Kamareddy
-
సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలి
దోమకొండ: సహకార సంఘాలు రైతులకు అండంగా ఉండాలని దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సహకార సంఘంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025–26 అర్థ వార్షిక నివేదిక మహాజనసభ రైతులతో కలిసి శనివారం నిర్వహించారు. స్వల్ప కాలిక అప్పులు, వసూలు, దీర్ఘకాలిక అప్పులు వసూలు, ఎరువులు, విత్తనాల పంపిణీ, వరి ధాన్యం కొనుగోలు కమిషన్పై ఆడిట్, ఇన్సూరెన్స్లపై సమావేశంలో చర్చించారు. సహకార సంఘంలో వచ్చిన ఆదాయం, వ్యయాలను సంఘం కార్యదర్శి బాల్రెడ్డి చదివి వినిపించారు. కార్యక్రమంలో సింగిల్విండో మాజీ చైర్మన్ పన్యాల నాగరాజ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు నల్లపు శ్రీనివాస్, నాయకులు అబ్రబోయిన స్వామి, సీతారాం మధు, నాగారపు ఎల్లయ్య,సహకార సంఘం క్లస్టర్ అధికారి రమేష్, మానిటరింగ్ అధికారి నాగేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక రుణాలు చెల్లించాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలను చెలించాలని సొసైటీ ప్రత్యేక అధికారి విష్ణు అన్నారు. మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. రుణాల రెన్యూవల్, దీర్ఘకాలిక రుణాల వసూలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై చర్చించి తీర్మానించారు.ఈ సందర్భంగా ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. సమావేశంలో క్లస్టర్ అధికారి లక్ష్మణ్, మానిటరింగ్ అధికారి విఠల్, సీఈవో నర్సింలు, సిబ్బంది నితిశ్రెడ్డి, శ్రీకాంత్, బాలకిషన్, రమేశ్, రైతులు శ్యాంరావు, రాములు, రాజేశ్వర్రెడ్డి, సంజీవరెడ్డి, రవిందర్రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి నిజాంసాగర్(జుక్కల్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరియైన వసతులు కల్పించాలని మహాజన సభలో రైతులు కోరారు. శనివారం మహమ్మద్నగర్ సొసైటీ ఫంక్షన్ హాల్లో గున్కుల్ సొసైటీ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సొసైటీ ద్వారా సుతిలిని సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో సొసైటీ పర్సన్ ఇన్చార్జి మురళిధర్గౌడ్, మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచులు కుమ్మరిరాములు, రమేష్యాదవ్, జీవన్, కిరణ్, హరిన్, మాజీ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ నాయకులు నాగభూషణంగౌడ్, అతిక్, విజయ్, సాయిలు రైతులు ఉన్నారు. -
పిచ్చికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శనివారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలైయ్యాయి. కాలనీకి చెందిన ముద్దసాని కనకయ్య, బ్రహ్మయ్యగారి వెంకవ్వ, జంగం లిల్లీ, సాయవ్వతోపాటు మరో చిన్నారిపై కుక్కలు దాడిచేసినట్లు కాలనీవాసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా పలువురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేయగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తరచు కుక్కల దాడితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామ శివారులోగల 63వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. జాతీయ రహదారిపై శనివారం వేకువజామున ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, వయస్సు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. తెల్లని మాసిన షర్ట్, నల్లని ప్యాంట్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో లేదా సెల్నెంబర్ 8712659853, 8712359742ను సంప్రదించాలన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ చెరువులో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు శనివారంం తెలిపారు. చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహిళ వయస్సు సుమారు 35–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా మృతురాలిని గుర్తిస్తే దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలన్నారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. భీంగల్ మండలం చెంగాల్ గ్రామానికి చెందిన ముందెల రాజేశ్వర్(51)ఈనెల 24న ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం అడ్మిట్ అయ్యాడు. తన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో వేలును తొలగించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడు భయపడి ఆస్పత్రి నుంచి ఈనెల 27న ఉదయం ఎవరికి చెప్పకుండ వెళ్లిపోయాడు. అనంతరం పెర్కిట్లోని విశ్వబ్రాహ్మణ సంఘ భవనం సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
బిచ్కుంద తైబజార్ @రూ.22.70లక్షలు
● మున్సిపాలిటీగా అప్గ్రేడ్కావడంతో పెరిగిన డిమాండ్ బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ సీమ షెట్కార్ సమక్షంలో కమిషనర్ హయ్యుం తైబజార్ వేలం పాట నిర్వహించారు. రూ.22,70,000 లకు ఖాజమియా వేలం పాట దక్కించుకున్నారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు రూ.18,70,000 వేలం పాట పలికింది. ఇప్పుడు మున్సిపాలిటీ కావడంతో వేలంపాటలో నాలుగు లక్షల ఆదాయం అదనంగా వచ్చింది. ఈ నిధులు అభివృద్ధి, తాగునీరు ఇతర పనులకు వాడుకుంటామని చైర్పర్సన్ తెలిపారు. గాంధారి తైబజార్ @రూ.9లక్షలు గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రేణుక సంజీవ్ యాదవ్, పాలక వర్గం ఆధ్వర్యంలో శనివారం తైబజారు, దాఖలాచిట్టీ(పశువుల సంత) వేలం వేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. తైబజార్ను గ్రామానికి చెందిన గడ మురళి రూ.9 లక్షల 10 వేలకు దక్కించుకున్నట్లు తెలిపారు. దాఖలా చిట్టిని వాడికారి శ్రీధర్ రెడ్డి రూ.4 లక్షల 32 వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలిపారు. వేలం పాట దక్కించుకున్నవారు పంచాయతీ కార్యాలయం నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవు, పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి తైబజార్ @రూ.8లక్షలు ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం తైబజార్ వేలంపాట నిర్వహించారు. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్వహించిన తైబజార్ వారాంతపు సంత రూ. 8 లక్షల 40 వేలకు సుభాష్ అనే వ్యక్తి దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. డెయిలీ మార్కెట్, పశువుల సంతకు సంబంధించిన తైబజార్కు సరిపడా ఆదాయం రాకపోవడంతో సోమవారానికి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. నేటి అంగడి స్థలం మార్పు భిక్కనూరు: ప్రతి ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంత (అంగడి) స్థలాన్ని మార్చుతున్నట్లు భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖసుదర్శన్ శనివారం తెలిపారు. ప్రస్తుతం ప్రతి వారం నిర్వహించే అంగడి స్థలంలో సీసీ రోడ్లను నిర్మాణపనులు జరుగుతున్నందున ఈ వారం నిర్వహించే అంగడిని వ్యవసాయమార్కెట్ గంజి ఆవరణలో ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. తైబజార్, మేకల సంతకు నాలుగు టెండర్ దరఖాస్తులు కామారెడ్డి టౌన్: మున్సిపాలిటీకి సంబంధించి తైబజార్, మేకల సంత నిర్వహణ కోసం అధికారులు టెండర్లను ఆహ్వానించారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు గడువు ముగిసే సమయానికి తైబజార్కు రెండు, మేకల సంతకు రెండు చొప్పున మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ మేనేజర్ రషీద్ తెలిపారు. గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు గడువు ముగిసిన తర్వాత రావడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దరఖాస్తులు తక్కువగా వచ్చాయన్న కారణంతో, కొందరు కౌన్సిల్ సభ్యుల డిమాండ్ మేరకు మళ్లీ రీటెండర్ నిర్వహించాలని అధికారులు భావించారు. దీనిపై టెండర్ దాఖలు చేసిన గుత్తేదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయమై శనివారం కమిషనర్ రాజేందర్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు, టెండర్ దారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తుదారులతోనే బహిరంగ వేలం నిర్వహించాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. ఈ నెల 30వ తేదీన కౌన్సిల్ హాల్లో బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ సోమవారం బహిరంగ వేలం నిర్వహించకపోతే తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తూ గుత్తేదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో టెండర్ దక్కించుకున్న వ్యక్తి పాలకులకు భారీగా ముడుపులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకే అధికారులు రీటెండర్కు మొగ్గు చూపుతున్నారని పలువురు ఆరోపించారు. -
ముగిసిన ఖో–ఖో శిక్షణ శిబిరం
తెయూ(డిచ్పల్లి):తెలంగాణ యూనివర్సిటీలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న వర్సిటీ మహిళల ఖో–ఖో శిక్షణ శిబిరం శనివారం ముగిసినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ తెలిపారు. ఈసందర్బంగా బాలకిషన్ మాట్లాడుతూ.. క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కుర్ర మోహన్కు డాక్టరేట్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి కుర్ర మోహన్ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ ప్రొఫెసర్ బోయపాటి శిరీష పర్యవేక్షణలో ‘ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ వ్యర్థాల నిర్మూలన–ఆర్గానిక్ సింథసిస్ కోసం సమర్థవంతమైన రంధ్రాలు గల ట్రాన్సిషన్ మెటల్ ఆకై ్సడ్ ఆధారిత కాటలిటిక్ వ్యవస్థల తార్కిక రూపకల్పన’ అనే అంశంపై మోహన్ పరిశోధన పూర్తి చేసి సిద్ధాంతగ్రంథం సమర్పించారు. శనివారం తెయూలో నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ జ్యోతి వ్యవహరించారు. పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కె.సంపత్ కుమార్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు వాసం చంద్రశేఖర్, మావురపు సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల (అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ)కు సంబంధించి 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్ /బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ సంపత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
ఎనిమిది బెంచ్లు.. 4,506 కేసులు
● జాతీయ లోక్ అదాలత్ సక్సెస్ ● రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు ● స్నేహపూర్వక పరిష్కారమే లోక్ అదాలత్ లక్ష్యం : జిల్లా జడ్జి వరప్రసాద్కామారెడ్డి టౌన్ : జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టుల్లో మొత్తం 8 బెంచ్లను ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న 4,506 కేసులను పరిష్కరించారు. క్రిమినల్, సివిల్, ప్రీలిటిగేషన్ విభాగాల్లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయి. క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 4,391 పరిష్కరించి రూ.73,83,390 పరిహారాన్ని బాధితులకు అందించారు. 24 సివిల్ కేసుల్లో పరిష్కారం చూపారు. మోటార్ ప్రమాద బీమా 11 కేసుల్లో రూ.కోటీ 5 వేల భారీ పరిహారాన్ని బాధితులకు అందజేశారు. 63 సైబర్ క్రైం కేసులను పరిష్కరించి రూ. 12,44,391 రికవరీ చేశారు. బ్యాంకు ప్రీలిటిగేషన్ 17 కేసుల్లో రూ. 9,65,000 సెటిల్ చేశారు. జిల్లావ్యాప్తంగా 4,506 కేసులను పరిష్కరించి, బాధితులకు మొత్తంగా రూ.1,95,97,781 పరిహారాన్ని ఖరారు చేశారు. -
పాఠాలు.. పిల్లలే లోకం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయ వృత్తిలో పాతికేళ్లుగా కొనసాగుతున్న యాదయ్య సార్ పాఠాలు బోధించడం, పిల్లలను మోటివేట్ చేయడమే తన లోకంగా జీవిస్తున్నారు. అటు విద్యార్థులకు, ఇటు తల్లిదండ్రులకు అభిమాన టీచర్గా నిలుస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల జిల్లా పరిషత్త్ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాయకుని యాదయ్య అనే ఉపాధ్యాయుడు పొద్దస్తమానం విద్యార్థుల చదువుకే సమయాన్ని వెచ్చిస్తారు. పనిచేసిన చోటే నివాసం ఉంటారు. రాత్రుల్లో సైతం పిల్లల ఇళ్లకు వెళ్లి పాఠ్యాంశాల్లోని వారి అనుమానాలు నివృత్తి చేస్తారు. లెక్కలంటే ఉండే భయాన్ని పోగొట్టి వారికి లెక్కల సబ్జెక్టును ఇష్టంగా మారుస్తారు. పిల్లలే కాదు వారి తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నారు యాదయ్య సార్. పెద్దకొడప్గల్ మండలం వడ్లం, బిచ్కుంద మండలం దడ్గి, జుక్కల్ మండలం ఖండేబల్లూర్ తదితర పాఠశాలల్లో పనిచేసిన యాదయ్య రెండేళ్లుగా మత్తమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. అప్పట్లో 10 గంటలకు స్కూల్ ఉన్నపుడు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు తీసుకునేవారు. స్కూల్ సమయం 9 గంటలకు మారిన తరువాత సాయంత్రం ఒక పూట ప్రత్యేక తరగతి తీసుకుంటున్నారు. పరీక్షల సమయంలో అయితే రాత్రి వరకూ విద్యార్థులను చదివిస్తూ ఉంటారు. పదో తరగతి పరీక్షలు నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఆయన పిల్లల ఇళ్లకు వెళ్లి వారి చదువులను పర్యవేక్షిస్తుంటారు. మత్తమాల పాఠశాలకు మత్తమాలతోపాటు రుద్రారం నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఆయా గ్రామాలకు వెళ్లి వారి చదువుల సంగతి పరిశీలించి మ్యాథ్స్ పై ఉన్న అనుమానాలు నివృత్తి చేయడం ద్వారా ఆయన పిల్లల్లో మ్యాథ్స్ అన్న భయాన్ని ఎప్పటికప్పుడు పోగొడుతూ వారిని తీర్చిదిద్దుతున్నారు. స్కూల్లో చదివే పిల్లలంతా యాదయ్య సార్ అంటే ప్రత్యక అభిమానం చూపుతారు. పదో తరగతిపై ప్రత్యేక దృష్టి స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థులపై యాదయ్య సార్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. వారికి ప్రత్యేక తరగతులు తీసుకోవడం, స్టడీ అవర్స్, ఇంటి దగ్గరకు వెళ్లి చదివించడం వంటివి చేస్తుంటారు. తద్వారా మంచి మార్కులు సాధించేలా ప్రిపేర్ అయ్యారు. లెక్కలంటే భయం వీడి, ఇష్టంగా చదివేలా తీర్చిదిద్దుతున్నారు. పిల్లల చదువుకే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. పరీక్షల సమయంలో ప్రతి విద్యార్థి ఇంటికి వెవెళ్లి వారితో మాట్లాడడం, వారికి ధైర్యాన్నిచ్చి ప్రోత్సహిస్తారు. తొమ్మిదో తరగతి పరీక్షలు అయిపోగానే వారికి కూడా పదో తరగతి అడ్వాన్సు క్లాసులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంగా యాదయ్య సార్ను ‘సాక్షి’ పలకరించగా వీలైనంత ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించడం మూలంగా వారు చదువులో రాణించగలుగుతున్నారు. వారికి మ్యాథ్స్లో ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయగలుగుతున్నాను. స్థానికంగా ఉండి వారి చదువును పర్యవేక్షించడంలో ఎంతో ఆనందం ఉంది. తల్లిదండ్రులు ఎంతో ఆదరిస్తున్నారు. ఇలాగే కొనసాగిస్తాననని పేర్కొన్నారు. ఉద్యోగం చేస్తున్న చోటే నివాసం ప్రత్యేక తరగతులు.. ‘లెక్కల’ భయం పోగొట్టే ప్రయత్నం మంచి మార్కులు సాధించేలా చొరవ యాదయ్య సార్ అంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక అభిమానం -
కౌన్సిల్ కన్నెర్ర
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026– IIలో uకామారెడ్డి టౌన్ : ఇద్దరు ఉన్నతాధికారులను సరెండ్ చేయాలని పార్టీలకు అతీతంగా కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. ఇది కామారెడ్డి చరిత్రలో మొదటిసారి. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ సమక్షంలో శనివారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. నాలుగు గంటలపాటు సమావేశం వాడివేడిగా సాగింది. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, టీపీవో గిరిధర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పట్టణ అభివృద్ధిని విస్మరిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే సానిటేషన్, నీటి సమస్య, వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని కమిషనర్ను సభ్యులు నిలదీశారు. టీపీవో సమావేశానికి వచ్చి మధ్యలో వెళ్లిపోయి సభ్యులను అగౌరవపరిచారని మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతిమయమైందని, కమిషనర్, టీపీవోలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సామాన్య ప్రజల పనులను పెండింగ్లో పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను ఫోన్ చేసినా కమిషనర్ లిఫ్ట్ చేయడం లేదని, తన మాటకు గౌరవం ఇవ్వడం లేదని చైర్పర్సన్ పేర్కొనడంతో అధికారుల వ్యవహారశైలి మరింత చర్చకు దారి తీసింది. సదరు అధికారులపై అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే సభ్యులు పట్టుబట్టారు. వారి వ్యవహారశైలిపై విచారణ చేపట్టాలని మొదట మినిట్స్ బుక్స్లో రాయగా సభ్యులు వ్యతిరేకించారు. వారిని సరెండర్ చేయాల్సిందేనని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ మేరకు జేసీ సమక్షంలోనే తీర్మానం చేసి సంతకాలు చేశారు. అయితే తీర్మానంపై కలెక్టర్, స్థానిక సంస్థల కలెక్టర్ విచారణ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.చైర్పర్సన్, అధికారులను నిలదీస్తున్న కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ చరిత్రలో మొదటిసారి వాడివేడిగా సాగిన బడ్జెట్ సమావేశం రూ.70.86కోట్ల ఆదాయం.. రూ.70.85 కోట్ల వ్యయ బడ్జెట్కు ఏకగీవ్ర ఆమోదం -
‘యంగ్ ఇండియా’ పనులు పూర్తి చేయాలి
● పేద విద్యార్థుల కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్మద్నూర్(జుక్కల్): పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుట్టలో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. పనులపై సమీక్షించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. అంతకు ముందు మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలెక్టర్ భోజనం మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సంగ్వాన్ మధ్యాహ్న బోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా.. వంటలు రుచికరంగా ఉంటున్నాయా అని కలెక్టర్ విద్యార్థినులను ప్రశ్నించారు. గత సంవత్సరం పాఠశాలకు వచ్చిన సందర్భంగా కలెక్టర్ రూ.2 లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో బోరు తవ్వకం, హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గది నిర్మాణం పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రస్థాయి ఎంపికలకు 20 మంది
కామారెడ్డి అర్బన్: హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ నాల్గో తరగతిలో ప్రవేశం కోసం రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి 20 మంది ఎంపికై నట్లు జిల్లా అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ తెలిపారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తొమ్మిది అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరగౌడ్ మాట్లాడుతూ.. 80 మంది క్రీడాకారులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభకనబర్చిన పది మంది బాలురు, పది మంది బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్, ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శులు పాక వెంకట్, రసూల్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: యాసంగి పంటల సాగు అవసరాల కోసం శుక్రవారం నిజాంసాగర్ ప్రా జెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడు దల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో నీరందించారు. శుక్రవారం ఐదో విడత నీటి విడుదల చేపట్టారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి టౌన్ : వ్యవసాయ కూలీలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈజీఎస్ను నీరుగార్చొద్దన్నారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణ (నారాయణపేట్), ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ(నిజామాబాద్), కోశాధికారిగా కిష న్(నిజామాబాద్), ఉపాధ్యక్షులుగా నాయిని రాజు(ఇల్లందు), వీరన్న(మహబూబాబాద్), గంగాధర్(నిజామాబాద్), సహాయ కార్యదర్శులుగా సలీం, వెంకయ్య, జాటోత్ కృష్ణ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు కిశోర్, రమేష్, కిశోర్, ప్రభాకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ : మెదక్ జిల్లా తుప్రాన్లో 29న జరిగే ఎస్జీటీల విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఎస్జీటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కోరారు. శుక్రవారం బాన్సువాడలో ఎస్జీటీల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 312తో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం వర్తింప జేయాలని, పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చే శారు. సమావేశంలో ఉపాధ్యాయులు హ న్మండ్లు, విజయ్కుమార్, సత్యనారాయణ, దర్శనం పర్వయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. రెంజల్: కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాప కులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్ఫూర్తి మందిరాన్ని శుక్రవారం లాంఛనగా ప్రారంభించారు. హెడ్గేవార్ పూర్వీకులు నివసించిన ప్రదేశంలో రూ. 30 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నా యి. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంఘ్ అఖిల భారత వనవాసీ మార్గదర్శక్ సోమయాజులు ఈ స్ఫూర్తి మందిరంలో గృహప్రవేశం చేశారు. వచ్చేనెలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాక వచ్చే నెల 11న ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ కందకుర్తికి రానున్నారని సంఘ్ ప్రతినిధులు తెలిపారు. హెడ్గేవార్ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవంలో ఆయన తోపాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో కేశవ సేవా సమితి ప్రతినిధులు సుధాకర్రెడ్డి, మల్లికార్జున్, శ్రీధర్రెడ్డి, వాసు పాల్గొన్నారు. -
గురుకులాలకు 27 మంది విద్యార్థుల ఎంపిక
దోమకొండ: దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది 5వ తరగతి ప్రవేశాల గురుకుల పరీక్ష కోసం 33 మందికి కోచింగ్ ఇవ్వగా వారిలో 27 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభతో ఎంపికై నట్లు గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చామన్నారు. గురుకులాలకు ఎంపికై న విద్యార్థులను సన్మానించారు. గడికోట ట్రస్టు ప్రతినిధులు రాజశేఖర్, బండారి ఆనంద్, గణేష్ యాదవ్, వినయ్ తదితరులున్నారు. బాన్సువాడ రూరల్: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండటానికి సింగిల్ఫేజ్ మోటార్ల ద్వారా కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇబ్రహీంపేట్ సర్పంచ్ ఉద్దెర సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం 7వ వార్డులో పంచాయతీ సిబ్బందితో కుళాయి ఏర్పాటు చేయించామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని ఆమె కోరారు. నాయకులు రాజ్కుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మొగులాన్పల్లి తండాలో మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. నెలలు గడిచినా మురికి కాలువలు శుభ్రం చేయించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు వృద్ధి చెందుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతోంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు సమయంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయించాలని తండావాసులు కోరుతున్నారు. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని బడాకసాబ్ గల్లీ వద్ద రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఘటన చోటుచేసుకోగా, శుక్రవారం ఉదయం రైలుపట్టాలపై మృతదేహంను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై లింబాద్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వయస్సు 50–55ఏళ్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. -
శోభాయాత్రలో డీజేకు అనుమతి నిరాకరణ
● స్వయంగా వాహనాన్ని నడిపిన ఎమ్మెల్యే ధన్పాల్ సుభాష్నగర్: నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని శోభాయాత్ర నిర్వహించారు. కానీ డీజేకు అనుమతి లేదని పోలీసులు డీజే వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పోలీసులతో మాట్లా డారు. అయినా వారు వినకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యేనే డీజే వాహనాన్ని నడిపారు. దగ్గరుండి శోభాయాత్రను ముందుకు నడిపించారు. -
వైభవంగా మత్తడి పోచమ్మ పండుగ
మద్నూర్(జుక్కల్): సుల్తాన్పేట్లో మత్తడి పోచమ్మ పండుగను శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలు బోనాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. పోచమ్మ తల్లి చల్లగా చూడమ్మా... ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండేలా చూడమని వారు కోరుకున్నారు. మహిళలు పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి ఆలయం వద్ద భోజనాలు చేశారు. సాయంత్రం రైతులు ఎడ్ల బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, ఉప సర్పంచ్ బాల్రాజ్, గ్రామస్తులు బస్వంత్రావ్ పటేల్, సుదర్శన్గౌడ్, ధన్రాజ్గౌడ్, హన్మాండ్లు ఉన్నారు. నయనానందకరం పెద్దమ్మ కల్యాణం భిక్కనూరు: మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం 27వ వార్షికోత్సవాలు నాలుగు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వనదుర్గ ఆలయంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుదుపరి పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణం జరిపించారు. కల్యాణం అనంతరం మహిళలు కట్నకానుకలు సమర్పించుకున్నారు. భారీగా భక్తులు హాజరయ్యారు. మాజీ సర్పంచ్ తున్కి వేణు, వార్డు సభ్యులు సర్గు దీప సందీప్లను ముదిరాజు సంఘం అధ్యక్షుడు బండి రాములు ఆధ్వర్యంలో సత్కరించారు. పెద్దమ్మ ఆలయంలో పూజలు చేసిన మాజీ చైర్పర్సన్ దంపతులు భిక్కనూరు: మండల కేంద్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయం 27వ వార్షికోత్సవాల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డితో పాటు ఆయన సతీమణి కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందు ప్రియలు పాల్గొని శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి కట్నకానుకలను సమర్పించుకున్నారు. వారిని మండల ముదిరాజు సంఘం అధ్యక్షుడు బండి రాములు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీటీసీ చంద్రకళ, నాయకులు గంగళ్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజల కోసమే కొత్త పార్టీ’
నిజామాబాద్ అర్బన్: ప్రజల కోసం పనిచేసేందుకే కొత్త పార్టీ పెడుతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఏప్రిల్ 25న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు అందరూ తరలిరావాలని ఆమె ఆహ్వానించారు. నగరంలోని జాగృతి కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఆ తర్వాత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయ్యే వరకు ఒకలా, అయిన తర్వాత మరోలా ప్రవర్తించటం రాజకీయ ఒరవడిగా మారిందని విమర్శించారు. ఇచ్చిన మాట అమలు చేయకపోయినా సరే ప్రజలు పట్టించుకోరన్న ధైర్యం రాజకీయ నాయకుల్లో ఉందన్నారు. ఆ విధానం పోవాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. నిజామాబాద్ వేదికగా పుట్టిన ఏ ఆలోచన అయినా సక్సెస్ అయ్యిందని, పార్టీ ఆలోచన కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోడలిగా తనకు ఇందూరు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. సమావేశంలో జాగృతి నాయకులు శ్రీనివాస్గౌడ్, ఎనుగందుల మురళి, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
గ్రామాల్లో బెల్ట్ జోరు...
