breaking news
Kamareddy
-
రక్తదానం ప్రాణదానంతో సమానం
కామారెడ్డి క్రైం: రక్తదానం ప్రాణదానంతో సమానమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలోని యూనియన్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. శిబిరంలో 153 మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, యూనియన్ రాష్ట్ర ప్రతినిధులు మధుసూధన్రెడ్డి, రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి మంగళవారం ఉదయం ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలో ఏఎంసీ గోడౌన్ (ఎస్పీ ఆఫీస్ దగ్గర), బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బిచ్కుందలో మార్కెట్ యార్డ్లలో సామగ్రి పంపిణి కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఉదయం 8 గంటలకు చేరుకోవాలని సూచించారు. కామారెడ్డి క్రైం : ‘సురక్షిత బ్యాంకింగ్కు మీ మొదటి అడుగు – కేవైసీ’ అనే నినాదంతో 13 వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవా లను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ కేవైసీ సంబంధిత మోసాలను నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజ ల్లో ఈ–కేవైసీ, సైబర్ మోసాలపై అవగాహన కల్పించడానికి ‘ఒక బ్యాంకు శాఖ–ఒక గ్రామసభ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎల్డీఎం చంద్రశేఖర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వినోద్, రాకేష్ కుమా ర్, సుజిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. దోమకొండ: రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికై నట్లు ఆర్చరీ కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. సోమవారం దోమకొండ గడికోటలో సీఎం కప్ ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండలో నిర్వహించినట్లు ఆర్చరీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్గౌడ్ తెలిపారు. బాలికల విభాగం(30 మీటర్లు)లో సహస్ర, బాలుర విభాగంలో ఎస్కే. రెహన్ ఎంపికయ్యారు. అదేవిధంగా బాలిక విభాగం(40 మీటర్లు)లో ఎన్.భావన, బాలుర విభాగంలో పీఆర్ రామచరణ్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్లో బాలికల విభాగంలో బి.వర్షిణి, పి.నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్.స్నేహిత్లు ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్లలో శ్రీ వైష్ణవి ఎంపికయ్యా రని కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. గ్రామ స ర్పంచ్ ఐరేని నర్సయ్య, పీడీ నరసింహారెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, మార్కెట్ కమి టీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖ ర్, సిద్ధ రాములు, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. నిబంధనల ప్రకారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు కేంద్రాలను కేటాయించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, సీపీవో రఘునందన్, అధికారులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడున్నా.. వచ్చి ఓటేయన్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మున్సిపాలిటీల పరిధిలో ఓటు ఉండి స్థానికంగా ఉండని ఓటర్ల వివరాలు సేకరించిన అభ్యర్థులు.. వారికి ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడున్నా వచ్చి ఓటేసి వెళ్లాలని కోరుతున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో చాలా మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు అద్దె ఇంట్లో ఉన్నపుడు వారి ఓట్లు అక్కడ నమోదు చేసుకుని, తర్వాత సొంత ఇళ్లు కట్టుకుని వేరే చోటుకు వెళ్లారు. మరికొందరు వేరే అద్దె ఇంట్లోకి మారారు. ఇలా చాలా మంది ఓట్లున్నాయి. ప్రతి వార్డులో వందల సంఖ్యలో స్థానికంగా ఉండని ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున పోల్ మేనేజ్మెంట్ చేస్తున్న వారు స్థానికంగా ఉండని వారిపై ఫోకస్ చేసి వారి వివరాలను సేకరించారు. వలస వెళ్లిన వారిలో తమకు వచ్చే ఓట్లు ఎన్ని అన్న లెక్కలు వేసుకుని, అనుకూలంగా ఉన్న వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తమవారు కాదనుకున్న వారికీ ఫోన్లు చేస్తున్నారు. ఈనెల 11న జరిగే ఓటింగ్కు రావాలని కోరుతున్నారు. రాకపోకలకు అయ్యే ఖర్చులను భరిస్తామని, కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా ఓటుకు ఇంత ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. స్థానికంగా వేరే వార్డుల్లో ఉన్న వారికి మద్యం, డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. కొందరికి ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కడెక్కడో ఉన్న వారు ఓటేయడానికి రావచ్చని భావిస్తున్నారు. అడ్రస్ లేని వారెందరో... ఓటరు జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో కొందరికి సంబంధించిన సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. కొన్ని కుటుంబాల ఫోన్ నంబర్లు కూడా ఎవరి వద్దా లేవు. కాంటాక్ట్ నంబర్లు దొరక్కపోవడతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. స్థానికంగా ఉండని ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు పోలింగ్ రోజు రావాలంటూ వేడుకోలు ఎంత ఖర్చయినా ఇస్తామంటున్న పలువురు.. -
‘నిర్భయంగా ఓటు వేయండి’
కామారెడ్డి క్రైం: ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం కోసం జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. కొత్త పట్టణంలోని శిశుమందిర్ పాఠశాల నుంచి ప్రారంభమైన పోలీసుల కవాతు బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, బడా మజిద్, పాంచ్రస్తా, డెయిలీ మార్కెట్, భరత్ రోడ్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్ మీదుగా రాజీవ్ పార్క్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసిందన్నారు. అభ్యర్థులు గానీ, వారి మద్దతుదారులు గానీ ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు మద్యం, డబ్బు, బహుమతులు వంటి ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దన్నారు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రతి కదలికను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, పట్టణ సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్, వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హోరెత్తిన ప్రచారం!
● ఆఖరి నిమిషం దాకా గల్లీలు చుట్టేసిన ముఖ్య నేతలు ● ర్యాలీలు నిర్వహించిన అభ్యర్థులుజిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిమున్సిపల్ ఎన్నికలలో విజయం కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్యనేతలు జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ గతనెల 27న వెలువడింది. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్కతేలింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల తరఫున పలువురు ముఖ్యనేతలు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, బీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోలు, సభలలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి బల్దియాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఎంపీ సురేశ్ షెట్కార్లు తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విస్తృతంగా ప్రచారం చేశారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బల్దియా ఎన్నికలలో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని ఆయన ధీమాతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల పక్షాల ఆ పార్టీ నేతలు పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడలో.. బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతోపాటు పలువురు నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిచ్కుందలో.. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతం ప్రచారం చేశారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే వార్డులను కలియ తిరిగారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. అందరిలోనూ గెలుపు ధీమా నాలుగు మున్సిపాలిటీలలో ప్రచారం ముగిసిన తర్వాత ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. తమతమ పార్టీలకు చెందిన అభ్యర్థులు మెజారిటీ వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలను కై వసం చేసుకుంటామన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు సైలెన్స్ పీరియడ్లో నిశ్శబ్దంగా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.కామారెడ్డి 33వ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కామారెడ్డి పదో వార్డులో ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతామని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు వార్డుల్లో ఓటర్ల దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థుల తరఫున స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత అవినీతికి అడ్డుపడిందని, అక్రమాలకు తెరపడిందని పేర్కొంటూ బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేయాలని ఓటర్లను కోరుతున్నారు. -
పకడ్బందీగా ఏర్పాట్లు
● నాలుగు మున్సిపాలిటీల్లో 239 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ప్రతి ఓటరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ‘‘జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులున్నాయి. ఓటర్లకోసం 239 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో కలిపి 1,49,525 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డిలో 99,313 మంది, ఎల్లారెడ్డిలో 13,265 మంది, బాన్సువాడలో 24,188 మంది, బిచ్కుందలో 12,759 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి బల్దియాలో 49 వార్డులు ఉండగా.. 152 పోలింగ్ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 24, బాన్సువాడలో 19 వార్డులకు 39, బిచ్కుందలో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. బరిలో 447 మంది అభ్యర్థులు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకుగాను 447 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 89 స్థానాల్లో పోటీలో ఉంది. ఎంఐఎం పదిచోట్ల, బీఎస్పీ నాలుగు చోట్ల, సీపీఎం మూడుచోట్ల, ఆప్ ఒక వార్డులో అభ్యర్థులను నిలిపాయి. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలనుంచి 18 మంది, స్వతంత్రులు 138 మంది పోటీలో ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 68 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఆ యా కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించాం. అలాగే అన్ని కేంద్రాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ ఉంటుంది. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. 1,398 మంది సిబ్బంది... పోలింగ్ నిర్వహణ కోసం 1,398 మంది సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇచ్చాం. కామారెడ్డిలో 883 మంది, ఎల్లారెడ్డిలో 142 మంది, బాన్సువాడలో 229 మంది, బిచ్కుందలో 144 మంది సిబ్బందిని నియమించాం. ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా కామారెడ్డిలో 17 మంది, ఎల్లారెడ్డిలో నలుగురు, బాన్సువాడలో ఏడుగురు, బిచ్కుందలో నలుగురు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 13న జరిగే కౌంటింగ్కు అవసరమైన ఏర్పాట్లు చేశాం. కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఏఎంసీ గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఉంది. ఎల్లారెడ్డి బల్దియాకు సంబంధించి ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీలో, బిచ్కుందలో ఏఎంసీలో కౌంటింగ్ నిర్వహిస్తాం. -
మున్సిపల్ పీఠం బీజేపీదే
● ఎమ్మెల్యే కేవీఆర్ కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ ర్యాలీలో జై బీజేపీ.. జై జై బీజేపీ నినాదాలు మిన్నంటాయి. అభ్యర్థులతో కలిిసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా మున్సిపల్ పీఠం బీజేపీ కై వసం చేసుకుంటుందని అన్నారు. కామారెడ్డి అభివృద్ధి, అవినీతి రహిత పాలన కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల బీసీ విద్యార్థులకు విదేశాల్లోని అత్యున్నత విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య అందించడానికి ఈ నెల 17న నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ సీహెచ్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోగా నేరుగా నిజామాబాద్ సుభాష్నగర్లోని స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08462–241055 నంబర్కు సంప్రదించవచ్చన్నారు. అత్తగారింటికి వెళ్తూ.. అనంత లోకాలకు నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు ఇలా.. అంకోల్ గ్రామానికి చెందిన పసుపుల సాయిలు(28) సోమవారం భార్య మనీషా, ఏడాది వయస్సు గల కొడుకుతో కలిసి బైక్పై బోధన్లోని అత్తగారి ఇంటికి బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రం వద్ద వారి బైక్ను బోధన్ నుంచి వస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యను అత్తగారింటిలో దింపి,అతడు కరీంనగర్లో బతుకు దెరువు కో సం పని చూసుకొని వస్తానని పేర్కొన్నట్లు సమా చారం.కానీ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
అందరి లెక్కలు సరి చేస్తాం
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ :ఈ రెండున్నర ఏళ్లలో పోచారం శ్రీనివా స్రెడ్డి బాన్సువాడకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని, గత సర్పంచ్ ఎన్నికల్లో కోటగిరి మండల కేంద్రం తప్ప మిగతా మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులే సర్పంచులుగా విజయం సా ధించారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా రు.కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను బె దిరిస్తున్నారని,అందరి లెక్కలు సరి చేస్తామని హె చ్చరించారు. సోమవారం బాన్సువాడలోని 9వ అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూపకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి యువకులు పోటీ చేస్తున్నారని, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. 9వ వార్డు అభ్యర్థి తేలి లక్ష్మి స్వరూప, 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, గాండ్ల కృష్ణ, మహేష్, బాడి శ్రీనివాస్, అక్బర్, లయక్, చందర్, సాయిబాబా తదితరులున్నారు. -
సంక్షిప్తం..
గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సూచించారు. మాల్తుమ్మెద గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని, నర్సరీని.. ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నెమ్మదిగా కొనసాగిస్తున్న లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శి అశోక్ను ఆదేశించారు. సృజనాత్మకతకు కళలు మూలం మద్నూర్(జుక్కల్):సృజనాత్మకతకు కళలు మూల మని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ అ న్నారు. ముంబై రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వేసిన వివిధ వర్ణచిత్రాలను సోమవా రం ఆవిష్కరించారు. వివిధ రకాల చిత్రాలు వేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రముఖ పద్యకవి, చిత్రకారుడు వెంకట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి లింగంపేట(ఎల్లారెడ్డి): అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. సోమవారం ఆయన అయ్యపల్లి తండా అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల హా జరు,పాఠశాలనిర్వాహణరికార్డులను పరిశీలించారు. చిన్నటాక్లీలో.. మద్నూర్(జుక్కల్): అంగన్వాడిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని మద్నూర్ ప్రాజెక్ట్ సీడీపీవో కళావతి సూచించారు. డోంగ్లీ మండలంలోని చిన్న టాక్లీ అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్లు సమయపాలన పాటించి.. నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు విద్యను అందించాలన్నారు. సూపర్వైజర్ సచిత ఉన్నారు. ఉపాధి పనులు ప్రారంభం లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు, నల్లమడుగు తండాల శివారులో సోమవారం సర్పంచులు ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూలీలు సమయపాలన పాటించి కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. సర్పంచ్ దేవసోత్ కవిత, క్షేత్రసహాయకులు, మేట్లు పాల్గొన్నారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు సదాశివనగర్(ఎల్లారెడ్డి):అర్హులైన నిరుపేదలందరి కి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నట్లు స ర్పంచ్ లాల్సింగ్, ఉప సర్పంచ్ రమేశ్రెడ్డి పేర్కొ న్నారు.సోమవారం తిర్మన్పల్లిలో ఇందిరమ్మ గృహా ల నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ఇంతియాజుద్దిన్, నాయకులు కావేటి సాయిలు, పెద్దొల్ల సాయిలు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ను ఆశీర్వదించండి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటర్లను కోరారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు. హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. -
ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం రూ.200 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఇప్పటికే చాలా పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రూ.8 కోట్లతో ఇండోర్ స్టేడియం, అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు, మార్చి నాటికి గోదావరి నీటి సరఫరా పెంపు పనులు వేగవంతం చేస్తామన్నారు. 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసిందని, ఎన్నికల తర్వాత ఇక్కడి ఎమ్మెల్యే కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రైలు పట్టాలు దాటుతూ వృద్ధురాలి మృతి కామారెడ్డి టౌన్: రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ఇలా.. వనపర్తి జిల్లాకు చెందిన మిరిగిల్లా సరోజమ్మ (75) ఆదివారం కామారెడ్డి రైల్వే గేట్ సమీపంలో పట్టాలు దాటుతోంది. భవానీ నగర్ నుంచి స్నేహపురి కాలనీ వైపు వెళ్తుండగా, అదే సమయంలో వస్తున్న తిరుపతి స్పెషల్ రైలును ఆమె గమనించలేదు. వేగంగా వచ్చిన రైలు సరోజమ్మను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పట్టాల పక్కన పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో మేకల కాపరి.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని వండ్రికల్ గ్రామంలో విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన మేకల కాపరి మృతిచెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వేముల కిషన్రావు(25) సోమవారం మేకల మేత కోసం గ్రామ శివారులో గల మత్తడి ఒర్రెవద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న మేడిచెట్టు పైకెక్కి కొమ్మలు నరికే క్రమంలో చెట్టు పైనుంచి వెళ్లిన 11కేవీ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అతడు చెట్టుపైనే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్యామ్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, 21 రోజుల వయస్సు గల కుమారుడున్నట్లు తెలిపారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగ 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ లారీ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి జరగడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపట్టారు. -
ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి
సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ: ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారం ముగియడంతో బాన్సువాడ పట్టణంలోని 19 వార్డుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని, పట్టణంలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. డబ్బుకు, మద్యానికి ఓటర్లు లోను కావవద్దని, రాజ్యంగబద్దంగా ఓటేయాలని సూచించారు. డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన బాన్సువాడ:ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సోమ వారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను పరిశీలించారు.ఏయే గదుల్లో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చే యాలో సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది సమయానికి రావాలని అ న్నారు.మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఉన్నారు. ఎల్లారెడ్డిలో..ఆర్డీవో పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డిరూరల్:ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఆర్డీవో పార్థసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. మంగళవారం ఎన్నికలకు సంబంధించిన సామగ్రి ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ యన తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. తహసీల్దా ర్ ప్రేమ్కుమార్, ఎంపీడీవో తాహేరాబేగం, మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్ తదితరులున్నారు. -
‘మార్చిలోగా బకాయిలు చెల్లించాలి’
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను మార్చిలోగా ఒకే విడతలో చెల్లించకపోతే ఉద్యమిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి పీఆర్టీయూ భవన్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జిల్లాలోని 81 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల్లోవిజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్రెడ్డి, భిక్షంగౌడ్, జిల్లా అధ్యక్షుడు కుషాల్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
● పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సో మవారం సంబంధిత నోడల్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ సిబ్బంది కేటాయింపు (డిస్ట్రిబ్యూషన్), పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమన్నారు. ప్రతి దశను పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్నిరకాల మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు మంగళవారం ఉదయం 7 గంటలకే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని, ఎన్నికల సామగ్రిని సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, వివిధ శాఖల నోడల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దండుపాళ్యం బ్యాచ్ను సాగనంపండి
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న దండుపాళ్యం బ్యాచ్ను సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిధులు మంజూరయ్యాయని.. అదే నిధులతో ఎల్లారెడ్డిలో పనులు జరుగుతున్నాయని అన్నారు. రూ.5 కోట్లతో బస్టాండ్ నిర్మాణం, రూ.18 కోట్లతో డబుల్ బెడ్రూంల నిర్మాణం, రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు బీఆర్ఎస్ నిధులు మంజూరు చేసి నిర్మిస్తే వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసి తాము అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ రూ.2 కోట్ల నిధులు కూడా తేలేదని అన్నారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లకు బీటీ వేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు జలంధర్రెడ్డి, ఆదిమూలం సతీష్, మనోహర్రెడ్డి, శ్రీనివాస్నాయక్, నర్సింలు, ముదాం సాయిలు, కౌన్సిలర్ అభ్యర్థులు ప్రసీలా, పద్మ, జీనత్ సుల్తానా, తదితరులున్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
● ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి ఎంపీ నిధులు పూర్తిగా అందిస్తాం ● జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్కే మద్దతుల పలకాలని, రెండేళ్ల కాంగ్రెస్ ప్రజా పాలనలో ఎల్లారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావుతో కలిసి ఎంపీ మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధి దీపాలు, పార్క్లను ఏర్పాటు చేశామన్నారు. తాను గతంలో ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లారెడ్డికి మోడల్ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించానన్నారు. ఎల్లారెడ్డి మీదుగా రుద్రూర్ వరకు ఎన్హెచ్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే కరీంనగర్–కామారెడ్డి– ఎల్లారెడ్డి నేషనల్ హైవే పనులు జరుగుతాయని అన్నారు. దీనికి సంబంధించిన నిధులు త్వరలోనే మంజూరవుతాయని అన్నారు. కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే మున్సిపల్లో 12 వార్డుల్లో గెలుపే లక్ష్యమని, కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన బస్టాండ్ పునర్నిర్మాణం, పెద్ద చెరువు కట్టమీద మినీ ట్యాంక్ అభివృద్ధి, పార్క్, ఇంటిగ్రేటెడ్ మోడల్ పాఠశాలకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. విలీన గ్రామాలలో విద్యుత్ లేక ఇబ్బందులు పడితే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ను అందించామన్నారు. మధ్యంతరంగా వదిలి వేసిన 300 ‘డబుల్’ ఇళ్లకు నిధులు మంజూరు చేయించి లబ్ధిదారులకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి అర్బన్: పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, ప్రయివేట్ రంగ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారిణి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013 ప్రకారం అశ్లీల వ్యాఖ్యలు, అభస్య ప్రవర్తన, శారీరక వేధింపులు నేరంగా పరిగణిస్తారని, 50 శాతం మంది మహిళలతో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు. అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలు షీబాక్స్ పోర్టల్లో నమో దు చేయాలని ఆమె సూచించారు. వివరాలకు మహిళా హెల్ప్ లైన్ 181 లేదా పోలీసు హెల్ప్ లైన్ 100 సంప్రదించవచ్చన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): సోషల్ మీడియా యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్ రాజేందర్ రావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు, ప్రగతి గ్రామ సంఘాల్లో మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, సామాజిక మాధ్యమాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత కోల్పోతే కుటుంబం, పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్రామ సంఘం అధ్యక్షులు గువ్వ భూదేవి, ఎం.లలిత, సీసీ ఆంజనేయులు, పర్యవేక్షణ సమాఖ్య ప్రతినిధి లత, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉండి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్ అన్నారు. సోమవారం కళాశాలలో కళాశాల టీఎస్కేసీ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. జాబ్మేళాలో ఏడుగురు విద్యార్థులు ఎంపిక కావడంపై ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు. టీఎస్కేసీ సమన్వయకర్త రాజ్గంభీర్రావు, అధ్యాపకులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: శ్రీరాం నారాయణ ఖేడి యా ప్రభుత్వ డిగ్రీకళాశాల(అటానమస్) మొ దటి, మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను సో మవారం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫె సర్ కే.సంపత్కుమార్తో కలిసి ప్రిన్సిపల్ గంగాధర్ విడుదల చేశారు. అటానమస్ హోదా లో మొదటి సెమిస్టర్లో 61శాతం, మూడో సెమిస్టర్లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నా రు. యూనివర్సిటీ అదనపు కంట్రోలర్ శాంతాబాయి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ సోమవారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరగనుండటంతో 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసి వేయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను మూసి వేయించినట్లు తెలిపారు. -
యూరియా ‘యాప్’ తప్పనిసరి
● ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ● స్మార్ట్ ఫోన్లతో రైతుల ఆపసోపాలు ● యూరియా కోసం గోదాముల వద్ద బారులు నిజాంసాగర్(జుక్కల్): రైతులు యూరియా బస్తాలు పొందడానికి యాప్ బుకింగ్ విధానం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొన్నటి వరకు పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు యూరియాను అందజేయగా, ఆదివారం యాప్ విధానం అమలు చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి స్మార్ట్ఫోన్లు లేకపోవడం, మరికొందరికి ఫోన్లు ఉన్నా బుకింగ్ విధానం తెలియక సతమతమయ్యారు. అవాక్కయిన రైతులు, సిబ్బంది.. నిజాంసాగర్ మండల కేంద్రంలోని అచ్చంపేట సొసైటీ గోదాముకు శనివారం సాయంత్రం లారీలో 444 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు గోదాము వద్దకు చేరుకొని రాత్రి అక్కడే పడుకున్నారు. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేసేందుకు సొసైటీ సిబ్బంది సిద్ధం కాగా, అధికారులు యాప్లో నమోదు తప్పనిసరి అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికే బస్తాలు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రైతులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకొని సొసైటీ సిబ్బందికి ఇవ్వడంతో యాప్ నమోదు ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఎకరానికి ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. కాగా, యాప్లో బుకింగ్ చేసుకున్నా, కొందరు రైతులకు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు. -
స్వీయ చరిత్ర రాసుకున్న స్వామి!
