Kamareddy
-
ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి
నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డిరూరల్/దోమకొండ: తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే ర్పించాలని నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీ అన్నారు. గ్రామంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన భోజనం సైతం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయురాలు జ్యోతితోపాటు నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సీఆర్పీలు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఆర్పీ మహేష్, పార్ట్టైం ఇన్స్ట్రక్టర్ వనజ తదితరులున్నారు. దోమకొండ మండలం సీతారాంపూర్ గ్రామంలో సర్పంచ్ నత్తి సంజీవ్ ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. హెచ్ఎం దత్తాద్రి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు శర్మ, రామరాజు, వార్డు సభ్యులు స్వామిగౌడ్ ,రాజిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పిల్లలు బడిలో ఉండాలి
కామారెడ్డి అర్బన్: 14 ఏళ్లలోపు బాలబాలికలు పనిలో కాకుండా బడిలో ఉండాలని, బాలలతో పనిచేయించే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్పోస్టర్లను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. బాలబాలికలకు విద్య, రక్షణ కల్పించడం తమ బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా సమన్వయకర్త గిరిజ, సీఎంఎస్ మమత, సంధ్యారాణి, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు. సీతారాంపూర్ గ్రామంలో .. ఎల్లారెడ్డిలో.. -
విద్యార్థులకు అభినందన
బాన్సువాడ : రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి గురువారం అభినందించారు. ఇంటర్మీడియెట్ ఇంఫ్రూవ్మెంట్ రాసిన శ్రీవైష్ణవి (ఎంపీసీ) 468/470, నిధాతహరీమ్(బైపీసీ) 434/440 మార్కులు సాధించారు. పట్టణంలోని తన నివాసంలో విద్యార్థులను పోచారం అభినందించి సన్మానించారు. జిల్లా నోడల్ అధికారి సలాం, డీఎస్పీ విఠల్రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ ఆర్ఎం నిజామాబాద్ రూరల్ : టీజీఎస్ ఆర్టీసీ నిజా మాబాద్ రీజియన్ మేనేజర్గా ఎస్వీజీకే మూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించా రు. ఈ సందర్భంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాల య అధికారులు ఆర్ఎంకు స్వాగతం పలికా రు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: ఆన్లైన్లో జరిగే అంతర్రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా కామారెడ్డి బాలసదనంకు చెందిన ఓ బాలికను కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. గురువారం కలెక్టరేట్కు వచ్చిన కేరళ దంపతులకు చిన్నారి శాంతను దత్తత ఇచ్చారు. దత్తత అనంతరం చిన్నారికి అద్వికా పీఎస్ అనే కొత్త పేరు పెట్టారు. చిన్నారి సంక్షేమం, భవిష్యత్ అభివృద్ధి, కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశాన్ని కల్పించే ఉద్ధేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వారికి దత్తత పత్రాలను అందజేశారు. కామారెడ్డి టౌన్ : తాను ఎల్లప్పుడూ పార్టీ క్రమశిక్షణకు, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ఇటీవల తనకు అందిన షోకాజ్ నోటీసులకు స్పందిస్తూ.. క్రమశిక్షణ సంఘం వైస్ చైర్మన్ శ్యామ్మోహన్కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. భిక్కనూరు: సెర్ప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురువారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నైతిని పాల్గొన్నది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న నైతిని మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మద్యపాన నిషేధంపై మాట్లాడింది. మద్యం కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ ఆమెను అభినందించారు. -
చౌక్బాల్ ఆటను వెలుగులోకి తెస్తా..
చౌక్బాల్ గేమ్ గురించి అందరికీ పూర్తిగా తెలియదు. ఈ ఆట క్రీడాకారుల మధ్య ఫిజికల్ టచ్ లేని ఆట. టెక్నిక్తో ఆడితే విజయం సాధించగలుగుతారు. క్రీడాకారులు మెలకువలు నేర్చుకొని ఆటలో అమలు చేసి విజయం సాధిస్తున్నారు. ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి ఆటకు వన్నె తేవడంతోపాటు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. – డి. సంజీవ్,పీఈటీ,మిసిమి హైస్కూల్, కమ్మర్పల్లి పీఈటీ నేర్పిన మెలకువలతో చౌక్బాల్ అంతర్జాతీయ పోటీల్లో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తా. మెడల్ సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకువస్తా. – సీహెచ్. శాశ్వంత్, క్రీడాకారుడు -
పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలి
తెయూ(డిచ్పల్లి): పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు పిలుపునిచ్చారు. తెయూ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఏక్ పేడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ –2026’ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ స్వామి, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి కె గంగాకిషన్, ఎన్జీసీ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎ గోవర్ధన్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యావరణ ఇంజినీర్ మానస తదితరులు పాల్గొన్నారు. -
పథకాల లక్ష్యాలను సాధించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమీక్షకామారెడ్డి క్రైం: ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2026 – 27 రూపకల్పనలో భాగంగా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పూరి గుడిసెల ప్రతిపాదనలు, ఉపాధి హామీ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణ అంచనాలు, వనమహోత్సవం ఏర్పాట్లు, ఎనఎఫ్బీఎస్, చేయూత పథకం, వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు గృహాలు మంజూరు చేయడంలో భాగంగా గ్రామాల్లో ఉన్న పూరి గుడిసెలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో చెత్త ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో స్ధానిక సంస్ధల ఇన్చార్జి అదనపు కలెక్టర్ గిరి, హోసింగ్ పీడీ విజయపాల్రెడ్డి, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, జెడ్పీ సీఈవో చందర్, సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ‘సర్’ హెల్ప్డెస్క్ ప్రారంభం కామారెడ్డి క్రైం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా ప్రజల సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అందించేందుకు హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1950ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవె న్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు ఇవీ..
ఎల్లారెడ్డి: రైతులకు విత్తనాలను విక్రయించే వారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, సీడ్ యాక్ట్–1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్–1983తోపాటు ఆయా రాష్ట్రాల నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ● దుకాణాల్లో వ్యవసాయశాఖ ద్వారా పొందిన లైసెన్స్ ఉండాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రతైఉలకు బిల్లు లేదా ఇన్వాయిస్ ఇవ్వాలి. ● రసీదులో కంపెనీ పేరు, విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ(ఎక్స్పైరీ డేట్), ధర స్పష్టంగా ఉండాలి. ● విత్తన ప్యాకెట్లపై కనీస మొలకెత్తే శాతం (జెర్మినేషన్ పర్సంటేజ్) భౌతిక స్వచ్ఛత వివరాలు ముద్రించి ఉండాలి. ● గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దు. వాటిని విడిగా భద్రపర్చాలి. ● విత్తనాలను ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువకు విక్రయించొద్దు. దుకాణంలో ధరల పట్టిక కచ్చితంగా ఉండాలి. ● కొనుగోలు, విక్రయాలకు సంబంధించి రికార్డులను, స్టాక్ రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలి. వ్యవసాయ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వీటిని చూపించాలి. ● నాసిరకం లేదా నకిలీ విత్తనాలు విక్రయించిన వారి లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేస్తారు. ● ప్రభుత్వం నిషేధించిన హెటీ పత్తి విత్తనాల విక్రయించొద్దు. ● గింజల్లో తేమ లేకుండా సరైన గిడ్డంగుల్లోనే నిల్వ ఉంచాలి. ● తప్పుడు క్లెయిమ్లు, లేబుళ్లు, డూప్లికేట్ బ్రాండ్ల విత్తనాలను విక్రయించొద్దు. ● విత్తనాలు మొలకెత్తక పోతే రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలి. అందుకు వారికి సహకరించాలి. -
అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి
● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ● బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష బిచ్కుంద(జుక్కల్): పట్టణ అభివృద్ధికి బిచ్కుంద మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రణాళిక రూపొందించాలని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సీమ షెట్కార్ అధ్యక్షతన అధికారులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి నూతన బల్దియా కార్యాలయం, మురికి కాలువలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, కాంప్లెక్స్ నిర్మాణానికి ఇతర అభివృద్ధి పనుల వివరాలను కమిషనర్ను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మున్సిపల్ భవనం నిర్మాణానికి ఎకరన్నర భూమి కాకుండా భవిష్యత్తులో కార్యాలయం విస్తీర్ణానికి సరిపడా 5 ఎకరాలు భూమిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సేకరించాలని కమిషనర్ను ఆదేశించారు. పెట్రోల్ బంకుకు కేవలం రూ.150 పన్ను ఉందని కౌన్సిలర్లు సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి కోసం ఆదాయం పెంచుకోవాలని సూచించారు. పాఠశాల భవనంలో బల్దియా కార్యాలయం కొనసాగుతుందని, విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా అద్దైపె రూంలు తీసుకోవాలని, అద్దె తాను చెల్లిస్తానని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు.. అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాలకవర్గం అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. 7వ వార్డులో కరెంటు సమస్య ఉందని, విద్యుత్ ఏఈ, కౌన్సిలర్ ముజాహిద్తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కమిషనర్ను ఆదేశించారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి రూ.40 లక్షలు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే చెత్తతో ఎరువులు తయారీ అయ్యే విధంగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్లు నౌషా నాయక్, కార్తిక, సందాని, కోఆప్షన్ సభ్యులు అసద్అలి, నాయకులు నాగ్నాథ్, విఠల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక మద్నూర్ : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే వెన్నెముక అని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గురు ఫంక్షన్హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీలో చిన్న పెద్ద తేడా లేదని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త సమానమేనని అన్నారు. పార్టీ సిద్ధంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలు, నాయకులు ఐకమత్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, నాయకులు హన్మండ్లుస్వామి, సంతోష్మేసీ్త్ర, గంగాధర్, దేవిదాస్పటేల్, రాంపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
శ్మశాన వాటిక అభివృద్ధికి ఏకగ్రీవ ఆమోదం
కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ శ్మశాన వాటికను సుందరంగా అభివృద్ధి చేయడానికి ఎట్టకేలకు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన గురువారం మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్మశాన వాటికలో కనీస వసతులు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతె నెలలో ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. సమస్య పరిష్కారానికి ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘ఎస్ఆర్ ఫౌండేషన్’ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ముందుకు వచ్చారు. శ్మశాన వాటికను మహా ప్రస్థానంగా తీర్చిదిద్దుతాని జిల్లా అధికారులకు విన్నవించారు. తమ సొంత నిధులతో స్మశాన వాటికను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అవసరమైన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 5వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినప్పటికీ వాయిదా వేసింది. మళ్లీ ఒకటే ఎజెండా అంశంగా గురువారం నిర్వహించి చర్చ జరిపారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులంతా సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని సింగిల్ ఎజెండాగా తీసుకొని, ఎస్ఆర్ ఫౌండేషన్కు అభివృద్ధి పనులు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. డీపీఆర్ సిద్ధం చేసి అభివృద్ది చేయాలని కౌన్సిల్ సభ్యులు కోరారు. ఇక హౌజింగ్ బోర్టు కాలనీలో శ్మశాన వాటికి సుందరంగా తయారుకానుంది. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ’సాక్షి’ దినపత్రికు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, మున్సిపల్ కమిషనర్ టి పర్వతాలు, కౌన్సిల్, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సింగిల్ ఎజెండాగా సాగిన కామారెడ్డి కౌన్సిల్ సమావేశం సొంత నిధులతో మహాప్రస్థానంగా మార్చనున్న ఎస్ఆర్ ఫౌండేషన్ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
సిరికొండ : మండల కేంద్రంలోని కామారెడ్డి రోడ్లో పెట్రోల్ బంకు ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తూంపల్లి గ్రామానికి చెందిన అనుగంటి సాయిలు, అయినాల అశోక్ రావుట్ల గ్రామానికి బైక్పై వెళుతుండగా ట్యాంకర్ లారీకి ఢీకొన్నారు. దీంతో బైక్ నడుపుతున్న సాయిలుకు తీవ్రగాయాలు, వెనుక కూర్చున్న అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రైతన్నా.. జాగ్రత్త
ఎల్లారెడ్డిలోని విత్తనాల దుకాణంలో రైతులుకామారెడ్డి క్రైం: ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్న రైతన్నలు విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎరువులు, విత్తనాలను సమకూర్చుకోవడంలో బిజీగా ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తిప్పలు తప్పవు. ప్రతి సీజన్లో నకిలీ విత్తనాల బెడద కనిపిస్తూనే ఉంది. నకిలీ, నాసిరకం విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకోవాలని కొమ్ముకాసే కంపెనీలు అనేకం మార్కెట్లో ఉన్నాయి. తక్కువ ధర, అధిక దిగుబడి అంటూ మాయమాటలతో రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో ప్రతి యేటా చాలాచోట్ల వెలుగుచూస్తున్నాయి. మొలకదశ నుంచి దిగుబడి వచ్చే వరకు అన్నీ సక్రమంగా జరగాలంటే నాణ్యమైన విత్తనాన్ని రైతులు ఎంచుకోవాల్సి ఉంటుంది.ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను నిరంతరంగా తనిఖీ చేస్తున్నాం. మండలాల పరిధిలో కూడా క్రమం తప్పకుండా దుకాణాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా నకిలీ వితనాలు విక్రయిస్తే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవు. – మోహన్రెడ్డి, డీఏవో, కామారెడ్డిజిల్లాలో ప్రధానంగా వరి సాగవుతుండగా, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కంది, మిరప, కూరగాయల పంటలను సైతం చాలా మంది రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.59 లక్షల ఎకరాల్లో వివధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. అలాగే 54 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 42.8 వేల ఎకరాల్లో పత్తి, 45 వేల ఎకరాల్లో కంది, 90 వేల ఎకరాల్లో సోయాబీన్, మరో 5 వేల ఎకరాల్లో మిరప, కూరగాయలు సాగవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే రైతులు మొక్కజొన్న, కంది, పత్తి, మిరప, కూరగాయల విత్తనాల కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు జిల్లా మార్కెట్లోకి వస్తుంటాయి. పక్కనే ఉన్న నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడిన ఘటనలు ప్రతి సీజన్లోనూ వెలుగుచూస్తున్నాయి. జిల్లాలో కూడా చాప కింద నీరులా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి చాలా మంది రైతులు నష్టపోయారు. ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో కంపెనీల ప్రతినిధులు రావడం, రైతులను బతిమాలుకుని, ఎంతో కొంత ముట్టజెప్పి విషయం పెద్దది కాకుండా, పైస్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లకుండా జాగ్రత్త పడుతన్న ఘటనలే ఎక్కువ.పంటలసాగు కాలం ప్రారంభమైన నేపథ్యంలో ‘నకిలీ’ ముప్పు పొంచి ఉంది. విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు ఒకటికి రెండుసా ర్లు ఆలోచించి విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల కొనుగోలులో ఆగం కావొద్దు మార్కెట్లో నకిలీ, నాసిరకం విత్తనాల బెడద మోసపూరిత కంపెనీల సరుకు చొచ్చుకొచ్చే ముప్పు గతంలో వెలుగు చూసిన అనేక ఘటనలు రంగంలోకి ప్రత్యేక బృందాలు -
క్రైం కార్నర్
ఆటో, స్కూటీ ఢీ.. యువకుడి మృతి కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం కోనసముందర్లో గురువారం స్కూ టీని ఆటో ఢీ కొనడంతో గ్రామానికి చెందిన లాడే చరణ్ (18) మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. కామారెడ్డి క్రైం : భార్యా, భర్తల మధ్య గొడవ కారణంగా క్షణికావేశంలో గడ్డి మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి తండాలో గురువారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన గుగులోత్ బాల్సింగ్ (42) బుధవారం సాయంత్రం ఇంట్లో భార్యతో చిన్న విషయంలో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై గుర్తు తెలియని గడ్డిమందు తాగేశాడు. కుటుంబసభ్యులు గమనించి నిజామాబాద్ జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్యకామారెడ్డి క్రైం : అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. లింగాపూర్ గ్రామానికి చెందిన బండారు రాజమణి (88) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఆమె గురువారం సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. -
ఇంటర్ సప్లిమెంటరీలోనూ బాలికలదే పైచేయి
● డీఐఈవో రవికుమార్ ఖలీల్వాడి : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని బాలికలు అధిక శాతం ఉత్తీర్ణులయ్యారని డీఐఈవో తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో విద్యార్థినిలు 5,241 మంది పరీక్షలకు హాజరుకాగా 3,839 మంది పాసై 73.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 4,908 మంది హాజరుకాగా 2,687 మంది పాసై 54.77 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొ త్తం 10,147 మంది హాజరుకాగా 6,526 మంది పాసై 64.31 శాతం సాధించారు. వొకేషనల్ కోర్సులో బాలికలు 329 మంది పరీక్షలు రా యగా, 257 మంది పాసై 78.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 960 మంది పరీక్షలకు హాజరై 679 మంది పాసై 70.73 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం 1,289 మంది పరీక్షలకు హాజరుకాగా 931 మంది పాసై 72.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో బాలికలు 2,0 66 పరీక్షలకు హాజరుకాగా 1,204 పాసై 58.2 8 శాతం, బాలురు 3,470 మంది పరీక్షలకు హాజరుకాగా 1,896 మంది పాసై 54.84 శా తం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,536 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,100 మంది పాస్ కావడంతో 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్ విభాగంలో బాలికలు 162 మంది పరీక్షలు రాయగా, 106 మంది పా సై 65.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలు రు 771 మంది పరీక్షలకు హాజరై 420 మంది పాస్ కాగా 54.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 933 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 526 మంది పాసై 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారని డీఐఈవో తెలిపారు. -
నాన్ లే అవుట్ వెంచర్లపై ఆగ్రహం
● ప్లాట్లు రిజిస్ట్రేషన్లు కాకుండా ఫిర్యాదు చేయాలని కౌన్సిలర్ల విన్నపం ● వెంచర్లు, అక్రమ నిర్మాణాలపై బాన్సువాడ బల్దియా సమావేశంలో చర్చబాన్సువాడ : పట్టణ పరిధిలో నాన్ లే అవుట్వెంచర్లపై బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ కాసుల విజయబాల్రాజ్ అధ్యక్షతన గురువారం బల్దియా సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హకీం మాట్లాడుతూ.. పట్టణంలో వెలు స్తున్న వెంచర్లు ఏ ఒక్కటి కూడా డీటీసీపీ లే అవుట్ కాలేదని, అయినప్పటికీ రియల్టర్లు నాన్ లే అవుట్ ప్లాట్లను అమాకులకు విక్రయిస్తు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. ఇళ్లు నిర్మించుకుందామంటే మున్సిప ల్ అధికారులు అనుమతులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నాన్ లే అవుట్ వెంచర్లలోని ప్లాట్లు విక్రయించకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. భారత్ గార్డెన్ పక్కన పా ర్కుకు వెళ్లే దారిలో 40 ఫీట్ల రోడ్డుపై అక్రమ నిర్మా ణం జరుగుతోందని కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. పట్టణంలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతున్నారని కౌన్సిలర్లు పేర్కొనగా, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి జరిమానాలు విధిస్తామని కమిషనర్ గంగాధర్ అన్నారు. వైస్ చైర్పర్సన్ రేష్మాబేగం, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ భూతానికి ఒకరు బలి
● చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య కామారెడ్డి క్రైం:బెట్టింగ్ భూతం ఒకరిని బలితీసుకుంది. బెట్టింగ్తో నష్టపోయి ఓ వ్యక్తి చెట్టు కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో ని రామారెడ్డి రోడ్డులో గురువా రం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎమ్మార్ కాలనీకి చెందిన అంకం క్రాంతి కుమార్ (40)కు భార్య లావణ్య, కుమార్తె సంయుక్త, కవలలైన కుమారులు విఘ్నేష్, వినాయక్ ఉన్నారు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ మధ్య దాదా పు రూ.12 లక్షల వరకు బెట్టింగ్లో నష్టపోయాడని, దీంతో అప్పులు పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన క్రాంతికుమార్ తిరిగి రాలేదు. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని గురువారం ఉదయం సమాచారం రావడంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరహరి తెలిపారు. -
చౌక్బాల్ బరి.. కమ్మర్పల్లి గురి
● సరికొత్త ఆటకు ప్రాచుర్యం ● శారీరక ఘర్షణలు లేని క్రీడగా గుర్తింపు ● జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు కమ్మర్పల్లి:శారీరక ఘర్షణలు లేని ఆటగా చౌక్బా ల్ ఆట ప్రాచుర్యం పొందింది. 2009 సంవత్సరంలో దేశంలోకి గుర్తింపు పొందిన ఈ క్రీడల్లో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి వేదికపై తమ ఆట తీరును ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఆటాడే విధానం ఇదే... జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. అఫెన్స్ టీం ఆటగాళ్లలో ఒక షూటర్ బంతిని రీబౌండ్ ఫ్రేమ్ (నెట్) మీదకు విసిరితే అదే వేగంతో వెనక్కి వస్తుంది. ఆ బంతిని డిఫెన్స్ టీం(అవతలి జట్టు) సభ్యులు పట్టుకోకుండా నేలను తాకితే అఫెన్స్ టీంకు పాయింట్ లభిస్తుంది. ఒక వేళ డిఫెన్స్ టీం బంతిని పట్టుకుంటే(క్యాచ్) ఫౌల్ అవుతుంది. బంతిని పట్టుకున్న ఆటగాడు గరిష్టంగా 3 సెకన్లు మాత్రమే బంతిని తన దగ్గర ఉంచుకోవాలి. బంతితో 3 అడుగుల కన్నా ఎక్కువ నడవకూడదనే నిబంధన ఉంది. అఫెన్స్ జట్టు ఫ్రేమ్కు కొట్టేందుకు మూడు సార్లు పాస్ ఉంటుంది. ఆటగాళ్ళు ’డీ’ ఆకారపు క్రీజ్ లోపలికి వెళ్లి ఆడకూడదు. ఎప్పుడు దాని వెలుపలే నిలబడి లేదా గాల్లోకి దూకి మాత్రమే షాట్ కొట్టాలి. అఫెన్స్ జట్టు మూడుసార్లు పాస్ ఉపయోగించిన తర్వాత డిఫెన్స్ జట్టుకు బంతిని రీబౌండ్ ఫ్రేమ్(నెట్)కు కొట్టే అవకాశం లభిస్తుంది. ఆట 30 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏ జట్టు ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఆటలో ఇద్దరు కార్నర్, ఒక షూటర్, మిడిల్, ఇద్దరు డిపెండర్లు పొజిషన్లో ఉంటారు. కమ్మర్పల్లిలో ఆటగాళ్లు... కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మిసిమి హైస్కూల్లో పీఈటీ సంజీవ్ చౌక్బాల్ ఆటను పరిచయం చేశారు. ఏమాత్రం పరిచయం లేని ఆటపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. నైపుణ్యాలు నేర్పి ఆటలోని మెలకువలను ప్రదర్శింపజేశారు. ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల పాఠశాలకు చెందిన సీహెచ్. శాశ్వంత్, సౌమిత్(ప్రభుత్వ పాఠశాల) జాతీయస్థాయికి ఎంపికై గోవాలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. శాశ్వంత్ జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాడు. మలేసియాలో ఆగష్టు 19 నుంచి జరిగే అంతర్జాతీయ చౌక్బాల్ పోటీల్లో పాల్గొననున్నాడు. గతేడాది అక్షిత్, రేవంత్ అనే విద్యార్థులు వైజాగ్లో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. -
ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’
● జిల్లాలో 1,193 అంగన్వాడీ సెంటర్లు ● ఆరేళ్ల లోపు చిన్నారులు 70 వేల 149 మంది..ఎల్లారెడ్డి రూరల్: జిల్లాలో ఆరేళ్లలోపు చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చేందుకు ఈనెల 15 నుంచి ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యను అందించనున్నారు. పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించేలా అవగాహనక కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే 6 ఏళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తారు. జిల్లాలో 1193 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి, దోమకొండ, బాన్సు వాడ, మద్నూర్లలో ప్రాజెక్టు సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్ల పరిధిలో 7,630 మంది గర్భిణు లు, 4,165 మంది బాలింతలు ఉండగా, 0 నుంచి 6 నెలల లోపు చిన్నారులు 4,618 మంది, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 30,625 మంది, 3 నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 34,906 మంది ఉన్నారు. పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు ఉదయం పాలు, ఉడికించిన గుడ్డుతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వేళ స్నాక్స్లో అందిస్తారు. చిన్నారులకు సెంటర్లలో పౌష్టికాహారంతోపాటు వయస్సుకు తగిన విధంగా ఆటపాటలతో కూడిన విద్య అందుతుంది.జిల్లాలోని ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఈనెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఆరేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. – ప్రసన్న, జిల్లా సంక్షేమ అధికారిణి -
యాప్తో ఇబ్బంది రాకుండా చూడాలి
నిజామాబాద్ అర్బన్ : కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్తోనే రైతుల కు ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠిని గురువారం కలిసి యూ రియా యాప్తో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, ప్రమోద్ కుమార్, నక్క రాజేశ్వర్, అనంత్ రెడ్డి, నూతల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కర్క గంగారెడ్డి , విజయ్ కష్ణ, బొబ్బిలి వేణు తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్ : నగరంలోని మిర్చి కంపౌండ్ 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్, ఎన్టీఆర్ చౌరస్తా నుంచి 33/11 కేవీ మిర్చి కంపౌండ్ సబ్స్టేషన్ వరకు లైన్ మరమ్మతుల కారణంగా శుక్రవారం నిర్ధిష్ట సమయాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని టౌన్–1 ఏడీఈ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిర్చి కంపౌండ్ సబ్స్టేషన్ పరిధిలోని కాంగ్రెస్ భవన్, కవితా కాంప్లెక్స్, గంజ్, రాంగోపాల్ స్ట్రీట్, దేవి రోడ్, మిర్చి కంపౌండ్ తదితర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని పేర్కొన్నారు. 11 కేవీ రైల్వే ఫీడర్లో సైతం 7 నుంచి 11 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. ● ఫోరెనిక్స్ ల్యాబ్కు నమూనాలు భిక్కనూరు :మండలంలోని బస్వాపూర్ గ్రా మంలో గురువారం అనుమానాస్పద స్థితిలో 50 గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని కందూరి సాయిలుకు చెందిన పది గొర్రెలు బు ధవారం మృతి చెందాయి. పశు సంవర్ధక శాఖ అధికారులు పంచనామా నిర్వహించి చిటుకు వ్యాధితో మృతి చెందినట్లు తొలుత నిర్ధారించారు. అయితే, గురువారం అదే మందలో ఉన్న సాయిలుకు చెందిన మరో 50 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి భరత్, అసిస్టెంట్ డైరెక్టర్ భరత్, పశు వైద్యాధికారులు మౌనిక రెడ్డి, అనిల్ రెడ్డి, రాంచందర్, రామ్ప్రసాద్, గోపాలమిత్ర సురేశ్ ఘటనా స్థలానికి చేరుకొని గొర్రెల కళేబరాలకు పోస్టుమార్టం చేశారు. నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. బాధితులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, తహసీల్దార్ సునీత, సర్పంచ్ తుడుం పద్మ పరామర్శించారు. నిజామాబాద్ రూరల్: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృత భాషా శిక్షణ శిబిరం గురువారం ము గిసింది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు అధ్యక్షుడు శశికాంత్ కులకర్ణి, ప్రధాన కార్యదర్శి రమేశ్బాబు కులకర్ణి, ప్రోగ్రాం చైర్మన్ నాలం రమేశ్రావు, రిటైర్డ్ డిప్యూటీ డీఈవో కృష్ణారావు, కోశాధికారి మిలింద్కుమార్, రత్నాకర్, హనుమంతరావును ఘనంగా సన్మానించారు. రెండు రోజులశిక్షణ శిబిరం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. అరుణ్కుమార్ శర్మ, అశోక్ శర్మ, లక్ష్మీనారాయణ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
కామారెడ్డి (ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడిని సదాశివనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం సదాశివనగర్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య గత నెల 22న రాత్రి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయి మృతి చెందాడని భార్య కంచర్ల రేణుక సదాశివనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ రాజేశ్చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణ, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పక్కా ప్రణాళిక ప్రకారం తలపై బలంగా కొట్టడంతోనే రాజయ్య మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల గంగశేఖర్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. గంగశేఖర్కు నాలుగు సంవత్సరాలుగా రాజయ్య భార్య రేణుకతో వివాహేతర బంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని భావించడంతోపాటు చనిపోతే వచ్చే ఇన్సురెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరు కలిసి రాజయ్యను హతమార్చాలని కుట్రపన్నారు. అందులో భాగంగా గత నెల 21న గంగశేఖర్ ముందస్తు ప్రణాళికతో రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించాడు. మద్యం తాగించిన అనంతరం తిర్మన్పల్లి గ్రామ శివారులోని రామారెడ్డి ప్రధాన రహదారిపై రాత్రివేళ మత్తులో ఉన్న రాజయ్య తలపై గంగశేఖర్ ఐరన్ రాడ్తో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం, ద్విచక్ర వాహనం అక్కడే పడేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, ద్విచక్ర వాహనం, నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిక్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
తల్లి సహా పిల్లలు మిస్సింగ్.. కలకలం రేపుతున్న మిస్టరీ!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అదృశ్యమైన వారిలో తల్లి, ముగ్గురు పిల్లలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఒకేసారి తల్లి, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన లయ (31), ఆమె పిల్లలు బిందు (16), శివ (13), దివిజ (8) కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు.ఒకేసారి తల్లి, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్ట్
మద్నూర్: జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మద్నూర్ సమీపంలోని జాతీయ రహదారి 161 పై బైక్పై ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన షేక్ గౌస్ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి, కత్తితో చంపుతామని బెదిరించి మొబైల్, రూ.వేయి నగదును దోచుకెళ్లారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్ఐ మోహన్ రెడ్డి, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్ లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్, మహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ జునైద్, సమీర్షాలుగా గుర్తించారు. నిందితులు ముఠాగా ఏర్పడి జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ మారణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పథకం ప్రకారం ఈ నెల 1న నాందేడ్ నుండి బైక్పై వచ్చి మద్నూర్ వద్ద షేక్ గౌస్ను దోచుకోవడంతో పాటు, అదే రాత్రి జుక్కల్ చౌరస్తా వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్, రూ.300 నగదు లాక్కుని పరారయ్యారు. ఆ వెంటనే నిజాంసాగర్ పరిధిలో చాకలి రాజు అనే వ్యక్తిని బెదిరించి పల్సర్ బైక్ను దోచుకున్నారు. ఈ మూడు ఘటనలపై మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. సలాబత్పూర్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి దోపిడీలకు ఉపయోగించిన 3 కత్తులు, 4 సెల్ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కేసు చేధనలో కృషి చేసిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, శ్రావణ్, శివ, శ్రీకాంత్లను అభినందించారు. ఒంటరిగా ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులే టార్గెట్ ముగ్గురు నిందితుల రిమాండ్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్ రెడ్డి -
ఎన్డీసీసీబీలో ‘సంపద’ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం
సుభాష్నగర్: అన్ని బ్యాంకుల కన్నా అధిక వడ్డీ రేటు ఎన్డీసీసీబీ ఇస్తుందని, వినియోగదారుల కోసం ‘సంపద ఫిక్స్డ్ డిపాజిట్’ స్కీంను ప్రవేశపెట్టినట్లు జిల్లా సహకార అధికారి (డీసీవో) ఎన్ శ్రీనివాస్రావు తెలిపారు. ఎన్డీసీసీబీ ఆధ్వర్యంలో నూతన డిపాజిట్ పథకం పోస్టర్లను నగరంలోని ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీవో మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్న ప్రత్యేక డిపాజిట్ పథకం సందప అని తెలిపారు. ఈ పథకం ద్వారా సాధారణ డిపాజిటర్లకు 8 శాతం వార్షిక వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, రైతులకు 103 సంవత్సరాలుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఎన్డీసీసీ బ్యాంకులో సురక్షితంగా పెట్టుబడి పెట్టి, అధిక వడ్డీ ద్వారా సంపదను మరింత భద్రంగా దాచుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఈవో నాగభూషణం వందే, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, గజానంద్, అనుపమ, సుమమాల, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పల్లె ఆటలతో ఐకమత్యం
● బలపడుతున్న బంధాలు ● వేసవి సెలవులతో వీధుల్లో పిల్లల సందడి ఆర్మూర్ : గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు పరిచయం చేసే ప్రతీ ఆట కొత్త ప్రపంచమే. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్లకు అతుక్కుపోకుండా, వాటి చెర నుంచి తప్పించే ఆటలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత, పట్టుదలను పెంచే ఆటలైన క్యారమ్స్, అష్టాచెమ్మా, వైకుంఠపాలి, చెస్, పులిమేక, గిల్లిదండా, గోటీలు, కోతి కొమ్మచ్చి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులను అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మామయ్యలు గ్రామీణ క్రీడల వైపు మరల్చుతున్నారు. ఫలితంగా స్నేహభావం, ఐకమత్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, సోదర భావం, సమానత్వంతోపాటు శారీరక శ్రమ, మెదడుకు మేత పెట్టే గ్రామీణ క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. మట్టి వాసన, చెమట చుక్కల విలువ తెలియని తరానికి అమ్మమ్మ, తాతయ్యలు వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. స్క్రీన్ టైమ్కు బ్రేక్ ఇచ్చి, ఒక్కసారైనా పిల్లల చేయి పట్టుకొని వీధిలోకి తీసుకెళ్లి గిల్లీదండా ఆడిద్దాం... కనుమరుగవుతున్న ఆటలతోపాటు కలిసిపోతున్న మన సంస్కృతిని కాపాడుకుందాం అంటూ పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీధుల్లో ఒకప్పటి సందడి... ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారంతా వేసవి సెలవుల్లో తమ పిల్లలను సొంతూళ్లకు పంపించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో పిల్లలు వీధుల్లో గిల్లీ దండా, కోతి కొమ్మచ్చి, గోటీలు, తొక్కుడు బిళ్ల, సైకిల్ టైర్ తిప్పడం, చార్పత్తి, దాగుడు మూతలు, బొంగరాలు, కబడ్డీ ఆడేవారు. కై లాసం, అష్టాచెమ్మా, పైల పచ్చీస్, చింత గింజ లాట లాంటి ఇండోర్ గేమ్స్కు ఆడుతూ కనిపిస్తున్నారు. చెరువులు, కాలువల్లో ఈత కొట్టే మధురానుభూతిని పంచుకుంటున్నారు. గ్రామీణ క్రీడలు ఆడుతున్న పిల్లలను వారిస్తూ పాశ్చాత్య ధోరణితో వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకో వాలి. మార్కులే జీవితం కా దు. పిల్లలతో అన్ని రకాల క్రీడలను ఆడించాలి. మనం ఆడిన ఆటలే మనకు నేర్పిన నాయకత్వ లక్షణాలు ఉపయోగపడుతున్నాయి. – ఈరవత్రి రాజశేఖర్, చార్టెడ్ అకౌంటెంట్, ఆర్మూర్ కలిసికట్టుగా గ్రామాల్లో పిల్లలు ఆటలాడటంతో వారిలో ఐక్యతా భావం పెరుగుతుంది. ఓడిపోయినా నవ్వుతూ ఎలా స్వీకరించాలో నేర్పేది మట్టిలో ఆడే ఆటలే. ఇవి మానసికంగా పిల్లలను బలవంతులను చేస్తాయి. – రామ్మోహన్, ప్రధానోపాధ్యాయుడు, మల్లారం, నిజామాబాద్ గ్రామీణ క్రీడల ప్రాధాన్యతను నేటితరం పిల్లలకు పరిచయం చేయాల్సిన అవస రం ఎంతైనా ఉంది. సెల్ఫోన్లు, టీవీల పుణ్యమా అని అసలు క్రీడలంటేనే తెలియ ని పరిస్థితి ప్రమాదకరం. పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చాలి. – శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు, పెర్కిట్, ఆర్మూర్క్రీడలతోనే మానసికోల్లాసం లభిస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనీసం సెలవు దినాల్లోనైనా పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకొనేలా ప్రోత్సహించాలి. రోజూ గంటసేపు చెమట పట్టేలా ఆడితేనే ఆరోగ్యం. – రాజగంగారాం, మండల విద్యాధికారి, ఆర్మూర్ -
మూడేళ్లకే ముక్కలు..