సదాశివనగర్(ఎల్లారెడ్డి): పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు..అన్న నానుడికి అర్థం లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. మద్యం ప్రియుల నుంచి ఒక్కో బాటిల్కు రూ.30 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. కిరాణ దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం దుకాణాలు నిర్వహిస్తుండడంతో గ్రామాల్లో యువత మద్యానికి బానిసవుతున్నారు. ఉదయం మొదలుకొని అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు చేస్తున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్ట్ దుకాణాలకు టెండర్లు.. మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో బెల్ట్ దుకాణం నిర్వహించాలంటే వీడీసీల ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా వేలం పాటలు నిర్వహిస్తు పోటాపోటీగా దక్కించుకుంటున్నారు. ఇటీవల అడ్లూర్ ఎల్లారెడ్డిలో బెల్ట్ షాపు నిర్వహించడానికి రూ.3 లక్షలకుపై పైగా వేలం పాడి ఓ వ్యక్తి దక్కించుకున్నారు. అలాగే తిర్మన్పల్లి, వజ్జపల్లి, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి, భూంపల్లి, లింగంపల్లి, మోడెగాం, జనగాం, కుప్రియాల్, ధర్మారావ్పేట్, అమర్లబండ, కల్వరాల్, మర్కల్, ఉత్తునూర్, యాచారం, వజ్జపల్లి తండా, వజ్జపల్లి, తదితర గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియులతో గొడవలకు దిగుతున్నారు. ‘మేం గ్రామానికి డబ్బులు కట్టినం.. మా ఇష్టం ఉన్న రేట్కు అమ్ముకుంటం’ అంటూ మద్యం ప్రియులకు సమాధానాలు ఇవ్వడంతో వారు అవాక్కవుతున్నారు. ఉదయం 4 గంటల నుంచి పెగ్ సిస్టం.. సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని హోటళ్లలో పెగ్ సిస్టం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. మద్యం ప్రియులు మొదటగా పెగ్ తీసుకున్న తర్వాతనే చాయి తాగుతున్నారు. హోటళ్లలో నిర్వహించే పెగ్ సిస్టం మద్యం విక్రయాల్లో కల్తీ మద్యం సైతం విక్రయిస్తూ ప్రజల అనారోగ్యాలకు కారకులవుతున్నారు. బెల్ట్ దుకాణాల్లో మద్యం ప్రియులకు కాలం చెల్లిన మిక్చర్ ప్యాకిట్లను అంటగడుతున్నారు. ఈ మిక్చర్ను తయారు చేయారు చేయడానికి మిక్చర్ కంపెనీ వారు నకిలీ నూనెలు వాడుతుండటం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. మద్యం అధికారులు ఇప్పటికై నా దృష్టి సారించి గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. విచ్చలవిడిగా విక్రయాలు ఒక్కో బాటిల్కు రూ.30 నుంచి 50 ఎక్కువగా వసూలు తాగుడుకు బానిస అవుతున్న యువత కాలం చెల్లిన మిక్చర్ ప్యాకెట్ల అమ్మకం మామూళ్ల ‘మత్తు’లో అధికారులుగ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహించకూడదు. అలాంటివి ఉంటే వెంటనే దాడులు చేస్తాం. శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అసలే విక్రయించ వద్దు. త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సంపతి కృష్ణ, ఎకై ్సజ్ సీఐ, కామారెడ్డి -
బీజేపీ ఫ్లోర్ లీడర్గా ప్రమోద్
సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్లీడర్గా 4వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని ప్రమోద్కుమార్ నియమితులయ్యా రు. బల్దియా ఎన్నికల్లో రెండవసారి ప్రమోద్కుమార్ కార్పొరేటర్గా ఎన్నికకావడంతో ఆయన ను ఫ్లోర్లీడర్గా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్కులచారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఫ్లోర్లీడర్గా దంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రెటరీగా మఠం పవన్కుమార్, పార్టీ విప్గా న్యాలం సునీత నియమితులయ్యారు. సునీత రెండుసార్లు బీజేపీ తరపున కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. దంపల్లి జ్యోతి తొలిసారి ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కార్పొరేటర్ కాగా, మఠం పవన్ కూడా తొలిసారి కార్పొరేటర్ అయ్యారు. -
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావులింగంపేట: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాణాపూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూరి గుడిసెలో నివసిస్తున్న గ్రామానికి చెందిన తుర్క హాజీకీ మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఆ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం కోసం 15 కేవీ ట్రాన్స్పార్మర్ను 63 కేవీగా అప్గ్రేడ్ చేయించారు. అలాగే మరో రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగమేశ్వర్, ఉపసర్పంచ్ సంజీవులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, నాయకులు రాయిని అశోక్, విఠల్రెడ్డి, గోకుల్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. సీతారాముల కల్యాణం
కామారెడ్డి టౌన్ : జిల్లాలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా సాగాయి. ఊరూవాడా అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలలో సీతారాముల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, బజరంగ్దళ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల భారీ శోభాయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటా రామనామం ప్రతిధ్వనించింది. జిల్లాకేంద్రంలోని ధర్మశాల వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పుర వీధుల మీదుగా సాగింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.సోమ్లానాయక్ తండాలో బాలరాముడు -
గడికోటలో క్రికెట్ పోటీలు ప్రారంభం
దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో శుక్రవారం క్రికెట్ పోటీలు నిర్వహించగా.. మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్ ప్రారంభించారు. దోమకొండతో పాటు కామారెడ్డికి చెందిన జూనియర్ స్థాయి క్రికెట్ పోటీలు జరిగినట్లు ఆయన తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో మెలగాలని వారికి సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదాం రవి, కామారెడ్డి, దోమకొండకు చెందిన క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేటకు చెందిన పౌడాల కిషన్ 30 ఏళ్ల క్రితం మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న ఎకరం స్థలంతోపాటు తన ఇంటిని గ్రామానికి విరాళంగా ఇచ్చారు. దీంతో శ్రీరామనవమి సందర్భంగా కిషన్ కుమారులు రమేష్, ప్రవీణ్కుమార్ను శుక్రవారం గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు కిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్తులు నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ గూలపల్లి లక్ష్మి, నాయకులు నారాయణ, శ్రీను, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
‘సర్కారు’ వారి బకాయి..
సామాన్యుల నుంచి పైసా వదలకుండా పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు.. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల విషయంలో మాత్రం నిస్సహాయులవుతున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకపోవడంతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ భవనాల బకాయిలు మున్సిపాలిటీకి ‘గుదిబండ’లా మారాయి. ప్రస్తుతం మొత్తం బకాయిలు రూ. 8.49 కోట్లకు చేరాయి. అసలు కంటే పెనాల్టీలే అధికం పట్టణంలో 84 రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, 14 కేంద్ర ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ఇందులో చాలా కార్యాలయాలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. చాలా కార్యాలయాలు ఏళ్ల తరబడిగా పన్నులు చెల్లించడం లేదు. దీంతో అసలు కన్నా పెనాల్టీల భారం ఎక్కువయ్యింది. మొత్తం బకాయిల్లో ఏరియర్స్తో కలిపి అసలు పన్ను రూ. 2.93 కోట్లు ఉండగా.. దీనికి వడ్డీ ఏకంగా రూ. 5.17 కోట్లు కావడం గమనార్హం. గతంలో ప్రభుత్వం వడ్డీలో 90 శాతం రాయితీ కల్పించినా ప్రభుత్వ శాఖల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇప్పుడు ఆ పన్నులు మోయలేని భారంగా మారాయి. అగ్రస్థానంలో ప్రభుత్వ ఆస్పత్రి.. బకాయిల జాబితాను పరిశీలిస్తే జిల్లా కేంద్ర ఆస్పత్రి అత్యధికంగా రూ. 3.58 కోట్లకుపైగా బల్దియాకు బకాయి పడింది. రూ. 42.13 లక్షలతో రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. మెడికల్ క్వార్టర్స్కు సంబంధించి రూ. 29.56 లక్షలు బకాయి ఉన్నారు. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులకే నిధులు సరిపోతున్నాయని, ఆస్తి పన్నుల చెల్లింపునకు నిధుల కొరత ఉందని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో బల్దియా.. కామారెడ్డి మున్సిపాలిటీకి ఆస్తి పన్నుల బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు ఆదాయ వనరులు పెరగడం లేదు. దీంతో బల్దియా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కూడాలేదు. బకాయిలు వసూలు చేస్తే బల్దియా అభివృద్ధి పథంలో పయనించడానికి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.మున్సిపల్ కార్యాలయంఆస్తి పన్ను బకాయిలపై ఏటా ప్రభుత్వ శాఖలకు నోటీసులు ఇస్తున్నాం. బకాయిల వివరాలను ఉన్నతాధికారులకు, సీడీఎంఏకు నివేదించాం. అసలు కంటే వడ్డీలు ఎక్కువవుతున్నాయి. కనీసం 50 శాతం బకాయిలు వసూలైనా మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంది. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డిఏరియర్స్ : రూ. 2,93,29,643 ఏరియర్స్పై పెనాల్టీ : రూ. 5,17,00,504 ప్రస్తుత పన్ను : రూ. 35,21,296 ప్రస్తుత పన్నుపై పెనాల్టీ : రూ. 4,22,283 మొత్తం బకాయిలు : రూ. 8,49,73,726చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్నులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏళ్ల తరబడిగా బకాయి పడడంతో అసలుకన్నా వడ్డీలే ఎక్కువయ్యాయి. కామారెడ్డి బల్దియాలో రూ. 8.49 కోట్లపైనే పన్నులు వసూలు కావాల్సి ఉంది. – కామారెడ్డి టౌన్ ఏళ్ల తరబడిగా ఆస్తి పన్ను చెల్లించని కార్యాలయాలు చెల్లించాల్సింది రూ. 8.49 కోట్లపైమాటే.. కామారెడ్డి మున్సిపాలిటీకి తప్పని ఆర్థిక ఇబ్బందులు -
క్రైం కార్నర్
మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై నాగభూషణం తెలిపారు. వివరాలు ఇలా.. సిర్పూర్ గ్రామానికి చెందిన పార్వతి లక్ష్మణ్ (68) రెండు నెలలుగా ఛాతి నొప్పి, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. భార్య లేనికారణంగా కొన్నిరోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అనారోగ్య కారణాలు, ఒంటరి జీవితంతో అతడు జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిలో మరొకరు.. ఎల్లారెడ్డి: పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి(53) భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటినుంచి అతడు మద్యానికి బానిసయ్యాడు. గురువారం యాదగిరి మద్యం తాగి ఇంటికి వచ్చి, డబ్బులు కావాలని కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో ఆయనను ఇద్దరు కుమారులు మందలించడంతో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పెద్దకుమారుడు మణికంఠచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని సారంగాపూర్ ప్రధాన రోడ్డులోగల పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు 6వ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. బంక్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి, విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించగా, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. సాయిప్రసాద్ అనే వ్యక్తి శుక్రవారం తన బైక్ను రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్చేసి స్టేషన్లోకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
నూతన కార్యవర్గం..
బీజేపీ రాజంపేట నూతన కార్యవర్గం.. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలు కార్యకర్తలు సమావేశమై నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుర్రాల రాము, ప్రధానకార్యదర్శిగా కొత్తిమీర్కర్ వంశీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రెండోసా రి ఎన్నికై న గుర్రాల రాము మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కామారెడ్డి ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపే తం చేస్తానన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు సంపత్రెడ్డి, నేతలు పిట్ల శ్రీనివాస్, గంగారెడ్డి పాల్గొన్నారు. యాడారం బీజేపీ కార్యవర్గం.. బీబీపేట: యాడారం గ్రామంలో బీజేపీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం మండలాధ్యక్షుడు అల్లం ప్రవీణ్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. బీజేపీ గ్రామాధ్యక్షుడిగా పిడుగు కిశోర్, ప్రధాన కార్యదర్శిగా పోసానిపల్లి రవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నక్క రవీందర్, కుమార్, శ్రీనివాస్, ధర్మారెడ్డి, భరత్ రాజు, మధు, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. మజీద్ నూతన కమిటీ.. బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద పట్టణంలోని ఆబెదీన్ మజీద్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సయ్యద్ మోయిజ్, ఉపాధ్యక్షులుగా షేక్ హుస్సేన్, షేక్ జలాల్, నదీం బబ్లు, ప్రధాన కార్యదర్శిగా బాబుమియా, ట్రెజరీగా నిస్సార్, నజీర్ పటేల్, సలహాదారులుగా మోయినొద్దిన్, అబ్దుల్ వహీద్, షేక్ ఉస్మాన్లను ఎన్నుకున్నారు. పాత కమిటీ గత 10 ఏళ్లు కొనసాగింది. నూతన కమిటీతో పాటు పెద్దల సూచనలతో మజీద్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని అధ్యక్షుడు సయ్యద్ మోయిజ్ అన్నారు. గ్రామ పెద్దలు మొయినోద్దిన్, సయ్యద్ నజీర్, ఇమాం మౌలాన షేక్ రిజ్వాన్ ఖాస్మీ, అబ్దుల్ గఫార్, అబ్రార్అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు సందాని, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో రవీందర్ గౌడ్ సూచించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వార్డులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న సమస్యలు, మందుల నిలువ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. డాక్టర్ సంగీత్, ఉత్తునూరు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎల్లారెడ్డిలో బస్సుడిపో ఏర్పాటు చేయండి
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● మంత్రులను కలిసి వినతిపత్రం అందజేతనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డిలో నూతనంగా బస్సు డిపోను ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. హైద్రాబాద్లో గురువారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ప్రిన్సిపాల్ సెక్రటరీ, టీజీయస్ఆర్టీసీ ఎండీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పాల్గొని పలు సమస్యలను వివరించారు. ఎల్లారెడ్డి పట్టణంలో నూతన బస్సుడిపోను ఏర్పాటు చేయాలని, ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, బాన్స్వాడ తదితర ప్రాంతాలకు అదనపు బస్సు లను నడపాలన్నారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టి అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని మంత్రులను ఎమ్మెల్యే అభ్యర్థించారు. -
ఆయకట్టుకు నిజాంసాగర్ భరోసా
● ఇప్పటికే నాలుగు విడతల్లో అందిన నీరు ● మరో రెండు తడుల్లో గట్టెక్కనున్న పంటలు ● ప్రాజెక్టులో 10.5 టీఎంసీల నిల్వనిజాంసాగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద పంట పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులో ఇంకా పది టీఎంసీలకుపైగా నీరుండడంతో ఈసారి సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదని రైతులు పేర్కొంటున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.5 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. మొదటి డిస్ట్రిబ్యూటరి నుంచి 49వ డిస్ట్రిబ్యూటరి వరకు నీరందుతోంది. యాసంగి సీజన్లో ఇప్పటివరకు నాలుగు విడతలలో కలిపి 10.7 టీఎంసీల సాగునీరందించారు. మొదటి విడతలో గతేడాది డిసెంబర్ 8 నుంచి జనవరి 7 వరకు 3.2 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రెండో విడతలో జనవరి 12 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 2.6 టీఎంసీలు, మూడో విడతలో ఫిబ్రవరి 9 నుంచి 24 వరకు 2.1 టీఎంసీల నీటిని అందించారు. నాలుగో విడతలో ఈనెల 4 నుంచి 21 వరకు 2.7 టీఎంసీల నీటిని వదిలారు. నెల రోజుల్లో పంటలు చేతికి.. నిజాంసాగర్ ప్రధాన కాలువ కింద బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట్, నందిపేట, బోధన్ మండలాల పరిధిలో ముందస్తుగా పంటలు సాగు చేశారు. ఆయా ప్రాంతాల్లోని పంటలు నెలరోజుల్లో కోతకు రానున్నాయి. అప్పటి వరకు ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మరో రెండు విడతల్లో సాగు నీరు అందించనున్నారు. ఆశాజనకంగా నీరు.. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,399.12 అడుగుల (10.5 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.నిజాంసాగర్ ఆయకట్టు కింద కళకళలాడుతున్న వరి పంట -
ముగిసిన కోలలు, భజన పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా గోపాల్పేట ఆర్యవైశ్య కళ్యాణమండపంలో బీజేపీ మండల నాయకులు కొండ మీరాతాయి ఆధ్వర్యంలో మూడురోజులుగా నిర్వహించిన కోలలు, భజనల మండలస్థాయి పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీలలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు కళాబృందాలు పాల్గొన్నాయి. కోలల పోటీల్లో మండలంలోని చిన్నఆత్మకూర్ జట్టు ప్రథమస్థానంలో నిలిచి రూ.5వేలు, రాఘవపల్లి జట్టు ద్వితీయస్థానంలో నిలిచి రూ.3వేలు, లింగంపల్లికలాన్ తృతీయస్థానంలో నిలిచి రూ.2వేలు, భజనపోటీల్లో మాల్తుమ్మెద జట్టు ప్రథమస్థానంలో నిలిచి రూ.5వేలు, జప్తిజాన్కంపల్లి జట్టు ద్వితీయస్థానంలో నిలిచి రూ.3 వేలు, నాగిరెడ్డిపేట జట్టు తృతీయస్థానంలో నిలిచి రూ.2వేల నగదును గెలుచుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న ప్రతిజట్టుకు రూ.1,500చొప్పున అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్మోహన్రెడ్డి, నేతలు హన్మాండ్లు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: ప్రస్తుతం సోషల్ మీడియా పట్ల విద్యార్థులందరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్సై విజయ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మైనర్లపై జరుగుతున్న నేరాలు, ప్రేమలు, మోసాలు అనే అంశంపై జిల్లా పోలీసు శాఖ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. హెచ్ఎం రవీంద్రారెడ్డి, ఏఎస్సై సుబ్రహ్మణ్యం, పోలీసు కళాబృందం తిరుపతి, శేషారావు, సాయిలు, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: నర్సరీలో మొక్కలతో పాటు రోడ్డు పక్కల పెట్టినటువంటి మొక్కలను జాగ్రత్తగా కాపాడాలని డీఆర్డీఏ అసిస్టెంట్ పీడీ వామనరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నర్సరీ, మల్బరీ సాగు, ఉపాధి హామీ పనులు పరిశీలించారు. మల్బారి సాగు పట్ల రైతులు అవగాహన పెంచుకొని లాభాలు పొందాలని సూచించారు. సర్పంచ్ ఏదుళ్ల సాద్విక, ఏంపీవో అబ్బాగౌడ్, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద కోర్డు ఆవరణలో గురువారం బార్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రకాష్ పటేల్, ఉపాధ్యక్షుడిగా శివాజీ, ప్రధాన కార్యదర్శిగా మనోజ్ కుమార్, సీనియర్ న్యాయవాదులను సలహాదారులుగా ఎన్నుకున్నారు. అనంతరం న్యాయవాదులు నూతన కమిటీని సన్మానించారు. సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ్రావు, మల్లేశం, విఠల్, విఠల్రావు, మహ్మద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద(జుక్కల్): బైక్ చోరీ కేసులో నిందితుడు చౌహాన్ అర్జున్ను గురువారం పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. సీతారాంపల్లికి చెందిన ఎర్రోళ్ల గంగాబోయి ఈ నెల 23న బిచ్కుందలోని సినిమా థియేటర్ వద్ద హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ పార్క్ చేశాడు. ఆ తర్వాత కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 25న బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా బైక్పై వచ్చిన వ్యక్తిని విచారించగా, బైక్ను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. చౌహాన్ అర్జున్ను రాజుల్లా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరింత విచారణ చేయగా కందర్పల్లి, ఫత్లాపూర్, జుక్కల్, బాన్సువాడ, నాగిరెడ్డిపేట్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు వెల్లడైందని ఎస్సై తెలిపారు. చాకచాక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై రాజు, కానిస్టేబుల్ మహ్మద్ నదీమ్, ఉపేంద్రను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. మాచారెడ్డి: సెల్ ఫోన్ల చోరీ కేసులో గురువారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మండలంలోని అంకిరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు చందు గజ్యానాయక్ తండా చౌరస్తాలో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చందుకు చెందిన సెల్ దుకాణం తాళాలు పగలకొట్టి మూడు ఫోన్లు, కొంత నగదును దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో గురువారం గజ్యానాయక్ తండా చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అంకిరెడ్డిపల్లి తండాకు చెందిన అజ్మీర అశోక్ అలియాస్ గణేశ్ పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ వివరించారు. నస్రుల్లాబాద్: రేషన్షాపులను బినామీలు నిర్వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి అన్నారు. గురువారం దుర్కి, సంగం గ్రామాల్లో గల రేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపులో గల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కేసులు పెడతామన్నారు. కామారెడ్డిఅర్బన్: శ్రీహరికోట ఇస్రో సందర్శనకు పట్టణ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్టు హెడ్మాస్టర్ గంగాకిషన్ తెలిపారు. పాఠశాల 8,9 తరగతుల విద్యార్థులు శ్రీహిత, వర్షిక, శివహాస్లు ఎంపిక కాగా ఈ నెల 27న(నేడు) సందర్శన బృందంలో వెళ్తున్నట్టు హెడ్మాస్టర్ పేర్కొన్నారు. -
‘లక్ష్యాలను చేరుకోవాలి’
కామారెడ్డి క్రైం: రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధ వారం కలెక్టరేట్లో డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మంజూరు చేసి న రుణాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బ్యాంకర్లు ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరీ పెంచాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఎల్డీఎం చంద్రశేఖర్, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: జన గణనలో భాగంగా మొదటి దశలో చేపట్ట నున్న గృహ జాబితా, గృహ గణన కార్యక్రమం మే 11 న ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సర్వే నిర్వహించే క్లర్కులు, టీఏలు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు కలెక్టరేట్లో మూడు రోజు ల పాటు నిర్వహించిన శిక్షణ గురువారం ముగిసింది. ము గింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జన గణనపై ప్ర తి అధికారి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నమో దు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు. -
వికసిత భారత్లో జియోఇన్ఫర్మాటిక్స్ కీలక పాత్ర
● అనంత టెక్నాలజీ వైస్ చైర్మన్, శాస్త్రవేత్త మాచర్ల నవీన్కుమార్ భిక్కనూరు: వికసిత భారత్, మేక్ఇన్ ఇండియాలో జియోఇన్ఫర్మాటిక్స్ టెక్నా లజీ కీలకపాత్ర పోషిస్తుందని అనంత టెక్నాలజీ వైస్ చైర్మన్, శాస్త్రవేత్త మాచర్ల నవీన్కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో మూడు రోజులుగా జరుగుతున్న జియోఇన్ఫర్మాటిక్స్ జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో భారతదేశంలో జీఐఎస్ విభాగంలో పది లక్షల ఉద్యోగాలు అవసరమని, కోటి పది లక్షలకు పైగా జియో స్పెషల్ విభాగంలో వ్యాపారం జరుగుతుందన్నారు. మొదటగా జీఐఎస్ను సైన్యం అవసరాల కోసం వాడేవారని ప్రస్తుతం జీఐఎస్ జీపీఎస్ లేని రంగం లేదన్నారు. చంద్రయాన్ –1, చంద్రయాన్–2, మంగళయాన్ విజయవంతమైన ప్రయోగాల్లో అ నంత టెక్నాలజీస్ కీలక పాత్ర పోషించిందన్నారు. విధ్యార్థులు జీపీఎస్ ఉపయోగించి ఏవిధంగా మ్యాపులను చిత్రీకరించాలో దోమకొండ గ్రామంలోని రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మ్యాపులను ప్రత్యక్షంగా విద్యార్థులతో తయారు చేయించారు. ఎన్ఐఆర్డీ శాస్త్రవేత్త ఎం.వి.రవిబాబు, యోగి వేమన యూనివర్సిటీ ప్రొ ఫెసర్ శివప్రతాప్, తెలంగాణ యూనివర్సిటీ సైన్స్ డీన్ సంపత్, శాస్త్రవేత్త రా మస్వామి,సౌత్క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్,తదితరులు పాల్గొన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): ఈ నెల 28న గాంధారి తైబజార్, పశువుల దాఖలా చిట్టీ వేలం వేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు గురువారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు తైబజారుకు రూ.1.5 లక్షలు, దాఖలా చిట్టీ వేలంకు రూ.35 వేల డిపాజిట్ చెల్లించాలన్నారు. తైబజారు, దాఖలా చిట్టీలు దక్కించుకున్న వారు 7 రోజుల్లో వేలం పాటలో 50 శాతం డబ్బులు చెల్లించాలన్నారు. మిగతా డబ్బులు వాయిదాల పద్ధతిలో పంచాయతీ నిబంధనల మేరకు చెల్లించాలన్నారు. వేలం పాటలో దక్కని వారికి చెల్లించిన డిపాజిట్లో నుంచి రూ.5 వేలు మినహాయించి మిగతా డబ్బులు అదే రోజు చెల్లిస్తామన్నారు. కామారెడ్డి అర్బన్: ఫర్నిచర్ రంగంలో యువతకు మూడు నెలలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ అంబర్పేటకు చెందిన ఎఫ్ఎఫ్ఎస్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎన్ఎస్టీఐ ముందుకు వచ్చిందని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం శిక్షణకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. కనీసం పదవ తరగతి పాసై 50 యేళ్లలోపు వారు వివరాలకు 76739 76699 నంబర్కు సంప్రదించాలని ప్రతినిధులు అనవిలాసిని, విశ్వనాథ్మోహన్ తెలిపారు. కామారెడ్డి అర్బన్: అన్ని కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ,మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ రెన్యూవల్ కోసం ఏప్రిల్ 20 వరకు తెలంగాణ ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాల బాధ్యులు విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. డిచ్పల్లి: మండలంలోని నడిపల్లి తండాకు చెందిన బట్టు వినోద్, భార్య కవిత గురువారం ఉదయం గుర్తు తెలియని మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడినట్లు ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. బట్టు బలరాం కొడుకు వినోద్ నాలుగు సంవత్సరాల క్రితం అదే తండాకు చెందిన బదావత్ గేమ్య వద్ద ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాడు.ఈ ప్లాట్ విషయంలో కొంతకాలంగా గేమ్య కుటుంబంతో గొడవ జరుగుతోంది.వినోద్ ఈ ప్లాట్లో ఇందిరమ్మ ఇల్లు ని ర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బుధవారం రాత్రి బట్టు వినోద్కు సంబంధించిన ఆవు బదావత్ నాందేవ్ ప్లాట్లోకి వెళ్లింది. దీంతో నాందేవ్ అతని భార్య, ఇద్దరు కొడుకులు, కోడలు వెళ్లి వినోద్, కవితలతో గొడవ పెట్టు కున్నా రు. తిరిగి గురువారం ఉదయం మళ్లీ గొడవ పెట్టుకోవడంతో మనస్థా పానికి గురైన వినోద్ అతని భార్య కవిత గుర్తు తెలియని మందు తాగి అపస్మారక స్థి తికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు వెంటనే వారిని నిజా మాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వారు తీసుకున్న మందు ఏమిటన్నదీ తెలియకపోవడంతో వైద్యులు సరైన చికిత్స అందించలేపోతున్నారని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం దంపతుల పరిస్థి తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలుకే!
● ఒకేరోజు 384 మందికి శిక్షలు విధించిన కోర్టు ● 37 మందికి జైలు.. మిగిలినవారికి జరిమానాలుకామారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు నిందితులకు జరిమానాలతోపాటు జైలు శిక్షలూ విధిస్తోంది. బుధవారం ఒకేరోజు 384 మంది మందుబాబులకు జిల్లా న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. 31 మందికి ఒక రోజు, నలుగురికి ఐదు రోజులు, మరో ఇద్దరికి ఏడు రోజుల జైలు శిక్ష వేశారు. మిగిలిన వాహనదారులకు మొత్తం రూ. 3,94,500 జరిమానా విధించారు. ఒకే రోజు ఇంత మందిపై చర్యలు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.మద్యం సేవించి వాహనం నడపడం అంటే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టడమే. బాధ్యతాయుతమైన ప్రయాణమే కుటుంబానికి భరోసా ఇస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీ -
జిల్లాకు నాలుగు టీపీఎస్లు!
● కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిట్లం, బాన్సువాడల్లో ఏర్పాటు ● నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ఒకే చోట ● కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్నది లక్ష్యం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో పాఠశాల చొప్పున నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో కామారెడ్డి నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాన్సువాడ నియోజకవర్గం నుంచి బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట 1,500 మంది చదువుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. ఇప్పుడున్న భవనాల్లోనే వీటిని ప్రారంభిస్తారు. కార్పొరేట్కు దీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్కు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్కు మంచి స్పందన రావడంతో వాటిని విస్తరించేందుకు ప్రభుత్వం నియోజకవర్గానికో స్కూల్ ఏర్పాటుకు పూనుకుంది. పేద, మధ్యతరగతి పిల్లలకు మంచి విద్యనందించే లక్ష్యంగా పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను వచ్చే విద్యాసంవత్సరం(2026–27) నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన బడులను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో మౌ లిక సదుపాయాలను మెరుగుపరిచి తరగతులు ప్రారంభించనున్నారు. తరువాత 1500 మంది విద్యార్థులకు సరిపడా గదు లు, సౌకర్యాలతో పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణం చేపడతా రు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల్ని చదివించేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తోంది. అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు నర్సరీ నుంచి 12 వ తరగతి దాకా ఒకే చోట చదువుకునేందుకు వీలు కలుగుతుంది. -
ఇందిరమ్మ ఇళ్ల వద్ద విద్యుత్ స్తంభాలు తొలగించాలి
దోమకొండ: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద విద్యుత్ స్తంభాలు తొలగించాలని దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య కోరారు. బుధవారం వి ద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లపై నుంచి వెళ్లే కరెంటు తీగలను అక్కడి నుంచి తీసివేయాలని కోరారు.మండల కేంద్రంలో ఇండ్ల నిర్మా ణం చేస్తున్న చోట విద్యుత్ వైర్లు ఇళ్లపై నుంచి ఉ న్నందున నూతనంగా ఇళ్ల నిర్మాణం చేసేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని వెంటనే అక్కడినుండి తీసివేయాలని సూచించారు. వేసవికాలంలో ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. డంపింగ్యార్డు నిర్వహణకు రూ.50 లక్షల మంజూరు దోమకొండ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి డంపింగ్ యార్డ్ నిర్వహణకు డీఆర్డీవో స్వచ్ఛ్ భారత్ నుంచి రూ.40 లక్షలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సహకారంతో మరో రూ.10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. అలాగే దోమకొండ గడికోట ట్రస్ట్ నిర్వాహకులు కామినేని అనిల్కుమార్ సైతం గ్రామంలో విద్యుత్తు సరఫరా నిర్వహణకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ట్రాన్స్కో ఏఈ విజయ్భాస్కర్, సిబ్బంది సురేష్, నవీన్, సంపత్, ఉప సర్పంచ్ శ్రీనివాస్లున్నారు. -
ఆలయ అభివృద్ధికి విరాళం
మాచారెడ్డి: చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం కామారెడ్డికి చెందిన పైడి గంగామణి, మధుసూదన్రెడ్డి దంపతులు రూ.71 వేలు బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభురామచంద్రం దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి శాలువా కప్పి సత్కరించారు. జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు పరంధామాచారి ఉన్నారు. మాచారెడ్డి: మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు పరిశుభ్రత పాటించాలని పాల్వంచ ఎంఈవో మనోహర్రావు సూచించారు. బుధవారం పాల్వంచ మండలం ఇసాయిపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే ప్రదేశాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. వంట చేసే వ్యక్తులు తలకి కుకింగ్ క్యాప్స్ ధరించాలన్నారు. హెచ్ఎంలు దయానంద్, భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు. గాంధారి: లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గాంధారి తహసీల్ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ రేణుక చౌహాన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు సంజీవ్ యాదవ్, గణేష్, రమేష్, బాబా, మదార్, బాలు తదితరులు పాల్గొన్నారు. డీఎస్హెచ్గా మార్పు.. వైద్యుల హర్షం కామారెడ్డి టౌన్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్పు కోసం విశేష కృషి చేసిన ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ను బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మార్పు వల్ల వైద్యులు, సిబ్బందికి ఎదురవుతున్న వేతన సమస్యలు, ఇతర పరిపాలనాపరమైన ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. వైద్యులు కిషోర్, పరిపాలనా అధికారులు లక్ష్మణ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: దేశవ్యాప్త జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీల కుటుంబాలను కూడా లెక్కించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టి, స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడం శోచనీయమని, కేంద్రం మాట తప్పితే దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్, రాము తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : దేశంలోని పాలకులు కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ, కార్మికులను, వ్యవసాయ కూలీలను వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్నారని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ. రామచందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభల ముగింపు సభను స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గుతాయని, అందుకే రైతులకు కనీస మద్దతు ధర పెరగకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో 69 శాతం మంది రైతులు హెక్టారులోపు భూమి కలిగిన వారే ఉన్నారని, గత్యంతరం లేక వారు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. కృష్ణ, పి. రామకృష్ణ, నేతలు వి. ప్రభాకర్, బి. రాము, వి.గోదావరి, పి. రామకృష్ణ, ఆర్. రమేష్, ఎ. సురేష్ పాల్గొన్నారు. పెట్రోల్ కోసం క్యూ ఎల్లారెడ్డిరూరల్: పెట్రోల్ కొరత వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వాహనదారులు పెట్రోల్ బంక్లకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో తమకు సరిపోతుందో లేదోనని క్యూలో ఉన్న వాహనదారులు ఆందోళన చెందారు. -
జీపీ పెండింగ్ బిల్లులు చెల్లించండి
● బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా షెట్కార్కు పంచాయతీ కార్యదర్శుల వినతి ● చెల్లించాల్సిన బిల్లులు రూ.3.5 లక్షలుబిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ కార్యదర్శులు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ సీమ షెట్కార్, వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్యదర్శులు మాట్లాడుతూ.. గోపన్పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి మూడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేశారని, జీపీల ప్రత్యేక అధికారుల పాలనలో జీపీలో నిధులు లేకపోవడంతో కార్యదర్శులు సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించారని అన్నారు. చేసిన పనుల తీర్మానం కాపీలు, బకాయిలు ఉన్నాయని, ఫర్నిచర్, రికార్డులు పూర్తి నివేదిక మున్సిపల్ అధికారులకు అప్పట్లో అప్పగించామని చెప్పారు. మూడు జీపీలకు సుమారు రూ.3.5 లక్షలు బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు చెల్లించడానికి కృషి: చైర్పర్సన్ మూడు జీపీల బకాయి బిల్లులు గురించి కలెక్టర్తో మాట్లాడి చెల్లించడానికి తనవంతు కృషి చేస్తానని చైర్పర్సన్ సీమ షెట్కార్ కార్యదర్శులకు భరోసా కల్పించారు. కమిషనర్ ఖయ్యుంతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఎంబీ రికార్డు ఉన్న వాటికి ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తాయని ఎంబీ లేని వాటికి రావని కమిషనర్ తెలిపారు. ట్రాక్టర్ల ఈఎంఐలు, బ్యాంకుకు చెల్లించిన కిస్తీలు, విద్యుత్ బల్బులు, బోరు మరమ్మతులకు ఎంబీ రికార్డులు ఉండవని.. బకాయిలు ఉన్నాయని జీపీ రికార్డులు అప్పగించేటప్పుడు బల్దియా అధికారులకు వివరాలు ఇచ్చామని తెలియజేశారు. -
విపత్తులపై అవగాహన అవసరం
● అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: విపత్తులపై అవగాహన పెంచుకుని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్, జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పెద్ద చెరువు వద్ద బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యవేక్షించారు. ప్రకృతి విపత్తులు, భారీ వరదల సమయాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలే విధానం, ప్రజలను ఎలా రక్షించాలి, చిక్కుకుపోయిన వారిని రక్షించే పద్ధతులు, గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించే విధానం, అత్యవసర సేవలకోసం ఎలా సంప్రదించాలి తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మాక్ డ్రిల్ల ద్వారా విపత్తుల సమయంలో ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా, సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చన్నారు. మాక్ డ్రిల్లో అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సహాయక బృందాల కమాండర్ డోల్ సింగ్, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ వైద్య సిబ్బంది, ఎన్సీసీ కెడెట్లు, స్థానికులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి కామారెడ్డి క్రైం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కామారెడ్డిలోని రాజీవ్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు సాయి ఈశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయాలి’
కామారెడ్డి టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులను పూర్తి చేసి, అర్హులకు పంపిణీ చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలపై, ముఖ్యంగా గృహ నిర్మాణ పథకాలపై మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. సరైన నిర్వహణ లేక వేల సంఖ్యలో ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. చాలాచోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని, విద్యుత్ కనెక్షన్లు, నీటి సౌకర్యం లేవని పేర్కొన్నారు. పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటి పనులు వెంటనే పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. కామారెడ్డి అర్బన్: ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఫేజ్ –1 దరఖాస్తు గడుపును ఏప్రిల్ 2 వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో టూ వీలర్, త్రీవీలర్, ఎలక్ట్రికల్ వాహనాలు, సోలార్ పంపు, పాడిగేదెలు, వ్యవసాయ డ్రోన్లు, వ్యవసాయ పరికరాలు, పట్టు పెంపకం, పందిరి తీగల కూరగాయల పెంపకం, మైనర్ ఇరిగేషన్ కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం టీజీవోబీఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎన్వై గిరి నియమితులయ్యారు. కొద్ది రోజులుగా ఆయన రెవెన్యూ శాఖలో వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ ఆర్డీవోగా విధులు నిర్వహించిన వీణను దేవాదాయ శాఖలోని భూముల సంరక్షణ విభాగం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎన్వై గిరికి పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం గిరి కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి టౌన్ : జిల్లాలోని గాంధారి, మద్నూర్ సీహెచ్సీలలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ విజయ్ భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కలెక్టరేట్లోని రూం నంబర్ 105లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు 28న సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. ● అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో గేదెకు తీవ్ర గాయాలు ● వేటగాళ్ల పనే అంటున్న గ్రామస్తులు సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో నాటు బాంబు కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణులను పట్టుకోవడం కోసం తవుడులో నాటు బాంబును పెట్టారు. మేత మేసుకుంటూ వెళ్లిన అడ్లూర్ ఎల్లారెడ్డిలోని కుమ్మరి శ్రీనివాస్కు చెందిన గేదె.. ఆ తవుడును తినగా నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడింది. బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
భూగర్భ జలాలను సంరక్షించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రస్తుతమున్న భూగర్భ జలాలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. లింగంపల్లికలాన్లో బుధవారం భూగర్భ జలాల సంరక్షణ విషయమై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అధికారి మహేష్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో ప్రభాకర్ చారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజ్ కుమార్, ఈసీ సాయిలు, కార్యదర్శి వనజ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: ప్రజల దైనందిన జీవితంలో జియో ఇన్ఫర్మాటిక్స్ భాగంగా మారిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రామ్మూర్తి అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో జరుగుతున్న జియో ఇన్ఫర్మేటిక్స్ సెమినార్ రెండవ రోజులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలోని జాగ్రఫికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా మ్యాపింగ్ చేయాలో విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ పావని, ప్రొఫెసర్ శివ ప్రతాప్, ఎన్ఆర్ఎస్సీ మాజీ డైరెక్టర్ రాఘవస్వామి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, సెమినార్ కన్వీనర్ ప్రతిజ్ఞ, ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ గుప్తా, హెచ్వోడీ కవిత, తదితరులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): పెద్దకొడప్గల్ గ్రామ శివారులో ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి కాపర్ను దొంగిలించినట్లు ఎస్సై అరుణ్కుమార్ తెలిపారు. ఎస్సై బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో ఉన్న రబ్డ్యా బంతిలాల్ అనే రైతు పక్కన ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్లను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ను దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. జీపీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. స్థలం కోసం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ ఎల్లారెడ్డిరూరల్: నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం కోసం ఇరు గ్రామాల మధ్య బుధవారం ఘర్షణ చోటుచేసుకుంది. అక్కంపల్లి జీపీ భవన నిర్మాణం కోసం గ్రామశివారులోని సర్వే నం.95/1లో పనులు చేపట్టేందుకు అక్కంపల్లి గ్రామస్తులు ప్రయత్నించారు. విషయం తెలసుకున్న అదే పంచాయతీ పరిధిలోని కిచ్చన్నపేట గ్రామస్తులు అక్కడికి చేరుకొని తాము కబ్జాలో ఉన్న స్థలంలో జీపీ భవనాన్ని ఎలా నిర్మిస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరుగ్రామాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి ఎస్సైలు భార్గవ్గౌడ్, దీపక్ కుమార్, సుబ్రమణ్యచారి తమ సిబ్బందితో అక్కంపల్లి గ్రామానికి చేరుకొని ఇరు గ్రామాల ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇరు గ్రామాల ప్రజలు వినిపించుకోకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. మాచారెడ్డి: మండలంలోని పోలంపల్లి శాంతానంద తపోవన ఆశ్రమంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశేషాలు నిర్వహించినట్లు నిర్వాహకుడు స్వామి తెలిపారు. ఆలయ ధర్మకర్త రాజమౌళి గుప్తా దంపతులు, గ్రామస్తులు ఉన్నారు. -
నియోజకవర్గాలు!
మరో నాలుగుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతటా అదే చర్చ సాగుతోంది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను 50 శాతం మేరకు పెంచనున్నట్లు సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జనాభా 15,71,022, కామారెడ్డి జిల్లాలో 9,72,625 ఉంది. ఇక గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో మహిళా కోటా శాసనసభ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లా నుంచి గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పలువురు నాయకులతోపాటు మహిళా నాయకురాలు సైతం చట్టసభలో ప్రాతినిధ్యంకోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పటికీ, తాజాగా నిర్వహించే జనాభా లెక్కలు, కులగణన మేరకు చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 శాసనసభ సీట్లు 8కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఒక శాసనసభ సీటు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండనున్న నేపథ్యంలో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, పొతంగల్ మండలాలను సైతం నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఈ మండలాలు బోధన్ నియోజకవర్గం పరిధిలోకి కలుపనున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాలను మరో నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా భీమ్గల్, నందిపేట, నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్పల్లి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ● నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ నార్త్, ఎడపల్లి మండలాలు, విలీన గ్రామాలు ● నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, మోపాల్, మోస్రా ● డిచ్పల్లి: డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి ● భీమ్గల్: భీమ్గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్ ● బాల్కొండ: బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి ● ఆర్మూర్: ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్ ● నందిపేట: నందిపేట, నవీపేట, రెంజల్, మాక్లూర్ ● బోధన్: బోధన్, సాలూర, వర్ని, చందూర్, రుద్రూర్, పొతంగల్, కోటగిరి ● బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, మహ్మద్నగర్, నిజాంసాగర్ ● జుక్కల్: జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం, డోంగ్లి ● ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి ● కామారెడ్డి: కామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట ● దోమకొండ: దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మహిళా కోటాలో 33 శాతం సీట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182కి పెరిగితే 60 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జి ల్లా నుంచి శాసనసభలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగానే ఉండే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 9 నుంచి 13కు పెరగనున్న శాసనసభ స్థానాలు నిజామాబాద్ జిల్లాలో 5 నుంచి 8కి.. కామారెడ్డి జిల్లాలో 4 నుంచి 5కు.. ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మహిళల కోటా 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్లో 15,71,022.. కామారెడ్డిలో 9,72,625 మంది జనాభా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం పునర్విభజనపై అన్నివర్గాల్లో జోరుగా చర్చనియోజకవర్గాల పునర్విభజన చేపడితే శాసనసభా స్థానాల స్వరూపం ఈవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.. -
పదో తరగతి విద్యార్థికి పాముకాటు
● సరంపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలో ఘటన ● కామారెడ్డి జీజీహెచ్లో చికిత్స కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర శివారులోని సరంపల్లి ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి పాముకాటు కు గురవ్వడం కలకలం రేపింది. వెంటనే విద్యార్థిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు త రలించారు. ఈ ఘటనతో తోటి విద్యార్థులంతా భయాందోళనకు గురవుతున్నా రు. వివరాలు ఇలా.. గాంధారి మండలం జెమిని తండాకు చెందిన బానోత్ చరణ్ సరంపల్లి ట్రైబల్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళ వారం ఉదయం అతడు పాఠశాల గ్రౌండ్లోకి రాగా, ఎడమ కాలిపై పాము కాటు వేసింది. విద్యార్థి కేకలు వేయడంతో అప్ర మత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే అ తడిని కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చరణ్ ఆ రోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యు లు తెలిపారు. పరీక్షల సమయంలో ఈ ఘటన జరగడంతో తోటి విద్యార్థులు తీ వ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉ న్నతాధికారులు స్పందించి హాస్టళ్లలో పా రిశుధ్య పనులు చేపట్టి, విద్యార్థుల రక్ష ణకు చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం : ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్ జిల్లా ముఠాను భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. భిక్కనూరులోని పెద్దమ్మ ఆలయంలో ఈ నెల 23న చోరీ జరిగింది. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం భిక్కనూరు టోల్గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను కంచర్ల గ్రామానికి చెందిన మాట్టె అచ్యుత్, కొక్కు గణేష్గా గుర్తించారు. వారిద్దరూ కలిసి పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇసన్నపల్లి, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ఆలయాల్లోనూ దొంగతనాలు చేశారని గుర్తించారు. మరో 10 చోరీల్లో వారు నిందితులుగా ఉన్నారు. గణేష్ గతంలో జైలుకు వెళ్లివచ్చాడు. నిందితుల నుంచి భిక్కనూరు ఆలయంలో చోరీ చేసిన పెద్దిరాజు ఇత్తడి విగ్రహం, పలు రోల్డ్గోల్డ్ ఆభరణాలు, ఆలయాల్లోని సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
బీజేపీ ఆధ్వర్యంలో కోలాల పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలోని ఆర్యవైశ్యసంఘం కల్యాణ మండపంలో మంగళవారం బీజేపీ నేత కొండ మీరాతాయి ఆధ్వర్యంలో కోలాల పోటీ లు నిర్వహించారు. అలాగే బుధవారం మండలస్థా యి భజన పోటీలు జరుపనున్నట్లు మీరాతాయి తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3వేలు, తృతీయ బహుమతిగా రూ.2వేలు అందించనున్నట్లు ఆమె చెప్పారు. పోటీల్లో పాల్గొన్న ప్రతిజట్టుకు రూ.1,500 నగదుతోపాటు షీల్డ్లను అందించనున్నట్లు ఆమె వివరించారు.ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన బాన్సువాడ: ఆడపిల్లల ప్రాముఖ్యతపై మంగళవారం బాన్సువాడ మాత శిశు ఆస్పత్రిలో ఆడపిల్లల తల్లులకు అవగాహన కల్పించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారితా కేంద్రం భేటీ జన్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో సౌభాగ్య మాట్లాడుతూ.. ఆడపిల్లలకు కల్పించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. బేబీ కిట్స్ పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ విజయభాస్కర్, వైద్యులు దివ్య, సుధ, ఆర్ఎంవో సుజాత, తదితరులు ఉన్నారు. -
సమన్వయంతో పని చేయాలి
కామారెడ్డి క్రైం: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు. అతి భారీ వర్షాలు, వరదలు లాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాలన్నారు. సమాచారం, సహాయక చర్యలు, పునరావాసం కల్పించడం లాంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు ఉండాలని సూచించారు. గతంలో జరిగిన వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆర్డీవో వీణ, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్కే సేవలను సద్వినియోగం చేసుకోవాలి
● డీఎంహెచ్వో డాక్టర్ రవీందర్ గౌడ్ ● జీజీహెచ్లో అడ్వొకసీ, సెన్సిటైజేషన్ కార్యక్రమంకామారెడ్డి టౌన్ : జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సంపూర్ణ సురక్ష కేంద్రం(ఎస్ఎస్కే) ద్వారా అందించే సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్వో రవీందర్గౌడ్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎస్ఎస్కే ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వకసీ, సెన్సిటైజేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కామారెడ్డిని హెచ్ఐవీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవి బారిన పడే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఎస్ఎస్కే ఒక ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. జీవితకాలం పాటు వారు ఈ వ్యాధి బారిన పడకుండా అవసరమైన సలహాలు, పరీక్షలు, చికిత్సను ఈ కేంద్రం అందిస్తుందని తెలిపారు. కేంద్రానికి సంబంధించిన సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా పరిచయం చేశారు. ఎస్ఎస్కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హెచ్ఐవీ, ఎస్టీడీ(లైంగిక వ్యాధులు) పట్ల అవగాహన కల్పిస్తూ, జాతీయ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ 1097 ప్రాముఖ్యతను వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఏఆర్టీ వైద్య అధికారులు స్నేహ, ప్రీతి, కమల, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు చంద్రప్రియ, పిల్లల వైద్యులు శిరీష, ఆఫీసర్ పద్మజ, డీపీఎం శోభ, కౌన్సిలర్లు శేఖర్ గౌడ్, లలిత కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు భరోసా పేరుతో ప్రభుత్వ మోసం
సుభాష్నగర్: రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందు రైతుల భావోద్వేగాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్.. రూ.12వేలకే పరిమితమైందన్నారు. -
‘జీవాలను పెంచి రైతులు లాభాలు పొందాలి’
కామారెడ్డి అర్బన్: రైతులు పంటలతో పాటు అనుబంధంగా అధిక మాంసం అందించే మేలుజాతి జీవాలను పెంచి లాభాలు పొందాలని జాతీయ మాంస పరిశోధన సంస్థ(ఎన్ఎంఆర్ఐ) డైరెక్టర్ సుఖ్దేవ్ బుర్బుదే అన్నారు. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, కామారెడ్డి డెయిరీ కళాశాల జాతీయ మాంస పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి కళాభారతిలో పశుసంవర్థక, వ్యవసాయ, మత్స్య, ఉద్యానవన, విజయ డెయిరీ, అధునిక వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ కంపెనీలు, బ్యాంకులు వారి వారి ఉత్పత్తుల స్టాళ్లతో కిసాన్మేళాను ఘనంగా నిర్వహించారు. కిసాన్ మేళా కరప్రతాలను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బుర్బుదే మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలు పెంచిన వారికి స్థానికంగా గిట్టుబాటవుతుందని, ప్రతిరైతు సమగ్ర అభివృద్ధికి పాడి పంటలతో పాటు జీవాలు పెంచాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు పశువైద్య విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎం.కిషన్కుమార్, శాస్త్రవేత్త బస్వారెడ్డిలు అవగాహన కల్పించారు. డెయిరీ కళాశాల అసోసియేట్ డీన్ సురేష్రాథోడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. -
ప్రజల గోస పట్టని పాలకులు
● ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకామారెడ్డి టౌన్ : దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతున్నా పాలకులకు పట్టడం లేదని, వారి తీరు దున్నపోతుపై వడగండ్ల వాన కురిసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభను మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులతో పుర వీధుల గుండా భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి వీక్లీమార్కెట్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ..పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆయుధాల వ్యాపారం కోసం అమెరికా ప్రపంచ దేశాలపై యుద్ధాలు చేస్తోందని విమర్శించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం, డప్పు నృత్యాలు ఆకట్టుకున్నాయి. నేతలు వి. ప్రభాకర్, కృష్ణ, పి. రామకృష్ణ, ఆర్. రమేష్, జి. సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో విద్యా రంగానికి నిధులు పెంచాలి
కామారెడ్డి టౌన్ : ఉపాధ్యా య, విద్యారంగ సమస్యల ను తక్షణమే పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ తెలంగా ణ పొగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవా రం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమా ర్ మాట్లాడుతూ.. విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 20 శాతం నిధులు కేటాయించాలన్నారు. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర బిల్లులను విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ వర్తింపజేయాలన్నా రు. జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్రెడ్డి, నాయకులు నరేందర్, శ్రీనివాస్, నళిని, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నిజామాబాద్ బెటాలియన్ బెస్ట్ కెడెట్గా సుధాంశు
కామారెడ్డి టౌన్ : నిజామాబాద్ ఎన్సీసీ బెటాలియన్ పరిధిలో కామారెడ్డికి చెందిన ఆర్కే డి గ్రీ కళాశాల ఎన్సీసీ యూనిట్ కెడెట్ సుధాంశు అద్భుత ప్రతిభ కనబరిచి బెస్ట్ కెడెట్ అవార్డును అందుకున్నాడు. మంగళవారం నిజామాబాద్ బెటాలియన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియజిత్ చేతుల మీదుగా సుధాంశు ఈ అవార్డుతో పాటు న గదు రివార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రియజిత్ మాట్లాడుతూ.. సుధాంశు క్రమశిక్షణ, అంకితభావం ఇతర కెడెట్లకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. విద్యార్థిని ప్రోత్సహించిన కళాశాల యాజమాన్యాన్ని, ఏఎన్వోలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆ ర్కే గ్రూప్ సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం చదువులోనే కాకుండా ఎన్సీ సీ, ఎన్్ ఎస్ఎస్, క్రీడలు, సాంస్కృతిక రంగా ల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాల డీన్ నవీన్, కో–ఆర్డినేటర్ దత్తాత్రి, ప్రిన్సిపాల్స్ గోవర్ధన్ రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు. బాన్సువాడ : మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సర్పంచ్ అనీల్కుమార్కు ఎంఆర్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామ సర్పంచి అనీల్కు వినతిపత్రం ఇచ్చారు. వార్డు సభ్యులు రాచకొండ బాలయ్య, అన్నం అనీల్, ఎంఆర్పిఎస్ నాయకులు హన్మాండ్లు, లాల య్య, సాయిలు, గంగారం, జ్ఞానేశ్వర్ ఉన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘంలో మహాజన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యదర్శి సందీప్ అర్థ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సంఘ సభ్యులు పాల్గొన్నారు. భిక్కనరు: గ్రామీణప్రాంతాల్లో జీఐఎస్, జీపీఎస్, కృత్రిమ మేధతో భవిష్యత్కు మార్గదర్శ కంగా ఉంటుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. తెయూ సౌత్ క్యాంపస్లో మంగళవారం జియో ఇన్ఫర్మెమెటి క్స్ జాతీయ సెమినార్ను ఎన్ఆర్సీ డిప్యూటీ డై రెక్టర్ రాఘవస్వామి, ఉస్మానియా ప్రొఫెసర్ బాలకిషన్లతో కలిసి వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఐఎస్, జీపీఎస్ సాంకేతికతో కృత్రిమమేధాను మిళితం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఎస్డీజీ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఎన్ఆర్సీ డిప్యూటీ డైరెక్టర్ రాఘవస్వామి మాట్లాడుతూ.. జీపీఎస్, జీఐఎ స్ సాకేంతికను ఉపయోగించుకుని ఇస్రో సాంకేతిక అనువర్తనాలను గ్రామీణ అభివృద్ధిలో మిళితం చేయవచ్చన్నారు. ప్రొఫెసర్ బాల్కిష న్ మాట్లాడుతూ.. జీఐఎస్ సాంకేతికతో నేడు ‘గిగ్ ఎకానమీ‘ ఆధారపడి ఉందన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, అధ్యాపకులు కవితా తోరన్, రాజేశ్వరి, మోహన్బాబు, నారాయణ, నాగరాజు, లలితలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 20 మందికి తీవ్ర గాయాలు
● రుద్రూర్ మండల కేంద్రంలో ఘటన ● బోధన్, నిజామాబాద్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు వైద్య సేవలురుద్రూర్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో బస్సు, లారీ డ్రైవర్లు, 18 మంది ప్రయాణికులు ఉన్నారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణికులు ఉన్నారు. బోధన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న డస్ట్ లోడ్ లారీని ఢీకొట్టింది. రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లలో బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లారీ కుర్నాపల్లి క్రషర్ నుంచి స్టోన్ డస్ట్ను పోతంగల్ మండలం పీఎస్ఆర్ నగర్లో ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణానికి తీసుకెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన స్థలాన్ని పోలీసు కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న, ఆర్టీసీ డీఎం, పోలీస్, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు బోధన్టౌన్ (బోధన్)/నిజామాబాద్ అర్బన్: బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో గాయపడి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీపీ సాయి చైతన్య పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదంలో ఓ చిన్నారి, మరో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళల ముఖాలకు గాయాలు కాగా దంతాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ కాలికి గాయం కాగా ఆంబులెన్స్లోనే చికిత్సను అందించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలాగౌడ్ తోపాటు మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
‘ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత’
నాగిరెడ్డిపేట: యువతకు ఉద్యోగాలిప్పించడం రాజకీయ వాగ్దానం కాదని, ప్రభుత్వ బాధ్యతని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన చర్యలు అవసరమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెనకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఎల్లారెడ్డి ప్రాంతంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి అర్బన్: ప్రకృతి విపత్తుల్లో ఉన్నతాధికారులు వేగవంతమైన స్పందన, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంయుక్త ఫౌండేషన్ కోర్సు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సంగ్వాన్ మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒత్తిడిలో స్థైర్యం– 2025లో కామారెడ్డి వరదలను ఎదుర్కోవడం, వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉన్న జిల్లాలను నిర్మించడం’ అనే అంశంపై ప్రసంగించారు. కొత్తగా నియమితులయ్యే గ్రూప్ వన్ అధికారులు ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని, సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోగల పలు హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు శిరీష, విక్రమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృత్రిమ రంగుల వినియోగాన్ని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి టౌన్ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్వో రవీందర్గౌడ్ సూచించారు. మంగళవారం వరల్డ్ టీబీ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ టీబీ డివిజన్ ఎంపిక చేసిన 118 గ్రామాల్లో జిల్లావ్యాప్తంగా హ్యాండ్హెల్డ్ ఎక్స్రే యంత్రాల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి టీబీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలల పాటు మందులు ఇస్తామని, పోషకాహారం కోసం ప్రతినెలా వెయ్యి రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. సకాలంలో మందులు వాడితే క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ చంద్రప్రియ, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రదీప్ కుమార్, పద్మజ, టీబీ సూపర్వైజర్ చంద్రకాంత్ పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీహరి అభినందించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం కప్ 2025–26 రెండో ఎడిషన్ విజయవంతంపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి తనను అభినందించారని వెంకటేశ్వరగౌడ్ తెలిపారు. -
కన్నోళ్లకు భరోసా!
తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కనిపెంచినవారిని పట్టించుకోని సంతానం వేతనంలోంచి 15 శాతం లేదా రూ. 10 వేలు అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ వర్తించనుంది. ఈ మేరకు తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో వృద్ధుల్లో హర్షం వ్యక్తమవుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డికన్నబిడ్డలను చదివించేందుకు, వారికోసం ఆస్తులు కూడబెట్టేందుకు తల్లిదండ్రులు ఎంతగానో చెమటోడుస్తారు. పిల్లలు చదువుకుని ప్రయోజకులైతే మురిసిపోతారు. వారు జీవితంలో స్థిరపడితే తమ కష్టాలు తీరినట్లేనని భావిస్తారు. చేతగాని వయసులో పిల్లలు ఆసరాగా ఉంటారని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. వృద్ధాప్యంలో వారు ఆశించేది కూడా పెద్దగా ఏమీ ఉండదు. పిల్లలనుంచి కాసింత ప్రేమ, నాలుగు మెతుకులు తప్ప.. అయితే పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తే.. ఉద్యోగం సంపాదించిన వారిలో కొందరు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. దీంతో చాలాచోట్ల పంచాయితీలు అవుతున్నాయి. కొందరు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. మరికొందరు ప్రజావాణికి వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే తమ పిల్లల గురించి బయట చెబితే వారి పరువు పోతుందని ఎవరికీ చెప్పుకోలేక చాలామంది తమలో తామే కుమిలిపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకూ తప్పని కష్టాలు... ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లలో చాలామంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలనెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించే వారు ఎందరో ఉన్నారు. కొందరైతే తల్లి/తండ్రి బ్యాంకు పాస్ పుస్తకం, ఏటీఎం కార్డులను తమ దగ్గరే ఉంచుకుని, వారి పెన్షన్ను ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఓ పింఛన్దారు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి తమ సంతానం నుంచి ఎదురవుతున్న కష్టాలను చెప్పుకుని కంటతడిపెట్టారు.పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ‘తల్లిదండ్రుల మద్దతు బిల్లు’ను కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారితో పాటు ప్రజాప్రతినిధులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. వారి జీతం నుంచి 15 శాతం లేదా రూ.10 వేల చొప్పున కోత విధించి తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టించుకోని కొడుకుల జీతం నుంచి కోత 15 శాతం లేదా రూ. 10 వేలు అందించేలా చర్యలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ వర్తింపు తల్లిదండ్రుల మద్దతు బిల్లును ఆమోదించిన క్యాబినెట్ హర్షం వ్యక్తం చేస్తున్న వృద్ధులు -
నిందితులను పట్టుకున్న బీట్ పోలీసులు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి కొత్త బస్టాండ్లో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ను చోరీ చేసి పరారైన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ ప్రశాంత్రెడ్డి, హోంగార్డు నర్సింలు సోమవారం రాత్రి వివేకానంద కాలనీలో బీట్ విధుల్లో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్పై అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గమనించి అడ్డుకున్నారు. వారి వద్ద ఓ మహిళకు చెందిన బ్యాగ్ ఉండడంతో అనుమానం వచ్చి విచారించగా.. బస్టాండ్లో మహిళ హ్యాండ్ బ్యాగ్ను దొంగలించి పరారైన విషయం బయటపడింది. నిందితులను పోలీసులు స్టేషన్కు తరలించారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్, హోంగార్డులను మంగళవారం ఎస్పీ అభినందించారు. -
‘సాక్ష్యాధారాలను పక్కాగా సేకరించాలి’
కామారెడ్డి క్రైం: నేరస్తులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సేకరించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో దొంగతనాలు, దోపిడీలు, దారి దోపిడీలు లాంటి గ్యాంగ్ ఫైల్స్ నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల కేసులు, సాక్ష్యాధారాల సేకరణ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నేరస్తుడి వివరాలను పకడ్బందీగా సిద్ధం చేసి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెండింగ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ఆపరేషన్ కవచ్ను మరింత బలోపేతం చేయాలన్నారు. రాత్రిపూట గస్తీని పెంచాలని సూచించారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్రావు, విఠల్రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, రైటర్లు పాల్గొన్నారు. -
నీటి వృథాను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులతో కలెక్టర్ నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఒక్క బొట్టు కూడా వృథా చేయరాదన్నారు. నీటిని అత్యంత విలువైన వనరుగా గుర్తించి అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, భూగర్భ జలశాఖ అధికారి సతీశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘భౌ’బోయ్!
జిల్లాలో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. జనంపై దాడులు చేస్తూ పిక్కలు పీకుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. మూడేళ్లలో 2,450 కుక్కకాటు కేసులు నమోదు కావడం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది. – కామారెడ్డి టౌన్మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026– 8లో uఈనెల 22వ తేదీన దోమకొండ మండలం చింతమాన్పల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఐదేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.ఈనెల 9వ తేదీన దోమకొండ మండల కేంద్రంలో పలువురిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.జనవరి 25న జిల్లా కేంద్రంలోని అయ్యప్పనగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క కరిచింది. ఆస్పత్రిలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన అరగంటలోనే అది వికటించి, చిన్నారి మరణించింది. గత నెలలో కామారెడ్డి లోని భారత్రోడ్లో ఇద్దరు మహిళలపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. -
29 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా..
కామారెడ్డి టౌన్ :కాలం వేగంగా కదిలిపోవచ్చు.. కానీ చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు అని నిరూపించారు ఆ పూర్వ విద్యార్థులు. 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకే వేదికపై కలిసిన ఆ స్నేహితుల కళ్లలో వెలకట్టలేని ఆనందం కనిపించింది. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(గంజ్)కు చెందిన 1996–97 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక అమృత గార్డెన్లో సోమవారం నిర్వహించారు. దశాబ్దాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి అల్లరి, గురువుల పాఠాలు, కలిసి పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యా రు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాకాయి కవితరాణి, అజీమ్, నరేశ్, గురుప్రసాద్, శ్రీకాంత్, శివశంకర్, అర్షద్, యాదగిరి గౌడ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. యువతలో మార్పు రావాలి బాన్సువాడ రూరల్: నేటితరం యువతలో మార్పురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రాణుతి అన్నారు. సోమవారం కళాశాలలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో షహీద్ దివస్ పాదయాత్ర నిర్వహించి మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు చూపిన తెగువ మరువరానిదన్నారు. వారి నుంచి నేటితరం యువత స్ఫూర్తి పొందాలన్నారు. కళాశాల నుంచి దేశాయిపేట్ చౌరస్తా వరకు నిర్వహించిన పాదయాత్రలో విద్యార్థులు, అధ్యాపకులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్రాథోడ్, బాన్సువాడ ఎస్సై తాజుద్దీన్, కృష్ణ, నస్రుల్లాబాద్ ఎస్సై రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నియంత్రణ ఏదీ?
జిల్లాలో గ్రామ సింహాలు భయపెడుతున్నాయి. దీంతో కుక్కకాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2023 సంవత్సరంలో 721 కేసులు నమోదు కాగా, 2024 లో 761 కేసులయ్యాయి. గతేడాది 802 మంది కుక్క కాటుకు గురయ్యారు. ఈ ఏడాది జనవరిలో 75, ఫిబ్రవరిలో 57, మార్చిలో ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. రికార్డులకెక్కని కేసులు వందల్లో ఉంటాయని తెలుస్తోంది. చీకటి పడితే మరింత రెచ్చిపోతున్న శునకాలు పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కుక్కలు పెరిగిపోయాయి. జనావాసాల మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు... రాత్రి వేళల్లో మరింత రెచ్చిపోతున్నాయి. రోడ్డువెంట వెళ్తున్నవారిపై దాడి చేస్తున్నాయి. వాహనాల వెంట పడుతూ వాహనదారుల్లో దడ పుట్టిస్తున్నాయి. కుక్కలను తప్పించుకుని వెళ్లే క్రమంలో వాహనం అదుపుతప్పి పలువురు పడిపోయిన ఘటనలూ ఉన్నాయి. శివారు కాలనీల్లో రాత్రి వేళల్లో జనం బయటి రావాలన్నా, బయటినుంచి ఇంటికి వెళ్లాలన్నా బయపడే పరిస్థితులున్నాయి.ఏబీసీ (ఆనిమల్ బర్త్ కంట్రోల్) జిల్లాలో నామమాత్రంగానే సాగుతోంది. వీధి కుక్కలకు సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలో జాప్యం వల్ల వాటి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రజలు కుక్క కాటు బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని వివరణ కోరగా వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణపై కౌన్సిల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.కామారెడ్డి క్రైం: జంతువుల్లో జనన నియంత్రణ కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో పశుసంవర్ధక, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. చిన్నారులు కుక్క కాట్లకు గురవుతున్న నేపథ్యంలో జంతు జనన నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు. మందులు అందుబాటులో లేకపోతే వెంటనే కొనుగోలు చేసి రెండు రోజుల్లోగా నియంత్రణ చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఆనిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కార్యక్రమాన్ని ముందుగా దోమకొండ మండల కేంద్రంలో ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో గ్రామ సింహాల స్వైరవిహారం పిక్కలు పీకుతున్న వీధి కుక్కలు మూడేళ్లలో 2,450 కుక్కకాటు కేసులు నమోదు వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న జనం -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 96 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్పై చర్యలు తీసుకోండి అవినీతి, అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందిన ద్యానబోయిన పండరి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రేషన్ దుకాణం నడిపించే ఎల్లయ్య అక్రమాలపై తనతో పాటు గ్రామస్తులు కలిసి గత జనవరిలో నిజాంసాగర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో విచారించి ప్రభుత్వ ఉద్యోగులు, మరణించిన వారి పేర్ల మీద రేషన్ బియ్యం నమోదు చేయడం, అంత్యోదయ కార్డులకు చక్కెర ఇవ్వకపోవడం, డీలర్గా ఉంటూ ఎన్నికల్లో ప్రచారాలు చేయడం లాంటివి చేసినట్లు అధికారులు తేల్చారని అన్నారు. నివేదికను గత నెల 9న బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆ డీలర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వెంటనే డీలర్పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. బెదిరించిన వార్డు సభ్యుడిపై చర్యలకు డిమాండ్ మొరం అక్రమ దందాపై వార్తలు ప్రచురించినందుకు తనను బెదిరించిన వార్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భిక్కనూర్కు చెందిన ఓ పత్రికా విలేకరి సాయి మణికంఠ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మండలంలో జరుగుతున్న మొరం అక్రమ దందాపై తాను పనిచేసే పత్రికలో వార్తా కథనాన్ని రాయగా స్థానికంగా ఉండే ఓ వార్డు సభ్యుడు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఎల్లారెడ్డిలో ఫిర్యాదులు నిల్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తహసీల్దార్ ప్రేమ్కుమార్ తెలిపారు. ఎంపీడీవో ప్రకాష్, సీడీపీవో ప్రసన్న తదితరులున్నారు. -
అడవుల సంరక్షణకు కృషి చేయాలి
● ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ఘనంగా అటవీ, పిచ్చుకల దినోత్సవంకామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అడవుల సంరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం ప్రపంచ అటవీ, పిచ్చుకల దినోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అటవీ శాఖ కార్యాలయం నుంచి డిగ్రీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన రోజున ఒక మొక్క నాటడాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పిచ్చుకల సంరక్షణపైనా దృష్టి సారించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు ముందుండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం అటవీ సంరక్షణ, పరిరక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎఫ్వో నిఖిత, ఏఎస్పీ చైతన్యరెడ్డి, పోలీసు, అటవీ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేసే బడ్జెట్
● హామీల అమలును గాలికి వదిలేశారు ● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికి మూడుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బడ్జెట్ను ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు. నిధులు కేటాయించకుండా ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనూ రైతు రుణమాఫీ వందశాతం జరగలేదన్నారు. పింఛన్లను పెంచడం, మహిళలకు రూ.2500, ఆడబిడ్డలకు స్కూటీలు లాంటి 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎంకు ఆరు గ్యారంటీలపై సంతకం చేసిన ఫైలు దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకపోగా కనీసం పదవీ విరమణ పొందిన వారికి బెనిఫిట్లు కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంబాల రవి యాదవ్, బల్వంత్ రావు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
విద్యుత్షాక్తో ఒకరి మృతి దోమకొండ: మండలంలోని లింగుపల్లి గ్రామానికి చెందిన రాకుల శంకర్ (43) సోమవారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గ్రామంలో ప్రయివేట్ కరెంట్ హెల్పర్గా పనిచేసే శంకర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇంటికి విద్యుత్ వైర్ల కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో విద్యుత్ స్థంభం నుంచి కిందపడ్డాడు. సీసీ రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శంకర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. గాయపడిన మహిళ ..రుద్రూర్: పోతంగల్ రైస్మిల్లులో పనిచేస్తూ గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేణి మొగులవ్వ (40) గత నెల 15న రైస్మిల్లులో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిషన్ బెల్ట్ చుట్టుకొని గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ అస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. సోమవారం కోటగిరి తహసీల్దార్ గంగాధర్ సమక్షంలో కొత్తపల్లి గ్రామంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త రేణి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ .. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు బైపాస్ రోడ్డులో ఉన్న బాగారెడ్డి నర్సరీ వద్ద గుర్తు తెలియని మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. బస్సును స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు. రెంజల్: మండలంలోని పేపర్ మిల్ శివారులో సోమవారం సాయంత్రం పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. పక్కాగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేయగా 9 మంది జూదరులు పట్టుబడ్డారని వివరించారు. వారి వద్ద నుంచి రూ.1380 నగదుతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బ్లాక్ సిలిండర్ల గుట్టురట్టు
బాన్సువాడ రూరల్: ఒక్క సిలిండర్ గ్యాస్ను రెండుగా, రెండు సిలిండర్ల గ్యాస్ను మూడు సిలిండర్లలోకి మార్చుతున్న బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది. సోమవారం నిజాంసాగర్కు చెందిన వీరభద్ర హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఆటోలో కొంతమంది బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఓ ప్రత్యేక పరికరం ద్వారా ఒక సిలిండర్ గ్యాస్ను రెండింటిలోకి మారుస్తూ కనిపించారు. అలా మార్చిన సిలిండర్లను బ్లాక్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తుండటాన్ని స్థానికులు గమనించడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. కాగా, ఎక్కడ దొరికిపోతామనే భయంతో ఆటోను వేగంగా నడిపి ఓ టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టారు. అనంతరం ఆటోను వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 16 సిలిండర్లతో కూడిన ఆటోను స్వాధీ నం చేసుకున్నారు. ఒక్క సిలిండర్ను రెండుగా మార్చుతున్న వైనం ఆటో వదిలి పారిపోయిన దుండగులు ఆటో, 16 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
ఒకేసారి మూడునెలల రేషన్
● ఎండల తీవ్రత దృష్ట్యా పంపిణీకి ఏర్పాట్లు ● గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యంఎల్లారెడ్డిరూరల్: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయడం కోసం అవసరమైన బియ్యాన్ని గోదాములనుంచి రేషన్ దుకాణాలను పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. గతేడాది వర్షాకాలంలో వర్షాలతో లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఎండలు ముదిరితే ప్రజలు ఇబ్బందిపడే అవకాశాలు ఉండడంతో ఈసారి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం కూడా ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 577 రేషన్ దుకాణాలున్నాయి. 2.76 లక్షల ఆహార భద్రత కార్డులలో 9.56 లక్షల మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. అంత్యోదయ కార్డులు 17,815 ఉండగా దీనిలో 52,531 మంది లబ్ధిదారులు, అన్నపూర్ణ కార్డులు 825 ఉండగా వీటిలో 865 మంది లబ్దిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 6,637 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించి సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
● వాగ్దేవి సామినేని, ఎండీ, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్(డయాబెటిక్ కౌన్సెలర్)బాన్సువాడ: వేసవి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎండీ, జనరల్ మెడిసిన్, ఫిజిషియన్(డయాబెటిక్ కౌన్సెలర్) వాగ్దేవి అన్నారు. సోమవారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రశ్న : వేసవిలో ప్రజలకు మీరిచ్చే సలహాలు.? సమాధానం: వేసవిలో ఎండలు అధికంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. ప్రతి రోజూ 3 నుంచి 4 లీటర్ల నీటిని కాచి వడపోసి తాగాలి. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకుంటే బాగుంటుంది. ప్రశ్న : వేసవిలో చాలా మందికి వాంతులు, విరేచనాలు వస్తాయి..దీనికి మీరిచ్చే సలహా? సమాధానం: ఎండలో పని చేసే వారికి ఎక్కువగా వడదెబ్బ తగులుతుంది. కళ్లు తిరగడం లాంటివి వస్తున్నాయంటే వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువచ్చి. పచ్చి దుస్తులతో ఒళ్లంతా తుడిసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఎండలో పని చేసే వారికే ఎక్కువగా వాంతులు, విరేచనాలు వస్తుంటాయి. ప్రశ్న : వేసవిలో చల్లటి కూల్డ్రింక్లు చాలా మంది సేవిస్తారు కదా? సమాధానం: వేసవిలో కూల్డ్రింక్లు సేవించవద్దు. ఎక్కువ చల్లగా ఉండే శీతల పానీయాలు తీసుకోవద్దు. ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ను నివారించడమే చాలా ముఖ్యం. -
పరీక్ష కేంద్రాల సందర్శన
బాన్సువాడ: పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తుపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యపై ఎంఈవో నాగేశ్వర్రావుతో మాట్లాడారు. ఆయన వెంట టౌన్ సీఐ శ్రీధర్, ఎంఈవో నాగేశ్వర్రావు, ప్రధానోపాధ్యాయులు నరహరి తదితరులున్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులలో కూలీల శాతాన్ని పెంచాలని పీడీ సురేందర్ సూచించారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్కార్డులు లేనివారికి జాబ్ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. కొలతల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో సవితారెడ్డి, ఏపీవో తిరుపతి, టెక్నికల్ అసిస్టెంటులు కృష్ణగౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ ప్రత్యేక సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6 కోట్ల 2 లక్షల బడ్జెట్ను రూపొందించారు. కార్యక్రమంలో వైస్చైర్పర్సన్ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్లు గాయత్రి, మహేశ్వరి, కౌసరున్నీసా, మంజుల, చంద్రయ్య, గఫార్, సిద్ధి శ్రీధర్, తిరుపతి, దశరథం, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, మేనేజర్ వాసంతి తదితరులున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి):లింగంపల్లి పాఠశాల లో కోతుల బెడద నుంచి రక్షించుకోవడానికి ఆ వరణ చుట్టూ సోలార్ కంచె ఏర్పాటు పనుల ను సోమవారం సర్పంచ్ లావణ్య ప్రారంభించారు.ఉప సర్పంచ్ ఎడ్ల గంగారాం,వార్డు స భ్యులు శ్రీకాంత్, నందకుమార్, గంగయ్య, ప ద్మ,సౌమ్య,జ్యోతి,హెచ్ఎం రమాదేవి, పంచా యతీ కార్యదర్శి ప్రకాశ్, జీపీవో నవీన్కుమార్, సైట్ ఇంజనీర్ అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
మడి తడిసేదెలా?
● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● ఎత్తిపోతున్న బోరుబావులు ● ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్న అన్నదాతలురామారెడ్డి: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి అప్పుడే భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో బోర్లలో నీటి ఊట తగ్గిపోయి పంటను కాపాడుకోవడం అన్నదాతకు కష్టంగా మారుతోంది. నీరందక ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు రామారెడ్డికి చెందిన పలువురు రైతులు. ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పంటకు అందిస్తున్నారు. యాసంగిలో మూడెకరాలలో వరి వేశానని రామారెడ్డికి చెందిన రైతు రవి గౌడ్ తెలిపారు. పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో బోరు ఎత్తిపోవడంతో ట్యాంకరు ద్వారా నీరు తెప్పించి పోస్తున్నానని పేర్కొన్నారు. రామారెడ్డికే చెందిన రాజయ్య బోరు కూడా ఎత్తిపోవడంతో ఆయన సైతం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వేల్పూర్: మండలంలోని మోతె హైస్కూలులో 2001–02 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోట కలవడంపై హర్షం వ్యక్తం చేశారు.ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ ఆనాటి తీపి గుర్తులను నెమ రు వేసుకున్నారు. అనంతరం నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విందులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల ● చీనూర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఓ ఇల్లును గుల్ల చేశారు. నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామానికి చెందిన బోయిని సురేష్ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి గోపాల్పేటలో జరుగుతున్న నల్లపోచమ్మ జాతరకు వెళ్లాడు. ఆదివారం వేకువజామున సురేష్ తన ఇంటికి వచ్చే చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాతాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 6మాసాల బంగారు కమ్మలు, 9తులాల వెండి కాళ్లపట్టీలు, 5తులాల వెండి కడియాలు, 2తులాల చేతి ఉంగరాలతోపాటు రూ.20వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయినట్లు తెలిపాడు. ఈమేరకు నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఎస్సై భార్గవ్గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలో శనివారం రాత్రి జరిగిన జాతరలో ఓ బైక్ అపహారణకు గురైంది. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన పోతరాజు బాబు తన ఫ్యాషన్ప్రో బైక్పై కుటుంబసభ్యులతో కలిసి గోపాల్పేట జాతరకు వచ్చాడు. కాగా తన బైక్ను రోడ్డు పక్కన గల పెట్రోల్బంకు పక్కన పార్క్చేసి ఉత్సవాలను చూసేందుకు ఆలయం వద్దకు వెళ్లాడు. కాగా ఆదివారం వేకువజామున రాజు పెట్రోల్బంకు వచ్చిచూడగా తన బైక్ కనిపించలేదు. దీంతో తన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయాలని పేర్కొంటూ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. -
మత్స్యకారులకు లైసెన్సులు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఆదివా రం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చింతకాయల సాయిలు లైసెన్సు లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్య కారు ల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామానికి చెందిన 51 మంది సభ్యులకు లైసెన్సులు అందజేశారు. నాయకులు కత్తుల అంజయ్య,ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి మనోజ్, కిష్ట య్య, శ్రీనివా స్, అంజయ్య, కిష్టయ్య, రాజు, సంతు, నరేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణహరికి పద్మశాలి ఉగాది పురస్కారం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం, తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని కృష్ణహరి ‘పద్మశాలి ఉగాది పురస్కారం’ అందుకున్నారు. ఆదివారం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కేవీబీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన పద్మశాలి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. సబ్బని కృష్ణహరి చేస్తున్న వివిధ సామాజిక సంఘ సేవకు గానూ సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. అమ్రాద్లో డొమెస్టిక్ సిలిండర్ల పట్టివేత మాక్లూర్: మండలంలోని అమ్రాద్ గ్రామంలో ఆదివారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ దుకాణంపై దాడులు నిర్వహించి 15 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకున్నారు. గ్రామంలో లక్ష్మన్ అనే వ్యక్తి ప్రభుత్వ రాయితీ సిలిండర్లను బ్లాక్లో అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో వారు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి లక్ష్మన్తోపాటు సిలిండర్లను పట్టుకున్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బోధన్: హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణకు ఐక్యంగా ముందుకెళ్లాలని కామారెడ్డి జిల్లా బిచ్కుంద సంస్థాన మఠాధిపతి షట్స్థల బ్ర హ్మ సద్గురు సోమలింగ శివాచార్య మహాస్వా మిజీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని గంజ్ రోడ్లో గల రాధాకృష్ణ మందిరం (సాయిబాబా ఆలయం) ప్రాంగణంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్వామీజీ ముఖ్య అథితిగా వి చ్చేసి, ప్రవచనాలు చేశారు. చిరుప్రాయం నుంచే తమ పిల్లలను ఆధ్యాత్మిక మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ సహ చాలక్ పాలేటి వెంకట్రావు, ఆర్య వైదిక ధర్మప్రచారక్ ఉత్తూరు పద్మ మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ ధర్మ రక్షణకు ఐక్యతను, సమరసతను చాటాలన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమం కొనసాగుతున్నాయని వెంకటరావు తెలిపారు. విశ్రాంత తహసీల్దార్ మురహరి, కమిటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ ప్రవేశానికి వేళాయే..
కమ్మర్పల్లి: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్టీయూకేటీ) పరిధి బాసర ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లు స్థానికంగా, 15 శాతం మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు.. పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోరును అదనంగా కలుపుతారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు. ప్రవేశాల షెడ్యూల్ ఈ నెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. దివ్యాంగులు, సైనిక ఉద్యోగుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్,గ్లోబల్ కేటగిరికి చెందినవారికి మే 20 వరకు ద రఖాస్తు చేసుకోవచ్చు. మే 30న ఎంపికై న విద్యార్థుల జాబి తా ప్రకటించి, జూన్ 5న తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అర్హతలు.. విద్యార్థులు తొలి ప్రయత్నంలో 2026–ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. 31.12.2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ(ఏ) 7, బీసీ(బీ) 10, బీసీ(సీ) 1, బీసీ(డీ) 7, బీసీ(ఈ)లకు 4 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. దరఖాస్తు ఇలా.. అభ్యర్థులు ఈ సేవ, మీ సేవ, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ. 450, వేరే రాష్ట్రాల వారు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యో గుల పిల్లలకు 2, ఎన్సీసీలో ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. జత చేయాల్సిన పత్రాలు.. దరఖాస్తు రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికో ద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఫీజులు ఇలా.. రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్య బీమా, ఇతరాలకు సంబంధించి రూ. 3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా రూ. 2,000 చెల్లించాలి. ఎంపికై న విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూ, ల్యాప్టాప్, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. మే 10 వరకు దరఖాస్తులకు గడువు సెలెక్షన్ లిస్టు మే 30.. జూన్ 5న కౌన్సెలింగ్ పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు సువర్ణావకాశం -
చిన్నారులపై కుక్కల దాడి
దోమకొండ: మండలంలోని చింతమాన్పల్లి గ్రామంలో ఆదివారం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా, వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు హర్షిని, జాహ్నవిల తల్లిదండ్రులు తమ ఇంటి దగ్గరలోని ఖాళీ స్థలంలో మొక్కజొన్న కంకులకు ఒలుస్తున్నారు. దీంతో వీరు ఇంటి నుంచి ఆడుకుంటూ తమ తల్లిదండ్రుల వద్దకు వెళుతుండగా, కుక్కలు రోడ్డుపై వెంటపడి వీరిని తీవ్రంగా గాయపర్చాయి. హర్షినికి కంటిపై తీవ్ర గాయాలు కాగా, జాహ్నవికి కాలుపై గాయాలైయ్యాయి. దీనిని గమనించిన వీరి తండ్రి నారం యశ్వంత్ వెంటనే చికిత్స కోసం ముందుగా కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. కాగా చిన్నారులను గాయపర్చిన కుక్కలను గ్రామస్తులు కర్రలతో దాడి చేసి చంపివేశారు. రోజురోజుకు గ్రామల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటి నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
అలరించిన కుస్తీ పోటీలు
బాన్సువాడ రూరల్: కోనాపూర్లో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభ చూపి నగదు బహుమతులు పొందారు. చివరి కుస్తీపోటీలో గెలుపొందిన వారికి సంగోజీపేట్ గ్రామ సర్పంచ్ మంద సంగమేశ్వర్ తన తండ్రి మంద శ్రీరాములు జ్ఞాపకార్థం వెండి కడియాలు బహూకరించారు. జాతర సందర్భంగా దుకాణాలు వెళిశాయి. సర్పంచ్ ఎల్లగోని కిష్టవ్వ, ఉపసర్పంచ్ బంజ భూషణం, నాయకులు రాజేశ్వర్గౌడ్, జెట్టి హన్మాండ్లు, వార్డు సభ్యులుపాల్గొన్నారు. లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దూరిశెట్టి అశోక్ తెలిపారు. కుస్తీ పోటీలు ఆధ్యంతం ఉత్కంఠంగా సాగాయి. చివరి కుస్తీ రూ.5 వేల నగదు బహుమతితో పాటు మరో కుస్తీ రూ.3 వేల నగదు బహుమతి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. -
యంగ్ సైంటిస్టులకు స్వాగతం
● 9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం ● మార్చి 31వరకు ఆన్లైన్ దరఖాస్తుకు గడువు బాన్సువాడ రూరల్: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్టు పేరుతో యువ విజ్ఞాన్(యువికా)కార్యక్రమాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తోంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కామారెడ్డి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామిరెడ్డి తెలిపారు. ఎంపిక ఇలా.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,050 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈవిద్యార్థులందరూ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 1, 2026 నాటికి 9వ తగరతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. 8వ తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా 50 శాతం, 8వ తరగతి సైన్స్, సోషల్ సబ్జెక్టు మార్కుల ఆధారంగా 10 శాతం, ఆన్లైన్ క్విజ్లో విద్యార్థి ప్రతిభకు 10 శాతం, సైన్స్ఫేయిర్లో పాల్గొంటే 10 శాతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు 5 శాతం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 15శాతం వెయిటేజీ మార్కులు కేటాయించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు.. ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన ఆహ్మదాబాద్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్షశాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న సువర్ణ అవకాశం ఇది. భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్న ఆకాంక్ష కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. –సిద్దిరామిరెడ్డి, కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి -
‘ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్’
తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. ఆదివారం తాడ్వాయిలో బీఆర్ఎస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడుసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిందని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం నిధులు కేటాయించడం మర్చిపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకే పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడం లేదని, దీంతో నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు రావడంలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అందరి అభివృద్ధికి కృషి చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ముదాం నర్సింలు, సర్పంచ్లు మంగారెడ్డి, తాజొద్దీన్, నాయకులు రాజేశ్వ్రావు, మహిపాల్రెడ్డి, రాజిరెడ్డి, రాములు, సంజీవ్, ధర్మారెడ్డి, రాఘవరెడ్డి, రమేష్రావు, సాయిరెడ్డి, నవీన్రెడ్డి పాల్గొన్నారు. -
తల‘సిరి’ లేదు!