● నాలుగు దశాబ్దాల తన ప్రస్తానానికి అక్షరరూపం ● ఆయన మరణించిన రోజునే వెలుగులోకి ● సామాజిక మాధ్యమాల్లో వైరల్ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : Ñç³ÏÐø-§ýlÅ-Ð]l$…ÌZ çÜ$©Æý‡ƒM>ÌS… ç³°-^ólíÜ G¯ŒS-Mú…-r-ÆŠ‡ÌZ ^èl°-´ùƇ$$¯]l Ð]l*ÐøÆ‡$$çÜ$t A{VýS-¯ól™èl {糿ê-MýSÆŠ‡ AÍ-Ķæ*‹Ü ç³yýlPÌŒæ-ÝëÓÑ$, AÍ-Ķæ*‹Ü ÌZMóSsìæ ^èl…§ýlÆŠ‡ ¯éË$VýS$ §ýlÔ>»êªÌS ™èl¯]l {ç³Ýë¢-¯]l…Oò³ Æ>çÜ$-MýS$¯]l² ïÜÓĶæ$ ^èlÇ{™èl Ôèæ°-ÐéÆý‡… Æ>{† ¯]l$…_ ÝëÐ]l*hMýS Ð]l*«§ýlÅÐ]l*ÌZÏ ^èlMýSPÆý‡$Ï Möyýl$-™ø…-¨.ÝëÓÑ$ D ¯ðlÌS 6¯]l VýSyìlaÆøÍ hÌêÏÌZ fÇ-W¯]l G¯ŒS-Mú…-rÆŠ‡ÌZ Ð]l$Æý‡-×ìæ…-_¯]l ÑçÙĶæ$… ™ðlÍ-íÜ…§ól. ™èl¯]l iÑ™èl ^èlÇ-{™èl¯]l$ ÑÐ]l-ÇçÜ*¢ VýS™èl…ÌZ BĶæ$¯]l Æ>íܯ]l ïÜÓĶæ$ ^èlÇ{™èl C糚yýl$ A…§ýl-DZ ^èl¨ÑÝù¢…-¨. C{Ýùh-ÐéyîlÌZ 1969 ÌZ f°-Ã…-_¯]l సస్వÝëÓÑ$ BÆø-™èlÆý‡VýS† Ð]lÆý‡MýS$ Ð]l*{™èlÐól$ ^èl¨Ñ-¯]lr$t A…§ýl$ÌZ õ³ÆöP¯é²Æý‡$. ™èl¯]l 16Ð]l Hsê 1984ÌZ çÜ…Vøh-Ðé-yìlMìS ^ðl…¨¯]l çÜ$ÌZ-^èl-¯]l™ø ÑÐé-çßæ-OÐðl$…-§ýl-°, Ð]l¬VýS$YÆý‡$ í³ÌSÏ˰ õ³ÆöP-¯é²Æý‡$. ò³§ýlª MýS*™èl$Æý‡$ Æý‡h™èl ç³#r$t-MýS-™ø¯ól ¨ÐéÅ…-VýS$Æ>Ë$ M>Ð]l-yýl…, ç³§ýlÐ]lÊyø Hsê 1999ÌZ ^èl°-´ù-Ƈ$$…§ýl° ÑÐ]l-Ç…-^éyýl$. 1995ÌZ JMýSÝëÇ ™èl¯]l FÇMìS ÐðlãÏ ™èlÍϧýl…{yýl$-ÌS¯]l$ MýSÍíÜ Ð]l*sêÏyé-¯]l-°, A§ól BQÇ ^èl*ç³# A° ÐðlÌSÏyìl…^éyýl$. నాలుగు దశాబ్దాల నాడే విప్లవ పాఠాలు... 1986లో ఇస్రోజివ ాడి గ్రామానికి వచ్చిన విప్లవకారులతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతోనే తాను రాడికల్ యూత్ లీగ్లో చేరి గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు వివరించాడు. భూస్వాముల అరాచకాలపై సంఘ సభ్యులతో కలిసి జరిపిన పోరాటాలను తెలిపాడు. ఊరును పోలీసులు చుట్టుముట్టి ప్రజల్ని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టిన విషయంలో భూస్వాములపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రజల్ని వదిలిపెట్టారని తెలిపాడు. 1991లో పూర్తిస్థాయి విప్లవకారుడిగా మారినట్టు పేర్కొన్నాడు. కామారెడ్డి లోకల్ ఏరియా దళంలో, తర్వాత సిర్నాపల్లి దళ కమాండర్గా, డివిజన్ కమిటీ మెంబర్గా, కామారెడ్డి ఏరియా కమాండర్గా సిరిసిల్లా ఏరియాకు ఇన్చార్జీగా ఉండి ఆ ప్రాంతంలో ఉద్యమాన్ని గైడ్ చేసినట్టు తెలిపాడు. తెలంగాణ ప్లీనంలో కొంతమంది క్యాడర్ను దండకారణ్యానికి పంపాలని తీసుకున్న నిర్ణయం మేరకు 2003 డిసెంబర్లో తాను అక్కడికి వెళ్లినట్టు వివరించారు. దక్షిణ సబ్ జోనల్ బ్యూరోలోని పశ్చిమ బస్తర్లో డీవీసీఎంగా, తర్వాత కంపనీ–2 కమాండర్గా, సచీవ్గానూ, దక్షిణ్ సబ్ జోనల్ కమాండ్ మెంబర్గా పనిచేసినట్టు అందులో వివరించారు. 2006లో దండకారణ్య కాన్ఫరెన్సులో తనను ఎస్జెడ్సీలోకి తీసుకున్నారని, ఉద్యమ అవసరాల రీత్యా 2011లో పశ్చిమ సబ్ జోనల్కు బదిలీ అయి 2020 వరకు అక్కడే సబ్ జోనల్ బ్యూరో మెంబర్గా, పశ్చిమ సబ్ జోనల్ కమాండర్ ఇన్ చీఫ్గా, కంపెనీ 10కు సచీవ్గా, కంపెనీ 4కు సచీవ్గా, ఉత్తర్ గడ్చిరోలి డివిజన్కు సబ్ జోనల్ బ్యూరో నుంచి ఇన్చార్జీగా పనిచేసినట్టు తెలిపాడు. దాడులకు నాయకత్వం.. 1993లో సిరా ్న పల్లిలో పోలీస్ అవుట్పోస్టుపై దా డి, 1999లో మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్పై దాడి, రామారెడ్డి పోలీస్ అవుట్పోస్టులపై దాడికి ప్రయత్నం చేసినట్లు వివరించాడు. కరీంనగర్ జిల్లా చందుర్తిలో 1998లో అంబుష్ వేసి ఎస్సైని, 2000 సంవత్సరంలో కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ అంబూష్లో తాను పాల్గొన్నది వివరించాడు. శత్రుదాడులకు గురైన ఘటనలు ఎన్నో... 1993లో నిజామాబాద్ జిల్లా పడ్కల్లో ఆరుగురితో కూడిన దళం ఒక ఇంట్లో ఉన్న సమాచారంతో వందలాది మంది పోలీసు బలగాలు చుట్టుముట్టిన ఘటనలో హోరాహోరీగా జరిగిన పోరాటాన్ని వివరించాడు. అందరూ చనిపోయినా తాను ఎలా తప్పించుకున్నది అందులో పేర్కొన్నాడు. 1999లో ప్రాజెక్టు రామడుగులో దాడి నుంచి తప్పించుకున్నట్టు, 1997లో నల్లవెల్లిలో యూత్తో మాట్లాడుతుండగా జరిగిన దాడి, 2020–21లో జగిత్యాల మండలం గజ్జెరాళ్లగుట్టపై ఉండగా గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన దాడి, అందులో రమేశ్ అనే దళకమాండర్ చనిపోగా, మిగతా వారు తప్పించుకున్నది వివరించాడు. 1998లో సిర్నాపల్లి అడవిలో జరిగిన దాడిలో తనతోపాటు న్యాలకొండ రజిత అలియాస్ పద్మక్క తప్పించుకున్న తీరును తెలిపాడు. -
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
బాన్సువాడ: బాన్సువాడ బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గడుమల లింగమేశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఏ బల్దియాలో జరగని అభివృద్ధిని బాన్సువాడలో చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రుణం తీర్చుకోవాలంటే 19 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని అన్నారు. ప్రతి వార్డులో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత పోచారంకే దక్కిందన్నారు. గతంలో 11వ వార్డులో కౌన్సిలర్గా పని చేసిన లింగంకు ప్రజల అభిమానం ఉందని, ఈ సారి లింగంను గెలిపించుకుంటే మిగిలిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేస్తామన్నారు. నేతలు కృష్ణారెడ్డి, గులేపల్లి శంకర్, జిన్న రఘు, జీవన్, మల్లారెడ్డి, లక్ష్మణ్, నారాయణ, కొంకి విఠల్, గులేపల్లి రమేష్, అనిత ఉన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
లింగంపేట/ కామారెడ్డి టౌన్: లింగంపేట మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 1970–71 సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రతాప్రెడ్డి, రఘునాథ్, సుధాకర్, గురునాథ్, చంద్రశేఖర్, సరసింహరెడ్డి, సాజిద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1972–73 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ భేటీలో పూర్వ విద్యార్థులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నరాముల అశోక్(41) గత సంవత్సరం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా రు. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహమ్మద్నగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నిజాంసాగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘట్ జిల్లా వాలేగావ్ గ్రామానికి చెందిన రాజ్కుమార్(38) కొన్ని నెలల క్రితం మండల కేంద్రానికి వచ్చి తాపీ మేస్త్రి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజులుగా మధ్యప్రదేశ్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్ మాట్లాడుతూ గొడవ పడేవాడు. అతిగా మద్యం సేవించేవాడు. ఆదివారం స్వగ్రామానికి వెళ్తున్నట్లు తోటివారితో చెప్పిన అతను ఇంటి బయట బట్టల బ్యాగు ఉండటాన్ని తోటి మేస్త్రిలు గమనించారు. వారు ఇంట్లో అతని కోసం వెతుకగా బాత్రూమ్లో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. -
నేటితో ప్రచారానికి తెర
● తుది అంకానికి చేరుకున్న అభ్యర్థుల ప్రచారం ● సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు ● గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలుమున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం తుది అంకా నికి చేరుకుంది. నేడు సోమ వారం సాయంత్రంతో బ హిరంగ ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. గెలుపు కో సం 9, 10వ తేదీల్లో అంతర్గతంగా చక్రం తిప్పేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేయనున్నారు. గెలుపు ఓటములను నిర్ణయించే కీలకమైన 11వ తేదీ పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బహిరంగ ప్రచారానికి స్వస్తి.. బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో, చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చెమటోడుస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు నియోజకవర్గాలను వీడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రలోభాలకు సిద్ధం.. ప్రచార గడువు ముగియడంతో 9, 10వ తేదీల్లో ప్రధాన పార్టీలు, స్వతంత్రులు తమ గెలుపు కోసం తెర వెనుక వ్యూహాలతో చక్రం తిప్పనున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, సామాజిక వర్గాల వారీగా మంతనాలు జరపనున్నారు. కాగా, పోలింగ్కు ఒకరోజు ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పలువురు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీ ల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అగ్రనేతల రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో పట్టణాలు హోరెత్తాయి. నాలుగు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుందలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం నిర్వహించారు.జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 1,49,525 ఓటర్లు ఈ నెల 11న తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. -
క్రైం కార్నర్
బాన్సువాడ రూరల్: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండల కేంద్రంలోని డబుల్బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న శివకుమార్(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో అతని భార్య ఎంతలేపినా నిద్రలేవకపోవడంతో ఆమె శివకుమార్ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం కొప్పర్లకు చెందిన గడిపె గోపాల్రావు కుమార్తె లక్ష్మి(14) రెంజల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు కుమార్తె లక్ష్మిని రాయించేందుకు గోపాల్రావు తన భార్యతో కలిసి కామారెడ్డికి బైక్పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో మల్లుపేట్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. బైక్పై ఉన్న వీరు కింద పడడంతో లక్ష్మి తలకు బలమైన గాయమైంది. స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మద్దెల వనిత బిచ్కుంద మండలం లచ్చన్లో తమ బంధువు చనిపోవడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇంటిపక్క వ్యక్తి వనితకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. ఆమె ఇంటికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీలో బీరువాలో ఉన్న తులం బంగారం, 120 తులాల వెండిని దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎరుపెక్కిన ఇస్రోజివాడి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: గడ్చిరోలి ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టు అగ్రనేత ప్రభాకర్ అలియాస్ పడ్కల్ స్వామి అలియాస్ లోకేటి చందర్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఇస్రోజివాడి గ్రామంలో ఆదివారం జరిగాయి. ఈ నెల 6న జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆయన మృతి చెందగా, శవాన్ని ఆదివారం ఉదయం గ్రామానికి తీసుకువచ్చారు. స్వామికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో ఖాళీ జాగాలోనే టెంటు వేసి ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి జిల్లా నక్సలైట్ ఉద్యమంలో కీలకనేతగా స్వామి బాన్సువాడ, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, కామారెడ్డి ఏరియాలతోపాటు సిరిసిల్లా ఏరియాలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేసిన వందలాది మంది మాజీలు ఆఖరి చూపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. విప్లవోద్యమంలోనే కన్నుమూసిన స్వామి భార్య సులోచన అమరత్వంపై ప్రచురించిన ‘గెరిల్లా అమ్మ’ అనే పుస్తకాన్ని స్వామి కొడుకు రమేశ్తోపాటు బంధువులతో కలిసి అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సులోచన త్యాగాన్ని సైతం కొనియాడారు. పీడిత ప్రజల కోసం అడవిబాట పట్టిన స్వామి నడిచిన దారిలో సులోచన తర్వాత ఇద్దరు పిల్లలు కూడా నడిచారని, వారిది మహోన్నత త్యాగమని పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు పలువురు స్వామి ఎదిగిన తీరును వివరించారు. స్వామి కుటుంబంలాగే దేశంలో లక్షలాది మంది పోరాడుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్న భారత ప్రభుత్వం ప్రజలపై యుద్ధం చేస్తోందని, వారి పక్షాన పోరాడుతున్న విప్లవకారులను పాశవికంగా కాల్చిచంపుతోందన్నారు. మార్చి 31 లోగా దేశంలో విప్లవకారులను ఏరివేస్తామని ప్రకటించి సైనిక దాడులకు పాల్పడిందన్నారు. ఏ దేశ ప్రభుత్వాలైనా తమ దేశ పౌరులపై యుద్ధం చేయవని, భారత ప్రభుత్వం మాత్రం ప్రజలపై, ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమకారులపై పాశవిక దాడి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎర్రజెండాల రెపరెపలు... స్వామి అంతిమయాత్రలో వందలాది మంది ఎర్రజెండాలు చేతబట్టుకొని పాల్గొన్నారు. దీంతో దారి మొత్తం ఎరుపెక్కింది. పాటలు పాడుతూ, నినదిస్తూ స్వామిని స్మరించుకున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నినదించారు. కాగా, స్వామి అంత్యక్రియల సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టిలో ఉండి పరిశీలించారు. అంత్యక్రియలకు హాజరైన వారిని, వారి మాటలను రికార్డు చేశారు.స్వామి కుటుంబానికి చెందిన చేను దగ్గర ఖననం చేశారు. కొడుకు రమేశ్ చేతుల మీదుగా అంతిమక్రియలు నిర్వహించారు. ఉద్యమంలో ఉన్నపుడు తల్లి అంత్యక్రియలు నిర్వహించిన రమేశ్, ఇటీవలే ఉద్యమం నుంచి వైదొలిగి లొంగిపోయాడు. ఇదే సమయంలో చనిపోయిన తండ్రి అంత్యక్రియలు కూడా ఆయన చేతుల మీదుగా జరిగాయి. గెరిల్లా అమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో తమ కుటుంబం ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది, అడవి బాట ఎందుకు పట్టిందన్న విషయాలను వివరించారు. తల్లిని గుర్తు చేస్తూ కంటతడి పెట్టాడు. అంత్యక్రియల్లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఽఅధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మన్, కార్యదర్శి నారాయణరావ్, విరసం అధ్యక్షుడు పాణి, కార్యదర్శి రాజయ్య, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధులు పద్మకుమారి, శాంతక్క, వివిధ సంఘాల నేతలు కుమారస్వామి, విజయరామరాజు, సుదర్శన్, భవానీ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, న్యాయవాదులు క్యాతం సిద్దరాములు, ఆజాద్, విద్యార్థి నేతలు విఠల్, సురేశ్, మాజీ మావోయిస్టు నేతలు అమర్, సునీత, నరేశ్, రామకృష్ణ, జనార్దన్ తదితరులు హాజరయ్యారు. వీడియో కాల్తో ఆఖరి చూపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ జైలులో ఉన్న స్వామి కూతురు లావణ్య తన తండ్రి ఆఖరి చూపు కోసం జైలు అధికారులకు విన్నవించుకోగా వీడియోకాల్కు అనుమతించారు. దీంతో లావణ్య తన అన్న రమేశ్కు జైలు అధికారుల ద్వారా వీడియోకాల్ చేసి తండ్రి శవాన్ని చూసి కంటతడిపెట్టింది. తండ్రికి నివాళులర్పించింది. లోకేటి చందర్కు కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నినాదాలతో హోరెత్తిన అంతిమయాత్ర ఆట, పాటలతో ర్యాలీలో పాల్గొన్న జనం -
33వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కుంబా రవియాదవ్ ఆదివారం వార్డులోని కాలనీలలో ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. 24 గంటల పాటు వార్డులో అందుబాటులో ఉంటానని, వార్డులోని సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. 37వ వార్డులో జోరుగా ప్రచారం కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 37వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నిట్టు కృష్ణమోహన్రావు ఆదివారం ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వార్డులోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. నాయకులు నిట్టు వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. డప్పు కళాకారులతో వినూత్న ప్రచారం కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలో 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆదివారం వినూత్నంగా ప్రచారం చేపట్టారు. డప్పు కళాకారులతో వార్డులోని కాలనీలో ప్రచారం చేశారు. ఉదయం నుంచి కళాకారులతో ప్రభుత్వ పథకాలు, వార్డు అభ్యున్నతికి తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టోను పాటల ద్వారా ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తానో ప్రజలకు అర్థమయ్యే విధంగా కళాకారులతో పాటల ద్వారా వివరించారు. కౌన్సిలర్ అభ్యర్థి కళావతి మాట్లాడుతూ.. మొదటిసారి పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాయకుడు రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
కామారెడ్డి రూపురేఖలు మారుస్తాం
కామారెడ్డి టౌన్: బీజేపీని గెలిపిస్తే రాబోయే మూడేళ్లలో కామారెడ్డి రూపురేఖలు మారుస్తామని స్థానిక శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వివిధ వార్డులలో బీజేపీ అభ్యర్థులతో కలిసి కార్నర్ మీటింగ్ సభలో ప్రసంగించారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు రూపాయి అవినీతికి పాల్పడినా వెంటనే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతానని బహిరంగంగా ప్రకటించారు. కామారెడ్డిలో ఆ ప్రధాన పార్టీలు రెండు ఒక్కటేనని, ప్రజలను దోచుకోవడమే వారి ప్రధాన ఎజెండా అని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో ఏ అభ్యర్థులు గెలిచినా అంతర్గతంగా అవినీతికి పాల్పడుతూ, కబ్జాలు, అక్రమాలతో దోపిడీకి పాల్పడతారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిని గద్దె దించి ఎవరికి దక్కించారో అందరికీ తెలుసన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లే వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని రాజకీయాలు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతాయని, అభివృద్ధికి ఆటంకం కలిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఆదాయం మార్గాలు పెంచి, రోడ్ల విస్తరణ, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ స్థలాలు, పచ్చదనంతో పురాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకోసం బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ కౌన్సిలర్లు అవినీతికి పాల్పడితే వేటు వేస్తాం ఆ రెండు పార్టీలు ఒకటే.. దోపిడీయే వారి ఎజెండా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శలు -
మంచి పాలన అందిస్తున్నాం..
● మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ● ఎల్లారెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ప్రచారంఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్: క్రికెట్లో బ్యాటింగ్, ఫీల్డింగ్తోపాటు మంత్రిగా ప్రజలకు మంచి పాలన అందిస్తానని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి బస్టాండ్, మినీ ట్యాంక్బండ్, అర్బన్ పార్క్, ఏటీసీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎల్లారెడ్డినిలో ఈద్గా ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి సరైన అభివృద్ధిని చూడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా రూ.35 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతోందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, మత్తమాల భాగ్యవతి, గాయత్రి, మహేశ్వరీ, కౌసరున్నీసా, మంజుల, చంద్రయ్య, గఫార్, నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, స్వప్న, ఎరుకల దశరథం తదితరులు పాల్గొన్నారు. -
‘పోచారం’.. ఇక పర్యాటకం!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు వద్ద పర్యాటక పనుల నిర్వహణకు మోక్షం కలిగింది. ఎమ్మెల్యే మదన్మోహన్రావు కృషితో నిధుల మంజూరుకు మార్గం సుగమం అయ్యింది. ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు గెస్ట్హౌస్ను నిర్మించనున్నారు. ప్రాజెక్టు వద్ద యాక్సెస్ రోడ్ల నిర్మాణంతోపాటు పిల్లల ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. నెరవేరనున్న కల.. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి పర్చాలని మండల ప్రజలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. వారాంతపు సెలవులతోపాటు పండగల వేళ కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు తరలివస్తారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి కిందకు జాలువారే నీటిలో తడుస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరుకొని అందులోని వన్యప్రాణుల సందడిని ఆస్వాదిస్తారు. కాగా, ప్రాజెక్టులో విహరించేందుకు బోటింగ్ సౌకర్యం లేకపోవడంపై సందర్శకులు నిరాశకు లోనవుతున్నారు. బాత్రూం, టాయ్లెట్స్ లాంటి కనీస సౌకర్యాలు లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల నిర్వహణకు రూ.3 కోట్లు మంజూరు బోటింగ్ సౌకర్యం, గెస్ట్హౌస్ నిర్మాణంతోపాటు పిల్లల ఆట పరికరాల ఏర్పాటుకు సన్నాహాలు -
త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను
మాజీ ఎంపీ బీబీ పాటిల్ బాన్సువాడ: బోధన్–బీదర్ రైల్వేలైనుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం బాన్సువాడలో బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టాణాలు అభివృద్ధి చెందాలంటే రైల్వేలైను ఉండాలని, బోధన్–బీదర్కు రైల్వేలెను కోసం గతంలో ప్రతిపాదనలు పంపితే మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, సాంకేతిక సమస్యల వల్ల పనులు ప్రారంభం కాలేదని, త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సంగారెడ్డి–అకోలా జాతీయ రహదారి విస్తరణ వల్ల హైదరాబాద్కు వెళ్లే బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజలకు దూరం తగ్గిందని, ట్రాఫిక్ లేకుండా సులువుగా హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని అన్నారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 17 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, కమలం గుర్తుకు ఓటేసి వారందరిని గెలిపించాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాలు: యెండల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. బాన్సువాడను బషీర్బాగ్గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఎన్జీవోఎస్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, వాసవికాలనీ, గౌలీగూడల పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లి వస్తుంటే గుర్రంపై పువ్వులు చల్లుతూ స్వాగతం పలికడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి తరహాలో బాన్సువాడలో కూడా బుల్డోజర్ యాక్షన్ చేయక తప్పడం లేదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇంద్రసేనా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
రూ. 15 వేల కోసం గొడవ.. హత్య
పిట్లం(జుక్కల్): కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలిల మధ్య జరిగిన వాగ్వాదమే ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. పిట్లం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును 48 గంటల్లో పిట్లం పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడలోని తన కార్యాలయంలో వెల్లడించారు. పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట సిద్ధులు అనే వ్యక్తి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నెల 6న సాయంత్రం కొత్త ఇంటికి వచ్చిన సిద్ధులుకు ఇంటి పెయింటింగ్ పనుల కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేశ్(46) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. హత్య కేసును ఛేదించేందుకు ఎస్సీ రాజేశ్చంద్ర రెండు బృందాలను ఏర్పాటు చేశారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేయగా వారు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో ఓ వ్యక్తి కిరాయి ఉన్న ఇంటికి వచ్చి ఇంటి వస్తువులను సర్దుకొని పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు బృందాలు సీసీ కెమెరాల ద్వారా గమనించాయి. అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నిందితుడు శ్రీకృష్ణ మృతుడు రాజేశ్ను హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. యూపీకి చెందిన మృతుడు రాజేశ్, శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పనిచేసేవారు. రాజేశ్ మిత్రుడు దిలీప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నాయని చెప్పడంతో వీరు ఇటీవల పిట్లంకు వచ్చారు. శ్రీకృష్ణతో దిలీప్ పెయింటింగ్ పనులు చేయించుకొని రూ. 15వేల నగదు ఇవ్వకుండా దిలీప్ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో మృతుడు రాజేశ్తో శ్రీకృష్ణ తరచూ గొడవపడేవాడు. ఈ నెల 6న సిద్ధులు నిర్మాణం చేపడుతున్న ఇంటికి శ్రీకృష్ణ రాజేశ్ను తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. దీంతో ఆగ్రహంతో అతని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. మృతుడు రాజేశ్ జేబులో ఉన్న ఫోన్, రూ. 250 నగదు తీసుకొని పరారైనట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్ర, ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లు కే రఘు, సాయాగౌడ్, వెంకటేశ్, నవీన్, హోమ్గార్డు సంగమేశ్ను ఎస్పీ రాజేశ్చంద్ర ప్రత్యేకంగా అభినందించారని బాన్సువాడీ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. చంపింది తోటి కూలీయే.. 48 గంటల్లో హత్య కేసును ఛేదించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు, అరెస్టు -
త్రిలింగ రామేశ్వరాలయానికి విరాళం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్ శివారులో గల త్రిలింగరామేశ్వరాలయ అభివృద్ధి కోసం హైద్రాబాద్కు చెందిన హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ పామిడిగంటం శ్రీరఘురాం రూ.70 వేలు విరాళంగా అందజేశారు. ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం శ్రీరఘురాం దంపతులను ఆలయకమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయకమిటీ చైర్మన్ దత్తు, తాండూర్, అక్కంపల్లి గ్రామాల సర్పంచ్లు భూమా యాదగౌడ్, వెంకాగౌడ్, నాయకులు సురేందర్రెడ్డి, సతీష్తోపాటు ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ఏనభైఏళ్ల చరిత్ర కల్గిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవోస్)పై అసత్య ప్రచారాలు మానుకోవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు హితవు పలికారు. ఆదివారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా భవన్లో జిల్లా ప్రతినిధులతో కలిసి అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో టీఎన్జీవోస్ ముందుండి ఉద్యమించిందని, ఇలాంటి సంఘంపై అసత్య ఆరోపణలు సమంజసం కాదన్నారు. సంఘంలో గెజిటెడ్ అధికారులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉపాధ్యాయ సంఘాలుండగా తెలంగాణలో వాటికి ప్రభుత్వ గుర్తింపు వచ్చిందని, టీఎన్జీవోస్తో కలిసి పనిచేసే వారిని కొనసాగిస్తే కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. నేతలు ఎం.చక్రధర్, ఎం.దేవరాజు, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మణ్లు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, కామారెడ్డి కాంగ్రెస్ ఇన్చార్జి నేరెళ్ల శారదను కామారెడ్డి కల్లు గీత పారిశ్రామిక సహకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం ఆమె సిరిసిల్లారోడ్లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సంఘ సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. నేతలు బండారి రాజాగౌడ్, నాడేం శ్రీధర్ గౌడ్, అమరసింహ గౌడ్, ప్రదీప్ గౌడ్, రామచంద్రం గౌడ్, హరికిషన్ గౌడ్, వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తాం
నిజాంసాగర్(జుక్కల్): వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన జుక్కల్ నియోజకవర్గంతో పాటు బిచ్కుంద మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కృషి, ఎమ్మెల్యే చొరవతో జుక్కల్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామన్నారు. ఆదివారం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల కార్నర్ సభలో మంత్రి మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఉన్నత విద్యావంతుడని, నియోజకవర్గం అభివృద్ధికి పట్టుదలతో గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడన్నారు. 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేటీఆర్కు అహంకారం పోలేదు: ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు విమర్శించారు. ఆదివారం మంత్రి అజారుద్దీన్తో కలిసి బిచ్కుందలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్నర్ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్ల నుంచి 171 ఓట్లతో గెలిచిన సంగతి మర్చిపోయాడన్నారు. అలాంటి వ్యక్తి బిచ్కుందకు వచ్చిన తన మెజార్టీ గురించి మాట్లడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్, నాయకులు సాయిపటేల్ తదితరులు ఉన్నారు. కార్నర్ సభలో మంత్రి అజారుద్దీన్ -
ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘రేవంత్ బీజేపీ మనిషే.. బడేభాయ్ తమ్ముడే.. ఏనాడూ కాంగ్రెస్ మనిషి కాలేడు.. ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకుండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు, సిరిసిల్లలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చి సీటు, గౌరవం లేకుండా చేసి మగవాళ్ల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తుండని విమర్శించారు. స్టూవర్టుపురం దొంగలుకాంగ్రెసోళ్లు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లేయించుకున్నారని, ఎక్కువ అడిగితే మెడలో ఉన్న పుస్తెలు లాక్కెళ్లే దండుపాళ్యం, స్టూవర్టుపురం దొంగల ముఠాలుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా అవకాశమిచ్చి బాన్సువాడ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్ను, కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన ప్రజలను దగా చేసి రేవంత్రెడ్డి కింద చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డికి రోషముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ మారిన పోచారంపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తే, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పాడని, మరి బీఆర్ఎస్లో ఉంటే ఈ వేదిక మీద తన పక్కన ఎందుకు లేడని ప్రశ్నించారు. కులం.. మతం బువ్వ పెట్టవు‘బీడీ కార్మికులు తంబాకు వాసనతో ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబ పోషణకు మగవాళ్లకు తోడుగా కొంతైనా సంపాదించాలని శ్రమిస్తారు. చిన్నప్పుడు దుబ్బాకలో ఓ శాలోళ్ల ఇంట్లో ఉండి చదువుకున్న కేసీఆర్కు బీడీకార్మికుల బాధలన్నీ తెలిసే రూ.2 వేలు ఆసరా పెన్షన్ను కల్పించాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం బువ్వ పెట్టవని, మంచి గుణం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే.. మంచి జరుగుతుందన్నారు. మా కులపోడు.. మా మతపోడు అని ఎన్నికల్లో ఓట్లు వేయొద్దన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ల బతుకుల్లో మార్పు రావాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లు బతుకమ్మ చీరలను బంద్ చేసి నేతన్నల బతుకులను ఆగం చేశారన్నారు. ‘నా మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారట.. మనకు జిల్లాలు వద్దా.. పాలన ప్రజలకు చేరువ కావద్దా..’ అని అడిగారు. తొండి సంజయ్ ఏం చేశారు?కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్కి తొండి సంజయ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి.. సిరిసిల్లకు ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. మనకు మంచి చేసే వాళ్లకే ఓట్లు వేయాలని, మోసం చేసే వాళ్లకు కాదన్నారు. పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా.. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్షిందే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.బాన్సువాడలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న కేటీఆర్ -