● బాన్సువాడ ఇరిగేషన్ ఆఫీస్లో పగిలిన టైల్స్.. బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ నీటిపారుదల శాఖ కార్యాలయం అధ్వానంగా మారింది. ఈకార్యాలయాన్ని బాన్సువాడలోని సాయికృపానగర్ కాలనీలో నిర్మించారు.కార్యాలయం నిర్మించి ఐదేళ్ల పూర్తవుతున్నా.. మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కార్యాలయం నిర్మాణ సమయంలో బెస్మెంట్లో మొరంకు బదులుగా నల్లమట్టి వేయడంతో కార్యాలయంలో గోడలు పూర్తిగా కుంగిపోయాయి. బెస్మెంట్ కిందికి దిగి పోవడంతో కార్యాలయ గదుల్లో వేసిన టైల్స్ పగిలిపోయాయి. కార్యాలయంలో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఉన్నతాధికారులు స్పందించాలి. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
● డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ఎల్లారెడ్డి: ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి బీఎల్ఏ తన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బలమైన బూత్ వ్యవస్థే పునాదిగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం బీఎల్ఏ మాస్టర్ ట్రైనర్ నరేశ్ రాథోడ్, మోహన్ కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, శ్రీధర్గౌడ్, బీఎల్ఏలు, ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు బడికి పంపించాలి
మాచారెడ్డి/కామారెడ్డి అర్బన్/నస్రుల్లాబాద్/గాంధారి: తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికే పంపించాలని పాల్వంచ ఎంపీడీవో శ్రీనివాస్ కోరారు. బుధవారం పాల్వంచ మండలం సింగరాయపల్లిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడిలోని అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటుకు పంపకుండా సర్కారు బడికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీపతి, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు బడిబాట నిర్వహించారు. హెడ్మాస్టర్లు సాయిరెడ్డి, నళిని, సాయాగౌడ్, హన్మాండ్లు, సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ లక్ష్మి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి, మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గాంధారి మండల పరిధిలో పలు గ్రామాల్లో బడిబాట నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఈవో శ్రీహరి మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బడిబయట పిల్లలను బడిలో చేర్పించాలని ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. ఈసందర్భంగా పీఆర్టీయూ మండల అధ్యక్షులు గునిగెరి హన్మాండ్లు మాట్లాడారు. -
పాల్వంచలో నూతన స్తంభాల ఏర్పాటు
మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రంలో బుధవారం నూతనంగా 14 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. మల్లికార్జున స్వామి ఆలయం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూచని శేఖర్ మాట్లాడుతూ... మండల కేంద్రంలోని రహదారి పక్క కాలనీలో ఎన్ని రోజులు విద్యుత్ వెలుగులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యం, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నారు. కామారెడ్డి టౌన్ : స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఉమ్మడి రాష్ట్ర ఆత్మీయ సమ్మేళన సభకు జిల్లా కేంద్రం నుంచి సంఘం నాయకులు బుధవారం తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి సభకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ కలిముద్దీన్, ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు జిల్లా నాయకులు వెళ్లారు. భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు వంగేటి నిహిత్రెడ్డి అగ్నివీర్కు ఎంపికయ్యాడు. బుధవారం గ్రామంలో నిహిత్రెడ్డిని సర్పంచ్ కుంట లింగారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. నిహిత్రెడ్డిని శాలువతో మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి, నాయకులు ధర్మయ్య, కోకస్వామి, శ్రీనివాస్రెడ్డి, నర్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల రోడ్డు నుంచి సోమారంకు వెళ్లే రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత రెండు సంవత్సరాలక్రితం వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోడ్డుపై వెళ్లే ద్విచక్రవాహనదారులు పలుమార్లు అదుపుతప్పి కిందపడిన ఘటనలు ఉన్నాయి. రాత్రివేళలో ఈరోడ్డు గుండా వెళ్లాలంటే వాహనదారులు భయపడుతున్నారు. అలాగే తాడ్వాయి శివారులోని రోడ్డులో తమ్మలవాని వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. అంకాపూర్ గ్రామంలోని ముఖాంబిక హోటల్లో పనిచేసే సునీల్(42) అనే వ్యక్తి బుధవారం మద్యం తాగి ఇంటికి వచ్చి బోర్లా పడుకున్నాడు. కొద్దిసేపటికి లేచి తన బెడ్ రూంలో నిద్రపోయాడు. రాత్రి ఏడుగంటలకు భార్య ఎంత పిలిచినా, కదిలించినా అతడు లేవలేదు. దీంతో ఆమె వెంటనే స్థానిక వైద్యుడిని ఇంటికి పిలువగా, అతడు పరిశీలించి సునీల్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో చిట్టుకు రోగంతో 10 గొర్రెలు మృతి చెందినట్లు భి క్కనూరు పశువైద్యాధికారి మౌనికరెడ్డి బుధవారం తెలిపా రు. బస్వాపూర్లో గొ ర్రెలు మృతిచెందిన విషయం తెలుకున్న తాను జంగంపల్లి పశువైద్యాధికారి అనిల్రెడ్డితో కలిసి గ్రామానికి వెళ్లామన్నారు. అక్కడే మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక లక్షణాలు, పోస్టుమార్టం పరిశీలన ప్రకారం చిట్టుకు (ఎంటరోటాక్సీమియా) వ్యాధి, అనుమానిత కేసుగా గుర్తించమన్నారు. గొర్రెలు, మేకలు పెంపకందారులు తమ పశువులకు చిట్టుకు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. గోపాలమిత్ర సురేష్ ఉన్నారు. ఆర్ఎంపీలపై కేసులు నమోదు నిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా పలువురు ఆర్ఎంపీ వైద్యులపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల పేరుతో వైద్యం అందిస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ పోలీసులకు ఇటీవల విన్నవించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్ల పరిధిలో పలువురు ఆర్ఎంపీలపై కేసులు నమోదు అయ్యాయి. -
నిషేధం.. కాగితాలకే పరిమితం
జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ విస్తరిస్తోంది. కిరాణా దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్ సెంటర్లు, పండ్ల దుకాణాలు, వీధి వ్యాపారులు ఇలా ఒకటేమిటి.. ప్రతి చోటా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. 20 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లపై పూర్తిస్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ, మార్కెట్లో ఇవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. పశువుల పాలిట శాపం ప్రజలు ఇళ్లలోని తడి చెత్తను, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో కట్టి రోడ్లపై, మురికికాల్వల్లో పారేస్తున్నారు. ఆహారం కోసం వెతికే మూగజీవాలైన ఆవులు, గేదెలు ఆ కవర్లతో సహా తినేస్తున్నాయి. దీంతో అవి అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి. అంతేకాకుండా, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్వల్లో ఇరుక్కుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. టాస్క్ఫోర్స్ కమిటీల చర్యలేవి.. ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు, పర్యవేక్షణకు మున్సిపల్ పరిధిలో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కమిషనర్, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాల అధికారులు ఉండాలి. వీరు నిరంతరం మార్కెట్లు, హోల్సేల్ వ్యాపార కేంద్రాలపై దాడులు నిర్వహించి ప్లాస్టిక్ నిల్వలను సీజ్ చేయడంతోపాటు భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో టాస్క్ఫోర్స్ కమిటీల హడావుడి కనిపించడం లేదు. పర్యావరణ దినోత్సవం వస్తే తప్ప మున్సిపల్ సిబ్బందికి ప్లాస్టిక్ తనిఖీలు గుర్తుకురావని పురప్రజలు పెదవి విరుస్తున్నారు. జరిమానాలు ఎక్కడ? నిబంధనల ప్రకారం నిషేధిత ప్లాస్టిక్ వాడే వ్యాపారులకు మొదటిసారి రూ. 2,500, రెండోసారి రూ. 5,000, మూడోసారి అంతకన్నా ఎక్కువ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. అవసరమైతే దుకాణాల లైసెన్సు కూడా రద్దు చేయవచ్చు. కానీ, అధికారుల ఉదాసీనతతో వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం చిరువ్యాపారులపైనే ప్రతాపం చూపే అధికారులు.. హోల్సేల్గా ప్లాస్టిక్ సరఫరా చేసే పెద్ద వ్యాపారుల జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని, తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.మున్సిపాలిటీ చెత్త(టన్నుల్లో) నిషేధిత ప్లాస్టిక్ (కేజీల్లో) కామారెడ్డి 40–45 1800–2200 బాన్సువాడ 18–20 800–1000 ఎల్లారెడ్డి 10–12 400–500 బిచ్కుంద 08–10 350–450జిల్లాలోని పురపాలికల్లో ప్లాస్టిక్ నిషేధం నామమాత్రంగా జరుగుతోంది. రోజురోజుకూ తగ్గాల్సిన వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపంతోనే నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్లు, టీ కప్పుల విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల చర్యలు కాగితాలకే పరిమితం కావడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. – కామారెడ్డి టౌన్ యథేచ్ఛగా ప్లాస్టిక్ వాడకం బల్దియాల్లో కంటితుడుపుగా తనిఖీలు నిషేధిత కవర్ల విక్రయాలు జోరు పర్యావరణానికి తీవ్ర విఘాతం టాస్క్ఫోర్స్ కమిటీల స్పందన కరువు పట్టింపులేని బల్దియా అధికారులునిషేధిత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతాం. ఇప్పటికే శానిటరీ విభాగం ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి హోల్సేల్ వ్యాపార కేంద్రాలు, గోదాములపై దాడులు చేస్తాం. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవు. వ్యాపారులు, ప్రజలు సహకరించి ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలి. – టి. పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
‘ఉపాధి’కి పెరిగిన డిమాండ్
● నెలక్రితం రోజుకు 23 వేల మంది హాజరు ● ప్రస్తుతం 60 వేలకు పెరిగిన సంఖ్యదోమకొండ: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెరిగింది. నెల క్రితం రోజూ 23 వేల మంది పనులకు వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 60 వేలకు చేరడం గమనార్హం. మే నెలలో వ్యవసాయ పనులు లేకపోవడంతో చాలామంది ఉపాధి హామీ పనులకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. మే నెల మొదటి వారంలో 23 వేల మంది మాత్రమే పనులు చేసేవారు. ఇది క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండో వారంలో 35,047 మంది ఉపాధి పనులకు రాగా.. మూడో వారంలో 41,280 మంది, నాలుగో వారంలో 54,052 మంది పనులు చేసినట్లు ఉపాధి హామీ పథకం అధికారులు తెలిపారు. కాగా ఈనెల మొదటివారంలో 60 వేలకుపైగా మంది పనులకు వచ్చారని పేర్కొన్నారు. కాగా ఉపాధి హామీ పథకం ఈనెలాఖరు వరకు కొనసాగనుంది. వచ్చేనెల ఒకటో తేదీనుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్ (వీబీ జీరామ్జీ) అమలులోకి రానుంది. అయితే కొత్త చట్టం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.వ్యవసాయ సీజన్ పనులు పూర్తయిన తర్వాత ఉపాధి హామీ పనులకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. మండలంలో నిత్యం రెండువేలకు పైగా కూలీలు పనులకు వస్తున్నారు. వారికి తగ్గట్టుగా పనుల సంఖ్యను పెంచాం. పనులను పర్యవేక్షిస్తూ కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – ప్రవీణ్కుమార్, ఎంపీడీవో, దోమకొండ -
సాగునీటికి అత్యంత ప్రాధాన్యత
● సిద్ధాపూర్ రిజర్వాయర్కు అదనంగా రూ.200 కోట్లు ● భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తవ్ుకుమార్ రెడ్డిజాకోరా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సురేశ్షెట్కార్వాహనంలో ప్రయాణిస్తూ సిద్ధాపూర్ రిజర్వాయర్ను పరిశీలిస్తున్న మంత్రి ఉత్తమ్ వర్ని: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరలో రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోరా, చందూర్ లిఫ్ట్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. హెలీకాప్టర్లో సిద్ధాపూర్కు చేరుకున్న మంత్రికి ప్రభుత్వ సలహాదారు పో చారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సురేశ్షెట్కార్, కలెక్టర్ ఇ లా త్రిపాఠి తదితరులు స్వాగతం పలికారు. సిద్ధాపూ ర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. జాకోరాకు చేరుకుని అక్కడ జాకోరా, చందూర్ లిఫ్ట్లను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. నిజాంసాగర్ కాలువ ఎగువ భాగాన ఉన్న రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ను నిర్మించామన్నారు. లిఫ్ట్ ద్వారా 7,975 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువపై సొలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పూర్తి చేసేందుకు మరో రూ.200 కోట్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు కూలిపోయాయని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ప్రకారం మూడు ప్రాజెక్టులను పునర్నిర్మిస్తామన్నారు. రూ. లక్షల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రయోజనం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో విద్య, వైద్యం, తాగు నీరు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ లీకై వ్యాపించిన మంటలు
● ముగ్గురికి గాయాలు కామారెడ్డి క్రైం: గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన మౌనిక ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు ఎగసిపడి మౌనిక చీరకు అంటుకోవడంతో కేకలు వేసింది. ఆమె అత్త మల్లవ్వ, కుమార్తె అలేఖ్య, భర్తలు వచ్చి మంటలు ఆర్పేశారు. ఈక్రమంలో మౌనికతో పాటు అత్త, కుమార్తెలకు గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో కిచెన్లో వ్యాపించిన మంటలను ఆర్పి వేసింది. గాయపడిన వారిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సిలిండర్ లీకేజీపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. -
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం
● ఎస్పీ రాజేశ్చంద్ర బాన్సువాడ: కానిస్టేబుల్ రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. బాన్సువాడ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ రఘు మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన కుటుంబాన్ని ఎస్పీ రాజేశ్చంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ రఘు విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందిలో ఆయన ఒకరని అన్నారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని, పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎస్పీ వెంట బాన్సువాడ టౌన్, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, సంతోష్కుమార్, ఎస్సై మహేందర్ తదితరులు ఉన్నారు.మాచారెడ్డి: మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో వెంకటి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది హాజరు పట్టికతోపాటు ఔషధ పట్టికను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అని ఆరా తీశారు. వైద్యాధికారి ఆదర్శతోపాటు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సోకే సీజనల్ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ● డీఈవో మల్లికార్జున్ భిక్కనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ పేర్కొన్నారు. ప్రయివేటు పాఠశాలల కన్నా మెరుగైన విద్యాబోధన జరుగుతోందని వివరించారు. భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బడిబాటలో డీఈవో పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఎంఈవో రాజగంగారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం భవానీ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శిరీషరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గాంధారి (ఎల్లారెడ్డి) : కాలేజీతోపాటు పరిసరాలు శుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేఖ్ సలాం సూచించారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కాలేజీ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ గడ్డం గంగారాంకు సూచించారు. 13న అస్మిత ఖేలో సైక్లింగ్ పోటీలు నిజామాబాద్ అర్బన్: జిల్లా స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైక్లింగ్ సిటీ లీగ్ వర ల్డ్ బైస్కిల్ డే సైక్లింగ్ పోటీలను ఈనెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి విజయ్కాంత్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను తెలంగాణ యూనివర్సిటీ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల విభాగంలో 19 సంవత్సరాలు పైబడిన వారికి, జూనియర్ బాలికల విభాగంలో 17 నుంచి 18 సంవత్సరాల వారికి, సబ్ జూనియర్ బాలికల విభాగంలో 13 నుంచి 16 సంవత్సరాల బాలికలకు పోటీలు ఉంటాయని తెలిపారు. మిగతా వివరాలకు 99128 83331 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి
భిక్కనూరు : ప్రపంచ వ్యాప్తంగా మంచినూనెలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలను సాగు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని సూచించారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జల సంరక్షణ–మన సంరక్షణలో భాగంగా జిల్లాలో 36 వేల కందకాలను తవ్వామని, దీంతో భూగర్భ జలాల పెంపుదల జరుగుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రజలు పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, 18 ఏళ్లు నిండిన అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయడం, డబుల్ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజకిరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై ప్రాజెక్టు స్థాయి పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ఆర్) కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. పిట్లం మండలంలోని నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ అంశాలను పరిశీలించారు. తక్కువ విస్తీర్ణంలో మాత్రమే భూములను సేకరిస్తుండటంతో నివాస గృహాలను మరోచోటికి మార్చే అవసరం లేదని, కుటుంబాల జీవనోపాధిపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కమిటీ అభిప్రాయపడింది. భూ సేకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు వర్తించవని కమిటీ నివేదించింది. సమావేశంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రైలులో గంజాయి రవాణా
● ఇద్దరి అరెస్ట్.. 10 కిలోల గంజాయి స్వాధీనం కామారెడ్డి క్రైం: రైలులో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని కామారెడ్డి రైల్వే, ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం గుర్తించి పట్టుకున్నారు. సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంబల్పూర్ నుంచి పుణే వెళ్తున్న నాగవలి ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు కామారెడ్డి స్టేషన్లో రైలు ఆగగానే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్, ప్రవీణ్గా గుర్తించారు. వారు ఒడిశా రాష్ట్రంలోని రాయ్ఘడ్ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి రైలులో మహారాష్ట్ర లోని రాయ్పూర్కు రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బల్వంత్రావు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్, ఎస్పీలకు కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫిర్యాదు
కామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీ పరిధిలో రూ.90 లక్షలకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తులు, స్క్రాప్ సామగ్రిని అక్రమంగా విక్రయించారని, దీనిపై స మగ్ర విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేయాలని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మా ట్లాడుతూ 2024 డిసెంబర్ 10న రాత్రి వాటర్ ఫిల్టర్ బెడ్ గోదాం, బుర్ర మత్తడి, పెద్ద చెరువు, జా తీయ రహదారి పక్కన నిల్వ ఉంచిన ప్రభుత్వానికి చెందిన పాత మోటార్లు, కాపర్ వస్తువులు, విలువై న స్క్రాప్ను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించి విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ పాత్రపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, వాటర్ వ ర్క్స్ ఉద్యోగి ఇచ్చిన వాంగ్మూలం కూడా ఇందుకు బలపరుస్తోందన్నారు. గతంలో తాము ఫిర్యాదు చే సినా అధికారులు చర్యలు తీసుకోలేదని, జిల్లా స్థా యి ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేనీ సందీప్, కౌన్సిలర్లు, నాయకులు కళ్లెం సావిత్రి, అంజాద్, లడ్డు, కాళ్ల రాజమ ణి, వనిత, ఫాతిమా, గ్యా ర అఖిల, గంగాధర్, సునీత, తహసీన్ ఉన్నిసా, వా జిద్, ఆఫ్రిన్, ఆస్మా హబీబ్, సుల్తానా బేగం, లలిత, ఇసాక్ షేరు, అన్వర్ అహ్మద్, గోనె శ్రీనివాస్, ము బాషిర్, గణేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్లో భారీ చోరీ
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ నగరంలోని సుభాష్నగర్లో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. రామాలయం పక్కన రిటైర్డ్ జా యింట్ కలెక్టర్ రవికుమార్ నివాసంలో ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఇంటిలోని 30 తులాల బంగారం, అరతులం వెండి, ఇంటిలో ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. ఇందులో బంగారు ఆభరణాలు ఉన్నా యి. రవికుమార్ ప్రస్తుతం హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఇంటికి వాచ్మెన్ వెంకట్ రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో రవికుమార్కు సమాచారం అందించారు. అనంతరం మూడో టౌన్ పోలీసులకు తెలుపగా ఏసీపీ ప్రకాశ్యాదవ్, ఎస్సై హరిబాబులు వచ్చి దొంగతనం తీరును పరిశీలించారు. ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇంట్లోని సీసీపుటేజీ డీపీఆర్ను దొండలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. -
ఎన్ఎంఎంఎస్ఎస్లో విద్యార్థుల ప్రతిభ
● బీబీపేట బాలుర పాఠశాల నుంచి ఎనిమిది మంది ఎంపిక ● జిల్లాలో మొదటి స్థానంబీబీపేట : బీబీపేట బాలుర పాఠశాల నుంచి ఇటీవ ల ప్రకటించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్ఎస్)లో ఎనిమిది మంది వి ద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విభాగంలో ఈపాఠశాల జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2025, 2024లల్లో ఈ పాఠశాల నుంచి ఇద్దరేసి వి ద్యార్థులు ఎంపికయ్యారు. నేషనల్ మీన్స్ కమ్ మె రిట్ స్కాలర్షిప్ ఆర్థికంగా వెనుకబడిన, చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్య కొనసా గించడానికి ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష. టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన ఎనిమిదో తరగతి వి ద్యార్థులు మామిడాల సృజన, రేగుల కార్తిక, ధర్మ గారి అచ్యుత్గౌడ్, శివంది నాగప్రసన్న, పెద్దోళ్ల మ నుశ్రీ, నీరడి రుచిత, కొత్తకోట సంయుక్త, వల్లెపు లాస్యలు ఇటీవల నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ పరీక్షకు ఎంపికయ్యా రు. ఎంపికై న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 9వ త రగతి నుంచి 12 వ తరగతి వరకు ప్రతి సంవత్సరా నికి గానూ రూ.12 వేలు అందిస్తారు. పాఠశాల ఉ పాధ్యాయులు విద్యార్థులలో ఉన్నటువంటి ప్రతిభ ను గుర్తించి ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజు అదనపు శిక్షణ తరగతులు నిర్వహించారు. గత ప్రశ్నాపత్రాలపై సాధన చేయించడం, వ్యక్తిగతంగా వచ్చిన సందేహాలను నివృత్తి చేయడంతో విద్యార్థులు ఈ పరీక్షలో మంచి ఫలితాలను సాధించారు. -
ఆత్మస్థైర్యం స్వీయ రక్షణ
● చిట్టి చేతులతో కరాటే పంచ్లు ● ఉత్సాహంగా నేర్చుకుంటున్న చిన్నారులుబాన్సువాడ : ఆత్మ స్థైర్యాన్ని పెంచుకోవడంతోపా టు స్వీయరక్షణ కోసం చిన్నారులు వేసవి సెలవుల్లో కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢత్వం.. క్రమ శిక్షణ అలవడేలా సెలవులు సద్వినియోగమ వుతున్నాయి. బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వా మి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ క్లాస్లు కొనసాగుతున్నాయి. మండలంలోని సంగోజిపేట్ గ్రామానికి చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కలల గురుకులం (అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. వేసవి సెలవులు వృథా చేయకుండా, సెల్ఫోన్లకు పరిమితం కాకుండా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. గత నెల 1వ తేదీన శిక్షణ తరగతులను ప్రారంభం కాగా, బుధవారం నాటితో ముగియనున్నాయి. మొదట్లో 8 మంది పిల్లలతో శిక్షణ క్లాస్లు ప్రారంభం కాగా, ఆ సంఖ్య 60కి చేరిందని నవీన్ తెలిపా రు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వర కు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు చిన్నారులకు కరాటే శిక్షణ కొనసాగింది. చిన్నారులు తమ చిట్టి చేతులతో ఇస్తున్న కరాటే పంచ్లను చూస్తూ స్థానికులు అభినందిస్తున్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగు తుంది. ఏదైనా సాధించొచ్చనే నమ్మకం కలు గు తుంది. అమ్మనాన్నలు కరాటే శిక్షణ అంటే ఆనందంతో పంపుతున్నారు. వేసవి సెలవులు వృథా కా కుండా శిక్షణ ఉపయోగపడుతోంది. నవీన్ మాస్టారుకు ప్రత్యేక ధన్యవాదాలు. – వైష్ణవి, బాన్సువాడ కరాటేతో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆత్మస్థైర్యం, నాయకత్వ లక్షణాలు అవలవడుతాయి. వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం ఆనందాన్ని ఇస్తోంది. పిల్లలు కూడా ఉత్సాహంగా వస్తున్నారు. – నవీన్, శిక్షకుడు -
ఫోన్ మాట్లాడొద్దన్న తండ్రి.. కూతురి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్) : ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు మండలంలోని పెద్ద తడ్గూర్కు చెందిన భాగ్యవార్ సంధ్య(15) అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద తడ్గూర్కు చెందిన భాగ్యవార్ మాదప్ప కూతురు సంధ్య ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఇంటర్మీడియెట్ కోసం బోధన్లోని ఓ ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. తనతోపాటు ఎస్సెస్సీ పూర్తి చేసిన స్నేహితులు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని తరుచూ వారితో ఫోన్ మాట్లాడుతుండడంతో తండ్రి మాదప్ప ఆమెను సోమవారం సాయంత్రం మందలించాడు. మంగళవారం ఉదయం మాదప్పతోపాటు ఆయన భార్య పొలానికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో సంధ్య దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హిట్లర్కు పట్టిన గతే రేవంత్రెడ్డికి పడుతుంది
కాంగ్రెస్, బీజేపీలు రైతులను మోసం చేస్తున్నాయి ● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డినిజామాబాద్రూరల్/డిచ్పల్లి : నియంత హిట్లర్కు పట్టిన గతే సీఎం రేవంత్రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో మంగళవారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్ (స్పెషల్ ఇంటెన్సిస్ రివిజన్) సన్నాహక సమావేశానికి ప్రశాంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారే నిజమైన కార్యకర్తలని అన్నారు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపడితే పార్టీ బలపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తోడుదొంగలని, ఆ రెండు పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. యూరియా కొరత వల్ల రైతుల కడుపు మండుతోందని, తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేసి పాతపద్దతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యాప్ పోవాలి.. బాపు రావాలి.. అని రైతులు కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎవ్వరూ కూడా తెలంగాణపై మాట్లాడలేదని, ప్రస్తుతం ఆంధ్రాగద్దల కన్ను తెలంగాణపై పడుతోందని, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడి ప్రజలు చూస్తు ఊరుకోబోరని హెచ్చరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీ గంగాధర్గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, హన్మంత్సింధే, జాజాల సురేందర్ తదితరులు ప్రసంగించారు. ప్రసంగించారు. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో రెండు ముఖ్యమైన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. యాప్ విధానాన్ని రద్దు చేసి అన్ని సొసైటీల ద్వారా రైతులకు నేరుగా యూరియా అందేలా చర్యలు చేపట్టాలని, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ను తక్షణమే పునరుద్దించాలని తీర్మానించారు. పార్టీ సీనియర్ నాయకుడు, సభ్యత్వ నమో దు ఇన్చార్జి గిర్దావర్ గంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, దాసరి ఇందిర, పాట్కూరి తనూజ, గడ్డం సుమనరెడ్డి హాజరయ్యారు. -
రీజియన్ అభివృద్ధికి కృషి చేశాం
నిజామాబాద్ రూరల్ : ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి విశేష కృషి చేశామని ఆర్ఎం టి జ్యోత్స్న అన్నారు. బదిలీపై నల్గొండ జిల్లాకు వెళ్తున్న ఆర్ఎంను, డిప్యూటీ ఆర్ఎంగా మెదక్ రీజియన్కు పదోన్నతిపై వెళ్తున్న మధుసూదన్ను అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రంలోని రీజియన్ కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. రీజియన్ అభివృద్ధికి విశేష కృషి చేశామని, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో సిబ్బంది కీలకపాత్ర పోషించారని కొనియాడారు. భవిష్యత్లో సైతం సంస్థ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు, మెకానికల్ ఫోర్మెన్లు, రీజియన్ పీవో పద్మజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అలరించిన కూచిపూడి కళాక్షేత్ర వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం మంగళవారం రాత్రి స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నటులు ఇంద్రజ, బలగం మురళీధర్గౌడ్, అదిరే అభిలు వార్షికోత్సవంలో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, జానపద, సంప్రదాయ నృత్యాలు అలరించాయి. కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకుడు, జాతీయ నృత్య కళాకారుడు వంశీ ప్రతాప్ గౌడ్ నృత్య కళకు అంకింతమై వందలాది మంది నృత్య కళాకారులను తీర్చిదిద్దడం అభినందనీయమని ముఖ్యఅతిథి వ్యాపార వేత్త సుభాష్రెడ్డి అన్నారు. తన నృత్య గురువు వంశీప్రతాప్గౌడ్ కావడం గర్వకారణంగా ఉందని నటుడు అభి అన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.చంద్రకాంత్రెడ్డి, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.స్థానిక నాయకులు, కళాభిమానులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. -
గ్రామాల్లో పూరిగుడిసెల సర్వే
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం అధికారులు పూరిగుడిసెల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పూరిగుడిసెల సర్వే చేపట్టినట్లు ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తెలిపారు. మండలంలోని వదల్పర్తిలో జరిగిన పూరిగుడిసెల సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. జీపీ కార్యదర్శి అశోక్ ఉన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : మండలంలోని గోపాల్పేటకు చెందిన కబడ్డీ క్రీడాకారులకు మంగళవారం బీజేపీ మండల నాయకురాలు మీరాతాయి క్రీడాదుస్తులను అందజేశారు. గోపాల్పేటకు చెందిన క్రీడాకారులు తాడ్వాయిలో జరుగుతున్న కబడ్డీ పోటీలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పోటీలో పాల్గొనే క్రీడాకారులకు క్రీడాదుస్తులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గసభ్యులు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రీజినల్ చైర్మన్గా శెనిశెట్టి గౌరీ శంకర్ నియామకమయ్యారు. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు కై లాస్ శ్రీనివాస్రావు తదితరులున్నారు. కామారెడ్డి క్రైం : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈనెల 11 న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నట్టు ఎన్నికల అ ధికారి లస్కర్ సత్యనారాయణ మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కార్యవర్గంలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారితో పాటు, మూడు చొప్పున ఉపాధ్యక్షులు, సంయుక్త కా ర్యదర్శుల పదవులు, 13 కార్యవర్గ సభ్యుల ప దవులు ఉంటాయని వెల్లడించారు. దాంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గానికి సైతం నామినేషన్లు స్వీకరించనున్నామని పే ర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఈ నెల 12న సా యంత్రం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్న వరలక్ష్మి గార్డెన్లో జరిగే జిల్లా సా ధారణ సర్వసభ్య సమావేశంలో భాగంగానే ఎన్నికల నిర్వహణ, తుది ఫలితాల వెల్లడి ఉంటాయన్నారు. ఆసక్తి గల టీయూడబ్ల్యూజే స భ్యులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. రుద్రూర్: ట్రాక్టర్ బంపర్ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గంగారాం తన ట్రాక్టర్కు కల్టివేటర్ను తగిలించేందుకు వాహనాన్ని వెనుకకు తీస్తుండగా, అక్కడే ఆడుకుంటున్న అతని మనవరాలు మహాన్విక (2)కు బంపర్ తగిలింది. ఈ ఘటనలో చిన్నారికి తలకు తీవ్ర గాయం కాగా, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
గాంధారి/బాన్సువాడ: గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ రఘు(45) గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. బాన్సువాడ పట్టణానికి చెందిన రఘు గత కొంత కాలంగా గాంధారి పోలీస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాన్సువాడలోని ఇంటికి వచ్చిన రఘు మంగళవారం ఉదయం విధి నిర్వహణ కోసం గాంధారికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అస్వస్తతకు గురయ్యాడు. గమనించిన కుంటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, 12ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
సర్ వచ్చేస్తున్నారు!
