధికారులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉపాధ్యాయ సంఘాలుండగా తెలంగాణలో వాటికి ప్రభుత్వ గుర్తింపు వచ్చిందని, టీఎన్జీవోస్తో కలిసి పనిచేసే వారిని కొనసాగిస్తే కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నేతలు ఎం.చక్రధర్, ఎం.దేవరాజు, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్లు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, కామారెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జి నేరెళ్ల శారదను కామారెడ్డి కల్లు గీత పారిశ్రామిక సహకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆమె సిరిసిల్లారోడ్లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సంఘ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. నేతలు బండారి రాజాగౌడ్, నాడేం శ్రీధర్ గౌడ్, అమరసింహ గౌడ్, ప్రదీప్ గౌడ్, రామచంద్రం గౌడ్, హరికిషన్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం
నిజాంసాగర్(జుక్కల్): వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జుక్కల్ నియోజకవర్గంతో పాటు బిచ్కుంద మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషి, ఎమ్మెల్యే చొరవతో జుక్కల్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామన్నారు. ఆదివారం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల కార్నర్ సభలో మంత్రి మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నత విద్యావంతుడని, నియోజకవర్గం అభివృద్ధికి పట్టుదలతో గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడన్నారు. 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేటీఆర్కు అహంకారం పోలేదు: ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విమర్శించారు. ఆదివారం మంత్రి అజారుద్దీన్తో కలిసి బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్నర్ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి 171 ఓట్లతో గెలిచిన సంగతి మర్చిపోయాడన్నారు. అలాంటి వ్యక్తి బిచ్కుందకు వచ్చిన తన మెజార్టీ గురించి మాట్లడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్, నాయకులు సాయిపటేల్ తదితరులు ఉన్నారు. కార్నర్ సభలో మంత్రి అజారుద్దీన్ -
ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘రేవంత్ బీజేపీ మనిషే.. బడేభాయ్ తమ్ముడే.. ఏనాడూ కాంగ్రెస్ మనిషి కాలేడు.. ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకుండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు, సిరిసిల్లలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చి సీటు, గౌరవం లేకుండా చేసి మగవాళ్ల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తుండని విమర్శించారు. స్టూవర్టుపురం దొంగలుకాంగ్రెసోళ్లు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లేయించుకున్నారని, ఎక్కువ అడిగితే మెడలో ఉన్న పుస్తెలు లాక్కెళ్లే దండుపాళ్యం, స్టూవర్టుపురం దొంగల ముఠాలుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా అవకాశమిచ్చి బాన్సువాడ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్ను, కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన ప్రజలను దగా చేసి రేవంత్రెడ్డి కింద చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డికి రోషముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ మారిన పోచారంపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తే, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పాడని, మరి బీఆర్ఎస్లో ఉంటే ఈ వేదిక మీద తన పక్కన ఎందుకు లేడని ప్రశ్నించారు. కులం.. మతం బువ్వ పెట్టవు‘బీడీ కార్మికులు తంబాకు వాసనతో ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబ పోషణకు మగవాళ్లకు తోడుగా కొంతైనా సంపాదించాలని శ్రమిస్తారు. చిన్నప్పుడు దుబ్బాకలో ఓ శాలోళ్ల ఇంట్లో ఉండి చదువుకున్న కేసీఆర్కు బీడీకార్మికుల బాధలన్నీ తెలిసే రూ.2 వేలు ఆసరా పెన్షన్ను కల్పించాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం బువ్వ పెట్టవని, మంచి గుణం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే.. మంచి జరుగుతుందన్నారు. మా కులపోడు.. మా మతపోడు అని ఎన్నికల్లో ఓట్లు వేయొద్దన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ల బతుకుల్లో మార్పు రావాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లు బతుకమ్మ చీరలను బంద్ చేసి నేతన్నల బతుకులను ఆగం చేశారన్నారు. ‘నా మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారట.. మనకు జిల్లాలు వద్దా.. పాలన ప్రజలకు చేరువ కావద్దా..’ అని అడిగారు. తొండి సంజయ్ ఏం చేశారు?కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్కి తొండి సంజయ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి.. సిరిసిల్లకు ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. మనకు మంచి చేసే వాళ్లకే ఓట్లు వేయాలని, మోసం చేసే వాళ్లకు కాదన్నారు. పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా.. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్షిందే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.బాన్సువాడలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న కేటీఆర్ -
కాంగ్రెస్ పాలనలో స్వర్ణయుగం
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన కొనసాగుతోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. శనివారం ఆ యన కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. రైతు భ రోసా కింద ఎకరాకు రూ. 6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కా మారెడ్డిలో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ను గె లిపించాలని ప్రజలను కోరారు. వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతానికి చేసిందేమీ లేద ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గతంలో ఏమీ చేయని వ్యక్తి, భవిష్యత్లో చేస్తాడనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానని చెప్పుకోవడం తప్ప, కామారెడ్డికి ఆయన సాధించిన ఘనత శూన్యమని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రచారం.. నిజాంసాగర్: మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6 వేలు ఇస్తున్నాం ఎన్నికల ప్రచారంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ -
దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి
● బీజేపీకి అవకాశమిస్తే ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తా ● ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలో దోపిడీని అడ్డుకుంటేనే ఉన్న నిధులతో సక్రమంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే వెంకటరమణారె డ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలలో లక్షల రూ పాయలు ఖర్చు చేస్తూ, చైర్పర్సన్ పీఠం కోసం కో ట్లాది రూపాయలు ముట్టజెప్పి అధికారంలోకి వచ్చే వారు.. ఆ తర్వాత ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలే జరిగాయని, ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే వా ర్డులన్నింటినీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కామారె డ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానని హామీ ఇ చ్చారు. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేని అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాకే నియోజకవర్గంలో కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు తగ్గా యని ఆయన గుర్తుచేశారు. గతంలో ఏ పార్టీ పాలించినా అందరూ కలిసికట్టుగా దోచుకున్నారని విమర్శించారు. మున్సిపల్ ఆదాయ మార్గాలను పెంచుకుని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసి చూపిస్తా నని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కా కుండా కేవలం అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమాలలో బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