రాష్ట్రంలో సగటు పౌరుడి తలసరి ఆదాయం పెరిగినా.. జిల్లా మాత్రం వెనకబడే ఉంది. తలసరి ఆదాయంలో 27వ స్థానంలో ఉన్న కామారెడ్డి.. జీడీడీపీలో మాత్రం 17వ స్థానంలో ఉంది. తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగినా కామారెడ్డి జిల్లా మాత్రం అట్టడుగునే ఉంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఇటీవల విడుదల చేసిన సామాజిక, ఆర్థిక నివేదిక–2006 ప్రకారం కామారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 2,63,307 గా నమోదయ్యింది. ఈ విషయంలో రాష్ట్రంలో 27 వ స్థానంలో ఉంది. ఇదే సమయంలో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీడీపీ) విషయంలో మాత్రం జిల్లా స్థానం కాస్త మెరుగ్గా ఉంది. రూ. 30,296 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 326 పరిశ్రమల ద్వారా 10,448 మంది ఉపాధి పొందుతున్నారు. మానూఫ్యాక్చరింగ్ యూనిట్లు 5,696, ఎంఎస్ఎంఈ యూనిట్లు 25,331 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వన మహోత్సవంలో నంబర్వన్.. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 17.99 శాతం ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2024–25 సంవత్సరంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో 123.6 శాతంతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ‘ఉపాధి’లో ఎనిమిదో స్థానం... ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 సంవత్సరంలో 22.2 లక్షల పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కా గా.. 15.4 లక్షల పనిదినాలను కల్పించారు. పనులు కల్పించడంలో జిల్లా ఎనిమిదో స్థానంలో ఉంది.జిల్లాలో 579 రేషన్ దుకాణాలు ఉండగా, 2,94,479 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 17,815 కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన కార్డులు, 2,75,839 ఆహా ర భద్రతాకార్డులు, 825 అన్నయోజన కార్డులు ఉన్నాయి. జిల్లా లో 3 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ ఉద్యోగులుపోనూ దాదాపు మిగతా అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంకా రేషన్కార్డుల కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉండడం గమనార్హం. వ్యక్తిగత ఆదాయంలో అట్టడుగున జిల్లా రాష్ట్రంలో 27వ స్థానం... జీడీడీపీలో 17వ స్థానంలో కామారెడ్డి తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడి -
‘జీసీఆర్’ జాబ్ మేళా సక్సెస్
● తరలివచ్చిన నిరుద్యోగులు ● 325 మంది ఉద్యోగాలకు ఎంపికకామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో ఆదివారం జీసీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. సుమారు 3,500 మంది యువతీ యువకులు ఈ మేళాకు తరలివచ్చారు. ఐటీ, ఫార్మా, మెడికల్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాలకు చెందిన 50 ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. అభ్యర్థుల అర్హతలను బట్టి ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి, 325 మందికి అక్కడికక్కడే ఉద్యోగ అవకాశం కల్పించి నియామక పత్రాలను అందజేశారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకే.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించామని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందన్నారు. ఉద్యోగాలకు ఎంపికై నవారు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మేళాలో ఉద్యోగాలు పొందినవారు జీసీఆర్ ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సబ్బని కృష్ణహరి, నిమ్మ విజయ్కుమార్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జూలూరి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమిది మహేష్, రాంశెట్టి హర్షిత, కాంగ్రెస్ నాయకులు మామిండ్ల అంజయ్య, శంకర్రావ్, చాట్ల వంశి, ప్రసాద్, జమిల్, రవీందర్ గౌడ్, రంగ రమేశ్గౌడ్, నర్సోళ్ల మహేశ్, బల్ల శ్రీనివాస్, నిరంజన్, మెహర్ బాబా తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి అర్బన్: భూమిపై జీవరాశుల మనుగడ నీటితో ముడిపడి ఉందని, వర్షం నీటిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని జిల్లా భూగర్భజల అధికారి సతీశ్యాదవ్ అన్నారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షం నీరు, భూగర్భజలాల యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, వాల్టా చట్టంపై జిల్లా అధికారి అవగాహన కల్పించారు. ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి వెంకటేష్, అటవీ శాఖాధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మద్నూర్: మద్నూర్లోని మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహిస్తున్న కందుల కొనుగోలు కేంద్రం ఈనెల 26 వ తేదీ వరకే కొనసాగుతుందని కేంద్రం నిర్వాహకులు చాట్ల గోపాల్ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి త్వరగా తమ పంట ఉత్పత్తిని తీసుకురావాలని సూచించారు. పంటను విక్రయించిన రైతుల ఖాతాలలో 15 రోజుల్లో డబ్బులు జమవుతున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్ : ఇటీవల జిల్లాలో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందించనున్నట్లు ఇస్కాన్ కామారెడ్డి కేంద్ర ముఖ్య ప్రతినిధి వెంకటదాస్ తెలిపా రు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మా ట్లాడారు. స్థానిక శ్రీ వాసవి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బహుమతుల ప్రదానంతోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): వయోజన విద్యాశాఖ, డీఆర్డీఏ సమన్వయంతో ఈనెల 29న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎఫ్ఎల్నెట్, ఎన్ఐవోఎస్ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చదువు నేర్చుకుంటున్న అభ్యాసకులు ఈ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యాసకులు గ్రామాలలోని సెర్ప్ సిబ్బందిని సంప్రదించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ అయిన అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యేలా చూడాలని అన్ని మండలాల ఏపీఎం, ఇతర అధికారులకు సూచించారు. -
ఒక్కో పని కోసం ఒక్కో మండలం... ఇదే సింగరాయపల్లి దుస్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాలనా సౌలభ్యం ఏమో గానీ ఆ ఊరి ప్రజలు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిందే. అవును.. మీరు చదువుతున్నది నిజమే ! ప్రస్తుతం పాల్వంచ మండలంలోకి మారిన ‘సింగరాయపల్లి’ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. తాలూకా వ్యవస్థను తొ లగించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో మాచారెడ్డి మండలం పరిధిలో సింగరాయ పల్లి గ్రామాన్ని చేర్చారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మాచారెడ్డి మండలంలో కొనసాగింది. 2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో సింగరాయపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన రామారెడ్డి మండలంలోకి చేర్చారు. దీంతో గ్రామస్తులు తమ పనుల కోసం రామారెడ్డి మండలానికి వెళ్లి వచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాచారెడ్డి మండలంలోని పాల్వంచ కేంద్రంగా కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ప్రజల విన్నపం మేరకు అప్పటి ప్రభుత్వం పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సింగరాయపల్లిని పాల్వంచ మండలానికి మార్చారు. మాచారెడ్డి నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి పాల్వంచ మండలానికి మారింది. గ్రామస్తులకు పాల్వంచ గ్రామం కొంత అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే మూడు మండలాలతో ఉన్న లింకు ఇబ్బందికరంగా మారింది. రామారెడ్డి పోలీస్ స్టేషన్ సింగరాయిపల్లి ఇప్పటికీ రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంది. దీంతో కేసుల విషయంలో గ్రామస్తులు రామారెడ్డికి వెళ్లాల్సిందే. గ్రామంలో ఏ ఘటన జరిగినా రామారెడ్డి పోలీసులు రావాల్సిందే. కొత్త మండలంగా ఏర్పాటైన పాల్వంచకు పోలీస్ స్టేషన్ మంజూరు కాలేదు. దీంతో పోలీసు సేవలు రామారెడ్డి నుంచే అందుతున్నాయి. మాచారెడ్డి సొసైటీ ‘సహకార’ సేవల కోసం సింగరాయపల్లి గ్రామస్తులు మాచారెడ్డికి వెళ్లాల్సిందే. పాల్వంచలో సొసైటీ ఏర్పాటు కాలేదు. సహకార బ్యాంకు శాఖ కూడా రాలేదు. దీంతో రుణాలు, పంటలకు అవసరమైన ఎరువుల కోసం మాచారెడ్డికి వెళ్లాల్సిందే. ఏ పని మీద వెళ్లినా రోజంతా అటే గడిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల సేవలు పాల్వంచ మండలంలో అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాల్వంచలో తహసీల్ సేవలు పాల్వంచ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేస్తూ 2023 ఏప్రిల్ 18న జీవో విడుదలైంది. మే నెలలో తహసీల్ కార్యాలయం ఏర్పాటైంది. రామారెడ్డి మండలంలో కొనసాగిన సింగరాయపల్లి గ్రామాన్ని పాల్వంచ మండలానికి మార్చారు. తొలుత తహసీల్ కార్యాలయం ఒక్కటే ఏర్పాటైంది. గతేడాది జనవరి 28న మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సింగరాయపల్లి గ్రామస్తులు మండల పరిషత్ పనుల కోసం పా ల్వంచకు వెళ్తున్నారు. అయితే ప్రజాపాలనలో వివిధ పనులకు ఇప్పటికీ రామారెడ్డి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో మండల పరిషత్ సేవలను పా ల్వంచ మండలానికి ఇవ్వాలి. మూడు మండలాలు తిరగాల్సి వస్తోంది మా ఊరికి మూడు మండలాలతో లింకు ఉండడంతో చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పట్లో అన్ని పనులకు రామారెడ్డికి వెళ్లేవాళ్లం. తరువాత పాల్వంచ మండలం అయ్యింది. దగ్గరైందన్న సంతోషం ఉన్నా, పనుల కోసం రామారెడ్డికి, మాచారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. – సొంటెం సాయిలు, గ్రామస్తుడురికార్డులను పాల్వంచకు మార్చాలిపాల్వంచలో మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటైనా ప్రజాపాలనకు సంబంధించిన పనుల కోసం రామారెడ్డి ఆఫీసుకు వెళ్లమంటున్నారు. మాకేమీ అర్థం కావడం లేదు. అన్ని రికార్డులను పాల్వంచకు మారిస్తే ఇబ్బంది పోతుంది. – కెంగర్ల భిక్షపతి, గ్రామస్తుడుమా ఇబ్బందులు తీర్చాలి ఎరువుల బస్తాల కోసం మాచారెడ్డి సొసైటీకి వెళ్లాల్సి వస్తోంది. కో ఆపరేటివ్ బ్యాంకు కోసం కూడా మాచారెడ్డికి వెళ్లాలి. పోలీసు స్టేషన్కు రామారెడ్డికి, మండలాఫీసుకు పాల్వంచకు వెళ్లాలి. మా ఇబ్బందులను గుర్తించి వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలి. – అన్నబోయిన శ్రీనివాస్, గ్రామస్తుడు -
అలరించిన కుస్తీ పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ఉగాది ఉత్సవాలలో భాగంగా మాసాన్పల్లిలో శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీపోటీల్లో పాల్గొన్నా రు. కాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జాదవ్ చరణ్ ఆఖరి కుస్తీపోటీల్లో పాల్గొని రూ.1,500 గెలుచుకున్నారు. ఈ మేరకు విజేతలకు గ్రామసర్పంచ్ సునంద, మాజీసర్పంచ్ అంజాగౌడ్, గ్రామపెద్దలు బహుమతులను అందజేశారు. కొమలంచలో.. నిజాంసాగర్(జుక్కల్): నల్లపోచమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం మహమ్మద్నగర్ మండలం కొమలంచలో కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నాగభూషణంగౌడ్, గంగారెడ్డి నగదును బహుమానంగా అందించారు. -
అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్న్ని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింధే ఆరోపించారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ మోసపూరితంగా ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ పేరుతో 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ను మరిచిందని విమర్శించారు. ఆరు సీజన్లకు నాలుగు సీజన్ల రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులకు మొండిచెయ్యి చూపించిందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎలాంటి నిధులు తీసుకురాలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయలేదని, ఏ ఒక్క గ్రామానికి బీటీ రోడ్డు వేయలేదని, ఆయనకు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కృష్ణపటేల్, పాకాల్ విజయ్, బన్సీ పటేల్, దరాస్ సురేశ్, సుల్తాన్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూర్, డోంగ్లీ మండల కేంద్రంలో శనివారం శనగ పంట కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్కు వచ్చిన శనగ పంటకు, కాంటాలకు పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనగ రైతులకు మద్దతు ధర దక్కాలనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. రూ.5,875 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని, తక్కువ ధరకు దళారులకు పంటను అమ్మి నష్టపోవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, నాయకులు సాయిపటేల్, సంతోష్ మేసీ్త్ర, తదితరులున్నారు. -
సబ్సిడీపై ఫ్రూట్ కవర్లు
మామిడి రైతులకు ఊరట ● ఎకరాకు 8వేల చొప్పున.. ● ఒక్కో రైతుకు ఐదు ఎకరాల వరకు 50 శాతం సబ్సిడీ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : మామిడి రైతులకు అండగా నిలుస్తూ వారిని ప్రొత్సహించేందుకు ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. మామిడి దిగుబడి చేతికొచ్చే సమయంలో ‘పండు ఈగ’ పంటను ఆశించి దిగుబడిపై తీవ్రప్రభావం చూపుతూ రైతులకు తీరని నష్టాన్ని క లుగజేస్తుంది. దీంతోపాటు ఇతర చీడపీడలు ఆశించి కాయలను రాల్చేస్తుంటాయి. కాయల పై మచ్చలు ఏర్పడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిరంగు కలిగిఉండి ఎలాంటి మచ్చలు లేకుండా నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చేందుకు ఉపయోగపడే ఫ్రూట్ కవర్లను రైతులకు 50శాతం సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాకు కొంతమేర లక్ష్యాన్ని నిర్ణయించి రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లను అందించేందుకు ఉద్యానశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో సాగు జిల్లాలో ఈ ఏడాది సుమారు 200మంది రైతు లు 2,500 ఎకరాల్లో మామిడిపంటను సాగుచేస్తున్నారు. అయితే ప్రస్తుత ఏడాది మామిడి రై తులకు 50 శాతం సబ్సిడీపై 20ఎకరాల వరకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్లను అందించాలని అధికా రులు లక్ష్యంగా నిర్ణయించారు. ఒక ఎకరాకు సుమారు 8వేల ఫ్రూట్ కవర్లు అవసరమవుతాయని, జిల్లాలో విధించిన లక్ష్యం ప్రకారం 20ఎకరాలకు లక్షా 60వేల కవర్లు అవసరమవుతా యని అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రూట్కవర్లపై మామిడిరైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఫ్రూట్కవర్లను వినియోగించడం వల్ల నాణ్యమైన దిగుబడి వస్తుంది. మామిడి రైతులు 50శాతం సబ్సిడీపై ఫ్రూట్కవర్లను పొంది చక్కని దిగుబడులు సాధించాలి. – సంతోషి, ఉద్యానశాఖ అధికారి, మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రం మామిడికాయలకు కట్టే ఫ్రూట్ కవర్లు 50 శాతం సబ్సిడీపై పొందాలంటే రైతులు మొదట పూర్తి ధర వెచ్చించి కవర్లను కొ నుగోలు చేయాలి. కొనుగోలు చేసిన కవర్ల కు సంబంధించిన బిల్లులతో కలిపి ఉద్యానశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. కవర్లకు సబ్సిడీ డబ్బులను రైతుల ఖా తాల్లో జమచేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కవర్ పూర్తి ధర రూ.2.50పైసలుగా ఉంది. ఈ లెక్కన కవర్కు రూ.1.25పైసల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. -
పైళ్లెన నెలకే.. అనంతలోకాలకు..
క్రైం కార్నర్● కవలల దినోత్సవం రోజునే ఒక్కటైన జంట కవలలు ● అనుమానాస్పదస్థితిలో ఒకరు మృతి మాచారెడ్డి: కవల జంటల పెళ్లితో ఆ ఇంట్లో వెల్లివిరిసిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. వివాహం జరిగిన నెలకే అన్నదమ్ముల్లో ఒకరు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాతపడడంతో రెండు కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది. వివరాలు ఇలా.. మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన కవలలైన విజయ్కుమార్, వినయ్కుమార్ల వివాహం గత నెల 22న తాడ్వాయి మండలం దేమెకలాన్ గ్రామానికి చెందిన కవలలైన అక్కా చెల్లెళ్లతో పెళ్లి జరిగింది. కవలల దినోత్సవం నాడే వారి వివాహం జరగడంతో మీడియాతోపాటు సోషల్ మీడియాలోవైరల్ అయ్యారు. ఇదిలా ఉండగా కవలల్లో చిన్నవాడైన వినయ్కుమార్ (31) శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరులో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు అందులో పడి ఉంటాడని భావిస్తున్నారు. విషాదంలో కుటుంబం.. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన గడ్డు పరిస్థితుల్లో తల్లి సుజాత అన్నీ తానై ఐదుగురు పిల్లల్ని(నలుగురు కుమారులు, ఒక కూతురు) చదివించింది. సోదరులు చదువులో ముందు వరుసలో ఉంటూ ఉద్యోగాలు సాధించారు. అమ్మాయిని చదివించి పెళ్లి చేశారు. తర్వాత కవలలైన విజయ్కుమార్, వినయ్కుమార్ల వివాహం జరిపించేందుకు కవలలైన అక్కాచెల్లెల్లను వెదికి పెళ్లి చేశారు. ఎంతో ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో వినయ్ మృతితో ఇప్పుడు తీరని వేధన మిగిలింది. హృదయవిధారకంగా మారిన ఆ ఇంటి పరిస్థితులను చూసిన గ్రామస్తులు, బంధువులు కంటతడిపెట్టారు. శనివారం ఘన్పూర్(ఎం) గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై విచారణ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడంపై శనివారం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన విద్యార్థిని ఇటీవల నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ట్యాంకు ఎక్కి విద్యార్థిని రక్షించారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సోషల్ వర్కర్ వీణ, పృథ్వి బాధిత యువతితో మాట్లాడి వివరాలు సేకరించారు. తమది పేద కుటుంబం కావడంతోపాటు నాయక్పోడ్ కులధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు చదువు వద్దని వారించారన్నారు. దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని విద్యార్థిని అధికారులకు వివరించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలకేంద్రం శివారులోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని కల్వరాల్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం శనివారం ఆటోలో కామారెడ్డికి బయలుదేరింది. సదాశివనగర్ శివారులోని హైవేపై వారి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యా యి. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● పర్యాటకులకు సౌకర్యంగా ‘నిజాంసాగర్’ టూరిజం పనులు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయించి, ఇళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో జాప్యానికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరిగేలా హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాలు, ఆక్సిజన్ పార్క్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్తోపాటు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఆక్సిజన్ పార్క్లో అభివృద్ది పనులు పూర్తి చేసి, వృక్షాల సంరక్షణతో పాటు ప్రజల కు కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారివెంట హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డీఈవో రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పర్యాటకులకు సౌకర్యంగా టూరిజం పనులు రానున్న వర్షాకాలం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకోటూరిజం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్ బంగ్లా వద్ద ఎకోటూరిజం పనులను ఆయన పరిశీలించారు. డిలక్స్ కాటేజీలు, షూట్ కాటేజీలు, రెస్టారెంట్ బ్లాక్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట నీటిపారుదలశాఖ ఈఈ సోలోమాన్, ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్ భుజంగరావు తదితరులు ఉన్నారు. -
బడ్జెట్పై భిన్నస్వరాలు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇలా..బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు 8.23 శాతం నామమాత్ర మే. కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో విద్యకు 15శాతం నిధులు కేటాయిస్తామని ప్రకటించి ఆచరణలో విఫలమైంది. పీఆర్సీ, ఎస్ఎస్ఏ, కేజీబీవీల సమస్యలను ప్రస్తవించలేదు. – బషీర్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సబ్బండ వర్గాలకు భరోసా కల్పించే బడ్జెట్ను ప్రభు త్వం ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించ డం రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రేటు 10.7 శాతం పెరగడం ప్రజాప్రభుత్వ పాలన ప్రగతికి నిదర్శనం. – ఏలే మల్లికార్జున్, డీసీసీ అధ్యక్షుడు విద్యారంగాన్ని పూ ర్తిగా నిరాశపర్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూ ళ్లు, పబ్లి క్ స్కూళ్ల ఏర్పాటు మసిపూసి మారేడుకాయ చందంగా ఉంది. టీచర్ల పెండింగ్ బ కాయిల ప్రస్తావన లేదు. విద్యకు 15శాతం నిధులు ఇస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. – ఎండీ ముజీబుద్దీన్, టీటీయూ, జిల్లా అధ్యక్షుడు నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే సంకల్పాన్ని ప్రక టించినప్పటికీ కే టాయింపులు ఆశాజనకంగా లేవు. తాజా బడ్టెట్లో 26,674 కోట్లు కేటా యించారు. ఇది గత బడ్జెట్ కన్నా 0.65 శాతం ఎక్కువ. ప్రభు త్వం మాటలు నీటి మూటలయ్యాయి. – కే.వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులు -
క్రైం కార్నర్
● కామారెడ్డి జిల్లావాసిగా గుర్తింపు గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్కు చెందిన దుంపటి వినయ్కుమార్(32)గా గుర్తించారు. మానేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా, మృతుడికి నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. గత నెల కవలల దినోత్సవం రోజున పెళ్లయినట్లు సమాచారం. కరెంట్ షాక్తో రైతుకు గాయాలు మాచారెడ్డి: విద్యుదాఘాతంతో ఓ రైతుకు గాయాలైన ఘటన మండలంలోని గోగుబండ తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మీపురం స్వామిదాస్ తన పంట పొలంలో తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్న మరో రైతు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించాడు. అంబులెన్స్ సిబ్బంది నరేశ్, ప్రణీత్ ప్రథమ చికిత్స అందించి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
రెండు భారీ చోరీలు
ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన త లారి జమున ఈ నెల 15న ఇంటికి తాళం వేసి జుక్కల్లో ఉంటున్న తన చిన్న కుమారుడు ఇంటికి వెళ్లింది. కాగా, శుక్రవారం ఉదయం ఇంటి తలుపు లు తెరిచి ఉండటాన్ని గమనించిన కాలనీవాసులు జమునకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆలూర్కు చేరుకున్న జమున ఇంట్లోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో ఆందోళనకు గురైంది. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలతోపాటు నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గురువారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కారు అద్దాలు ధ్వంసం చేసి.. బోధన్టౌన్(బోధన్): కారు అద్దాలు పగులగొట్టి రూ.3 లక్షలు చోరీ చేసిన ఘటన బోధన్ పట్టణంలోని గోశాల రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం. సాలూర మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు భూమి కొనుగోలు కోసం చెల్లించాల్సిన డబ్బులను డ్రా చేసుకోవడానికి రాకాసీపేట్లోని కెనరా బ్యాంక్కు వెళ్లాడు. బ్యాంకులోకి వెళ్లి రూ. 3 లక్షలు డ్రా చేసి తిరిగి గోశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఎదుట కారును పార్కు చేశాడు. డ్రా చేసిన రూ. 3 లక్షలు కారులో పెట్టి, మరికొన్ని డబ్బులు డ్రా చేసుకోవాడనికి యూనియన్ బ్యాంకులోకి వెళ్లి తిరిగి కారు వద్దకు వచ్చాడు. కారు అద్దాలు పగిలి ఉండటంతోపాటు అందులోని రూ. 3 లక్షలు కనిపించక పోవడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్లో 10 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ బోధన్లో కారులో నుంచి సినీ ఫక్కీలో రూ.3లక్షల దొంగతనం -
రాక్ కై ్లంబింగ్లో విద్యార్థిని ప్రతిభ
కామారెడ్డి టౌన్: భువనగిరిలో నిర్వహించిన శిలారోహణం(రాక్ కై ్లంబింగ్) శిక్షణలో జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల విద్యార్థిని జి.హర్షిత అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు భువనగిరి కోటపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్వతారోహకులు మాలావత్ పూర్ణ ఆధ్వర్యంలో రాక్ కై ్లంబింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న హర్షిత, కఠినమైన సవాళ్లను అధిగమించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన ఏకై క విద్యార్థినిగా నిలించింది. హర్షిత ప్రతిభను గుర్తించిన మాలావత్ పూర్ణ, స్వయంగా ఆమెకు సర్టిఫికెట్ను అందజేసి అభినందించారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థినిని పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయులు సన్మానించారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేటలో శుక్రవారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు సర్పంచ్ నర్సింలు తెలిపారు. కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. హోరాహోరీగా మల్లయోధులు తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. జంగమాయిపల్లిలో.. ఎల్లారెడ్డిరూరల్: జంగమాయిపల్లిలో శుక్రవారం కుస్తీ పోటీలు జరిగాయి. కుస్తీ పోటీలకు ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్. పిట్లం, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్ మండలాలకు చెందిన మల్లయోధులు హాజరయ్యారు. మొదటి బహుమతిగా 3 తులాల వెండి కడియం, ద్వితీయ బహుమతిగా రెండు తులాల వెండి కడియం విజేతలకు అందించారు. సర్పంచ్ రాములు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, కృష్ణాగౌడ్, ప్రవీణ్ తదితరులున్నారు. నస్రుల్లాబాద్లో.. నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఢిల్లీకి చెందిన బల్జిత్ కౌర్ అనే మహిళ మరో యువకునితో కుస్తీ పోటీలతో తలపడింది. గెలుపోటములు తేలకపోవడంతో నగదును చెరి సమానం పంచారు. విజేతలకు గ్రామ కమిటీ చైర్మన్ మంతపురి సాయిగౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు రెడ్డి, మాజీ సర్పంచ్ అరిగే సాయిలు, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు తిమ్మారెడ్డి గ్రామంలో.. ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. చుట్టు పక్క మండలాల మల్లయోధులు కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. సిద్దాపూర్కు చెందిన గోపాల్ చివరి కుస్తీ పోటీలో నెగ్గి రూ.4 వేల నగదు గెలుచుకున్నట్లు బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి తెలిపారు. కామారెడ్డి అర్బన్: డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబూష్యన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)ఎస్ఈ ఎన్.శ్రావణ్కుమార్, ఏడీఈ కిరణ్చైతన్యను జిల్లా విద్యుత్ అధికారులు శుక్రవారం కలిశారు. జిల్లాలో పని చేసిన శ్రావణ్, కిరణ్ ప్రభుత్వం ఉచిత కరెంట్ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన డిస్కమ్కు బదిలీ అయ్యారు. ఏఈ వెంకటేశ్, సబ్ ఇంజినీర్లు నవీన్, చంద్రకాంత్, శ్రీనివాస్, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై నిర్లక్ష్యం
విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే నిధు లు కేటాయించి మరోసారి నిరాశపరిచింది. ఉపాధ్యా య సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 20 శాతం గానీ, విద్యాకమిషన్ సూచించినట్టుగా 18 శాతం గానీ, కనీసం కాంగ్రెస్ తన మెనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 15 శాతం కూడా బడ్జెట్లో కేటాయించలేదు. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోయింది. – సీహెచ్ అనిల్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీపీటీఎఫ్ రైతులకు, సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే బడ్జెట్ ఇది. సీఎం రేవంత్రెడ్డి విజన్కు అనుగుణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను రూపొందించారు. మైనారిటీల కోసం రూ. 3,769 కోట్లు కేటాయించడం శుభపరిణామం. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు, విద్యకు ప్రాధాన్యతనిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఏకంగా రూ. 36,000 కోట్లకు పైగా కేటాయించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతను చాటుకుంది. – షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బడ్జెట్ చేతి వృత్తిదారులను నిరాశకు గురిచేసింది. రూ.3.24 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. రాష్ట్రంలో 25 లక్షల మంది వృత్తిదారుల సంక్షేమం, హాస్టళ్లు, స్కాలర్షిప్పులకు ఈ నిధులు ఎలా సరిపోతాయి. గత ఏడాది కేటాయించిన రూ. 1,418 కోట్లు కూడా ఖర్చు చేయలేరు. ఎన్నికల హామీల మేరకు వృత్తిదారుల కోసం బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించాలి. – ఎస్ వెంకట్గౌడ్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ -
సంక్షేమానికి ప్రాధాన్యం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు దక్కలేదు. ముఖ్యంగా ఏళ్ల తరబడిగా నిర్లక్ష్యానికి గురవుతున్న సాగునీటి ప్రాజెక్టు 22వ ప్యాకేజీకి ఈ సారి కూడా బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగలేదు. దీంతో జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీరే పరిస్థితి లేదు. కాగా అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్తవి అమలుకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా కుటుంబ భద్రత కోసం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను జూన్ 2 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. సంపాదకుడు చనిపోయినపుడు కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల బీమా అందించేలా పథకాన్ని రూపొందించారు. రేషన్ కార్డు ప్రామాణికంగా అమలు చేస్తే జిల్లాలో 2,94,479 కుటుంబాలకు బీమా వర్తించనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న 80 వేల పైచిలుకు మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఐదు వేల పైచిలుకు మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదురహిత వైద్యం అందించేందుకు హెల్త్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా జిల్లాలో 10 వేల పైచిలుకు ఉద్యోగులు, అలాగే రెండు వేల పైచిలుకు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో చదువుతున్న విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్షిప్ అందిస్తామని ప్రభు త్వం ప్రకటించింది. రైతులకు నూరు శాతం సబ్సిడీపై సోలార్ పంపుసెట్లు అందించనుంది. దివ్యాంగులైన విద్యార్థులకు ఫిట్టెడ్ మోటరైజ్డ్ బైకులు అందించనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై వివిధ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజల బడ్జెట్ అంటూ కితాబునిస్తున్నారు. -
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. -
లీకేజీనా? మాస్ కాపీయింగా?