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. – కామారెడ్డి క్రైం‘సర్’ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా చేపట్టిన సర్ప్రక్రియ ఈనెల 15వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 1 న విడుదల చేసే తుది ఓటరు జాబితాతో ముగియనుంది. ఈ మొత్తం ప్రక్రియలో బీఎల్వో (ఎన్యుమరేటర్)లదే కీలక పాత్ర కానుంది. వారి పనితీరు, మొత్తం ప్రక్రియను తహసీల్దార్లు, సంబంధిత ఆర్డీవోలు ఈఆర్వోల హోదాలో పర్యవేక్షించనున్నారు. సమగ్ర ఓటరు సర్వే ప్రారంభం కానుండడంతో ఓట్లు రద్దు కాకుండా ఉండడం కోసం ఓటర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్యుమరేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేసుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. 15 నుంచి ప్రక్రియ ప్రారంభం.. జిల్లాలో సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభిస్తారు. ఎన్యుమరేటర్ జాబితా తయారీ, వారికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల కేటాయింపులు, ఎన్యుమరేషన్ పత్రాల ప్రింటింగ్ లాంటి పనులు 24 వ తేదీ వరకు పూర్తి చేసుకోనున్నారు. 25 నుంచి క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే ప్రారంభం అవుతుంది. జూలై 24న సర్వే పూర్తిచేసి, అదే రోజున పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపడతారు. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం 6,99,019 మంది ఓటర్లున్నారు. దీంట్లో కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో 2,61,216 మంది, ఎల్లారెడ్డిలో 2,28,551 మంది, జుక్కల్ పరిధిలో 2,09,252 మంది ఓటర్లు ఉన్నారు. ఇదివరకే గుర్తించిన విధంగా జిల్లాలోని 3 (కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్) నియోజకవర్గాల పరిధిలో ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 791 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి పరిధిలో 267, ఎల్లారెడ్డిలో 274, జుక్కల్లో 250 పీఎస్లున్నాయి. ఒక్కో పీఎస్కు ఒక బీఎల్వో ఉన్నారు. పేరుందో లేదో తెలుసుకోండిలా.. 2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 80 శాతం వరకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కామారెడ్డి నియోజకవర్గంలో 70 శాతం దాటింది. చాలా మంది ఓటర్లు ఇళ్లు మారడం, అందుబాటులో లేకపోవడంతో అర్బన్ ఏరియాలలో మ్యాపింగ్ స్లోగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దశకు మ్యాపింగ్ ప్రక్రియ ఈనెల 25 నుంచి నెలపాటు ఇంటింటి సర్వే జూలై 31 నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ సెప్టెంబర్ 28 వరకు పరిష్కారాలకు అవకాశం అక్టోబర్ 1 న తుది ఓటరు జాబితా కీలకంగా వ్యవహరించనున్న బీఎల్వోలు -
వద్దంటున్నా.. వరికే మొగ్గు
● ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపని రైతాంగం ● 3.20 లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తారని అంచనాదేశంలో వరి ధాన్యం అధిక ఉత్పత్తితో నిల్వ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వరిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాలలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులు మాత్రం దీనికి సుముఖంగా లేరు. జిల్లాలో వానాకాలం సీజన్లో 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా.. ఇందులో వరి ఒక్కటే 3.20 లక్షల ఎకరాల్లో సాగవనుంది. నిరాసక్తతకు కారణాలు.. ● ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. కానీ ఇతర పంటలకు ఆ భరోసా లేదు. ● పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల ధరలు తరచూ మారుతుంటాయి. పంట చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. దీనికితోడు నిల్వ చేసుకుందామంటే గోదాముల సమస్య. ఆయా పంటలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలూ లేవు. ● ప్రత్యామ్నాయాలపై రైతులకు సరైన అవగాహన లేదు. కొత్త పంటలతో ప్రయోగాలు చేసే బదులు వరి సాగే సురక్షితమైన ఎంపికగా భావిస్తున్నారు. నేల స్వభావం కూడా వరికే అనువుగా ఉంటుందంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలతోపాటు ఎరువులను రాయితీపై అందించాలి. కనీస మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బిందు సేద్యం, తుంపర సేద్యం పరికరాలను ఉచితంగా లేదా భారీ సబ్సిడీపై అందజేయాలి. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటలు నష్టపోతే రైతులకు తక్షణమే పరిహారం అందేలా సమర్థవంతమైన బీమా సౌకర్యం కల్పించాలి.వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. షరా మామూలుగానే ఈసారీ అత్యధిక విస్తీర్ణంలో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. – ఎల్లారెడ్డి -
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. గోదాంలోని రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, డీటీ రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్(రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఒకటో తరగతినుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్లోని 112 గదిలోగల తమ కార్యాలయంలో సంప్రదించాలని, పూర్తి వివరాలకు 94949 82936, 91822 87674 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. భిక్కనూరు: వర్షాకాలం ప్రారంభమైనందున వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి సూచించారు. మంగళవారం అంతంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. దోమలు నివారణ చర్యలు చేపట్టాలని, తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇంటిపన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భార్గవ్రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించింది. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూర్ శివారులోని సర్వే నంబర్ 527/42/1/2 లో గల ఎకరం ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీ కి కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు. లింగంపేట: గ్రామ పంచాయతీలు, మండల పరిషత్కు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఎంపీడీవోతో మాట్లాడి అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకోసం నిధులను వినియోగించుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నాగన్నగారి మెట్ల బావిని సందర్శించారు. ఆయన వెంట డీపీవో మురళి, మండల ప్రత్యేకాధికారి సురేందర్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, కార్యదర్శి శ్రావణ్కుమార్ తదితరులున్నారు. నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ముందుగా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ను పరిశీలిస్తారు. అనంతరం జాకోరా గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించి పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి బయల్దేరి వెళ్తారు. -
‘గుడిసెలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యం’
రామారెడ్డి: గుడిసెలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం ఆయన రామారెడ్డిలోని ఒడ్డెర కాలనీలో పర్యటించి గుడిసెలో నివసిస్తున్న కుటుంబంతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరగా.. ఆయన విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం రామారెడ్డిలో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, ప్రతి చిన్నారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా బడి బాట నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంఈవో ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం ఆందోళన
సదాశివనగర్: అప్పుడే రైతన్నకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మంగళవారం పద్మాజీవాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు టోకెన్లను అందించి యూరియాను పంపిణీ చేశారు. యూప్లో బుక్ చేసుకున్న వారందరికీ అందేలా చూస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న జిల్లా సహకార అధికారి రామ్మోహన్ ఏవో ప్రజాపతి, విండో సీఈవో దేవేందర్లతో మాట్లాడి యూరియా స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేస్తున్నామని విండో చైర్మన్ గంగాధర్ తెలిపారు. -
ఏసీబీ దాడుల కలకలం
నిజామాబాద్అర్బన్/మోపాల్: జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ ఇంటితో పాటు బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచే మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆర్అండ్బీ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)గా మోహన్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. భారీ అక్రమాస్తులు సంపాదించినట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు దిగారు. మోపాల్ మండలం కులాస్పూర్ తండా ఆయన సొంత గ్రామం. మోహన్ నా యక్ ఇంటితో పాటు ఫామ్హౌస్, మాధవనగర్ సమీపంలోని ఆయన బావమరిది, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ నివాసం, మరో బావమరిది మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో నివసిస్తున్న రెడ్యా నాయక్, ఆయన స్నేహితుడు సంజీవ్రెడ్డి (కాంట్రాక్టర్) జిల్లా కేంద్రంలోని మారుతినగర్, వేల్పూర్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సంజీవ్రెడ్డి మోహన్ నాయక్కు దగ్గరి సన్నిహితుడు. గతంలో మోహన్ నాయక్ జిల్లాలో ఆర్అండ్బీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్ఈగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈక్రమంలో ఇక్కడ కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క అక్రమార్జన చేపట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మోహన్ నాయక్కు సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసి, స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇతరత్ర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సోదాలు కొనసాగాయి. కలకలం రేపుతున్న దాడులు.. జిల్లాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ అక్రమాస్తుల వ్యవహారాల్లో వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్లోని కీలక బాధ్యతల్లో పని చేస్తున్న కొందరు ఉన్నతాధికారుల స్థిరాస్తులపై , వారి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ● రవాణాశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి జిల్లా కేంద్రంలో భారీగా స్థిరాస్తులను గుర్తించారు. బైపాస్ రోడ్లో ఓ హోటల్, ఇంటీరియల్ దుకాణానికి సంబంధించి భూమి ఉన్నట్లు విచారణలో తేలింది. అలాగే ఓ బడా కాంట్రాక్టర్తో కలిసి కొన్ని అపార్ట్మెంట్లలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ● హైదరాబాద్లోని జలమండలిలో పని చేసిన ఓ ఉన్నతాధికారిని ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనకు సంబంధించి నవీపేట మండలంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. ● తాజాగా మోహన్ నాయక్ ఇళ్లపై సోదాలు జరగడంతో ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఇతర ప్రాంతాల్లో అక్రమార్జనకు పాల్పడి జిల్లాలో స్థిరాస్తులు కూడబెట్టుకోవడం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.అనేక స్థిరాస్తులు..?ఆర్అండ్బీ శాఖలో కీలక బాధ్యతల్లో ఉండి అనేక అక్రమాలకు పాల్పడినట్లు మోహన్ నాయక్పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. సొంత జిల్లాలోనే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మోపాల్, డిచ్పల్లి మండలాల పరిధిలో సుమారు 30 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. కులాస్పూర్ తండాలో ఫామ్హౌస్ ఉంది. దానికి ఆనుకుని ఎకరం స్థలంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇటీవల కులాస్పూర్ తండా సమీపంలో రూ.6 కోట్లతో 9 ఎకరాల విలువైన భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా నగరంలోని బైపాస్ రోడ్లో ఓ వెంచర్లో రూ.కోట్లు విలువ చేసే విల్లాను కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో తన సన్నిహితుడైన కాంట్రాక్టర్ పేరుతో పనులు చేయకున్నా..భారీగా బిల్లులు పొంది అక్రమార్జన చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇళ్లలో సోదాలు ఆయన బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ విస్తృత తనిఖీలు.. ఐదు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు భారీగా అక్రమాస్తుల గుర్తింపు -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలన్నారు. , ఫిర్యాదులు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఆవ్వో పాండు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణిలో 65 వినతుల స్వీకరణ -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
మోపాల్: మోపాల్ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఏ గంగాధర్ (52) గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్కు చెందిన ఏ గంగాధర్ 1998లో పోలీస్శాఖలో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మోపాల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధుల్లో భాగంగా మండలంలోని గుడితండాలో నిర్వ హించిన గ్రామసభకు హాజరయ్యాడు. విధులు పూర్తి చేసుకుని మధ్యా హ్నం సమయంలో నగరంలోని రోటరీనగర్లోగల తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో భార్య, కుమారుడు ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తు న్న క్రమంలోనే తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యబృందం అత్యవసర చికిత్సతోపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయ న స్పందించలేదు. తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గంగాధర్ కుమారుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటు న్న ఆ కుటుంబానికి కుటుంబ పెద్ద కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. కాగా గంగాధర్ ఆకస్మిక మరణం పోలీస్శాఖకు తీరని లోటు అని, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీసు అని సీఐ సురేష్కుమార్, ఎస్సై సుస్మిత పేర్కొన్నారు. ఆయన మృతికి వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగాధర్ అంత్యక్రియలు బషీరాబాద్లో మంగళవారం నిర్వహించనున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. -
క్రైం కార్నర్
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి నవీపేట : మండలంలోని అంజుమన్ ఫా రం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీపేట్కు చెందిన మహ్మ ద్ గౌస్(30) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. నిజామాబాద్ మండలం పాల్ద గ్రామంలోని అత్తగారింటికి బైక్పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడడంతో గౌస్ తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో మరొకరు.. ఇందల్వాయి: బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై సుమలత తెలిపిన వివరాలు.. తిర్మన్పల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోశయ్య (82) ఇందల్వాయి నుంచి సోమవారం సాయంత్రం తన స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా ఇందల్వాయి నుంచి ధర్పల్లి వైపు వెళ్తున్న టిప్పర్ ఢీట్టింది. తీవ్ర గాయాలపాలైన పోచయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడు రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ.. నాగిరెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన దూదేకుల అజీమ్ (73) చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నడుచుకుంటూ వెళ్తు న్న అజీమ్ను వెనక నుంచి ఆటో ఆదివారం ఢీకొట్టిందన్నారు. గాయాలపాలైన అజీమ్ మెదక్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతు సోమవారం మృతి చెందాడని తెలిపారు. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అక్రమార్కులపై చర్యలేవీ?
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు జరిపి రెండున్నర నెలలు దాటాయి. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయా విభాగాల్లో అవినీతి జరిగిందని తేలినా ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కామారెడ్డి బల్దియాలోని పలు విభాగాలపై ఈ ఏడాది మార్చి 16న ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రోజంతా సోదాలు చేసి పలు విభాగాలలో అవినీతి గుట్టు రట్టు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో 25 మందికిపైగా అధికారులు, సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమాలను ప్రభుత్వానికి, సీడీఎంఏకు నివేదించారు. కానీ రెండున్నర నెలలు గడిచినా ఇప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అవినీతి జరిగిందని తేలినా... మున్సిపాలిటీలో అక్రమార్కులు ఏ విభాగాన్నీ వదలకుండా మేసేశారు. టౌన్ ప్లానింగ్, సానిటేషన్, ఇంజినీరింగ్, అకౌంట్స్.. ఇలా ప్రతిచోటా అవినీతికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులు ఇవ్వడం, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలోని సుమారు 400 వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోయినా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా బల్దియాకు రావాల్సిన రూ. కోటి ఆదాయం పక్కదారి పట్టింది. శానిటేషన్ విభాగంలో డీజిల్ బిల్లుల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. మున్సిపల్ వాహనాలకు నెలకు రూ. 12.40 లక్షల డీజిల్ ఖర్చు చూపిస్తూ, దానికి సంబంధించిన కనీస లాగ్ బుక్కులను కూడా నిర్వహించకపోవడం గమనార్హం. పారిశుద్ధ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా, వారికి పూర్తి నెల జీతం చెల్లించినట్లు రికార్డులు సృష్టించి ప్రతినెలా రూ. లక్షల్లో నొక్కేసినట్లు తేలింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో భవన అనుమతుల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. పట్టణంలో అక్రమంగా నిర్మించిన 47 భవనాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డిసెంబర్ 2025 నుంచి వచ్చిన 169 భవన నిర్మాణ దరఖాస్తుల్లో 18 అప్లికేషన్లను నిర్ణీత 21 రోజుల గడువు దాటినా పెండింగ్లో ఉంచారు. ఈ వ్యవహారంలో దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తూ, లంచాల కోసం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. సోదాల సమయంలో సుమారు 18 గంటల పాటు మున్సిపల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఏసీబీ బృందం.. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమాలపై సాక్ష్యాలను సేకరించింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదికను కూడా సమర్పించారు. దాడులు జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనలేదు. నోటీసులు అందుకున్న అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అవినీతి అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏసీబీ నివేదిక ఆధారంగా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెండున్నర నెలల క్రితం కామారెడ్డి బల్దియాలో ఏసీబీ సోదాలు సానిటేషన్, డీజిల్ బిల్లులు, జీతాల్లోనూ అవకతవకల గుర్తింపు నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులు.. బాధ్యులకు నోటీసులతోనే సరి.. -
ఇసుక వ్యాపారులకు నోటీసులు
భిక్కనూరు: మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు మండల రెవెన్యూ అధికారులు సోమవారం నోటీసులు జారీచేశారు. అక్రమ దందాపై ‘సాక్షి’ దినపత్రికలో జోరుగా ఇసుక అక్రమ దందా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు నోటీసులను జారీచేశారు. అనుమతులు లేకుండా ఇసుక వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసులో హెచ్చరించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలానికి 2026–27 విద్యాసంవత్సరానికిగాను ఎనిమిది ప్రీప్రైమరీ సెక్షన్స్ పాఠశాలలు మంజూరు అయినట్లు ఎంఈవో యూసెఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. సదాశివనగర్,ఽ ధర్మారావుపేట్, అడ్లూర్ఎల్లారెడ్డి, భూంపల్లి, లక్ష్మీనాయక్తండా, తిర్మన్పల్లి, కల్వరాల్, తిమ్మోజివాడిలలో పాఠశాలలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్గా పనిచేయడానికి ఇంటర్మీడియట్, ఆయాలుగా పనిచేయడానికి 7వ తరగతి వరకు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి):మండల కేంద్రంలోని ఎ మ్మార్సీ భవనంలో సోమవారం ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలను ఎంఈవో రామస్వామి పంపిణీ చేశారు. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవివే విద్యార్థుల కోసం 11,417 పుస్తకాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు, మూడు రోజులలో సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 15న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని అదేరోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. సర్పంచ్ విజయరాములు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యం
మానసిక ఉల్లాసం ● చౌట్పల్లిలో విద్యార్థుల యోగా సాధన ● ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్ శిక్షణ ● 13 ఏళ్ల వయస్సులో యోగా నేర్పుతున్న అనిరుధ్గౌడ్ యోగా శిక్షణ ఇస్తున్న అనిరుధ్గౌడ్మోర్తాడ్(బాల్కొండ): ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్లైన్లో క్లాసులు విని యోగాపై పట్టు సాధించిన 13 ఏళ్ల విద్యార్థి తన తోటి విద్యార్థులకు వేసవి సెలవుల్లో యోగా శిక్షణ ఇస్తున్నాడు. సెలవుల్లో ఏదో ఒక ప్రత్యేక అంశాన్ని నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న తనతోటి వారికి యోగా శిక్షణ ఇచ్చి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం బాట చూపాడు. అతడే కమ్మర్పల్లి మండలం చౌట్పల్లికి చెందిన సిలివేరి అనిరుధ్గౌడ్. స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న అనిరుధ్ తనతోపాటు చదువుకుంటున్న వారికి యోగా శిక్షణ ఇచ్చి మెలకువలను నేర్పిస్తుండడం విశేషం. విద్యార్థులు కూడా తమ వేసవి సెలవులను వృథాగా పోనివ్వకుండా యోగా నేర్చుకోవడంపై దృష్టి సారించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా శిక్షణ తరగతులను అనిరుధ్గౌడ్ నిర్వహిస్తున్నాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో యోగా క్లాస్లకు అటెండ్ అయ్యాను. యోగాతో మానసిక ఉల్లాసంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలుసుకున్న నేను నా తోటి విద్యార్థులకు అదే చెప్పాను. సెలవులు ప్రారంభం కాగానే యోగా శిక్షణ ఇవ్వాలని కోరడంతో రోజూ శిక్షణ ఇస్తున్నా. అందరూ ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. – అనిరుధ్గౌడ్, యోగా శిక్షకుడు యోగా శిక్షణ ద్వారా ఎంతో నేర్చుకున్నాం. యోగా క్లాసులు అనగానే మొదట ఏదో అనుకున్నాం. రెండు మూడు రోజులకే అన్నీ అర్థమయ్యాయి. మా సహచర విద్యార్థి అనిరుధ్ ఇచ్చిన శిక్షణ ఎంతో బాగుంది. యోగాతో ఆరోగ్యం బాగుటుందని తెలుసుకున్నాం. – రూపేశ్, చౌట్పల్లి యోగా సాధన ద్వారా చదువుపై పట్టు సంపాదించడానికి మార్గం దొరికింది. యోగా శిక్షణ అందరికీ అవసరమే. ఆరోగ్యం, మానసికి ప్రశాంతత ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. అది యోగాతోనే సాధ్యమని తెలుసుకున్నాం. ప్రతి సెలవుల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి. – శ్రీమై, చౌట్పల్లి అనిరుధ్ ఇచ్చే యోగా శిక్షణ బాగుంది. మాతోటి విద్యార్థి ఎన్నో ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తుండటం మాకూ శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఉత్సాహంగా రోజూ యోగా క్లాసులకు హాజరవుతున్నాం. మానసికంగా ప్రశాంతత లభిస్తోంది. – అక్షర, చౌట్పల్లి -
భారీ వర్షం.. తడిసిన జొన్నలు
నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండలంలోని శేర్ఖాన్పల్లి, సింగితం, తెల్గాపూర్ గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి జొన్నలు తడిసిపోయాయి. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన జొన్నలు అలాగే ఉన్నాయి. ఇంకా కాంటా వేయాల్సినవి కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. భారీ వర్షం కురియడంతో కుప్పల చుట్టూ నీరు నిలిచింది. బస్తాలూ తడిచిపోయాయి. శేర్ఖాన్పల్లి శివారులో తడిసిన జొన్న బస్తాలను సర్పంచ్ సాయమ్మ, జీపీవో గోవర్ధన్ పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. -
వడ్లెప్పుడు కొంటరు?
● అన్నారంలో రైతుల రాస్తారోకో ● రెండునెలలైనా కొనుగోళ్లు పూర్తవకపోవడంపై ఆగ్రహంరామారెడ్డి: వానాకాలం ప్రారంభమైనా వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం అన్నారంలో రాస్తారోకో చేశారు. ధాన్యం సంచులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రెండు నెలలవుతున్నా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండకు ఎండి ఇప్పటికే భారీగా తరుగు రూపంలో నష్టపోయామని, ఇప్పుడు వానలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ 70 మంది రైతులకు సంబంధించిన ధాన్యం కాంటా కావాల్సి ఉందన్నారు. ధాన్యం సేకరణ నెమ్మదిగా సాగుతోందని గతంలో రోడ్డెక్కినా అధికారులు స్పందించలేదన్నారు. లారీలు సకాలంలో రావడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. -
ఆయకట్టు గట్టెక్కేనా?
