చిత్తడి నేలలో ప్రకృతి సోయగాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చిత్తడి నేలల్లోని ఈ దృశ్యాలు కనురెప్ప కొట్టేందుకు వీలులేకుండా దృష్టిని కట్టిపడేస్తున్నాయి. నీలి వర్ణంతో ఆకాశం, ఆ సాగరం కలిసిపోగా.. పచ్చని ప్రకృతిలో ఎక్కడ చూసినా నిలువెత్తున నిలిచిన తాటిచెట్లు కనువిందు చేస్తున్నాయి. డొంకేశ్వర్ మండలంలోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తున్న పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్దులవుతున్నారు. ఈ దృశ్యాలను నికాల్పూర్ గోదావరి వద్ద ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్)
చిత్తడి నేలలో ప్రకృతి సోయగాలు