కారులో హుషారు!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. మూడు మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రచార సభలకు ప్రజలు భారీగా తరలిరావడంతో గులాబీ దండులో నూతనోత్సాహం కనిపిస్తోంది.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/బాన్సువాడ/నిజాంసాగర్/ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడా రు. రేవంత్రెడ్డి బూతులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అప్పట్లో ఇదే గడ్డమీద రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డిని, ఆయన కొడుకులను దున్నపోతులు, ఆంబోతులు అని సంబోధించిన ఆడియోను వినిపించారు. పోచారం పార్టీ మారడంతో దొంగ చాటుగా ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్రెడ్డి విసిరిన ఎంగిలి మెతుకులకు ఆశపడి విలువను దిగజార్చుకున్నాడంటూ పోచారం గురించి పరుషంగా మాట్లాడారు. ఆయనకు రోషం, దమ్ము ఉంటే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి తన సత్తా చాటాలని సవాల్ చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను, బాన్సువాడ ప్రజలను మోసం చేసిన పోచారం శ్రీనివాస్రెడ్డికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎల్లారెడ్డి సభలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వైఫల్యాలను ఎత్తిచూపారు. ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాసిచ్చిన బాండ్ పేపర్ ఏమయ్యిందని కేటీఆర్ ప్రశ్నించారు. వరదలొస్తే ప్రపంచబ్యాంకు సాయం అడిగి మన దేశం ఇజ్జత్ తీసిన గొప్పోడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబంపైకి ట్రాక్టర్ను తీసుకువెళ్లి ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మదన్మోహన్రావు బిందెలు పంచి, బిందె కింద కమ్మేసిండని ఇప్పటికైనా వారి మోసపూరిత హామీలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్లో రైతుబంధు పడేదని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా పెట్టుబడి సాయం రాలేదన్న విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయని, మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని పేర్కొన్నారు. బిచ్కుంద సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులకు నిధులు మంజూరు చేశామని, పనులు ఎందుకు పూర్తి చేయడంలేదో ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. రూ.5 వందల కోట్లతో నాగమడుగు పనులు చేపడితే, ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకువెళ్లడంలేదో అడగాలన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్కు, లేకపోతే కారుకు ఓటేయాలని ప్రజలను కోరారు.ర్యాలీలు, సభలు.. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కేటీఆర్ ముందుగా బాన్సువాడకు చేరుకున్నారు. పట్టణ శివార్లలోని కొయ్య గుట్ట అమరవీరుల స్తూపం వద్ద నుంచి ర్యాలీ గా పట్టణంలోకి వచ్చారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద సభలో మాట్లాడారు. అనంతరం బిచ్కుందలో రోడ్షో నిర్వహించారు. ఎన్నికల ప్రచార సభలో భారీగా జనం పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోనూ భారీ ర్యాలీ తీశారు. గాంధీ చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, నాయకులు జుబేర్, తానాజీరావ్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవడం పక్కా అని, జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధే గెలుపును ఎవరూ ఆపలేరని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మూడు మున్సిపాలిటీల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం చెప్పాలని పిలుపు భారీగా తరలివచ్చిన ప్రజలు.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం -
పోచారం ప్రాజెక్టునుంచి రెండోవిడత నీటివిడుదల
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు నుంచి శనివారం రెండోవిడత నీటి విడుదల చేపట్టా రు. ఆయకట్టు పరిధిలోని బీ జోన్లో యా సంగి పంటల సాగు నిమిత్తం ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకా రం 15 రోజులపాటు నీటిని విడుదల చేయ నున్నట్లు ఇరిగేషన్ వర్క్ఇన్స్పెక్టర్ యాదగి రి తెలిపారు. తర్వాత 10 రోజులపాటు నీటివిడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు. రేపటి నుంచి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు కామారెడ్డి అర్బన్ : సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. అథ్లెటిక్స్తో పాటు ఖోఖో, వా లీబాల్, యోగా, ఫుట్బాల్ అంశాల్లో పోటీ లుంటాయని పేర్కొన్నారు. ఆయా పోటీల ను జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడి యం, లయోల హైస్కూల్, భవానీరోడ్డులో ని ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ సెంటర్, కా మారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని జిల్లా యో గాభవన్, రామారెడ్డి మండలం ఉప్పల్వా యి రెసిడెన్షియల్ స్కూల్, రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానం, భిక్కనూరు జి ల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మందాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, దోమకొండ గడీకోటలలో నిర్వహించనున్నామన్నారు. నేటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు కామారెడ్డి క్రైం: జిల్లా రైతుల కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఆధార్, మొబైల్ నంబర్, జిల్లా, మండలం, పంట సాగు విస్తీర్ణం వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అనంతరం సమీప డీలర్ వద్ద ఎరువుల లభ్యతను పరిశీలించి యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, లేదంటే బుకింగ్ రద్దవుతుందని పేర్కొన్నారు. పట్టాదారులతో పాటు కౌలుదారులు సైతం ఈ యాప్ను ఉపయోగించవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ‘ప్రజావాణి కొనసాగుతుంది’ కామారెడ్డి క్రైం : మున్సిపల్ ఎన్నికలు జరు గుతున్నా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరి గే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం కూడా కొనసాగిస్తామని అదనపు కలెక్టర్ విక్ట ర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు మున్సిపల్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్లోని 25వ నంబర్ రూంలో అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ‘రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి’ కామారెడ్డి అర్బన్: రైతులు రూ. 2 వేలు వాటాగా చెల్లించి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్పీవో) ఏర్పాటు చేసుకుని బహుళ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో ఎఫ్పీవోల ఏర్పాటు, పనితీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో రామ్మోహన్ మాట్లాడుతూ ఎఫ్పీవో సభ్యత్వం తీసుకునే ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం తనవాటాగా రూ.2 వేలు చెల్లిస్తుందన్నారు. ఎఫ్పీవోల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్, పరికరాలు, గిట్టుబాటు ధర, బ్రాడింగ్ కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి షేక్చాంద్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్, చిన్నమల్లారెడ్డి ఉపసర్పంచ్ స్వప్న, సొసైటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఇస్రోజీవాడి నుంచి దండకారణ్యం దాకా..