సాగర్లో నీరున్నా..ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటినిల్వలు ఆశాజనకంగా ఉన్నా.. ఆయకట్టుకు నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటిని విడుదల చేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – నిజాంసాగర్● ప్రాజెక్టులో 7 టీఎంసీలపైనే నిల్వ ● పంటల సాగుపై ఎల్ నినో నీలినీడలు ● నీటి విడుదలపై స్పష్టత కరువు ● ఆందోళనలో రైతులునిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా ఖరీఫ్లో సుమారు 1.5 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రాజెక్టును నమ్ముకుని పలువురు రైతులు బోర్లు, బావుల కింద వానాకాలం పంటల సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులు దున్ని పెట్టుకున్నారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, ఎడపల్లి, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లో ఇప్పటికే నారుమళ్లనూ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నుంచి ఆయకట్టు కింద వరి నాట్లు వేయనున్నారు. ఆందోళన కలిగిస్తున్న ‘వాతావరణ’ం.. వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులను ఎల్ నినో ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున బోరుబావులు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసినా.. ఒకవేళ వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏమిటన్నది రైతులను వేధిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 771 టీఎంసీల నీరుంది. అయితే ఇందులో ఆవిరి, లీకేజీల రూపంలో 1.5 టీఎంసీలు తగ్గిపోతాయి. మరో అర టీఎంసీ మేర డెడ్స్టోరేజీ ఉంటుంది. ఖరీఫ్ పంటలు గట్టెక్కడానికి 9 టీఎంసీల వరకు నీరు అవసరం. దీంతో ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసినా వర్షాలు కురియకపోతే పంటలు గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కాగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తారో లేదోనని సందేహిస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి స్టేట్ లెవల్ కమిటీ ఫర్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (స్కివమ్) కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు). అయితే యాసంగి పంటల సాగు సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో 1,405 అడుగులు 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆయకట్టు కింద సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆయకట్టు పంటల అవసరాల కోసం ప్రాజెక్టు 6 విడతల్లో 12.289 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కాగా జనవరిలో సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇందులో 4.592 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టును చేరాయి. నిజాంసాగర్లో అంతకుముందు ఉన్న నీరు, సింగూరు జలాలు కలిపి 10 టీఎంసీలపైనే నీరుండాలి. కానీ ప్రస్తుతం 7.1 టీఎంసీలు మాత్రమేఉన్నాయి. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసి జల చౌర్యానికి పాల్పడుతుండడంతోపాటు లీకేజీలు, ఆవిరి రూపంలో సుమారు 3 టీఎంసీలు ఖాళీ అయ్యాయి.నిజాంసాగర్ ఆయకట్టు కింద వానాకాలం పంటల కోసం నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. స్కివమ్ కమిటీ ఆదేశాల మేరకు నీటి కేటాయింపులు ఉంటాయి. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటిని విడుదల చేస్తాం. – కిమ్యానాయక్, నీటిపారుదలశాఖ ఈఈ, నిజాంసాగర్ -
నాన్ కమాండ్ ఏరియాకు సాగునీరు
వర్ని: నిజాంసాగర్ కాలువ ఎగువన ఉన్న నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు ఈ ఖరీఫ్లో సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. రూ.106 కోట్లతో నిర్మాణం చేపట్టిన జాకోర, చందూర్ లిఫ్ట్ల పనులు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోమవారం జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్ను, సభాస్థలిని, హెలీప్యాడ్న్ ఆయన పరిశీలించారు. జాకోరా లిఫ్ట్ ద్వారా కాలు వ ఎగువ భాగాన ఉన్న 25 వేల ఎకరాలకు, చందూర్ పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షా 80 వేల ఎకరాల పంట సాగవుతుందని నాన్ కమాండ్ ఏరియా రైతులకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్బాబా, పీసీసీ డెలిగేట్ రాజిరె డ్డి, తహసీల్దార్ ప్రశాంత్కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, సర్పంచ్ సాయిలు నాయకులు, కరణం సాయిరెడ్డి, బారీ, గిరి, వీర్రాజు పాల్గొన్నారు. -
స్కేటింగ్ నేర్చుకున్నా..
హాయ్ ఫ్రెండ్స్... నా పేరు డీజీ అన్విక్ష్ భీమ్. నా స్వగ్రామం వేల్పూర్. వేసవి సెలవుల్లో నిజామాబాద్లో ఉండే అమ్మమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కేటింగ్ శిక్షణలో పాల్గొంటున్నాను. మొదటిసారి స్కేటింగ్ షూస్ ధరించినప్పుడు కొంచెం భయంగా అనిపించింది. కానీ ప్రతిరోజూ సాధన చేయడంతో, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా స్కేటింగ్ చేస్తున్నాను. వేసవి సెలవులను ఆనందంగా, ఉపయోగకరంగా గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. -
కాంట్రాక్టర్ల తిరుగుబాటు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారితో పాటు కీలక నాయకులు తమను పట్టించుకోవడం లేదని, చివరకు అధికార యంత్రాంగం సైతం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామాల పాలనలో కీలకంగా వ్యవహరిస్తూనే అప్పులు చేసి మరీ పనులు చేస్తున్న సర్పంచ్లు, పంచాయతీల పాలకవర్గాలు సైతం ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందంటూ ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బహిరంగంగానే తమ అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని సర్పంచ్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నతరహా, మధ్యతరహా, పెద్దతరహా అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లూ తమకు బిల్లులు ఇవ్వకపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్టర్లు చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. 1941లో ఏర్పాటై జాతీయ స్థాయి సంస్థగా ఉన్న ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో ‘మా హక్కు–మా బిల్లులు–రాష్ట్ర అభివృద్ధి’ అనే నినాదంతో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్లో కాంట్రాక్టర్లు రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సన్నాహక సమావేశంపై మాట్లాడారు. ఇందులో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కార్యదర్శి భాస్కర్రెడ్డి, ప్రమోద్రెడ్డి, సురేందర్రావు, బాగారెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల చేశారు. పదేళ్లుగా చెల్లింపులు లేవు.. గత పదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.25 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్రెడ్డి, భాస్కర్రెడ్డి తెలిపారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రతి ప్రాంతంలో, పట్టణంలో, గ్రామంలో అభివృద్ధి చూపిస్తున్న తమకు బిల్లులు ఇవ్వకపోవడం భావ్యం కాదన్నారు. కాంట్రాక్టర్లు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. తమవద్ద పనిచేస్తున్న వాళ్లకు జీతాలు ఇవ్వలేకపోతుండడంతో పాటు అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నామన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి క్లాస్–1 కాంట్రాక్టర్ స్థాయి వరకు బిల్లులు రాక ఆత్మహత్యల దిశగా పలువురు వెళుతున్నారన్నారు. ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు గుండెపోట్లతో మరణించారన్నారు. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మేఘా, నవయుగ లాంటి బడా కాంట్రాక్టర్లుకు మాత్రం ఎప్పటికప్పుడు వేలకోట్లు చెల్లింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని దాదాపు అందరు చిన్న, పెద్ద కాంట్రాక్టర్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు బ్యాంకు తనఖాల్లోనే ఉన్నాయన్నారు. ఇక మున్సిపాలిటీల్లో అయితే అనేక గ్రాంట్లు వస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడం శోచనీయమన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే మరిన్ని అభివృద్ధి పనులు కాలాతీతం లేకుండా పూర్తి చేస్తామన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు రూ.2 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పనులు చేసే కాంట్రాక్టర్లకు అదే స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం తమపై చిన్నచూపు వదిలేసి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రీన్చానల్ విధానం అన్ని చెప్పినప్పటికీ అది కూడా ఒకటిరెండు రోజులకే పరిమితం అయిందన్నారు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించి ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నాం.. ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయ్.. 18న ‘చలో హైదరాబాద్’కు ఇందూరులో సన్నాహక సమావేశం -
డీఎంహెచ్వోగా వెంకటి బాధ్యతల స్వీకరణ
కామారెడ్డి టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో)గా జె.వెంకటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ డీఎంహెచ్వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై కామారెడ్డికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఇన్చార్జి డీఎంహెచ్వోగా విధులు నిర్వహించిన రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్ఎంవోగా తిరిగి విధుల్లో చేరారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులకు అంచనాలు తయారీ చేసి కలెక్టర్ ద్వారా మంజూరు పొందాలని డీఆర్డీవో దామోదర్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం, హౌసింగ్ అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను లబ్ధిదారులకు చెల్లించాలన్నారు. ఎల్లారెడ్డి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న తెలంగాణ క్రికెట్ పోటీల్లో (టీజీ–20) జిల్లా యువకుడు విక్రాంత్రెడ్డి ఆడబోతున్నారు. ఎల్లారెడ్డికి చెందిన సత్యంరెడ్డి కుమారుడైన విక్రాంత్రెడ్డి బ్యాటింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. ఆయనను వేలంలో అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు ఎంపిక చేసుకుంది. విక్రాంత్రెడ్డికి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి దంపతులతోపాటు కాంగ్రెస్ నాయకులు, క్రికెట్ అభిమానులు అభినందనలు తెలిపారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం 62 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా ఒకరికి 3 రోజులు, మరొకరికి 2 రోజులు, 8 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 33 మందికి కలిపి రూ.73.05 వేలు జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి క్రైం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూ చించారు. సోమ వారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంటపని చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిసరాలు, ఆహార పదార్థాల పరిశుభ్రత పద్ధతులు పాటించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఆహార భద్రత, విద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆహార భద్రత జిల్లా అధికారి విక్రమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘కార్పొరేట్’ దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలి సుభాష్నగర్(నిజామాబాద్ అర్బన్): కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాల్లో తనిఖీ లు చేపట్టాలని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సందీప్కు వినతిపత్రం ఇచ్చారు. దాడులు నిర్వహించి వినియోగదారుల హక్కులను కాపాడాలని కోరారు. -
నేను గీసిన చిత్రం
శ్రీరాం ఘనతేజ, 5వ తరగతి, భీమ్గల్ శ్రీరాం కార్తికేయ, 5వ తరగతి, భీమ్గల్ పందిరి శాల్వి, 6వ తరగతి, జీవదాన్ హైస్కూల్, కామారెడ్డి. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
నేరస్తుల సమాచారాన్ని నమోదు చేయాలి
నిజామాబాద్అర్బన్: నేరాలు, నేరస్తుల సమాచా రాన్ని సీసీ టీఎన్ఎస్ 2.0 (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్)ద్వారా వేగవంతంగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించా రు. సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. దర్యాప్తు ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ప్రజలకు అందించే సేవలను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడంపై దిశా నిర్దేశం చేశారు. ఈ – సాక్ష్య వ్యవస్థ ద్వారా నేర సంఘటనలకు సంబంధించి డిజిటల్ ఆధారాలను సేకరించడం భద్రత పరచడం, కోర్టు విచారణలో సమర్పించే విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడం, సేవల్లో నాణ్యతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు, ఇన్చార్జి సీపీ రాజేశ్చంద్ర, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్తో శారీరక దృఢత్వం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లా కేంద్రంలో ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ సైకిల్ ర్యాలీకామారెడ్డి టౌన్ : సైక్లింగ్తో శారీరక దృఢత్వం లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్ను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్‘ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో యాంత్రిక జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల శారీరక దృఢత్వం పెంపొందడమే కాకుండా కాలుష్య నియంత్రణలోనూ భాగస్వాములం కావొచ్చన్నారు. యువత, విద్యార్థులు బైక్లపై చూపించే శ్రద్ధను సైక్లింగ్పై పెట్టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్రెడ్డి, ఆయా శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అలరించిన ఆర్కెస్ట్రా బృంద ప్రదర్శన
డిచ్పల్లి: మండలంలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్లో నూతనంగా ఏర్పాటైన ఆర్కెస్ట్రా బృందం ఆదివారం నిర్వహించిన ప్రదర్శన ఎంతో అలరించింది బెటాలియన్ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ సంగీత ప్రదర్శనతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. వారు పాత, కొత్త సినీ మధుర గీతాలను ఆలపిస్తూ, దానికి తగ్గట్టుగా వాయిద్యాలను వాయిస్తూ అందరినీ ఆశ్చ ర్యంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా బెటాలియ న్ కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. బృందాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు గానూ ఇన్చార్జి 8వ బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీసుల విధుల్లో ఉండే ఒత్తిడిని దూరం చేయడానికి, సిబ్బంది మానసిక ఉల్లాసానికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కమాండెంట్ పేర్కొన్నారు. అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
వర్షాకాలానికి సూచిక.. మృగశిర కార్తె వేడుక
● నేడు ఘనంగా జరుపుకోనున్న ప్రజలు ● జిల్లావ్యాప్తంగా చేపలు, మామిడి పండ్లకు పెరిగిన డిమాండ్ నిజామాబాద్ రూరల్: తొలకరి చినుకులు పడే మృగశిర కార్తె సోమవారం ఆరంభం అవుతుంది. సంప్రదాయం ప్రకారం మృగశిర కార్తె ప్రారంభమైన వెంటనే కొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు పడటం మొదలవుతుందని పెద్దలు చెబుతుంటారు. భారీ వర్షాలు సాధారణంగా మృగశిర రెండో వారంలో లేదా ఆరుద్ర కార్తె ప్రారంభానికి దగ్గరగా నమోదవుతుంటాయి. సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు ఈ రోజున ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. మరికొందరు చేపలు ఆహారంగా తీసుకుంటారు. మామిడి పండ్లను కూడా తింటారు. మృగశిర కార్తె రోజు నుంచి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి ఇంగువ బెల్లం, చేప మందు దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నగరంలో చేపల మార్కెట్, మామిడిపండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. -
ఆర్టీఏ చలాన్ పేరుతో సైబర్ మోసం
● రూ.95వేలు పోగొట్టుకున్న బీర్కూర్ యువకుడు బాన్సువాడ: సైబర్ నేరగాళ్ల మోసంతో ఓ యువకుడు బ్యాంకు ఖాతాలోని రూ.95 వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు ఇలా.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మజర్ అనే యువకుడు ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న తన వాట్సప్కు ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్ వచ్చింది. దీంతో సదరు యువకుడు ఆ లింక్ను క్లిక్ చేసి అందులో ఉన్న వివరాలు నమోదు చేశాడు. ఈనెల 3న మజర్ తన బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ చేశాడు. ఈ నెల 6న విడతల వారీగా 15 నిమిషాల వ్యవధిలో రూ.95 వేలు మాయమయ్యాయి. దీంతో బ్యాలెన్సు చూసుకోగా రూ.95 వేలు డ్రా అయినట్లు చూపించడంతో వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు. డిచ్పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గురుముఖ్ సింగ్ అనే వ్యక్తి తన టీవీఎస్ మోపెడ్పై బస్టాండ్ వైపు నుంచి నాగ్పూర్ గేట్ వైపు బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలో అతడి వాహనాన్ని వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో గురుముఖ్ కిందపడగా, లారీ టైరు అతడి కాలు పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ బ్రాహ్మణకుంట బాధిత కుటుంబాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణకుంటలో ఇటీవల ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బాధిత కుటుంబీకులను ఎమ్మెల్యే ఓదార్చి, రూ. 18వేల ఆర్థిక సహాయం అందజేశారు. భీమ్గల్ తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంపీడీవో సంతోష్కుమార్తోపాటు ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రమాదానికి కారణమైన బ్రాహ్మణ కుంటను పరిశీలించారు. అధికారులు వెంటనే కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా కుంటను పూడ్చివేసే చర్యలను పరిశీలించాలని సూచించారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలానికి చెందిన దమ్మన్నగారి సాయిరెడ్డి(50) కువైట్లో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. సాయిరెడ్డి బతుకు దెరువు కోసం గత కొన్ని సంవత్సరాలుగా కువైట్ దేశానికి వెళుతున్నాడు. కాగా ఈనెల ఆరవ తేదీన విధినిర్వహణలో ఉండగా ఆకస్మాత్తుగా సాయిరెడ్డికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ఈవిషయం కుటుంబసభ్యులకు తెలియడంతో రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య శిరీష, కుమారుడు సుభాన్ రెడ్డి ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి సాయిరెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తొందరగా రప్పించాలని కోరారు. -
వేతనాలు ఇక్కడ!
సేవలక్కడఎల్లారెడ్డి పశువుల ఆస్పత్రిఎల్లారెడ్డిలోని డివిజన్ స్థాయి పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుతోపాటు ఒక వెటర్నరీ అసిస్టెంట్, రెండు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులున్నాయి. ఈ ఆస్పత్రికి ఏడీగా 2024 ఆగస్టులో బదిలీపై వచ్చిన ఉద్యోగి.. నెల రోజులు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఎక్కడో దూరంగా ఉన్న నారాయణపేట జిల్లాకు డిప్యుటేషన్పై వెళ్లారు. అప్పటినుంచి అక్కడే సేవలందిస్తున్న ఆయన.. వేతనం మాత్రం ఎల్లారెడ్డిలో పొందుతుండడం గమనార్హం. ఇదే ఆస్పత్రికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సైతం డిప్యుటేషన్పై తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ పశువుల ఆస్పత్రి వెళ్లడం గమనార్హం. ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఏడాదిన్నరగా నిజాంసాగర్ పశువుల ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలా రెగ్యులర్ ఉద్యోగులు తమకు అనువైన స్థానాలకు డిప్యుటేషన్పై వెళ్లగా.. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. రెగ్యులర్ పోస్టింగ్ ఉన్న స్థానంలో ఉద్యోగుల కొరత ఉన్నా అందరూ డిప్యుటేషన్లపై వెళ్లడం, అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైద్యులు లేకపోవడంతో అటెండరే తనకు తెలిసిన అరకొర వైద్య సేవలు అందిస్తున్నారు. మత్తమాల పశువైద్యాధికారిపై భారం.. మత్తమాలలో పనిచేస్తున్న పశువైద్యురాలికి మండలంలోని వెల్లుట్ల పశువుల ఆస్పత్రి ఇన్చార్జి బాధ్యతలతోపాటు ఎల్లారెడ్డి ఆస్పత్రి బాధ్యతలూ అప్పగించారు. మండలంలోని రెండు పశువుల ఆస్పత్రులతో పాటు అదనంగా ఎల్లారెడ్డిని కూడా అప్పగించడంతో ఆమైపె అదనపు భారం పడుతోంది. అయినా పశువులకు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు అత్యవసరమైతే ఎల్లారెడ్డికి వచ్చి సేవలందిస్తున్నారు.ఎల్లారెడ్డి ఆస్పత్రి వైద్యుడు డిప్యుటేషన్పై ఇతర ప్రాంతానికి వెళ్లడంతో ఇక్కడ ఇన్చార్జి ఏడీ బాధ్యతలను నాగిరెడ్డిపేట వైద్యుడికి అప్పగించారు. అయితే సొంత మండలంలో సేవలందించడానికే ఎక్కువ కేటాయించాల్సి వస్తుండడంతో ఆయన చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని పశుపోషకులు అంటున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమావేశాలకు మాత్రమే ఆయన హాజరవుతున్నట్లు తెలుస్తోంది.ఎల్లారెడ్డి ఆస్పత్రిలో సేవలందించేందుకు ని యమితులైన వైద్యులు తమకు అనువైన ప్రాంతాల కు డిప్యుటేషన్ వేయించుకుని వెళ్లడంతో పశువుల కు సకాలంలో సరైన వైద్య సేవలు అందడం లేదు. దీంతో పశుపోషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్లను రద్దు చేసి ఎక్కడి వైద్యులకు అక్కడికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా డిప్యుటేషన్లపై ‘సాక్షి’ జిల్లా పశువైద్యాధికారి(డీవీఏహెచ్వో) భరత్ను వివరణ కోరగా జిల్లాలో పశువైద్యులు, సిబ్బంది కొరత త్వరలోనే తీరుతుందన్నారు. ఎల్లారెడ్డి ఆస్పత్రికి కూడా సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమిస్తామన్నారు.ఎల్లారెడ్డిలోని డివిజన్ స్థాయి పశు వైద్యశాలలో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులంతా డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో స్థానికంగా పశువులకు సరైన సేవలు అందడం లేదు. దీంతో పశుపోషకులు ఇబ్బందిపడుతున్నారు. – ఎల్లారెడ్డి అనువైన ప్రాంతాలకు ఉద్యోగుల డిప్యుటేషన్ సమావేశాలకే పరిమితమవుతున్న ఇన్చార్జి.. ఎల్లారెడ్డి పశువుల ఆస్పత్రిలో అందని వైద్యసేవలు -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులుసాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. -
బీఎల్ఏలే పార్టీకి పునాది
● ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి టౌన్ : బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి బలమైన పునాది లాంటివారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తల ప్రత్యేక శిక్షణ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వెంటనే గుర్తించి సరిచేయించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ సూచించారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు బీఎల్ఏల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంఘం నిబంధనలు, డిజిటల్ విధానాల వినియోగంపై మాస్టర్ ట్రైనర్ రోహిత్రావు అవగాహన కల్పించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయకులు సందీప్, శ్రీనివాస్, అంజాద్, లడ్డు, అఖిల, ఫెరోజ్ సుల్తానా, కళ్లెం సావిత్రి, యూనుస్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలు మీరూ పంపండి..
