breaking news
Corporate
-
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?
పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. -
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. -
నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే అబద్ధాలతో రెజ్యూమెలను సృష్టించి కంపెనీలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇటువంటి ఫేక్ అభ్యర్థిని నమ్మి ఉద్యోగం ఇవ్వడం వల్ల తమ కంపెనీ రూ.2 లక్షలకు పైగా నష్టపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్ మీడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ గుప్తా లింక్డ్ఇన్లో షేర్ చేసిన వివరాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అసలేం జరిగింది?కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య తనిఖీ) అనవసరమని భావించినట్లు గుప్తా పేర్కొన్నారు. కేవలం అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రదర్శన, గట్ ఫీలింగ్ ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఈ క్రమంలోనే చిరాగ్ అనే అభ్యర్థి కంపెనీలోకి ప్రవేశించాడు. పాత కంపెనీలో 3 ఏళ్ల అనుభవం, నెలకు రూ.40,000 వేతనం ఉండడంతో ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈ స్టార్టప్ కంపెనీ రూ.45,000 జీతం ఆఫర్ చేసింది.నియామకం జరిగిన రెండు నెలల తర్వాత చిరాగ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక సాధారణ రియాక్షన్ వీడియో ఎడిటింగ్ టాస్క్ (సాధారణంగా జూనియర్ ఎడిటర్లు రోజుకు మూడు చేస్తారు) పూర్తి చేయడానికి చిరాగ్కు రెండు రోజులు పట్టింది. పైగా అతను ఇచ్చిన అవుట్పుట్ ఏమాత్రం పనికివచ్చేది కాదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం తన పాత కంపెనీని సంప్రదించింది.వెలుగు చూసిన నిజాలువెరిఫికేషన్ ప్రక్రియలో చిరాగ్ ఆడిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో అతను నెలకు పొందింది రూ.25 వేలు మాత్రమే, కానీ రూ.40 వేలు అని అబద్ధం చెప్పి 80 శాతం పెంపు పొందాడు. తాను పాత కంపెనీలో రాజీనామా చేయలేదు. పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతన్ని తొలగించింది. కొత్త కంపెనీలో రిఫరెన్స్ కోసం అతను ఇచ్చిన మేనేజర్ నంబర్ తన స్నేహితుడిది. ఆ స్నేహితుడు మేనేజర్లా నటించి చిరాగ్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.ఈ ఒక్క తప్పుడు నియామకం వల్ల కంపెనీకి కలిగిన నష్టాన్ని గుప్తా వివరించారు. వేతన రూపంలో మూడు నెలలకు గానూ రూ.1.35 లక్షలు, శిక్షణ ఖర్చుల కింద రూ.40,000, రీప్లేస్మెంట్ నియామకం కింద రూ.25,000 నష్టపోయామని చెప్పారు. దీనికంటే ముఖ్యంగా క్లయింట్ ప్రాజెక్టుల జాప్యం, టీమ్ మనోధైర్యం దెబ్బతినడం, నాలుగు నెలల విలువైన సమయం వృథా అయినట్లు తెలిపారు.స్టార్టప్లకు సూచనలుఈ చేదు అనుభవం తర్వాత ప్రాపర్ మీడియా ప్రతి నియామకానికి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల మునుపటి కంపెనీ హెచ్ఆర్కు అధికారిక మెయిల్ చేయడం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రాస్ చెక్ చేయడం, అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవడం వంటివి తప్పనిసరి చేశారు. తప్పు జరిగిన తర్వాత బాధపడేకంటే, అభ్యర్థిని కంపెనీలోకి తీసుకునే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆయన సూచించారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
గూగుల్ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా?
దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. -
బ్యాంకులకు వరుస సెలవులు!
దేశంలోని వివిధ ప్రాంతాలలోని.. బ్యాంకు శాఖలు వచ్చే వారం మూడు రోజులు క్లోజ్లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 18, 19, 20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.ఫిబ్రవరి 18 (బుధవారం): టిబెటన్ నూతన సంవత్సరమైన లోసర్ను జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర దినోత్సవం/రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్ & మిజోరాంలలో బ్యాంకులకు సెలవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు
స్పెయిన్కి చెందిన ట్రెయిన్ బుకింగ్ ప్లాట్ఫాం అయిన ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ (ట్రెనెస్)లో మెజారిటీ వాటాలను ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్ యూరోలు) ఉంటుంది.యూరోపియన్ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్ యాజ్ సరీ్వస్ అనే ఇంకో స్పానిష్ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్క్యూఏఏఎస్ సంస్థ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధ సేవలను అందిస్తోంది. -
దేశంలోనే టాప్ 5 టోల్ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు
భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 టోల్ ప్లాజాల గురించి తెలుసుకుందాం. -
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.తగ్గుతున్న ధాతు గ్రేడ్లురాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.పెరుగుతున్న డిమాండ్రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.ధరల దిశ2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తు ఎలా?వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!. -
రిలయన్స్కి వెనెజులా చమురు
న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్నగర్ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్ క్రూడాయిల్ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది. -
లెన్స్కార్ట్కు భారీ లాభాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది. -
రుణాలపై టాటా క్యాపిటల్ అవగాహన కార్యక్రమాలు
ముంబై: ‘సవాల్ కరో, ఫిర్ లోన్ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్ ఎండీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. -
పైలట్లకు భలే డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు
భారతీయ విమానయాన రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో (IndiGo) తన చరిత్రలోనే అతిపెద్ద కాక్పిట్ నియామక డ్రైవ్లలో ఒకదాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పల విభాగాల్లో 1,000 మందికి పైగా పైలట్లను నియమించుకునేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, కెప్టెన్లు వంటి అన్ని స్థాయిలలో నియామకాలు జరగనున్నాయి.ఈ నిర్ణయం 2025 డిసెంబర్లో ఎదురైన తీవ్రమైన సిబ్బంది కొరత, ఆ కారణంగా ఏడు రోజుల్లో వేల సంఖ్యలో విమానాలు రద్దైన ఘటనల తర్వాత తీసుకున్నదిగా తెలుస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన విశ్రాంతి నిబంధనలతో (FDTL) సిబ్బంది లభ్యతపై ఒత్తిడి పెరగడంతో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యగా ఈ భారీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది.డీజీసీఏ కొత్త నిబంధనలువిమాన సురక్షత దృష్ట్యా డీజీసీఏ (DGCA) పైలట్లకు సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను సవరించింది. కొత్త నియమాల ప్రకారం పైలట్లకు తగిన విశ్రాంతి సమయం తప్పనిసరి.దీంతో రోస్టర్ నిర్వహణలో మార్పులు అవసరమయ్యాయి. కొంతకాలం తాత్కాలిక సడలింపులతో సేవలు నిర్వహించిన ఎయిర్లైన్లు, ఇప్పుడు పూర్తి స్థాయి అమలుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పైలట్ల అవసరం ఏర్పడింది.నియామకాల్లో ప్రత్యేకతఇండిగో విమానాల్లో ప్రధానంగా ఎయిర్బస్ A320 కుటుంబానికి చెందిన విమానాలు ఉపయోగిస్తుండగా, ముందస్తు A320 అనుభవం లేకపోయినా అర్హత కలిగిన పైలట్లను తీసుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉందని సమాచారం.విమానాల సంఖ్య పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్గాల్లో విస్తరణ జరగడం, ప్రయాణికుల రద్దీ పెరగడం వంటి అంశాలు కూడా నియామకాల వేగాన్ని పెంచుతున్నాయి.పైలట్ల జీతాలు ఎలా ఉన్నాయంటే..భారతీయ విమానయాన రంగంలో పైలట్ వృత్తి అత్యంత అధిక వేతనాలు కలిగిన కెరీర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా జీతాలు (అంచనా) ఇలా ఉంటాయి..ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్: నెలకు రూ.80,000 నుంచి రూ.1.5 లక్షలుఫస్ట్ ఆఫీసర్ (FO): రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలుసీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (SFO): రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షలుకెప్టెన్: రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువనడిపే విమాన రకం, అనుభవం, ఫ్లైట్ గంటలు, అంతర్జాతీయ మార్గాలు వంటి అంశాలపై ఆధారపడి ఈ మొత్తాలు మారవచ్చు.ఇతర భత్యాలు, సౌకర్యాలుజీతంతో పాటు పైలట్లకు పలు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అవి..లేఓవర్ అలవెన్సులు (దేశీయ, అంతర్జాతీయ)ఫ్లైట్ గంటల ఆధారిత ప్రోత్సాహకాలుమెడికల్ ఇన్సూరెన్స్ & లైఫ్ కవర్కుటుంబ సభ్యులకు ఉచిత/తగ్గింపు ధరల ప్రయాణ సౌకర్యంశిక్షణా అవకాశాలు, టైప్ రేటింగ్ మద్దతుపనితీరు ఆధారిత బోనసులుకొన్ని ఎయిర్లైన్లు పైలట్ల మనోబలాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతున్నాయి.ఇతర ఎయిర్లైన్లలోనూ నియామకాలుభారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆకాశ ఎయిర్ (Akasa Air) వంటి కొత్త ఎయిర్లైన్లు కూడా పైలట్ల నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. వేతనాలు, సౌకర్యాల పరంగా పోటీ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా అనేక ఎయిర్లైన్లు భారత పైలట్లకు అవకాశాలు అందిస్తున్నాయి. దీనితో దేశీయంగా జీతాల నిర్మాణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. -
గిఫ్ట్ సిటీ ఛైర్మన్గా ఉదయ్ కోటక్ నియామకం
ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ దేశలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ సిటీ’ సారథ్య బాధ్యతలను చేపట్టారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ(గిఫ్ట్ సిటీ) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్గా ఆయనను నియమిస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.హస్ముఖ్ అధియా స్థానంలో కోటక్గత ఏడాది జూన్ నుంచి గిఫ్ట్ సిటీ బోర్డు ఛైర్మన్గా (నాన్-ఎగ్జిక్యూటివ్) సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హస్ముఖ్ అధియా స్థానంలో ఉదయ్ కోటక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ శాఖ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన పాత్రకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుందని డిప్యూటీ సెక్రటరీ అంకితా షా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.గిఫ్ట్ సిటీ: ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగుజరాత్లోని 886 ఎకరాల్లో విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక, సాంకేతిక హబ్. వ్యాపారాలకు సులభతర వాతావరణాన్ని కల్పిస్తూ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిస్తారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సుస్థిరత, అత్యాధునిక సాంకేతికతకు కీలకంగా మారుతున్నాయి.ఉదయ్ కోటక్..1985లో కేవలం రూ.30 లక్షల పెట్టుబడితో ఒక చిన్న బిల్లు డిస్కౌంట్ సంస్థను స్థాపించిన ఉదయ్ కోటక్, నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్ను దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా తీర్చిదిద్దారు. ప్రాథమికంగా ఎటువంటి పెద్ద కార్పొరేట్ నేపథ్యం లేకపోయినా పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానాలతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. 2003లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన మొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా కోటక్ మహీంద్రా రికార్డు సృష్టించింది. భారత ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2026 సంవత్సరంలో ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
ఐటీ రంగంలో ఖర్చుల సెగ..
గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు సాఫ్ట్వేర్ సేవల కంటే హార్డ్వేర్ మౌలిక సదుపాయాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ సేవల కంపెనీలు తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ స్టాక్ ధరల తగ్గింపు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశాన్ని అందిస్తోందని క్వాంటం ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) క్రిస్టీ మథాయ్ చెబుతున్నారు.మారిన వ్యయాల ప్రాధాన్యతప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీంతో కంపెనీలు తమ బడ్జెట్ను డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హై-ఎండ్ ప్రాసెసర్ల వైపు మళ్లిస్తున్నాయి. ఎన్విడియా వంటి హార్డ్వేర్ కంపెనీలు లాభపడుతుంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS), సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మార్పుల వల్ల లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇటీవల భారీగా క్షీణించాయి.సెంటిమెంట్ కంటే ఫండమెంటల్స్ బలంగా..మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఐటీ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల నుంచి ఐటీ ఆర్డర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఇప్పుడు నేరుగా ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పొందడం ప్రారంభించాయి. కీలక రంగాల్లో ఆర్డర్ బుక్స్ ఆశాజనకంగా ఉన్నాయని, ఇది భవిష్యత్తు వృద్ధికి సంకేతమని మథాయ్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
స్టాండర్డ్ ఇంజనీరింగ్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హై–ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవల సంస్థ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (గతంలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ) రూ. 240 కోట్లతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో రూ. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రమోటర్ కందుల నాగేశ్వరరావు తెలిపారు. ఇది వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. అలాగే ఇప్పుడున్న ప్లాంట్లపై దాదాపు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు, ఇప్పటికే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. ఈ ఏడాదిలో సుమారు రూ. 760–800 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు, ప్రస్తుతం 95 రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఆదాయంలో ఎగుమతుల వాటా 13 శాతంగా ఉన్నట్లు వివరించారు. శుక్రవారం షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 129.70 వద్ద క్లోజయ్యింది. -
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో ఎన్టీటీ డేటా జట్టు
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ట్రాన్స్ఫర్మేషన్ నౌ వార్షిక కార్యక్రమం సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.సంక్లిష్టమైన వ్యవస్థల కారణంగా మధ్య, భారీ స్థాయి కంపెనీలు బీ2బీ చెల్లింపుల విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటాయని ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ఎండీ కృణాల్ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఏపీ సాఫ్ట్వేర్ని ఉపయోగించే సంస్థల మధ్య బీ2బీ చెల్లింపులను సరళతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.ట్రాన్స్ఫర్మేషన్ నౌ కార్యక్రమంలో 1,500 మంది పైగా సీఎక్స్వోలు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. డేటా సార్వ¿ౌమత్వం, బాధ్యతాయుతంగా కృత్రిమ మేథను వినియోగించడం తదితర అంశాలపై చర్చించారు. ఆటోమోటివ్, కెమికల్స్, తయారీ తదితర రంగాల్లో ఎస్ఏపీ ఆధారిత వ్యూహాల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ గ్లోబల్ సీఈవో నార్బర్ట్ రోటర్తో పాటు ఎన్పీసీఐ భారత్ కనెక్ట్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. -
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్ల నెట్వర్క్ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది. -
బ్యాంక్లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహించనుంది.2016 నుంచి ఆర్బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్ ప్రాధాన్యాన్ని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. -
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం
జొమాటో సంస్థను వదిలి వెళ్లిన మాజీ ఉద్యోగులను తిరిగి ఆహ్వానిస్తూ జొమాటో గ్రూప్ (ఎటర్నల్) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆయనకు సుమారు 8,000 ఈమెయిల్స్ వచ్చినట్లు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఈమెయిల్స్ను రెండు వర్గాలుగా విభజించవచ్చు. అందులో గతంలో ఎటర్నల్ ప్రయాణంలో భాగమై వివిధ కారణాలతో సంస్థను వీడిన 4,000 మంది మాజీ ఉద్యోగులు కొందరున్నారు. ఇప్పటివరకు సంస్థలో పనిచేయకపోయినా జొమాటో సంస్కృతికి ఆకర్షితులై చేరాలనుకుంటున్న వారు మరో 4,000 మంది ఉన్నారు. ‘నేను దీన్ని అస్సలు ఊహించలేదు. చాలా ధన్యవాదాలు. ఈ ఈమెయిల్స్లో ఎన్నో కథలు, భావోద్వేగాలు, నిజాయితీ దాగి ఉన్నాయి’ అని గోయల్ ఆనందం వ్యక్తం చేశారు.పాత సహోద్యోగులకు బంపర్ ఆఫర్సంస్థ గత కొన్నేళ్లుగా ఎదుగుతున్న క్రమంలో పాత ఉద్యోగులతో తనకు ఉన్న అనుబంధం ప్రస్తుత టీమ్కు ఉండకపోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 8,000 మెయిల్స్ స్వయంగా చదవడం సమయంతో కూడుకున్న పని కావడంతో తనతో నేరుగా పనిచేసిన వారికి ఆయన ఒక వెసులుబాటు కల్పించారు. ఎవరైనా గతంలో దీపిందర్తో పనిచేసి ఉంటే మెయిల్ కోసం వేచి చూడకుండా నేరుగా తన మొబైల్ నంబర్ కనుగొని వాట్సాప్ చేయమని ఆయన కోరారు.‘గతాన్ని పట్టించుకోను’మాజీ ఉద్యోగుల పట్ల గోయల్ చూపిన సానుకూల దృక్పథం చర్చనీయాంశమైంది. గతంలో వారు ఎందుకు వెళ్లిపోయారు లేదా ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారనే విషయాలను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో సంస్థలో సరైన వాతావరణం లేదా నాయకత్వం లేకపోవడం వల్ల కొందరు వెళ్లిపోయి ఉండవచ్చని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ‘నేను గతాన్ని పట్టుకుని కూర్చుంటానని మీరు భావించవద్దు. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మాకు మీ అవసరం ఉంది’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు.ఎందుకు మాజీ ఉద్యోగులకే ప్రాధాన్యత?సంస్థ పనితీరు, దాని విలువలు తెలిసిన వారు తిరిగి రావడం వల్ల పని వేగవంతం అవుతుందని గోయల్ నమ్ముతున్నారు. ‘ఎటర్నల్లో ఇంకా వృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఎదిగి, బయటకు వెళ్లి తిరిగి రావాలనుకునే వారికంటే మెరుగైన అభ్యర్థి మరొకరు ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: డబుల్ డ్రాప్.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు -
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త
భారతీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు అందించింది. గత సెప్టెంబర్లో వాయిదా పడిన జీతాల పెంపును ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసికానికి గాను 100 శాతం వేరియబుల్ పేను కంపెనీ ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఫిబ్రవరి జీతంతో కలిసి అందుతుంది. అయతే, జీతాల పెంపు ఎంత శాతం ఉంటుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఐటీ రంగంలో వేచి చూసే ధోరణిభౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ భయాల కారణంగా ఐటీ రంగంలో వ్యాపార పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. టీఈఎస్ ఏప్రిల్లో ఇవ్వాల్సిన పెంపును సెప్టెంబర్కు వాయిదా వేసి మెజారిటీ ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు పెంపును ఇచ్చింది. కాగ్నిజెంట్.. ఆగస్టులో జరగాల్సిన పెంపును నవంబర్కు వాయిదా వేసింది. ప్రధాన ఐటీ సంస్థల్లో పెంపును ప్రకటించిన చివరి కంపెనీగా విప్రో నిలిచింది.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఫ్లిప్కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. -
పోలియో నిర్మూలనకు బీఈ వ్యాక్సిన్
బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) పోలియోకు వ్యతిరేకంగా.. ఒక ప్రధాన మైలురాయిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2) కోసం ఫేజ్ II ప్రీ-క్వాలిఫికేషన్ (PQ) మంజూరు చేసింది. ఈ ప్రీ-క్వాలిఫికేషన్ ద్వారా.. BE తన సింగిల్ ఇంటిగ్రేటెడ్ సైట్లో మొత్తం ఉత్పత్తి శ్రేణి (డ్రగ్ సబ్స్టాన్స్ & డ్రగ్ ప్రొడక్ట్) కోసం WHO ప్రమాణాలను పూర్తి చేసింది.ఫేజ్ I ప్రీ-క్వాలిఫికేషన్ (జూన్ 2024) కేవలం డ్రగ్ ప్రొడక్ట్ ఉత్పత్తికి మాత్రమే వర్తించింది. ఇది బయట నుంచి అందిన డ్రగ్ సబ్స్టాన్స్ ఆధారంగా తయారయ్యేది. కానీ ఫేజ్ II ద్వారా BE మొత్తం ఉత్పత్తి విధానాన్ని WHO ప్రమాణాలతో నిర్వహించగలుగుతుంది, ఇది ప్రపంచంలో పోలియోవైరస్ టైప్ 2 (cVDPV2) వ్యాప్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 700 మిలియన్ల డోసుల nOPV2 ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకి పంపించింది. అక్కడ cVDPV2 వ్యాప్తిని నియంత్రించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. nOPV2 ప్రత్యేకంగా ఔట్పుట్ నియంత్రణ కోసం రూపొందించారు. ఇది పోలియో వైరస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ ప్రీ-క్వాలిఫికేషన్ సాధనలో PT Bio Farma (ఇండోనేషియా), PATH, Gates Foundation వంటి అంతర్జాతీయ భాగస్వాములు కీలక సహకారం అందించారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఉత్పత్తి సరాసరి పరిశీలనలు, ప్రత్యేక పరీక్షలు మరియు తయారీ సిద్ధత కార్యక్రమాలు ఈ విజయానికి తోడ్పడ్డాయి. -
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయానికి భారీ స్పందన లభించింది. తొలిరోజైన బుధవారం నాడు ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్)కి 2.3 రెట్లు సబ్ర్స్కయిబ్ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,650 కోట్ల విలువ చేసే బిడ్లను దాఖలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లకు 9.40 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా రూ. 256.07 రేటుపై 22.07 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గురువారం బిడ్ చేయొచ్చు. ఓఎఫ్ఎస్కి మంచి స్పందన లభిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు.బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి సంబంధించి బేస్ ఇష్యూ పరిమాణం 10.44 కోట్లు (3 శాతం) కాగా, గ్రీన్షూ ఆప్షన్ కింద మరో 6.96 కోట్ల షేర్లను (2 శాతం) కేంద్రం విక్రయిస్తోంది. ఒక్కో షేరుకి రూ. 254 ధర చొప్పున బీహెచ్ఈ ఎల్లో 17.41 కోట్ల షేర్లను (5 శాతం వాటా) విక్రయించడం ద్వారా రూ. 4,422 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
ఇప్పుడు ట్రావెల్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్ లగేజీ, బ్యాగ్ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. సూట్కేసులు, ట్రాలీలు, బ్యాక్ప్యాక్లు, బిజినెస్ బ్యాగ్లు మొదలైనవి విక్రయించే అప్పర్కేస్ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్ (మహారాష్ట్ర), రుద్రపూర్ (ఉత్తరాఖండ్)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దన్ను గల అప్పర్కేస్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్ నైనా పరేఖ్ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్కి మార్చుకుంటున్నామని వివరించారు. కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. మార్కెట్ వాటాపై కన్ను.. యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్కేస్ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్క్లూజివ్ స్టోర్స్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్ప్యాక్ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
పీఎల్ఐ పథకానికి 55 కంపెనీలు సై..