● దళ సభ్యుడి నుంచి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీ వరకు.. ● లోకోటి చందర్ ప్రస్థానం ● మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా విప్లవోద్యమంలో లోకోటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ ది ప్రత్యేక స్థానం. 1990 ప్రాంతంలో పీపుల్స్వార్లో నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఆయన కొంత కాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారి, స్వామి పేరుతో చురుకుగా పనిచేశారు. 1993 సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లా పడ్కల్లో ఓ ఇంట్లో స్వామి దళం ఉందన్న సమాచారంతో పోలీసు బలగాలు ఊరిని చుట్టుముట్టాయి. ఇంట్లో దాక్కున్న దళ సభ్యులంతా చనిపోయినా, స్వామి పోలీసులతో పోరాడి గేదెల మంద రావడంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. దాదాపు 36 గంటల పాటు జరిగిన కాల్పుల సంఘటనలో స్వామి తప్పించుకున్న తీరును గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎలా తప్పించుకున్నాడన్న దానిపై కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో స్వామి చనిపోవడంతో అప్పట్లో నక్సల్స్ ప్రభావిత గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. భార్య కడసారి చూపునకూ నోచుకోక.. మావోయిస్టు పార్టీలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేసిన స్వామి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ప్లాటూన్ కమాండర్గానూ పనిచేశారు. ఆయన గెరిల్లా ఆర్మీ శిక్షణలు ఇచ్చారని తెలుస్తోంది. దండకారణ్యానికి వెళ్లిన త ర్వాత ప్లాటూన్ కమాండర్గా పనిచేసి పీఎల్జీఏ ను విస్తరించడంలో కీలక భూమిక పోషించారని చెబుతారు. చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారని తెలుస్తోంది. కాగా స్వామి కుటుంబమంతా విప్లవోద్య మంలో పాల్గొంది. ఆయన భార్య సులోచన అనారోగ్యంతో చనిపోయిన సమయంలో ఆయన దూ రంగా ఉండడంతో అంత్యక్రియలకు కూడా హాజ రు కాలేకపోయారని సమాచారం. మూడున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో కొనసాగిన స్వామి అలియాస్ చందర్.. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జ రిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకురావడం కోసం స్వామి కుమా రుడితో పాటు బంధువులు అంబులెన్స్ను తీసుకుని శనివారం వెళ్లారు. ఆదివారం ఉదయం వరకు మృతదేహాన్ని తీసుకుని వచ్చే అవకాశాలున్నాయి.అంచెలంచెలుగా ఎదిగి.. వ్యవసాయమే స్వామి కుటుంబం జీవనాధారం. 1990లలో పీపుల్స్వార్ నక్సల్స్ గ్రామానికి రావడంతో స్వామి ఉద్యమానికి ఆకర్శితుడయ్యారు. కొంతకాలం వారికి సహకరించి, పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. దళ సభ్యుడిగా చురుకుగా పనిచేసిన స్వామి.. కొద్ది కాలానికే డిప్యూటీ కమాండర్గా, తర్వాత కమాండర్గా ఎదిగారు. సిర్నాపల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, సిరిసిల్ల దళాలకు నాయకత్వం వహించారు. స్వామి పేరుతోనే జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడుల నుంచి పలు సంఘటనల్లో ఆయన పాల్గొన్నాడని అప్పట్లో ఆయనతో పనిచేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోయినవారు చెబుతారు. పోలీసు నిర్బంధం పెరిగి ఎన్కౌంటర్లలో పలువురు నక్సల్ నేతలు చనిపోవడంతో ఉమ్మడి జిల్లాలో స్వామి ఒక్కరే మిగిలారు. దీంతో మావోయిస్టు పార్టీ ఆయనను దండకారణ్యానికి పంపించింది. అబూజ్మడ్, గడ్చిరోలీ తదితర ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. -
క్రైం కార్నర్
● కార్యదర్శి వేధింపులే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు బోధన్టౌన్(బోధన్): గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ నీరడి బాబు(38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరడి బాబు పెంటాఖుర్దు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5న ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబసభ్యులు బోధన్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బాబు భార్య నీరడి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసినప్పటికీ లెక్కల్లో తేడాలున్నాయని అందరిముందు అవమానించాడని, దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మద్యానికి బానిసై ఒకరు ..బాన్సువాడ: పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సంగమేశ్వర కాలనీకి చెందిన టాక్ సందీప్(24) మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వాడు. రోజూ మద్యం తాగి ఇంట్లో అనవసరంగా గొడవ పడేవాడు. శుక్రవారం ఇంట్లో ఊరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు సముదాయించారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మరొకరు.. బీబీపేట: అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఒకరు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గోపాల్ (35) అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తితో ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారకస్థితిలో ఉన్న గోపాల్ను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ తనిఖీ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను శనివారం ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చినాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే వారు ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా వినియోగించుకోవాలని అన్నా రు. ఎన్నికల సిబ్బంది తదితరులున్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఎఫ్ఎస్టీ టీం అధికారులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు 50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లరాదని అన్నారు. అంతకు మించి నగదు ఉంటే దానికి సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుందన్నారు. తాడ్వాయి మండలంలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్లో చలాన్లను చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీని అదర్శవంతంగా తీర్చిదిద్దానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీచౌక్లో శనివారం ఆయన, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి ప్రజలతో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని, ఇంకా ఎవరైన పేదలుంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేస్తామని అన్నారు. గాంధీ చౌక్ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.650 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నార్ల వసంత, నాయకులు వాహాబ్, నందకిషోర్, నార్ల రవీందర్, నాగులగామ వెంకన్న, ఖమురు, గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ.. నేటి సాంకేతిక ప్రపంచంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఈనేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సుపరిచితం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టాస్క్ మేనేజర్ రఘుతేజ, ట్రైనర్ హనుమంతు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లలో గృహవినియోగ సిలిండర్లు వాడొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): హోటళ్లు, దాబాల్లో గృహాలకు వినియోగించే సిలిండర్లు వాడడం విరుద్దమని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు అన్నారు. మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దాబాలపై శనివారం వారు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా 18 గృహ వినియోగం సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్వో స్వామి మాట్లాడుతూ.. హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఉపయోగించే సిలిండర్లు మాత్రమే వాడాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న 18 సిలిండర్లను సదరు గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డీటీలుసురేష్, షరీఫ్, సిబ్బంది ఉన్నారు. జిల్లాకేంద్రంలో 30 సిలిండర్లు.. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఏఎస్వో రవీందర్ రాథోడ్ ఆధ్వ ర్యంలో సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా గృహ అవసరాల కు వినియోగించాల్సిన సిలిండర్లను నిబంధనలకు విరుద్దంగా వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి 30 సిలిండర్లను స్వాధీనం చేసుకుని 19 మంది వ్యాపారులపై కేసులు నమో దు చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. సిలిండర్లను కామారెడ్డిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. డీటీ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం కప్ పోటీల్లో ప్రతిభ