పరస్పర సహకారం● అరగంటలోనే పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు.. ● తొమ్మిది మంది టీచర్ల సస్పెన్షన్ ● వంద శాతం రిజల్ట్ కోసమే వ్యవహారం ఖలీల్వాడి: పదో తరగతి పరీక్ష మొదలైన అర గంటలోనే జిల్లాలో ప్రశ్నపత్రం బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బుధవారం జరిగిన తెలుగు, హిందీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను సెంటర్లో పనిచేసే సిబ్బంది వాట్సాప్ ద్వారా బయటికి పంపించి సమాధానాలు తెప్పించారు. ప్రశ్నపత్రం కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విషయం తెలిసిన విద్యాశాఖ అధికారులు ఘటనకు సంబంధించిన తొమ్మిది మంది సిబ్బందిపై వేటు వేశారు. అయితే, ఇదంతా పదో తరగతి పరీక్షల్లో వందశాతం రిజల్ట్, ఉన్నత కళాశాలల్లో సీట్ల కోసమే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలు కఠినమైనా పేపర్ బయటికి.. జిల్లాలోని 642 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 24,361 మంది, ఏడుగురు ప్రయివేట్ విద్యార్థులు 144 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందితోపాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, తనిఖీలకు వెళ్లే సిబ్బందికి సైతం సెల్ఫోన్ల వినియోగానికి అనుమతి లేదు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నా.. ప్రశ్నపత్రం బయటికి వెళ్లడం, సమాధానాలు రావడం అనుమానాలకు తావిస్తోంది. సెంటర్లోని సిబ్బంది ప్రశ్నపత్రాన్ని బయట వ్యక్తులకు అందించారా? లేక టీచర్ల ఫోన్లకే పంపించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రశ్నపత్రాన్ని బయటకు పంపిన వారితోపాటు బయట ఫోన్కు వెళ్లిన వ్యక్తులపై సైతం విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆగ్రహం పదో తరగతి పరీక్షలో పేపర్ బయటికి రావడంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఈవో అశోక్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సోమవారం జరిగే పరీక్షకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇద్దరు టీచర్లపై సస్పెషన్ ఎత్తివేతఖలీల్వాడి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బోధన్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో ప్రశ్నపత్రం వైరల్ అయిన ఘటనలో ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. గురువారం అధికారుల విచారణలో అవాస్తవమని తేలిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ అయిన పెంటాకలాన్ జడ్పీ హైస్కూల్ టీచర్ వేణు, కల్దుర్కి జడ్పీ హైస్కూల్ టీచర్ శివానందరావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతిలో ప్రభుత్వ, ప్రయివేట్, గురుకుల, మోడల్, కేజీబీవీ పాఠశాల్లో 100 శాతం ఉత్తీర్ణత కోసం అక్కడ పనిచేసే సిబ్బంది ద్వారా మాస్కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రయివేటు పాఠశాలలు ఉత్తీర్ణత శాతం, గ్రేడ్లను ప్రచారం చేసుకునేందుకు పరీక్ష కేంద్రానికి సంబంధించిన పాఠశాల వారితో పరస్పర సహకారం తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం మాస్ కాపీయింగ్ చేయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలపై సరైన నిఘా లేకపోవడంతో అక్కడ మాస్కాపీయింగ్ జరిగేందుకు ఆస్కారం ఉంటోంది. తనిఖీ చేసే బృందాలు సైతం ముందస్తు సమాచారం అందించడంతో విద్యార్థుల వద్ద చిట్టీలు దొరక్కుండా అక్కడి సిబ్బంది జాగ్రత్తలు పడుతున్నట్లు సమాచారం. అయితే, మాస్ కాపీయింగ్ వ్యవహారంతో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నంబరు ప్లేటు మార్చి..
● చలానాలు తప్పించుకునేందుకు ఎత్తులు ● వాహనాల నంబర్లు మార్చి తిప్పుతున్న వైనం ● తనిఖీల్లో చిక్కుతున్న వాహనదారులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శాఖ ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానా విధిస్తోంది. అయితే చలానాలకు విరుగుడుగా కొందరు వాహనదారులు నంబర్ ప్లేట్ను మార్చేసి ఏమారుస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్కు బదులు ఏదో ఒక నంబరు రాయించుకుని తిరుగుతున్నారు. వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు వాహనంపై ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ను ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు విషయం బయటపడుతోంది. భిక్కనూరులో పోలీసులు జాతీయ రహదారిపై ఇటీవల వాహనాలను తనిఖీ చేసే సమయంలో తప్పుడు నంబరు ప్లేట్తో తిరుగుతున్న డీసీఎం వ్యాన్ పట్టుబడింది. అసలు నంబర్కు బదులు డీసీఎంకు మరో నంబర్ వేసి నడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో గత కొంత కాలంగా వేరే నంబర్లు వేసుకుని తిరుగుతున్న వాహనాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు కొందరు తమ రిజిస్ట్రేషన్ నంబరును నంబర్ ప్లేట్పై మార్చేసి నడుపుతుంటారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘన సమయంలో చలానా ఆ నంబరు ఉన్న ఇతర వాహనదారుడికి వెళ్తుంది. ఆ బైకు తనది కాదని, తాను చలానా పడిన ఆ ప్రాంతానికే వెళ్లలేదంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా చోట్ల పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించలేదని, బైకుపై ముగ్గురు ప్రయాణించడం వంటి కారణాలతో జరిమానాలు ఎక్కువగా పడుతుంటాయి. అయితే నంబరు వేరేది వేసుకుని తిరిగేవారు దర్జాగా ఉండగా, ఆ నంబరు ఉన్న ఇతర వాహనాల యజమానులకు ఫైన్లు పడుతుండడంతో లబోదిబోమంటున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు విధిస్తున్న చలానాలను తప్పించుకునేందుకే చాలా మంది నంబర్ ప్లేట్లు మారుస్తున్నట్టు తెలుస్తోంది. పరిమిత వేగాన్ని దాటి ప్రయాణించడం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణించడం, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను నిలపడం, రోడ్డు మీద వాహనాలను నిలపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటిని పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఆయా నిబంధనలకు ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. వాహనాల తనిఖీ సమయంలోనైతే బ్రీత్ ఎనలైజర్ ద్వారా మద్యం తాగి నడిపేవారిని పట్టుకుని చట్టం ముందు నిలబెడుతున్నారు. కోర్టుల్లో జరిమానాలతోపాటు శిక్షలు కూడా పడుతున్నాయి. అయితే జరిమానాలను తప్పించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ సందర్భంలో పోలీసులు మోటార్ చట్టానికి సంబందించి పలు పోర్టల్స్లో వాహనాల నంబర్లు నమోదు చేసి వివరాలను పరిశీలిస్తున్నారు. ఒక వేళ వాహనంపై ఉన్న నంబరు సరైనదైతే వదిలేస్తున్నారు. ఏమైనా తేడా ఉంటే పట్టేస్తున్నారు.జిల్లాలో అనేక రకాల వాహనాలకు డూప్లికేట్ నంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసు లు నంబర్ ప్లేట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. నంబరు కనబడకుండా ఎలాంటి ఉపాయం చే సినా పట్టేస్తున్నారు. వాహనం అసలు నంబరు కు బదులు ఇతర నంబర్లు ఉంటే జరిమానా విధించడంతోపాటు వారిపై కేసులు కూడా న మోదు చేస్తున్నారు. నంబరు ప్లేట్లను మార్చడం చట్ట విరుద్ధమని పోలీసులు అంటున్నారు. ఏదై నా ప్రమాదం జరిగినప్పుడు నంబరు ప్లేట్ త ప్పుగా ఉంటే అటు బాధితునికి, ఇటు నిందితు నికి ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. -
కుస్తీపోటీల్లో ఢిల్లీ మహిళ
రెంజల్: మండలంలోని బోర్గాం గ్రామంలో ని ర్వహించిన కుస్తీ పోటీల్లో ఢిల్లీకి చెందిన మహిళ పాల్గొని, అబ్బురపరిచింది. ఉగాది పండుగ సందర్భంగా గురువారం స్థానిక హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. పోటీల్లో స్థానిక మల్లయోదుడి తో ఢిల్లీకి చెందిన బంజిత్కౌర్ తలపడి, లేడీ ప హిల్వాన్గా విజయం సాధించారు. బంజిత్కౌ ర్ తలపడుతున్న సమయంలో స్థానికులు ఆమె ను చప్పట్లు, ఈలలతో ప్రోత్సహించారు. ఆమె కు నిర్వాహాకులు రూ.2 వేల నగదును అందించారు. ఫైనల్ కుస్తీలో మహారాష్ట్రకు చెందిన ప్రభాకర్ విజయం సాధించగా విజేతకు రూ.5 వేలను అందించారు. అనంతరం బంజిత్కౌర్ దంపతులు మాట్లాడుతూ.. కుస్తీ పోటీలపై ఉన్న ఆసక్తి కారణంగా మండలంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు రెండు సంవత్సరాలుగా వస్తున్నట్లు పేర్కొన్నారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ బోధన్రూరల్: మండలంలోని పెగడాపల్లి గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు గ్రామ పెద్దలు, యువకులు గురువారం భూమిపూజ నిర్వహించారు. త్వరలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్కాపూర్ తండాలో జగదాంబ సేవాలాల్ రామ్రావు మహరాజ్ ఆలయ ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్, పౌరదేవి పీఠాధిపతి బాబుసింగ్ మహరాజ్లు ముఖ్యఅతిథిలుగా హాజరై ఆలయాల వద్ద నిర్వహించిన భోగ్బండార్లో పాల్గొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మల్కాపూర్ తండా, జగదాంబ ఆలయాల వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. పిట్ల కృష్ణ మహరాజ్, బాబుసింగ్ మహరాజ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
అవినీతిపరులకు పరాభవం తప్పదు
నిజామాబాద్ రూరల్: అవినీతిపరులు, అక్రమాలు, అధర్మానికి పాల్పడే వారికి ఈ ఏడాది పరాభవం తప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని కిషన్గంజ్లో గల ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ఆధ్వర్యంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. పంచాంగ శ్రవణం వినడానికి దాదాపు 52 సంవత్సరాలుగా వైశ్య సంఘానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సనాతన ధర్మం ఆచార వ్యవహారాలు పాటించడంలో వైశ్యులు ముందుంటారని కొనియాడారు. కేవలం హిందూ సంస్కృతిని పాటించడమే కాకుండా అందరిని ఏకం చేయడంలో వైశ్యుల పాత్ర కీలకమన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం జనవరి 1 నూతన సంవత్సర కాదని, ఉగాదినే కొత్త సంవత్సరమని తెలిపారు. యువత పోకడలకు పోకుండా ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన వేద పండితులు బ్రహ్మశ్రీ వేలేటి గౌరీ శంకర్ శర్మ ను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రాము, 34 డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రవీణ్ (పండు), ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, కోశాధికారి గాలి నాగరాజు గుప్తా, కన్వీనర్లు లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పార్శి మారుతి గుప్తా, సుధాకర్ గుప్తా, రాజా ప్రతాప్ గుప్తా, నేతి మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు -
క్రైం కార్నర్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలం బీబీపేటకు చెందిన పల్లపు రవి(26) కొన్నేళ్లుగా బాన్సువాడలోని దాల్మల్గుట్టలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి పని నిమిత్తం అతడు తాడ్కోల్ రోడ్డు నుంచి గౌలీగూడ వైపు ఎక్స్ఎల్పై బయలుదేరాడు. రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం అతివేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బోధన్రూరల్: సాలూర శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి గురువారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వివరించారు. నిజామాబాద్ రూరల్: మద్యం తాగి ఆటో నడిపిన వ్యక్తిపై డ్రంకెన్డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు మోపాల్ ఎస్సై సుష్మిత గురువారం తెలిపారు. సిర్పూర్ తండాకు చెందిన సురేష్ అనే యువకుడు ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని, మద్యం మత్తులో నిజామబాద్ వైపు బయలుదేరాడు. మోపాల్ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆటో డ్రైవర్ సురేష్ ఆటో నిలుపకుండా అతివేగంగా నడపడంతో ఏఎస్సైకి గాయమైంది. వెంటనే పోలీసులు ఆటో డ్రైవర్ను వెంబడించగా అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రయాణికులతో, పోలీసు వారిపై తిరగబడ్డాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఆమె తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని కుమార్గల్లిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. నగరానికి చెందిన గంగాప్రసాద్ అనే వ్యక్తి బుధవారం రాత్రి కుమార్గల్లిలోని ఓ ఇంటిలో చోరీకి యత్నించాడు. ఈక్రమంలో ఇంట్లోని వృద్ధురాలు అతడిని చూసి కేకలు వేసింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై, అతడిని పట్టుకున్నారు. అనంతరం ఒకటోటౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాత నేరస్తుడని, కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. -
అందని వేతనాలు
ఎల్లారెడ్డిరూరల్: ఉపాఽధిహామీ కూలీలకు ఉపాధి కల్పించే సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి వేతనాలు రాక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఉపాధిహామీ కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు .. జిల్లాలో 2 లక్షల 48 వేల 423 జాబ్ కార్డులు ఉండగా వీటి పరిధిలో 4 లక్షల 68 వేల 500 మంది కూలీలు ఉన్నారు. ఉపాధిహామీ ఏపీవో, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తారు. పనులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు. జిల్లాలో 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరికి గత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అరకొర వేతనాలు ఉన్న తమకు కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉపాధి సిబ్బంది వివరాలను నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు... మూడు నెలల నుంచి ఇబ్బందులు అధికారులు స్పందించాలని వేడుకోలు -
ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు
● పలు చోట్ల అమ్మవారికి బోనాలు ● ఆలయాల్లో భక్తుల రద్దీ జిల్లాకేంద్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉగాది పండుగ సందర్భంగా ఎడ్లబండ్ల, ట్రాక్టర్లను ఆలయాల చుట్టూ తిప్పారు. పలు చోట్ల పోచమ్మ ఆమ్మవారికి బోనాలు తీసి భక్తులు మొక్కులు చెల్లించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్పేటలో నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఉగాది రోజూ ప్రారంభమయ్యా యి. మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, తాడ్వాయి మండలాల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. –సాక్షి, నెట్వర్క్ -
వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం
రామారెడ్డి: ఉగాది నుంచి ప్రారంభమైన శ్రీసీతారామచంద్రస్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వచ్చే నెల 4 వరకు వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుషనోల్ల రమేశ్ అన్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, ఆలయ కమిటీ చైర్మన్ రంగు రవీందర్తో కలిసి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. ఈనెల 27న శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, 28న గరుడ సేవ, 30న శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తామన్నారు. వచ్చేనెల 2న రథోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. నా గి రెడ్డిపేట ఎంపీడీవో కురుమ ప్రవీణ్, ఆలయ క మిటీ చైర్మన్ రవీందర్గౌడ్, సందీప్, మైపాల్, ఉత్సవ, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. -
ల్యాబ్ టెక్నీషియన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్ రూరల్:పారామెడికల్ ల్యాబ్ టెక్నీషి యన్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని పీఎంఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో గురువారం జరిగిన జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకు ల్యాబ్ టెక్నీ షియన్లకు గుర్తింపే లేకుండ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా పారామెడికల్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ల్యాబ్ టెక్నీషియన్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజులలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్టీ మిత్రులను ఏకం చేసి వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సన్నీ, కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఇంతియాజ్, ఉపాధ్యక్షుడిగా శివ, ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా కవిత, సహాయ కార్యదర్శిగా కళ్యాణ్, రఘు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రాము, వంశీ ఎన్ని కయ్యారు. రవీందర్, తలారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రంజాన్ తోఫాల పంపిణీ
తాడ్వాయి/లింగంపేట/బాన్సువాడ రూరల్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడి, సంగోజీవాడి, చందాపూర్, బ్రాహ్మణపల్లి, ఎర్రాపహాడ్, దేమికలాన్ గ్రామాలలో గురువారం ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. లింగంపేట మసీద్లలో రంజాన్ తోఫాలు ముస్లింలకు మహిళలకు అందజేశారు. టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫియోద్దీన్ మాట్లాడారు. బాన్సువాడ మండలం తాడ్కోల్లో సర్పంచ్ అందెరమేష్, దేశాయిపేట్లో జ్యోతీప్రకాష్, హన్మాజీపేట్లో లావణ్య వెంకాగౌడ్, పోచారం గ్రామంలో రమేష్నాయక్, ఇబ్రహీంపేట్ గ్రామంలో ఉద్దర సంధ్యారాణి ముస్లింలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు రెడ్ క్రాస్ సొసైటీ బాన్సువాడ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. రంజాన్ పండుగను ఆనందరంగా జరుపుకోవాలన్నారు. బాన్సువాడ మండలం బోర్లం, ఇబ్రాహీంపేట్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. -
ఖరీఫ్ ముంగిట్లో యాసంగికి ‘భరోసా’!
కామారెడ్డి క్రైం: ఓ వైపు యాసంగి పంటలు కోతకు వస్తున్నాయి. మరో నెల గడిస్తే ఖరీఫ్ సీజన్కు రైతులు సమాయత్తం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా విడుదలపై స్పష్టత వచ్చింది. మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఈనెల 22 న పెట్టుబడి సాయం అందించనున్నారు. సకాలంలో అందకపోయినా పంటల సాగులో చేసిన అప్పులు, ఇతర అవసరాలకు ఆసరాగా ఉండనుండడంతో రైతులు కాస్త ఊరట చెందుతున్నారు.జిల్లాలో 3,32,611 మంది రైతులు..జిల్లాలో గత యాసంగి లెక్కల ప్రకారం మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. ఇందులో ఎకరంలోపు భూమి కలిగిన రైతులు 1,30,671 మంది, 1 నుంచి 2 ఎకరాల మధ్య ఉన్నవారు 81,796 మంది, 2నుంచి 3 ఎకరాలు కలిగిన రైతులు 48,945 మంది, 3 నుంచి 4 ఎకరాలున్నవారు 26,734 మంది, 4 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులు 15,800 మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాల మధ్య భూమి ఉన్నవారు 11,265 మంది, 10 ఎకరాలకుపైగా భూమి కలిగిన వారు 1,493 మంది ఉన్నారు. అందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలంటే రూ.316.53 కోట్లు అవసరం.ఈనెల 25 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశంజిల్లాలో గతేడాదికంటే ఈసారి రైతుల సంఖ్య 12 వేలు పెరిగింది. వారికి కూడా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకల్లా రిజి్రస్టేషన్లు, ఆన్లైన్ రికార్డుల ప్రక్రియ పూర్తయిన భూములకు దరఖాస్తు చేసకునే అవకాశం ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాల్లో మార్పులు, గతంలో సాంకేతిక కారణాల (డీబీటీ ఫెయిల్యూర్)తో రైతు భరోసా అందని వారు కూడా మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు ఈనెల 25 వరకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.స్పష్టత కరువు..యాసంగికి సంబంధించిన రైతు భరోసా కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే పెట్టుబడి సాయంపై ఆశలు వదులుకున్నారు. ఆలస్యం జరిగినా యాసంగి పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఈనెల 22 న మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేస్తామని, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరలో మూడో విడత నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే రెండు, మూడు విడతలలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ పరిషత్ ఎన్నికల కోడ్ వస్తే నిధులు జమ చేయడం కొనసాగిస్తారా, ఆపేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో అందరికీ పెట్టుబడి సాయం అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యాసంగి సాయమే ఇంత ఆలస్యంగా ఇస్తుండడంతో వానాకాలంలో రైతుభరోసా ఇస్తారో లేదోనన్న చర్చ రైతుల్లో నడుస్తోంది. -
ఉగాదికి వేప పువ్వు కొరత
● తెగుళ్ల బెడదతో ఎండిపోతున్న చెట్లు ● రాలిపోయిన పూత ఎల్లారెడ్డి: షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఈసారి చేదు మాయమయ్యేలా కనిపిస్తోంది. వేప పువ్వు కొరతే ఇందుకు కారణం. ఉగాది పచ్చడిని తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు రుచులతో తయారు చేస్తారు. ఇందులో తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం పచ్చిమిరప లేదా మిరియాలు, చేదు కోసం వేపపువ్వు, వగరు కోసం మామిడిలను వినియోగిస్తారు. అయితే ఈసారి కొమ్మ ఎండు తెగులుతోపాటు కీటకాలు, ఫంగస్ ఆశించి చాలాచోట్ల వేప చెట్లు ఎండిపోతున్నాయి. వేపచెట్ల మొవ్వలు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత, కాయలు కుళ్లి పోతున్నాయి. దీంతో ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో వేప పువ్వుకు కొరత ఏర్పడింది. ఈసారి వేపు పువ్వు లేకుండా ఉగాది పచ్చడి చేసుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేప చెట్లు ఎండిపోతున్న విషయమై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డిని సంప్రదించగా.. ఎండు తెగులుతోపాటు కీటకాలు, ఫంగస్ వల్ల వేప చెట్లు ఎండిపోతున్నట్లు గుర్తించామన్నారు. చెట్టులో ఎండిపోతున్న భాగాన్ని తొలగించి మాన్కోజెబ్తో కార్బన్డజిమ్ మిశ్రమాన్ని కలిపి పిచికారి చేస్తే చెట్లను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేప చెట్లకు మందు పిచికారి చేయించి రక్షించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి భిక్కనూరు: ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా మహిళా శిశు సంరక్షణాధికారిణి ప్రమీల అన్నారు. బుధవారం ఆమె భిక్కనూరు రైతు వేదికలో టైలరింగ్ ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన మహిళలకు ఆమె సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ప్రతి మహిళ ఆయా రంగాల్లో తప్పనిసరిగా శిక్షణ పొంది ప్రావీణ్యత సాధించి ఉండాలన్నారు.అప్పుడే మహిళ తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతుందన్నారు. సర్పంచ్ బల్యాల రేఖ, ఈవో మహేష్గౌడ్, తదితరులున్నారు. -
అకాల వర్షంతో నష్టం
మద్నూర్/పెద్దకొడప్గల్/ఎల్లారెడ్డిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం రాత్రి, బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల రాళ్లు పడ్డాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. పెద్దకొడప్గల్ మండలంలో వందల ఎకరాలలో జొన్న పంట నేలకొరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో ఈదురుగాలులతో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. మద్నూర్ మండలంలోని మేనూర్, సుల్తాన్పేట్, మారెపల్లి, మద్నూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటలు, జొన్న పంటకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోగల శ్రీకన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో భగవద్గీత ఆధారిత వి ద్యా విలువలు అంశంపై ఈనెల 24న పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇస్కాన్ కామారెడ్డి ప్రతినిధి వెంకటదాస్ ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగం, సనాతన ధర్మంలో ఇస్కాన్ పాత్ర అంశాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తిగలవారు పాల్గొనా లని సూచించారు. కామారెడ్డి టౌన్ : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ద్వితీయ భాష పరీక్ష నిర్వహించగా.. 99.75 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 13,144 మంది విద్యార్థులకుగాను 13,111 మంది హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు. -
యువకుడి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ యువకుడు బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. కామారెడ్డి మండలం ఇస్రోడిజివాడికి చెందిన కనుకంటి సాయికుమార్(23) కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో కుకింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో మద్యం సేవించి మత్తులో ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు దారితీసినట్లు ఎస్సై వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ ప్రశాంత్ను చిన్నదడ్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చంపేస్తానని బెదిరించడంతో బుధవారం పొలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి దడ్గి లైన్లో మరమ్మతులు ఉన్నాయని లైన్మన్ ఎల్సీ తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆపరేటర్ ప్రశాంత్కు ఫోన్ చేసి కరెంటు సరఫరా ఎందుకు తీశారని, వెంటనే ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మన్ ఎల్సీ తీసుకున్నాడని చెప్పినా వినకుండా తనకే ఎదురు చెబుతావా? నీ సంగతి చూస్తా..అంటూ అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో పై అధికారుల ఆదేశాల మేరకు ఆపరేటర్ పొలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసునమోదు చేస్తామని ఎస్సై రాజు తెలిపారు. కారు దగ్ధం ● త్రుటిలో తప్పిన ప్రమాదం మాచారెడ్డి: మండలంలోని గన్పూర్(ఎం) గ్రామ శివారులో కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్ కారులో కామారెడ్డికి వెళుతున్నారు. గన్పూర్(ఎం) శివారులోకి రాగానే సీఎన్జీ కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో అనుమానం వచ్చి రోడ్డు పక్కన కారును నిలిపివేశాడు. అంతలోనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. శ్రీనివాస్గౌడ్ అప్రమత్తమై కారును నిలిపివేయకుంటే పెను ప్రమాదం సంభవించేదని ఎస్సై అనిల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
అంతర్రాష్ట్ర బైకు దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి వరాలు వెల్లడించారు. నిర్మ ల్ జిల్లా బాసర, ముథోల్, భైంసా, తానూర్, నిజామాబాద్ జిల్లా నవీపేట్, మాక్లూర్, రెంజల్, వర్ని తదితర పోలీస్ స్టేషన్లో బైక్ చోరీ కేసులు నమోదుకాగా, అందులో 15 కేసులను ఛేదించామన్నారు. పాత నేరస్తులైన షేక్ అర్బాజ్, షేక్ ఇమ్రాన్, షేక్ సమీర్లు గతంలో బైక్, చైన్ స్నాచింగ్కు పాల్పడే వారని, వీరిని నాలుగో టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. వీరిపై గతంలోనే 10 కేసులు ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా షేక్ అర్బాజ్, షేక్ ఇమ్రాన్, షేక్ సమీర్, షేక్ రెహమాన్ అంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లో పల్సర్ బైకులే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కలిసి 17 బైకులను చోరీ చేయగా, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 17 బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్కు చెందిన షేక్ అర్బాజ్ రహమత్, సోమ్ కాంబ్లే, మనోజ్ షేర్, షాదుల్ షేక్ తక్కువ ధరకు కొనుగోలు చేయగా, వీరి నుంచి బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 13న నవీపేటలోని అయ్యప్ప టెంపుల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా పోలీసులను చూసి ముఠా సభ్యులు పారిపోతుండగా పట్టుకున్నామన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాశ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్, ఎస్సై మహేశ్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. 220 గ్రాముల ఆల్ప్రాజోలం పట్టివేత కామారెడ్డి క్రైం: వివిధ గ్రామా ల్లో నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితుల వద్ద నుంచి 220 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి ఎకై ్సజ్ సీ ఐ సంపత్ కృష్ణ తెలిపారు. కా మారెడ్డి ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. కల్తీకల్లులో కలిపే ఆల్ప్రాజోలం విషయంలో విశ్వసనీయ సమాచారం రావడంతో ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు ముందుగా సదాశివనగర్ మండలం భూంపల్లిలో దాడులు నిర్వహించి గడిపల్లి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద నుంచి 4 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించింది. దీంతో మరోసారి దాడులు చేపట్టి నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన గురం రాజేందర్ గౌడ్ వద్ద 110 గ్రాములు, జలాల్పూర్కు చెందిన గడ్డం మానిక్య గౌడ్ వద్ద 106 గ్రాముల చొప్పున ఆల్ప్రాజోలంను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్, శరత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి
● వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, తేమ మీటర్లు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గోదాముల నిల్వ సామర్థ్యం సరిపోకపోతే ప్రైవేటు గోదాములు, భవనాలను అద్దెకు తీసుకోవాలన్నారు. అనంతరం ఎల్పీజీ సరఫరాపై సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ రీఫిల్లింగ్, సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 113 మందిపై కేసులు నమోదు చేశామని, 160 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నెలాఖరులోగా రుణాల రికవరీ పూర్తి చేయాలి కామారెడ్డి క్రైం: జిల్లాలో బ్యాంక్ లింకేజీ రుణాల రికవరీని నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బకాయిల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖలు సమన్వయంతో పని చేసి, లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, సెర్ప్, సీ్త్రనిధి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతు మహోత్సవానికి తరలిరావాలి కామారెడ్డి క్రైం: సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22 న జరిగే రైతు మహోత్సవానికి రైతులు భారీగా తరలి రావాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లు, బ్యాంకులు, ఎఫ్పీవోలు, స్టార్టప్ కంపెనీల ప్రదర్శనలు, అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సౌకర్యాలను మెరుగుపరచాలి భిక్కనూరు: ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు సౌకర్యాలను మెరుగు పరుచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రాజు, తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ వైఫల్యాలపై 20న ధర్నా’
కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామని, 23వ అసెంబ్లీ ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నరేందర్రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, నాయకులు విపుల్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
చిరుత గోర్లు స్వాధీనం
బాన్సువాడ : వర్ని మండలం చక్లి తండాకు చెందిన పట్లోత్ జబ్బార్ వద్ద 10 చిరుత పులి గోర్లు స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించామని బాన్సువాడ ఎఫ్డీవో సునీత తెలిపారు. ఇటీవల బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో చిరుత పులి కళేబరం కనిపించిన విషయం తెలిసిందే. చిరుతకు గోర్లు లేకపోవడాన్ని గమనించిన అటవీ అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. చక్లి తండాకు చెందిన పట్లోత్ జబ్బార్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో మంగళవారం అతడిపై కేసు నమోదు చేశారు. అతడి వద్దనుంచి చిరుత గోర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని ఎఫ్డీవో తెలిపారు. ఈ ఘటనలో హన్మాజీపేట్ గ్రామానికి చెందిన హన్మంత్రావు, గుంటూరు తండాకు చెందిన వసంత్ అనే వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో ల్యాబ్కు పంపించామని, నివేదిక వచ్చాక ఎలా చనిపోయిందనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా చిరుతపులి గోర్ల మాయం వెనుక అటవీశాఖ సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దోమకొండ: రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా ఎంపికై న సీతారాంపల్లి గ్రామానికి చెందిన 125 మంది రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లు అందించామన్నారు. భూసార పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. కార్యక్రమంలో దోమకొండ, సీతారాంపల్లి సర్పంచ్లు నర్సయ్య, భానుశ్రీ, ఏవో మణిదీపిక, ఏఈవోలు కృష్ణారెడ్డి, సంజీవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్రెడ్డి, నాయకులు తిర్మల్గౌడ్, అనంత్రెడ్డి, సీతారం మధు, సిద్దారెడ్డి, శ్రీనివాస్, రైతులు శంకర్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: వచ్చే నెలలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించి ఈనెల 20వ తేదీ వరకు పరీక్ష రుసుము చెల్లించాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాద రుసుముతో 24 వరకు, రూ.500 అపరాద రుసుముతో 26వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రుసుము చెల్లించిన విద్యార్థులు ఈనెల 26 వరకు తమ దరఖాస్తులను ఆయా కళాశాలల పరీక్షల విభాగంలో అందజేయాలని పరీక్షల అదనపు నియంత్రణ అధికారులు ఎన్.రాములు, ఏ.రాజేందర్ సూచించారు. ఎల్లారెడ్డి: యువత ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికళ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం కలుషితమై, దీని ప్రభావం అన్ని జీవరాశుల మీద పడుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీనారయణ, ఫలక్నుమా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్కుమార్, ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ విజయభాస్కర్రెడ్డి, ఎల్లారెడ్డి కళాశాల సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు శశిధర్, చంద్రకాంత్, గోదావరి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిధులు దుర్వినియోగం చేయొద్దు
ఎల్లారెడ్డి: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలని, నిధులు దుర్వినియోగం చేయొద్దని ఏపీడీ వామన్రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. 2024 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2025 వరకు నిర్వహించిన ఉపాధిహామి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. 2024– 2025 ఆర్థిక సంవత్సరంలో ఎల్లారెడ్డి మండలంలో రూ.3 కోట్ల 69 లక్షల 79 వేల 822 పనులు జరిగాయని తెలిపారు. వీటిలో రూ.7 వేల నిధులను రికవరీ చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సూర్యాజీ, వినోద్, తదితరులున్నారు. -
పేరుకుపోయిన నిర్లక్ష్యం..