కాంగ్రెస్ పాలనలో స్వర్ణయుగం
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన కొనసాగుతోందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. శనివారం ఆ యన కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. రైతు భ రోసా కింద ఎకరాకు రూ. 6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కా మారెడ్డిలో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ను గె లిపించాలని ప్రజలను కోరారు. వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంతానికి చేసిందేమీ లేద ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గతంలో ఏమీ చేయని వ్యక్తి, భవిష్యత్లో చేస్తాడనే నమ్మకం ప్రజలకు లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానని చెప్పుకోవడం తప్ప, కామారెడ్డికి ఆయన సాధించిన ఘనత శూన్యమని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో ప్రచారం.. నిజాంసాగర్: మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. బిచ్కుంద, ఎల్లారెడ్డిలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం రైతు భరోసా కింద ఎకరానికి రూ. 6 వేలు ఇస్తున్నాం ఎన్నికల ప్రచారంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ -
దోపిడీని అడ్డుకుంటేనే అభివృద్ధి
● బీజేపీకి అవకాశమిస్తే ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తా ● ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీలో దోపిడీని అడ్డుకుంటేనే ఉన్న నిధులతో సక్రమంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే వెంకటరమణారె డ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలలో లక్షల రూ పాయలు ఖర్చు చేస్తూ, చైర్పర్సన్ పీఠం కోసం కో ట్లాది రూపాయలు ముట్టజెప్పి అధికారంలోకి వచ్చే వారు.. ఆ తర్వాత ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఘటనలే జరిగాయని, ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే వా ర్డులన్నింటినీ అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే కామారె డ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానని హామీ ఇ చ్చారు. ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేని అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాకే నియోజకవర్గంలో కబ్జాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు తగ్గా యని ఆయన గుర్తుచేశారు. గతంలో ఏ పార్టీ పాలించినా అందరూ కలిసికట్టుగా దోచుకున్నారని విమర్శించారు. మున్సిపల్ ఆదాయ మార్గాలను పెంచుకుని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేసి చూపిస్తా నని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కా కుండా కేవలం అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమాలలో బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
కారులో హుషారు!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తెచ్చింది. మూడు మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రచార సభలకు ప్రజలు భారీగా తరలిరావడంతో గులాబీ దండులో నూతనోత్సాహం కనిపిస్తోంది.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/బాన్సువాడ/నిజాంసాగర్/ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడా రు. రేవంత్రెడ్డి బూతులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అప్పట్లో ఇదే గడ్డమీద రేవంత్రెడ్డి పోచారం శ్రీనివాస్రెడ్డిని, ఆయన కొడుకులను దున్నపోతులు, ఆంబోతులు అని సంబోధించిన ఆడియోను వినిపించారు. పోచారం పార్టీ మారడంతో దొంగ చాటుగా ప్రచారం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్రెడ్డి విసిరిన ఎంగిలి మెతుకులకు ఆశపడి విలువను దిగజార్చుకున్నాడంటూ పోచారం గురించి పరుషంగా మాట్లాడారు. ఆయనకు రోషం, దమ్ము ఉంటే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి తన సత్తా చాటాలని సవాల్ చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను, బాన్సువాడ ప్రజలను మోసం చేసిన పోచారం శ్రీనివాస్రెడ్డికి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎల్లారెడ్డి సభలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వైఫల్యాలను ఎత్తిచూపారు. ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాసిచ్చిన బాండ్ పేపర్ ఏమయ్యిందని కేటీఆర్ ప్రశ్నించారు. వరదలొస్తే ప్రపంచబ్యాంకు సాయం అడిగి మన దేశం ఇజ్జత్ తీసిన గొప్పోడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబంపైకి ట్రాక్టర్ను తీసుకువెళ్లి ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినా పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మదన్మోహన్రావు బిందెలు పంచి, బిందె కింద కమ్మేసిండని ఇప్పటికైనా వారి మోసపూరిత హామీలను అర్థం చేసుకుని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్లో రైతుబంధు పడేదని, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా పెట్టుబడి సాయం రాలేదన్న విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఏమయ్యాయని, మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని పేర్కొన్నారు. బిచ్కుంద సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులకు నిధులు మంజూరు చేశామని, పనులు ఎందుకు పూర్తి చేయడంలేదో ఎమ్మెల్యేను ప్రశ్నించాలని కోరారు. రూ.5 వందల కోట్లతో నాగమడుగు పనులు చేపడితే, ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకువెళ్లడంలేదో అడగాలన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్కు, లేకపోతే కారుకు ఓటేయాలని ప్రజలను కోరారు.ర్యాలీలు, సభలు.. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన కేటీఆర్ ముందుగా బాన్సువాడకు చేరుకున్నారు. పట్టణ శివార్లలోని కొయ్య గుట్ట అమరవీరుల స్తూపం వద్ద నుంచి ర్యాలీ గా పట్టణంలోకి వచ్చారు. అంబేడ్కర్ చౌరస్తా వద్ద సభలో మాట్లాడారు. అనంతరం బిచ్కుందలో రోడ్షో నిర్వహించారు. ఎన్నికల ప్రచార సభలో భారీగా జనం పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోనూ భారీ ర్యాలీ తీశారు. గాంధీ చౌక్ వద్ద ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, నాయకులు జుబేర్, తానాజీరావ్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవడం పక్కా అని, జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధే గెలుపును ఎవరూ ఆపలేరని కేటీఆర్ పేర్కొన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మూడు మున్సిపాలిటీల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం చెప్పాలని పిలుపు భారీగా తరలివచ్చిన ప్రజలు.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం -
పోచారం ప్రాజెక్టునుంచి రెండోవిడత నీటివిడుదల
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు నుంచి శనివారం రెండోవిడత నీటి విడుదల చేపట్టా రు. ఆయకట్టు పరిధిలోని బీ జోన్లో యా సంగి పంటల సాగు నిమిత్తం ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకా రం 15 రోజులపాటు నీటిని విడుదల చేయ నున్నట్లు ఇరిగేషన్ వర్క్ఇన్స్పెక్టర్ యాదగి రి తెలిపారు. తర్వాత 10 రోజులపాటు నీటివిడుదల నిలిపివేస్తామని పేర్కొన్నారు. రేపటి నుంచి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు కామారెడ్డి అర్బన్ : సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఈనెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటన లో తెలిపారు. అథ్లెటిక్స్తో పాటు ఖోఖో, వా లీబాల్, యోగా, ఫుట్బాల్ అంశాల్లో పోటీ లుంటాయని పేర్కొన్నారు. ఆయా పోటీల ను జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడి యం, లయోల హైస్కూల్, భవానీరోడ్డులో ని ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ సెంటర్, కా మారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని జిల్లా యో గాభవన్, రామారెడ్డి మండలం ఉప్పల్వా యి రెసిడెన్షియల్ స్కూల్, రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానం, భిక్కనూరు జి ల్లాపరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మందాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్, దోమకొండ గడీకోటలలో నిర్వహించనున్నామన్నారు. నేటి నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు కామారెడ్డి క్రైం: జిల్లా రైతుల కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఆధార్, మొబైల్ నంబర్, జిల్లా, మండలం, పంట సాగు విస్తీర్ణం వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అనంతరం సమీప డీలర్ వద్ద ఎరువుల లభ్యతను పరిశీలించి యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోగా ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, లేదంటే బుకింగ్ రద్దవుతుందని పేర్కొన్నారు. పట్టాదారులతో పాటు కౌలుదారులు సైతం ఈ యాప్ను ఉపయోగించవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ‘ప్రజావాణి కొనసాగుతుంది’ కామారెడ్డి క్రైం : మున్సిపల్ ఎన్నికలు జరు గుతున్నా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరి గే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం కూడా కొనసాగిస్తామని అదనపు కలెక్టర్ విక్ట ర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు మున్సిపల్ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టరేట్లోని 25వ నంబర్ రూంలో అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ‘రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులుగా చేరాలి’ కామారెడ్డి అర్బన్: రైతులు రూ. 2 వేలు వాటాగా చెల్లించి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్పీవో) ఏర్పాటు చేసుకుని బహుళ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో ఎఫ్పీవోల ఏర్పాటు, పనితీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో రామ్మోహన్ మాట్లాడుతూ ఎఫ్పీవో సభ్యత్వం తీసుకునే ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం తనవాటాగా రూ.2 వేలు చెల్లిస్తుందన్నారు. ఎఫ్పీవోల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట ప్రాసెసింగ్, మార్కెటింగ్, పరికరాలు, గిట్టుబాటు ధర, బ్రాడింగ్ కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి షేక్చాంద్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్, చిన్నమల్లారెడ్డి ఉపసర్పంచ్ స్వప్న, సొసైటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఇస్రోజీవాడి నుంచి దండకారణ్యం దాకా..
● దళ సభ్యుడి నుంచి వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీ వరకు.. ● లోకోటి చందర్ ప్రస్థానం ● మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా విప్లవోద్యమంలో లోకోటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ ది ప్రత్యేక స్థానం. 1990 ప్రాంతంలో పీపుల్స్వార్లో నక్సలైట్ ఉద్యమంలో చేరిన ఆయన కొంత కాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారి, స్వామి పేరుతో చురుకుగా పనిచేశారు. 1993 సెప్టెంబర్లో నిజామాబాద్ జిల్లా పడ్కల్లో ఓ ఇంట్లో స్వామి దళం ఉందన్న సమాచారంతో పోలీసు బలగాలు ఊరిని చుట్టుముట్టాయి. ఇంట్లో దాక్కున్న దళ సభ్యులంతా చనిపోయినా, స్వామి పోలీసులతో పోరాడి గేదెల మంద రావడంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. దాదాపు 36 గంటల పాటు జరిగిన కాల్పుల సంఘటనలో స్వామి తప్పించుకున్న తీరును గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎలా తప్పించుకున్నాడన్న దానిపై కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో స్వామి చనిపోవడంతో అప్పట్లో నక్సల్స్ ప్రభావిత గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. భార్య కడసారి చూపునకూ నోచుకోక.. మావోయిస్టు పార్టీలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేసిన స్వామి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ప్లాటూన్ కమాండర్గానూ పనిచేశారు. ఆయన గెరిల్లా ఆర్మీ శిక్షణలు ఇచ్చారని తెలుస్తోంది. దండకారణ్యానికి వెళ్లిన త ర్వాత ప్లాటూన్ కమాండర్గా పనిచేసి పీఎల్జీఏ ను విస్తరించడంలో కీలక భూమిక పోషించారని చెబుతారు. చత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోనే ఎక్కువ కాలం పనిచేశారని తెలుస్తోంది. కాగా స్వామి కుటుంబమంతా విప్లవోద్య మంలో పాల్గొంది. ఆయన భార్య సులోచన అనారోగ్యంతో చనిపోయిన సమయంలో ఆయన దూ రంగా ఉండడంతో అంత్యక్రియలకు కూడా హాజ రు కాలేకపోయారని సమాచారం. మూడున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో కొనసాగిన స్వామి అలియాస్ చందర్.. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జ రిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయన మృతదేహాన్ని తీసుకురావడం కోసం స్వామి కుమా రుడితో పాటు బంధువులు అంబులెన్స్ను తీసుకుని శనివారం వెళ్లారు. ఆదివారం ఉదయం వరకు మృతదేహాన్ని తీసుకుని వచ్చే అవకాశాలున్నాయి.అంచెలంచెలుగా ఎదిగి.. వ్యవసాయమే స్వామి కుటుంబం జీవనాధారం. 1990లలో పీపుల్స్వార్ నక్సల్స్ గ్రామానికి రావడంతో స్వామి ఉద్యమానికి ఆకర్శితుడయ్యారు. కొంతకాలం వారికి సహకరించి, పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. దళ సభ్యుడిగా చురుకుగా పనిచేసిన స్వామి.. కొద్ది కాలానికే డిప్యూటీ కమాండర్గా, తర్వాత కమాండర్గా ఎదిగారు. సిర్నాపల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, సిరిసిల్ల దళాలకు నాయకత్వం వహించారు. స్వామి పేరుతోనే జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్లపై దాడుల నుంచి పలు సంఘటనల్లో ఆయన పాల్గొన్నాడని అప్పట్లో ఆయనతో పనిచేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోయినవారు చెబుతారు. పోలీసు నిర్బంధం పెరిగి ఎన్కౌంటర్లలో పలువురు నక్సల్ నేతలు చనిపోవడంతో ఉమ్మడి జిల్లాలో స్వామి ఒక్కరే మిగిలారు. దీంతో మావోయిస్టు పార్టీ ఆయనను దండకారణ్యానికి పంపించింది. అబూజ్మడ్, గడ్చిరోలీ తదితర ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. -
క్రైం కార్నర్
● కార్యదర్శి వేధింపులే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు బోధన్టౌన్(బోధన్): గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ నీరడి బాబు(38) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోధన్ మండలం పెంటాఖుర్దు గ్రామంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరడి బాబు పెంటాఖుర్దు గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5న ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా గమనించిన కుటుంబసభ్యులు బోధన్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బాబు భార్య నీరడి కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేసినప్పటికీ లెక్కల్లో తేడాలున్నాయని అందరిముందు అవమానించాడని, దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మద్యానికి బానిసై ఒకరు ..బాన్సువాడ: పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. సంగమేశ్వర కాలనీకి చెందిన టాక్ సందీప్(24) మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వాడు. రోజూ మద్యం తాగి ఇంట్లో అనవసరంగా గొడవ పడేవాడు. శుక్రవారం ఇంట్లో ఊరేసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు సముదాయించారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ మరొకరు.. బీబీపేట: అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఒకరు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర గోపాల్ (35) అప్పులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తితో ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారకస్థితిలో ఉన్న గోపాల్ను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ తనిఖీ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ సెంటర్ను శనివారం ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చినాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే వారు ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా వినియోగించుకోవాలని అన్నా రు. ఎన్నికల సిబ్బంది తదితరులున్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఎఫ్ఎస్టీ టీం అధికారులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు 50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లరాదని అన్నారు. అంతకు మించి నగదు ఉంటే దానికి సంబంధించిన పత్రాలు చూపాల్సి ఉంటుందన్నారు. తాడ్వాయి మండలంలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్లో చలాన్లను చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ నరేష్, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీని అదర్శవంతంగా తీర్చిదిద్దానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీచౌక్లో శనివారం ఆయన, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి ప్రజలతో మాట్లాడారు. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని, ఇంకా ఎవరైన పేదలుంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజురు చేస్తామని అన్నారు. గాంధీ చౌక్ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.650 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నార్ల వసంత, నాయకులు వాహాబ్, నందకిషోర్, నార్ల రవీందర్, నాగులగామ వెంకన్న, ఖమురు, గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ.. నేటి సాంకేతిక ప్రపంచంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఈనేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సుపరిచితం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టాస్క్ మేనేజర్ రఘుతేజ, ట్రైనర్ హనుమంతు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
హోటళ్లలో గృహవినియోగ సిలిండర్లు వాడొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): హోటళ్లు, దాబాల్లో గృహాలకు వినియోగించే సిలిండర్లు వాడడం విరుద్దమని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు అన్నారు. మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దాబాలపై శనివారం వారు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా 18 గృహ వినియోగం సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్వో స్వామి మాట్లాడుతూ.. హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఉపయోగించే సిలిండర్లు మాత్రమే వాడాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న 18 సిలిండర్లను సదరు గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డీటీలుసురేష్, షరీఫ్, సిబ్బంది ఉన్నారు. జిల్లాకేంద్రంలో 30 సిలిండర్లు.. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఏఎస్వో రవీందర్ రాథోడ్ ఆధ్వ ర్యంలో సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా గృహ అవసరాల కు వినియోగించాల్సిన సిలిండర్లను నిబంధనలకు విరుద్దంగా వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి 30 సిలిండర్లను స్వాధీనం చేసుకుని 19 మంది వ్యాపారులపై కేసులు నమో దు చేసినట్లు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తెలిపారు. సిలిండర్లను కామారెడ్డిలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. డీటీ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం కప్ పోటీల్లో ప్రతిభ
బాన్సువాడ రూరల్: సీఎంకప్ బాన్సువాడ నియోజకవర్గ పోటీల్లో బాన్సువాడ జోన్ క్రీడాకారులు సత్తాచాటీ చాంపియన్షిప్ సాధించినట్లు పీడీ తారాచంద్, సురేందర్లు శనివారం తెలిపారు. వాలీబాల్ బాలుర, బాలికల విభాగాల్లో నస్రుల్లాబాద్ ప్రథమస్థానం సాధించిందని, ఖోఖోలో బాలుర, బాలికల విభాగాల్లో బీర్కూర్ మండలం ద్వితీయ స్థానం సాధించిందన్నారు. కబడ్డీలో కొత్తాబాది(బాన్సువాడ మండలం) బాలికలు, బాలుర విభాగాల్లో మొదటి స్థానాలు సాధించారన్నారు. నియోజకవర్గ స్థాయిలో 9మండలాల క్రీడాకారులు పాల్గొనగా బాన్సువాడ జోన్ క్రీడాకారులు విజేతలుగా నిలిచారన్నారు. పాల్గొన్న క్రీడాకారులు, పీఈటీలకు వారు అభినందనలు తెలిపారు. -
కేటీఆర్కు ప్రజల బ్రహ్మరథం
● బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో కార్నర్ మీటింగ్లకు భారీగా హాజరైన జనం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులుఎల్లారెడ్డిలో కార్నర్ మీటింగ్కు హాజరైన ప్రజలు నిజాంసాగర్(జుక్కల్)/ఎల్లారెడ్డి/బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ కార్నర్ మీటింగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయా పట్టణాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా బిచ్కుందలో కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకుల ఉత్సాహం చూసి, ఎన్నికల ప్రచారంలాగా లేదని ఎన్నికల విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. జుక్కల్కు శాశ్వత ఎమ్మెల్యే ఎవరంటే హన్మంత్ సింధేనని అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో 12 స్థానాలను గెలిపిస్తే, కౌన్సిల్లో తీర్మానం చేయించి గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామన్నారు. అలాగే ఎల్లారెడ్డిలో కేటీఆర్కు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి గాంధీచౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్టాండ్ నిర్మాణానికి రూ.5కోట్లు, 300 డబుల్ బెడ్ రూంలకు 18 కోట్ల రూపాయలు, 30 పడకల ఆస్పత్రి నుంచి వంద పడకల ఆస్పత్రికి రూ.10 కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు, రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోటి రూపాయలతో వైకుంఠ ధామం, , మినీ ట్యాంక్ బండ్, డయాలసిస్ సెంటర్ తదితర వాటికి నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దీనికి సంబందించిన జీవోలను సైతం ప్రజలకు చూయించడం జరిగిందన్నారు. పనులు పూర్తయ్యేలోగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఎమ్మెల్యే వాటిని ప్రారంభోత్సవాలు చేసి ఆర్భాటాలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా తేలేదని అన్నారు. అంతకుముందు బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద గజమాలతో కేటీఆర్ను ఘనంగా సత్కరించారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గంకు ఇవ్వని నిధులు బాన్సువాడకు మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ అంటూ, బాన్సువాడలో మాత్రం కాంగ్రెస్ అంటు ప్రచారం చేస్తున్న పోచారం శ్రీనివాస్రెడ్డి కండువ కప్పుకునే ప్రచారం చేయాలని అన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తానాజీరావు, బీఆర్ఎస్ నాయకులు నాల్చర్ రాజు, గిర్ధావర్ గంగారెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, మోచీ గణేష్, రమేష్యాదవ్, బాడి శ్రీనివాస్, అక్బర్, శివ, ఖలీల్, ధర్మతేజ ఉన్నారు. -
కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
కామారెడ్డి క్రైం: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ, ఒకటవ వార్డు పరిధిలోని ఇల్చిపూర్, అడ్లూర్, రెండవ వార్డు పరిధిలోని రామేశ్వర్పల్లి గ్రామాల్లో పార్టీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కాంగ్రెస్పార్టీ కల్యాణలక్ష్మి, రైతుబంధు తదితర పథకాలతోపాటు హామీలు ఇచ్చి చేస్తున్న మోసాలపై ప్రజలకు బాకీ కార్డులు పంచుతూ వివరించారు. కామారెడ్డి బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్ పట్టణంలోని 38వ వార్డు పరిధిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్ధించారు. -
పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా సాగాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ అన్నారు. మండలంలోని శెట్పల్లి గ్రామ పంచాయతీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో రాబోయో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఇటీవల సీఎం కప్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కోతుల బెడదను నివారించడానికి చేపడుతున్న పనులను పరిశీలించి సర్పంచ్ను అభినందించారు. సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, ఉపసర్పంచ్ బాలయ్య, అశోక్, అంజాగౌడ్, పద్మ, లింగాగౌడ్, రుక్మవ్వ, అంజనేయులు, రాజమణి, తదితరులు ఉన్నారు. -
పర్యావరణ సంరక్షణలో భాగస్వాములు కావాలి
బాన్సువాడ రూరల్: పర్యావరణ సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డివిజన్స్థాయి వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన ఆకర్షణీయ నమూనాలను ప్రదర్శించి ప్రతిభ చాటారు. షేక్ సలాం ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి మాట్లాడుతూ.. వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడంతోపాటు వ్యర్థాలను సంపదగా మార్చే అలోచన పెరిగిందన్నారు.పోటీలలో కేజీబీవీ గాంధారి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, పీఎంశ్రీ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల బాన్సువాడ ద్వితీయ స్థానం సాధించింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించి అభినందించారు. ఎంఈవో నాగేశ్వరరావు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కుషాల్, వెంకటరమణ, భునేకర్ సంతోష్, నర్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం పన్ను వసూళ్లకు ప్రణాళిక
● జిల్లా పంచాయతీ అధికారి మురళి ● భిక్కనూరు జీపీ తనిఖీ భిక్కనూరు: జిల్లావ్యాప్తంగా వందశాతం ఇంటి పన్నుల వసూళ్లకు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. భిక్కనూరు గ్రామపంచాయతీని శనివారం ఆయన సందర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పన్నులను వందశాతం వసూలు చేయడం వల్ల గ్రామాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయన్నారు. రానున్న వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలను అందజేశామన్నారు.15వ ఆర్థికసంఘం నిధులు త్వరలో గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ కానున్నందున వెంటనే చెల్లింపులు జరపాలని జిల్లాలోని ఎంపీవోలకు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఈవో మహేష్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పెద్దమ్మ ఆలయంలో చోరీ
బీబీపేట: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం ఉదయం చోరీ జరిగినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. ఉదయం ఇద్దరు గుర్తు తెలియని మహిళలు తలపై కొంగు కప్పుకొని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మెడలో నుండి అర్ధతులం పుస్తెలు అపహరించారు. అనంతరం హుండీ తీయడానికి ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముదిరాజ్ సంఘం సభ్యుల సమాచారం మేరకు ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంను రప్పించారు. బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్ పల్లితండాకు చెందిన శ్రావణ్ అదృశ్యమైనట్లు బాన్సువాడ ఎస్హెచ్వో తుల శ్రీధర్ తెలిపారు. ఈ నెల 5న కుటుంబంలో గొడవల కారణంగా బయటికి వెళ్లిన శ్రావణ్ తిరిగి రాలేదన్నారు. శ్రావణ్ కుమారుడు దేవరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రావణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తెలుపు రంగు ధోవతి, షర్టు ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పేర్కొన్నారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామ శివారు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని ఆర్ఐ సాయిబాబా శనివారం పట్టుకున్నారు. పోతంగల్ మంజీర నది నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని విచారించామన్నారు. డ్రైవర్ వద్ద అనుమతిపత్రాలు లేకపోవడంతో వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించామని తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బొల్లారం గ్రామసమీపంలో చిత్తు–బొత్తు ఆడుతున్న ఏడుగురిని శనివారం పట్టుకున్నట్లు స్థానిక ఎస్సై భార్గ వ్గౌడ్ తెలిపారు. బొల్లారం శివారులో చిత్తు– బొత్తు ఆడుతున్నారని తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.14,250 నగదుతోపాటు ఏడు మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. -
ఎల్లారెడ్డిపై ఎగిరేది కాంగ్రెస్ జెండా
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పలు వార్డులలో శనివారం ఆయన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మున్సిపాలిటిలో రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి వాటిని పూర్తి చేస్తోందన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, తిరుపతి న్నారు. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించాం నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలో ప్రతీ గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దక్కిందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలో శనివారం ఎన్నికల ప్రచార సభలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జీ నీలం మధు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ కాంగ్రెస్ నాయకులు సాయిపటేల్, విఠల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
జక్రాన్పల్లి: మునిపల్లి గ్రామ శివారులో టాటా సుమో, బైక్ను ఢీకొనడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ (41) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబా ద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ తొర్లికొండలోని బంధువుల ఇంటికి శుక్రవారం పండుగ నిమిత్తం వచ్చి బైక్పై తిరిగి వెళ్తున్నాడు. మునిపల్లి శివారులోని జాతీయ రహదారిపై టాటా సుమో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో శ్రీనివాస్ గౌడ్కు తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం శ్రీనివాస్గౌడ్ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మంత్రి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, ప్రచారంలో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. శుక్రవారం 3వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 12 వార్డులు బీఆర్ఎస్ గెలువబోతోందని జోస్యం చెప్పారు. నాల్చర్ శిరీష కుటుంబ పెద్దలు 50 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నారని, వారి వారసురాలిగా నాల్చర్ శిరీష బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులను ఓటర్లు నమ్మవద్దని, నెరవేర్చని హామీలు ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారని అన్నారు. మేనిఫెస్టో భగవద్గీతతో సమానం: శిరీష 3వ వార్డు కోసం తయారు చేసిన ప్రత్యేక మేనిఫెస్టో భగవద్గీతతో సమానమని, వంద శాతం అమలు చేసి తీరుతామని బీఆర్ఎస్ అభ్యర్ధి నాల్చర్ శిరీష అన్నారు. వార్డులో ప్రచారం చేస్తూ కార్డు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. ● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం 11వ వార్డులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్ధి భాగ్యలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని, పాలక వర్గం కొలువుదీరిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి రూ.60 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని నమ్మవద్దని కోరారు. చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. -