న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం మూడో రౌండ్ను కేంద్ర స్టీల్ మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్గ్రేడెడ్ అలాయ్ స్టీల్ తయారీలో 8.7 మిలియన్ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.వీటిలో పీఎస్యూ దిగ్గజం సెయిల్ సేలం స్టీల్ ప్లాంట్తో స్టీల్ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో పీఎల్ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్.. లక్ష్యాలు రెండింటికీ తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్ టన్నుల స్పెషాలిటీ స్టీల్ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు. -
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయితే డీల్ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్) ఆధారిత ఫుడ్ విభాగంలో రిలయన్స్ కన్జూమర్ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్తో సదరన్ హెల్త్ ఫుడ్స్ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్సీపీఎల్ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల బిజినెస్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. -
భారత్లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య సాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. అమెరికా కోర్టులో పెండింగ్లో ఉన్న ఈ విచారణకు సంబంధించి భారతదేశంలో ఉన్న సాక్ష్యాలను సేకరించేందుకు న్యాయపరమైన సహాయం కావాలని కోరుతూ ప్రమీల దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మద్రాస్ హైకోర్టులో పిటిషన్కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ‘లెటర్స్ రోగేటరీ’(లెటర్స్ రోగేటరీ అనేది అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో ఒక దేశపు కోర్టు, మరొక దేశపు కోర్టుకు పంపే అధికారిక అభ్యర్థన పత్రం)ను గౌరవించి దాన్ని అమలు చేసేలా భారత అధికారులను ఆదేశించాలని ప్రమీలా శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సరిహద్దు వ్యాజ్యాల్లో మరో దేశంలోని సాక్ష్యాలను లేదా సాక్షుల స్టేట్మెంట్లను సేకరించడానికి ఉపయోగించే అధికారిక అభ్యర్థనే ఈ లెటర్స్ రోగేటరీ.ఈ కేసులో శ్రీధర్ వెంబుతో సహా పలువురు కీలక సాక్షులు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నందున వారి నుంచి సాక్ష్యాలను సేకరించి అమెరికా కోర్టుకు సమర్పించడానికి స్థానిక కోర్టు కమిషనర్ను నియమించాలని ఆమె కోరారు.వివాదం నేపథ్యం..1993లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య 2020 నుంచి విభేదాలున్నాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగుతున్న ఈ విడాకుల విచారణలో ప్రమీల కొన్ని ఆరోపణలు చేశారు. కంపెనీలో తన వాటాను తగ్గించే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు జోహో సంస్థకు చెందిన ఆస్తులను తన కుటుంబ సభ్యులకు అక్రమంగా బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. 2020లో భారతదేశానికి మకాం మార్చిన తర్వాత తనకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబు గతంలోనే బహిరంగంగా ఖండించారు. ఆస్తుల వివరాలను దాయడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆస్తుల బదిలీ జరగలేదని వాదిస్తున్నారు.సాక్ష్యాల సేకరణ ఎందుకు కీలకం?వీరి విడాకుల ప్రక్రియలో భాగంగా వైవాహిక ఆస్తుల పంపకం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు సంక్లిష్టంగా మారాయి. భారతదేశంలో నివసిస్తున్న సాక్షుల స్టేట్మెంట్లు లేకుండా కాలిఫోర్నియా కోర్టు ఒక నిర్ణయానికి రావడం కష్టమని ప్రమీల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో కూడా భారత న్యాయస్థానాలు అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఇటువంటి విదేశీ అభ్యర్థనలను అంగీకరించిన సందర్భాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.హైకోర్టు స్పందనప్రమీలా శ్రీనివాసన్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ శ్రీధర్ వెంబుకు నోటీసులు జారీ చేసింది. భారతీయ చట్టాలకు లోబడి సాక్ష్యాల నమోదుకు స్థానిక కమిషనర్ను నియమించవచ్చా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
వరుసగా 200 మెసేజ్లు.. రూ.10 లక్షలు మాయం
బెంగళూరులో ఓ వ్యాపారవేత్త సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.10 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొన్ని గంటల వ్యవధిలోనే 200కు పైగా మెసేజ్లు రావడంతో బాధితుడు నిర్ఘాంతపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.బెంగళూరులోని హెచ్ఆర్బీఆర్ లేఅవుట్కు చెందిన 56 ఏళ్ల భువన్ (పేరు మార్చాం) అనే వ్యాపారవేత్తకు ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట మధ్య కాలంలో తన మొబైల్కు వరుసగా ఎస్ఎంఎస్ హెచ్చరికలు రావడం మొదలైంది. ఏవో ఒకటి రెండు కాదు, ఏకంగా 200కు పైగా సందేశాలు రావడంతో ఆయన ఆందోళనకు గురై వాటిని తనిఖీ చేశారు.ఖాతా ఖాళీ చేసిన సైబర్ కేటుగాళ్లువచ్చిన సందేశాలను పరిశీలించగా అవి ఓటీపీలు, బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయినట్లు వచ్చిన అలర్ట్లని ఆయన గుర్తించారు. తన ప్రమేయం లేకుండానే రెండు బ్యాంకు ఖాతాల నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగినట్లు గ్రహించిన భువన్ వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించారు. మొదటి ఖాతా నుంచి రూ.26,000 డెబిట్(ఉపసంహరణ) అయ్యాయి. రెండో ఖాతా నుంచి రూ.9.6 లక్షలకు పైగా నగదు మాయమైంది.పోలీసుల దర్యాప్తుఈ ఘటనపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బాధితుడు తెలియకుండానే మోసగాళ్లు పంపిన ఏదైనా అపాయకరమైన ఏపీకే ఫైల్ లింక్పై క్లిక్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు పంపిన మాల్వేర్ లింక్ లేదా ఏపీకే ఫైల్ను క్లిక్ చేయడం ద్వారా బాధితుడి ఫోన్ వారి నియంత్రణలోకి వెళ్లి ఉండవచ్చు. దీనివల్ల బాధితుడికి తెలియకుండానే ఓటీపీలను యాక్సెస్ చేస్తూ నగదును దారి మళ్లించి ఉంటారు’ అని పోలీస్ అధికారి చెప్పారు.జాగ్రత్త వహించాల్సిన అంశాలుతెలియని వ్యక్తులు పంపే వాట్సాప్ సందేశాలు లేదా ఎస్ఎంఎస్లలోని లింక్లను క్లిక్ చేయవద్దు.అపరిచిత సోర్సెస్ నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకండి.బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలి.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్ బాంబు!