నేను గీసిన చిత్రం83328 87332ఎం లక్ష్యతేజ్ రెడ్డి 3వ తరగతి బోధన్ టి అతిశయ 7వ తరగతి నిర్మల్ రెమ్మ అభిత 5వ తరగతి మెంట్రాజ్పల్లి వి. శ్రేయాన్ నిజామాబాద్ ప్రజ్ఞ యోదిత 2వ తరగతి దేశాయిపేట్ గ్రామం సాత్విక్ 4వ తరగతి జానకంపేట మం: ఎడపల్లి జిల్లా: నిజామాబాద్ అక్షయ్ కుమార్ 7వ తరగతి ముత్యంపేట్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
తాగు నీటి కోసం నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: బోధన్ పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. బోధన్లోని బెల్లాల్ చెరువును నింపనున్నారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నాలుగు రోజుల పాటు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాలువ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ తూముల ద్వారా నీటిని విడుదల చేయవద్దని రైతులకు సూచించారు. ఎల్లారెడ్డి: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించిందని, ఈనెల 15న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండ తీవ్రతతోపాటు ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండడంతో సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి అర్బన్: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆదివారం జిల్లా జట్లను ఎంపిక చేశారు. కామారెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్–11, 13, 15, 17, 19 విభాగాలలో బాలబాలికలకు, మాస్టర్స్ విభాగంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో కలిపి 60 మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు ఎంపిక చేశామని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్గౌడ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు కేటగిరీలవారీగా ఫిబ్రవరి వరకు ఉంటాయని పేర్కొన్నారు. భిక్కనూరు: హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో వారం రోజులుగా జరుగుతున్న మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్లో భిక్కనూరుకు చెందిన రిశ్విత సత్తాచాటింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోటీలో మరో క్రీడాకారుడితో కలిసి రిశ్విత అద్భుత ప్రతిభ చూపి బంగారు పతకం సొంతం చేసుకుంది. రిశ్విత కామారెడ్డిలోని పూలే గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. -
‘ధరణి టౌన్షిప్పై కోర్టుకు వెళ్తాం’
కామారెడ్డి అర్బన్: ధరణి టౌన్షిప్ పేరుతో నాలుగేళ్ల క్రితం ప్లాట్లు విక్రయించిన ప్రభుత్వం.. అందులో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని రాజీవ్ స్వగృహ ధరణి టౌన్షిప్ బాధితుల సంఘం అధ్యక్షుడు రాజనర్సింహారెడ్డి విమర్శించారు. ఆదివారం కామారెడ్డి శుభం కన్వెన్షన్ ప్రాంగణంలో గౌరవ అధ్యక్షుడు కై లాస్ రాజేశ్వర్రావుల సమక్షంలో టౌన్షిప్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనర్సింహారెడ్డి మాట్లాడుతూ టౌన్షిప్లో సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబితే ఇళ్లు, ప్లాట్లు కొనుక్కున్నామని, ఇప్పటివరకు రోడ్డు, విద్యుత్, నీటి సరఫరా వంటి కనీస మౌలిక సౌకర్యాలేవీ కల్పించలేదని పేర్కొన్నారు. మాట తప్పిన ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో ప్లాట్ల కొనుగోలుదారులు జస్వంత్రావు, చీల శ్రీనివాస్, కేదార్, భుజంగరావు, వెంకటరాములు, చక్రం, చంద్రయ్య, శ్రీనాథ్, శ్రీనివాస్, శివరాజయ్య, రాజ్గంభీర్రావు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, నవీన్కుమార్, శ్రీనాథ్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మృగశిర కార్తె
కామారెడ్డి అర్బన్: తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే కాలాలను ఆయా నక్షత్రాల పేరుతో కార్తెలు అని పిలుస్తారు. ఏడాదిలో 27 కార్తెలు వస్తాయి. ఒక్కో కార్తె సుమారు 15 రోజులు ఉంటుంది. అయితే రైతులు మాత్రం వర్షాకాలం ముందు వచ్చే రోహిణితోపాటు వర్షాకాలంలో వచ్చే మృగశిర (మిర్గం), ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త కార్తెలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయా కార్తెలను గుర్తు పెట్టుకుని ఆకాశం వైపు ఆశగా చూస్తారు. మృగశిర కురిస్తే.. రోహిణిలో ఎండకు రోళ్లు పగిలేంతగా ఎండలు కాస్తాయని, ఆ సమయంలో విత్తనాలు వేయొద్దని రైతులు భావిస్తారు. మృగశిర సాధారణంగా జూన్ 8న ప్రారంభమవుతుంది. దీనిని రైతులు పండుగలా జరుపుకుంటారు. వాతావరణం చల్లబడి వర్షాలు కురిసి సాగు పనులు మొదలయ్యే కాలమిది. మృగశిర కురిస్తే ముల్లోకాలు చల్లబడతాయని, ఈ కార్తెలో వర్షం కురిస్తే వచ్చే అయిదు కార్తెలూ వర్షిస్తాయని రైతులు నమ్ముతారు. ఇంగువ, బెల్లం ప్రసాదం.. ఆరోగ్యం కోసం మిర్గం రోజు ఇంగువ, బెల్లం కలిపి ప్రసాదంలా తీసుకుంటారు. ఈ రెంటిని కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసి పరగడుపున తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, వాతావరణంలో మార్పులతో ఎదురయ్యే రుగ్మతలనుంచి ఇది కాపాడుతుందని ప్రజలు నమ్ముతారు. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి ఇంగువ, బెల్లం దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు.మిర్గంగా పిలుచుకునే మృగశిర కార్తె రోజున భోజనంలో మాంసాహారం తప్పనిసరిగా ఉంటుంది. మృగశిర అనగానే గుర్తుకు వచ్చేది చేపలే.. ఈ కార్తె రోజున చేపలకూర తినడం ఆనవాయితీగా వస్తోంది. మిర్గం రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలు పొందేందుకు చేపలు తినాలంటారు. ఉబ్బసంతో బాధపడుతున్నవారికి పలుచోట్ల చేపలమందు వేస్తారు. మృగశిర కార్తె సోమవారం ప్రారంభమవుతుంది. అయినా ఆదివారమే చేపల మార్కెట్లు కళకళలాడాయి. -
‘మహా’ ఇసుక దోపిడీకి పాతికేళ్లు
బోధన్: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మంజీర నదిలో ఇసుక తవ్వకాల సరిహద్దు వివాదం 25 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవండం లేదు. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు హద్దులు దాటి మన భూభాగంలోకి చొరబడి ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా ప్రతిఏటా రూ. కోట్ల విలువైన ఇసుక దోపిడీకి గురవుతోంది. తాజాగా సాలూర మండలం హున్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో మన భూభాగంలో చొరబడి మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. హున్సా, మందర్నా గ్రామస్తులు గుర్తించి ఫిర్యాదు చేయగా సాలూర మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించారు. మన హద్దులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ నెల 3న మన రెవెన్యూ, పోలీసు అధికారులు బోలేగాం క్వారీలోకి వెళ్లి ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో మహారాష్ట్ర గ్రామాల ప్రజలు వాదనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి మంజీర నదిలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. అయితే నిర్ణీత తేదిన జాయింట్ సర్వేకు సాలూర మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లినప్పటికీ మహారాష్ట్ర అధికారులు హాజరు కాలేదు. దీంతో సరిహద్దుల వివాదం మరోసారి వాయిదా పడింది. సరిహద్దు గ్రామాలు.. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పోతంగల్, సాలూర, బోధన్ మండలాల్లోని పోతంగల్, సుంకిని, కారేగాం, మందర్నా, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గేల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గాం గ్రామాలు మంజీర నది సరిహద్దులో ఉన్నాయి. నదికి అవతలి వైపు నాందేడ్ జిల్లాలోని బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలోని నాగిని, గంజ్గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలీ, శాకాపూర్ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలున్నాయి. గంజ్గాం, బోలేగాం, ఎస్గీ, కార్ల, సగ్రోలి ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. గతంలో 2011 నుంచి 2016 వరకు వరుసగా ప్రతి ఏటా హున్సా–మందర్నా, సుంకిని గ్రామస్తులకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామస్తులతో సరిహద్దు వివాదం నెలకొంది. జాయింట్ సర్వే, ఇసుక తవ్వకాల విషయంలో పలుసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంజీరలో ఇసుక తవ్వకాల వల్ల మన భూభాగంలోని తీర ప్రాంత గ్రామాలకు భూర్భజలాల ముప్పు తన్నుకొస్తుంది. నది తీర ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు లేవు. కరెంట్ బోరుబావులే పంట సాగుకు ప్రధాన జలవనరుగా ఉన్నాయి. పలు ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలు మంజీర జలాలపై ఆధారపడి పని చేస్తున్నాయి. ● ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన గంజ్గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలి క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి. మంజీర నదిలోని మన హద్దుల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాల సమస్య ఏర్పడుతుందని నది తీరంలోని మన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.మన భూభాగంలోని మంజీర నదిలో మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాల విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. తద్వార ఇసుక తవ్వకాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం. – అజ్మత్ నవాజ్, సాలూర తహసీల్దార్ మంజీరలో ఎడతెగని సరిహద్దు వివాదం మన భూభాగంలో తవ్వకాలు జరుపుతున్న మహారాష్ట్ర కాంట్రాక్టర్లు జాయింట్ సర్వేకూ డుమ్మా కొడుతున్న పొరుగు రాష్ట్ర అధికారులు -
మున్నూరుకాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తాం
● చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ ● విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంనిజామాబాద్ రూరల్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ సేవలను విస్తరిస్తామని చైర్మన్ బొమ్మ శ్రీరా మ్ చక్రవర్తి పటేల్ అన్నారు. నగరంలోని ప్రగతిన గర్ మూన్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రభు త్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థులకు ‘ప్రతిభా పు రస్కారాలు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడా రు. ప్రతి జిల్లాలోని సంఘ కార్యాలయాల్లో, కల్యా ణ మండపాల్లో కార్పొరేషన్కు సంబంధించిన స మాచారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. కాపు సోదరుల కుటుంబాల అభ్యున్నతికి జిల్లా క మిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రంతో గోల్డ్ మెడల్ శాలువాతో సత్కరించారు. సభాధ్యక్షులుగా తోట రాజశేఖర్, ప్రతినిధులు అబ్బపూర్ రవీందర్, బుస్స ఆంజనేయులు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ రాంభూపాల్, బొబ్బిలి నర్స య్య, గోపి, సురేష్ పాల్గొన్నారు. -
మెదడుకు మేత.. చెస్ ఆట
బోధన్: చెస్ (చదరంగం) ఒక ఆటే కాదు.. మెదడుకు మేత వంటిది. మేధో వికాసానికి, విమర్శనాత్మక ఆలోచనకు ఒక చక్కని శిక్షణ. చదువుతోపాటు చదరంగం (చెస్) ఆడటం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు అద్భుతంగా మెరుగవుతాయని చెస్ సీనియర్ కోచ్లు అంటున్నారు. చిన్న వయస్సులో చెస్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వ్యూహకర్తలుగా ఉన్నత స్థాయిలో రాణించేందుకు ఉపయోగకరమని పేర్కొంటున్నారు. ఈక్రమంలో బోధన్ పట్టణంలో ఇటీవల సాయిసామల చెస్ అకాడమీ ద్వారా చిన్నారులకు నెలపాటు చదరంగం ఆటలో శిక్షణ అందించారు. 30 రోజులు.. 44 మంది.. బోధన్ పట్టణానికి చెందిన యువకుడు సాయిబాబా సామల తాను నేర్చుకున్న చెస్ అటను నేటి, భావితరం బాలబాలికలకు అందించాలనే సంకల్పం, సేవాధృక్పథంతో కొత్తగా సాయి సామల చెస్ అకాడమీ ఏర్పాటు చేశారు. తొలిసారి అకాడమీ అధ్వర్యంలో పట్టణంలోని దయానంద్ గోశాల ఆర్యసమాజ్ ప్రాంగణంలో 6 ఏళ్ల వయస్సు పైబడిన బాలబాలికలకు ప్రత్యేకంగా చెస్ సమ్మర్ క్యాంప్ను 30 రోజుల పాటు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు నామ మాత్రపు ఫీజుతో మే 3 నుంచి జూన్ 2 వరకు శిబిరం కొనసాగించారు. డివిజన్ పరిధిలోని పట్టణ పరిసర మండలాలు, గ్రామాలకు చెందిన 44 మంది సమ్మర్క్యాంప్లో పాల్గొని చెస్లో తర్ఫీదు పొందారు. శిబిరం చివరి రోజు నిర్వహించిన ఫైనల్ టోర్నమెంట్లో పలువురు చిన్నారులు విశేష ప్రతిభ చాటారు. ముగింపు వేడుకల్లో పలువురు ప్రముఖులు విచ్చేసి, ప్రతిభ చూపిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. పట్టణంలో చిన్నారులకు ఇలాంటి శిక్షణ శిబిరం నిర్వహించడంపై పట్టణ ప్రజలు అకాడమీ నిర్వాహకులను అభినందించారు. బోధన్లో సాయిసామల చెస్ అకాడమీ నిర్వహించిన సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు చెస్ ఆటపై ఆసక్తితో మా గ్రామం నుంచి బోధన్లో ఏర్పాటు చేసిన సమ్మర్క్యాంప్కు వచ్చి శిక్షణ పొందాను. నిర్వాహకులు చాలా సులభమైన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆటపై మంచి పట్టు రావడంతో ఎంతో పురోగతి సాధించాను. –ఎంజీ హితేంద్ర, చెస్ క్రీడాకారుడు, గోవూర్, మోస్రా మండలంచెస్ ఆట నేర్చుకోవడం వల్ల చదువులో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించాను. 30 రోజుల పాటు సమ్మర్ క్యాంప్లో పాల్గొని శిక్షణ పొందాను. ఏ విషయంలోనైనా ముందుగా ఆలోచించడంతోపాటు, సరైన నిర్ణయం తీసుకోవడం నేర్చుకున్నాను. –ఎంఎస్ ధోనీ, చెస్ క్రీడాకారుడు, బోధన్ నేటి బాలబాలికలు ఎక్కువ సమయం డిజిటల్ వినోదాలకే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలలను వా టి నుంచి దృష్టిమళ్లీంచి వా రిలోని సృజనాత్మతకు పదు ను పెట్టాలనే ఆలోచనతో సమ్మర్ క్యాంప్ నిర్వహించాను. విశేష స్పందన లభించింది. –సాయిబాబా సామల, సాయి సామల చెస్ అకాడమీ కో–ఆర్డినేటర్, కోచ్, బోధన్ విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదలకు తోడ్పాటు బోధన్లో ఇటీవల క్యాంప్ నిర్వహించిన సాయిసామల చెస్ అకాడమీ -
జర్నలిస్టులకు రెయిన్కోట్ల పంపిణీ
కామారెడ్డి క్రైం: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపధ్యంలో క్షేత్రస్ధాయిలో విధులు నిర్వహించే జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో రెయిన్ కోట్లను శనివారం కలెక్టరేట్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజాసమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, డీపీఆర్వో తిరుమల, డీపీవో మురళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్లపై చెత్త వేయొద్దు
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ పరిధిలో చెత్త వేయవద్దని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 3, 4, 8, 9,18 వార్డుల్లో సభలు నిర్వహించారు. ఆయా వార్డుల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, జల్ సంచయ్–జల్భాగీదారి పథకం కింద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, మురుగు కాలువల పూడికతీత, శుభ్ర పరచడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు రేష్మబేగం, హకీం, రుక్మిణి, శ్యామల, పాశం ఆమని, కో– ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, నాయకులు ఎజాస్, సీఐ శ్రీధర్ ఉన్నారు. -
ఆర్యక్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
కామారెడ్డి అర్బన్/కామారెడ్డిటౌన్: ఛత్రపతి టీచర్స్ సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్, మెడిసిన్, ఇంజనీరింగ్ ఉన్నత విద్యాకోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులతో పాటు, వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన ఆర్యక్షత్రియలకు శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి టీచర్స్ సొసైటీ అధ్యక్షుడు ఎల్.వెంకట కృష్ణారావు, కార్యదర్శి మధు, కోశాధికారి కమలాకర్రావు, ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకటరావు, పట్టణ అధ్యక్షుడు బాలాజీరావు, ప్రతినిధులు రాజేశ్వరరావు, ఆనంద్రావు, దత్తాత్రి, మనోహర్రావు, కౌన్సిలర్లు గంగాధర్రావు, బి.వినోద తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: ముదిరాజ్లు మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను వినియోగించుకొని ఉన్నత చదువులు చదివి స్థిరపడాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. కామారెడ్డి సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో శనివారం ముదిరాజ్ పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మర్ పున్న రాజేశ్వర్, ముదిరాజ్ సంఘం నాయకులు, కౌన్సిలర్లు కాళ్ల రాజమణి, గణేష్, భానుప్రకాష్, అరవింద్, గంగారాజు, గజ్జల భిక్షపతి, రమేష్, లింబాద్రి, తదితరులున్నారు. పిట్లం(జుక్కల్): వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలను తప్పక పాటించాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. ఆయన శనివారం సిబ్బందితో కలిసి మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. వాహన ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ఫోర్ విలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని సూచించారు. బాన్సువాడ రూరల్: గ్రామాభివృద్ధికి సహకరించాలని కోనాపూర్ గ్రామ సర్పంచ్ ఎల్లగోని కిష్టవ్వ కోరారు. శనివారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రాజేష్ గ్రామసభ ఉద్దేశాలను వివరించారు. గ్రామంలో మురుగు కాల్వల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ కిష్టవ్వ వివరించారు. ఉపసర్పంచ్ బంజభూషణం, నాయకులు రాజేశ్వర్గౌడ్, హన్మాండ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న శ్రీపురం మంగ రచించిన బడి పాటను ఎంఈవో రాజగంగారెడ్డి శనివారం ఆవిష్కరించారు. మంగ ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే కలిగే మేలు, సౌకర్యాల గురించి రచించిన పాట ఎంతో బాగుందని ఆయన కొనియాడారు .తల్లిదండ్రులార ఆలోచించండి మన ఊరి బడిని కాపాడుకుందాం అంటూ ఆమె రచించిన పాట ఆలోచింపజేస్తుందన్నారు. సర్పంచ్ సాయగౌడ్, హెచ్ఎం ప్రసన్నదేవి తదితరులు పాల్గొన్నారు. -
తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచాలి
ఎల్లారెడ్డి: ప్రజలు తమ ఇంటిలో తడి, పొడి చెత్తను వే ర్వేరుగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ అ న్నారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4, 5, 6 వార్డులలో సభలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించనున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని సూచించారు. కౌన్సిలర్లు మంజుల, చంద్రయ్య, గఫార్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్ తదితరులున్నారు. -
రైతులకు అందుబాటులో ఉండాలి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డిబాన్సువాడ : గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు రైతులకు అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డిని, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్లను కలిసిన గ్రామ స్థాయి నాయకులు వారిని సన్మానించారు. ఆత్మ కమిటీ డైరెక్టర్గా గ్రామానికి చెందిన సందుల రవిని నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రైతులకు సేవ చేసే భాగ్యం అందరికి రాదని, నిరంతరం గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామ స్థాయి నాయకులు కాదేపురం గంగారాం, పండరి, ఇందూరు గజేందర్, అశోక్, రవి, కామప్ప, వడ్ల నాగయ్య తదితరులున్నారు. -
కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు ఊరుకోం
మద్నూర్(జుక్కల్): మద్నూర్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులు ప్రారంభించే వరకు ఊరుకోమని, దీని కోసం శాంతియుతంగా మా గళం వినిపిస్తామని యువకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాత రాష్ట్ర రహదారిపై శనివారం యువకులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2019లో మద్నూర్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులు ఇంత వరకు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. గతంలో ఉన్న పాలకులు, ప్రస్తుతం ఉన్న పాలకులు కేంద్రీయ విద్యాలయంపై నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏడేళ్లుగా కేంద్రీయ విద్యాలయం మొదలు కాలేదన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా ఫలితం కనపడకపోవడంతోనే రాస్తారోకో చేపట్టామని తెలిపారు. కనీసం కేంద్రీయ విద్యాలయం తాత్కలిక భవనంలో ప్రారంభించి శాశ్వత భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అనంతరం యువకులు తహసీల్దార్ ముజీబ్కు వినతి పత్రం అందించారు. వార్డు సభ్యుడు నరేష్, తుకారాం, సచిన్, సురేశ్, రవి, పెంటేశ్, పింకు, సంజు తదితరులున్నారు. -
మహిళల సంక్షేమమే సమాజ ప్రగతి
కామారెడ్డి టౌన్ : మహిళల భద్రత, బాలల సంక్షేమమే సమాజ ప్రగతికి బలమైన పునాదని ఏహెచ్టీయూ(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) ఎస్సై ఉస్మాన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని లేబర్ అడ్డాలో ఉమెన్ సేఫ్టీ వింగ్, జిల్లా ఏహెచ్టీయూ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కళాబృందం ఆటపాటలతో సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్లైన్ 1098 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఏహెచ్టీయూ కానిస్టేబుల్ రాజేందర్, కళాబృందం సభ్యులు ప్రభాకర్, సాయిలు, లేబర్ అడ్డా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాస్, డైలీ లేబర్ కార్మికులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్కు మోడల్ విద్యార్థుల ఎంపిక
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్)కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన డి.మహేందర్, రిషిక్ రెడ్డి, షేక్ అబ్దుల్లా, సంకీర్తన, డి.గీతిక, టి.రష్వితలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పరీక్షను 8వ తరగతిలో రాస్తారన్నారు. 9వ తరగతి పూర్తయిన తర్వాత ఏడాదికి స్కాలర్ షిప్ రూ.12 వేల చొప్పున వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మాట్లాడుతూ...పాఠశాల నుంచి స్కాలర్ షిప్కు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. -
వ్యాధుల కాలం.. జర పైలం
● దోమల నివారణతో రోగాలు దూరం ● కలుషిత నీటిని తాగొద్దని సూచనసదాశివనగర్(ఎల్లారెడ్డి): రోగాల సీజన్ ప్రారంభమైంది. తొలకరి వర్షాలు కురియడంతో పుడమి పులకరించింది. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ప్రధానంగా కొన్ని రకాలైన వ్యాధులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. దోమలతో మలేరియా, డెంగీ, నీటి కాలుష్యంతో డయేరియా, కామెర్లు, వైరల్ జ్వరాలు పిల్లల్లో మజిల్స్, గదవ బిల్లలు, చికెన్ఫాక్స్ లాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. కోవిడ్ వచ్చిన సమయంలో సాధారణ వ్యాధులు ప్రజలకు ఆటంకం కలిగించకపోయినా ప్రస్తుత సీజన్లో మరి కాస్త అప్రమత్తంగా ఉంటే ఆ వ్యాధుల నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగీ, మలేరియాతో జాగ్రత్త... ముఖ్యంగా అపరిశుభ్ర పరిసరాలు, ఓపెన్ నాళాలు, మురుగు నిల్వ ఉన్నచోట దోమలు పెరిగే అవకాశం ఉంది. రోడ్ల వెంబడి వ్యర్థ పదార్థాలను పడేయడం వల్ల మురికి కూపాలుగా మారుతున్నాయి. మలేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్ధారించి చికిత్స అందించాల్సి ఉంటుంది. లేదంటే మలేరియా మూత్ర పిండాలు, కాలేయం, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి కోమాలోకి వెళ్లే ఆస్కారం ఉంటుంది. నల్లగా ఉండే డెంగీ దోమ ఒంటిపై తెల్లని చారలు ఉంటాయి. అందుకే దీన్ని టైగర్ దోమగా పిలుస్తారు. ఇది కుట్టిన ఏడు నుంచి 8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. హఠాత్తుగా తీవ్ర జ్వరం, కాళ్లు కదిలించలేని పరిస్థితి, భరించలేని కండరాల నొప్పి, వాంతులు వికారంగా రక్తంతో కూడిన మల విసర్జన, కడుపునొప్పి ఉంటాయి. రక్తపోటుతో పాటు రక్తకణాల సంఖ్య పడిపోతుంది. ఫలితంగా అన్ని అవయవాలు పని చేయక ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇక మలేరియా, డెంగీ, చికెన్ ఫ్యాక్స్ వస్తే తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం, ఒక్కసారిగా అధిక జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులు, పార్శపునొప్పి, కీళ్ల నొప్పులు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత నీరు తాగడం వల్ల కలరా, డయేరియా, పచ్చకామెర్లు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీటి ద్వారానే వ్యాధులు వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. మురికి నీరు ప్రవహించక ఒక్క చోట నిల్వ ఉండడం వల్ల దోమల ఉధృతి పెరుగుతుంది. దీంతో వైరల్ జ్వరాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – ఆస్మాఅప్షిన్, వైద్యాధికారిణి, పీహెచ్సీ, సదాశివనగర్సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందస్తు జాగ్రత్తలతో రోగాలు సోకకుండా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దోమకాటు బారిన పడకుండా కాళ్లు చేతులు పూర్తిగా కప్పి ఉండే దుస్తులు వేసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంక్ల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. సంపులు, ట్యాంక్లపై మూతలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. -
కాంగ్రెస్లోకి రాఘవపల్లి జీపీ పాలకవర్గ సభ్యులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాఘవపల్లి గ్రామపంచా యతీ పాలకవర్గ సభ్యులు శనివారం హైదరాబాదు లోని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నివాసంలో కాంగ్రెస్లో చేరారు. గ్రామసర్పంచ్ నార్ల గంగామ ణి, ఉపసర్పంచ్ సూరయ్యతోపాటు వార్డు సభ్యులు సురేందర్, బాలమణి, వెంకయ్య, ఇందిరమ్మ, పాప య్య, రుక్మిణి, భాస్కర్, గంగయ్య, రమేష్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ భర్తకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ గౌడ్, ఆత్మకమిటీ డైరెక్టర్ కిష్ఠాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచాలి
ఎల్లారెడ్డిరూరల్: అంగన్వాడీ సిబ్బంది వేతనాలను పెంచాలని కోరుతూ శనివారం సూపర్వైజర్లకు వినతిపత్రం అందించారు. అంగన్వాడీ సిబ్బందికి నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ప్రతి నెలా 1న వేతనాలు అందించాలని, గత ఏప్రిల్కు సంబంధించిన వేతనాన్ని ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీ టీచర్లు దేవకర్ణ తదితరులు కలిసి సూపర్వైజర్లు స్వప్న, హారతి, ఈశ్వరీబాయిలకు అందించారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎంపీడీవో నరేష్ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ తండాలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. లింగంపేట(ఎల్లారెడి): పొల్కంపేట గ్రామ కుర్మ సంఘం కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా కడాల రాజు, ఉపాధ్యక్షుడిగా చిల్లెల్ల రవి, కోశాధికారిగా కొల్పుల రమేశ్, సహాయ కోశాఽధికారిగా గడ్డం సతీష్, ప్రధాన కార్యదర్శిగా కడాల ఎల్లేశంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం సన్మానించారు. -
సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
దోమకొండ: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం లింగుపల్లి, చింతమాన్పల్లి గ్రా మాల్లో నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ ప్రణా ళిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. హరితహారంలో మొక్కలు నాటాలని, ఇంకుడు గుంతల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. తడి పొడి చేత్త వేర్వేరుగా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు చొరవ చూపాలన్నారు. సర్పంచ్లు లక్ష్మి, సిద్ధరాములు, పంచాయతీ కార్యదర్శి రమేశ్, ఈజీఎస్ ఏపీవో రజని, ఏవో మణిదీపిక పాల్గొన్నారు. -
‘పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి’
కామారెడ్డి టౌన్ : పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 40వ వార్డులో శనివారం వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వార్డు సభలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరుచేసి మున్సిపాలిటీకి అందించాలని కోరారు. వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, ఆయా శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● బీఆర్ఎస్ నేతల డిమాండ్ ● భిక్కనూరు తహసీల్దార్ చాంబర్ వద్ద ధర్నాభిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో శనివారం భిక్కనూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వడ్లను కొనుగోలు చేయడంలో, తూకం వేసిన ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విపలమైందన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ఇంకా కాకపోవడం సర్కారు వైఫల్యానికి నిదర్శనమన్నారు. పోలీసులు వచ్చి తహసీల్దార్ సునీతతో కలిసి బీఆర్ఎస్ నాయకులను సముదాయించారు. ధర్నా విషయాన్ని అదనపు కలెక్టర్ గిరి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకువెళ్లగా రెండు రోజుల్లో కొనుగోళ్లను పూర్తి చేసి బస్తాలన్నింటినీ మిల్లులకు తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో నేతలు ఆందోళన విరమించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నేతలు అందె మహేందర్రెడ్డి, తున్కి వేణు, మద్ది స్వామి, రంజిత్ వర్మ, పాల రాంచంద్రం, వెంకట్రెడ్డి, ద్యావర సాయిరెడ్డి, పైడి నరేందర్రెడ్డి, ద్యావర లక్ష్మి, బస్వయ్య, గంగళ్ల రవీందర్, కర్రోళ్ల రాజు, భరత్, ముచ్చర్ల రాంరెడ్డి, బాబు, మదుసూదన్రెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏకరూపం.. తీవ్ర జాప్యం!
● త్వరలో తెరచుకోనున్న స్కూళ్లు ● ఇప్పటికీ జిల్లాకు చేరని క్లాత్ ● పాత, చిరిగిన యూనిఫాంతోనే స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితికామారెడ్డి టౌన్/బిచ్కుంద : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏటా పుస్తకాలతోపాటు ఉచితంగా రెండు జతల యూనిఫాం అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వీటిని సమకూరుస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజే వీటిని అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి వారం రోజులే సమయం ఉంది. ఇప్పటికీ జిల్లాకు క్లాత్ రాకపోవడంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు పాత, చిరిగిన దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 77,690 మంది విద్యార్థులు.. జిల్లాలో 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో కలిపి 77,690 మంది విద్యార్థులున్నారు. ఇందులో 37,247 మంది బాలురు, 40,443 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ ఏటా ప్రభుత్వం రెండు జతల ఉచిత యూనిఫాంలను అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు యూనిఫాం క్లాత్ రాలేదు. ఇప్పుడు క్లాత్ వచ్చినా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కుట్టించడం అసాధ్యం. విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాం కుట్టించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.జిల్లాకు ఎన్ని యూని ఫాంలు కావాలో ప్రభుత్వానికి వివరాలు పంపాం. యూనిఫాంలు ఎప్పుడు వస్తాయనే దానిపై రాష్ట్ర కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. దుస్తులు లేదా క్లాత్ రాగానే పంపిణీ చేస్తాం. స్కూళ్ల ప్రారంభానికి ముందే వస్తాయని ఆశిస్తున్నాం. ఈసారి కొత్తగా టై, బెల్ట్లు, షూలు కూడా వచ్చే అవకాశం ఉంది. – మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డిరాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా టెస్కో సంస్థ ద్వారా నాణ్యమైన యూనిఫాం వస్త్రాన్ని సేకరించి, వాటిని ఏప్రిల్, మే నెలల్లోనే జిల్లాలకు సరఫరా చేస్తూ వస్తోంది. ఆ క్లాత్ను మండలాలవారీగా పంపిణీ చేసి మహిళా సంఘాల సభ్యులతో కుట్టించేవారు. దీనివల్ల అటు విద్యార్థులకు సకాలంలో దుస్తులు అందేవి.. ఇటు మహిళా సంఘాలకు ఉపాధి దొరికేది. అయితే ఈసారి ప్రభుత్వం టెస్కోను కాదని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే క్లాత్ సరఫరాలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులకూ స్పష్టత లేదు. మరోవైపు యూనిఫాంలు కుట్టడం ద్వారా ఆదాయం సమకూరుతుందని భావించిన మహిళా సంఘాల సభ్యులకూ నిరాశే మిగిలింది. -
‘నీట్’కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి
● ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్ష కేంద్రాలుండాలి ● రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకామారెడ్డి క్రైం: త్వరలో నిర్వహించే నీట్–2026 కు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల నమోదు, బయోమెట్రిక్ ధ్రువీకరణ, తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు తదితర విషయాల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అధికారులు పాల్గొన్నారు. -
కారును ఢీకొన్న లారీ
● మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం భిక్కనూరు: బస్వాపూర్ సమీపంలోని జాతీ య రహదారిపై కారును వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా శనివారం తన కారులో హైదరాబాద్ నుంచి నిజమాబాద్ వైపు వెళ్తున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఆయన కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డివైడర్పైకి ఎక్కి నిలిచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు ఇతరులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పార్టీ నాయకు లు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆయన వేరే కారులో నిజామాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. కామారెడ్డి అర్బన్: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకో సం ఈనెల 12 వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్నవారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు టీజీఈపాస్లో దరఖాస్తు చేసుకుని, సంబంధించిన ప్రతులను పాఠశాలలో అందజేయాలని సూచించారు. బాన్సువాడ: పీఈసెట్లో జిల్లాకు చెందిన వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. బాన్సువాడ మండలం కొత్తాబాదికి చెందిన కడవత్ భరత్కు బీపెడ్ లో రాష్ట్ర స్థాయి 12వ ర్యాంకు, నస్రుల్లాబాద్ మండలం నెమ్లికి చెందిన చిట్టి మానసకు డీపెడ్లో రాష్ట్ర స్థాయి 23వ ర్యాంకు, ఇదే గ్రామానికి చెందిన బండి కావేరికి డీపెడ్లో రాష్ట్ర స్థాయి 38వ ర్యాంకు, ఇదే గ్రామానికి చెందిన గడ్డం మానసకు బీపెడ్లో రాష్ట్ర స్థాయి 412వ ర్యాంకు వచ్చాయని వాలీబాల్ కోచ్ సురేందర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన వాలీబాల్ క్రీడాకారులను ఆయన అభినందించారు. ిపిట్లం: పిట్లం నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం బస్సును పునరుద్ధరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. రోజూ ఉదయం 8.10 గంటలకు పిట్లం నుంచి నిజామాబాద్ నగరానికి బస్సు బయలు దేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు ఉదయం 7.10 గంటలకు బాన్సువాడ నుంచి బయలుదేరి 8 గంటలకు పిట్లంకు చేరుకుంటుందన్నారు. 8.10 కి పిట్లం నుంచి బయలుదేరి 9.50 గంటలకు నిజామాబాద్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ సర్వీస్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రెక్కలు!