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఆ మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త కుప్పకు ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు చేయడమే తక్కువ. అవును.. 12 నెలలు గడిచినా, క్యాలెండర్లు మారినా.. అక్కడి వ్యర్థాలు మాత్రం ఇంచు కూడా కదలడం లేదు. మున్సిపల్ సానిటేషన్ విభాగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఒక కాలువను శుభ్రం చేయడానికి వీరికి ఏడాది కాలం కూడా సరిపోవడం లేదని స్థానిక ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డులో ఉన్న ఈ బడా మురికి కాలువను గత కౌన్సిల్ హయాంలో నూతనంగా నిర్మించారు. ఆ తర్వాత ప్రత్యేక పాలన ఏడాది గడిచి, ఇప్పుడు కొత్త కౌన్సిల్ కొలువుదీరింది. పాలకులు మారారు తప్ప, ఈ కాలువ రాత మాత్రం మారలేదు. నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ మురికి కాలువను శుభ్రం చేసిన దాఖలాలు లేవని స్థానికులు వాపోతున్నారు. కాలువలో చెత్తాచెదారం భారీగా పేరుకుపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికే అధికారులు, ప్రజాపతినిధుల కళ్లముందే కనిపిస్తున్న ఈ బడా కాలువను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘పశువులకు టీకాలు వేయించాలి’
భిక్కనూరు : పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్ కుమార్ సూచించారు. మంగళవారం గుర్జకుంటలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. వచ్చేనెల 9 వరకు జిల్లాలో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్రెడ్డి, మండల పశువైద్యాధికారి దేవేందర్, పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● పోలీసులు, ఆశాకార్యకర్తల మధ్య తోపులాటకామారెడ్డి టౌన్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరెట్లోకి వెళ్లేందుకు ప్రయత్నింగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశాకార్యకర్తలు బారికేడ్లను పక్కకు జరిపి ప్రధాన గేటు వైపు దూసుకువెళ్లారు. పోలీసులు వారిని నిలువరించే క్రమంలో ఇరువర్గాల మధ్య సుమారు అరగంట పాటు తోపులాట జరిగింది. ఓ ఆశాకార్యకర్తల సొమ్మసిల్లి పడిపోగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, అరుణ్కుమార్ మాట్లాడుతూ మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన సీఐ నరేశ్ను సస్పెండ్ చేయాలని, ఆయనపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చకుంటే త్వరలోనే చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిర, రాజశ్రీ, నాయకులు మమత, లావణ్య, గీత, సీఐటీయూ నాయకులు నర్సింలు, సత్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పలు గ్రామాలలో వడగండ్ల వర్షం
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. మండలంలోని మత్తమాల, అల్మాజీపూర్, రుద్రారం, మల్కాపూర్ గ్రామాలలో వడగండ్ల వర్షం కురిసింది. వర్షం వలన పొట్ట దశలో ఉన్న వరి పంటకు నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయాన్ని యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్కు ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వాసంతి తెలిపారు. జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా లింగంపేట, భిక్కనూరు, నిజాంసాగర్ కేజీబీవీలు ఎంపికై నట్లు తెలిపారు. ఇక నుంచి విద్యార్థులకు ‘నీట్’కు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండదు, అలాగే రూ.లక్షలు ఖర్చు పెట్టే స్థోమత లేకపోవడంతో ఎంతో మంది నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా ప్రభుత్వం కేజీబీవీల్లో ఎన్ఈఈటీ(నీట్)కు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలన్నారు. మే 3న టీజీఆర్జేసీ సెట్–2026 ద్వారా ప్రవేశ పరీక్షల నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఇందులో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. జీఈసీవో సుకన్య ఉన్నారు. -
కో–ఆప్షన్ పదవి ఎవరికో?
● నాయకుల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్న ఆశావహులు ● ఈసారి నాలుగు స్థానాలా లేక రెండు స్థానాలే కేటాయిస్తారా..?బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి నెల రోజులు కావొస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపైనే చర్చ కొనసాగుతోంది. కో–ఆప్షన్ ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. బాన్సువాడ పట్టణంలో స్థానిక లాబీయింగ్ మరింత ఊపందుకుంది. ఆశీస్సులు ఎవరికో.. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు 11 వా ర్డులు కాంగ్రెస్ స్థానాలు సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని వారు నిరాశపడకుండా ము ఖ్య నాయకులు కో–ఆప్షన్ ఇస్తామని సర్ది చెప్పి పో టీ నుంచి తప్పించారు. కాంగ్రెస్ నాయకులు కొంద రు కో–ఆప్షన్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గ తంలో బాన్సువాడ మున్సిపాలిటీకి నాలుగు కో–ఆప్షన్ పదవులు కేటాయించారు. 2020లో మైనార్టీ, బీసీ మహిళ, సీనియర్ సిటిజన్, డ్వాక్రా సంఘం స భ్యురాలికి కో–ఆప్షన్ పదవులు కేటాయించారు. ప్రస్తుతం నాలుగు కో–ఆప్షన్ స్థానాలు కేటాయిస్తా రా లేక రెండు స్థానాలే కేటాయిస్తారా అనే ప్రశ్న జో రుగా కొనసాగుతుంది. రెండు కో–ఆప్షన్ స్థానాలు కేటాయిస్తే ఒకటి మహిళకు, మరొక స్థానం మైనార్టీ కి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. కో–ఆప్షన్ కోసం ఇటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కా సుల బాల్రాజ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిల ఆశీస్సుల కోసం ఆశావహులు చక్క ర్లు కొడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హత లు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్ప రం పోటీ పడుతున్నారు. మరి కో–ఆప్షన్ ఎవరిని వరిస్తుందో వారం రోజులు ఎదురు చూడాల్సిందే. కో–ఆప్షన్ కాకపోతే ఇతర నామినేటెడ్ పదవుల్లో అ వకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రజావాణి ఫిర్యాదుపై విచారణ
లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్లో మంగళవారం ప్రజావాణి ఫిర్యాదుపై ఎంపీవో మలహరి విచారణ చేశారు. అయిలాపూర్లో గ్రంథాలయం కోసం నిర్మించిన భవనంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలులేకుండా పోతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయాన్ని తొలగించి గ్రంథాలయానికి కేటాయించాలని గ్రామానికి చెందిన మన్నె కృష్ణ ఈ నెల 9వ తేదీన కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీవో గ్రామంలో విచారణ చేపట్టారు. నిరుద్యోగులు చదువుకోవడానికి వీలుగా తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముందుకు రావడంతో ఫిర్యాదుదారుడు అంగీకరించినట్లు తెలిపారు. సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ సంజీవులు, కార్యదర్శి నవాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావును కలిశారు. సర్పంచుల ఫోరం ఎంపిక అనంతరం మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్పంచ్ల ఫోరం ఎన్నికల్లో సక్రూనాయక్ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేతలు సాయిరాం, బాబు, సేవ్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేట తండాకు చెందిన దశరథ్నాయక్ను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆత్మ కమిటీ చైర్మన్తో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి 24 మంది డైరెక్టర్లను నియమించారు. నూతనంగా ఎంపికై న చైర్మన్ను హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు సన్మానించారు. నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాక ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి నేడు ఎమ్మెల్యే మ దన్మోహన్రావు రానున్నట్లు మున్సిపల్ చైర్మ న్ పద్మ శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. మై నార్టీలకు ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొనేందు కు ఎమ్మెల్యే హాజరుకానున్నట్లు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ శివారులో మంగళవారం సాయంత్రం ఎలుగు బంట్లు సంచరించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఎలుగుబంట్ల సంచార దృశ్యాలను యువకులు వీడియోలు తీశారు. యాసంగి ఆరుతడి, వరిపంటలు సాగు చేసిన రైతులు రేగడి చేను వద్దకు కాపలా వెళ్లగా రెండు ఎలుగు బంట్లు గాండ్రిస్తూ పరుగులు తీస్తుండగా మంచెలపైకి ఎక్కి అరుస్తూ ప్రాణాలు కాపాడుకున్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని వివిధ హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, క్యాంటీన్లలో మంగళవారం సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించి 9 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వ్యాపార అవసరాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికిగాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో నమో దు కోసం ఆసక్తిగల ప్రయివేట్ పాఠశాలలు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొంది మంచి వసతులున్న, ఫలితాలు సాధిస్తున్న పాఠశాల యాజమాన్యాలు కలెక్టరేట్లోని 113వ నంబర్ గదిలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: అడవుల్లో విత్తన బంతులు వేయడం మొక్కల పెంపకానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ పేర్కొన్నారు. కళాశాల ఎకో క్లబ్, వృక్ష, అటవీశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు విత్తన బంతులు తయారు చేసి మంగళవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతమైన మట్టితో తయారు చేసిన విత్తన బంతులతో అడవుల్లో వివిధ రకాల మొక్కలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. వీటితో సకల జీవరాశికి ఆహారం అందడంతో పాటు ఆశ్రయం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు దినకర్ చిన్న, విశ్వప్రసాద్, శ్రీవల్లి, స్వాతి, శ్రీలత, వెన్నెల, రమణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : ఇంటర్ మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ పెంచడంపై తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, విజయకుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్ సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
కమనీయం.. గోమాత కల్యాణం
మద్నూర్: ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. వేదమంత్రోచ్ఛారణలు.. మంగళ హారతుల నీరాజనాల మధ్య వరుడు వృషభ రాజు.. వధువు గో మహాలక్ష్మిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరంతా పెళ్లి పెద్దలుగా మారి జరిపించిన ఈ కమనీయ వేడుకకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం వేదికయ్యింది. మద్నూర్లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో సోమవారం రాత్రి ఆవు, దూడల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. వేదపండితులు వెంకట్ మహారాజ్, మహేశ్ మహారాజ్లు పెళ్లి మంత్రాలను చదవగా.. అచ్చం నిజం పెళ్లిలా కార్యక్రమం సాగింది. కార్యక్రమానికి వచ్చినవారంతా ఆవుదూడలపై అక్షింతలు చల్లారు. అనంతరం భాజాభజంత్రిలు, మంగళ హారతులతో గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. వివాహానంతరం అందరూ విందు ఆరగించారు. లోక కళ్యాణం కోసం ఆవు, దూడల కల్యాణం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
తెలుగులో 99 మార్కులు.. తిరుమల తీసుకెళ్లిన అధ్యాపకుడు
మానకొండూర్(కరీంనగర్) : తెలుగు భాషను ప్రోత్సహించేందుకు ఓ అధ్యాపకుడు వినూత్న ఆలోచన చేశాడు. ఇంటర్లో తెలుగు సబ్జెక్టులో 99 మార్కులు తెచ్చుకున్న వారిని తిరుమల వెంకన్న దర్శనానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఎనిమి ది మంది 99 మార్కులు తెచ్చుకోగా ఇచ్చిన మా ట ప్రకారం వెంకన్న దర్శనం చేయించాడు. క రీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజ ర్ల గ్రామానికి చెందిన బోళ్ల ప్రవీణ్కుమార్ కా మారెడ్డి మైనారిటీ బాలుర జూనియర్ కళాశాల లో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తాను బో ధించే విద్యార్థులకు తెలుగు సబ్జెక్టుపై మక్కువ పెంచేలా వినూత్నంగా ఆలోచన చేశాడు. తెలుగులో 99 మార్కులు తెచ్చుకుంటే తిరుమల తీసుకెళ్తానని విద్యార్థులతో చెప్పాడు. గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన 40 మందిలో 8 మంది 99 మార్కులు తెచ్చుకున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో తిరుమల తీసుకెళ్లడం వీ లుకాకపోవడంతో సదరు విద్యార్థులను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన మరునాడు తిరుమల తీసుకెళ్లాడు. శనివారం వెంకన్న దర్శనాని కి వెళ్లిన విద్యార్థులు మంగళవారం కామారెడ్డికి చేరుకున్నారు. వీరితో అధ్యాపకులు బాలమల్లు శ్రీకర్, రవి ఉన్నారు. -
ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఉగాది ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గోపాల్పేటలో ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు జరుగనున్న ఉగా ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉ త్సవాలలో భాగంగా చేపట్టనున్న ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అల్లర్లు జరగకుండా సర్పంచ్లు, ఉ పసర్పంచ్లు, గ్రామపెద్దలు బాధ్యత వహించాలన్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్, సర్పంచులు పాల్గొన్నారు. దోమకొండ: ఉగాది పండుగ సందర్భంగా నిర్వ హించే ఎడ్లబండ్ల ప్రదర్శన శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై ప్రభాకర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో స ర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరె డ్డి, నాయకులు శంకర్రెడ్డి, సీతారాం మధు, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్రెడ్డి తదితరులున్నారు. -
ౖపైపెకి చికెన్.. పాతాళానికి గుడ్డు..
ఎల్లారెడ్డి: మార్కెట్లో కోడి మాంసం ధర కొండెక్కి కూచుంది. అదే సమయంలో కోడి గుడ్డు ధర మాత్రం సగానికి పడిపోయింది. రెండు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ. 240 నుంచి రూ. 260 పలుకగా.. ప్రస్తుతం రూ. 320 నుంచి రూ. 360 వరకు విక్రయిస్తున్నారు. గుడ్డు ధర మాత్రం రూ. 7 నుంచి రూ. 4కు పడిపోయింది. జిల్లాలో ఈనెల మొదటి వారంలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 290, డ్రెస్స్డ్ చికెన్ ధర రూ. 260 ఉండేది. రెండో వారాంతానికి ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ ధర రూ. 360, డ్రెస్స్డ్ చికెన్ ధర రూ. 340 కి చేరింది. నాటు కోళ్లను ఒక్కోదానిని రూ. 750 నుంచి రూ. 800లకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతతో కోళ్లు చనిపోతున్నాయని, మరోవైపు వివాహాలు, రంజాన్ మాసం కారణంగా డిమాండ్ పెరగడంతో చికెన్ ధర ఆకాశాన్నంటుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన దాణా ధరలు కూడా చికెన్ రేటు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. సగం ధరకే కోడి గుడ్డు.. నిన్నామొన్నటి వరకు ఆకాశాన్నంటిన కోడి గుడ్డు ధర.. ప్రస్తుతం భారీగా పడిపోయింది. నెల క్రితం వరకు గుడ్డు ధర రూ. 7 వరకు పలికింది. ప్రస్తుతం రూ. 3.50 నుంచి రూ. 4 వరకు దొరుకుతోంది. గతంలో రాష్ట్రంలో ఉత్పత్తయ్యే గుడ్లలో 50 శాతానికిపైగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవని, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవని, అందుకే ధర తగ్గించి అమ్ముకుంటున్నామని పేర్కొంటున్నారు. -
అక్కడ మామూలే!
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన సానిటేషన్ విభాగానికి అవినీతి మరకలు అంటుకున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి మున్సిపల్ ఖజానాకు కన్నం వేస్తూనే క్షేత్రస్థాయిలో కార్మికుల శ్రమనూ దోచుకుంటున్నారు. గతంలో ఈ విభాగంలో ఇద్దరు అధికారులు ఏసీబీకీ చిక్కారు. తాజాగా ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు మరిన్ని బట్టబయలయ్యాయి. – కామారెడ్డి టౌన్కామారెడ్డి బల్దియా సానిటేషన్ విభాగంలో 264 పారిశుద్ద్య కార్మికులు, వీరిని పర్యవేక్షించేందుకు 16 మంది జవాన్లు పనిచేస్తున్నారు. కొత్త పట్టణానికి ఒక రెగ్యులర్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. గతంలో స్క్రాప్ను అమ్ముకుని సస్పెన్షన్కు గురై మళ్లీ విధుల్లో చేరిన మరొకరిని పాతపట్టణానికి ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్గా కేటాయించారు. ఈ విభాగంలో కార్మికుల హాజరుకు సంబంధించి రెండు రిజిస్టర్లను వినియోగిస్తున్నట్లు సమా చారం. పారిశుద్ధ్య కార్మికులలో కొందరు విధులకు హాజరు కాకపోయినా, హాజరు చూపిస్తున్నారు. ఇలా డుమ్మా కొట్టిన కార్మికుల జీతాల నుంచి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. పని చేయకుండానే జీతం వస్తుండడంతో సదరు కార్మికులు కూడా వీరికి సహకరిస్తున్నారు. డ్యూటీ కావాలంటే డబ్బులివ్వాల్సిందే.. ఓ వార్డులో పనిచేసే మహిళా కార్మికురాలు చనిపోతే.. ఆమె స్థానంలో భర్తను తీసుకునేందుకు మొదట ఓ అధికారి రూ. 50 లంచం తీసుకున్నారు. 6 నెలలు పని చేయించుకుని తొలగించి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. గతంలో రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకుని 16 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. హోటళ్ల నుంచి నెలవారీ మామూళ్లు.. హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్తను ఉచితంగానే సేకరించాల్సి ఉంటుంది. అయితే చెత్త సేకరణ సిబ్బంది ప్రతినెల వాటి యజమానులనుంచి చెత్త సేకరణ కోసం నెలకు రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం.బల్దియాలో 22 చెత్త సేకరణ ఆటోలు, 9 డంపింగ్ ట్రాక్టర్లు, స్కై లిఫ్ట్, పొక్లెయిన్, డోజర్, జీప్ ఉన్నాయి. చెత్త సేకరణ డంపింగ్ వాహనాల విషయంలో భారీగా గోల్మాల్ జరుగుతోంది. ప్రతి నెల రూ. 14 లక్షలకుపైగా బిల్లులు చెల్లిస్తుండగా.. వీటిలో రూ. 3 లక్షల నుంచి 5 లక్షలు అధికారులు, సిబ్బంది నొక్కేస్తున్నట్లు ఏసీబీ తనిఖీలలో తేలింది. రోజూ వాహనాలు తిరిగే కిలోమీటర్లను అధికంగా చూపిస్తూ డీజిల్ బిల్లులను అమాంతం పెంచేస్తున్నారని తెలుస్తోంది. వాహనాల మైలేజీకి, ఖర్చవుతున్న ఇంధనానికి పొంతన ఉండడం లేదు. రికార్డులను మాయం చేస్తూ కాకి లెక్కలు రాసినట్లు స్పష్టమవుతోంది. అలాగే రెండేళ్ల క్రితం ఈ విభాగంలో వాహనాల మరమ్మతులు, ఇందనం బిల్లుల రూపేణా రూ. కోటికిపైగా మింగేసినట్లు తెలిసింది.సానిటేషన్ విభాగం సేకరించిన చెత్తలో వచ్చే ప్లాస్టిక్, ఇనుము, ఇతర సామగ్రిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. అయితే అధికారులు, సిబ్బంది వాటిని రహస్యంగా అమ్ముకుంటున్నారని తెలిసింది. సానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అవినీతి ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కామారెడ్డి సానిటేషన్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అవినీతికి కేరాఫ్గా కామారెడ్డి బల్దియా సానిటేషన్ విభాగం డుమ్మా కొట్టిన ఉద్యోగులకు హాజరు.. అనంతరం వారినుంచి వసూళ్లు ఇంధన బిల్లుల్లోనూ ప్రతినెలా రూ. 3లక్షలపైనే జేబుల్లోకి.. ‘చెత్త’నూ వదలని అక్రమార్కులుజిల్లా కేంద్రంలో గతేడాది 400 వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్ చేయలేదు. దీంతో ఖజానాకు కోటి రూపాయల వరకు గండి పడిందని ఏసీబీ సోదాలలో తేలింది. నిబంధనల ప్రకారం రావాల్సిన రుసుములను కాకుండా, తక్కువగా చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్లు జారీ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పాత పట్టణంలోని ఓ మర్చంట్ ఆసోసియేషన్కు చెందిన 25 దుకాణాల ట్రేడ్ లైసెన్స్లను రెన్యువల్ చేస్తే బల్దియాకు రూ. 8 లక్షలు వచ్చేవి. కానీ సిబ్బంది వారి నుంచి రూ. లక్షన్నర లంచం తీసుకుని నూతన ట్రెడ్ లైసెన్స్లను జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు తీసుకుంటూ తప్పుడు కొలతలతో ట్రెడ్ లేసెన్స్లను జారీ చేస్తూ మున్సిపల్ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. -
‘గ్రాసం’ గోస
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎండాకాలం సమపించక ముందే మేత కోసం మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామ పొలిమేరల్లో ఉన్న భూముల్లో రైతులు పంటలు సాగు చేసుకోవడంతో మూగజీవాలకు గ్రాసం దొరక్క అల్లాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా గన్నారం తండాకు చెందిన 150 ఆవుల మందను గ్రాసం కోసం సదాశివనగర్ మండలానికి తోలుకొస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. పశువులు మేత మేయడానికి కనీసం గజం భూమి కూడా ఖాళీ లేకుండా ఉండడంతో తాము తమ ఆవులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చినట్లు పశువుల కాపరులు పేర్కొన్నారు. -
ఆటో చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నిజామాబాద్అర్బన్: జల్సాలకు అలవాటుపడి ఆటో చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నార్త్రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 13న న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉండే పండ్ల వ్యాపారి నర్సింలు తన ఆటో చోరీకి గురైనట్లు 5వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలోని నెహ్రూనగర్కు చెందిన షేక్నయీమ్ జల్సాలకు అలవాటుపడి మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అందులో భాగంగానే నర్సింలు ఆటోను దొంగిలించినట్లు సీఐ తెలిపారు. ఆటోను మహారాష్ట్రలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అర్సపల్లిలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసును ఐదో టౌన్ ఎస్సై గంగా ధర్, సిబ్బంది త్వరగా ఛేదించినట్లు సీఐ తెలిపారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని సూర్య విహార్ కాలనీలో నాలుగు ఆవులు చోరీకి గురైనట్లు బాధితులు ఆదివారం తెలిపారు. పట్టణంలోని సూర్యవిహార్లో పశువుల పాకలో కట్టి ఉంచిన నాలుగు ఆవులను దుండగులు చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింథే నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గిర్నితండాకు చెందిన మార్కెట్ కమిటీ మాజీి డైరెక్టర్ అంబునాయక్కు ఆదివారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింథే ధైర్యం చెప్పారు. ఇటీవల పక్షవాతంతో అంబునాయక్ మంచానపడ్డారు. మంచానపడిన అంబునాయక్ కుటుంబానికి అన్నివిధాలుగా ఆదుకుంటానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గున్కుల్ సొసైటీ మాజీ చైర్మన్ వాజిద్ అలీ, దూప్సింగ్ తండా సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు రాంచందర్, సంగమేశ్వర్ గౌడ్, నారాయణ, మనీశ్రెడ్డి, తదితరులున్నారు. -
విద్యుత్ అంతరాయాల నివారణకు ప్రత్యేక వాహనాలు
● విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు నిజామాబాద్ రూరల్: ప్రకృతి విపత్తులైన భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్ఈ పీవీ రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సర్కిల్ పరిధిలో 3 ఈఆర్టీ(ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్) వాహనాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. సబ్డివిజన్ స్థాయిలో 14 వాహనాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులకు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ తదితర మెటీరియల్ ముందుగానే అందుబాటులో ఏర్పాటు చేసుకొని, వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో సమస్య ఏర్పడిన ప్రాంతానికి బృందాన్ని వెంటనే పంపించి వేగంగా సమస్యను పరిష్కరిస్తున్నామని ఎస్ఈ వివరించారు. ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ వాహనాల ద్వారా హఠాత్తుగా సంభవించే సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఎస్ఈ అన్నారు. -
బోధన్లో గ్యాస్ ఇబ్బందులు
బోధన్టౌన్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద సీపీఎం, సీపీఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెబుతుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల కోసం కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకొని ఎనిమిది రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు రాజు, రాములు, పోశెట్టి, సాయిలు, గౌస్, హైమద్, అమీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
ఎల్లారెడ్డిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ ఆదివారం తెలిపారు. 2వ వార్డులో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామంలో మహిళ సమాఖ్య భవనానికి రూ.10లక్షల నిధులు కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఉప సర్పంచ్ రాజయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో ముందుండాలి లింగంపేట(ఎల్లారెడ్డి): వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులు ముందుండాలని ఎంపీవో మలహరి సూచించారు. ఆదివారం లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండో రోజు వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామాల్లోని తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత వార్డు సభ్యులపై ఉంటుందన్నారు. అలాగే వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, పారిశుద్ధ్యం, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. పంచాయతీ రాజ్ చట్టం–2018లోని అంశాలు, అమలు విధానాన్ని వివరించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. -
కృష్ణ జింకను కాపాడిన గ్రామస్తులు
వర్ని: మండలంలోని శంకోర గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు పడిన కృష్ణ జింకను గ్రామస్తులు ఆదివారం కాపాడారు. అడవిలో కుక్కలు వెంటపడగా వాటి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో సాగర్ కాలువలో పడిన కృష్ణ జింకను శంకోరా గ్రామానికి చెందిన యువకులు కాపాడారు. నీళ్లలో కొట్టుకపోతున్న జింకను పైకి తీసుకొచ్చి మళ్లీ అడవిలో వదిలివేశారు. కామారెడ్డి టౌన్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యులతో పాటు చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకులను సైతం ఇబ్బంది పెడుతోంది. గ్యాస్ సిలిండర్ లభించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆర్కేలాడ్డ్ రోడ్లో ఒక చిన్న ఫుడ్ హోటల్ నిర్వాహకురాలు వినూత్నంగా ఆలోచించారు. వంట గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఆధునిక కట్టెల పొయ్యిని వినియోగిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అతి తక్కువ కట్టెలు లేదా బొగ్గుతో, ఎక్కువ వేడినిచ్చే ఈ పొయ్యిని వాడటం వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా రొట్టెలు, వంటకాలు చేయడానికి గ్యాస్ స్టౌ కంటే ఇలాంటి పొయ్యిలే ఎంతో అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవైపు కమర్షియల్ గ్యాస్ దొరక్కపోవడంతో ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అన్వేషించడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. -
జోరందుకుంటున్న కూలర్ల విక్రయాలు
మద్నూర్(జుక్కల్): కాలాలు కూడా కొంతమందికి కడుపు నింపుతాయి. ఏడాదంతా చిన్నాచితకా పను లు చేసుకుంటున్న వారికి వేసవిలో చేతినిండా పను లు దొరుకుతాయి. వేసవి వచ్చిందంటే చాలు విద్యు త్ ఉపకరణాలు వాడని వారుండరు. పేద మధ్య త రగతుల ప్రజలు కుడా ఫ్యాన్లు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్లో విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు పెరగడంతో రిపేర్లకు ఉపాధి దొరుకు తోంది.అలాగే అసెంబుల్డ్ కూలర్లు తయారు చేస్తుండటంతో మధ్య తరగతి ప్రజలు కూడా వేసవిలో చ ల్లబడటం కోసం కూలర్లు తీసుకుంటున్నారు. ఫ్యా న్లు, కూలర్లే కాదు.. ఏసీలు, ఫ్రిజ్ల బిగింపు లాంటి పనులతో వారికి చేతినిండా పనులు దొరుకుతున్నా యి. ఎండలు ముదురుతున్నాయి. ఉక్కపోత ఎక్కువైంది. వేడి నుంచి ఉపశమనం కోసం స్థాయిని బట్టి ఫ్యాన్లు, మధ్య తరగతి వారు కూలర్లు, ఉన్నతవర్గాల వారు ఏసీలు వినియోగిస్తున్నారు. మెకానిక్లు కూడా బిజీ అయిపోయారు. గ్రామాల నుంచి కూడా ఫ్యాన్లు, కూలర్లు మరమ్మతుల కోసం మండల కేంద్రానికి వస్తున్నారు. -