బాన్సువాడ రూరల్: సీఎంకప్ బాన్సువాడ నియోజకవర్గ పోటీల్లో బాన్సువాడ జోన్ క్రీడాకారులు సత్తాచాటీ చాంపియన్షిప్ సాధించినట్లు పీడీ తారాచంద్, సురేందర్లు శనివారం తెలిపారు. వాలీబాల్ బాలుర, బాలికల విభాగాల్లో నస్రుల్లాబాద్ ప్రథమస్థానం సాధించిందని, ఖోఖోలో బాలుర, బాలికల విభాగాల్లో బీర్కూర్ మండలం ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కబడ్డీలో కొత్తాబాది(బాన్సువాడ మండలం) బాలికలు, బాలుర విభాగాల్లో మొదటి స్థానాలు సాధించారన్నారు. నియోజకవర్గ స్థాయిలో 9మండలాల క్రీడాకారులు పాల్గొనగా బాన్సువాడ జోన్ క్రీడాకారులు విజేతలుగా నిలిచారన్నారు. పాల్గొన్న క్రీడాకారులు, పీఈటీలకు వారు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం
● బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో కార్నర్ మీటింగ్లకు భారీగా హాజరైన జనం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులుఎల్లారెడ్డిలో కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలు నిజాంసాగర్(జుక్కల్)/ఎల్లారెడ్డి/బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్నర్ మీటింగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయా పట్టణాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా బిచ్కుందలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకుల ఉత్సాహం చూసి, ఎన్నికల ప్రచారంలాగా లేదని ఎన్నికల విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. జుక్కల్కు శాశ్వత ఎమ్మెల్యే ఎవరంటే హన్మంత్ సింధేనని అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 స్థానాలను గెలిపిస్తే, కౌన్సిల్లో తీర్మానం చేయించి గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామన్నారు. అలాగే ఎల్లారెడ్డిలో కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గాంధీచౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్టాండ్ నిర్మాణానికి రూ.5కోట్లు, 300 డబుల్ బెడ్ రూంలకు 18 కోట్ల రూపాయలు, 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకల ఆస్పత్రికి రూ.10 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు, రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోటి రూపాయలతో వైకుంఠ ధామం, , మినీ ట్యాంక్ బండ్, డయాలసిస్ సెంటర్ తదితర వాటికి నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనికి సంబందించిన జీవోలను సైతం ప్రజలకు చూయించడం జరిగిందన్నారు. పనులు పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని ప్రారంభోత్సవాలు చేసి ఆర్భాటాలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదని అన్నారు. అంతకుముందు బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గజమాలతో కేటీఆర్ను ఘనంగా సత్కరించారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గంకు ఇవ్వని నిధులు బాన్సువాడకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ అంటూ, బాన్సువాడలో మాత్రం కాంగ్రెస్ అంటు ప్రచారం చేస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డి కండువ కప్పుకునే ప్రచారం చేయాలని అన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తానాజీరావు, బీఆర్ఎస్ నాయకులు నాల్చర్ రాజు, గిర్ధావర్ గంగారెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, మోచీ గణేష్, రమేష్యాదవ్, బాడి శ్రీనివాస్, అక్బర్, శివ, ఖలీల్, ధర్మతేజ ఉన్నారు. -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
కామారెడ్డి క్రైం: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, ఒకటవ వార్డు పరిధిలోని ఇల్చిపూర్, అడ్లూర్, రెండవ వార్డు పరిధిలోని రామేశ్వర్పల్లి గ్రామాల్లో పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కాంగ్రెస్పార్టీ కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర పథకాలతోపాటు హామీలు ఇచ్చి చేస్తున్న మోసాలపై ప్రజలకు బాకీ కార్డులు పంచుతూ వివరించారు. కామారెడ్డి బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్ పట్టణంలోని 38వ వార్డు పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. -
పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా సాగాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ అన్నారు. మండలంలోని శెట్పల్లి గ్రామ పంచాయతీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో రాబోయో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఇటీవల సీఎం కప్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కోతుల బెడదను నివారించడానికి చేపడుతున్న పనులను పరిశీలించి సర్పంచ్ను అభినందించారు. సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, ఉపసర్పంచ్ బాలయ్య, అశోక్, అంజాగౌడ్, పద్మ, లింగాగౌడ్, రుక్మవ్వ, అంజనేయులు, రాజమణి, తదితరులు ఉన్నారు. -
పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలి
బాన్సువాడ రూరల్: పర్యావరణ సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డివిజన్స్థాయి వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన ఆకర్షణీయ నమూనాలను ప్రదర్శించి ప్రతిభ చాటారు. షేక్ సలాం ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి మాట్లాడుతూ.. వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతోపాటు వ్యర్థాలను సంపదగా మార్చే అలోచన పెరిగిందన్నారు.పోటీలలో కేజీబీవీ గాంధారి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, పీఎంశ్రీ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల బాన్సువాడ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించి అభినందించారు. ఎంఈవో నాగేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కుషాల్, వెంకటరమణ, భునేకర్ సంతోష్, నర్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం పన్ను వసూళ్లకు ప్రణాళిక
● జిల్లా పంచాయతీ అధికారి మురళి ● భిక్కనూరు జీపీ తనిఖీ భిక్కనూరు: జిల్లావ్యాప్తంగా వందశాతం ఇంటి పన్నుల వసూళ్లకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. భిక్కనూరు గ్రామపంచాయతీని శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయడం వల్ల గ్రామాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రానున్న వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలను అందజేశామన్నారు.15వ ఆర్థికసంఘం నిధులు త్వరలో గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ కానున్నందున వెంటనే చెల్లింపులు జరపాలని జిల్లాలోని ఎంపీవోలకు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈవో మహేష్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పెద్దమ్మ ఆలయంలో చోరీ