‘పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు’
కామారెడ్డి క్రైం: జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల సామగ్రి సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి భోజన వసతితో సహా అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
అప్పుడు మెట్టినిల్లు.. ఇప్పుడు పుట్టినిల్లు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరేళ్ల నాడు అత్తగారి ఊరు నుంచి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించిన ఆమె.. ఈసారి తల్లిగారి ఊరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన ఉర్దొండ వనిత 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2024 లో అప్పటి చైర్మన్ జాహ్నవిపై అవిశ్వాసం పెట్టడంతో ఆమె పదవి కోల్పోయింది. ఆ సమయంలో చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన వనిత.. వైస్ చైర్మన్ పదవితో సరిపెట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు ఆమె వైస్ చైర్మన్గా కొనసాగారు. ఈసారి కాంగ్రె్స్ పార్టీ అభ్యర్థిగా తన తల్లిగారు ఊరు లింగాపూర్ గ్రామ పరిధిలోని 9 వ వార్డు నుంచి బరిలో దిగారు. ఈసారి గెలిస్తే చైర్మన్ పదవి రేసులో నిలిచే అవకాశాలున్నాయి. కాగా వనిత తండ్రి కొమిరెడ్డి నారాయణ అప్పట్లో లింగాపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అలాగే ఆమె మామ (భర్త తండ్రి) ఉర్దొండ రాజయ్య దేవునిపల్లి గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేశారు. -
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి
ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పద్మ శ్రీకాంత్, తదితరులున్నారు. చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డి: మండలంలోని పలు గ్రామాల డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్మోహన్రావు శుక్రవారం చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూంలు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అండగా నిలుస్తున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరుగుతోందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాండూర్లోని త్రిలింగరామేశ్వరాలయం క్యాలెండర్ను శుక్రవారం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మదత్తు, తాండూర్ సర్పంచ్ భూమా యాదగౌడ్, ఉపసర్పంచ్ అభిషేక్, ఇతర గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. -
‘ఆడబిడ్డ పెళ్లికి రూ. 11 వేల కానుకిస్తా’
ఎల్లారెడ్డి: ఎన్నికలలో గెలుపుకోసం అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డునుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సిద్ధి శ్రీధర్ వినూత్న హామీలిస్తున్నారు. వార్డు పరిధిలోని ఆడబిడ్డల వివాహం సందర్భంగా రూ. 11 వేల కానుకిస్తానని, ఆడపిల్ల జన్మిస్తే రూ. 10 వేలు ఇస్తానని చెబుతున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం రూ. 10 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆరు నెలలకోసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులను అందిస్తాననీ మాటిస్తున్నారు. -
బల్దియాను కలిసికట్టుగా దోచుకున్నారు
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో గత పాలకులు ఎవరు అధికారంలో ఉన్నా.. అందరూ కలిసికట్టుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన వివిధ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లుగా ఎక్కడికీ పారిపోలేదని, తన కుటుంబంతో సహా కామారెడ్డిలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉన్నానని షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. బల్దియాలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. తాను గెలిచిన తర్వాత మున్సిపాలిటీకి ఉన్న రూ.70 కోట్ల అప్పును తీర్చి, ఆదాయ మార్గాలను పెంచి గట్టెక్కించానని, ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, బీజేపీ అభ్యర్థి చైర్పర్సన్ అయ్యేలా ప్రతి ఓటరు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. -
విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఓటర్లకు పంపిణీ చేశారు. నాయ కులు ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన విప్లవ శిఖరం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. కొద్దికాలానికే పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. పార్టీలో స్వామి పేరుతో పనిచేశాడు. ఉద్యమంలో చేరిననాటినుంచి వెనుదిరిగి చూడలేదు. కుటుంబమంతా ఉద్యమ బాటలో.. స్వామి కామారెడ్డి ఏరియాతో పాటు సిర్నాపల్లి, ఎల్లారెడ్డి ఏరియాల్లో దళ కమాండర్గా పనిచేశాడు. జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో చాలా కాలం పనిచేసిన స్వామి కార్యదర్శిగా ఎదిగారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించడంతో లొంగుబాట్లు, అరెస్టులతో పాటు ఎన్కౌంటర్లు జరిగాయి. ఎంతో మంది సానుభూతిపరులు, నక్సలైట్లు చనిపోయారు. దీంతో అప్పటి పీపుల్స్వార్ నేతలు స్వామిని దండకారణ్యానికి పంపించారు. కొద్ది కాలానికే స్వామి భార్య సులోచన కూడా అడవి బాట పట్టింది. నవత పేరుతో దండకారణ్యంలో పనిచేసింది. వారి పిల్లలు రమేశ్, లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. అయితే 2005 లో లావణ్య, రమేశ్లు కూడా అడవిబాట పట్టారు. ఎనిమిదేళ్ల క్రితం స్వామి భార్య సులోచన అనారోగ్యంతో అక్కడే చనిపోగా విప్లవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి కూతురు లావణ్య ఆరు నెలల క్రితం చత్తీస్గఢ్లో అరైస్టె జైలులో ఉండగా.. కుమారుడు రమేశ్ డిసెంబర్ 2న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్వామి ప్రస్తుతం ప్రభాకర్ పేరుతో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా అలాగే వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.ప్రభాకర్ పేరుతో పనిచేస్తున్న స్వామి అలియాస్ లోకేటి చందర్ ఎన్కౌంటర్లో చనిపోయిన వార్త శుక్రవారం రాత్రి ప్రసార ధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారమైంది. ఉమ్మడి జిల్లా విప్లవోద్యమం గురించి అవగాహన ఉన్నవారు చాలా మంది ఆయన గురించి చర్చించుకోసాగారు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఆపరేషన్ కగార్తో ఏర్పడిన తీవ్ర నిర్బంధంతో లొంగిపోతాడని అందరూ భావించారు. ఆయన వెనకడుగు వేయకుండా చివరి వరకు విప్లవోద్యమానికి అంకితమయ్యాడని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఉమ్మడి జిల్లా విప్లవోద్యమ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన విప్లవ శిఖరం నేలకొరిగింది. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండి పీడిత ప్రజల కోసం నడిచిన స్వామి అలియాస్ లోకేటి చందర్ శకం శుక్రవారంతో ముగిసింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో స్వామి మరణించాడు. మూడున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో స్వామి విప్లవోద్యమంలోనే కన్నుమూసిన భార్య ఇటీవల లొంగిపోయిన కుమారుడు.. ఆరునెలలుగా జైలులోనే కూతురు -
రాజకీయ నేతలు మూకుమ్మడిగా దోచుకున్నారు
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రూ.వేల కోట్ల నిధులను రాజకీయ నాయకులు మూకుమ్మడిగా దోచుకున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం వద్ద పందులు, గాడిదల లెక్కలు ఉన్నాయి కానీ, మనుషుల లెక్కలు లేవని బీసీ గణనను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే కామారెడ్డి చౌరస్తాలో ఉరేసుకుంటానని, చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ప్రత్యర్థులు ఎంత ఇచ్చినా తీసుకుని, ఓటు మాత్రం కత్తెర గుర్తుకే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేతలు హరిశంకర్ గౌడ్, తాహెర్ మహ్మద్, అభ్యర్థులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలు ర పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మాధవ రావు తెలిపారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఎం.ప్రణీత్, ఎం.రాహుల్ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కోలకొండ మల్లవ్వకు చెందిన గొర్రెల షెడ్డును శుక్రవారం ఏపీఎం ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లవ్వ గొర్రె పొటేళ్ల పెంపకం కోసం రూ. 2 లక్షల రుణాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీపీఎం సురేశ్ కుమార్, సర్పంచ్ వంకాయల శిరీష, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ సమాఖ్య అధ్యక్షులు భూదేవి, సీసీలు ఆంజనేయులు, వీవోఏలు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: నాసా ఒలంపియాడ్ పరీక్షలలో సరస్వతి శిశుమందిర్ హైస్కూల్(కామారెడ్డి) విద్యార్థులు ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. నిశాంత్, రితేష్, రామ్ నిహల్, రిత్విక్ రెడ్డి విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అభినందించింది. నాసా ఒలంపియాడ్ రీసోర్స్ పర్సన్ డాక్టర్ సంజయ్, పాఠశాల అకాడమీ ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి జీపీ పాలకవర్గాన్ని ఉపసర్పంచ్ చైతన్యతో పాటు ఉపాధి ఫీల్డు అసిస్టెంట్ కొండల్రెడ్డి అవమానించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సాయగౌడ్తో పాటు పలువురు వార్డు సభ్యులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్కు ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఉప సర్పంచ్, ఫీల్డు అసిస్టెంట్లు చేశారని ఈ విషయాన్ని సర్పంచ్కు వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భిక్కనూరు: కంచర్లలోని అంగన్వాడీ కేంద్రాలను సీడీపీవో శోభారాణి శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ఆమె వెంట సర్పంచ్ అరుణ, సూపర్వైజర్ మంగ ఉన్నారు. -
క్రైం కార్నర్
కుమ్మన్పల్లిలో ఒకరి ఆత్మహత్య బోధన్రూరల్: సాలూర మండలంలోని కుమ్మన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఊషం లక్ష్మణ్ (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే మద్యానికి బానిస కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈనెల 5న ఇంటి ముందు గల చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా శుక్రవారం మృతుడి భార్య మల్లుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండు గ్రామాల్లో చోరీలు రామారెడ్డి: రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో, పాల్వంచ మండలం సింగరాయిపల్లి గ్రామంలో దొంగలు గురువారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సింగరాయపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రెండు బైక్లు దొంగిలించారు. వాటిలో ఒక బైక్లో పెట్రోల్ అయిపోవడంతో గ్రామంలోనే వదిలివేశారు. అలాగే సింగరాయిపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి చిల్లర నాణేలను, సీసీ కెమెరాలను, హార్డ్డిస్క్లను కూడా దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు. రెడ్డిపేట గ్రామంలో ఒక బైక్ డ్రంకన్డ్రైవ్లో 33మందికి శిక్షలు కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు శుక్రవారం ఒకే రోజు డ్రంకన్డ్రైవ్ కేసుల్లో 33 మందికి శిక్షలు విధించాయి. ఇటీవల పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడ్డారు. వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా 10 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 33 మందికి రూ.35వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తాం..
సభలో పాల్గొన్న ప్రజలు (ఇన్సెట్లో) మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు. బీజేపీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే ఎలా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ వద్ద ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో నిజామాబాద్ నగరం చెత్తకుప్పలా మారిందన్నారు. 12 ఏళ్లుగా మోదీ, 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 90 శాతం ఉన్నప్పటికీ అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. నిజామాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ స్మార్ట్ సిటీ పథకం ఎందుకు తేలేదన్నారు. ఎంపీ కేవలం మోదీ జపం చేస్తున్నారన్నారు. నిజామాబాద్ గల్లీల్లో మోరీలు తీయాలంటే మోదీ అవసరమా అన్నారు. నిజామాబాద్ జిల్లాకు విమానాశ్రయం ఎందుకు సాధించలేదన్నారు. ఎందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కేంద్రం నుంచి నిజామాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు ఇస్తే మేం వద్దన్నామా అన్నారు. ఏమి నిధులు తెచ్చారని ఓట్లు అడుగుతున్నారన్నారు. మూడు సార్లు మోదీ ప్రధాని అయినప్పటికీ నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ చేయలేకపోయారన్నారు. ● నిజామాబాద్ రైతులు ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వల్లేనన్నారు. నిజామాబాద్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినదించింది ఈ గడ్డమీద నుంచేనన్నారు. సుదర్శన్రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు మంత్రులుగా పని చేశారని, చిన్న మచ్చ లేదన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారు పేరన్నారు. క్వింటా పసుపు అమ్మితే తులం బంగారం వస్తుందన్న నానుడి ఉండేదన్నారు. ఇక్కడి వ్యవసాయం తెలంగాణతో పాటు దేశానికే ఆదర్శమన్నారు. నిజామాబాద్ రైతుల పోరాటాలు దేశానికే ఆదర్శమన్నారు. ● జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నా మనసులో నిజామాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేస్తా. జిల్లాలో వివిధ విద్యాసంస్థల కోసం రూ.600 కోట్లు మంజూరు చేశాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రూ.1,045 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నిధులు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే కానీ మున్సిపల్ శాఖ మంత్రినైన నావద్దకు రావాలి. నిధులు ఇచ్చే బాధ్యత నాదే. జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాదేనన్నారు.నిజామాబాద్ నగరపాలకం, ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను గెలిపించుకోవాలని, అప్పుడే అభివృద్ధి పనులు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బంగారం లాంటి అవకాశాన్ని ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు వదులుకోవద్దన్నారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ ఓట్లు అడగాలంటే స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. ఓట్లు అడిగే హక్కు లేని బీజేపీని బొందపెట్టాలన్నారు. నిజామాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాదేనన్నారు. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్లకు ఎయిర్పోర్టులు తీసుకొచ్చామన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ చెత్తకుప్పలా మారింది ఎంపీ అర్వింద్ స్మార్ట్ సిటీ స్కీం ఎందుకు తేలేదు.. విమానాశ్రయం ఎందుకు తీసుకురాలేదు గతంలో 90 శాతం ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని అడ్డుకున్నారు.. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండడం సాధ్యం కాదు నేనే మున్సిపల్ మంత్రిని.. కాంగ్రెస్ను గెలిపిస్తే నిధులిస్తా నగరపాలకం, పురపాలకాల్లో కాంగ్రెస్ను గెలిపిద్దాం కేశాపూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి -
అభివృద్ధి అంటే పారిపోవడమా
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: మున్సిపల్ పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే అభివృద్ధి అని ప్రత్యర్థి పార్టీల నాయకులు భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండేళ్ల ఏళ్లలో కామారెడ్డికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని ఇందిరా గాంధీ చౌరస్తాలో నిలబెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
రెబల్స్ సవాల్!
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026– 8లో uప్రధాన పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తమ ఓట్లకు ఎక్కడ గండిపడుతుందేమోనని ఆయా పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజిల్లాలోని నాలుగు బల్దియాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు, వారి తరఫున ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్ భయపెడుతున్నారు. ఆయా పార్టీలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన వారిలో కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీటుగా ప్రచారం నిర్వహిస్తూ జనంలోకి చొచ్చుకుపోతూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రెబల్స్ గెలిచే అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల వీరి మూలంగా ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు బాన్సువాడలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. ప్రచారంలో జోరు.. గెలుపోటములపై ప్రభావం వివిధ పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన పలువురు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో వారి ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరిలో కొందరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా.. మరికొందరు తమకు టికెట్టు ఇవ్వని పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెబల్స్ సైతం జోరుగా ప్రచారం చేస్తుండడంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీంతో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న పలువురు తిరుగుబాటు అభ్యర్థులు పలు వార్డుల్లో సత్తా చాటే ప్రయత్నం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ముచ్చెమటలు ఎవరికి చేటు తెస్తారోనని ఆందోళన -
నాలుగు జంటలు.. ఎనిమిది వార్డులు
గెరిగంటి లక్ష్మీనారాయణ, స్వప్న(బీఆర్ఎస్), కామారెడ్డి కందూరి చంద్రశేఖర్, రేణుక(సీపీఎం), కామారెడ్డి షేక్ జుబేర్, పర్వీన్ బేగం (బీఆర్ఎస్), బాన్సువాడ చంద్రశేఖర్గౌడ్, కవిత (బీజేపీ), బాన్సువాడ ఎన్నికల బరిలో భార్యాభర్తలు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఒక్కోసారి రిజర్వేషన్లు కలిసిరాక పోటీ చేసే అవకాశాలు దూరమవుతుంటాయి. రిజర్వేషన్లు కలిసొచ్చినా టికెట్టు ఆశించే వారి సంఖ్య ఎక్కువ ఉండి అవకాశం కోల్పోతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి, అది కూడా భార్యభర్తలకు అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో నాలుగు జంటలకు ఎన్నికల బరిలో దిగే అవకాశం దక్కింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి రేణుక, 8వ వార్డునుంచి బరిలో ఉన్న అదే పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ భార్యాభర్తలు. వీరిద్దరు గతంలో కౌన్సిలర్లుగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ 46వ వార్డు నుంచి, ఆయన భార్య స్వప్న 47వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. స్వప్న గత కౌన్సిల్లోనూ సభ్యురాలు. బాన్సువాడ మున్సిపాలిటీలో మొన్నటివరకు వైస్ చైర్మన్గా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన షేక్ జుబేర్ ఈసారి 2వ వార్డునుంచి పోటీ చేస్తుండగా.. ఆయన భార్య పర్వీన్ 17వ వార్డునుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాన్సువాడలో మరో జంట బీజేపీ నుంచి పోటీ చేస్తోంది. చంద్రశేఖర్గౌడ్ 13వ వార్డు నుంచి, ఆయన భార్య కవిత 14వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. కవిత ఒక పర్యాయం ఎంపీటీసీగా పనిచేశారు. -
కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి
● మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ: మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ మున్సిపల్లో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ గృహంలో ఆయన మాట్లాడారు. బాన్సువాడ పట్టణం అభివృద్ధికి కేసీఆర్ రూ.650 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో రూ.60 నుంచి రూ.70 కోట్ల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బాన్సువాడకు రాకముందు మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా బాన్సువాడను అభివృద్ధి చేయలేదని, 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక తాడ్కోల్ శివారులో 26 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని, బాన్సువాడలో సెంట్రల్ లైటింగ్, బాన్సువాడ–నిజామాబాద్కు డబుల్ రోడ్డు, నిజాంసాగర్ ప్రధాన కాలువ సీసీ లైనింగ్, ఉప కాలువలు, చెరువుల మరమ్మతులు చేశానని అన్నారు. చందూర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి 6 ఎకరాలు కొనుగోలు చేసి ఇప్పటి వరకు పేదలకు పంచిపెట్టలేదని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని సిగ్గులేకుండా చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, అందరి లెక్కలు సరి చేస్తామని అన్నారు. 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బాడి శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం చేశారు. శనివారం బాన్సువాడకు కేటీఆర్ రానున్నట్లు తెలిపారు. గిర్ధావర్ గంగారెడ్డి, జుబేర్, నార్ల రత్నకుమార్, అంజిరెడ్డి, యలమంచలి శ్రీనివాస్రావు, ధర్మతేజ, చందర్, బాడి శ్రీనివాస్, అక్బర్ తదితరులున్నారు. -
నాలుగుసార్లు.. నాలుగు వార్డులు..
సాధారణంగా నేతలు ఒక స్థానానికి పరిమితమవుతారు. గెలిచినా ఓడినా తర్వాతి ఎన్నికల్లో అదే స్థానంనుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ ఆ నేత తీరే వేరు.. ప్రతిసారి కొత్త వార్డు నుంచి బరిలో దిగుతారు. ఆయనే కామారెడ్డికి చెందిన మాజీ కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్రావు. ఆయన మొదటిసారి 2005లో నిర్వహించిన ఎన్నికలలో 32వ వార్డు(అశోక్నగర్) నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై గెలిచి తొలిసారి కౌన్సిల్లో అడుగుపెట్టారు. ● 2014లో నిర్వహించిన ఎన్నికలలో రెండోసారి 28వ వార్డు (ఎన్జీవోస్ కాలనీ) నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అయితే ఆయన మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా నియమితులయ్యారు. ● 2020లో మూడో పర్యాయం 8వ వార్డు (హౌసింగ్ బోర్డు కాలనీ) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి 37 వ వార్డు(విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీలు) నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
నిన్నటి దోస్తులు.. నేడు ప్రత్యర్థులు
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా తలపడాల్సి రావొచ్చు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లుగా పనిచేసిన ముప్పారపు ఆనంద్, కుంబాల రవియాదవ్ మంచి దోస్తులు. ఒకప్పుడు ఇద్దరూ బీజేపీలో యువనేతలుగా గుర్తింపు పొందారు. తర్వాత ఇద్దరూ బీఆర్ఎస్లో పనిచేశారు. మారిన రాజకీయ సమీరణల మూలంగా ఇప్పుడు ఇద్దరు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. పట్టణంలో జనరల్ స్థానమైన 33 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కుంబాల రవియాదవ్ పోటీ చేస్తుండగా.. అదే వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ముప్పారపు ఆనంద్ బరిలో ఉన్నారు. నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న ఇద్దరు మిత్రులు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచి ప్రత్యర్థులుగా మారిపోయారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిముప్పారపు ఆనంద్, కాంగ్రెస్ అభ్యర్థికుంబాల రవియాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి -
పురుగుమందుల వినియోగం తగ్గించాలి
నస్రుల్లాబాద్: రైతులు పురుగు మందుల వినియోగం తగ్గించాలని ఏవో భవాని అన్నారు. మండలంలోని మిర్జాపూర్, నెమ్లి గ్రామాల్లో గురువారం వరి పొలాలను ఆమె పరిశీలించారు. రైతులు సహజ ఎరువులను వాడాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్టిలైజర్ షాపులను స్టాక్ రిజిస్టార్లను,మందులను పరిశీలించారు. ఆమె వెంట రైతులు ఉన్నారు. కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి మద్నూర్(జుక్కల్): శనగ, మొక్కజొన్న, జొన్న పంటలో కత్తెర పురుగును గమనించినట్లు ఏవో రాజు తెలిపారు. మండలంలోని అవాల్గావ్ శివారులో పంటలను గురువారం ఏవో రాజు పరిశీలించారు. యాసంగిలో సాగు చేస్తున్న శనగ, మొక్క జోన్న పంటలకు ఆశించిన కత్తెర పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. నివారణ కోసం 80 గ్రాముల ఇమమెక్టిన్ బేంజాయేట్ లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీ లీటర్ల మందును ఒక లీటర్ వేప నూనేలో కలిపి ఎకరా పంటకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. యాసంగిలో సాగు చేస్తున్న పంటలను ఆయా గ్రామాల ఏఈవోల దగ్గర నమోదు చేసుకోవాలన్నారు. ఏఈవోలు సంపత్, సౌమ్య, ఎఫ్పీవో చైర్మెన్ గోపాల్ ఉన్నారు. -
విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కామారెడ్డి టౌన్: చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు, న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. కోర్టు పనులకు దూరంగా ఉండి, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితుడితో పాటు ఈ హత్య వెనుక ఉన్న సూత్రధారులందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టంను అమలు చేయాలని కోరారు. న్యాయవాదులు నరేందర్ రెడ్డి, గోవింద రావు, జగన్నాథం, వెంకటరామిరెడ్డి, భిక్షపతి, శ్రీధర్, లత రెడ్డి, నరేష్ కుమార్, మాయ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో న్యాయవాది హత్య ఘటనను నిరసిస్తు నిరసన చేపట్టారు. న్యాయవాదులు గోపాల్రావు, శ్రీనివాస్, శ్రీకాంత్, సాయిబాబా, సాయిప్రకాష్ దేశ్పాండే, నవీద్ తదితరులున్నారు. -
పనులు నాణ్యతగా చేపట్టాలి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పను లను, కస్తూర్భా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈ నాగేశ్వర్ రావు అన్నారు. గురువారం ఆయన ఆయా నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలోని మద్నూర్, నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ మేసీ్త్ర ఉన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఏవో కిషన్ మట్టి సమూనాలు సేకరించి భూసార పరీక్ష వాటి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రణాళికతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ప్రభుత్వ మానసిక వైద్యాధికారి రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం–మాదకద్రవ్యాల నిరోధం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆ రోగ్యం ఎంతో కీలకమన్నారు. ఎకై ్సజ్ ఎస్సై వి క్రమ్ కుమార్ మాట్లాడుతూ.. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కృంగిపోవద్దని, జీవితంలో సాధించాల్సింది చాలా ఉందని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. జిల్లా సోషల్ వర్కర్ రాహుల్ మాట్లాడుతూ.. మానసిక సమస్యలు ఉంటే టెలి మానస్ 14416కు, డ్రగ్స్ సమాచారంపై 14446 నంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రిన్సిపల్ మాధవి, ఎకై ్సజ్ సిబ్బంది దేవా, రఘు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: హైదరాబాద్లో ఇటీవల ని ర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. క్రీడాకారులు వివిధ విభాగాల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించినట్టు కార్యదర్శి రాజ య్య, కోచ్ డీకొండ సాత్విక్ తెలిపారు. బంగారు పతకాలను నహీరా, అర్ఫాత్, హన్సికా సాధించారన్నారు. వెండి, కాంస్య పతకాలు సాధించిన వారిలో రీతన్య, తహ్వికా, మోక్షజ్ఞ, చెర్వికా, శ్రియాన్ష్లున్నారు. క్రీడాకారులను ప లువురు అభినందించారు. -
ఎనిమిదేళ్ల బాలుడికి పెద్ద కష్టం
రామారెడ్డి: తెలిసి తెలియని వయసులో కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రికి తలకొరివి పెట్టిన చిన్నారిని చూసి అంత్యక్రియలకు హా జరైన కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి. బుధవారం రామారెడ్డి గ్రామానికి చెందిన కాటంరవి విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించగా పెద్దకొడుకు అఖిల్ తండ్రికి తలకొరివి పెట్టాడు. గ్రామంలోని రైతులకు పొలం, ఇళ్లలోని విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ అందరితో కలివిడిగా ఉండే రవి హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ప్రచార హోరు
● ఇంటింటికి వెళ్తున్న అభ్యర్థులు ● కార్నర్ మీటింగ్లలో ముఖ్యనేతలుమున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం ఓటర్లు, వివిధ సంఘాల నాయకులతో ఫోన్లలో మాట్లాడడం, సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల ఎన్నికల్లో తమతమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఆయా బల్దియాలపై తమ పార్టీ జెండా ఎగురవేయడం కోసం వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ర్యాలీలు నిర్వహిస్తూ కార్నర్ మీటింగులలో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులను ఎండగడుతూనే, తమ అభ్యర్థులను గెలిపిస్తే ఏం చేస్తామో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డిలో.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వార్డులలో ఆయన పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో పలు వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ తమ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగిస్తున్నారు. అవినీతి రహిత పాలన కోసం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.బిచ్కుందలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిచ్కుందను మున్సిపాలిటీగా చేసిన ఘనత తమదేనని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆయా వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో బిచ్కుంద అభివృద్ధికి నిధులు తీసుకువచ్చానని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు ప్రచారం చేస్తున్నారు. -
అప్పట్లో నామినేటెడ్ చైర్మన్!