క్లౌడ్ సర్వీసులందించే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ తమ సంస్థలో భారీ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచుతూ, పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఫిబ్రవరి ప్రారంభంలో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఈ లేఆఫ్స్ కేవలం సాధారణ విభాగాలకే పరిమితం కాలేదు. కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏజెంట్ ఫోర్స్ ఏఐ ఉత్పత్తి విభాగంతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై ప్రభావం పడింది.కంపెనీలో పనిచేస్తున్న మార్కెటింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లోనూ ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. లింక్డ్ఇన్ పోస్ట్లు, కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం సంస్థ తన ఏఐ కార్యకలాపాలను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టెక్ పరిశ్రమలో లేఆఫ్స్ పరంపరఏఐ టూల్స్కు పెరుగుతున్న ఆదరణతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగ కోతలను విధిస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో అమెజాన్ ఏకంగా 16,000 కొలువులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఒక పాడ్కాస్ట్లో సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావం వల్ల కస్టమర్ సపోర్ట్ విభాగంలో తక్కువ మంది సిబ్బంది సరిపోతారని అందుకే అప్పట్లో 4,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఆరు ఎన్బీఎఫ్సీ లైసెన్సుల సరెండర్
అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్ ఫైనాన్స్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ తమ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) లైసెన్సులను రిజర్వ్ బ్యాంకుకి సరెండర్ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్ శ్యామ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, రామా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్మెంట్ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్లో టాటా మోటర్స్ ఫైనాన్స్ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్లో పిరమాల్ ఫైనాన్స్లో పిరమాల్ ఎంటర్ప్రైజ్ విలీనమైంది.మరోవైపు, నిర్దిష్ట ఎన్బీఎఫ్సీలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్ఫేస్ లేని, అసెట్స్ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ వద్ద రిజిస్టర్ చేయించుకోనక్కరలేదు. చిన్న ఎన్బీఎఫ్సీలకు నో రిజిస్ట్రేషన్ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్బీఎఫ్సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్బీఐ వద్ద నమోదు (రిజిస్టర్) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపును ఆర్బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45ఏఐ కింద ప్రతీ ఎన్బీఎఫ్సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్ తక్కువేనని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్ ఇంటర్ఫేస్ (శాఖలు/యాప్/డిజిటల్ ప్లాట్ఫామ్లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఎన్ఎస్ఈ, ఇండియా పోస్ట్ జట్టు
మ్యుచువల్ ఫండ్స్ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా పోస్టల్ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) జట్టు కట్టాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్కి చెందిన 1.64 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్వర్క్ని, ఎన్ఎస్ఈ ఎంఎఫ్ ఇన్వెస్ట్ ప్లాట్ఫాంని ఉపయోగించుకోనున్నాయి. తొలి దశలో చిన్న పథకాలతో మొదలుపెట్టి రెండో దశలో పూర్తి స్థాయి స్కీములు, పోర్ట్ఫోలియో అనలిటిక్స్, ప్రాంతీయ భాషల్లో సపోర్ట్, సలహా సేవలను అందుబాటులోకి తేనున్నాయి.గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వారు తమ దగ్గరుండే పొదుపు మొత్తాలను, సంపద సృష్టికి ఉపయోగపడే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం రూ.81 లక్షల కోట్లకు చేరింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
టైటాన్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్ దిగ్గజం టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం జంప్చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి. కాగా.. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్లేన్ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్ ఆదాయం 46 శాతం జంప్చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్లేన్ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది. -
ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.Today is my last day at Anthropic. I resigned.Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL— mrinank (@MrinankSharma) February 9, 2026 -
రైలులో అత్యవసర బెర్త్లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?
రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్క్వార్టర్స్లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
నాటి విమర్శలకు పిచాయ్ సమాధానం
టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.తొందరపాటు వద్దు..ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.జెమిని 3సుందర్ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో ‘ఏఐ ఓవర్వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.రికార్డు ఆదాయంఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’
కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్లో ఓ వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్మెంట్ డిమాండ్ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్ చేయవచ్చు.ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.ప్రతి 6-12 నెలలకు లింక్డ్ఇన్, సీవీ అప్డేట్ చేయండి.పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.కంపెనీలు రెజెక్ట్ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్ కోసం ఉన్న పాత ఫర్నిచర్లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
భారత్కు త్వరలో టెక్ కంపెనీ సీఈఓలు రాక
న్యూఢిల్లీ వేదికగా భారత్లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.దిగ్గజ కంపెనీల సారథులుఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్గేట్స్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.దేశీయంగా కూడా ఈ సమ్మిట్పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.సదస్సు ప్రత్యేకతలుప్రభుత్వం ఈ సమ్మిట్ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
అరబిందో ఫార్మా లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 910 కోట్లను తాకింది. యూరప్, యూఎస్లలో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో హైదరాబాద్ కంపెనీ రూ. 846 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,979 కోట్ల నుంచి రూ. 8,646 కోట్లకు బలపడింది. ప్రధాన బిజినెస్లలో పటిష్ట ఎగ్జిక్యూషన్, నిలకడైన డిమాండ్, యూఎస్, యూరప్ తదితర కీలక మార్కెట్లలో విస్తరించిన బలమైన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వంటి అంశాలు క్యూ3 ఫలితాలను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ వైస్చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1 శాతం లాభంతో రూ. 1,201 వద్ద ముగిసింది. -
హోటల్లో ఒక్క రోజుకి రూ.30 లక్షలు.. ఎందుకంటే?
భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది. -
లిస్టింగ్కు 8 కంపెనీలు రెడీ
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలోనూ దేశీయంగా ప్రైమరీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కదులుతున్నప్పటికీ పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది(2025) సెపె్టంబర్– నవంబర్ మధ్య కాలంలో సెబీకి 9 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోగా.. మిగిలిన 8 కంపెనీలకు సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్సహా.. ఆర్వీ ఇంజినీరింగ్, ఎలివేట్ క్యాంపసస్, శంకేష్ జ్యువెలర్స్, ఆర్మీ ఇన్ఫోటెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, సెడెమాక్ మెకట్రానిక్స్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా చేరాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 10,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఏడాది(2026)లో భారత్ కోకింగ్ కోల్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, అమాగీ మీడియా ల్యాబ్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మొత్తం రూ. 4,766 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఎన్బీఎఫ్సీ నుంచి.. ఎన్బీఎఫ్సీ ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఇన్క్రెడ్ హోల్డింగ్స్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్ధుల వసతి(స్టూడెంట్ ఎకామడేషన్), కే–12 ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఎలివేట్ క్యాంపసస్ ఐపీవో ద్వారా రూ. 2,550 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కే–12 సంస్థల కొనుగోలు, క్యాంపస్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు వెచ్చించనుంది. కేబుళ్ల తయారీ కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో విడిభాగాలు పవర్ట్రెయిన్ నియంత్రిత వ్యవస్థలు, ఆటో విడిభాగాల తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80,43,300 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లెడ్ అలాయ్స్ లెడ్ స్మెల్టర్ కంపెనీ ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.76 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత నాణ్యతగల లెడ్ అలాయ్స్ను తయారు చేస్తోంది. ఐటీ ఇన్ఫ్రా.. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లు అందించే ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 250 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్ఫ్రా కన్సెల్టెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సరీ్వసుల కంపెనీ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో కోటి షేర్లను ప్రస్తుత వాటా దారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 38 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact Co-presented by: @NSEIndiaCo-powered by: @LICIndiaForever & @apollotyres Special Partners: @Niva_Bupa, APIS & Adani AirportsEnergy Partner: @kpgroupgujarat NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026 -
అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, కస్టమ్ చిప్స్, లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వంటి సాంకేతిక రంగాల్లో.. అమెజాన్ దాదాపు 200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఖర్చు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని.. ది వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మందిని తొలగించాలని తన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా సంస్థ నాల్గవ త్రైమాసిక ఆదాయం 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఈ ఖర్చు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం ఉపయోగిస్తామని తెలిపారు. AWS అనేది సంస్థలు, ప్రభుత్వాలు, మొబైల్ యాప్స్కు క్లౌడ్ సేవలు అందించే విభాగం. ఇది సంస్థను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబడటానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఇదే సమయంలో, ది వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పత్రిక మొత్తం ఉద్యోగుల్లో సుమారు 30 శాతం.. అంటే 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే ప్రకారం.. పత్రిక చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది. అందుకే ఈ ఉద్యోగాల తొలగింపు తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు.భవిష్యత్తులో పత్రిక జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. కాగా క్రీడలు, పుస్తకాలు వంటి విభాగాలను పూర్తిగా మూసివేయనుంది.. రోజువారీ పాడ్కాస్ట్ 'పోస్ట్ రిపోర్ట్స్' కూడా నిలిపివేయనుంది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి సమయాల్లో పరిహారం..బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు. -