బీబీపేట: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం ఉదయం చోరీ జరిగినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఉదయం ఇద్దరు గుర్తు తెలియని మహిళలు తలపై కొంగు కప్పుకొని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మెడలో నుండి అర్ధతులం పుస్తెలు అపహరించారు. అనంతరం హుండీ తీయడానికి ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముదిరాజ్ సంఘం సభ్యుల సమాచారం మేరకు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను రప్పించారు. బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్ పల్లితండాకు చెందిన శ్రావణ్ అదృశ్యమైనట్లు బాన్సువాడ ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 5న కుటుంబంలో గొడవల కారణంగా బయటికి వెళ్లిన శ్రావణ్ తిరిగి రాలేదన్నారు. శ్రావణ్ కుమారుడు దేవరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రావణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తెలుపు రంగు ధోవతి, షర్టు ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని ఆర్ఐ సాయిబాబా శనివారం పట్టుకున్నారు. పోతంగల్ మంజీర నది నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని విచారించామన్నారు. డ్రైవర్ వద్ద అనుమతిపత్రాలు లేకపోవడంతో వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బొల్లారం గ్రామసమీపంలో చిత్తు–బొత్తు ఆడుతున్న ఏడుగురిని శనివారం పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై భార్గ వ్గౌడ్ తెలిపారు. బొల్లారం శివారులో చిత్తు– బొత్తు ఆడుతున్నారని తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.14,250 నగదుతోపాటు ఏడు మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. -
ఎల్లారెడ్డిపై ఎగిరేది కాంగ్రెస్ జెండా
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పలు వార్డులలో శనివారం ఆయన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపాలిటిలో రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి వాటిని పూర్తి చేస్తోందన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, తిరుపతి న్నారు. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించాం నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలో ప్రతీ గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దక్కిందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో శనివారం ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జీ నీలం మధు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కాంగ్రెస్ నాయకులు సాయిపటేల్, విఠల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జక్రాన్పల్లి: మునిపల్లి గ్రామ శివారులో టాటా సుమో, బైక్ను ఢీకొనడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ (41) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబా ద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ తొర్లికొండలోని బంధువుల ఇంటికి శుక్రవారం పండుగ నిమిత్తం వచ్చి బైక్పై తిరిగి వెళ్తున్నాడు. మునిపల్లి శివారులోని జాతీయ రహదారిపై టాటా సుమో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాస్ గౌడ్కు తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం శ్రీనివాస్గౌడ్ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మంత్రి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, ప్రచారంలో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. శుక్రవారం 3వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 12 వార్డులు బీఆర్ఎస్ గెలువబోతోందని జోస్యం చెప్పారు. నాల్చర్ శిరీష కుటుంబ పెద్దలు 50 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నారని, వారి వారసురాలిగా నాల్చర్ శిరీష బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులను ఓటర్లు నమ్మవద్దని, నెరవేర్చని హామీలు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. మేనిఫెస్టో భగవద్గీతతో సమానం: శిరీష 3వ వార్డు కోసం తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని, వంద శాతం అమలు చేసి తీరుతామని బీఆర్ఎస్ అభ్యర్ధి నాల్చర్ శిరీష అన్నారు. వార్డులో ప్రచారం చేస్తూ కార్డు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. ● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం 11వ వార్డులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్ధి భాగ్యలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని, పాలక వర్గం కొలువుదీరిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి రూ.60 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని కోరారు. చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. -
‘పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు’
కామారెడ్డి క్రైం: జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల సామగ్రి సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి భోజన వసతితో సహా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అప్పుడు మెట్టినిల్లు.. ఇప్పుడు పుట్టినిల్లు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరేళ్ల నాడు అత్తగారి ఊరు నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన ఆమె.. ఈసారి తల్లిగారి ఊరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన ఉర్దొండ వనిత 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 లో అప్పటి చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం పెట్టడంతో ఆమె పదవి కోల్పోయింది. ఆ సమయంలో చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన వనిత.. వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు ఆమె వైస్ చైర్మన్గా కొనసాగారు. ఈసారి కాంగ్రె్స్ పార్టీ అభ్యర్థిగా తన తల్లిగారు ఊరు లింగాపూర్ గ్రామ పరిధిలోని 9 వ వార్డు నుంచి బరిలో దిగారు. ఈసారి గెలిస్తే చైర్మన్ పదవి రేసులో నిలిచే అవకాశాలున్నాయి. కాగా వనిత తండ్రి కొమిరెడ్డి నారాయణ అప్పట్లో లింగాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అలాగే ఆమె మామ (భర్త తండ్రి) ఉర్దొండ రాజయ్య దేవునిపల్లి గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేశారు. -
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి
ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పద్మ శ్రీకాంత్, తదితరులున్నారు. చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డి: మండలంలోని పలు గ్రామాల డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్మోహన్రావు శుక్రవారం చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూంలు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అండగా నిలుస్తున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరుగుతోందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్లోని త్రిలింగరామేశ్వరాలయం క్యాలెండర్ను శుక్రవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మదత్తు, తాండూర్ సర్పంచ్ భూమా యాదగౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, ఇతర గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘ఆడబిడ్డ పెళ్లికి రూ. 11 వేల కానుకిస్తా’
ఎల్లారెడ్డి: ఎన్నికలలో గెలుపుకోసం అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సిద్ధి శ్రీధర్ వినూత్న హామీలిస్తున్నారు. వార్డు పరిధిలోని ఆడబిడ్డల వివాహం సందర్భంగా రూ. 11 వేల కానుకిస్తానని, ఆడపిల్ల జన్మిస్తే రూ. 10 వేలు ఇస్తానని చెబుతున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ. 10 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అందిస్తాననీ మాటిస్తున్నారు. -
బల్దియాను కలిసికట్టుగా దోచుకున్నారు