● 1956 నుంచి 1969 వరకు బల్దియాగా ఎల్లారెడ్డి ● 13 ఏళ్లూ నామినేటెడ్ చైర్మన్ పాలనే!ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయ భవనంఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణం గతంలోనూ మున్సిపాలిటీగా ఉంది. 1956 లోనే మున్సిపాలిటీగా మార్చారు. 1969 వరకు కొనసాగింది. తర్వాత ఎల్లారెడ్డిని పంచాయతీ చేశారు. తిరిగి 2018 లో రెండోసారి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. నిజాం పాలనలో జమాబంది(పన్నుల వసూళ్లు) కోసం ఎల్లారెడ్డి తహసిల్ కార్యాలయం ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పట్లో పెద్దపెద్ద అధికారులు ఇక్కడ ఉండేవారని చెబుతారు. అధికారుల కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ఉన్న ఎల్లారెడ్డిని 1956లో మున్సిపాలిటీగా మార్చారు. అప్పట్లో ఎన్నికలు కాకుండా ప్రభుత్వం చైర్మన్ను నామినేట్ చేసేది. అలా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ప్రముఖ న్యాయవాది మైసన్ వకీల్ను నియమించింది. ఆయన 1956 నుంచి 1969 వరకు ఈ పదవిలో కొనసాగారు. మున్సిపాలిటీ కావడం వల్ల ప్రజలపై పన్నులభారం ఎక్కువగా ఉందన్న కారణంతో 1969లో ఎల్లారెడ్డిని గ్రామ పంచాయతీగా మార్చారు. తిరిగి గత ప్రభుత్వం 2018 ఆగస్ట్ 2న ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది. -
అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టండి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి టౌన్: కామారెడ్డిని అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఓ టర్లను కోరారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ని 3, 4, 5, 8, 26, 27, 29, 30, 31 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కొత్త వాగ్దానాలు చేసే వారిని నమ్మవద్దన్నారు. ‘మేము కామారెడ్డిలో చేసిన అభివృద్ధిని కళ్లముందు ఉంచి ఓట్లు అడుగుతున్నాం. రెండేళ్లుగా ప్రజలకు ముఖం చాటేసిన నాయకులు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసే వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి‘ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, పట్టణానికి నిధులు తీసుకురావడంలోనూ, అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలోనూ తానే స్వయంగా పూచీకత్తుగా ఉంటానని హామీ ఇచ్చారు. -
బల్దియాలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
● బీజేపీకి మున్సిపల్ పీఠం దక్కితేనే అది సాధ్యం ● ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆయా వార్డులలో పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌరస్తాల్లో మాట్లాడుతూ గత పాలకులు బల్దియాను అప్పులపాలు చేశారన్నారు. తాను రూ. 30 కోట్లకుపైగా బల్దియాకు ఆదాయం సమకూర్చేలా చేసి అప్పులనుంచి గట్టెక్కించానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పట్టణంలో అవినీతి, కబ్జాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేశానన్నారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రం అభివృద్ధి కావాలంటే తప్పకుండా మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలన్నారు. బీజేపీని గెలిపిస్తే రింగ్రోడ్డు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, విశాలమైన రోడ్లతో రాష్ట్రంలోనే ఆదర్శంగా కామారెడ్డిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. -
‘మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేద్దాం’
బాన్సువాడ : మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కో ఇన్చార్జి అశోక్ పర్ణమి పిలుపునిచ్చారు. గురువారం ఆయన బాన్సువాడలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను, ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. హామీలను అమలు చేయని పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, నాయకులు కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చీదరి సాయిలు, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలవారీగా పార్టీ కో ఆర్డినేటర్లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీకి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, నేరెళ్ల శారద, ఎల్లారెడ్డి మున్సిపాలిటికీ ఎం.వేణుగౌడ్, బాన్సువాడకు ఎంపీ సురేశ్ షెట్కార్, బిచ్కుందకు పల్లె లక్ష్మణ్రావు గౌడ్ నియమితులయ్యారు. కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘రాజ్యాంగం –75 ఏళ్ల ప్రస్థానం’ అంశంపై ఒక రోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం, సవాళ్లు, విజయాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ప్రిన్సిపల్, వర్క్షాప్ కన్వీనర్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, గణేష్, రాములు, శ్రీనివాస్రావు, చంద్రశేఖర్గౌడ్, అధ్యాపకులు శ్రీకాంత్, అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారు. 3.30 నుంచి 4.30 గంటల వరకు కొనసాగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. వేదికపైనుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 4.45 గంటలకు హెలీప్యాడ్కు చేరకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,200 మంది పోలీసులు బందోబస్తు విధులలో పాల్గొంటున్నారు. ఏడుగురు ఏసీపీలు, 45 మంది సీఐలు, 48 మంది ఎస్సైల ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేశారు. ● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ అర్బన్: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితోపాటు అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● శివానగర్లో ముగిసిన నియోజకవర్గ సీఎం కప్ పోటీలు ఎల్లారెడ్డి: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్లో నిర్వహించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీఎం కప్ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో యువకులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. డీఎల్పీవో సురేందర్, క్రీడాకారులు తదితరులున్నారు. ఖోఖో విజేత పాల్వంచ కామారెడ్డి అర్బన్: పట్టణంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సీఎం కప్ పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో ఖోఖో బాలికల విభాగంలో విన్నర్గా పాల్వంచ, రన్నర్గా కామారెడ్డి (గర్గుల్జట్టు), బాలుర విభాగంలో విన్నర్గా పాల్వంచ, రన్నర్గా బీబీపేట, కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్గా కామారెడ్డి అర్బన్, రన్నర్గా పాల్వంచ, బాలుర విభాగంలో విన్నర్గా మాచారెడ్డి, రన్నర్గా భిక్కనూర్ మండలాలు నిలిచాయి. విజేతలకు జిల్లా యువజన క్రీడాల శాఖాధికారి వెంకటేశ్వర్లు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్లు బహుమతులు అందజేశారు. మాచారెడ్డి: పాల్వంచ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నియోజకవర్గ సీఎం కప్ ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈసందర్భంగా జట్లను హెచ్ఎం గోవర్ధన్రెడ్డి అభినందించారు. -
అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
దోమకొండ: మండలంలోని అంబారిపేట గ్రామంలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత దంపతులు గురువారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం మహిళలు ఓడిబియ్యం పోశారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఉపసర్పంచ్ సత్తగౌడ్, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డిలోని 7,8, 12వ వార్డులలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ను కై వసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఎల్లారెడ్డి అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ అభ్యర్థులు భాగ్యవతి, శ్రీనివాస్, దశరథం, సోసైటీ వైస్ చైర్మెన్ ప్రశాంత్గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. వినూత్న ప్రచారం కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీ తోడైంది. తాజాగా పుర వీధుల్లో ’డిజిటల్ వాకింగ్ బోర్డులు’ సందడి చేస్తున్నాయి. ప్రచారకర్తలు తమ వీపునకు ఎల్ఈడీ లైటింగ్ బోర్డులను తగిలించుకుని వార్డుల్లో కలియతిరుగుతున్నారు. చీకటిలోనూ అభ్యర్థి ఫోటో, గుర్తు తళతళలాడుతూ కనిపిస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆగి మరీ చూస్తున్నారు. ఫ్లెక్సీల కంటే ఈ ’లైటింగ్’ ప్రచారం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ, ఓటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 37వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గురువారం రాత్రి ఈ వినూత్న ప్రచారం చేపట్టాడు. -
పోలింగ్ కేంద్రాలపై పోలీసుల నిఘా
మున్సిపాలిటీల వారీగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు..● ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ● 111 సమస్యాత్మక కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లుకామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల వర్గీకరణ పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 239 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. అందులో దాదాపు సగం కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిని సమస్యాత్మక, అతి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గొడవలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు.మున్సిపాలిటీ మొత్తం సమస్యాత్మకం అతి అత్యంత పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం సమస్యాత్మకం కామారెడ్డి 152 9 20 24 ఎల్లారెడ్డి 24 2 0 12 బాన్సువాడ 39 8 2 19 బిచ్కుంద 24 2 0 13 మొత్తం 239 21 22 68మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా సాగుతున్నాం. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్ చంద్ర, ఎస్పీ -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి ● బిచ్కుందలో అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన బిచ్కుంద(జుక్కల్): మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బిచ్కుందలో గురువారం ఆమె పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు వ్యయపరిమితి దాటవద్దని, ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం డబ్బులు ఖర్చు చేయాలన్నారు. అభ్యర్థి బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మొత్తం జమ చేసి ప్రచారంలో భాగంగా ఖర్చు చేసిన ప్రతీ దానికి బిల్లులు తప్పకుండా చూపించాల్సి ఉంటుందన్నారు. ర్యాలీలు, బహిరంగా సమావేశాలకు అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కమిషనర్ ఖ య్యుం ఇతర అధికారులు ఉన్నారు. బాన్సువాడలో బాన్సువాడ: పట్టణంలో గురువారం మున్సిపల్ ఎన్నికల ఖర్చుపై అభ్యర్థులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో చేసే ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాల సమాచారం పక్కాగా ఉండాలని అన్నారు. ఏటీవో జగన్ తదితరులు ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు ిసిద్ధం ఎల్లారెడ్డి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది గురువారం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది బ్యాలెట్ బాక్సులను పరిశీలించి వాటికి ఆయిల్ వేసి శుభ్రం చేశారు. దీంతోపాటు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రిని సైతం అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. -
కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి
ఎల్లారెడ్డిరూరల్: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ కేంద్ర నాయకులు, రాష్ట్ర కో–కన్వీనర్ అశోక్ అన్నారు. ఎల్లారెడ్డిలో గురువారం బీజేపీ నాయకుల సమావేశం అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో మొండి చేయి చూపుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పట్టణాల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ కౌన్సిలర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రవీందర్రావు, లింగారావు, రాజ్ మోహన్ రెడ్డి, బాలకిషన్, హనుమాండ్లు, నర్సింలు, రాజేష్, క్రాంతి కుమార్, శ్రీనివాస్, గంగారెడ్డి, భాస్కర్రెడ్డి, దత్తు, రాములు పాల్గొన్నారు. -
సంక్షిప్తం
వికలాంగుడికి సొంత డబ్బును పింఛన్గా అందించిన సర్పంచ్ ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ సాయిలు గురువారం వికలాంగుడు మంగళి రమేష్కు తన సొంత డబ్బులను పింఛన్గా అందించారు. ప్రభుత్వం నుంచి అతడికి పింఛన్ మంజూరయ్యే వరకు తన సొంత డబ్బులతో ప్రతి నెల పింఛన్గా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థికసాయం అందజేత భిక్కనూరు: బస్వాపూర్ గ్రామానికి చెందిన దంపతులు బాలురాజు–మంజుల ఇటీవల ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బాధిత కుటుంబానికి గురువారం గ్రామానికి చెందిన చంద్రంసేటు రూ.11వేలు, బియ్యం, బాదే గురువయ్య రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. ఉపసర్పంచ్ కార్తిక్రెడ్డి, నేతలు తుడుం స్వామి ఉన్నారు. ఆర్థిక సాయం అందిస్తా.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం చేస్తు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు పరిధిలో ఆడ పిల్ల వివాహానికి రూ.11 వేల ఆర్థిక సహాయం, ఆడపిల్ల జన్మిస్తే కుటుంబ సభ్యులకు రూ. 10వేల ఆర్ధిక సహాయం, వార్డులో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియల ఖర్చులకు రూ. 10వేల ఆర్థిక సహాయంతో పాటు, ఆరు నెలలకొకసారి వార్డులో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని హామీ ఇస్తు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని సదాశివనగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈమేరకు వారు గురువారం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్కు వినతిపత్రం అందజేశారు. డీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. సర్పంచ్ శిరీష, ఉప సర్పంచ్ కుందెన ప్రవీణ్కుమార్, వార్డు సభ్యులు బందా సాయవ్వ, సాగర్, మంజూల, రాజమణి, పోసాని భైరయ్య, కోతి బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొత్త మహిళా సమాఖ్య భవనం నిర్మించాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో నూతన మహిళా సమాఖ్య భవనం నిర్మించాలని మహిళ సమాఖ్య ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక భవనం లేక సమావేశాలు జరుపుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సంఘ భవనం కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ కాలేజీల్లోనే మౌళిక సదుపాయాలు, అర్హత గల అధ్యాపకులు ఉంటారని, నాణ్యమైన విద్య అందుతుందని అధ్యాపకులు అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగారం, సిబ్బంది గురువారం గండివేట్, గౌరారం జెడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత విద్యార్థులు ఇంటర్ కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని సూచించారు. పొక్లెయిన్, ట్రాక్టర్ల సీజ్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 86లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్, ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు గిర్దావర్ సంతోష్ గురువారం తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. వాహనాలను పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట జూనియర్ అసిస్టెంట్ నర్సింగ్రావు, జీపీవో నవీన్ తదితరులు ఉన్నారు. -
జింక కళేబరం లభ్యం
● చిరుత దాడి చేసి ఉంటుందని అనుమానం ● ట్రాక్ కెమెరా ఏర్పాటు చేసిన అటవీ అధికారులుమాచారెడ్డి: లక్ష్మీరావులపల్లి అటవీ ప్రాంతంలో జింక మృతదేహం కనిపించింది. చిరుత దాడి చేసి చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. బుధవారం లక్ష్మీరావులపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం కూలీలు అటవీ ప్రాంతంలో పనిచేస్తుండగా సమీపంలో వారికి జింక కళేబరం కనిపించింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్వో రమేశ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో ట్రాక్ కెమెరాలను అమర్చారు. ఒకవేళ చిరుత దాడిచేసి ఉంటే మళ్లీ అదే ప్రాంతానికి వస్తుందని ఎఫ్ఆర్వో తెలిపారు. ఉపాధి కూలీలతో పాటు ఎవరూ మూడు రోజుల వరకు ఆ ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచించారు. -
‘బంగారం’లాంటి ఓటు!
నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో ఓ అభ్యర్థి భర్త తనకు తెలిసిన ఇంటికి వెళ్లాడు. ‘మీకు ఏ ఆపద వచ్చినా నిమిషాలల్ల ఉరికొచ్చిన. ప్రతీ కష్టంల మేమున్నం. మున్సిపల్ ఎలక్షన్ల నా భార్య నిలబడ్డది. మీరు మాకే ఓటెయ్యాలె పెద్దవ్వ’ అంటూ అడిగాడు. ‘అయ్యో బిడ్డా.. మీకు గాకుంటె యెవళ్లకు వేస్తం’ అన్నది ఆ పెద్దవ్వ.. ‘మొన్న గాయిన ఇంటికి వచ్చి మీ ఇంట్ల పది ఓట్లున్నయి. మాటిస్తే అద్దతులం బంగారం పెడతా అన్నడు. మాకేమో మీకే వేయాలని ఉంది. అందుకే ఏదో ఒకటి జెప్పి పంపినం’ అని చెప్పింది. దీంతో ఆ అభ్యర్థి భర్త పది ఓట్లు తమకే అనుకుంటూ లోలోపల సంతోషపడ్డడు. అయితే అంతలోనే ఆ పెద్దవ్వ బాంబు పేల్చింది. ‘బిడ్డా మీకే ఓట్లేస్తంగని ఆ అద్దతులం ఏందో నువ్వే ఇయ్యు’ అనడంతో షాక్ అయ్యాడు. ఇప్పటికే బంగారం ధర ఆకాశానికంటింది. అద్దతులం అంటే ఎనభై తొంభై వేలు.. వామ్మో అనుకుని ‘సరే పెద్దవ్వ. మళ్ల వచ్చి కలుస్త’ అని చెప్పి మరో ఇంటికి వెళ్లిపోయాడు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
పిన్న వయసులో ఎన్నికల బరిలో..
జిల్లాలో యువతరం రాజకీయాల్లోకి వస్తోంది. మహిళలూ ముందుంటున్నారు. పాతికేళ్లలోపు మహిళా అభ్యర్థులు పలువురు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు. ● కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డునుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంశెట్టి హర్షిత పోటీ చేస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఆమె వయసు 22 ఏళ్లు.. 32వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గ్యార అఖిల వయసు కూడా 22 ఏళ్లే. ఆమె డిగ్రీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 5వ వార్డునుంచి బీజేపీ అభ్యర్థిగా 22 ఏళ్ల స్నేహ పోటీ చేస్తున్నారు. 27వ వార్డులో సీపీఎం అభ్యర్థిగా తోట అలేఖ్య (25), 41వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాపల్లి నవ్య(26) పోటీ పడుతున్నారు. ● ఎల్లారెడ్డిలోని రెండో వార్డులో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సమీరా బేగం వయసు 23 ఏళ్లు. ● బాన్సువాడ ఏడో వార్డునుంచి 24 ఏళ్ల మానస (బీజేపీ అభ్యర్థి), ఆరో వార్డు నుంచి 25 ఏళ్ల హీనా ఫాతిమా (కాంగ్రెస్ అభ్యర్థి) అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ● బిచ్కుందలో 12వ వార్డునుంచి 24 ఏళ్ల రూప బీఆర్ఎస్ అభ్యర్థిగా, ఆరో వార్డునుంచి 25 ఏళ్ల రాథోడ్ సునీత (25) బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
ఎన్నికల నియమావళిని పాటించాలి
● ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను నమోదు చేయాలి ● అదనపు కలెక్టర్ మధుమోహన్కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు రిటర్నింగ్ అధికారి అందజేసిన ఖర్చుల రిజిస్టర్లో ఎన్నికల ఖర్చులన్నింటినీ ప్రతిరోజూ వోచర్లు, రసీదులతో సహా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో ఖర్చుల ఖాతాలను సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వాహనాల వినియోగం, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఊరేగింపులు నిర్వహించాలంటే ముందస్తుగా రిటర్నింగ్ అధికారి గానీ, సహాయ రిటర్నింగ్ అధికారి నుంచి గానీ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా వాహనాలు లేదా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు తమ పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకుని రిటర్నింగ్ అధికారి ఆమోదం పొందాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేయరాదన్నారు. ఎన్నికల నిబంధనలపై ఏవైనా సందేహాలుంటే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
‘పట్టణ రూపురేఖలు మారుస్తాం’
కామారెడ్డి టౌన్: గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి పట్టణం అభివృద్ధిలో వెనకబడిందని, కాంగ్రెస్ హయాంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పట్టణ రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల రోడ్డులోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా ప్రజల్లో కనిపించని ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ వస్తున్నారని విమర్శించారు. ప్రెస్మీట్లు పెట్టి కరప్షన్ గురించి మాట్లాడే ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములను అరోరా కాలేజీకి ధారాదత్తం చేసింది ఎవరో చెప్పాలన్నారు. రైతులు తమ పిల్లల చదువుల కోసం కొన్న భూములను అన్యాక్రాంతం చేయడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రంతోనే ఓటర్ల ముందుకు వెళ్తుందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. పట్టణంలో అంతర్గత రహదారుల విస్తరణ, అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నిరంతరాయంగా శుద్ధ జలం సరఫరా చేస్తామన్నారు. అభ్యర్థులందరూ క్రమశిక్షణతో, ఐక్యమత్యంతో పనిచేసి 49 వార్డుల్లోనూ విజయం సాధించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ పాల్గొన్నారు. -
మహిళా చైతన్యం!
● 447 మంది అభ్యర్థుల్లో 236 మంది వనితలే.. ● రిజర్వ్ వార్డులతోపాటు జనరల్ స్థానాల్లోనూ బరిలో పలువురు రాజకీయాలపై మహిళల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రజాప్రతినిధి కావడం కోసం ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నారు. రిజర్వ్ అయిన స్థానాల్లోనే కాకుండా జనరల్ వార్డుల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో సగానికన్నా ఎక్కువమంది అభ్యర్థులు మహిళలే ఉండడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిస్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించిన తర్వాత వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో రాజకీయ చైతన్యమూ పెరుగుతూ వస్తోంది. మహిళకు రిజర్వు అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ నిలబడి సత్తా చాటుతున్నారు. 50 శాతం రిజర్వేషన్ అవకాశం రావడంతో వారికి కేటాయించిన స్థానాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో బరిలో దిగుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 92 వార్డులు ఉండగా 45 వార్డులను మహిళలు రిజర్వు అయ్యాయి. అన్ని వార్డుల్లో కలిపి మొత్తం 447 మంది బరిలో ఉన్నారు. ఇందులో 236 మంది మహిళలు ఉన్నారు. పలు వార్డుల్లో బహుముఖ పోటీ.. మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ప్రధాన పార్టీలనుంచే కాకుండా స్వతంత్రులుగానూ చాలామంది పోటీ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని 5, 13, 40, 41 వార్డులలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. 7, 23, 27, 28, 35 వార్డుల్లో ఆరుగురు చొప్పున, 16, 21, 22, 30, 38, 42, 48 వార్డులలో ఐదుగురు చొప్పున పోటీపడుతున్నా రు. బాన్సువాడలోని 7, 17 వార్డుల్లో ఆరుగురు చొప్పున 6, 8, 14 వార్డుల్లో ఐదుగురు చొప్పున మహిళలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బి చ్కుందలోని మూడో వార్డులో ఏడుగు రు, 11వ వార్డులో ఐదుగు రు, 12వ వార్డులో ఆరుగురు, ఎల్లారెడ్డిలోని 1, 2 వార్డుల్లో ఐదుగురు చొప్పున మహిళలు పోటీ చేస్తున్నారు.మహిళ లకు రిజర్వు అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ పలువురు పోటీ పడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో 3, 31, 45 వార్డులలో ఇద్దరు చొప్పున, 9, 19, 24, 25, 26, 32, 36, 49 వార్డులలో ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచారు. ఎల్లారెడ్డిలో 9, 15 వార్డులలో ఒక్కొక్కరు, బిచ్కుంద ఒకటో వార్డులో ఇద్దరు, ఆరో వార్డులో ఒకరు పోటీ చేస్తున్నారు.మున్సిపాలిటీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం కామారెడ్డి 49 48,389 50,907 17 99,313 ఎల్లారెడ్డి 12 6,321 6,943 01 13,265 బాన్సువాడ 19 11,578 12,599 11 24,188 బిచ్కుంద 12 6,201 6,556 02 12,759 మొత్తం 92 72,489 77,005 31 1,49,525మున్సిపాలిటీ వార్డులు మొత్తం అభ్యర్థులు మహిళలు కామారెడ్డి 49 254 137 ఎల్లారెడ్డి 12 45 23 బాన్సువాడ 19 85 45 బిచ్కుంద 12 63 31 మొత్తం 92 447 236 -
‘అవినీతి రహిత పాలన అందిస్తాం’
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీని అవినీతి రహితంగా తీర్చిదిద్దడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకవర్గాల హయాంలో మున్సిపాలిటీని అవినీతి ఊబిలోకి నెట్టి కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు. గత రెండేళ్లలో బీజేపీ చొరవతో మున్సిపాలిటీలో అవినీతి గణనీయంగా తగ్గిందని, అప్పుల భారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి రూ. 6 కోట్ల ఆదాయం ఉంటే, తాను గెలిచిన తర్వాత దానిని రూ. 16 కోట్లకు పెంచామన్నారు. పన్నులు సక్రమంగా చెల్లిస్తే మున్సిపాలిటీకి ఏటా రూ. 24 కోట్ల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6 కోట్లు కలిపితే ఏటా దాదాపు రూ. 50 కోట్ల ఆదాయం సమకూరుతుందని లెక్కలు చూపారు. ఈ మొత్తంలో రూ. 16 కోట్ల నిర్వహణ ఖర్చులు పోగా, మిగిలిన ఆదాయం నుంచి ప్రతి వార్డుకు రూ. 75 లక్షల చొప్పున కేటాయిస్తే మూడేళ్లలో పట్టణంలోని ప్రధాన సమస్యలన్నీ పరిష్కరించవచ్చన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే, నీతి, నిజాయితీతో పనిచేసే బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సరస్వతి విద్యామందిర్లో ఫుడ్ ఫెస్టివల్
కామారెడ్డి అర్బన్: రైతులు ఎంతో శ్రమపడి పంటలు పండిస్తారని, పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని వృథా చేయవద్దని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్ అన్నారు. బుధవారం కామారెడ్డి సరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు తమకు ఇష్టమైన 160 రకాల వంటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సంచాలన సమితి అధ్యక్షుడు గీరెడ్డి రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి బి.గోపాలకృష్ణలు భారతీయ పాకశాస్త్రం ఎంతో గొప్పదని అన్నారు. వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, ప్రతినిధులు రఘుకుమార్, ప్రధానాచార్యులు నల్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం, మరో వైపు ఉల్లిగడ్డ, అల్లమెల్లిగడ్డ విక్రయ మైకులతో హోరిత్తిస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ప్రతిరోజు ఉల్లిగడ్డ, అల్లమెల్లి గడ్డ విక్రయ వ్యాన్ల ప్రచారం అరగంటకు ఒక సారి కొనసాగుతుండగా దీనికి తోడు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచార వాహనాలు అధిక శబ్దంతో ఒకటి తర్వాత మరో వాహనంతో భరింప రాని శబ్దంతో విసుగు చెందిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పలు కాలనీల్లో అధిక శబ్దం భరించలేక తలుపులు మూసి ఉంచుతున్నారు. పోలీసులు అనుమతిలేని వాహనాల యాజమానులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయం
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి బుధవారం పట్టణంలోని 16, 17 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. మరో సారి ఓటు వేస్తే హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. పార్టీ అభ్యర్థులు గుంజ జ్యోతి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు గుంజ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిక కామారెడ్డి క్రైం: బీజేపీ పట్టణ కార్యదర్శి రాజావరపు గురుమూర్తి బుధవారం బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాయకులు పాల్గొన్నారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో బుధవారం సామాజిక గ్రామ సభ ఏర్పాటు చేసి ఏపీడీ వామన్రావు, ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీవో మధు సమీక్షించారు. 2024–25లో జరిగిన 45 గ్రామ పంచాయతీల పరిధుల్లో సామాజిక తనిఖీలు చేశారు. అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు, గ్రామసభలు పూర్తయ్యాయి. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి పనుల పరిశీలన లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి, లింగంపేట గ్రామాల్లో బుధవారం ఎంపీడీవో నరేశ్ ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. పనులు కొలతల ప్రకారం చేయాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో నరేందర్, క్షేత్రసహాయకులు, తదితరులు ఉన్నారు. -
చెక్కుల పంపిణీ
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్తో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు రమేష్ దేశాయ్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. బుధవారం 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి కాసర్ల మాధవి తరపున ప్రచారం చేసి మల్లన్న గుడి దగ్గర ఓటర్ల కోరిక మేరకు సెల్ఫీ దిగారు. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్ అనిపించింది. బిచ్కుంద(జుక్కల్): మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల వివరాలు, ఎంత వరకు ఖర్చు చేయాలి తదితర ఎన్నికల నిబంధనలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని కమిషనర్ ఖయ్యుం తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరు అవగాహన సదస్సుకు హాజరు కావాలని కోరారు. తెయూ (డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ 3, 5వ సెమిస్టర్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ 1, 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజ్, న్యాయ కళాశాలలో జరిగిన పరీక్షలకు మొత్తం 201 మంది విద్యార్థులకు 195 మంది హాజరుకాగా ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నందిపేట్(ఆర్మూర్): ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్–2026 పరీక్షకు ఏప్రిల్ 20 తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నందిపేట పాలిటెక్నిక్ పిన్సిపాల్ రాజ్కుమార్ తెలిపారు. మే 13 న పాలీసెట్ పరీక్ష ఉంటుందన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నందిపేట కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ కోర్సులలో 60 సీట్ల చొప్పున ఉన్నాయని తెలిపారు. నందిపేట్(ఆర్మూర్): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నందిపేట మండలం చౌడమ్మ కొండూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన కొడపాల్ సాగర్ (30) మంగళవారం రాత్రి 10 గంటలకు బైక్పై నందిపేట నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. బైక్లపై ప్రయాణిస్తున్న కొడుపుల సాగర్తోపాటు శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాగర్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన శివ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి తండ్రి సాయన్న ఫిర్యాదు మేరకు అతివేగంగా అజాగ్రత్తగా బైక్ నడిపిన వెలుమల ప్రవీణ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట, హరిజన వాడ, 5వ, 6వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్కు ఓటు వేయడం వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యదిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ అభ్యర్థులు స్వప్న, గఫార్, చంద్రయ్య తదితరులున్నారు. -