భూ విలువకురాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 శాతం వరకు విలువ పెరిగింది. దీంతో సామాన్యులకు భూములు, ప్లాట్ల కొనుగోలు మరింత భారంగా మారింది. – కామారెడ్డి క్రైంస్థిరాస్తుల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. ఎక్కడ చూసినా 50 నుంచి 120 శాతం వరకు విలువ పెరిగింది. అన్ని సబ్రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో పెరిగిన భూముల విలువ ఆధారంగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాగా సర్కారు నిర్ణయం భూములు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ఇది అదనపు భారంగా మారింది. ఒక్కో రూపాయి పోగు చేసుకుని ఇంటి స్థలమో, వ్యవసాయ భూమో కొనుగోలు చేయాలని చూస్తున్నవారిని పెరిగిన భూముల విలువ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, బిచ్కుందలలో సబ్రిజిస్ట్రార్ కార్యాయాలున్నాయి. వీటిలో పాట్లకు సంబంధించిన, జిల్లాలోని అన్ని తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారి వెంట గజం మార్కెట్ విలువ రూ. 2,400 నుంచి రూ. 4,200 కు చేరింది. కాలనీల్లో రూ. 1,300 ఉండగా రూ. 2,300 కు పెంచారు. ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ప్లాట్ల మార్కెట్ విలువ 90 శాతం వరకు పెరిగింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50 శాతానికి పైగా పెంచారు. బిచ్కుంద మున్సిపాలిటీలో రూ. 1,700 ఉన్న గజం మార్కెట్ విలువ తాజాగా రూ. 3 వేలు అయ్యింది. సబ్రిజిస్ట్రార్ పరిధిలోని గ్రామాల్లో గజం రూ. 500 నుంచి వెయ్యి రూపాయలకు, ఇతర మండల కేంద్రాల్లో రూ. 1,700 నుంచి రూ. 2,600 లకు పెరిగాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం వరకు పెరిగింది. దోమకొండ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని గ్రామాల్లో గతంలో పాట్ల కనీస ధర గజానికి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ. 600 లకు పెరిగింది. ఐదు మండల కేంద్రాల్లో గజానికి కనీస ధర రూ. 600 నుంచి రూ. 900 లకు చేరింది. భిక్కనూరులో ప్రధాన రహదారి వెంట ధర గజానికి రూ. 900 లనుంచి రూ. 1,900 లకు పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఏరియాను బట్టి 60 శాతం వరకు పెరిగింది.కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్లాట్లకు సంబంధించి గతంలో గజం కనీస విలువ రూ. 2,100 గా ఉండగా ఇప్పుడది రూ. 3,200 లకు పెరిగింది. బస్టాండ్, స్టేషన్రోడ్ ప్రధాన రహదారుల వెంట ప్లాట్ల విలువ రూ. 17,600 నుంచి రూ. 26,400లకు చేరింది. నిజాంసాగర్ రోడ్డులో ప్రధాన రహదారి వెంట గతంలో గజం విలువ రూ. 5,800 ఉండగా ఇప్పుడు రూ. 8,700 లకు పెరిగింది. కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయితీలలో గజం విలువను రూ. 900 నుంచి రూ. వెయ్యికి పెంచారు. మండలం పరిధిలోని వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువ గతంలో ఎకరానికి రూ. 2.70 లక్షలుగా ఉండేది. ఇప్పుడు రూ. 3,93,750 లకు చేరింది.బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి వెంట గజం ధర రూ. 5,800 ఉండగా తాజా విలువ ప్రకారం రూ. 10,200 అయ్యింది. కాలనీల్లో ఇళ్ల స్థలాలు గజం రూ. 2,400 నుంచి రూ. 5,800 లకు, గ్రామాల్లో ప్లాట్ల విలువ గజం రూ. 500 నుంచి రూ.వెయ్యికి చేరాయి. వ్యవసాయ భూముల విలువ అన్ని మండలాల్లోనూ గతంలో ఉన్నదాని కంటే 60 శాతం వరకు పెరగడ గమనార్హం.ఇటీవల ఎకరం భూమి కొన్నా. గురువారం స్లాట్ బుక్ చేసినప్పుడు రూ. 29,600 చెల్లించాను. శుక్రవారం రిజిస్ట్రేషన్కు వెళ్తే భూముల విలువ పెరిగిందన్నరు. అదనంగా రూ. 21 వేలు వసూలు చేశారు. ఒక్క రోజులో రూ. 21 వేల భారం పడింది. – వనం గంగాధర్, బాన్సువాడ వ్యవసాయ భూముల మార్కెట్ విలువపై 50 శాతం పెంపు ఇతర స్థలాలపై 120 శాతం వరకు.. అమలులోకి వచ్చిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువ స్థిరాస్తులు కొనేవారిపై అదనపు భారం -
ఆరుగురు జల సమాధి
కమ్మర్పల్లి(భీమ్గల్)/బాన్సువాడ:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో నివాసం ఉండే కంది మహేశ్ కొడుకు హరీశ్ (10), కూతురు వర్షిణి (5), ధ్యారంగుల సురేశ్ కొడుకు అరవింద్ (4) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆడుకుంటూ కాలనీ పక్కనే ఉన్న బ్రాహ్మణకుంట వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు బట్టలు విప్పి ఒడ్డున పెట్టి కుంటలోకి దిగారు. ఇటీవల కుంటలో మొరం తవ్వకాలు జరపడంతో గుంతలు ఏర్పడ్డాయి.గుంతలు తవ్విన ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు మునిగి పోయారు. మధ్యాహ్న సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడంతో మహేశ్, సురేశ్ కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు. కాలనీలో, పక్కనే ఉన్న వ్యవసాయ తోటల్లో ఇతర ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్ఐ సీహెచ్ తిరుపతి, పోలీస్ సిబ్బంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్ద ఒడ్డున పిల్లల దుస్తులు కనిపించాయి. దీంతో అగి్నమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను ఘటన స్థలానికి రప్పించి గల్లంతైన పిల్లల కోసం గాలించారు. రెండు గంటల పాటు శ్రమించిన గజ ఈతగాళ్లు చివరికి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎల్లమ్మ పండగ చేస్తుండగా.... కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి బోలక్పల్లి శివారులోని మంజీర బ్రిడ్జి కింద ఎల్లమ్మ గుడి వద్ద పండగ చేశాడు. అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్ల కుటుంబాలను పిలిచాడు. అందరూ కలిసి సంతోషంగా పండగ చేసుకున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో పండరి కుమార్తె పావని(15)తోపాటు, లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన పండరి చెల్లి అనిత (40), ఆమె కుమార్తె శివాణి (13), పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన పండరి మరో చెల్లి సుజాత కుమారుడు భానుప్రసాద్తోపాటు అక్షయ, అశ్వీతలు మంజీర నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు.అయితే అక్షయ, అశ్వీతలు ఒడ్డున ఉన్నారు. అనిత, శివాణి, పావని, భానుప్రసాద్లు నదిలో స్నానానికి దిగారు. లోతుగా ఉండడంతో ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న అక్షయ, అశ్వీతలు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ హుటాహుటిన వచ్చి నీటిలో మునిగిన అక్క అనిత, మేనకోడలు శివాణి, అన్న కుమార్తె పావని, అక్క కుమారుడు భానుప్రసాద్లను బయటకు తీశాడు. నీట మునిగిన వారందరినీ బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత, శివాణి, పావని మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. భానుప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ప్రమాదవశాత్తు చెరువులో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: పట్టణ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వెంకట సుబ్బయ్య(32) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆల్లూర్ మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన సుబ్బయ్య బతుకుదెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం ఆర్మూర్కు వచ్చాడు. ఇక్కడే కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మెకానిక్ నిర్లక్ష్యం.. ట్రాక్టర్ యజమాని ..భిక్కనూరు : మెకానిక్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ యజమాని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని మంగిలిపల్లి రమేశ్(52) ట్రాక్టర్ మరమ్మతులు చేసేందుకు కామారెడ్డికి చెందిన మెకానిక్ రియాన్ను పిలిపించాడు. దీంతో రియాన్ వచ్చి ట్రాక్టర్ను రిపేర్ చేస్తుండగా యజమాని రమేశ్ ట్రాక్టర్ ఎదుట నిల్చున్నాడు. ఆ సమయంలో రియాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫ్ ద్వారా స్టార్టు చేయగానే ట్రాక్టర్ ముందుకు వెళ్లి రమేశ్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేశ్ను కామారెడ్డిలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహామేరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేశ్ మృతి చెందాడు. రమేశ్ మృతికి కారణమైన మెకానిక్ రియాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కరెంట్ షాక్తో గేదె ..నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ గ్రామ శివారులోని ఎస్ఎస్ 5 ట్రాన్స్ఫార్మర్ వద్ద గురువారం కరెంట్ షాక్తో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన తోట రవీందర్ పాడి గేదె మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లింది. పొలం గట్టు వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో గేదె అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతుకు రూ. 55 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
చదివింది మరిచిపోకుండా...
మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులు తాము చదువుకున్న పాఠాలు, లెక్కలు ఇతర అంశాలను మరిచిపోకుండా ఉండేందుకు వేసవి సెలవుల్లోనూ నిత్యం రెండు, మూడు గంటలపాటు సమయం కేటాయిస్తున్నారు. గురువు బోయిడి నర్సయ్య నిత్యం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ పాఠ్యంశాలపై పట్టు సంపాదించుకుంటున్నారు. బాల్కొండ మండలం బస్సాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కొన్నేళ్లుగా వేసవి సెలవులను వృథా చేయకుండా చదువుకోసం వినియోగిస్తున్నారు. కరోనా కన్నా ముందు నుంచే బస్సాపూర్ విద్యార్థులు యేటా సెలవుల్లో రెండు, మూడు గంటలపాటు ఆన్లైన్ తరగతులను కొనసాగిస్తుండడం విశేషం. మా సారు పాఠశాలలో చెప్పిన లెక్కలను ఇప్పుడు సెలవుల సమయంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. వాట్సాప్లో ఆయన లెక్కలు పంపిస్తే వాటిని ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసి తిరిగి వాట్సాప్లో పంపిస్తున్నాం. తప్పులుంటే సరిచేసుకోమంటూ సూచనలు ఇస్తున్నారు. – పి.దేవాన్ష్, 4వ తరగతి ప్రతి సెలవుల్లోనూ నేను చదువుకున్న పాఠాలు మరిచిపోకుండా ఉండేందుకు మా గురువు నర్సయ్య ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. మేము ఉత్సాహంగా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నాం. – లతీక్ష, 4వ తరగతి పాఠ్యాంశాలు గుర్తుండేలా బొమ్మలను గీస్తూ మా మాస్టర్ పాఠాలు చెప్పారు. ఇప్పుడు హోంవర్క్లో ఆయన చెప్పిన పాఠాలకు అనుగుణంగా బొమ్మలను గీస్తున్నాం. సెలవులను వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం. – శివరక్షిత్, 5వ తరగతి మా గురువు రోజు మా తల్లిదండ్రుల వాట్సాప్కు పాఠ్యంశాలకు సంబంధించిన సూచనలు, సలహాలు పంపుతారు. ఆయన సూచించిన విధంగా మేము హోమ్వర్క్ చేసి వాట్సాప్లో పంపిస్తున్నాం. పాఠాలు ఏవీ మరచిపోకుండా గుర్తుంచుకుంటున్నాం. – బి. కారుణ్య, 5వ తరగతి వేసవి సెలవుల్లోనూ ఆన్లైన్లో సలహాలు, సూచనలు ఇంటి వద్దనే ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు వాట్సాప్ సమూహం ద్వారా పర్యవేక్షిస్తున్న టీచర్ -
పిల్లలు మీరూ పంపండి..
83328 87332ఎం. రిషివర్ధన్, 8వ తరగతి, లయోలా హైస్కూల్, భిక్కనూర్, జిల్లా : కామారెడ్డి. ఖుషి రెడ్డి, 1వ తరగతి, నిజామాబాద్. ఇషాన్, 5వ తరగతి, ప్రభుత్వ పాఠశాల, ఐలాపూర్, కామారెడ్డి. జి.రసజ్ఞ, 6వ తరగతి, శ్రీ సిద్ధార్థ స్కూల్, హైదరాబాద్. ఎం. హర్షవర్ధన్, 6వ తరగతి, భిక్కనూర్, జిల్లా : కామారెడ్డి. హర్ధిక్, 3వ తరగతి, మంజీరా హైస్కూల్, రామాయంపేట్, మెదక్ టి.అతిష్య, 7వ తరగతి, నిర్మల్ టి. అక్షద ప్రియ, 5వ తరగతి, నిజామాబాద్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంకామారెడ్డి క్రైం: వర్షపు నీరు వృథా కాకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్లో నిర్మించిన ఇంకుడుగుంతను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరంఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి చ ర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఇంకుడుగుంత పరిసరాల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు.అలాగే క లెక్టరేట్లో ఉద్యోగులకు జ్యూట్ బ్యాగులు, పర్యావరణహిత వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. మొక్కలు నాటిన అధికారులు సాక్షి నెట్వర్క్: బిచ్కుంద కోర్టు ఆవరణలో ప ర్యావరణ దినోత్సవం సందర్భంగా సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్ కుమార్ మొక్కలు నాటారు. అలాగే కామారెడ్డి సీనియర్ సిటిజన్స్ ఫోరం జిల్లా భవనం ప్రాంగణంలో అసోసియేషన్ ప్రతినిధులు మొక్కలు నాటారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామంలో సర్పంచ్ అనసూయ మొక్కలను నాటా రు. అనంతరం గ్రామస్తులతో కలిసి పర్యావరణా న్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారిణి పద్మావతిని అధ్యాపకులు సన్మానించారు.పెద్దకొడప్గల్ మండలం పోచారం గ్రామంలో సర్పంచ్ బాలాజీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క కృషిచేయాలని ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి సూ చించారు. బాన్సువాడ కోర్టు ఆవరణలో జడ్జి టీఎస్పీ భార్గవి మొక్కలు నాటారు.బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ రైతువేదిక వద్ద సర్పంచ్ అందె రమేష్తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సిబ్బందికి వారు సూచించారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామంలో సర్పంచ్ సాయిలు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పను ల గురించి తీర్మాణం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. -
‘పండుగ’ వేళ విషాదం
బాన్సువాడ/బాన్సువాడ రూరల్/పిట్లం: పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అదే మండలంలోని బొల్లక్పల్లి శివారులోగల మంజీర బ్రిడ్జి వద్దనున్న ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం పండుగ చేశాడు. అన్నదమ్ములు సాయిలు, రవీందర్తో పాటు చెల్లెళ్లు అనిత, సుజాతల కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. అందరూ కలిసి మొక్కలు చెల్లించికుని, సంతోషంగా భోజనాలు చేశారు. సాయంత్రం వేళలో పండరితోపాటు ఆయన కూతురు పావని(15), చెల్లెలు లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనిత(40), ఆమె కూతురు శివాని (13), మరో చెల్లి పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన సుజాత కుమారుడు భానుప్రసాద్తో పాటు మరికొందరు మంజీర నది వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో అనిత, శివాని, పావని, భానుప్రసాద్ అదుపుతప్పి పడిపోయారు. ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ పరుగెత్తుకుంటూ వచ్చి నీటిలో మునిగిన అనితతో పాటు శివాని, పావని, భానుప్రసాద్లను ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే అనిత, శివాని, పావని మరణించారు. భానుప్రసాద్తోపాటు ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులు మోసుకుంటూ రోడ్డు వరకు వచ్చి అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భానుప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓదార్చిన ఆర్డీవో.. నీట మునిగి ముగ్గురు మరణించిన విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరాతీశారు. మృతుల బంధువులను ఓదార్చారు. భానుప్రసాద్కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మిన్నంటిన రోదనలు.. మంజీర నదిలో ముగ్గురి మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు బాన్సువాడ ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య కేసు నమోదు చేసుకున్నారు.లింగంపేట : మంజీర నదిలో మునిగి మరణించిన పర్మళ్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనితకు భర్త నర్సింలు, కూతురు శివాని, కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. శివాని కామారెడ్డిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి, కొడుకు భానుప్రసాద్ పర్మళ్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేశారు. ఇటీవల పర్మళ్ల గ్రామంలో ఊర పండుగ చేసుకున్నారు. పండుగ అనంతరం నిద్ర కోసం గురువారం రాత్రి పుట్టింటికి (పిట్లం మండలంలోని కిష్టాపూర్)కు వచ్చారు. శుక్రవారం అందరు కలిసి సంతోషంగా ఎల్లమ్మ పండుగ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. నీట మునిగి తల్లీకూతుళ్లు అనిత(40), శివాని(13) మృతి చెందడంతో పర్మళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలు అనిత గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. -
గడ్డం చంద్రశేఖర్రెడ్డిపై పార్టీ చర్యలు తీసుకోవాలి
● లేకపోతే గాంధీ భవన్లో దీక్ష చేస్తాం ● మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కామారెడ్డి టౌన్ : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే వెయ్యి మంది కార్యకర్తలతో గాంధీ భవన్ ముందు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా కష్టపడుతున్న షబ్బీర్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురై మూడేళ్ల క్రితం కాంగ్రెస్లో చేరిన నాయకులు కావాలో.. 35 ఏళ్లుగా పార్టీ మారకుండా కష్టపడుతున్న వారు కావాలో అధిష్టానం తేల్చుకోవాలన్నారు. షబ్బీర్ అలీతోపాటు ఇతర నేతలపై గడ్డం చంద్రశేఖర్రెడ్డి వర్గం చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, సందీప్, పాత రాజు, శ్రీనివాస్రెడ్డి, రమేష్, అనంతరెడ్డి, సుదర్శన్, బాలరాజ్, సుధాకర్రెడ్డి, రాజాగౌడ్, నౌసిలాల్ నాయక్, కౌన్సిలర్లు వాజిద్, షేరు తదితరులు పాల్గొన్నారు.దోమకొండ: ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని జిల్లా ఫారెస్ట్ అధికారి నీరజ్కుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గడికోటలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ గురించి వివిధ పాఠశాలల విద్యార్థులు గీసిన చిత్రాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గడికోట వారసులు కామినేని అనిల్కుమార్, ట్రస్టు మేనేజర్ బాబ్జీ, డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామకృష్ణ, సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్, నాయకులు శేఖర్, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుభాష్నగర్ : జీజీహెచ్ నిజామాబాద్లో తొలిసారి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ విజయవంతమైంది. కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో తొలిసారిగా నిర్వహించిన క్లిష్టమైన వైద్య, శస్త్రచికిత్సా ప్రక్రియలు విజయవంతమై ఆస్పత్రి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్రావ్ తెలిపిన వివరాల ప్రకారం... బురాజీ (65) అనే వ్యక్తి ఇటీవల తీవ్రమైన ఛాతినొప్పితో జీజీహెచ్లో చేరారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫ్రక్షన్(గుండెపోటు) వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే కార్డియాలజీ బృందం థ్రాంబోలైసిస్ చేసి రోగికి చికిత్స అందించారు. గురువారం రోగికి యాంజియోగ్రామ్లో రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించి కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్ బృందం పీటీసీఏ స్టెంట్ వేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు కార్డియాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తున్న సహకారంతోనే అత్యాధునిక వైద్య సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి విజయ్ కుమార్ నాయకత్వాన్ని, ప్లాస్టిక్ సర్జన్ శివానీ సేవలను వారు ప్రశంసించారు. -
బల్దియా సమావేశం రసాభాస
● ఇష్టానుసారంగా ఎజెండా సిద్ధం చేశారన్న సభ్యులు ● సమావేశం నుంచి వెళ్లిపోయిన చైర్పర్సన్కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీరు మారడం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశం రసాభాస కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ మధ్యలోనే వెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి సమక్షంలో కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఎజెండా అంశాలపై చర్చించాలని చైర్పర్సన్ కోరారు. అయితే ఎజెండాలోని అంశాలను ఏకపక్షంగా, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా సిద్ధం చేశారని కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. గత సమావేశంలో చేసిన తీర్మానాల పనుల్లో ఎలాంటి పురోగతి లేదని సభ్యులు మండిపడ్డారు. పట్టణంలో సానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా అంశాలతో పాటు వార్డుల వారీగా ఉన్న సమస్యలపై చర్చిద్దామని చైర్పర్సన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు వినలేదు. సభ్యుల ప్రవర్తనతో అసహనానికి గురైన చైర్పర్సన్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్మశానవాటికల అభివృద్ధితో పాటు, మురికి కాలువల పూడికతీత తదితర కీలక సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండానే సమావేశం వాయిదా పడింది. వారంలోపు శ్మశాన వాటిక అభివృద్ధి అంశంతో పాటు ఇతర సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ పేర్కొన్నారు. -
పర్యావరణాన్ని కాపాడాలి
నిజామాబాద్ లీగల్ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలని ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి ఎస్. నారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్ నినో కారణంగా విపరీతమైన వేడి వాతావరణం ఉంటుందని, ప్రతి ఇంట్లో ఏసీలు పెట్టడంతో వేడిమి ఎక్కువ అయ్యిందని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠరావు, మేజిస్ట్రేట్స్ శ్రీనివాస్ రావు, చైతన్య, హరికుమార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అవుల నారాయణ, పరిపాలనాధికారి గోవిందరావు, న్యాయవాదులు రాజ్కుమార్ సుబేదార్, రాజు, ఆశ నారాయణ, రవిప్రసాద్, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు శైలజ, శ్రావణ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి జిల్లా జడ్జి నారాయణ -
చైన్స్నాచర్ అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): మెండోరా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడు గుర్జంత్ సింగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి శుక్రవారం తెలిపారు. బాల్కొండలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం సోన్పే ట్కు చెందిన ఉప్పరి గణేశ్ తన భార్య గంగు, కూతురు మనీషతో కలిసి ముప్కాల్ నుంచి బుస్సాపూర్ శివారుకు చేరుకోగా ముసుగు ధరించిన దొంగ గంగు మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్జంత్ సింగ్గా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో సిబ్బంది నరేందర్, భరత్గౌడ్, లింగన్న నిందితుడిని పట్టుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెండోరా పోలీసులను సీఐ అభినందించారు. వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వెండి ఆభరణాలను అపహరించినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఆలయంలోని బీరువాను పగులగొట్టి 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
10 లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
● తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్భిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లను ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన రామేశ్వర్పల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షానికి కామారెడ్డి డివిజన్ పరిధిలో 800 టన్నుల వడ్లు తడిశాయని గుర్తించామన్నారు. రైతులకు నష్టం కలుగకుండా ఉండేందుకు తడిసిన వడ్లను వెంటనే రైస్మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆయన శ్రీ సిద్దరామేశ్వర రైస్మిల్లులో పారాబాయిల్డ్ రైస్మిల్లుల యజమానులతో సమావేశమయ్యారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటవెంటనే ధాన్యం అన్లోడ్ చేయించాలని సూచించారు. సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని అన్లోడ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన 14 మంది రైస్మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 4.19 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంధ్రకాంత్రెడ్డి, విండో పర్సన్ ఇన్చార్జి నాగార్తి భూంరెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, రైస్మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష కామారెడ్డి క్రైం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సాయంత్రం మానిటరింగ్ అధికారులు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ వివరాలను వెంటనే ట్యాబ్లలో నమోదు చేయాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి కామారెడ్డి క్రైం: జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్ నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జనగణన, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), భూభారతి అమలు అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. సేకరించే సమాచారం ఖచ్చితత్వంతో కూడినదై ఉండేలా సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు అన్నీ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారం ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. -
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
● డిచ్పల్లి శివారులో కారును వెనుక నుంచి ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకులు కిందపడగా, లారీ వెళ్లడంతో మృతి డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): మండల కేంద్రం శివారు నాగ్పూర్ గేట్ సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం వైఎస్సార్ కాలనీకి చెందిన చిన్న స్వామి అలియాస్ నవీన్ (20) డిగ్రీ చదువుతుండగా, బలరాం అలియాస్ నాని (24) స్టోన్ కట్టర్గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బైక్పై ధర్పల్లి నుంచి జక్రాన్పల్లికి బయలుదేరారు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ సమీపంలో హైవేపై మూలమలుపు వద్ద వారి ముందువెళ్తున్న కారును తప్పించబోయి, కారు వెనక భాగాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరు బైక్తోపాటు కిందపడిపోయారు. అదే సమయంలో వీరి వెనకే వస్తున్న లారీ వీరిద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సీఐ వినోద్, ఎస్సై ఎండీ ఆరిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీ సాయిచైతన్య సైతం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ రహదారి అధికారులు, రవాణా శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాష్, డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై ఆరిఫ్, అధికారులు ఉన్నారు. భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి శివారులోని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన కొమ్ము మహేష్ (30) బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. గురువారం తన స్వగ్రామమైన సంగమేశ్వర్ నుంచి అతడు సొంత పనులపై కామారెడ్డికి బైక్పై బయలుదేరాడు. జంగంపల్లి గ్రామశివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనురాధ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై అంజనేయులు వివరించారు. జంగంపల్లి గ్రామశివారులో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో హైవే పక్కన ఉన్న ఓ చెట్టు రోడ్డుపై పడింది. ఆ సమయంలోనే మహేష్ చెట్టును తప్పించి, నెమ్మదిగా వెళ్లడంతోనే గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. బలరాం (ఫైల్) చిన్న స్వామి (ఫైల్) -
కంటి పరీక్షలు
ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి నిపుణుడు హరికిషన్ రావు ఆధ్వర్యంలో 41 మంది రోగులకు పరీక్షలు చేశారు. వీరిలో ఇద్దరికి సర్జరీ కోసం హైదరాబాద్ సరోజినీదేవి ఆస్పత్రికి, ఏడుగురిని క్యాటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తం బాన్స్వాడ లయన్స్ క్లబ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. 21 మంది రోగులకు కంటి అద్దాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ పర్యవేక్షించారు. -
రక్త పరీక్షలతో ఆరోగ్య పరిరక్షణ
భిక్కనూరు: రక్తపరీక్షలతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం ఆయన భిక్కనూరు ప్రభుత్వాస్పత్రిలో రక్త పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళ రక్త పరీక్షలు చేయించుకోవాలని, దీనివల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖాధికారి రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ, తహసీల్దార్ సునీత, డీఆర్డీవో దామోదర్రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, వైద్యులు యెమిమా, ఈవో మహేష్గౌడ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
సామెతలు
నేను గీసిన చిత్రంహన్విక యూకేజీ హైదరాబాద్ ఏ దీక్షిత 2వ తరగతి జీవదాన్ హైస్కూల్ లింగంపేట జిల్లా : కామారెడ్డి టి హయగ్రీవ్ 3వ తరగతి నిర్మల్ అతిషయ 7వ తరగతి నిర్మల్ బి రిష్వంత్ 6వ తరగతి మంజీర హై స్కూల్ రామాయంపేట జిల్లా: మెదక్ -
వెంటనే చర్యలు తీసుకోవాలని
● సాక్షి కథనానికి సీఎంవో స్పందన మద్నూర్(జుక్కల్): సాక్షి దిన పత్రికలో గురువారం ప్రచురితమైన ‘చిమ్మ చీకట్లో సర్కార్ దవాఖానా’ అనే వార్తకు సీఎంవో కార్యాలయం స్పందించింది. ఈ విషయమై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సీఎంవో నుంచి సమాచారం అందింది. గురువారం డీసీహెచ్ విజయ్భాస్కర్ మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్జాదవ్ను వివరణ కోరారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఇన్వర్టర్ నుంచి ఆస్పత్రిలోని వార్డుకు కలిపే విద్యుత్ వైరింగ్లో మరమ్మతులు ఉండటంతో ఆస్పత్రిలో అంధకారం నెలకొందని, వెంటనే అదే రాత్రి ఎలక్ట్రీషియన్ను పిలిపించి మరమ్మతులు చేపించినట్లు వైద్య అధికారుల ద్వారా తెలిసింది. బాన్సువాడ రూరల్: గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని దేశాయిపేట్ గ్రామ సర్పంచ్ భూనేకర్ జ్యోతి ప్రకాష్ కోరారు. గురువారం గ్రామపంచాయతీలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి గీత గ్రామసభ ఉద్దేశాలను వివరించారు. గ్రామంలో మురుగు కాల్వల పరిశుభ్రత, వీధిదీపాల నిర్వాహణ, తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ జ్యోతి అన్నారు. బాన్సువాడ రూరల్: బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బోర్లం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపి కోరారు. గురువారం ఆయన గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలలపై మోజును వీడి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు అయ్యాల సంతోష్, సత్యనారాయణ, చైతన్య తదితరులు ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎన్ని అడ్డంకులు వచ్చినా విద్యార్థుల కోసం బాత్రూములను నిర్మిస్తామని సర్పంచ్ నరేశ్ అన్నారు. దేవాయిపల్లిలో గురువారం ఆయన గ్రామస్తులతో కలసి మాట్లాడారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు పాఠశాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న బాత్రూము పనులను అడ్డుకుంటున్నారన్నారు. విద్యార్థుల ఆట స్థలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాలక వర్గం, గ్రామస్తుల తీర్మానం మేరకే పనులను చేపట్టినట్లు తెలిపారు. -
నదిలో పడి పశువుల కాపరి మృతి
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో పడి ప్రమాదవశాత్తు పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన మ్యాతరి నారాయణ(44)కు వివాహం కాలేదు. ఈనెల 2న ఎప్పటిలాగే పశువులను మేపుతూ గోదావరి నదిలో నీటిని తాగించేందుకు తీసుకువెళ్లాడు. నదిలోకి దిగిన నారాయణ ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక మృతి చెందాడు. సాయంత్రం ఎప్పటిలాగే పశువులు ఇంటికి వెళ్లగా, నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నదిలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో మృతుడి సోదరి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోపాల్: మండలంలోని న్యాల్కల్ చెరువులో పడి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కర్రెళ్ల చిన్న శంకర్ (60)కు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈనెల 3న తన గొర్రెలను చూసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం చెరువు కట్టపై అతడి దుస్తువులు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు అదే వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బొడ్డారి స్వామి (25) అనే యువకుడు బుధవారం చేపలు పట్టడానికి వల తీసుకుని కామారెడ్డి పెద్ద చెరువుకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిలో అతడి మృతదేహం కనిపించింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. చేపల వల కాళ్లకు చుట్టుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్డి సంఘాల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్గా కరుణాకర్ రెడ్డి
కామారెడ్డి అర్బన్: తెలంగా ణ రెడ్డి సంఘాల ఐక్య వేది క రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి నియామక పత్రం అందజేశారు. రెడ్డి సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా కామారెడ్డి జిల్లాకు చెందిన కరుణకర్రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ప్రతినిధులు గోపాల్రెడ్డి, రాజ్కుమార్రెడ్డి, సుమన్రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 1989 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థినులు గురురువా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించగా, ఏళ్ల తర్వాత మళ్లీ స్నేహితులంతా ఒక్కచోట కలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకూంటూ ఆనాటి తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. విందువినోదాలతో ఆనందంగా గడిపారు. ఎల్లారెడ్డి రూరల్: తిమ్మారెడ్డి గ్రామంలో గురువారం వన సంరక్షణ, జల సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కోల రాములు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రజలు ప్రతీ ఇంట్లో రెండు మొక్కలు నాటాలని సర్పంచ్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. -
అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్