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో గత పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా.. అందరూ కలిసికట్టుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన వివిధ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లుగా ఎక్కడికీ పారిపోలేదని, తన కుటుంబంతో సహా కామారెడ్డిలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నానని షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. బల్దియాలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. తాను గెలిచిన తర్వాత మున్సిపాలిటీకి ఉన్న రూ.70 కోట్ల అప్పును తీర్చి, ఆదాయ మార్గాలను పెంచి గట్టెక్కించానని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, బీజేపీ అభ్యర్థి చైర్పర్సన్ అయ్యేలా ప్రతి ఓటరు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఓటర్లకు పంపిణీ చేశారు. నాయ కులు ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన విప్లవ శిఖరం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. కొద్దికాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. పార్టీలో స్వామి పేరుతో పనిచేశాడు. ఉద్యమంలో చేరిననాటినుంచి వెనుదిరిగి చూడలేదు. కుటుంబమంతా ఉద్యమ బాటలో.. స్వామి కామారెడ్డి ఏరియాతో పాటు సిర్నాపల్లి, ఎల్లారెడ్డి ఏరియాల్లో దళ కమాండర్గా పనిచేశాడు. జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో చాలా కాలం పనిచేసిన స్వామి కార్యదర్శిగా ఎదిగారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించడంతో లొంగుబాట్లు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్లు జరిగాయి. ఎంతో మంది సానుభూతిపరులు, నక్సలైట్లు చనిపోయారు. దీంతో అప్పటి పీపుల్స్వార్ నేతలు స్వామిని దండకారణ్యానికి పంపించారు. కొద్ది కాలానికే స్వామి భార్య సులోచన కూడా అడవి బాట పట్టింది. నవత పేరుతో దండకారణ్యంలో పనిచేసింది. వారి పిల్లలు రమేశ్, లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. అయితే 2005 లో లావణ్య, రమేశ్లు కూడా అడవిబాట పట్టారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో అక్కడే చనిపోగా విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి కూతురు లావణ్య ఆరు నెలల క్రితం చత్తీస్గఢ్లో అరైస్టె జైలులో ఉండగా.. కుమారుడు రమేశ్ డిసెంబర్ 2న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వామి ప్రస్తుతం ప్రభాకర్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా అలాగే వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.ప్రభాకర్ పేరుతో పనిచేస్తున్న స్వామి అలియాస్ లోకేటి చందర్ ఎన్కౌంటర్లో చనిపోయిన వార్త శుక్రవారం రాత్రి ప్రసార ధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఉమ్మడి జిల్లా విప్లవోద్యమం గురించి అవగాహన ఉన్నవారు చాలా మంది ఆయన గురించి చర్చించుకోసాగారు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఆపరేషన్ కగార్తో ఏర్పడిన తీవ్ర నిర్బంధంతో లొంగిపోతాడని అందరూ భావించారు. ఆయన వెనకడుగు వేయకుండా చివరి వరకు విప్లవోద్యమానికి అంకితమయ్యాడని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఉమ్మడి జిల్లా విప్లవోద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విప్లవ శిఖరం నేలకొరిగింది. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి పీడిత ప్రజల కోసం నడిచిన స్వామి అలియాస్ లోకేటి చందర్ శకం శుక్రవారంతో ముగిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో స్వామి మరణించాడు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో స్వామి విప్లవోద్యమంలోనే కన్నుమూసిన భార్య ఇటీవల లొంగిపోయిన కుమారుడు.. ఆరునెలలుగా జైలులోనే కూతురు -
రాజకీయ నేతలు మూకుమ్మడిగా దోచుకున్నారు
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రూ.వేల కోట్ల నిధులను రాజకీయ నాయకులు మూకుమ్మడిగా దోచుకున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం వద్ద పందులు, గాడిదల లెక్కలు ఉన్నాయి కానీ, మనుషుల లెక్కలు లేవని బీసీ గణనను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే కామారెడ్డి చౌరస్తాలో ఉరేసుకుంటానని, చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రత్యర్థులు ఎంత ఇచ్చినా తీసుకుని, ఓటు మాత్రం కత్తెర గుర్తుకే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేతలు హరిశంకర్ గౌడ్, తాహెర్ మహ్మద్, అభ్యర్థులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలు ర పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మాధవ రావు తెలిపారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎం.ప్రణీత్, ఎం.రాహుల్ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కోలకొండ మల్లవ్వకు చెందిన గొర్రెల షెడ్డును శుక్రవారం ఏపీఎం ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లవ్వ గొర్రె పొటేళ్ల పెంపకం కోసం రూ. 2 లక్షల రుణాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీపీఎం సురేశ్ కుమార్, సర్పంచ్ వంకాయల శిరీష, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ సమాఖ్య అధ్యక్షులు భూదేవి, సీసీలు ఆంజనేయులు, వీవోఏలు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: నాసా ఒలంపియాడ్ పరీక్షలలో సరస్వతి శిశుమందిర్ హైస్కూల్(కామారెడ్డి) విద్యార్థులు ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. నిశాంత్, రితేష్, రామ్ నిహల్, రిత్విక్ రెడ్డి విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అభినందించింది. నాసా ఒలంపియాడ్ రీసోర్స్ పర్సన్ డాక్టర్ సంజయ్, పాఠశాల అకాడమీ ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి జీపీ పాలకవర్గాన్ని ఉపసర్పంచ్ చైతన్యతో పాటు ఉపాధి ఫీల్డు అసిస్టెంట్ కొండల్రెడ్డి అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాయగౌడ్తో పాటు పలువురు వార్డు సభ్యులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్కు ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఉప సర్పంచ్, ఫీల్డు అసిస్టెంట్లు చేశారని ఈ విషయాన్ని సర్పంచ్కు వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భిక్కనూరు: కంచర్లలోని అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో శోభారాణి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఆమె వెంట సర్పంచ్ అరుణ, సూపర్వైజర్ మంగ ఉన్నారు. -
క్రైం కార్నర్
కుమ్మన్పల్లిలో ఒకరి ఆత్మహత్య బోధన్రూరల్: సాలూర మండలంలోని కుమ్మన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఊషం లక్ష్మణ్ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 5న ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం మృతుడి భార్య మల్లుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు గ్రామాల్లో చోరీలు రామారెడ్డి: రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో, పాల్వంచ మండలం సింగరాయిపల్లి గ్రామంలో దొంగలు గురువారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సింగరాయపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రెండు బైక్లు దొంగిలించారు. వాటిలో ఒక బైక్లో పెట్రోల్ అయిపోవడంతో గ్రామంలోనే వదిలివేశారు. అలాగే సింగరాయిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి చిల్లర నాణేలను, సీసీ కెమెరాలను, హార్డ్డిస్క్లను కూడా దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు. రెడ్డిపేట గ్రామంలో ఒక బైక్ డ్రంకన్డ్రైవ్లో 33మందికి శిక్షలు కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు డ్రంకన్డ్రైవ్ కేసుల్లో 33 మందికి శిక్షలు విధించాయి. ఇటీవల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడ్డారు. వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా 10 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 33 మందికి రూ.35వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తాం..