ఉపాధి హామీ కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలి
బాన్సువాడ రూరల్: గ్రామాల్లో ఉపాధి హామీ ప నులకు వచ్చే కూలీల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉందని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన మండల కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణరెడ్డితో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉ పాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప లు సూచనలు చేశారు. వేసవి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పంచాయ తీ కార్యదర్శులకు ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఇంకా పనులు ప్రారంభించని వారిని గుర్తించి వారు వెంటనే పనులు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. -
కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు
భిక్కనూరు: కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం వారు రామేశ్వర్పల్లిలో ఆరోగ్య ఉపకేంద్రం వద్ద కుష్టువ్యాధి నివారణకు కృషి చేస్తామని గ్రామస్తులతో కలిసి నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా మందులు వాడి చికిత్సలు చేయించుకుంటే వ్యాధి తగ్గుతుందన్నారు. సర్పంచ్ చేపూరి రాణి, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్రెడ్డి, ఉపసర్పంచ్ వినోద్గౌడ్, ఎంఎంసీ డైరెక్టర్ రమేశ్రెడ్డి, ఏఎన్ఎం మాధవి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.వైభవంగా ఎల్లమ్మ చక్ర తీర్థం దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రా మ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవా ల్లో భాగంగా బుధవారం అమ్మవారికి గ్రామాని కి చెందిన మహిళలు ఒడిబియ్యం పోశారు. చక్ర తీర్థం కార్యక్రమం నిర్వహించారు. మొ క్కులను తీర్చుకున్నారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్, లక్ష్మీనారాగౌడ్, అధ్యక్షులు అనిల్గౌడ్, ఉపాధ్యక్షులు ప్రకాష్గౌ డ్, కార్యదర్శి చంద్రగౌడ్ పాల్గొన్నారు. ప్రారంభమైన ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్లో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గైని రాజయ్య, వీడీసీ చైర్మన్ శ్రీకాంత్ రావు, పాల కేంద్రం అధ్యక్షుడు దొడ్లె రవి, మాజీ ఎంపీటీసీ రాంచందర్ రావు, విండో మాజీ చైర్మన్ ప్రభాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్వర ఆలయంలో సంత్ నరహరి పుణ్యతిథి మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని మల్లేశ్వర ఆలయంలో బుధవారం సంత్ నరహరి సోనార్ పుణ్యతిథి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సంత్ నరహరి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. వార్కారీలు, భజన మండలి సభ్యుల బృందం.. ఆలయంలో కీర్తన, భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఘనంగా బోనాల ఊరేగింపు భిక్కనూరు: మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం 50వ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. దారిపొడవునా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు. -
ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి
బాన్సువాడ: బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రా మానికి చెందిన మచ్కురి రాజు (35) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఇటుక ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. అయితే, రాజు చెట్టుకు ఢీకొని మృతి చెందినట్లు ఇటుక ట్రాక్టర్ డ్రైవర్ చిత్రీకరించిన విష యం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మృతుడు రాజు మిర్జాపూర్లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వీరాపూర్ వద్ద ఇటుక బట్టీ ప్రాంతంలో అతివేగంతో వస్తున్న ఇటుక ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా ట్రాక్టర్ డ్రైవర్ రాజు మృతదేహాన్ని చెట్టు పక్కన ఉంచి, చెట్టును ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజు మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు అనుమా నం వచ్చి ఇటుక బట్టీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించగా ట్రాక్టర్ ఢీకొన్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో రాజు కుటుంబానికి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు బాన్సువాడలో రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని చెప్పడంతో విరమింపజేశారు. కాగా, భార్య పుట్టిన రోజునాడే భర్త రాజు మృతి చెందడంతో కుటుంబీకులు గుండెలవిసెల రోదించారు. వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన కొత్తోళ్ల సుప్రియ (26) అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. మోస్రా గ్రామానికి చెందిన సుప్రియ కుటుంబకలహాలతో నెల రోజులుగా అదే గ్రామంలో తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. జనవరి 25న ఇంట్లో నుంచి వెళ్లిన సుప్రియ తిరిగి రాకపోవడంతో బుధవారం పోలీస్ స్టేషన్లో తల్లి సవిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని వడ్డె ర కాలనీకి చెందిన గండికోట మల్లేశ్ (35) మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపా రు. మల్లేశ్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బా ధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మా నసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన డ్రైవర్ -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాలి
బాన్సువాడ రూరల్: లబ్ధిదారులు వీలైనంత వరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాలని కామారెడ్డి జిల్లా హౌజింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన బోర్లంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. మంజూరై ఇంకా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇంటి నిర్మాణాల కోసం ఇతరులను చూసి అనవసర ఖర్చులు చేయవద్దన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనుల పురోగతిపై పంచాయతీ కార్యదర్శి సాయికుమార్తో సమీక్షించారు. హౌసింగ్ డీఈ గోపాల్, ఏఈ వినీత్ పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న డీసీఎం
గాంధారి(ఎల్లారెడ్డి): డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో డ్రైవర్కు గాయాలైన ఘటన గండివేట్ స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగ్లూర్కు చెందిన డీసీఎం వ్యాన్ గాంధారి నుంచి బాన్సువాడ వైపు వెళ్తోంది. డ్రైవర్ రాందాస్ అజాగ్రత్తగా నడపటంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును అతి వేగంగా ఢీకొట్టింది. డీసీఎం క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు బయటకు తీసి 108 అంబులెన్సులో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బ్లాక్ లెవల్ స్పోర్ట్ ్స మీట్ ప్రారంభం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆర్డీవో పార్థసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొని మాట్లాడారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని, యువత ఎల్లపుడు కష్టపడి చదివి ఉన్నత స్థానాలలో ఉండాలన్నారు. యువత ఆటపాటలలో ముందుండాలన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలె్న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యతను వెలికితీయడానికి భారత ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, చెస్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం మెమోంటోలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కో–ఆర్డినేటర్ వి.శంకరయ్య, స్పోర్ట్స్ ఇన్చార్జ్ శివకుమార్, కళాశాల స్పోర్ట్స్ కమిటీ మెంబర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
మొక్కులు చెల్లించుకున్న కాచాపూర్ ప్రజాప్రతినిధులు
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిదులు బుధవారం సమ్మక్క సారక్కలకు ముడుపులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్, ఉప సర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ సర్పంచ్లు బైండ్ల భూపతి, యాదయ్యలతో పాటు నేతలు డాక్టర్ రాజిరెడ్డి, జీవన్రెడ్డి, భూమయ్య, తొగరి మురళి, వార్డు సభ్యుడు తొగరి రమేష్లు మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచమని వేడుకున్నారు. గ్రామాన్ని అభివృద్థి పథంలో నడిపించుమని కోరుతూ అమ్మవార్లకు కట్నకానుకలతో పాటు రూ.21వేల విలువచేసే బెల్లంను సమర్పించుకున్నారు. -
అనారోగ్యంతో లైన్మన్ మృతి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన లైన్మన్ జంగం నాగప్ప(50) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నాగప్ప ఆరు నెలల క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. నాగప్ప స్వగ్రామం పెద్దకొడప్గల్లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని రాంలక్ష్మణ్పల్లి గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం నాలుగు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకావత్ రాము కొంతకాలంగా తన ఇంట్లో నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు మంగళవారం ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. కూలర్లో రెండు ప్లాస్టిక్ సీసాల్లో అక్రమంగా దాచి ఉంచిన నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని రాముపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రమైన పిట్లంలో సోమవారం రాత్రి జరిగిన బైక్ చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాన్సువాడ నుంచి వచ్చిన క్లూస్ టీం అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. ఆయన వెంట పిట్లం ఎస్సై వెంకట్రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
పశుపోషకులకు అధికారుల నోటీసులు
● దురుసుగా ప్రవర్తించిన ఒకరిపై కేసు నమోదునిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గిర్నితండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొన, నడిమి, గిర్నితండాల్లోని పశుపోషకులకు మండల పరిషత్, గ్రామపంచాయతీ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ‘సర్వీస్ రోడ్లే పశువుల కొట్టాలు’ అంటూ సోమవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిషత్ అధికారుల ఆదేశాల మేరకు గిర్నితండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరి.. పశుపోషకులకు నోటీసులు ఇచ్చారు. సర్వీస్ రోడ్లపై పశువులను కట్టేయడమే కాకుండా నోటీసు తీసుకోకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరిపై దురుసుగా ప్రవర్తిస్తూ, విధులకు ఆటంకం కల్గించాడు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి గౌరి నిజాంసాగర్ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో హరిసింగ్పై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
అభ్యర్థులకు ప్రచార కష్టాలు
బాన్సువాడ : మున్సికల ప్రచారం అభ్యర్థులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తాడ్కోల్ శివారులో ఉన్న డబుల్ బెడ్ కాలనీ ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. బాన్సువాడ పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో తాడ్కోల్ శివారులో గత ప్రభుత్వ హయాంలో 1,000 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి అర్హులైన పేదలకు అందజేసింది. ఆ ఇళ్లలో 2 వేలపైనే ఓట్లర్లు నివసిస్తున్నారు. అక్కడ నివనించే ఓటర్లు గతంలో పట్టణంలోని పలు వార్డుల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ ఇళ్లలో నివాసముండి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఈ కాలనీని ప్రత్యేక వార్డుగా గుర్తించి ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు మున్సిపల్ అధికారులకు దరఖాస్తు సైతం చేసుకున్నారు. ప్రస్తుతం పట్టణంలో 19 వార్డులు ఉన్నాయి. కొత్తగా వార్డులు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ నివసిస్తున్న ఓటర్లు తమ పాత వార్డుల్లోనే ఓటు వేయాల్సి వస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్లలో పలు వార్డులకు సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఆయా వార్డుల్ల పోటీ చేసే అభ్యర్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీకి వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఓటర్లు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో 8వ వార్డులో ఓటు వచ్చింది. ఇప్పుడేమో 15వ వార్డులో ఓటు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఓటు వస్తుందో నాకే తెలియడం లేదు. నేను ఎలాగోలా వెళ్తా. కానీ మా అమ్మ నడవలేని స్థితిలో ఉంది. అంత దూరం ఎలా వెళ్లాలి. –విష్ణు, డబుల్ బెడ్ రూం కాలనీవాసిదూరంతో ఇబ్బందులు.. తాడ్కోల్ డబుల్ బెడ్రూం కాలనీవాసులు పట్టణానికి రావాలంటే ఆటోలే దిక్కు. రవాణా సౌకర్యం లేదు. చాలా మంది కాలినడకనే వస్తుంటారు. ద్విచక్ర వాహనాలు ఉన్న వారికి ఇబ్బందులు ఉండవు. మున్సిపల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. పట్టణంలో ప్రతి వార్డుకో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో ఆటోలో రావాలంటే పట్టణానికి రూ.100 వసూలు చేసేవారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రవాణా భారం పిరం కానుంది. ఇక్కడి ఓటర్ల ఓటు కావాలనుకునే అభ్యర్థులు ప్రతీ రోజూ రెండు, మూడు సార్లు వచ్చి ప్రసన్నం చేసుకుంటే గానీ ఓట్లు పడే అవకాశం లేదు. గల్లీలో ఓట్లు.. డబుల్ బెడ్ రూం కాలనీలో ఇళ్లు తాడ్కోల్ డబుల్ బెడ్ రూం కాలనీలో 2 వేలకు పైగా ఓటర్లు -
కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపుకామారెడ్డి టౌన్: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన 420 కాంగ్రెస్ పార్టీని, వారి అభ్యర్థుల ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వీజీ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్లతో కలిసి పార్టీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కాంగ్రెస్ పార్టీ వందలాది హామీలిచ్చి ప్రజల ను వంచించిందని ధ్వజమెత్తారు. అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో.. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ పార్టీ అధ్యక్షు డు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, తదితరులు పాల్గొన్నారు. స్నేహితుడి తల్లి అంత్యక్రియల్లో.. భిక్కనూరు: స్నేహితుడి తల్లి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం పాల్గొన్నారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్లు చిన్ననాటి మిత్రులు. మంగళవారం గంగారెడ్డి తల్లి బుచ్చిరాజమ్మ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ బస్వాపూర్ గ్రామానికి వచ్చి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
రేణుకాదేవి ఎల్లమ్మ కల్యాణోత్సవం
భిక్కనూరు: మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం 50వ వార్షికోత్సవాలను గౌడ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం గౌడ సంఘం ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దోమకొండ: ముత్యంపేట గ్రామ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు సందర్భంగా మంగళవారం అమ్మవారికి గ్రామానికి చెందిన మహిళలు ఘనంగా బోనాలు తీశారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్, లక్ష్మీనారాగౌడ్, అధ్యక్షులు అనిల్గౌడ్, ఉపాధ్యక్షుడు ప్రకాష్గౌడ్, కార్యదర్శి చంద్రగౌడ్, కోశాధికారి నరేశ్ గౌడ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్లో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బోనాలను ఊగించారు. భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్లో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంత చేయాలని వారు కోరారు. దోమకొండ: మండల కేంద్రంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఊర పండుగ మంగళవారం ముగిసింది. ఉదయం నుంచి ఊరడమ్మ, సార్గమ్మల వద్ద ప్రత్యేక పూజలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరంతా తిరిగి మళ్లీ వనభోజనాలకు వెళ్లారు. గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, ఊర పండగ నిర్వాహకులు మర్రి శేఖర్, సిద్ధారెడ్డి, కూర చంద్రం, పున్న రాములు, సంతోష్ రెడ్డి, తదతరులు పాల్గొన్నారు. -
ఎల్లారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు బి–ఫాంలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎల్లారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. 18 నెలల కాలంలో మినీ ట్యాంకు బండ్ అభివృద్ధి చేయడంతో పాటు, రూ.5 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మించినట్లు తెలిపారు. అలాగే వివిధ పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.. రానున్న రోజులలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పథంలో నిలుపుతామని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మశ్రీకాంత్, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. బగళాముఖీ క్యాలెండర్ల ఆవిష్కరణ ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంగళవారం బగళాముఖీ అమ్మవారి క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన క్యాలెండర్లు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలని అన్నారు. జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల బాలకిషన్, కృష్ణాగౌడ్ తదితరులున్నారు. -
ఆయకట్టుకు నీరందిస్తున్నా.. నిండుకుండే!
● రెండు విడతల్లో 6 టీఎంసీల విడుదల ● అయినా కళకళలాడుతున్న నిజాంసాగర్ ● ‘సింగూరు’ జలాల రాకే కారణంనిజాంసాగర్: ఆయకట్టు కోసం ఇప్పటికే ఆరు టీఎంసీల నీటిని విడుదల చేసినా నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలానే కళకళలాడుతోంది. సింగూర్ రిజర్వాయర్నుంచి నాలుగు టీఎంసీలు వచ్చి చేరడమే ఇందుకు కారణం. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కరకట్ట, రివిట్మెంట్ మరమ్మతు పనులు చేపడుతుండడంతో నీటిని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతనెల 10న ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెల 13 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నాలుగు టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఒక టీఎంసీ నీరు మంజీర నదిలో స్టోర్ అయ్యింది. రెండో విడతలో సింగూరు నుంచి మరో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టుకు సాగునీరు.. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ పరిధిలో 1.5 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతున్నాయి. ఆయకట్టు అవసరాలకోసం ఆరు విడతల్లో నీటిని అందించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో నెల రోజుల పాటు 3.225 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండ దఫాలో 21 రోజుల పాటు 2.6 టీఎంసీల నీటిని వదిలారు. నీటిని వదులుతుండడంతో ప్రాజెక్టు ఖాళీ కావాల్సి ఉండగా.. సింగూరు నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు మళ్లీ కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. మంగళవారం సాయంత్రానికి 1,403.33 అడుగుల (15.4 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 15 టీఎంసీలకుపైగా నీరుండడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాసంగికి ఢోకా లేనట్లేనని పేర్కొంటున్నారు. -
‘బాలల రక్షణ అందరి బాధ్యత’
కామారెడ్డి టౌన్: బాలల హక్కుల పరిరక్షణ ప్ర తి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె కా మారెడ్డిలోని బాల సదన్, భవానీపేట్లోని ఇండియన్ జిప్సీ ట్రస్ట్ చిల్డ్రన్ హోమ్లను తని ఖీ చేశారు. చిన్నారులతో ముచ్చటించారు. వా రి ఆరోగ్యం, విద్యా సౌకర్యాలపై ఆరా తీశారు. వంటగదిలోని సరుకులను, నివాస గదులను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం, వసతులు అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో మంగళవా రం మెదక్ జిల్లాకు చెందిన మత్స్యసహకార శా ఖ అధికారులు రొయ్యపిల్లలను విడుదల చేశా రు. ప్రాజెక్టులో 5.85 లక్షల రొయ్యపిల్లలను విడుదల చేసినట్లు మెదక్ జిల్లా మత్స్యసహకారశాఖ అధికారి మల్లేశం తెలిపారు. కార్యక్ర మంలో పోచారం సర్పంచ్ సంజీవరావు, మె దక్ జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ దేవేందర్, ఇరిగేషన్ అధికారి టింకు, జిల్లా డైరెక్టర్ శ్రీనివాస్, పోచారం మ త్స్యసహకార సంఘం కార్యదర్శి శివయ్య, సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ప్రతి విద్యుత్ ఉద్యోగి అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాపెల్లి రవీందర్ సూచించారు. మంగళవారం కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ రవీందర్ విద్యుత్ భద్రత అంశాలపై చర్చించి ప్రతిజ్ఞ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ లైన్ క్లియరెన్స్ యాప్ ద్వారా ఎల్సీ తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయో ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈలు కళ్యాణచక్రవర్తి, శ్రీనివాస్గౌడ్(టెక్నికల్), ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: అధ్యాపకులు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నిరంతం కృషి చేయాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ సూచించారు. కళాశాలలో మంగళవారం ‘పరిశోధనాత్మక వ్యాసం ఎలా రాయాలి’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఒరవడి, ఉన్నత ప్రమాణాలతో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు రూపొందించాలని సూచించారు. సదస్సులో రిసోర్స్ పర్సన్ అంకం జయప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. లింగంపేట: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ప క డ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడి యట్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించా రు. మంగళవారం లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్ష లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు సైన్స్ కోర్సుల్లో 1,123 మంది విద్యార్థులకుగాను 1,103 మంది, ఒకేషనల్ పరీక్షలకు 1,202 మంది విద్యార్థులకుగాను 1,085 మంది హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 922 మందికిగాను 909 మంది, ఒకేషనల్ విభాగంలో 1,098 మందికిగాను 1,043 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రిన్సిపల్ నరేందర్, అధ్యాపకులు ఉన్నారు. -
లెక్క తేలింది
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఏ వార్డునుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారో తేలిపోయింది. చివరి రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల రెబల్స్, స్వతంత్రులు కలిపి మొత్తం 217 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 92 వార్డుల్లో మొత్తం 447 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని వార్డులనుంచి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి 89 వార్డుల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంఐఎం 10, బీఎస్పీ 4, సీపీఎం 3, ఆప్ ఒక స్థానంలో అభ్యర్థులను నిలపగా.. ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలనుంచి 18 మంది, స్వతంత్రులు 138 మంది పోటీ చేస్తున్నారు. బాన్సువాడలో.. బాన్సువాడ పట్టణంలో 19 వార్డుల పరిధిలో 85 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని వార్డులలో, బీజేపీ 17 వార్డులో పోటీ చేస్తుండగా.. స్వతంత్రులు 30 మంది బరిలో నిలిచారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 45 మంది ఎన్నికల బరిలో మిగిలారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజీపీ అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తుండగా.. బీఎస్పీ రెండు స్థానాల్లో బరిలో ఉంది. ఏడుగురు స్వతంత్రులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచారం జోరందుకోనుంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు వెంటనే రంగంలోకి దూకారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూనే సంఘాలతో సమావేశమవుతున్నారు. హామీలను గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బరిలో మిగిలిన వారి లెక్కతోపాటు స్వతంత్రుల గుర్తులు తేలడంతో బుధవారం నుంచి ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలున్నాయి.నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తుండగా.. బీజేపీ 89 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. అభ్యర్థుల లెక్క తేలడంతో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. – సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్ చివరి రోజు 217 నామినేషన్ల ఉపసంహరణ 92 వార్డులనుంచి బరిలో 447 మంది.. అన్నివార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు 89 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా.. 254 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాలలో అభ్యర్థులను నిలిపాయి. బీజేపీ 48 వార్డుల్లో, ఎంఐఎం 8 చోట్ల, జనసేన 7, టీఆర్ఏపీ 6, సీపీఎం 3, బీఎస్పీ, ఏఐఎఫ్బీ, ఆప్ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. స్వతంత్రులు 81 మంది పోటీలో ఉన్నారు. -
ఎలక్షనంటే ‘చీప్’ కాదోయ్!
పట్టణాల్లో ఎలక్షన్ అంటే సాదాసీదాగా ఉండదు కదా.. పేదలు నివసించే కొన్ని స్లమ్ ఏరియాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో మధ్య తరగతి ప్రజలు, ఉన్నత వర్గాల వారే ఉంటారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతలు, అభ్యర్థులు ఓటర్ల చెంతకు వెళుతున్నారు. రాత్రికి గల్లీ సంఘాలు, సిండికేట్లు, సొసైటీలు, కుల సంఘాలు... ఇలా వివిధ వర్గాల వారీగా సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే చీప్ లిక్కరో, సాధారణ బ్రాండ్ల మద్యమో ఇస్తే ఓటర్లు ఒప్పుకోవడం లేదట. చాలా చోట్ల ఖరీదైన బ్రాండెడ్ లిక్కరే అడుగుతున్నారట. అభ్యర్థులు కూడా ఓటరు కోరిన విలువైన మద్యాన్ని ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అందరి దృష్టి దేవునిపల్లి పైనే..
కామారెడ్డి బల్దియాలో విలీనమైన దేవునిపల్లి గ్రామంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ నాలుగు వార్డులుండగా.. అన్నీ మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ స్థానం మహిళకు కేటాయించడంతో కాలం కలిసి వస్తే ఇక్కడినుంచి గెలిచినవారికే బల్దియా పాలన పగ్గాలు అందే అవకాశాలున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● విలీన గ్రామంలో నాలుగు వార్డులు ● అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్ ● కాలం కలిసొస్తే చైర్పర్సన్ అయ్యే అవకాశంకామారెడ్డి పట్టణానికి ఆనుకుని ఉన్న దేవునిపల్లి గ్రామం కొన్ని దశాబ్దాలపాటు ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది. నియోజకవర్గాల సర్దుబాటు జరిగినపుడు కామారెడ్డి నియోజక వర్గంలోకి మారింది. కామారెడ్డి పట్టణం విస్తరించే క్రమంలో మున్సిపాలిటీలో విలీనమైంది. దేవి విహార్, కాకతీయనగర్, మధురానగర్, పదహారిళ్ల పోర్షన్, బ్రహ్మంగారి గుడి ఏరియా, జీవదాన్ కాలనీ, విద్యుత్ కాలనీ, బీడీ కాలనీ, సాయి సద్గురు కాలనీ... ఇలా దేవునిపల్లి శివారు అంతా పట్టణంలో కీలకమైన ప్రాంతంగా ఎదిగింది. దీనికి తోడు మెడికల్ కాలేజీ కూడా అక్కడే ఏర్పాటు కావడం, భారీ వెంచర్లు రావడం, విల్లాలు, అపార్టుమెంట్ల నిర్మాణాలు సాగుతుండడంతో దేవునిపల్లి శివారు అంతా కాస్ట్లీగా మారింది. గత మున్సిపల్ పాలక వర్గం పదవీ కాలం ముగియకముందు నుంచే ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకున్న వారు సేవా కార్యక్రమాలతో జనంలో ఉన్నారు. కొన్ని వార్డుల్లో ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి మరింత ఖర్చు పెడుతున్నారు. సంఘాలు, సిండికేట్లు, కులాల పేరుతో ఓట్ల కొనుగోలు దందా నడుస్తోంది.దేవునిపల్లి గ్రామందేవునిపల్లి పరిధిలోని నాలుగు వార్డుల నుంచి పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులు కాలం కలిసొస్తే మున్సిపల్ చైర్పర్సన్ పీఠం మీద కూర్చునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇంట గెలవాలన్న పట్టుదలతో అభ్యర్థుల తరపున వారి భర్తలు చెమటోడుస్తున్నారు. ఏ అవకాశాన్ని వదలకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎంత ఖర్చు చేయడానికయినా వెనకాడడం లేదని తెలుస్తోంది. -
6న సీఎం రేవంత్రెడ్డి పర్యటన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి ఈ నెల 6వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం అయ్యాక రేవంత్రెడ్డిది మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్ గ్రామం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్రెడ్డి మంగళవారం సభాస్థలి వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవతంరెడ్డి జి ల్లా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం చేసే కీల కమైన ప్రకటనలు చేయనున్నారన్నారు. సుమారు 50వేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం పర్యటన చారిత్రక ఘట్టం కానుందన్నారు. జిల్లా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారివెంట నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, డీసీసీ కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి, బీరెడ్డి సంతోష్రెడ్డి, జావెద్ అక్రమ్, కేశాపూర్, బర్థిపూర్, ఽకంజర్, ధర్మారం సర్పంచ్లు గంగారెడ్డి, భాస్కర్, రాకేశ్యాదవ్, వాసుబాబు, రూరల్ యూత్ నాయకుడు నరేశ్, పెంటాజీ తదితరులు ఉన్నారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపు -
ముక్కలుగా కోసి.. చెత్తకుప్పలో వేసి
కామారెడ్డి క్రైం: ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా కోసి.. సంచిలో మూటకట్టి చెత్తకుప్పలో వేసిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పట్టణంలోని అశోక్నగర్ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో చెత్తాచెదారం వేస్తుంటారు. ఉద యం ఓ సంచిలో పురుషుడికి సంబంధించిన నడుము నుంచి కింది శరీర భాగాన్ని స్థానికులు గమనించారు. వారి సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఎక్కడో వ్యక్తిని హత్య చేసి మూటను ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరాన్ని రెండు, లేదా మూడు ముక్కలు చేసి ఓ భాగాన్ని ఇక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తు న్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆ«ధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. -
లంకె బిందెలంటూ మృత్యుభయం చూపి..