● సీఎం, మంత్రులందరిదీ అదేబాట ● సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి ● మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికామారెడ్డి క్రైం : అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. సీఎంతోపాటు మంత్రులందరిదీ అదేబాట అన్నారు. గురువారం కామారెడ్డిలోని వెలమ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరించి పెడితే రేవంత్ సర్కారు ఫోర్త్సిటీ పేరిట భూములను ప్రైవేటు వారికి అమ్ముకునే పనిలో పడిందన్నారు. మిల్లర్లతో కలిసి రూ.వెయ్యి కోట్లు, ఎకై ్సజ్లో రూ.600 కోట్లు, మంచిర్యాలలో 116 ఎకరాల దేవాదాయశాఖ భూములు, సింగరేణి భూముల కుంభకోణాలకు ఆయా మంత్రులు తెరలేపారని ఆరోపించారు. కొత్తగా రైతు డిస్కం పేరుతో మరో అవినీతితో ముందుకువచ్చారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ను దూరం చేసే కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. హామీల అమలు నిరూపిస్తే.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. రైతుబంధు ఎన్నిసార్లు ఎగ్గొట్టారో రైతులు గమనిస్తున్నారన్నారు. 2023 అక్టోబర్లో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అభివృద్ధి పనులకు రూ.8 కోట్లతో తాను శిలాఫలకం వేశానన్నారు. ఇప్పుడు తాము మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు అక్కడ మళ్లీ ఫొటోలు దిగుతున్నారన్నారు. మున్సిపాటిలీలో సీసీ రోడ్లకు తాను రూ.23 కోట్లు తీసుకువస్తే ఇప్పుడు తాము మంజూరు చేసినట్లు అధికార పార్టీ నేతలు శంకుస్థాపనలు చేసుకుంటున్నారన్నారు. గతేడాది వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్రెడ్డి వచ్చి పరిశీలించారని, ధ్వంసమైన అన్ని బ్రిడ్జీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను 15 రోజుల్లో చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ కనీస మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, నాయకులు ముజీబొద్దీన్, ప్రభాకర్రెడ్డి, సుమిత్రానంద్, ప్రేమ్కుమార్, ప్రభాకర్ యాదవ్, కుంబాల రవి, లక్ష్మీనారాయణ, బల్వంత్రావు తదితరులు పాల్గొన్నారు.చేతగాని ప్రభుత్వం..ఇదొక చేతగాని ప్రభుత్వమంటూ రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి విరుచుకుపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ పేరు చెబితేనే ఛీకొడుతున్నారన్నారు. చేతగాని సీఎంగా రేవంత్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు. -
మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవ్వాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో మక్కల కొనుగోళ్లను మూడు రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో మక్కలు, జొన్నల సేకరణపై సమీక్ష నిర్వహించారు. జొన్నల కొనుగోళ్లను సైతం వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో గోదాములకు తరలించి నిల్వ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 39,903 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 20,718 మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ క్రాంతి, డీఏవో మోహన్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్రామసభలతో సమస్యలకు పరిష్కారం
● పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దోమకొండ: గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం గొట్టిముక్కులలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 532 గ్రామపంచాయతీలలో నాలుగు విడతలలో ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నామన్నారు. గురువారం జిల్లాలోని 136 గ్రామాల్లో సభలు నిర్వహించామని, 6, 8, 10 తేదీలలో మిగిలిన చోట్ల గ్రామసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధు లను దూరంగా ఉంచవచ్చన్నారు. ఆకుపచ్చ రంగు బుట్టలో తడి వ్యర్థాలు, నీలం రంగు బుట్టలో పొడి వ్యర్థాలు, ఎరుపు రంగు బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నల్ల రంగు బుట్టలో ప్రత్యేక వ్యర్థాలను వేరు చేసి గ్రామపంచాయతీకి అందించాలని ప్రజలకు సూచించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ఆయిల్పాం సాగుకు మొగ్గు చూపా లని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు అందరూ సహకరించాలన్నా రు. ప్రత్యేక ఓటరు స వరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో సర్పంచ్ సంజీవ్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్కుమా ర్, తహసీల్దార్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రంలో భారీ వర్షం
కలెక్టరేట్ వద్ద 82 ఎంఎం వర్షపాతం నమోదు కామారెడ్డి క్రైం: జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో దాదాపు 45 నిమిషాల పాటు వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కలెక్టరేట్ వద్ద 82 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. భిక్కనూరులో 71.3, దోమకొండలో 56, పాతరాజంపేటలో 39.8, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 24.8, రామారెడ్డిలో 10, సదాశివనగర్లో 9.8, పిట్లంలో 7, బిచ్కుందలో 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి చుట్టుపక్కల భారీ వర్షం కురియడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో గోదాములకు తరలించడానికి సిద్ధంగా ఉన్న వరి, మక్క, జొన్న బస్తాలు, కుప్పలు తడిసిపోయాయి. -
నేడు బల్దియా సమావేశం
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియా సాధారణ అత్యవసర సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన నిర్వహించనున్నారు. మున్సిపల్ అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించి 17 అంశాలతో రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించనున్నారు. ఇతర అంశాలు.. పట్టణంలో నీటి సరఫరా నిర్వహణ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రెయినేజీలలో పూడికతీత, పొక్లెయిన్ల కాంట్రాక్టులు, వీధి దీపాల కొనుగోలు, పార్కుల అభివృద్ధి వంటి పలు అత్యవసర ఇంజినీరింగ్ పనుల కోసం సిద్ధం చేసిన రూ. 1.28 కోట్ల అంచనాలకు పరిపాలనా అనుమతి కోరనున్నారు. అక్రమ కుళాయిలు, 2019లో మున్సిపాలిటీలో విలీనమైన 7 గ్రామ పంచాయతీల్లోని ఆన్లైన్ కాని నల్లా కనెక్షన్లను గుర్తించి, నెలకు రూ. 100 చొప్పున బిల్లు వసూలు చేస్తూ క్రమబద్ధీకరించే అంశంపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. కోతులను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టే ప్రత్యేక ఏజెన్సీ సేవలకు గాను రూ. 10 లక్షల సాధారణ నిధుల వ్యయానికి ఆమోదం తెలపనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 3.71 కోట్ల కంపోస్ట్ ప్లాంట్ పనులు, రూ. 1.62 కోట్ల డీఆర్సీసీ పనులతో పాటు, రోజుకు 30–50 టన్నుల సామర్థ్యం గల వ్యర్థాల నిర్వహణ యంత్రాల సేకరణ అంశంపై చర్చించనున్నారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రారంభమయ్యే సమావేశానికి కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని చైర్పర్సన్ ఉమారాణి కోరారు.శ్మశాన వాటిక అభివృద్ధికి..కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోగల శ్మశాన వాటికలో కనీస వసతులు లేక అంతిమ సంస్కారాల నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్ఆర్ ఫౌండేషన్ స్పందించి సొంత నిధులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. అనుమతులు ఇప్పించాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరగా.. దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతులను కౌన్సిల్ ముందు ఉంచారు. ఎజెండా అంశంలో సైతం ‘సాక్షి’ పేరును పొందుపరిచారు. కౌన్సిల్ దీనిని ఆమోదించి ఎస్ఆర్ ఫౌండేషన్కు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నారు. ఎజెండా అంశంగా ‘సాక్షి’ కథనం వైకుంఠధామం అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థకు అనుమతివ్వనున్న కౌన్సిల్ -
జిల్లా రవాణా అధికారిగా సంతోష్ కుమార్
కామారెడ్డి క్రైం: జిల్లా రవాణా అధికారిగా సంతోష్ కుమార్ నియమితులయ్యారు. ఇ క్కడ ఇన్చార్జి డీటీవోగా విధులు నిర్వర్తించి న శ్రీనివాస్ వరంగల్కు బదిలీపై వెళ్లారు. ఆ యన స్థానంలో మంచిర్యాలలో ఎంవీఐగా పనిచేస్తున్న సంతోష్కుమార్ పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. జిల్లా రవాణా శాఖలో ఖాళీగా ఉన్న రెండు ఎంవీఐ పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట నుంచి శంకర్ నారాయణ, ఆదిలాబాద్ నుంచి ప్రదీప్ కుమార్ బదిలీపై వచ్చారు. డీటీ వో, ఇద్దరు ఎంవీఐలు గురువారం బాధ్యత లు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీడబ్ల్యూవో బదిలీ కామారెడ్డి క్రైం: జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి ప్రమీల ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. అమె స్థానంలో ఎల్లారెడ్డి ఏసీడీపీవోగా పనిచేస్తున్న ప్రసన్నకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆమె బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ను కలిశారు. బదిలీపై వెళ్తున్న డీడబ్ల్యూవో ప్రమీలను కలెక్టర్ సత్కరించారు. ‘నిరంతరం మిల్లింగ్ జరిగేలా చూడాలి’ భిక్కనూరు : సీఎంఆర్ పెండింగ్ల నివారణ కు నిరంతరం మిల్లింగ్ జరిగేలా చూడాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి వెంకేటేశ్వ ర్లు రైస్మిల్లర్లకు సూచించారు. గురువారం ఆయన భిక్కనూరు, రామేశ్వర్పల్లి గ్రామా ల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024–2025 రబీ, ఖరీఫ్, 2025–2026 రబీ సీజన్కు సంబంధించిన పెండింగ్ సీఎంఆర్ ను పూర్తి చేసేందుకు మిల్లింగ్ యూనిట్లను నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఆ యన వెంట పౌరసరఫరాలశాఖ జిల్లా మేనే జర్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య తదితరులు ఉన్నారు. ‘తొలిరోజే పాఠ్య పుస్తకాలు అందించాలి’ కామారెడ్డి టౌన్ : ప్రభుత్వ పాఠశాలల వి ద్యార్థులకు నూతన విద్యాసంవత్సరం ప్రా రంభం రోజే పాఠ్యపుస్తకాలు అందేలా చూ డాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.మల్లికార్జున్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తకాల గోదాంను గురువారం ఆయన సందర్శించి, పుస్తకాల నిల్వ లు, పంపిణీ రికార్డులను పరిశీలించారు. పా ఠశాలలకు పుస్తకాల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని, మండలాల వారీగా కేటాయింపులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట పాఠ్యపుస్తకాల నోడల్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ఇన్చార్జి మేనేజర్ గిరిప్రసాద్ తదితరులున్నారు. నాణ్యమెన విత్తనాలను విక్రయించాలి తాడ్వాయి: నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం తాడ్వాయి, దేమికలాన్, ఎర్రాపహాడ్ గ్రామాలలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిర్ణీత ధరలకే రైతులకు ఎరువులు, విత్తనాలను విక్రయించాలన్నారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఏవో నర్సింలు తదితరులున్నారు. -
షబ్బీర్ గడ్డం!
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uV/sఅధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ముదిరిపాకాన పడుతోంది. ఈ పంచాయితీ గాంధీ భవన్కు చేరింది. జిల్లాకేంద్రంలోని రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.కామారెడ్డి టౌన్ : కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గంలో పట్టు కోసం సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గంతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి వర్గాలు కృషి చేస్తున్నాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వైకుంఠధామం విషయంలో.. కామారెడ్డి పట్టణంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అయితే అవసరమైన అనుమతులు ఇచ్చే విషయంలో బల్దియా పాలకవర్గం నాన్చివేత ధోరణితో వ్యవహరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ విమర్శలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఉద్దేశించినవేనంటూ ఆయన వర్గం నేతలు గతనెల 31వ తేదీన గాంధీభవన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గడ్డం చంద్రశేఖర్రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. చంద్రశేఖర్రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ షబ్బీర్ అలీ వర్గం ఇచ్చిన ఫిర్యాదులు, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ గురువారం గడ్డం చంద్రశేఖర్రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బహిరంగంగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, క్రిమినల్ కేసుల్లో ప్రమేయం కలిగి ఉండడం, సీనియర్ నాయకుడి ప్రతిష్టకు, కాంగ్రెస్ ఇమేజ్కు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలపై ఈనెల 11 వ తేదీలోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని టీపీసీసీ డీఏసీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ నోటీసులు జారీ చేశారు. చర్చనీయాంశంగా వర్గపోరు.. అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇరు వర్గాలు త్రీవ స్థాయిలో పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంపై పా ర్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. షబ్బీర్ అలీ వర్గం ఫిర్యాదుతో స్పందించిన పార్టీ క్రమశిక్షణ సంఘం.. చంద్రశేఖరరెడ్డికి షోకాజ్ నోటీసు లు జారీ చేసింది. చంద్రశేఖరరెడ్డి వ ర్గం ఇచ్చిన ఫిర్యా దులపై ఎలా స్పందిస్తుందోన న్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. గాంధీ భవన్కు చేరిన కాంగ్రెస్ పంచాయితీ పరస్పర ఫిర్యాదులతో వేడెక్కిన రాజకీయం జిల్లాలో హాట్ టాపిక్గా మారిన హస్తంలో అంతర్గత పోరు -
షబ్బీర్ అలీపై ఫిర్యాదు..
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డికి నోటీసులు జారీ అయిన రోజే ఆయన వర్గం సైతం షబ్బీర్ అలీపై పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మామిండ్ల అంజయ్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ గురువారం మల్లు రవిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు. షబ్బీర్ అలీ కామారెడ్డిలో పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నారని, గత ఎన్నికల్లో ఆయన సరిగా పనిచేయకపోవడం వల్లే రేవంత్రెడ్డి ఓడిపోయారని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ కుటుంబంలోని వ్యక్తులు నియోజకవర్గంలో అరాచకాలు సాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి షబ్బీర్ అలీ కుటుంబం కుట్రలు చేసిందని, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అభ్యర్థి వద్ద డబ్బులు తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ పీఠం కట్టబెట్టారని ఆరోపణ చేశారు. -
పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదం
కామారెడ్డి టౌన్: మండల పరిధిలోని గర్గుల్ గ్రామ వడ్లూరు శివారు వ్యవసాయ పొలాల్లో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. పొలాల మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్లకు సంబంధించిన వైర్లు భూమికి చాలా తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో రైతులు, కూలీలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పనులు చేసుకుంటున్నారు. విద్యుత్ స్తంభాలు వంగిపోయి, వైర్లు కిందికి జారిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పొలాల్లో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు తిప్పాల్సి వస్తోందని, వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. అలాగే పొలాల గట్ల వెంబడి మేతకు వెళ్లే పశువులకు కూడా ఈ వైర్లు ముప్పుగా మారాయి. ఈ ప్రమాదకర పరిస్థితిపై గతంలోనే పలుమార్లు స్థానిక లైన్మాన్తో పాటు సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే వైర్లను సరిచేయాలని గర్గుల్ గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యేనా..?
● ఏడేళ్ల క్రితమే మంజూరు ● నేటికీ పూర్తికాని ప్రక్రియ ● ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఆశలుమద్నూర్(జుక్కల్): జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్. ఇది ఎవరూ కాదనలేని నిజం. చీకటిలో చిరుదివ్వెలా జిల్లాలో కేవలం మద్నూర్ మండలానికి కేంద్రీయ విద్యాలయం(కేవీ) 2019లో మంజూరైంది. నేటికి పనులు మొదలు కాకపోవడంతో మద్నూర్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఉంటుందా లేక తరలిపోతుందా అనే అనుమానం కలుగుతోంది. 2019 నుంచి నేటి వరకు కేంద్రీయ విద్యాలయం ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల సంస్థ సూచనల మేరకు అధికారులు మండల కేంద్రంలో తాత్కాలిక భవనాలను కూడా ఎంపిక చేశారు. భవన నిర్మాణం కోసం మండల కేంద్రంలో 5 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేశారు. మండల రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సైతం అందించారు. కేంద్రీయ విద్యాలయం అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించారు. అయినా ఇంత వరకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై స్పష్టత రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు చింతిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, డీఈవో రాజులతో సమావేశమై మండల కేంద్రంలోని భవన నిర్మాణం కోసం స్థలాన్ని చూపించారు. అలాగే స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించుకోవచ్చని కేంద్రీయ అధికారులకు ఎమ్మెల్యే వివరించారు. కాని ఇంత వరకు కేంద్రీయ విద్యాలయంపై కదలిక లేకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022లో రిలే నిరాహార దీక్ష మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని 2022లో మద్నూర్ ప్రజలంతా ఏకమై తహసీల్ కార్యాలయ ఆవరణలో 5 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మద్నూర్లో కేంద్రీయ విద్యాలయం నెలకొల్పడానికి అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న బీబీ పాటిల్, హన్మంత్సింధేలు ప్రత్యేక చొరవ తీసుకుంటామని రిలే నిరాహార దీక్ష విరమించాలని కోరడంతో ఐదు రోజులుగా నిర్వహించిన నిరాహార దీక్షను విరమించారు. ఆ తర్వాత యువకులు కేంద్రీయ విద్యాలయంపై పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సైతం అందజేశారు. కాని నేటికీ కేంద్రీయ విద్యాలయ నిర్మాణంపై, తాత్కాలిక తరగతుల ప్రారంభంపై ఎలాంటి సమాచారం లేదు.కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలతో పాటు పేద విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయంలో సీట్లు కేటాయిస్తారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైతే ఎంతో మందికి విద్యావకాశాలు మెరుగుపడతాయి. తద్వార విద్యారంగం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికై నా ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావులు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం మొదలుపెట్టి తాత్కాలిక కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
రాజీవ్ యువ నీరసం
లోన్● జిల్లాలో యువ వికాసం పథకానికి 44,742 దరఖాస్తులు ● ఏడాది దాటినా నిధులివ్వని సర్కారు ● నిరాశలో దరఖాస్తుదారులుగతేడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని, తొలివిడతలో మొదటి రెండు కేటగిరీలకు ముందుగా నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో దీనిపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పథకం ఊసే ఎత్తలేదు. దీంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పథకాన్ని పట్టాలెక్కించాలని కోరుతున్నారు.రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించింది. నాలుగు కేటగిరీల్లో చిన్నచిన్న వ్యాపారాలకు సంబంఽధించిన యూనిట్లు మంజూరు చేయడం కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మొదటి కేటగిరీ కింద రూ. 50 వేల యూనిట్కు 100 శాతం సబ్సిడీ, రెండో కేటగిరి కింద రూ.లక్ష యూనిట్కు 80 శాతం, మూడో కేటగిరీలో రూ. 2 లక్షల యూనిట్కు 70 శాతం, నాలుగో కేటగిరీలో రూ. 5 లక్షల యూనిట్కు 50 శాతం సబ్సిడీ అందిస్తామని ప్రకటించింది. సబ్సిడీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాలు పొందాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తించాక తుది జాబితాను సిద్ధం చేసి గతేడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున యూనిట్లను మంజూరు చేస్తామని పాలకులు చెప్పడంతో నిరుద్యోగులు ఆశతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. భారీగా దరఖాస్తులు.. రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లావ్యాప్తంగా మొత్తం 44,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 8,346, ఎస్టీ కార్పొరేషన్ 4,604, మైనారిటీ కార్పొరేషన్కు 6,880, ఓబీసీ కార్పొరేషన్కు 1,006, బీసీ కార్పొరేషన్కు 23,906 దరఖాస్తులు వచ్చాయి. నాలుగు కేటగిరీలలో మొదటి రెండు కేటగిరీలకే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం.. దరఖాస్తుల స్వీకరణకే పరిమితమయ్యింది. నిధులు కేటాయించకపోవడంతో ఒక్కరికి కూడా పథకం ఫలాలు అందలేదు. ఈ పథకాన్ని ప్రకటించి ఏడాది దాటినా అడుగు ముందుకు పడకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. – కామారెడ్డి క్రైంస్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీపై రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే సంతోషించా. డెయిరీ ఫాం కోసం రూ.లక్ష యూనిట్కు దరఖాస్తు చేసుకున్నా. దరఖా స్తు చేసుకుని ఏడాది గడిచినా ఫలితం లేదు. యూనిట్లు మంజూరు చేసి యువతను ప్రోత్సహించాలి. – శివకుమార్, గాంధారిరాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా పాలకేంద్రం పెట్టుకోవడం కోసం రూ. 5 లక్షల యూనిట్కు దరఖాస్తు చేసుకున్నా. నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికీ యూనిట్ మంజూరు కాలేదు. పాలకులు స్పందించి యూనిట్లు మంజూరు చేయాలి. – సాయిబాబా, బాన్సువాడ -
చేతికందుతున్న కరెంట్ తీగలు
● ప్రమాదం జరగకముందే సరి చేయాలని కోరుతున్న స్థానికులు ● పట్టించుకోని ట్రాన్స్కో అధికారులుఎల్లారెడ్డి: మండలంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ తీగలు చేతికందేలా వాలిపోయి ప్రాణాంతకంగా మారినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారు పొలాల్లో విద్యుత్ తీగలు చేతికందేలా జారాయి. ఈ కారణంగా పొలాల్లో పనిచేయడానికి రైతులు భయపడుతున్నారు. ట్రాక్టర్తో దున్నడానికి పొలంలోకి దిగితే వేలాడుతున్న తీగల కారణంగా ఒక మడి నుంచి వేరే మడికి వెళ్లడానికి ట్రాక్టర్ డ్రైవర్లు భయపడి దున్నకుండా వదిలి వెళ్లిపోతున్నారు. తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కల్యాణి ప్రాజెక్ట్ కట్ట గత సెప్టెంబర్లో తెగిపోయి, తిమ్మారెడ్డి వాగు పొంగి పొర్లినప్పుడు వందలాది కరెంట్ పోల్స్, వాటి విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు వరదనీటిలో కొట్టుకుపోయి తిమ్మారెడ్డి శివారులోని కొత్త హన్మాండ్ల గుడి వెనక ఒక కుంటలో నిలిచిపోయాయి. కుంటలో పశువులు నీళ్ల కోసం దిగితే కరెంట్ వైర్లు చుట్టుకుని పశువుల ప్రాణాలు పోతున్నాయి. మూడు రోజుల క్రితం ఈ కుంటలో రెండు గేదెలు కొమ్ములకు కరెంట్ తీగలు చుట్టుకుని ప్రాణాపాయ స్థితిలో మునిగిపోతుండగా స్థానికులు చూసి రక్షించారు. కుంటలోకి కొట్టుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ తీగలను తీయకపోవడంతో నీళ్లలో నాని అవి నిరుపయోగంగా మారిపోయాయి. ఈ విషయమై రైతులు లైన్మెన్లకు తెలిపినా వారు పట్టించుకోలేదు. గ్రామాలలో పరిస్థితి ఇలా ఉంటే ఎల్లారెడ్డి పట్టణంలోని పలు శివారు ప్రాంతాలలో కరెంట్ తీగలు చేతికందేలా కిందకు వేలాడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టణంలోని కుమార్ గల్లీలో జనావాసాల మధ్య ఉన్న మెయిన్ లైన్లు కూడా కిందకు వేలాడుతున్నాయని, పట్టణంలో కలిసి పోయిన గండి చెరువు శివారు భూముల్లో సైతం విద్యుత్ వైర్లు చేతికందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గాలి వాన కారణంగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి కరెంట్ తీగలు కిందకు వాలుతున్నాయని ట్రాన్స్కో అధికారులు అంటున్నా.. ఇవి ఆరు నెలలకు పైగా కిందకు వేలాడుతున్నాయని ప్రజలు అంటున్నారు. తక్షణం సరిచేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని వారు కోరుతున్నారు.తిమ్మారెడ్డి శివారులోని తమ పొలాల్లో కరెంట్ వైర్లు నేలకు వేలాడుతున్నాయని 2025, సెప్టెంబర్ 19న ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా వాటిని సరిచేయనేలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యవసాయం చేయాల్సి వస్తోంది. – హఫీజ్ పటేల్, రైతు, తిమ్మారెడ్డి -
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన పునర్నిర్మాణానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నిధులు మంజూరు చేయించడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత సంవత్సరం భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోయిన విషయం విదితమే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వంతెన నిర్మాణం కోసం రూ.4 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్): ఈ విద్యా సంవత్సరం నుంచి పెద్దకొడప్గల్, కాస్లాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించబోతున్నట్లు బుధవారం ఎంఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఆయా పాఠశాలల్లో నాలుగు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ప్రీ ప్రైమరీ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవచ్చని, విద్యార్థులకు ప్రత్యేక తరగతి గది, ఆట వస్తువులు, బొమ్మలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల్లోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. -
జీజీహెచ్లో ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతం
సుభాష్నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన తొలి, క్లిష్ట ప్లాస్టిక్ సర్జరీలు రెండు విజయవంతమయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ నాగమోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన లచ్చవ్వ ముఖంపై ఎడమ కన్ను కింద భాగంలో బాసల్ సెల్ కార్కినోమ వ్యాధితో బాధపడుతోంది. వ్యాధి నిర్ధారణ కావడంతో శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ విజయ్కుమార్ పర్యవేక్షణలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివానీ ఆధ్వర్యంలో రొటేషన్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా నగరానికి చెందిన మమత కాలిభాగంలో దీర్ఘకాలంగా మానని గాయం కారణంగా తీవ్రంగా బాధపడుతోంది. ఆమెకు ఫ్లాప్ కవర్, స్ల్పిట్ థిక్నెస్ స్కిన్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. చికిత్స ద్వారా రోగులు సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని సూపరింటెండెంట్ నాగమోహన్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు జీజీహెచ్లో అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు అత్యాధునిక సేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యబృందం కట్టుబడి ఉందన్నారు. వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. -
జొన్నల కొనుగోళ్లను పూర్తి చేయాలి
గాంధారి: వర్షాకాలం సమీపిస్తున్నందున జొన్నల కొనుగోళ్లు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. వడ్లు, మక్కలు, జొన్నల కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొతంగల్ కలాన్, గుర్జాల్లలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కాంటా చేసిన బస్తాలను తరలించేందుకు వీలైనంత తొందరగా లారీలను పంపిస్తామన్నారు. ఆయన వెంట డీసీవో రామ్మోహన్, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్, మాజీ సర్పంచ్ సంజీవు తదితరులున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఈవో మల్లికార్జున్
కామారెడ్డి టౌన్ : జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన ఎల్.మల్లికార్జున్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో సెక్టోరల్ అధికారులు, కోఆర్డినేటర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. పాత డీఈవోకు వీడ్కోలు.. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి బదిలీపై హైదరాబాద్ కార్యాలయానికి వెళ్తున్న ఎస్.రాజును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. అలాగే డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి సాదరంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భిక్కనూరు: కూతురును సర్కారు బడిలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ సర్పంచ్. వివరాలిలా ఉన్నాయి. కాచాపూర్ సర్పంచ్ జ్యోతి సంతోష్గౌడ్ కూతురు లక్ష్మీప్రసన్న ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. బడిబాటలో భాగంగా ఇంటింటికి వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చెబుతున్న సర్పంచ్.. ముందుగా తన కూతురును గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేర్పించారు. ఆమెను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సుభాన్రెడ్డి, ఉపసర్పంచ్ దశరథం పాల్గొన్నారు. ● ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ సంయుక్త కార్యదర్శి అనిల్ తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులలో సీట్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచాలని తెయూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంయుక్త కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో తెయూ వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరిరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలను 60 కి పెంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, కార్యకర్తలు సంజీవ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు
బాన్సువాడ రూరల్: సాధారణ బదిలీల్లో భాగంగా బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బదిలీ కాగా వారి స్థానంలో ఇతర గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వచ్చి బుధవారం విధుల్లో చేరారు. బోర్లం పంచాయతీ కార్యదర్శిగా శివాజీ, రాంపూర్కు సాయిలు, ఇబ్రాహీంపేట్ తండాకు సాయికుమార్, తాడ్కోల్కు భరత్, కొల్లూర్కు రాఽధిక, కొత్తాబాదికి సృజన్రెడ్డి, సోమేశ్వర్ పంచాయతీకి పాల్త్య రవి, హన్మాజీపేట్కు భానుచందర్, కోనాపూర్ కార్యదర్శిగా రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే మండల కార్యాలయ సూపరింటెండెంట్గా భానుప్రకాష్, సీనియర్ అసిస్టెంట్గా సుభాషిణి బదిలీపై వచ్చినట్లు ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. సత్యనారాయణరెడ్డి ఇన్చార్జి ఎంపీవోగా కొనసాగుతారన్నారు. బాన్సువాడ రూరల్: జొన్నల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సంగోజీపేట్ సర్పంచ్ సంగమేశ్వర్ అన్నారు. గ్రామస్తులతో కలిసి బుధవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక్కో రైతు వద్ద ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున ప్రభుత్వ మద్దతు ధర రూ.3,699 చొప్పున జొన్నలు కొనుగోలు చేస్తుందన్నారు. జొన్నలను దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దన్నారు. కాంటా చేసిన బస్తాలు తడవకుండా చూడాలన్నారు. సహకారశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు బుధవారం తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 40 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడు సంపత్గౌడ్ సమక్షంలో చేరారు. వారికి ఆయన తన నివాసంలో కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్సింగ్, బ్యాగరి సాయిలు, మహేందర్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన రాజారాం అనిల్ కుమార్ ప్రమాదవశాత్తూ కుడి చేయిని కోల్పోయాడు. ఈ విషయం ప్రముఖ శాస్త్రవేత్త, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డికి వివరించగా ఆయన కృత్రిమ(ఫైబర్) చేతిని తయారు చేయించి బాధితుడికి అమర్చారు. దాంతో యువకుడు బైక్ నడపడంతో పాటు చిన్న చిన్న వస్తువులను పట్టుకునే విధంగా చేతిని అమర్చినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కృత్రిమ చేతికి అయ్యే ఖర్చును పైడి ఎల్లారెడ్డి భరించినట్లు తెలిపారు. మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్, సుభాష్, అనిల్, నరేష్ భగవాన్, రమేశ్, గణే ష్, తదితరులు పాల్గొన్నారు. ● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిజాంసాగర్(జుక్కల్): ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు, అధికారులు తమ వంతు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. సొంతిల్లు లేక ఇంటి స్థలం ఉన్న వారికి రెండో విడత ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. -
7 లోగా మక్క కొనుగోళ్లు పూర్తవ్వాలి
● రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సదాశివనగర్: మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను ఈనెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన పద్మాజీవాడి, మోడెగాం గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పద్మాజీవాడి సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు 18,840 క్వింటాళ్ల మక్కలను సేకరించామన్నారు. ఇందులో 15వేల క్వింటాళ్లను గోదాంలకు తరలించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు సుబ్బారావు, గౌడెల్లి గంగాధర్, విండో చైర్మన్ గంగాధర్, అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, విండో సీఈవో దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: బడిబాటను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. బుధవారం హైదరాబాద్నుంచి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ అభినవ్ అభిలాష, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలిస్, హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలు కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బడి బాట, ప్రవేశాల ప్రత్యేక కార్యక్రమంపై చర్చించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భవిత కేంద్రాల బలోపేతం, కొత్త ప్రీప్రైమరీ విభాగాల ప్రారంభం, జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలల పునఃప్రారంభం, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ సకాలంలో పంపిణీ చేయడంతో పాటు, సెర్ప్ బృందాల ద్వారా యూనిఫాంల తయారీ, పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో విద్యా కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణతో పాటు రోజువారీ పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఈవో మల్లికార్జున్, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల హబ్గా కామారెడ్డి!