సభలో పాల్గొన్న ప్రజలు (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు. బీజేపీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో నిజామాబాద్ నగరం చెత్తకుప్పలా మారిందన్నారు. 12 ఏళ్లుగా మోదీ, 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 90 శాతం ఉన్నప్పటికీ అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. నిజామాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ స్మార్ట్ సిటీ పథకం ఎందుకు తేలేదన్నారు. ఎంపీ కేవలం మోదీ జపం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ గల్లీల్లో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అన్నారు. నిజామాబాద్ జిల్లాకు విమానాశ్రయం ఎందుకు సాధించలేదన్నారు. ఎందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి నిజామాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు ఇస్తే మేం వద్దన్నామా అన్నారు. ఏమి నిధులు తెచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినప్పటికీ నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేకపోయారన్నారు. ● నిజామాబాద్ రైతులు ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వల్లేనన్నారు. నిజామాబాద్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినదించింది ఈ గడ్డమీద నుంచేనన్నారు. సుదర్శన్రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మంత్రులుగా పని చేశారని, చిన్న మచ్చ లేదన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారు పేరన్నారు. క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడి ఉండేదన్నారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికే ఆదర్శమన్నారు. నిజామాబాద్ రైతుల పోరాటాలు దేశానికే ఆదర్శమన్నారు. ● జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నా మనసులో నిజామాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేస్తా. జిల్లాలో వివిధ విద్యాసంస్థల కోసం రూ.600 కోట్లు మంజూరు చేశాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.1,045 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్ శాఖ మంత్రినైన నావద్దకు రావాలి. నిధులు ఇచ్చే బాధ్యత నాదే. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాదేనన్నారు.నిజామాబాద్ నగరపాలకం, ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవాలని, అప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు వదులుకోవద్దన్నారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ ఓట్లు అడగాలంటే స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. ఓట్లు అడిగే హక్కు లేని బీజేపీని బొందపెట్టాలన్నారు. నిజామాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాదేనన్నారు. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్లకు ఎయిర్పోర్టులు తీసుకొచ్చామన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ చెత్తకుప్పలా మారింది ఎంపీ అర్వింద్ స్మార్ట్ సిటీ స్కీం ఎందుకు తేలేదు.. విమానాశ్రయం ఎందుకు తీసుకురాలేదు గతంలో 90 శాతం ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకున్నారు.. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు నేనే మున్సిపల్ మంత్రిని.. కాంగ్రెస్ను గెలిపిస్తే నిధులిస్తా నగరపాలకం, పురపాలకాల్లో కాంగ్రెస్ను గెలిపిద్దాం కేశాపూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
అభివృద్ధి అంటే పారిపోవడమా
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: మున్సిపల్ పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే అభివృద్ధి అని ప్రత్యర్థి పార్టీల నాయకులు భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండేళ్ల ఏళ్లలో కామారెడ్డికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని ఇందిరా గాంధీ చౌరస్తాలో నిలబెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
రెబల్స్ సవాల్!