● క్షుద్రపూజల పేరిట రూ.లక్షలు వసూలు ● నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: ‘‘మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి. అందుకే మీకు తరచుగా అనారోగ్య, ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటిని తీసివేయకపోతే మీ కుటుంబంలో మరణాలు తప్పవు’’ అంటూ భయపెడుతూ.. క్షుద్ర పూజల పేరుతో లక్షలు దోచుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్దిరోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు నటిస్తూ ఓ వ్యక్తి వచ్చాడు. మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, వాటి కారణంగానే కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతోందని చెప్పాడు. వాటిని తీయకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయపెట్టాడు. క్షుద్రపూజలు చేసి లంకె బిందెలు తీసివేస్తానని నమ్మించాడు. దీనికి రూ.8.20 లక్షలు డిమాండ్ చేశాడు. బీరవ్వ కుటుంబం ఇటీవల సదరు వ్యక్తికి కామారెడ్డిలో డబ్బులు అందించింది. తర్వాత అతడు ఫోన్ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి బీరవ్వ గతనెల 26 న కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ప్రధాన నిందితుడిని సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సారెడ్డిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదు, సెల్ఫోన్, రెండు లగ్జరీ కార్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న అతడి ఇద్దరు అనుచరులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని గుప్త నిధులు, పూజల పేరిట ఈ ముఠా చాలా మంది నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతేడాది కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి భిక్షాటన కోసం వెళ్లి లంకె బిందెల పేరిట ఇదే తరహాలో రూ.14 లక్షలు డిమాండ్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.2.93 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఇలా ఇతర జిల్లాల్లోనూ ఈ ముఠాపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ నరహరి, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
బులియన్ మార్కెట్లో అయోమయం!
బంగారం, వెండి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రికార్డుల మీద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలను చూసి సామాన్యులే కాదు ధనవంతులు కూడా బెంబేలెత్తిపోయారు. ఇటీవల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.86 లక్షలకు చేరింది. త్వరలోనే రూ.2 లక్షలకు చేరుతుందని భావించారు. అయితే మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు పడిపోతూ సామాన్యులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. కామారెడ్డి మార్కెట్లో శనివారం 10 గ్రాముల ధర రూ.1.52 లక్షలకు పడిపోయింది. సోమవారం కొంత కోలుకుని రూ.1.57 లక్షలకు చేరుకుంది. అయినా గరిష్ట స్థాయినుంచి సుమారు రూ. 30 వేలు పడిపోయినట్లే.. బంగారం ధర అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోయిన నేపథ్యంలో మార్కెట్లో అయోమయం నెలకొంది. వ్యాపారులతో పాటు కొనుగోలుదారులకూ ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొనుగోళ్లకు ఆచితూచి అడుగులు ఈనెల మూడో వారంలో శుభముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలకు తేదీలు నిర్ణయించుకున్నారు. అయితే ఆభరణాలు చేయించడానికి బంగారం కొనే విషయంలో చాలా మంది ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లిళ్ల కోసం ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారు ధర పెరిగినా, తగ్గినా ఫరక్ పడదన్నట్టుగా ఉంటే, కొందామని వాయిదా వేసుకున్న వారు ధరలను చూసి హడలిపోయారు. ఆలోచిస్తుండగానే ధరలు పడిపోయాయి. ఎప్పుడు పడిపోతాయో, ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో నెలకొన్న అయోమయ పరిస్థితుల్లో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని, కొందరు వచ్చి బంగారం, వెండి ధరలు ఎంత అని అడిగి తెలుసుకుని వెళ్తున్నారని పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నాలుగైదు రోజులుగా బంగారం మార్కెట్లో అయోమయం నెలకొందని అభిప్రాయపడ్డారు. ధర ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ధరల హెచ్చుతగ్గులతో వ్యాపారులూ ఆందోళనతో ఉన్నారు. అమ్మకాలు తగ్గిపోయి దుకాణాలు వెలవెలబోతుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.అడ్డగోలుగా పెరిగిన బంగారం, వెండి ధరలతో ఆభరణాలు తయారు చేయించుకునేవారు తగ్గిపోయారు. దీంతో స్వర్ణకారులకు పని కరువైంది. గతంలో పెళ్లిళ్లకు ఐదు తులాల నుంచి పది తులాల వరకు ఆభరణాలు చేయించేవారు. ఓ స్థాయి ఉన్న వారు 10 తులాల నుంచి 20 తులాల వరకు ఆభరణాలు చేయించుకునేవారు. పేద, మధ్య తరగతి ప్రజలు స్థానికంగా ఉన్న స్వర్ణకారుల వద్ద ఆభరణాలు తయారు చేయించుకుంటే, ఉన్నత వర్గాలు మాల్స్కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం ధరలు పెరిగిన తరువాత పని కరువైందని పలువురు స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెండి ధర కూడా సరికొత్త రికార్డులను సృష్టించిన తర్వాత అమాంతం పడిపోయింది. మూడు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4.10 లక్షలకు చేరింది. కనీసం కాళ్లకు మట్టెలు, పట్టీలు కూడా చేయించుకోలేని పరిస్థితి వచ్చిందని పలువురు సామాన్య మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సోమవారం ఉదయం ధర కిలోకు రూ. 2.50 లక్షలకు పడిపోయింది. మధ్యాహ్నానికి కొంత తేరుకుని రూ.2.60 లక్షలకు, సాయంత్రానికి రూ.2.80 లక్షలకు చేరుకుంది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో సామాన్యులు కాస్త ఊరట చెందుతున్నారు.ఇటీవలి కాలంలో పూటకో రికార్డు గరిష్టానికి చేరుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు.. దిగివస్తున్నాయి. అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోతున్న ఆయా లోహాలను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం జనం ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి అడ్డగోలుగా పెరిగి అమాంతం పడిపోతున్న బంగారం, వెండి ధరలు కొనుగోలుకు వెనకాముందవుతున్న జనం వెలవెలబోతున్న దుకాణాలు -
‘ఖైదీలకు న్యాయ సహాయం అందేలా చూడాలి’
కామారెడ్డి టౌన్ : ఖైదీల మానవ హక్కుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన వారికి న్యాయ సహాయం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్ఎస్ఏ) కార్యదర్శి టి.నాగరాణి ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును సమీక్షించారు. అనంతరం ఖైదీలతో ప్రత్యక్షంగా సమావేశమై వారికి ఉన్న చట్టపరమైన హక్కులు, డీఎల్ఎస్ఏ ద్వారా లభించే వివిధ ఉచిత సేవలపై అవగాహన కల్పించారు. జైలు వంటగది, పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రతపై ఆరా తీశారు. ఫిర్యాదు పెట్టెలను తనిఖీ చేసి, ఖైదీల సమస్యల పరిష్కారానికి తగిన సూచనలిచ్చారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మాయ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ సంజీవ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. ‘జాతీయ విద్యా విధానం–2020’ పై నిర్వహించే సదస్సుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు జయప్రకాశ్, సుధాకర్, శ్రీనివాస్రావు, రాజేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: కేంద్రం ఇచ్చిన నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డిలో అమృత్ 2.0 పనులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.30 కోట్లతోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 మున్సిపాలిటీలకు రూ.2,870 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసిందన్నారు. ఎల్లారెడ్డిలోని మొత్తం 12 వార్డులలో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. అత్యధికంగా సీట్లు సాధించి బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, రవీందర్రావు, బాలకిషన్, నక్క గంగాధర్, నర్సింలు, రాజేష్, వంగపల్లి కాశి, రాంప్రసాద్ తదితరులున్నారు. -
‘సామాజిక అంశాలపై పట్టు సాధించాలి’
కామారెడ్డి టౌన్: పాఠశాల దశ నుంచే సామాజిక అంశాలపై పట్టు సాధించాలని, అప్పుడే దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారగలుగుతారని డీఈవో రాజు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం(ఎస్టీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంఘికశాస్త్రంలో సరైన అవగాహన కలిగి ఉంటే సమాజంలో బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. టాలెంట్ టెస్ట్లో జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి సుమారు 170 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిలో వివిధ విభాగాల నుంచి కర్ల సుప్రియ, జి.శైలజ, బి.అరుణ్, జె.శ్రీకాంత్, కె.సంజన, శివశక్తి, బి.నందిని, సంజన, ఆర్.శ్రీదీప్, రఫత్, మహిన్ ఖానమ్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని టీఎస్ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్ కుమార్ తెలిపారు. వీరు ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్టులో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి నూతిపల్లి బాలరాజ్, కోశాధికారి రాజశేఖర్, ఉపాధ్యక్షురాలు విజయ కుమారి, టెక్నికల్ విభాగం ప్రతినిధి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డి కాంగ్రెస్లో వర్గపోరు లేదు
● కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం ● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని, అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో జిల్లా అభ్యర్థులకు సంబంధించిన బీఫాంలను డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కేడర్ అంతా పూర్తి సమన్వయంతో ఉందన్నారు. విభేదాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగి, అన్ని వార్డుల్లో జయకేతనం ఎగురవేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాన్సువాడ గడ్డపై కమలం జెండా ఎగరాలి’
బాన్సువాడ : బాన్సువాడ బల్దియాపై కమలం జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పిలుపునిచ్చారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫాంలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర ముఖ్య నాయకులు వస్తారన్నారు. బీజేపీలో చేరిన ఉద్యమకారుడు మహేశ్ బాన్సువాడ : బాన్సువాడకు చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు చాకలి మహేశ్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మహేశ్ 19వ వార్డునుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, నాయకులు చీదరి సాయిలు, శంకర్గౌడ్, చిరంజీవి, శ్రీనివాస్, సాయిరెడ్డి, డాకయ్య, పాశం భాస్కర్రెడ్డి, చీకట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
రెండో దశ ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగింది. 239 మంది పీవోలు, 239 మంది ఏపీవోలు, 645 మంది ఇతర పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపాలిటీలను కేటాయించారు. మరికొందరిని రిజర్వ్లో ఉంచారు. విదులు కేటాయించిన అధికారులకు బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ తెలిపారు. కామారెడ్డి, బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, బాన్సువాడ మున్సిపల్, ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయానికి సమీపంలోని ఏఎంసీ గోదాం, బాన్సువాడ డిగ్రీ కళాశాల, బిచ్కుంద మార్కెట్ యార్డు, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, సీపీవో రఘునందన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజకీయ కుటుంబాల నుంచి పోటీలో కోడళ్లు
● 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో షెట్కార్, నాల్చర్ కుటుంబాలు ● మామ, భర్త ఆశయాలు నెరవేరుస్తాం బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద పట్టణానికి చెందిన రెండు రాజకీయ కుటుంబాల నుంచి ఇద్దరు కోడళ్లు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్వర్గీయులు మల్లికార్జునప్ప షెట్కార్, నాల్చర్ శ్రీహరి ఇద్దరూ జుక్కల్ నియోజకవర్గంలో 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో రాణిస్తూ జిల్లాతో పాటు రాష్ట్రస్దాయి వరకు ఎదిగి గుర్తింపు పొందారు. నాల్చర్ ఫ్యామిలీ.. నాల్చర్ శ్రీహరి రెండో కోడలు శిరీష 3వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నాల్చర్ శ్రీహరి 1978లో మద్నూర్ తాలుకా ఎల్ఎండీ చైర్మన్గా, 1981లో బిచ్కుంద సొసైటీ చైర్మ న్గా, 1990లో ఎంపీపీ, 1996లో జెడ్పీటీసీ, రెండు పర్యాయాలు ఏఎంసీ చైర్మన్గా వివిధ హోదాలలో పని చేశారు. అలాగే పెద్ద కోడలు నాల్చర్ భారతి రాజు 2019లో జెడ్పీటీసీగా పని చేశారు. రెండో కుమారుడు బాలాజీ 2025 వరకు బిచ్కుంద సొసైటీ చైర్మన్గా కొనసాగారు. మామ శ్రీహరి, భర్త బాలాజీ అడుగుజాడలో నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేయడానికి రాజకీయాల్లో అడుగు పెట్టానని నాల్చర్ శిరీష తెలిపారు. షెట్కార్ వారసురాలిగా సీమా రమేశ్.. మల్లికార్జునప్ప షెట్కార్ కుటుంబం నుంచి రెండో కోడలు సీమా రమేష్ షెట్కార్ 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014లో సీమా షెట్కార్ ఎంపీటీసీగా గెలుపొందారు. మల్లికార్జునప్ప షెట్కార్ మద్నూర్, బిచ్కుంద ఏఎంసీ చైర్మన్గా కొనసాగారు. మామ మల్లికార్జునప్ప, భర్త రమేష్ షెట్కార్ వారసురాలుగా సీమా షెట్కార్ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వారి అడుగు జాడలోనడిచి ఆశయా లు నెరవేరుస్తానంటున్నారు. బిచ్కుందకు మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే చైర్పర్సన్గా చేయ డానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రెండు కుటుంబాలు ప్రజా సేవకే అంకితం అంటున్నారు. నాల్చర్ శిరీష, 3వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సీమా షెట్కార్, 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీబీపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం ఆపూర్వ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చదువుకునే రోజుల్లో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకున్నారు. 2028 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బెజుగంచెరువుతండాలో గల జగదాంబ సమేత సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం తండావాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పురోహితులు శివకుమార్ శర్మ, పూజారి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవాచనం, విశేష అభిషేకం, హోమాలు–పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి పౌర పీఠాధిపతి బాబుసింగ్ మహారాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తండావాసులు మద్యం, ఇతర దురవాట్లను వీడి సన్మార్గంలో నడవాలన్నారు. భగవంతుడిని నమ్ముకొని తల్లిదండ్రుల సేవలో చక్కని జీవనం గడపాలని చెప్పారు. భద్యానాయక్, సర్పంచ్లు భాస్కర్, బాల్యానాయక్, ప్రభుగౌడ్, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎస్సై భార్గవ్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభమైన ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు దోమకొండ: ముత్యంపేట గ్రామ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతిపూజ, సాయంత్రం శావ కార్యక్రమం నిర్వహించారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్, లక్ష్మీనారాగౌడ్, అధ్యక్షులు అనిల్గౌడ్, ఉపాధ్యక్షులు ప్రకాష్ గౌడ్, కార్యదర్శి చంద్రగౌడ్, కోశాధికారి నరేశ్ గౌడ్, కమిటీ డైరెక్టర్లు, తదితరులున్నారు. ఘనంగా మల్లన్న జాతర భిక్కనూరు: గుర్జకుంట శివారులో ఉన్న మల్లన్న ఆలయం వార్షికోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచే యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా భిక్కనూరు గ్రామ పంచాయతీ 14వ వార్డు సభ్యుడు జ్ఞానప్రకాశ్రెడ్డి భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి బోనాలను సమర్పించారు. ఆధ్యాత్మికం -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
కామారెడ్డి క్రైం: తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులిద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. గత నెల 2 న మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం అపహరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన చిల్లకూరి క్రిష్ణారెడ్డి అలియాస్ చండీక్రిష్ణను పోలీసులు 20 రోజుల క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నిందితులు మూడవత్ అంజియా, సత్యనారాయణ (దొంగ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి)లను కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద అనుమాన్పాదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన నిందితులు క్రిష్ణారెడ్డి, మరోవ్యక్తి అయిన ప్రభులతో కలిసి తాళం వేసిన షట్టర్లు, ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన బంగారు ఆభరణాలను ముత్తూట్, ఇతర ఫైనాన్స్లలో తాకట్టు పెట్టడం, గుర్తు తెలియని వ్యాపారులకు అమ్మడం చేస్తారని, వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారని విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. అంజియాపై ఏపీ, తెలంగాణల్లోని పలు పీఎస్లలో 5, క్రిష్ణారెడ్డిపై 8 కేసులు ఉన్నట్లు వివరించారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ నరహరి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సిబ్బందిని అభినందించారు. బంగారం గొలుసు చోరీ కేసులో.. వృద్ధురాలిని నమ్మించి బంగారం గొలుసు అపహరించిన కేసులో నిందితుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డీపీవోలో సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని భరత్ రోడ్కు చెందిన బట్టు నర్సవ్వ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తోంది. రెండు రోజుల క్రితం భూపుత్రమ్మ కల్యాణ మండపం సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించి ఇంటికి వెళ్తుండగా గాంధారి మండలం జెమిని తండాకు చెందిన రత్లా రవి మాటలు కలిపాడు. ఆమె సరిగ్గా నడవలేని స్ధితిలో ఉండటాన్ని గమనించి బైక్పై ఇంటివద్ద దింపుతానని నమ్మించాడు. ఇంటికి తీసుకువెళ్లిన అనంతరం వృద్ధురాలికి మళ్లీ కల్లు తాగించి, మత్తులో ఉన్న ఆమె మెడలో నుంచి తులం బంగారు గుండ్లను లాక్కొని పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రవిని గుర్తించి సోమవారం పట్టుకున్నారు. పట్టణ పోలీసులను ఎస్పీ అభినందించారు. -
క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మల్లెపూల శ్రీనివాస్(46) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. మూడు రోజుల క్రితం మండలంలోని నిజాంపూర్–తుంగిని గ్రామాల మధ్య రహదారిపై రెండు బైకులు ఢీకొనడంతో నవీపేటకు చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందగా మల్లెపూల శ్రీనివాస్, నరేశ్ గాయపడ్డారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మల్లెపూల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపి ఒకరికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష సాయితల్ప సాయి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఉద్మీర్గల్లీకి చెందిన గంగాధర్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకొని బోధన్ కోర్టులో హాజరుపర్చారు. వారం రోజుల జైలు శిక్షను విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ గ్రామశివారులో ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు చేసి పేకాడుతున్న 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వారి నుంచి రూ.3,200, మూడు ఫోన్ల్, మూడు బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ షాప్లో పేకాడుతున్న ఆరుగురిని పట్టుకొని వారి నుంచి రూ.3,480 నగదు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
సంక్షిప్తం..
మండల కార్యాలయంలో ప్రజావేదిక బాన్సువాడ రూరల్: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉపాధి హామీ ప్రజావేదికను నిర్వహించారు. ఏపీడీ వామన్రావు హాజరై వారం రోజుల పాటు ఎస్ఆర్పీ పర్యవేక్షణలో డీఆర్పీలు క్షేత్రస్థాయిలో చేపట్టిన విచారణపై చర్చించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు బా న్సువాడ మండలంలో 4.36 కోట్ల పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. చేపట్టిన పనులకు చె ల్లించిన బిల్లులు,లేబర్పేమెంట్ తదితర అంశాలపై గ్రామ స్థాయిలో జనవరి 22 నుంచి ఈనెల 1 వరకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టారన్నారు. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి నిధులు రికవరీ చేస్తామన్నారు. ఎస్ఆర్పీ మౌనిక, ఎంపీడీవో ఆనంద్, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సోషల్ టాలెంట్ టెస్ట్లో మాచారెడ్డి విద్యార్థినికి ప్రథమ స్థానం మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్లో మాచారెడ్డి ఉన్నతపాఠశాల విద్యార్థిని విష్ణుప్రియ ప్రథమ స్థానం సాదించింది. సోమవారం విద్యార్థినిని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. హెచ్ఎం వెంకటాచారి, గైడ్ టీచర్లు శ్యాంగౌడ్, కమల ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం సర్పంచ్ వినోద పంపిణీ చేశారు. గ్రామంలోని కొర్వి లావణ్య, గొల్ల నర్సవ్వలకు రూ.19 వేల చొప్పున మంజూరైన చెక్కులను అందజేశారు. ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులున్నారు. సంగోజీవాడిలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు గైని శివాజీ అన్నారు. సంగోజీవాడిలో సోమవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు లింగం, హైమద్, లక్ష్మణ్రావు, బాలురాజు, రవి, రఫీ, ఫారూక్, సుదర్శన్, నర్సిములు, బాలునర్సు, తదితరులు పాల్గొన్నారు. పిట్లం పంచాయతీ పాలకవర్గ సమావేశం పిట్లం(జుక్కల్): పిట్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమ్మరి శేఖర్ అధ్యక్షతన పాలక వర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రా మంలో చేపట్టే పారిశుధ్య పనులు, మురికి కాల్వల నిర్మాణం, పంచాయతీ ఆదాయ, వ్యయాలు తదితరాల గురించి చర్చించారు. పలువురు పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని ఆపివేయాలని పాలకవర్గ సభ్యులు పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఉప సర్పంచ్ అవేజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ఆటో సౌకర్యం లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లికి చెందిన విద్యార్థులు ప్రతి రోజూ శెట్పల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లడానికి సోమవారం నుంచి ఉచిత ఆటో సౌకర్యం కల్పించినట్లు సర్పంచ్ గోనె లింగం తెలిపారు. విద్యార్థులు ప్రతి రోజూ నడుచుకుంటూ కిలో మీటర్ మేర వెళ్తున్నారు. దాంతో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో తమ విలువైన చదువు కోల్పోతున్నారు. విషయం తెలుసుకున్న నూతన సర్పంచ్.. అయ్యపల్లి నుంచి శెట్పల్లి పాఠశాలకు వెళ్లడానికి ఆటోను ఏర్పాటు చేశారు. స్థల పరిశీలన గాంధారి: మండల పరిధిలోని నేరల్, గౌరారం గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల కోసం బుధవారం స్థలాలను పరిశీలించినట్లు ఏపీఎం ప్రసన్న కుమార్ తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి స్థలాలను ఐకేపీకి అప్పగించారని ఏపీఎం తెలిపారు. సీసీ రాములు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుటుంబకలహాలతో భర్త ఆత్మహత్య
● భార్యను కాపాడిన స్థానికులు ● చిన్న మల్లారెడ్డి చెరువు వద్ద ఘటన కామారెడ్డి క్రైం: భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తాడ్వాయి మండలం సోమారం గ్రామానికి చెందిన చింతమడక రాజేశ్వర్ (45), అతని భార్య అర్పిత సోమవారం కామారెడ్డికి వచ్చి బైక్పై తిరిగి వెళ్తుండగా చిన్న మల్లారెడ్డి కల్లు దుకాణం వద్ద ఆగారు. అక్కడ కుటుంబ విషయాలపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన రాజేశ్వర్ పక్కనే ఉన్న చెరువులో దూకేశాడు. గమనించిన అర్పిత కూడా చెరువులోకి దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రాజేశ్వర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్: హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. జనవరి 22న ముజాయిద్నగర్లోని బాబాకిరాణం షాపు వద్ద గొడవ జరిగింది. ఈ వ్య వహరంలో జహీర్ అనే వ్యక్తికి కత్తిపోట్లు జరిగాయి. ఘటనలో జునేద్, మునవర్, అబ్దుల్వహీద్, మహ్మద్ షేక్ రఫీక్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. గౌస్, ఫజీల్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి కత్తి, రెండు రాడ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
కాలకృత్యాలు తీర్చుకునేందుకూ ఇబ్బందులే
● వడ్లం జెడ్పీహెచ్ఎస్లో అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం ● ఇబ్బంది పడుతున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులుపెద్దకొడప్గల్(జుక్కల్): వడ్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికలతో పాటు, మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు చెందిన పాత మూత్రశాలలు, మరుగు దొడ్లు శిఽథిలావస్థకు చేరడంతో రెండు సంవత్సాల క్రితం కూల్చివేశారు. అప్పటి నుంచి పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. రెండు పాఠశాలల్లో కలిపి దాదాపు 250ి మందికిపైగా చదువుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమీపంలోని ఇళ్ల మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. బాలురు పాఠశాల బయటకు చెరువు కట్టవైపు వెళ్తుండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందతున్నారు. జెడ్పీ పాఠశాలలో నూతన మరుగుదొడ్ల నిర్మాణం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రూ.4 లక్షల చొప్పున నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించడంలో సంబంధిత అధికారులు జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ప్రారంభించినా మధ్యలోనే నిలిపి వేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.మేము పేద్ద దేవిసింగ్ తండా నుంచి వస్తాం. మూత్రశాల లు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది కలుగుతుంది. పాఠశాల సమీపంలోని ఇళ్లలోకి వెళ్లి కా లకృత్యాలు తీర్చుకుంటున్నాం. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. – సుజిత, విద్యార్థిని, వడ్లం జెడ్పీహెచ్ఎస్ రూ.4 లక్షలతో రెండు యూ నిట్ల మూత్రశాల, మరుగు దొడ్ల పనులు గతంలో ప్రా రంభించారు. డబ్బులు రాక పోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మరో రూ. 6 లక్షలతో మూడు యూనిట్లు త్వరలో ప్రా రంభం చేస్తున్నారు. నిలిచిపోయిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు పున:ప్రారంభం చే యించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం. – ప్రవీణ్ కుమార్, ఏఈవో, పెద్దకొడప్గల్ -
బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: బీఆర్ఎస్ పార్టీ డైరీలను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నీరడి శంకర్, నల్లవెల్లి అశోక్, కుంబాల రవి, బల్వంత్రావు, పాత హనుమాన్లు, రాజాగౌడ్, రమేష్, సర్పంచ్ చిందం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి
బాన్సువాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని ఎస్జీటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ డిమాండ్ చేశారు. సోమవారం బాన్సువాడలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న ఏఐ జాక్టో ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పేరుతో తెలంగాణలో ఉన్న 35 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొంటున్నాయని, ఎస్జీటీలందరూ అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ సంఘాన్ని కలిసి ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని సూచించాలని, జీవో–25ను మార్చే విధంగా సవరణలు తేవాలని.. ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి చేసేలా అడగాలని అన్నారు. ఎస్జీటీలు పవార్ హీరాలాల్, చింతల విజయ్, వెంకటరమణ, పండరి, శ్రీనివాస్నాయక్, రవి, వాజీద్ తదితరులు ఉన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): తిర్మన్పల్లికి చెందిన ఆరె సంజన, శ్లోక అనే ఇద్దరు విద్యార్థులు సోషల్ టాలెంట్ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం తెలంగాణ సాంఘిక రాష్ట్ర ఉపాధ్యాయుల ఫోరమ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 7న రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బాల్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులను మెమోంటోలతో సత్కరించి అభినందించారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సవితారెడ్డి సోమ వారం బాధ్యతలు తీసుకున్నారు. తాడ్వాయి ఎంపీడీవోగా పనిచేసిన సాజీద్అలీ పదవీ విరమణ పొందడంతో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవోగా పని చేస్తున్న సవితకు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాడ్వాయి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు, అధికారులు అభినందించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలిగా చీనూర్ గ్రామానికి చెందిన మ్యాకల మాధవిని నియమించినట్లు సోమవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్ తెలిపారు. ఈ మేరకు మాధవికి ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, నాయకులు రాంచందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఇమామ్, కిరణ్, మహేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీల్స్... ఏఐ కాల్స్