ఎర్రజొన్న నిలువకే మొగ్గు
మోర్తాడ్: ఇరాన్తో సాగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు ఎర్రజొన్నల ధరను అమాంతం తగ్గించారు. తమ లాభాలకు వ్యాపారులు గండికొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 22,378 ఎకరాల్లో ఎర్రజొన్నలను సాగు చేశారు. మూడు సీజన్లతో పోల్చితే సాగు విస్తీర్ణం ఎంతో తగ్గింది. సాగు విస్తీర్ణం తగ్గిపోయిన కారణంగా ఉన్న పంటకు డిమాండ్ ఏర్పడాల్సి ఉంది. కానీ వ్యాపారుల మాయాజాలంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి ఏటా ఏదో ఒక కారణం చెబుతూ ఎర్రజొన్నలకు ధర తగ్గిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి ఏకంగా ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపడం గమనార్హం. ఎర్రజొన్నలను అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లోనే వినియోగిస్తారు. కొంత మొత్తం మాత్రం పొరుగు దేశాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు కావాలని ధర తగ్గించి తమను నష్టానికి గురి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్కు చెందిన రైతు రవి పండించిన ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ.3,900ల ధరకు విక్రయించాలని నిర్ణయించాడు. వ్యాపారులు మాత్రం రూ.600లు తగ్గించి ఒక్కో క్వింటాలుకు రూ.3,300 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీంతో సదరు రైతు అనుకున్న ధరకు ఎర్రజొన్నలను విక్రయిస్తే రూ.6,35,700ల ఆదాయం లభించేది. వ్యాపారులు సూచించిన ధరకు అమ్మితే రూ.5,37,900ల ఆదాయం మాత్రమే వచ్చేది. అంటే ఆ రైతుకు రూ.97,800ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పట్లో ఎర్రజొన్నలను విక్రయించడానికి బదులు కోల్డ్ స్టోరేజీలో నిలువ చేసుకుని ధర పెరిగిన సమయంలోనే అమ్ముకోవాలని రైతు రవి నిర్ణయించాడు. ఇది ఒక్క రవి భావనే కాదు. ఎర్రజొన్నలను సాగు చేసిన ఎంతో మంది రైతులు ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. అందుబాటులో ఉంటే కోల్డ్ స్టోరేజీలు లేకుంటే గోదాంలు, తమ ఇళ్లలోనే ఎర్రజొన్నలను నిలువ చేసుకుంటున్నారు. యుద్ధం కారణం చూపి ధర తగ్గించిన వ్యాపారులు వారం రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.600 పడిపోయిన ధర ధర పెరిగాకే విక్రయిస్తామంటున్న రైతులు -
గుప్పుమంటున్న గుడుంబా
● గ్రామాల్లో పెరుగుతున్న స్థావరాలు ● అధికారుల పర్యవేక్షణ కరువు ● ప్రజల పాలిట శాపంగా మారుతున్న పరిస్థితి సిరికొండ: పల్లెల్లో గుడుంబా గుప్పుమంటోంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేస్తున్నారు. అబ్కారీ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పల్లెల్లో నాటు సారా ఏరులై పారుతోంది. సిరికొండ మండలంలో గిరిజన తండాలు అధికంగా ఉండటంతో తండాలు, మారుమూల గ్రామాల్లో గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది. పల్లెల్లో నాటు సారా అమ్మకాలను కొందరు తమ ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. పూరి గుడిసెల్లో బట్టీలను పెట్టి దొంగచాటుగా నాటు సారాను కాస్తుంటారు. సారాను ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపి గ్రామాలకు తరలిస్తు పొలిమేరల్లో విక్రయాలు సాగిస్తున్నారు. హానికర పదార్థాలతో.. పల్లెల్లో నాటు సారాను విక్రయదారులు ప్రాణాంతక పదార్థాలతో తయారు చేస్తున్నారు. యూరి యా, పటిక, నల్లబెల్లం, తంబాకు లాంటి హానికర పదార్థాలను గుడుంబా తయారీలో వినియోగిస్తున్నారు. ఇలా ప్రాణాంతక పదార్థాలతో తయారు చేసిన సారాను తాగి పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మద్యం అధిక ధరలతో.. మద్యం ధరలు అధికంగా ఉండడంతో పేదలు గుడుంబా వైపు మొగ్గుచూపుతున్నారు. ఒక్కోసారా ప్యాకెట్టు తక్కువ ధరకే లభిస్తుండటంతో ధరలు అధికంగా ఉన్న మద్యాన్ని కొనలేక కూలీ పనులు చేసుకునే వారు సారాకు బానిసలవుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతుందని హానికర పదార్థాలతో తయారు చేస్తున్న విషయం గమనించక నాటు సారాను తాగుతు పేద ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నాటు సారా తయారు చేయకుండా, విక్రయించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. సారా తయారీ, వాడకం వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. సారా తయారీదారులపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నాం. – వేణుమాధవరావు, భీంగల్ ఎకై ్సజ్ సీఐ చర్యలు శూన్యం నాటు సారా విక్రయాలపై అబ్కారీ అధికారుల చర్యలు శూన్యంగా మారాయి. నామ మాత్రంగా దాడులు చేయడమే తప్ప నాటు సారా తయారీని ని వారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాటు సారా అమ్మకాలు పూర్తిగా కనుమరుగు కాగా, గత రెండేళ్లుగా పల్లెల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాటు సారా తయారు చేస్తున్న, విక్రయిస్తున్న వారిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకొని తహసీల్ ఎదుట బైండోవర్ చేస్తున్నారు. ఇటీవల చీమన్పల్లి, తాటిపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. -
శ్రీరామ నవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
● మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు ● రఘునాథ ఆలయం సందర్శన నిజామాబాద్ రూరల్: శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్, నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయ అభివృద్ధి ప నుల కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఇటీవల రూ.50 లక్షల నిధులు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, నూడా చైర్మన్ ఆదివారం ఆలయ పరి సర ప్రాంతాలను సందర్శించి రోడ్లు అంచనా వే యించినారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తుల కు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని,తగిన వస తులు మున్సిపల్ ద్వారా కల్పిస్తామని వారు అన్నా రు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు ముక్క దేవేందర్ గుప్తా, కోశాధికారి పెండ్యాల శ్రీనివాస్, కమిటీ ట్రస్ట్ మెంబర్, కార్యవర్గ సభ్యులు భక్తవత్సలం నా యుడు, డీ రాజేంద్రప్రసాద్, బంటు బలరాం తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అశోక్ కుమార్, సంపత్, బింగి ప్రకాశ్, చల్ల గంగాధర్, తాటి వీరేశం, నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
చికిత్స పొందుతూ ఒకరి మృతి రెంజల్(బోధన్):రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రా మానికి చెందిన రాజేందర్(45) మూడు రోజుల క్రితం సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా బోర్గాం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో ఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాతుడిని స్థానికులు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గొర్రెల మందపై కుక్కల దాడి ధర్పల్లి: మండల కేంద్రానికి చెందిన కుర్మ నడిపి సాయిలుకు చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆరు గొర్రెలు మృతి చెందాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. నడిపి సాయిలు తన గొర్రెలను పగలు మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి ఇంటి పరిసరాల్లో రక్షణ చర్యలు చేపట్టి ఉంచుతారు. ఆదివారం తెల్లవారుజామున గొర్రెల మంద పై వీధి కుక్కలు దాడి చేశాయి. మండల పశు వైద్యాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గాయపడిన గొర్రెలకు ప్రథమ చికిత్స అందజేశారు. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. -
అనిరుధ్ కుటుంబసభ్యులకు పరామర్శ
కామారెడ్డి టౌన్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన చెందిన జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన మంగలి దేవేందర్ కుమారుడు అనిరుధ్(13) కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. బాలుడి నివాసానికి వెళ్లిన ఆయన, అనిరుధ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు పంపరి లక్ష్మణ్, జమీల్, జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా, రాజశేఖర్, సునీల్ గౌడ్, నర్సుల మహేష్ తదితరులున్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని కొత్తపేట హన్మాన్ దేవాలయంలో పాల్గుణ బహుళ ద్వాదశి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడంతో పాటు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. వార్డు సభ్యుడు సిద్ధారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భిక్కనూరు:ఽ భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేకువజామునుంచే భక్తులు ఆలయానికి వచ్చి మూలబావి వద్ద స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో సందడిగా ఉంది. లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లి శివారులోని ప్రభుస్వామి ఆలయం చుట్టూ ఆదివారం ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శనను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఆలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నట్లు తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): అయ్యపల్లి శివారులోని ప్రభుస్వామి ఆలయం వద్ద ఆదివారం అన్నదా న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్శి వెంకటేశం లింగమణి దంపతులు జా తరకు వచ్చే భక్తులు, ప్రజలకు అన్నదానం చే శారు. ప్రతి ఏటా జాతర సమయంలో అన్నదా నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్శి ప్రభాకర్, లక్ష్మీపతి, శ్రీనివాస్, పవన్, మల్లయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిజాంసాగర్(జుక్కల్): పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం నిర్విరామంగా పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలనకు ప్రజలు ఆకర్షితులై గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. ఆదివారం మహమ్మద్నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి జుక్కల్ ఎమ్మెల్యే ముఖ్య అఽతిథిగా హాజరయ్యారు. మండల కేంద్రానికి చెందిన బుడగజంగాలు, పాండవులు, సింగితం గ్రామానికి చెందిన పలువురు వార్డు స భ్యులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎ మ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు వారినుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వస్తున్న నాయకు లు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమా ర్, మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, సర్పంచులు రమేష్యాదవ్, హరిన్,కుమ్మరిరాములు, కిరణ్, రఫీ కాంగ్రెస్ నా యకులు నర్సింలు, నాగబూషణంగౌడ్, లోక్యానాయక్, గుర్రపు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు ఒడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇల్లును ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్పంచ్ బొజ్జ అంజయ్య, నాయకులు ప్రజాపండరి తదితరులున్నారు. -
కార్పొరేట్కు దీటుగా కేజీబీవీలు!
కామారెడ్డి టౌన్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్ (వైఐఐవోఈ)లుగా మార్చింది. ఈ నేపథ్యంలో వాటిలో ఇంటర్ ప్రవేశాలకోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు www.tgrjc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 5న పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రతిభావంతులకు ఆయా విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. వీటిలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థినులకు సాధారణ విద్యా బోధనతో పాటు జేఈఈ, నీట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఈ ఎక్స్లెన్స్ సెంటర్లలో ప్రవేశం కోసం ప్రత్యేక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు దీనికి అర్హులు. అర్హత సాధించిన వారికి ఉచితంగా వసతితో పాటు నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థినులకు ఈ నిర్ణయం గొప్ప వరమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేక కోర్సులు.. జిల్లాలో మొత్తం 19 కేజీబీవీలు ఉండగా ప్రస్తు తం 13 చోట్ల ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో ఉంది. అయితే వీటిలో విద్యార్థినుల ఆసక్తి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మూడు కేజీబీవీలను స్పెషల్ కోచింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దనుంది. కేజీబీవీ భిక్కనూరులో జేఈఈ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. లింగంపేటలో వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న వారి కోసం నీట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. నిజాంసాగర్లో న్యాయ విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థినుల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)కు కోచింగ్ ఇస్తారు. ప్రభుత్వం జిల్లాలోని భిక్కనూరు, లింగంపేట, నిజాంసాగర్ కేజీబీవీలను సీవోఈ ఎక్స్లెన్స్గా ఎంపిక చేసింది. వీటిలో జేఈఈ, నీట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాత పరీక్షల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – బి.సుకన్య, కేజీబీవీ సెక్టోరియల్ అధికారి, కామారెడ్డి ‘ఎక్స్లెన్స్’కు జిల్లాలో మూడు పాఠశాలల ఎంపిక జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ -
వేటాడుతున్న పెద్దపులి
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్–సిరిసిల్ల– జగిత్యాల జిల్లాల అటవీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న పెద్దపులి తన వేట కొనసాగిస్తోంది. ఇటీవల జిల్లాలోని కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో ఉన్న భీమ్గల్ మండలం దే వక్కపేట్ అడవుల్లో రెండు ఆవులను చంపిన పె ద్దపులి, తాజాగా జగిత్యాల జిల్లాలోకి ప్రవేశించి అక్కడ వేట మొదలు పెట్టింది. కొడి మ్యాల రేంజ్ దమ్మాయిపేట్ అటవీ ప్రాంతంలో ఓ రైతు కట్టేసి ఉంచిన ఆవుపై దాడి చేసి హత మార్చిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆవు మాంసాన్ని కొంత మేర ఆరగించి వెళ్లింది. సమాచా రం అందుకున్న అటవీ అధికారులు ఘ టనా స్థలాన్ని పరిశీలించారు. రోజుకు 20 కిలో మీట ర్లు సంచరిస్తున్న పులి మూడు జిల్లాలను హడలెత్తిస్తోంది. ఇదే పులి గత కొన్ని రోజుల క్రితం రా జన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లంతకుంట, తిప్పాపురం అడవుల్లో నాలుగు ఆవులను చంపేసింది. ఇప్పటి వరకు ఏడు ఆవులను హతమార్చింది. రోజుకో చోట వేటాడి మూడు జిల్లాల అటవీ అధికారులకు నిద్ర లే కుండా చేస్తోంది. అదృష్టవశాత్తు మనుషులపై ఎలాంటి దాడులు చేయ డం లేదు. పెద్దపులి వే ట నేపథ్యంలో రైతులను, పశువుల కాపర్లను, అడవులకు సమీప గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ పులి మ నుషులపై దాడి చేసే పరిస్థితి ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాలు తీసుకుని దానిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రంగంలోకి పుణే బృందంపెద్దపులుల సంచారానికి సిరిసిల్ల, జగిత్యా ల, నిజామాబాద్ సరిహద్దు అడవులు అను కూలంగా ఉన్నాయి. అటు పులితోపాటు ఇ టు మనుషుల ప్రాణాలకు హాని కలగకుండా చర్యలు చేపట్టారు. అటవీ శాఖ పుణే నుంచి నలుగురితో కూడిన రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపింది. జిల్లాకు చేరు కున్న బృందం.. ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సోమ, మంగళవారాల్లో ఆయా జిల్లాల అటవీ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. సోమ వారం నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆ దిలాబాద్ జిల్లాలు అలాగే మంగళవారం కా మారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్ జిల్లాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న ట్లు డీఎఫ్వో వికాస్మీనా ‘సాక్షి’కి తెలిపారు. జగిత్యాల వైపు వెళ్లి మరో ఆవును చంపిన టైగర్ మూడు జిల్లాల అటవీ సరిహద్దుల్లో హడల్ రోజుకు 20 కిలోమీటర్ల మేర సంచారం -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
● ఏబీవీపీ డిమాండ్ ● కలెక్టరేట్ వద్ద ‘రాత్రి బస’ కామారెడ్డి టౌన్ : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 9 వేల కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఆదివారం కలెక్టరేట్ వద్ద రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు అని, భిక్ష కాదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అల్తాఫ్, స్వస్తిక్, రాకేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకుల అరెస్ట్ ‘రాత్రి బస’ కార్యక్రమంతో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ను తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని పరిషత్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో దేవునిపల్లి సీఐ రామన్తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు విద్యార్థులను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై భువనేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషి
● బాన్సువాడ సెగ్మెంట్కు 150 ఫంక్షన్ హాల్స్ మంజూరు ● ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రుద్రూర్/వర్ని: నియోజకవర్గంలో కనీస వసతుల కల్పన, విద్య, వైద్య సేవలతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పేదలు తక్కువ వ్యయంతో శుభకార్యాలు నిర్వహించుకునేలా బాన్సువాడ నియోజకవర్గంలో 150 ఫంక్షన్ హాళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రూర్ మండలం అక్బర్నగర్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న జనరల్ ఫంక్షన్హాల్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దేశంలోనే ఒకే నియోజకవర్గానికి ఇంతపెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరు కావడం అరుదని అన్నారు. అనంతరం వర్ని మండలం శ్రీనగర్లో అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తహసీల్దార్ తారాబాయి, సర్పంచులు సీతారామరాజు (రాంబాబు), పూర్ణిమ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, నాయకులు బుజ్జన్న, నరోజి గంగారాం, తోట అరుణ్ కుమార్, పట్టెపు రాములు, అనిల్ పటేల్, మారుతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరిన గేటు కష్టాలు
మరమ్మతులకు ముందుమరమ్మతుల తర్వాతజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అవుట్ పేషెంట్ బ్లాక్ వైపు ఉన్న సుభాష్రోడ్డులోని గేటుకు ఎట్టకేలకు మరమ్మతులు చేయించారు. దీంతో రాకపోకలకు అనుకూలంగా మారడంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ గేటు దెబ్బతినడంతో రాకపోకల విషయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈనెల 6న ‘ఆస్పత్రి గేటిలా.. రాకపోకలెలా?’ శీర్షికన, ఈనెల 12న ‘మరమ్మతులు మరిచి.. నో ఎంట్రీతో సరి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రి అధికారులు స్పందించి, గేటుకు మరమ్మతులు చేయించారు. దీంతో రోగులకు ఇబ్బందులు తొలిగాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
‘సమర్థవంతంగా జనగణన నిర్వహించాలి’
కామారెడ్డి అర్బన్ : జిల్లాలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించడానికి సన్నద్ధంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) విక్టర్ సూచించారు. జనగణనపై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా తొలిదశలో గృహజాబితా, గృహ గణన చేయాల్సి ఉంటుందని, ఇందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. 33 అంశాలతో జనాభా గణన పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జెడ్పీ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, సీపీవో రఘునందన్, జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మన్నేకుల సంఘం కమిటీల ఏర్పాటు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద శనివారం మన్నేకుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా రాష్ట్ర అధ్యక్షుడు మన్నే సుధాకర్ హాజరై, మాట్లాడారు. మన్నే కులస్తులు పూర్వం రాజుల వద్ద బటులుగా పనిచే యడం వల్ల మన్నే వీరులు పేరు వచ్చినట్లు పేర్కొ న్నారు. మన్నే కులస్తుల హక్కుల సాధన కోసం కలిసికట్టు పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం జిల్లా, మండల కమిటీలను ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడుగా ఎడ్ల కిషన్(ఎల్లారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా దండెం నవీన్(కొండాపూర్), కోషాధికారిగా ఇంటెనుక కాశీరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. లింగంపేట మండల కమిటీ అధ్యక్షుడిగా ముదాం స్వామి, ఉపాధ్యక్షులుగా క్యాతం బాలయ్య, భూదయ్య, శంకర్, అశోక్, కార్యదర్శులుగా ముదాం సాయిలు, శ్రీనివాస్, సంగారెడ్డి, బాల్రాజు, సాయిబాబా, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలయ్య, గౌరవ అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి బాబు, కోషాధికారి సిద్దు, నాయకులు నాగభూషణం, యాదగిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ అదుపు తప్పి ఒకరు..
నవీపేట: మండలంలోని అనంతగిరి సమీపంలో శనివారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహంతం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాజా వెంకటేశ్ (53) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనంతగిరి శివారు నుంచి రెడ్డి ఫారానికి ఇసుకను ట్రాక్టర్లో తీసుకువస్తుండగా వెనుక నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటో ఓవర్ టేక్ చేసిందన్నారు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లో పడగా ఇంజిన్ వెంకటేశ్పై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
● పిప్రిలో ఆటో, స్కూటీ ఢీ ● ఇద్దరు యువకులు మృతి ఆర్మూర్టౌన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందిన ఘటన ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. పిప్రి గ్రామానికి చెందిన సంచు శ్రీనివాస్(40), ఆర్మూర్కు చెందిన దయ్య విజయ్(33) ఇద్దరూ స్నేహితులు. శ్రీనివాస్ ఆర్మూర్లోని ఓ బా ర్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. విజయ్ సైతం గతంలో నాలుగు నెలలపాటు అదే బార్లో పనిచేశాడు. అయితే, ఈ నెల 4న విజయ్ ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాల్సి ఉండగా, యుద్ధ పరిస్థితుల నేప థ్యంలో విమానాలు రద్దు కావడంతో వెళ్లలేదు. అ యితే, శనివారం ఉద యం శ్రీనివాస్, విజ య్ కలిసి స్కూటీపై ఆర్మూర్ వైపు వస్తూ ఆర్మూర్ నుంచి నందిపేటకు వెళ్తున్న ఆటో ను ఢీకొని ఎగిరిపడ్డారు. దీంతో ఘట నా స్థలంలోనే ఇద్దరు మృతిచెందారు. కుటుంబాల్లో విషాదం.. రోడ్డు ప్రమాదంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీనివాస్, విజయ్లకు ఇంకా పెళ్లి కాలేదు. కొన్నేళ్ల క్రితం వీరి తండ్రులు మరణించగా, తల్లుల వద్ద ఉంటూ పనులు చేసుకొని జీవ నం సాగిస్తున్నారు. కుటుంబాలకు పెద్ద దికై ్కన కొ డుకులు మరణించడంతో తల్లులు గుండెలవిసెలా రోదించారు. యువకుల మరణంతో తల్లులిద్దరూ ఒంటరివారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. దుయ్య విజయ్(ఫైల్) సంచు శ్రీనివాస్(ఫైల్) -
గర్భిణితో నర్సు దురుసు ప్రవర్తన
లింగంపేట(ఎల్లారెడ్డి): వైద్యం కోసం వచ్చిన గ ర్భిణితో ఓ నర్సు దురుసుగా ప్రవర్తించిన ఘట న లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇ లా.. లింగంపేట మండ లం నల్లమడుగు గ్రామానికి చెందిన పూజిత తొ మ్మిది నెలల గర్భిణీ. లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం వచ్చి, డ్యూటీలో ఉన్న నర్సు ప్రతిభరాణి వద్దకు వెళ్లి మూడో డోసు ఇంజక్షన్తోపాటు వైద్య పరీక్షలు చేయమని అడిగింది. దాంతో ఆమె ‘ఇంజక్షన్ లేదు ఏమిలేదు పో’ డాక్టరమ్మ లేదు అంటూ దురుసుగా మాట్లాడింది. వైద్యం చేయము ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ తేల్చి చెప్పడంతో గర్భిణీ గర్భిణీ పీహెచ్సీ ఆరుబయట నిరసన తెలుపుతూ కూర్చుంది. ఈ విషయమై పీహెచ్సీ వైద్యురాలు హిమబిందును వివరణ కోర గా.. పూజిత మూడో డోసు ఇంజక్షన్ కోసం ఆస్ప త్రికి వచ్చిన విషయం వాస్తవమే అన్నారు. డాక్టర్ సమక్షంలోనే ఇంజక్షన్ ఇస్తారు. దీంతో నర్సు ఇంజక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది.డాక్టర్ వచ్చిన తర్వాత పీహెచ్సీకి పూజిత వచ్చి వైద్యం పొందినట్లు తెలిపారు. నర్సు దురుసుగా మాట్లాడడం సరికాదని, సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. -
22న మెగా జాబ్మేళా
కామారెడ్డి టౌన్: కామారెడ్డిలో ఈనెల 22న జీ సీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఉ పాధి మేళా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపా రు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపం వేదికగా ఈ మేళా నిర్వహించనున్న ట్లు, 50కి పైగా ప్రముఖ కంపెనీలతో సుమారు 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్న ట్లు వివరించారు. ఎస్సెస్సీ నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులకు వారి విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సిలర్ మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, నాయకులు రంగ రమేష్గౌడ్, సబ్బని హరికృష్ణ, గంగారాములు, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, రాజశేఖర్, సునీల్, అరుణ్ పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని ప్రెస్కాలనీలో నివాసముండే పట్లోళ్ల సుగుణ ఇంట్లో గతేడాది ఆగస్టు 5న చోరీకి పాల్పడిన నిందితుడిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. సుగుణ తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టబడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రూ.రెండున్నల లక్షలు అపహరణకు గురికావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆరు నెలల తర్వాత నిందితుడు దండుగల ఎల్లప్ప తాడ్కోల్ శివాజీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించారు. ప్రెస్కాలనీలో చోరీకి పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి రూ.45వేల విలువ చేసే ట్యాబ్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని సీఐ తుల శ్రీధర్ తెలిపారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ అనుబంధ క్షేత్రాల అఖిల భారతీయ సమన్వయ సదస్సు హర్యానాలో జరుగుతోంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సంఘ్ అన్ని శాఖలకు చెందిన అఖిల భారత అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో ఇందూరు నగరానికి చెందిన అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు కొండెల సాయిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కలిసి ఒకే వరుసలో పాల్గొన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్ష స్థాయికి ఎదిగిన అత్యంత సాధారణ కార్యకర్తలు ఇద్దరు కలిసిన అరుదైన దృశ్యం జిల్లా సంఘ్ శ్రేణుల్లో సంతోషం నింపింది. -
అశ్వ వాహనంపై ఊరేగిన శ్రీవారు
● ఇందూరు తిరుమలలో నిత్య హవన పూర్ణాహుతి ● భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామ శివాల్లోని ఇందూరు తిరుమల బ్రహ్మో త్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు ఉదయం నిత్య హవన పూర్ణాహుతి నిర్వహించారు. శనివారం సందర్భంగా సామూహిక భగవద్గీత పఠనం చేశారు. షాక్తా పరిషత్ బృందం గురువు పవన్ శర్మ, మహిళా శిష్య బృందం భక్తశ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి సామూహిక గానం చేశారు. దీంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సాయంత్రం స్వామివారు అశ్వవాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు. అశ్వ వాహనంపై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని దేవనాథ జీయర్ స్వామి తెలిపారు. అనంతరం దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి, సినీ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, విజయసింహా రెడ్డి, డీసీపీ బస్వారెడ్డి, సాయిరెడ్డి, ఎంపీటీసీ రాము లు, నర్సారెడ్డి, పృథ్వీ, ప్రవీణ్, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