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uప్రధాన పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తమ ఓట్లకు ఎక్కడ గండిపడుతుందేమోనని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజిల్లాలోని నాలుగు బల్దియాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్ భయపెడుతున్నారు. ఆయా పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన వారిలో కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీటుగా ప్రచారం నిర్వహిస్తూ జనంలోకి చొచ్చుకుపోతూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రెబల్స్ గెలిచే అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల వీరి మూలంగా ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు బాన్సువాడలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. ప్రచారంలో జోరు.. గెలుపోటములపై ప్రభావం వివిధ పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో వారి ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరిలో కొందరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా.. మరికొందరు తమకు టికెట్టు ఇవ్వని పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెబల్స్ సైతం జోరుగా ప్రచారం చేస్తుండడంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీంతో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న పలువురు తిరుగుబాటు అభ్యర్థులు పలు వార్డుల్లో సత్తా చాటే ప్రయత్నం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు ఎవరికి చేటు తెస్తారోనని ఆందోళన -
నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు
గెరిగంటి లక్ష్మీనారాయణ, స్వప్న(బీఆర్ఎస్), కామారెడ్డి కందూరి చంద్రశేఖర్, రేణుక(సీపీఎం), కామారెడ్డి షేక్ జుబేర్, పర్వీన్ బేగం (బీఆర్ఎస్), బాన్సువాడ చంద్రశేఖర్గౌడ్, కవిత (బీజేపీ), బాన్సువాడ ఎన్నికల బరిలో భార్యాభర్తలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఒక్కోసారి రిజర్వేషన్లు కలిసిరాక పోటీ చేసే అవకాశాలు దూరమవుతుంటాయి. రిజర్వేషన్లు కలిసొచ్చినా టికెట్టు ఆశించే వారి సంఖ్య ఎక్కువ ఉండి అవకాశం కోల్పోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి, అది కూడా భార్యభర్తలకు అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో నాలుగు జంటలకు ఎన్నికల బరిలో దిగే అవకాశం దక్కింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి రేణుక, 8వ వార్డునుంచి బరిలో ఉన్న అదే పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ భార్యాభర్తలు. వీరిద్దరు గతంలో కౌన్సిలర్లుగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు నుంచి, ఆయన భార్య స్వప్న 47వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. స్వప్న గత కౌన్సిల్లోనూ సభ్యురాలు. బాన్సువాడ మున్సిపాలిటీలో మొన్నటివరకు వైస్ చైర్మన్గా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన షేక్ జుబేర్ ఈసారి 2వ వార్డునుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పర్వీన్ 17వ వార్డునుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాన్సువాడలో మరో జంట బీజేపీ నుంచి పోటీ చేస్తోంది. చంద్రశేఖర్గౌడ్ 13వ వార్డు నుంచి, ఆయన భార్య కవిత 14వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. కవిత ఒక పర్యాయం ఎంపీటీసీగా పనిచేశారు. -
కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ: మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ గృహంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ పట్టణం అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో రూ.60 నుంచి రూ.70 కోట్ల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బాన్సువాడకు రాకముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా బాన్సువాడను అభివృద్ధి చేయలేదని, 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక తాడ్కోల్ శివారులో 26 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని, బాన్సువాడలో సెంట్రల్ లైటింగ్, బాన్సువాడ–నిజామాబాద్కు డబుల్ రోడ్డు, నిజాంసాగర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్, ఉప కాలువలు, చెరువుల మరమ్మతులు చేశానని అన్నారు. చందూర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి 6 ఎకరాలు కొనుగోలు చేసి ఇప్పటి వరకు పేదలకు పంచిపెట్టలేదని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని సిగ్గులేకుండా చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, అందరి లెక్కలు సరి చేస్తామని అన్నారు. 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. శనివారం బాన్సువాడకు కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. గిర్ధావర్ గంగారెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, ధర్మతేజ, చందర్, బాడి శ్రీనివాస్, అక్బర్ తదితరులున్నారు. -
నాలుగుసార్లు.. నాలుగు వార్డులు..
సాధారణంగా నేతలు ఒక స్థానానికి పరిమితమవుతారు. గెలిచినా ఓడినా తర్వాతి ఎన్నికల్లో అదే స్థానంనుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఆ నేత తీరే వేరు.. ప్రతిసారి కొత్త వార్డు నుంచి బరిలో దిగుతారు. ఆయనే కామారెడ్డికి చెందిన మాజీ కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్రావు. ఆయన మొదటిసారి 2005లో నిర్వహించిన ఎన్నికలలో 32వ వార్డు(అశోక్నగర్) నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై గెలిచి తొలిసారి కౌన్సిల్లో అడుగుపెట్టారు. ● 2014లో నిర్వహించిన ఎన్నికలలో రెండోసారి 28వ వార్డు (ఎన్జీవోస్ కాలనీ) నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అయితే ఆయన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ● 2020లో మూడో పర్యాయం 8వ వార్డు (హౌసింగ్ బోర్డు కాలనీ) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి 37 వ వార్డు(విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీలు) నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కామారెడ్డి టౌన్: చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు, న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. కోర్టు పనులకు దూరంగా ఉండి, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టంను అమలు చేయాలని కోరారు. న్యాయవాదులు నరేందర్ రెడ్డి, గోవింద రావు, జగన్నాథం, వెంకటరామిరెడ్డి, భిక్షపతి, శ్రీధర్, లత రెడ్డి, నరేష్ కుమార్, మాయ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో న్యాయవాది హత్య ఘటనను నిరసిస్తు నిరసన చేపట్టారు. న్యాయవాదులు గోపాల్రావు, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబా, సాయిప్రకాష్ దేశ్పాండే, నవీద్ తదితరులున్నారు. -
అప్పట్లో నామినేటెడ్ చైర్మన్!
● 1956 నుంచి 1969 వరకు బల్దియాగా ఎల్లారెడ్డి ● 13 ఏళ్లూ నామినేటెడ్ చైర్మన్ పాలనే!ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయ భవనంఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణం గతంలోనూ మున్సిపాలిటీగా ఉంది. 1956 లోనే మున్సిపాలిటీగా మార్చారు. 1969 వరకు కొనసాగింది. తర్వాత ఎల్లారెడ్డిని పంచాయతీ చేశారు. తిరిగి 2018 లో రెండోసారి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. నిజాం పాలనలో జమాబంది(పన్నుల వసూళ్లు) కోసం ఎల్లారెడ్డి తహసిల్ కార్యాలయం ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పట్లో పెద్దపెద్ద అధికారులు ఇక్కడ ఉండేవారని చెబుతారు. అధికారుల కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉన్న ఎల్లారెడ్డిని 1956లో మున్సిపాలిటీగా మార్చారు. అప్పట్లో ఎన్నికలు కాకుండా ప్రభుత్వం చైర్మన్ను నామినేట్ చేసేది. అలా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ప్రముఖ న్యాయవాది మైసన్ వకీల్ను నియమించింది. ఆయన 1956 నుంచి 1969 వరకు ఈ పదవిలో కొనసాగారు. మున్సిపాలిటీ కావడం వల్ల ప్రజలపై పన్నులభారం ఎక్కువగా ఉందన్న కారణంతో 1969లో ఎల్లారెడ్డిని గ్రామ పంచాయతీగా మార్చారు. తిరిగి గత ప్రభుత్వం 2018 ఆగస్ట్ 2న ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది.