● పురపోరులో వినూత్నంగా అభ్యర్థుల ప్రచారం ● ఓటర్లను ఆకర్షించేలా సోషల్ మీడియా వాడకం నిజామాబాద్ రూరల్: పురపోరులో అభ్యర్థులు ప్రచారానికి సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. గెలుపే ధ్యేయంగా ఓటర్లను ఆకర్షించేలా సాంకేతికతను వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రీల్స్.. షార్ట్ వీడియోలు ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్స్ సర్వసాధారణం. మున్సిపల్ డివిజన్, వార్డుల్లో ఓటర్లందరూ అభ్యర్థులకు తెలిసే అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరుకు తమ సందేశం చేరేలా అభ్యర్థులు సోషల్ మీడియాను ఎంచుకున్నారు. ఇన్స్ట్రాగామ్లో రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా షార్ట్స్ చేస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. స్థానిక సమస్యలపై వివరిస్తూ తమను గెలిపిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వార్డులు, డివిజన్లో రోజూవారీగా చేస్తున్న ప్రచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రచారానికి ఉపయోగిస్తున్న కరపత్రాలపై క్యూఆర్ కోడ్లను ముద్రిస్తూ వాటి ద్వారా తమ వీడియో సందేశాన్ని ఓటర్లకు చేరవేస్తున్నారు. ఏఐ కాల్స్... అభ్యర్థులు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను సైతం విరివిగా వాడుతున్నారు. అభ్యర్థుల స్వరంతో ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఏఐ ద్వారా ప్రచార పోస్టర్లను తయారు చేయిస్తున్నారు. -
మిశ్రమ స్పందన
● జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు కరువు ● జిల్లాకో బాలికల హాస్టల్తో ప్రయోజనం ● కేంద్ర బడ్జెట్పై భిన్నాభిప్రాయాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు బడ్జెట్ బాగుందంటుండగా.. మరికొందరు పెదవి విరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోపాటు వ్యవసాయ రంగానికి కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. అయితే జిల్లా విషయానికి వస్తే ప్రత్యేకంగా కేటాయింపులేమి లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే వంతెనలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. రింగ్ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వంటి వాటికి ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయి. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలకు సంబంధించి కీలకమైన కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు ఉన్నా నిధుల కేటాయింపు జరగడం లేదు. జిల్లా కేంద్రాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తే నిధులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నా, బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు.ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించారు. ఇది బాలికల విద్య అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేస్తే బాలికా విద్యకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందన్న అభిప్రయాం వ్యక్తమవుతోంది.కేంద్ర బడ్జెట్ మైనారిటీ ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. బడ్జెట్లో రూ. 3,400 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.50 కోట్లు మాత్రమే పెరిగింది. దేశ జనాభాలో 15 శాతం ఉన్న మైనారిటీలకు ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. రాష్ట్రాలు కేటాయించినంత కూడా కేంద్రం ఇవ్వకపోవడం శోచనీయం. తెలంగాణపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. – షబ్బీర్అలీ, ప్రభుత్వ సలహాదారు -
ఆస్పత్రిలో చిన్నారి మృతి
కామారెడ్డి టౌన్: ఆ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయా యి. కుక్క కాటుకు వ్యాక్సిన్ తీసుకున్న ఆ బాలిక.. కొద్దిసేపటికే తండ్రి భుజాలపైనే కన్ను మూసింది. దీంతో తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని రాగా నే దేవుని చెంతకు వెళ్లావా చిట్టి తల్లి అంటూ ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప నగర్లో నివాసం ఉంటున్న కల్లూరి అర్చన రమేష్ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు క్రితర్ష ఉన్నారు. గత నెల 25న పాప ఇంటి ముందు ఆడుతుండగా వీధి కుక్క కరిచింది. దీంతో అదేరోజు స్థానిక జీజీహెచ్లో రేబిస్ వ్యాక్సిన్ మొదటి డోసు, 28న రెండో డోసు ఇప్పించారు. ఆదివారం మధ్యాహ్నం మూడో డోసు ఇప్పించిన కొద్దిసేపటికే పాప తల మెడ కిందకు వాల్చేసి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే పాపను తండ్రి రమేష్ ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మరణవార్త విన్న మృతురాలి బంధువులు వందలాది మంది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతదేహంతో ఎమర్జెన్సీ వార్డులో బైఠాయించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ వైద్యులు, సిబ్బందిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని వైద్యులను ఓ గదిలో ఉంచి రక్షణ కల్పించారు. వైద్యులను తమకు అప్పగించాలని పోలీసులతో బంధువులు వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్, అద్దాలు, మందులు, ఈసీజీ మిషన్, ఇంజెక్షన్ వాయిల్స్ను ధ్వంసం చేశారు. సుమారు 4 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఆర్ఎంవో సంతోష్, పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ విషయమై ఆర్ఎంవో సంతోష్ను వివరణ కోరగా.. సాధారణంగా రేబిస్ వ్యాక్సిన్ వికటించే అవకాశాలు తక్కువని, మరణానికి గల అసలు కారణాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన ఫర్నిచర్ ధ్వంసం -
నామినేషన్ల విత్డ్రాకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తవడంతో ఎన్నికల ప్రచారంపై పార్టీలు ఫోకస్ చేశాయి. ఇదే సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసిన ఆయా పార్టీలు.. జాబితాలను వెలువరించనప్పటికీ పోటీ నుంచి తప్పుకోవాలంటూ పలువురిని బుజ్జగిస్తున్నాయి. దీంతో తమకు టికెట్ రాదని తేలిపోవడంతో వారు విత్డ్రాకు ససేమిరా అంటున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానైనా బరిలో ఉంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 49 వార్డులున్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ లో టికెట్లకోసం భారీ పోటీ ఉంది. అన్ని వార్డుల్లో పోటాపోటీగా నలుగురైదుగురు నామినేషన్లు వేయడంతో అభ్యర్థిగా ఎంపిక చేసిన వారిని వదిలి, మిగతా వారిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. అయితే తాము పోటీ నుంచి తప్పుకునేది లేదంటూ పలువురు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పట్టణంలో సగానికి పైగా వార్డుల్లో టికెట్ దక్కని వారు రెబల్గా బరిలో నిలుస్తారని స్పష్టమవుతోంది. కొన్ని వార్డుల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ముగ్గురు, నలుగురు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలోనూ కొన్ని వార్డుల్లో పలువురు టికెట్ల కోసం పోటీపడ్డారు. ఓ వార్డులో టికెట్ రాదని తెలిసి సదరు నేత బీఆర్ఎస్లో చేరాడు. మరో వార్డులో నామినేషన్ వేసిన బీజేపీ నేత.. ఇండిపెండెంట్గానైనా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉండగా అధికార పార్టీలో పలువురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. టికెట్టు రాదని ముందే ఊహించిన ఒకరిద్దరు నేతలు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. బాన్సువాడలో కాంగ్రెస్లో రెండు వర్గాలకు చెందిన వారు నామినేషన్లు వేశారు. టికెట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. టికెట్ రాని వారు రెబల్గా బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిచ్కుందలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా చేపట్టాయి. తిరుగుబాట్లు తప్పవా... టికెట్లు దక్కని వారు చాలాచోట్ల రెబల్గా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వారిని బుజ్జగించడానికి ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఉపసంహరణకు మంగళవారం వరకు అవకాశం ఉండడంతో సోమవారం అందరితో మాట్లాడి ఉపసంహరింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల తిరుగుబాట్లు తప్పేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుజ్జగింపులకు తలొగ్గని నేతలు అవకాశం ఇవ్వాలని డిమాండ్ రెబల్గానైనా బరిలో ఉంటామంటున్న పలువురు -
క్రైం కార్నర్
గొర్రెను కాపాడబోయి కాపరి మృతి బీబీపేట: గొర్రెను కాపాడబోయి గొర్ల కాపరి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్ల లింగం(55) గ్రామ శివారులో గొర్లను మేపేందుకు వెళ్లాడు. యాడారం గ్రామ చెరువు వద్ద చెరువు దాటే క్రమంలో ఓ గొర్రె అందులో పడగా దానిని కాపాడేందుకు లింగం చెరువులోకి దిగాడు. దీంతో నీట మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
బెంబేలెత్తిస్తున్న వానరాలు, కుక్కలు
రామారెడ్డి: వానరమూక రోడ్డుపై తిష్ట వేసి అటుగా వెళ్లే వారిని భయాందోళనకు గురి చేస్తుండగా, మండల కేంద్రం రామారెడ్డిలో కుక్కల గుంపులు రోడ్లపై తిష్ట వేసి ప్రజలను భయపెట్టిస్తున్నాయి. రామారెడ్డిలో ఇటీవల కాలంలో 15 మందిని వీధి కుక్కలు గాయపరిచాయి. రామారెడ్డి మండలం మద్దికుంట మర్రి నుంచి రెడ్డిపేట ఎల్లమ్మ గుడి వరకు కిలోమీటర్ మేర వానరమూక గుంపులు గుంపులుగా రోజూ ఉదయం నుంచి తిష్ట వేస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లడానికి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు పెద్ద వాహనాలు వచ్చేవరకు వేచి చూసి వాటి వెనక వెళ్తున్నారు. ఆ వానర గుంపులను నిలువరించడం ఎవరికి సాధ్యం కాకపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నోటీసులు ఇవ్వడం కేసీఆర్ను అవమానించడమే
● ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఎల్లారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆరోపించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీచౌక్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చే శారు.అనంతరం జాజాల మాట్లాడుతూ.. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం ఆయనను అవమానించడమేనని అన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్ర భుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు. ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి తమ పార్టీ నాయకులపై విచారణల పేరిట దా డులకు దిగడం తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఎ న్ని కుట్రలు, డైవర్షన్లు చేసినా ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు.జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు,బీఆర్ఎస్ నాయకులు జలంధర్రెడ్డి, ము దాం సాయిలు, సతీష్, మహేష్ తదితరులున్నారు. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
బీబీపేట: మల్కాపూర్లో ఆదివారం సీఆర్ఆర్ నిధులు రూ.20 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. సర్పంచ్ రామగల్ల నాగరాజు, బీజేపీ నాయకుల చేతులు మీదుగా పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రవీణ్, స్వామిగౌడ్, రంజిత్గౌడ్, పోస శివకుమార్, సంతోష్ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్కు చెందిన 1989–90 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోటుకు చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరి అదృశ్యం నిజామాబాద్ అర్బన్: నగరంలోని రెండో టౌన్ పో లీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఆదివారం తెలిపారు. హైమద్పుర కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ నదీమ్ గత నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రా లేదు.కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియలేదు.నదీమ్ అన్న కొడుకు రెహమాన్ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు
● కామిశెట్టిపల్లిలో కనుమరుగైన పల్లె ప్రకృతి వనం ● పట్టించుకోని అధికారులు, పంచాయతీ సిబ్బంది నస్రుల్లాబాద్: గత ప్రభుత్వం హయాంలో అటవీ సంపదను పెంచాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పల్లె ప్రకతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో మొక్క నాటడానికి, పెంచడానికి నిధులు కేటాయించి వాటిని సంరక్షించడానికి రూ.లక్షలు వెచ్చించారు. కాని అధికారుల పర్యవేక్షణ కరువై.. పంచాయతీ సిబ్బంది పట్టింపులేని చర్యలతో ప్రభుత్వ ఆశయానికి గండి పడింది. ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరు అందక ఎండి పోతున్నాయి. సాధారణంగా ఒక మొక్కను నరికితే పంచాయతీ సిబ్బంది జరిమానాలు విధించి ముక్కు పిండి వసూలు చేస్తారు. కాని వారి నిర్లక్ష్యానికి వందల సంఖ్యలో ఉన్న మొక్కలు ఎండిపోతున్నా వారిని ప్రశ్నించే వారు కరువయ్యారు. కామిశెట్టిపల్లిలో గత పాలకులు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. నస్రుల్లాబాద్ మండలం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి–765డి వెడల్పు కారణంగా ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయింది. కనీసం అధికారులకు మరో చోట మొక్కలను నాటించాలన్న ఆలోచన లేకపోవడం గమనర్హం. నిర్వహణ నామ మాత్రమేనా..? నర్సరీల్లో మొక్కలను పెంచాలని అధికారులు పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే నాచుపల్లి, నస్రుల్లాబాద్ తదితర గ్రామాల్లో పనులను వేగవంతం చేశారు. కాని కామిశెట్టిపల్లిలో మాత్రం కనీసం పంచాయతీ సిబ్బంది కన్నెత్తి చూసిన దాఖలాలే కనపడటం లేదు. ప్రస్తుతం పనులు పక్కన పెడితే గత వర్షాకాలంలో పెంచాల్సిన మొక్కలు సైతం పంచలేదని పై చిత్రం చూస్తే అర్థం అవుతుంది. నర్సరీలో ఏర్పాటు చేసిన మొక్కలు కవర్లలోనే ఎండి పోయాయి. కాని అధికారులు లెక్కల్లో మాత్రం వాటి పెంపకానికి ఖర్చులు, ప్రజలకు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం. -
ఘనంగా ఊరపండుగ
దోమకొండ: మండల కేంద్రవాసులు ఆదివారం ఊర పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగలో భాగంగా స్థానిక బురుజు వద్ద ఉదయం రంగం కార్యక్రమం నిర్వహించారు. రంగం చెప్పే వ్యక్తి భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బురుజు కోటతో పాటు ఊరడమ్మ ఆలయం వద్ద గావుపట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు అలరించాయి. అనంతరం గ్రామం చుట్టూ సరి చల్లారు. అనంతరం ఊళ్లోని అన్ని ఇళ్లకు తాళాలు వేసి, వనభోజనాలకు తరలి వెళ్లారు. గ్రామంలోని దాదాపు 4 వేల కుటుంబాలు వనభోజనాలకు తరలివెళ్లాయి. కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, ఊర పండగ నిర్వాహకులు మర్రి శేఖర్, సిద్ధారెడ్డి, కూర చంద్రం, సంతోష్రెడ్డి, కొండ అంజన్, పాలకుర్తి శేఖర్, బిసు సతీష్, బత్తిని సిద్ధరాములు, కుంచాల శేఖర్, నర్సారెడ్డి, అనంతరెడ్డి, ఉన్న లక్ష్మణ్, బుర్ర బాపురెడ్డి, నాగారపు ఎల్లయ్య, మేక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.ఊర పండుగ రంగం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు -
కేసీఆర్పై రాజకీయ వేధింపులు మానుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ ● జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నిరసనకామారెడ్డి టౌన్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఆదివారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. పాలన చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే విచారణల పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
నాటి బానిసవాడనే నేటి బాన్సువాడ
● పాతూరు.. కొత్తూరు.. పదవుల కోసం రెండింటి మధ్య పోటీ బాన్సువాడ : రజాకార్ల కాలంలో బానిసవాడగా పిలువబడే ప్రాంతమే నేటి బాన్సువాడ. స్వాతంత్య్రం రాక పూర్వం నిజాం పాలన కాలంలో దోమకొండ ఆస్థానం వారు పాత బాన్సువాడలో గడీలను ఏర్పాటు చేసుకుని పాలన కొనసాగించే వారు. అప్పట్లో ఉన్న పోలీసు వ్యవస్థను పాత బాన్సువాడ ఆస్థానంలో ఉన్న లక్ష్మారెడ్డి అనే వ్యక్తి మంచికి చెడుకు ముందుండేవారట. పోలీసులు పాత బాన్సువాడకు రావాలంటే లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనుమతి తీసుకుని వచ్చేవారని చెప్పుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక బానిసవాడకు బాన్సువాడగా నామకరణం చేశారు. అప్పట్లోనే పాత బాన్సువాడ–కొత్త బాన్సువాడగా పిలిచే వారట. కొత్త బాన్సువాడలో నార్ల వారి కుటుంబ, చావుస్ల కుటుంబ సభ్యులే అధికంగా ఉండటంతో ప్రతీ సారి జరిగే ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికల్లో వంతుల వారీగా పరిపాలన చేసేవారట. బాన్సువాడలో పండగైనా పాత బాన్సువాడ గడీ కాడి నుంచే ప్రారంభిస్తారు. పదవుల పంపకాల్లో ప్రతీ సారి పాతూరు–కొత్తూరు అంటూ లొల్లి పెట్టుకునే వారని తెలిసింది. పాత బాన్సువాడకు చెందిన వారు సర్పంచ్గా ఎన్నికై తే కొత్త బాన్సువాడకు చెందిన వార్డు సభ్యుడికి ఉపసర్పంచి ఇవ్వాలనే నిబంధనలు పెట్టుకున్నారు. ఇలా అప్పటి నుంచి నేటి వరకు ఇలాగే పదవుల పంపకాలు కొనసాగుతున్నాయి. 1969లోనే తెలంగాణ స్థాయి కబడ్డీ పోటీలు పాత బాన్సువాడలో నిర్వహించారు. పాత బాన్సువాడకు చెందిన బి. గంగారెడ్డి అనే వ్యాపారవేత్త 1962 –1967 వరకు ఎమ్మెల్యేగా చేశారు. అలాగే పాతూరుకు చెందిన కత్తెర గంగాధర్ 1989–1994 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. వీరితో పాటు బాన్సువాడలో నివాసముంటున్న పలువురు మండల ప్రజాప్రతినిధులుగా కొనసాగారు. పాత బాన్సువాడలో చెక్కు చెదరని పురాతన గడీ 1) నార్ల లింగయ్య (సమితి అధ్యక్షులు) 2) కత్తెర గంగాధర్ (ఎంపీపీ) 3) గుడాల విఠల్ (ఎంపీపీ) 4) గులెపల్లి శ్రీనివాస్ (ఎంపీపీ) 5) కాసుల బాల్రాజ్ (ఎంపీపీ) 6) జంగం గంగాధర్ (ఎంపీపీ) 7) రేష్మ బేగం (ఎంపీపీ) బాన్సువాడ ఎమ్మెల్యేగా 1989–1994 వరకు పని చే శాను. అప్పట్లో తాను చేసిన అ భివృద్ధి నేటికి కళ్లకు కనప డుతుంది. సంగమేశ్వర కాలనీ కోసం 1993లో 11 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పేదలకు స్థలాలు పంపిణీ చేశాను. నేడు అదే సంగమేశ్వర కాలనీలో సుమారుగా 8 వేల జనాభా ఉంటోంది. నిరంతరం ప్రజాసేవ కోసమే తపించా. ఇంకా ప్రజలకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో నడుస్తున్నా. –కత్తెర గంగాధర్, మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ -
గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన సంగారెడ్డిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మర్కల్లో నిర్వహించిన అంత్యక్రియలకు భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మోతెలో ఆదివారం న ర్సరీ పనులు ప్రారంభమైనట్లు సర్పంచ్ వజీర్ సుజాతాబాయి తెలిపారు. రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటడానికి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొక్కల పెంపకానికి మట్టిని సేకరించి కవర్లలో నింపుతున్నట్లు తెలిపారు. విత్తనాలు వేసి మొక్కలు పెరగడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి, లింగంపేటతో పాటు పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఇటీవల ఎన్నికై న సర్పంచులు పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను, పిచ్చి మొక్కలను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనులకు, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలోనే వేయాలని సూచించారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం ఎల్పుగొండలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో శీతాకాలం ప్రత్యేక శిబిరం చేపట్టారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామంలోని రోడ్లపై పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాలను శుభ్రం చేయడం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటివి నిర్వహించారు. సర్పంచ్ శోభ, ఉప సర్పంచ్ రవీందర్, వార్డు సభ్యులు శ్రీధర్రావ్, దేవరాజు, ఎల్లయ్య, అనిల్, రాములు, తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: మండలంలోని యాడారం గ్రామంలో తాగునీటి ఎద్దడికి సర్పంచ్ గొబ్బూరి సుధారాణి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదవారం గ్రామంలోని 10 వార్డులో బోరు మోటారు రిపేర్ చేసి కనెక్షన్ ఇచ్చారు. కాలనీలొని తాగునీటి పైపులైన్కు కనెక్షన్ ఇచ్చారు. వారి వెంట వార్డు సభ్యులు శ్రీకాంత్రెడ్డి, యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
సమాధి దేవాలయం వద్ద మైకుల ఏర్పాటు
● ప్రతి గంట గంటకు భగవద్గీత శ్లోకాలు భిక్కనూరు: మండల కేంద్రంలో ఉన్న అతి పురాతనమైన సిద్దగిరి రామగిరి సమాధి దేవాలయం వద్ద భక్తులు ఆదివారం మైక్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాది ఆలయం వద్ద 30 ఫీట్ల ఎత్తులో మైక్లను అమర్చామని, ప్రజల్లో భక్తిభావాన్ని సనాతన ధర్మాన్ని మరింత పెంపొందించేందుకు ఈ మైక్లను ఉపయోగిస్తామన్నారు. ప్రతి గంటకు ఒక్కసారి సమయం చెబుతూ భగవద్గీత శ్లోకాలతో పాటు తాత్పర్యం కూడా ఈ మైక్ల ద్వారా వినిపించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల ప్రజలకు భగవద్గీత గురించి అవగాహన కలుగుతుందన్నారు. కామారెడ్డి అర్బన్: సంస్కారభారతి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కూచిపూడి కళాక్షేత్రంలో భరతముని సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కూచిపూడి కళాక్షేత్రం కళాకారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా జాతీయ కళాకారుడు వంశీప్రతాప్గౌడ్, నాట్య గురువులు కనకతార, హర్షితలను సన్మానించారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్, ప్రతినిధులు రాజు, స్వామిగౌడ్, మాతృశక్తి కన్వీనర్ నాగపురి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పరంజ్యోతి కల్కిసేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈ అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. భిక్కనూరులో అంగడి సందర్భంగా అమ్మ స్వామి వార్ల అన్న ప్రసాదాన్ని ప్రజలకు పంపిణీ చేశామన్నారు. తమ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సమితి ప్రతినిధులు ఎర్రం చంద్రశేఖర్, దిగంబర్, సిద్దంశెట్టి శ్రీనివాస్, ఎర్రం విజయ్, ఎర్రం వినోద్, కాశీనాథం, గంజి శ్రీనివాస్, అల్లాడి రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కోసం అవకాశం ఇవ్వండి
● బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డిఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఎల్లారెడ్డిలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు బీఫారాలను అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది క్రితం జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుందని దీంతో రాష్ట్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. వెయ్యి కోట్లు నష్ట పోయిందని పేర్కొన్నారు. నిధులు రాకపోవడంతో మున్సిపాలిటీలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎస్డీఎఫ్ నిధులు కేటాయించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని డిమాండ్ చశారు. వరదల వల్ల ఎల్లారెడ్డితో పాటు చుట్టుపక్కల మండలాలు ఎంతో నష్టపోయాయని, బాధితులకు ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవడం సిగ్గు చేటని పేర్కొన్నారు. లింగంపల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణం పనులు ఇంత వరకు చేపట్టలేదన్నారు. ఎల్లారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులతో చర్చిస్తానన్నారు. ప్రజలు బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వినిత్ వర్మ, నాయకులు బాలకిషన్, దేవేందర్, సతీష్, రాజేష్, రవీందర్రావు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల బరిలో భార్యాభర్తలు
● వేరువేరు వార్డులనుంచి నామినేషన్లు కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల బరిలో భార్యాభర్తలు ఇద్దరూ నిలవడం కామారెడ్డిలో చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని 47వ వార్డుకు చెందిన గెరికంటి స్వప్న గత కౌన్సిల్లో (2020–2025)లో కౌన్సిలర్గా పనిచేశారు. తన వార్డులో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఆమె ఈసారి కూడా అదే వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్వప్న భర్త గెరికంటి లక్ష్మీనారాయణ సైతం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన 46వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ విజయం సాధిస్తే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్లో ఇద్దరూ కలిసి అడుగుపెట్టే అరుదైన అవకాశం దక్కుతుంది.కామారెడ్డి క్రైం: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా గతనెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 విజయవంతంగా పూర్తయ్యిందని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు పరిశ్రమలు, హోటళ్లు్, ఇటుక బట్టీలు, వ్యాపార సముదాయాలు, మెకానిక్ షాపులు, నిర్మాణ రంగం తదితర ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో 50 మంది 18 ఏళ్లలోపు పిల్లలను గుర్తించామని పేర్కొన్నారు. ఇందులో 46 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. వీరిలో 14 మంది చిన్నారులు బయటి రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 21 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే టోల్ఫ్రీ నంబర్ 1098కు గానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. కామారెడ్డి టౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డులకుగాను మొత్తం 676 మంది నామినేషన్లు వేశారు. ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణలకు గడువు ఉంది. భిక్కనూరు: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) జాతీయ మహాసభలు ఈ నెల 6 నుంచి 8 వరకు జరుగుతాయని బీఎంఎస్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సందుగారి రవీందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీఎంఎస్ జాతీయ మహాసభల్లో కార్మికుల సంక్షేమం కోసం పలు తీర్మానాలను ఆమోదించనున్నట్లు తెలిపారు. కార్మికుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు, జాతీయ తభావాన్ని నింపేందుకు బీఎంఎస్ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను కూడా ప్రభుత్వం మార్చి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని బీఎంఎస్ ప్రతినిధులను కోరారు. -
రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడ: రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఇంతలా అవమానించడం తగదని, ప్రజలు త్వరలోనే కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బాన్సువాడలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, యలమంచలి శ్రీనివాస్రావు, చందర్, శివ, రమేష్యాదవ్, మోచీ గణేష్, ఇషాక్, సాకలి సాయిలు, రమేష్, గాండ్ల కృష్ణ, ఉమ మహేష్ తదితరులు ఉన్నారు. -
ప్రజల దృష్టి మరల్చడానికే అక్రమ కేసులు
● త్వరలోనే సీఎం బావమరిది అక్రమాలు బయటపెడతాం ● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల వ్యవహరం కొనసాగిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి ఓ ఫెయిల్యూర్ సీఎం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ ఇంటి గోడకు నోటీసులు అట్టించడం రేవంత్రెడ్డి చిల్లరబుద్ధికి నిదర్శనమన్నారు. ఇలాంటి కేసులకు కేసీఆర్ బయటపడేవారుకాదని, ఉద్యమ కాలంలో అనేక కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి బావమరిది సృజన్రెడ్డి కుంభకోణాల చిట్టా బయటపెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. దీంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దారిమళ్లించడానికే రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నరని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసుల పరిధిలో ఉన్న అంశం అని దానికి అనుమతులు హోం సెక్రెటరీ ఇస్తారని సీఎంకు, మంత్రులకు సంబంధం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతియడానికి విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బతీయడానికే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్త, బీఆర్ఎస్ లీగల్ సెల్ కార్యదర్శి మధుసూదన్రావు, మాజీ కార్పొరేటర్ విశాలినీరెడ్డి, సుమనరెడ్డి, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్నగర్లో ఇల్లు దగ్ధం
బోధన్టౌన్: పట్టణంలోని అంబేడ్కర్నగర్ కాలనీకి చెందిన శంకర్ ఇల్లు ఆదివారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంటి నుంచి పొగలు రావడంతో కుటు ంబీకులు కేకలు వేస్తూ బయటకు వచ్చారు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశా రు.కాగా అప్పటికే ఇంట్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆ ర్పివేశారు. రూ.లక్షా50వేల ఆస్తి నష్టం వా టిళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబానికి మున్సి పల్ మాజీ చైర్మన్ తూము పద్మ, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు నగదు, బియ్యం అందజేశారు.