● స్పోర్ట్స్ కాంప్లెక్స్గా మార్చేందుకు రూ. 9 కోట్లు మంజూరు ● మారనున్న ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలుకామారెడ్డి టౌన్ : కామారెడ్డిని క్రీడల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని అత్యాధునిక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా మార్చేందుకు రూ. 9 కోట్లు మంజూరు చేసింది. జిల్లాకేంద్రంలో ఐదెకరాల విస్తీర్ణంతో స్టేడియం ఉంది. దీనిని ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. దీనిని అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం ఆయన దృష్టి సారించారు. యువతను వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడల వైపు మళ్లించాలనే సంకల్పంతో స్టేడియం అభివృద్ధికి రూ. 9 కోట్లు మంజూరు చేయించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి అదనంగా ఎకరం స్థలం కేటాయించేలా చూశారు. దీనికితోడు స్టేడియంలో డ్రెయినేజీ, మౌలిక వసతుల కల్పన కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ. కోటి విరాళాన్ని అందించింది. మొత్తం రూ. 10 కోట్ల నిధులతో స్టేడియాన్ని అభివృద్ధి చేయనున్నారు. పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిధిలోని పోలీస్ సిబ్బంది, అథ్లెట్లు తమ షూటింగ్, రన్నింగ్ ప్రాక్టీస్, అథ్లెటిక్ ఈవెంట్ల శిక్షణ కోసం హైదరాబాద్ లేదా వరంగల్కు వెళ్లాల్సి వస్తోంది. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని అభివృద్ధి చేశాక ఇక్కడే ఆయా అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి వీలుంటుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కామారెడ్డి వేదికగా జాతీయ స్థాయి పోటీలతో పాటు టీ–20 క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేలా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సీఎంతో చర్చించి త్వరలోనే స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు.ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నారు. మల్టీపర్పస్ ఇండోర్ విభాగాల్లో అత్యాధునిక జిమ్, రైఫిల్ షూటింగ్, టేబుల్ టెన్నిస్, నాలుగు బ్మాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టు, యోగా హాల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అవుట్డోర్ క్రీడలైన క్రికెట్, వాలీబాల్, హాకీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్లడ్లైట్లను అమర్చనున్నారు. వాకింగ్, రన్నింగ్ కోసం ప్రత్యేకంగా 8 లేన్ల ట్రాక్ను ఏర్పాటు చేస్తారు. స్టేడియం ఆవరణలో ఆధునిక స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించనున్నారు. -
చిమ్మ చీకట్లో సర్కార్ దవాఖానా
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చీకట్లు కమ్ముకున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో 2 గంటల పాటు ట్రాన్స్కో అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆస్పత్రిలో రోగులు చీకట్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు కరెంట్ లేక.. ఫ్యాన్లు తిరగక, చీమ్మ చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అర్ధరాత్రి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులకు టార్చ్లైట్ వెలుతురులో వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న వార్డు సభ్యులు నరేష్, తుకారం ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. డ్యూటీలో ఉన్న నర్సులు, సిబ్బందికి లైట్, ఫ్యాన్ సౌకర్యం ఉంది.. రోగులకు మాత్రం ఏమీ లేదు. వైద్య సిబ్బంది ఉన్న చోట ఇన్వర్టర్ ఏర్పాటు చేసి రోగులు ఉన్న చోట ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ తీరుపై మండిపడ్డారు. అలాగే ఆస్పత్రిలో రాత్రి ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో కనీసం జనరేటర్ సౌకర్యం లేకపోవడం ఏమిటన్నారు. ఇప్పటికై నా ఆస్పత్రి సూపరింటెండెంట్, అధికారులు స్పందించి ఆస్పత్రిలో జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం పాదయాత్ర
బీబీపేట: ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో పేరు వచ్చినప్పటికీ కొన్ని తప్పుల వల్ల ఆన్లైన్లో పేరు కనిపించడం లేదని, లిస్టులో నుంచి పేరు తొలగించడంతో ఆ కుటుంబం మొత్తం బీబీపేట నుంచి జిల్లా కలెక్టరేట్కు పాదయాత్రగా వెళ్లిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. కామారెడ్డి జిల్లా బీబీపేటకు చెందిన ఎల్లమైన నందినికి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో లబ్ధిదారు అప్పటికే శిథిలావస్థలో ఉన్న ఇల్లును కూల్చి ముగ్గు పోసుకున్నారు. తీరా చూశాక ఆన్లైన్లో నుంచి పేరు తొలగించారని, ఆన్లైన్లో పేరు కనిపించడం లేదని నిర్మాణానికి అధికారులు మంజూరు ఇవ్వలేదు. దీంతో బాధితులు కుటుంబంతో సహా అధికారుల చుట్టూ మూడు నెలలుగా తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతూ బుధవారం నందిని కుటుంబ సభ్యులు బీబీపేట నుంచి పాదయాత్రగా కలెక్టరేట్కు కాలినడకన బయల్దేరి వెళ్లారు. దోమకొండ వరకు పాదయాత్రగా వెళ్లగానే మండల స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి హుటాహుటిన బీబీపేటకు వచ్చి వివరాలు సేకరించారు. పాదయాత్రగా వెళ్తున్న కుటంబ సభ్యులను పిలిచి మంజూరు పత్రం అందించి ఇంటి నిర్మాణానికి స్థానిక ఎంపీడీవో పూర్ణచంద్రదోయకుమార్ చేతుల మీదుగా ముగ్గు పోయించారు. దీంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఉపాధి పనుల పరిశీలన నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో ఉపాధి పనులను బుధవారం ఎంపీడీవో అనిత పరిశీలించారు. కొలతల ప్రకారంగా ఉపాధి పనులు చేస్తేనే కూలీలకు కూలీ గిట్టుబాటు అవుతుందన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్ జముల శంకర్, కూలీలు ఉన్నారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు బుధవారం గ్రామ సర్పంచ్ గొట్టం అనుసూజ చేతుల మీదుగా మజ్జిగ, చల్లని నీటిని అందజేశారు. ఉపాధి కూలీలు ఎండదెబ్బ బారిన పడకుండా మజ్జిగతో పాటు చల్లని నీటిని అందుబాటులో ఉంచామని సర్పంచ్ తెలిపారు. డీసీసీ కార్యదర్శి గొట్టం నర్సింలు, నాయకులు గొల్ల మల్లయ్య యాదవ్, పౌలు, గంగి చిన్ననారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.కోమట్పల్లి వీడీసీ అధ్యక్షుడిగా గంగారాం లింగంపేట(ఎల్లారెడ్డి): కోమట్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ) అధ్యక్షుడిగా వేల్పుల గంగారాంను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గంగమల్లు, కోశాధికారిగా బాల్రాజు, కమిటీ సభ్యులుగా శంకర్, కాశీరాం, గంగారాం, శ్రీధర్, రమేశ్గౌడ్, అల్లిరాజులను ఎన్నుకున్నట్లు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం మండల కార్యవర్గం ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా కమ్మరి సిద్దిరాములుచారి(కొండాపూర్), ఉపాధ్యక్షులుగా కమ్మరి వెంకటిచారి, వడ్ల రాజుచారి, ప్రధాన కార్యదర్శిగా అవుసుల లక్ష్మణ్చారి, కోశాధికారిగా వడ్ల రాజేందర్చారి, కార్యదర్శిగా అవుసుల శ్రీనివాస్చారిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్ల భీమయ్యచారి, రవికుమార్, వెంకటేశం, పండరి, మురళి, తదితరులు పాల్గొన్నారు.సంక్షిప్తం -
ప్రజాపాలనలోప్రగతి పరుగులు
మాట్లాడుతున్న వీహెచ్కామారెడ్డి క్రైం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో సాగుతున్న ప్రజాపాలనతో తెలంగాణలో ప్రగతి పరుగులు తీస్తోందని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముందుగా హైదరాబాద్ రోడ్లోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజా పరిపాలనను మరింత వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడం, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేకమైన వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహించి 4,170 మందిని పరీక్షించారని హనుమంతరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు, క్రీడలలో ఉత్తమ ప్రదర్శన సాధించిన పది మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించామన్నారు. వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని హనుమంతరావు వివరించారు. ఆ వివరాలు.. ● యాసంగిలో ఇప్పటివరకు 4,01,257 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసి రూ. 839.48 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశాం. ● ఈ ఏడాది మృతి చెందిన 627 రైతుల కుటుంబ సభ్యులకు రూ. 31.35 కోట్ల రైతు బీమా పరిహారాన్ని అందించాం. ● రైతు భరోసా కింద యాసంగిలో 3,09,281 మంది రైతులకు రూ.220.30 కోట్ల పెట్టుబడి సాయం ఇచ్చాం. ● యాసంగిలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 36,662 మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించాం. ● 66 కొనుగోలు కేంద్రాల ద్వారా 14 వేల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు, జొన్న, శనగలను కొనుగోలు చేశాం. ● మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 1,51,342 మంది లబ్ధిదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశాం. ఇందుకుగాను ప్రభుత్వం రూ.16.05 కోట్ల సబ్సిడీ అందించింది. ● 64 మంది దివ్యాంగులకు రూ.76.80 లక్షలతో రెట్రోఫిటెడ్ స్కూటీలను పంపిణీ చేశాం. ● వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న 5, 513 మందికి రూ. 3.73 కోట్ల ఉపకార వేతనాలు చెల్లించాం. ● 3,419 మంది విద్యార్థులకు రూ.1.60 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ● బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా గత విద్యా సంవత్సరంలో 758 విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో ప్రవేశం కల్పించి, రూ.2.74 కోట్లను ఫీజుల రూపంలో చెల్లించాం. ● గృహ జ్యోతి పథకం కింద 1,73,803 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తున్నాం. దీనికి రూ.137.81 కోట్లు ఖర్చు చేశాం. ● 1,17, 667 వ్యవసాయ బోరుబావులకు రూ. 25.68 కోట్ల విలువైన ఉచిత విద్యుత్ అందించాం. ● జిల్లాలో 2,248 ఇందిరమ్మ ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు, 1,325 ఇళ్లు గోడల వరకు, 3,794 స్లాబ్ వరకు పూర్తయ్యాయి. 1,816 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించి లబ్ధిదారులకు రూ. 226.14 కోట్లు చెల్లించాం.రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. యోగా ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ రూ.50 వేలు అందించారు. అనంతరం రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవారికి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను అథితులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఏఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కృషి ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు జిల్లాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు -
గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలి
● రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకామారెడ్డి క్రైం: గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదికారులతో మాట్లాడారు. బుధవారం నుంచి 12 వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలపై పలు సూచనలు ఇచ్చారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రజల సమస్యల స్వీకరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పురోగతి తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. వీసీలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారు
● బీసీల హక్కుల కోసం రాహుల్, రేవంత్ కృషి.. ● ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావుకామారెడ్డి టౌన్ : ‘బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అదే బీసీలకు ద్రోహం చేస్తున్నారు. అగ్రకులాలకు చెందిన నాయకులైనప్పటికీ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డిలు బీసీల అభ్యున్నతి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు’ అని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మా ట్లాడారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం జరగాలంటే వారి ఖచ్చితమైన లెక్క తేలాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్ పట్టుబట్టారన్నారు. తెలంగాణలో బీసీ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జనగణనలో కులగణన వద్దని కేంద్ర ప్రభుత్వం అందని, ఈ విషయమై కోర్టుకు వెళ్లగా కులగణన చేయాల్సిందేనని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. బీజేపీకి ఎన్నికల్లో గెలవడం, భారత్ను హిందూదేశంగా మార్చడమే లక్ష్యాలని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఈసీలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని, విపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకు వాడుకుంటోందని ఆరోపించారు. సర్లో అందరూ భాగస్వాములై అర్హులందరి ఓట్లు ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, నాయకులు మహమ్మద్ నయీ మ్, ఐరేని సందీప్, ఇసాక్ షేరు, అంజాద్, శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, కన్నయ్య, లక్కపత్తిని గంగాధర్, పండ్ల రాజు, గంప ప్రసాద్, కారంగుల అశోక్రెడ్డి, భూమని బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ సమస్యకు చెక్!
● మంజీర నదిలో పూడిక, ముళ్ల చెట్ల తొలగింపునకు నిధులు ● ప్రారంభమైన పనులునాగిరెడ్డిపేట: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యకు చెక్ పడనుంది. నది ఉధృతంగా ప్రవహించినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం రూ. 2.08 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఏటా మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంతంలోని పంటలు ముంపునకు గురవుతున్నాయి. నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మట్టిదిబ్బలు, తుమ్మచెట్లు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, వాడి, చీనూర్, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, మాసాన్పల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల రైతులు ఈ సమస్యతో పంటలు నష్టపోతున్నారు. నదిలోని దిబ్బలు, ముళ్ల చెట్లు, పూడికను తొలగించి పంటలను కాపాడాలని రైతులు ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావు రైతుల సమస్యపై స్పందించారు. మంజీర పరీవాహక ప్రాంత భూముల ముంపు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 2.08 కోట్లు మంజూరు చేసింది. నీరుండడంతో.. ముంపు సమస్య పరిష్కార పనులు నాలుగు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. మంజీర నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన మట్టిదిబ్బలు, ముళ్ల చెట్లు, పూడిక తొలగింపు పనులు చేపట్టారు. నదిలో నీరు ఉండడంతో పనులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నదికి ఒకవైపు ఉన్న ఒడ్డు నుంచి మధ్యలో ఉన్న తుమ్మ చెట్ల వరకు అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. వరదలు వచ్చేలోపు పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. -
‘చేయూత’ అందేదెప్పుడో?
ఎల్లారెడ్డి: చేయూత పెన్షన్లకోసం అర్హులైనవారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని ఆశించినవారికి మళ్లీ నిరాశే మిగిలింది. దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు ఉసూరుమంటున్నారు. నాలుగేళ్లుగా నిరీక్షణ.. గత ప్రభుత్వ హయాంలో 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత కొత్త పింఛన్ల ఊసు లేదు. జిల్లాలో వేలాది మంది అర్హులైనవారు నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకోవడం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం దరఖాస్తులకు సంబంధించిన సైట్ను కూడా మూసివేసింది. కాగా ప్రభుత్వం జూన్ 2వ తేదీన రెండు లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో అర్హులైనవారు ఆయా పింఛన్లకోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మీసేవ కేంద్రాలకు పరుగులు తీశారు. వీరి అవసరాన్ని కొందరు సొమ్ము చేసుకుంటూ రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతో శ్రమకోర్చి అవసరమైన సర్టిఫికెట్లు సమకూర్చుకున్నా చివరికి నిరాశే మిగిలింది. జూన్ 2 వచ్చినా చేయూత పెన్షన్లపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ విషయమై డీఆర్డీవో దామోదర్రెడ్డిని వివరణ కోరగా కొత్త పింఛన్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదన్నారు. అర్హులైన వారి జాబితాను తయారు చేసి ఉంచుకోవాలని మాత్రమే పైఅధికారుల నుంచి సమాచారం అందిందన్నారు. జూన్ 2న కొత్త సామాజిక పెన్షన్లు ఇస్తారని ప్రచారం ఆగమేఘాల మీద ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకున్న ప్రజలు సర్కారు నుంచి ప్రకటన రాకపోవడంతో నిరాశ -
జిల్లాలో 88 శాతం ధాన్యం సేకరణ పూర్తి
నాగిరెడ్డిపేట: జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి 88 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందని డీసీఎస్వో వెంకటేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సివిల్ సప్లయ్ డీఎం శ్రీ కాంత్తో కలిసి మండలంలోని పలు కొ నుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం తరలింపులో తలెత్తుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకున్నారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 4.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సేకరించిన వడ్లకు సంబంధించి 49,803 మంది రైతుల ఖాతాలలో రూ. 846 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధాన్యం సేకరణను పూర్తిచేస్తామన్నారు. ఆయన వెంట విజిలెన్స్ డీటీ సురేష్, ఏపీఎం రాంనారాయణగౌడ్, సొసైటీ సీఈవో సందీప్, సీసీలు నారాయణ, దత్తు తదితరులున్నారు. కామారెడ్డి క్రైం: బదిలీపై వెళ్తున్న అధికారులను కలెక్టరేట్లో మంగళవారం సన్మానించారు. భూగర్భజల శాఖ అధికారి సతీశ్ యాదవ్, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్ బదిలీ అయిన విషయం తెలిసిందే. వీరికి వీడ్కోలు కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం సేవలు ఈనెల 10 నుంచి అందుతాయని పీ ఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ హె ల్త్స్కీం ట్రస్ట్ సభ్యుడు పుల్గం దామోదర్రెడ్డి తె లిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో మాట్లాడారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే మూల వేతనంలో 1.5 శాతం చెల్లింపు ఆప్షన్ ఇస్తారని, ఆందోళనకు అపోహలకు గురి కావద్దని పేర్కొన్నారు. భార్యభర్తలు, ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగి తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మొత్తం ఆరుగురికి హెల్త్స్కీంలో నగదు రహిత ప్రయోజనం ఉంటుందన్నారు. రెండు నెలల్లో పీఆర్సీ సాధిస్తామన్నారు. పాఠశాలల్లో సరస్వతి విగ్రహాలు, జాతీయ నాయకుల ఫొటోల తొలగింపు, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల నియామకం, వేతనాల తగ్గింపు అంశాలను పీఆర్టీయూ వ్యతిరేకిస్తుందన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుషాల్, శ్రీనివాస్రెడ్డి, నాయకులు గోవర్ధన్, సంతోష్కుమార్, హన్మండ్లు, నర్సారెడ్డి, రూప్సింగ్, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్ష ఫలితాలలో ఎస్సీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 182వ ర్యాంక్ సాధించిన సాందీపని కళాశాల విద్యార్థిని బ్రాహ్మణిని మంగళవారం కళాశాలలో సన్మానించారు. జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రతినిధులు ఎ.జనార్దన్రెడ్డి, పెంటయ్య, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్గా ఎంపికయ్యారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ప్రిన్సిపల్కు అభినందనలు తెలిపారు. -
ప్రాచీన కళలకు జీవం
నిజాంసాగర్(జుక్కల్): అంతరిస్తున్న కళలకు గ్రామీణ ప్రాంత యువత జీవం పోస్తున్నారు. సోమవారం రాత్రి బ్రాహ్మణపల్లిలో రేణుకా ఎల్లమ్మ జీవిత నాటకాన్ని ప్రదర్శించారు. మూడు రోజుల నుంచి గ్రామంలో ఎల్లమ్మ ఆట ఆడుతూ చుట్టు ప్రక్క ప్రాంతాల ప్రజలను ఆకట్టుకున్నారు. రేణుకా ఎల్లమ్మ నాటక ప్రదర్శన చేసిన యువతను గ్రామ సర్పంచ్ గరబోయిన చంద్రకళ, గ్రామ పెద్దలు కిశోర్, వెంకటేశం, సాయిలు సన్మానించారు. రాజంపేట(భిక్కనూరు): నల్లాలలో నీరు రాని రోజు గ్రామస్తులు ఫోన్ చేస్తే వెంటనే ట్యాంకర్తో వచ్చి నీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అంద్యాల రమేశ్. రాజంపేట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లోకి మంగళవారం మంచినీరు రాకపోవడంతో వారు రమేష్కు సమాచారం అందించగా ఆయన ట్యాంకర్ను తీసుకుని వచ్చి ఉచితంగా నీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయినవారి అంత్యక్రియలకు కూడా ఉచితంగా ట్యాంకర్ ద్వారా నీరును అందజేస్తున్నానన్నారు. -
మైదానమా.. పంచాయితీల అడ్డానా?
● రామారెడ్డి హైస్కూల్ గ్రౌండ్లో మళ్లీ మొదలైన పంచాయితీలు ● ఇబ్బంది పడుతున్న క్రీడాకారులురామారెడ్డి(ఎల్లారెడ్డి): రామారెడ్డి జిల్లా పరిషత్ బా లుర, బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు ప్రాథ మిక పాఠశాల మైదానం ప్రస్తుతం స్కూల్ గ్రౌండ్ లా కాకుండా రచ్చబండకు వేదికలా మారింది. పంచాయితీలకు అడ్డాగా తయారైంది. నిత్యం పదుల సంఖ్యలో ఇక్కడ పంచాయితీలు నిర్వహిస్తుండటంతో క్రీడాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండటమే శాపం.. రామారెడ్డి జీపీ భవనంలో తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ను నిర్వహిస్తున్నారు. దీనికి ఎదురుగానే పాఠశాల మైదానం ఉంది. మండల వ్యాప్తంగా వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చే ఇరువర్గాల వారు.. ‘తామే మాట్లాడుకుంటాం‘ అంటూ బయటకు వచ్చి, నేరుగా స్కూల్ మైదానంలోకి చేరుకుంటున్నారు. అక్కడ గంటల తరబడి పంచాయితీలు పెట్టడం, ఒకరిపై ఒకరు గట్టిగా అరుస్తూ గొడవల కు దిగడం నిత్యకృత్యంగా మారింది. సోమవారం కూడా దాదాపు 100 మంది మైదానంలో చేరి పెద్ద ఎత్తున పంచాయితీ పెట్టారు. గతంలో హెచ్చరించినా.. మళ్లీ మొదటికే! ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘స్కూల్ మైదానమా.. పంచాయితీలకు అడ్డానా?‘ అనే శీర్షికతో కథనం ప్రచురించగా అప్పటి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తీవ్రంగా స్పందించారు. పాఠశాల మైదానంలో ఎలాంటి పంచాయతీలను అనుమతించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ ఆదేశాలు ఇచ్చిన కొద్దిరోజులు పరిస్థితి బాగున్నా.. మళ్లీ ఇప్పుడు కథ మొదటికి వచ్చింది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిత్యం మైదానంలో పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కాంగ్రెస్లో చేరిన తగిలేపల్లి సర్పంచ్
బాన్సువాడ: వర్ని మండలం తగిలేపల్లి సర్పంచ్ అల్లం గంగవ్వతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం బాన్సువాడలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సర్పంచ్ అల్లం గంగవ్వ, ఉప సర్పంచ్ వడ్ల గంగాప్రసాద్తో పాటు 50 బీఆర్ఎస్ గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పోచారం భాస్కర్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్బాబా తదితరులున్నారు. -
వంతెన పునర్నిర్మాణానికి నిధుల కేటాయింపు
నాగిరెడ్డిపేట/లింగంపేట(ఎల్లారెడ్డి) : గతేడాది కురి సిన భారీవర్షాలతో ఎల్లారె డ్డి నియోజకవర్గంలోని లింగంపల్లి ఖుర్ధు, అడ్విలింగా ల వద్ద దెబ్బతిన్న హైలెవల్ వంతెనల పునర్నిర్మాణానికి నిధులు మంజూరుయ్యాయి. వరదల కారనంగా నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల, లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్ధు వద్ద హైలెవల్ వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనివల్ల ఆ సమయంలో కొన్నిరోజులపాటు కేకేవై(కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైలెవల్ వంతెనలకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ ప్రజల, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పలుమార్లు సంబంధితశాఖల మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈక్రమంలో అడివిలింగాల వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.4.50కోట్లు, లింగంపల్లి ఖుర్ధు వద్ద హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.4 కోట్ల చొప్పున మొత్తం రూ.8.50కోట్ల నిధులను మంజూరుచేస్తూ రవాణా, రహదారులు, భవనాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే పనులు చేపడతామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. -
క్రైం కార్నర్
వడదెబ్బతో మహిళ మృతి సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన ఆకుల లక్ష్మి(56) వడదెబ్బతో మృతిచెందారు. లక్ష్మి రోజూ మాదిరిగా మంగళవారం కూలీ పనికి వెళ్లారు. పని చేసేచోట వడదెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే కుటుంబీకులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్ తండాలో భూమి కోసం ఘర్షణకు పాల్పడ్డ ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ మంగళవారం తెలిపారు. చద్మల్ తండాకు చెందిన బేల్సింగ్, జగదీశ్వర్ వర్గాలు చద్మల్ శివారులో గల భూమి కోసం పదేళ్లుగా గొడవలు పడుతున్నారు. ఇటీవలే ఇరువర్గాలు ఘర్షణ పడి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దీంతో ఎస్సై విచారణ చేపట్టి తహసీల్దార్ ఎదుట ఇరువర్గాలను బైండోవర్ చేశారు. కానీ, అదే భూమి కోసం మంగళవారం ఉదయం ఘర్షణ పడి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. స్క్రాప్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామశివారులో ఉన్న పైపుల స్క్రాప్ ఫ్యాక్టరీలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం వేళ మంటలు వ్యాపించడంతో కార్మికులు, నిర్వాహకులు అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఫ్యాక్టరీ యంత్రాలు, ముడిసరుకు, స్క్రాప్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలిపారు. డివైడర్ను ఢీకొని ఇద్దరికి గాయాలు మద్నూర్(జుక్కల్): మండలంలోని సలాబత్పూర్ వద్ద జాతీయ రహదారి వంతెనపై మంగళవారం బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. జుక్కల్ మండలం కేంరాజ్కల్లాలి నుంచి దేగ్లూర్కు చెందిన మారుతి, రేణుక బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన యువకుడు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెంది న గోస్కె ఆనంద్ అనే యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ చూస్తుండగా యాప్లో సైబర్ నేరగాళ్లు రూ.5000 వేలు చెల్లిస్తే రూ.99వేలు అకౌంట్లో చేస్తామని ఆశచూపి, వాట్సాప్లో స్కా నర్ను పంపారు. నిజమేనని నమ్మిన ఆనంద్ స్కా నర్కు రూ.5వేలు పంపించారు. కొద్దిసేపటికి వచ్చి న ఫోన్ నంబర్ బ్లాక్ కావడం, స్కానర్ డిలీట్ చేయ డంతో అవాక్కయ్యాడు. మోసపోయానని గుర్తించి సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉపాధి కూలీకి పాముకాటు బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న హన్మవ్వ అనే కూలీకి పాము కాటేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో తోటికూలీలు పాముబారి నుంచి కాపాడారు. అనంతరం ఆమెను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. వాహనాలు తనిఖీ నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల ధ్రువ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు సూచించారు. -
సంక్షిప్తంగా..
పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన పొట్టిగాని శంకర్కు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియామక పత్రాన్ని గాంధీభవన్లో అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని సూచించారు. అడ్డుగా వేసిన షెడ్లను తొలగించాలి భిక్కనూరు: మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న గంగమ్మ ఆలయం, మడివేలు పోచయ్య ఆలయాల ఎదుట కొందరు అక్రమంగా వేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ గంగపుత్ర సంఘం, రజక సంఘ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డిలకు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గంగపుత్ర సంఘ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి అంజనేయులు, కోశాధికారి సత్యనారాయణ, రజక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ ముందస్తు అరెస్ట్ భిక్కనూరు: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ తున్కి వేణును సోమవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం మద్నూర్(జుక్కల్): సుల్తాన్పేట్లో సోమవారం వార్డు సభ్యుల సమక్షంలో గ్రామంలో మద్యం విక్రయించరాదని తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తున్నట్లు ప్రకటించి తీర్మాన ప్రతులను ఎకై ్సజ్ పోలీసులతో పాటు స్థానిక ఎస్సై మోహన్రెడ్డికి అందించామన్నారు. ఉప సర్పంచ్ బాల్రాజ్ ఉన్నారు. అగ్నివీర్కు 8 మంది ఎంపిక కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అగ్నివీర్ ఎంపికల్లో సత్తా చాటి ఏకంగా 8 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులు కార్తీక్, దత్తాద్రి, సంగమేశ్వర్, సందీప్, సతీష్, జ్ఞానేశ్వర్, శంకర్, జైపాల్లను ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, ఎన్సీసీ అధికారి సుధాకర్, పీడీ శ్రీనివాస్ు, ఆయా విభాగాల అధిపతులు అభినందించారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలి కామారెడ్డి అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒరిజనల్ సర్టిఫికెట్లను కళాశాలల నుంచి పొందలేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బాలు తెలిపారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని ఆరోపించారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమౌతారని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సహకరించాలి భిక్కనూరు: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని భిక్కనూ ర్ సీఐ నరేష్ కోరారు. సోమవా రం కంచర్ల గ్రామ ప్రజాపతినిధులు, నేతలు ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సర్పంచ్ అరుణ స్వామి, మాజీ సర్పంచ్ చంద్రం, నాయకులు శేఖర్ రెడ్డి, బాపురెడ్డి, అనిల్ రెడ్డి ఉన్నారు. -
మక్కలను వేగంగా కొనుగోలు చేయాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మక్కలను వేగంగా కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఇన్చార్జి డీఎం క్రాంతి అన్నా రు. ఆమె సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చిన మక్కలను వెంట, వెంటనే తూకం చేయాలన్నారు. ఒక వేళ వర్షం కురిస్తే రైతులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వ స్తుందన్నారు. తూకం వేసిన బస్తాలను సొసైటీ నిర్వాహకులు వర్షాల నుంచి భద్రపరుచుకోవాలన్నారు. లారీలు తెప్పించి, గన్నీ బ్యాగులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ కపిల్రెడ్డి.. మార్క్ఫెడ్ అధికారిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, డెరెక్టర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