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్ఫామ్పై గిగ్వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్ కంపెనీ తెలిపింది. అర్బన్ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్డోర్ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.తమ ప్లాట్ఫామ్లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్ కంపెనీ తెలిపింది. తన ప్లాట్ఫామ్పై టాప్–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది. -
ఎల్ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్’
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది. ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్ సేవల విస్తరణ, కస్టమర్ సర్వీస్ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్ రిటైల్ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు భారత్లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది. -
ఏసీసీ బ్యాటరీలకు భారీగా డిమాండ్
దేశీయంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2025లో ఇది 28 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్అవర్)గా ఉండగా 2040 మధ్య నాటికి 700 జీడబ్ల్యూహెచ్ స్థాయికి చేరనుంది. ఇండియా బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్, సప్లై చెయిన్ (ఐబీఎంఎస్సీఎస్) సదస్సు సందర్భంగా ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025లో మొత్తం బ్యాటరీల డిమాండ్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు 60 శాతంగా ఉండగా, 2047 నాటికి 74–77 శాతానికి పెరగొచ్చని అంచనా. 2035 నాటికి దేశీయంగా ఈవీల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 30 శాతం మేర వృద్ధి చెందనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు దీనికి సారథ్యం వహించనుండగా, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు ఆ తర్వాత స్థానాల్లో ఉండనున్నాయి. బ్యాటరీల తయారీదారులు, ఇన్వెస్టర్ల కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే శర్మ తెలిపారు.ఎనర్జీ స్టోరేజీ విప్లవం వల్ల వ్యవస్థవ్యాప్తంగా భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పునరుత్పాదక శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుల్హారి తెలిపారు. రెండు రోజుల ఈ సదస్సులో చైనా, జపాన్, అమెరికా తదితర దేశాల నుంచి 250పైచిలుకు కంపెనీలు, 600 మందికి పైగా డెలిగేట్లు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
న్యూఢిల్లీ: అంకుర సంస్థల నిర్వచనాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నోవరు పరిధిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచింది. డీప్ టెక్ స్టార్టప్ల పరిధిని కూడా విస్తరించింది. ఇకపై రిజిస్టరయిన 20 ఏళ్ల వరకు, వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇది పదేళ్లుగా ఉంది.టర్నోవరు పరిమితిని కూడా రూ. 300 కోట్లకు ప్రభుత్వం పెంచింది. డీప్ టెక్ సంస్థలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సుదీర్ఘ సమయం పట్టేయొచ్చని డీపీఐఐటీ నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితరాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా నిర్దిష్ట కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్లకు కూడా స్టార్టప్ గుర్తింపునివ్వనుంది.ఇదే సమయంలో ఈ మార్పులతో స్టార్టప్ వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్నోవరు, కాలపరిమితుల పెంపుతో ఎక్కువ సంస్థలు స్టార్టప్ హోదా పొందే అవకాశం ఏర్పడనుంది. దీంతో పన్ను రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఫండింగ్ అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డీప్ టెక్, అగ్రి టెక్, క్లైమేట్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ, సహకార రంగాల్లోనూ సాంకేతికత ఆధారిత వ్యాపారాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. -
బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!
సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.రంగుఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.సాంప్రదాయంచాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!వ్యాపారంఇతర పేపర్లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.మానసిక ప్రభావంప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు. -
డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.Whoever said “money can’t buy happiness” really knew what they were talking about 😔— Elon Musk (@elonmusk) February 5, 2026 -
రిటైర్మెంట్ వయసు పెరగనుందా?
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం 2026లో మరోసారి చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఆయుర్దాయం, పెన్షన్ బాధ్యతల భారం నేపథ్యంలో ఈ విషయం విధాన నిర్ణేతలు, ఉద్యోగులు, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 58–60 సంవత్సరాల మధ్య ఉన్న పదవీ విరమణ వయస్సును సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలు, రంగాల వారీగా వస్తున్న ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా వర్తించే ఏకరీతి నిర్ణయం ఇప్పటివరకు అధికారికంగా తీసుకోలేదు.సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు!దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు సంప్రదాయ పదవీ విరమణ నిబంధనలను పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలా వద్దా అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 64 నుంచి 65 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.కార్మికుల పదవీ విరమణ వయస్సును పొడిగించాలా అనే అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక పని జీవితం, పెరుగుతున్న పెన్షన్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని దానిని 62 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలా అనే దానిపై విధాన, మేధావి వర్గాలు చురుకుగా చర్చిస్తున్నాయి.నిరుద్యోగ సమస్యపదవీ విరమణ వయస్సు పెంపు ప్రభావం కేవలం పెన్షన్ వ్యయాలకే పరిమితం కాదు. ఇది మొత్తం శ్రామిక శక్తి సమీకరణంపైనా ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కువకాలం సేవలో కొనసాగించడం ద్వారా కొన్ని రంగాల్లో నైపుణ్యాల కొరతను తగ్గించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. -
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.Well done— Elon Musk (@elonmusk) February 5, 2026 -
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), దాని గ్రూప్ కంపెనీలతో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసాలపై దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోర్టు ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ దర్యాప్తును ముగించాలని ఈడీ, సీబీఐలకు స్పష్టం చేసింది.కోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలుఒకే ఎఫ్ఐఆర్పై ప్రశ్నలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదు మేరకు సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే బహుళ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతి ఫిర్యాదు వెనుక విభిన్న లావాదేవీలు ఉన్నాయని గుర్తు చేసింది.బ్యాంకు అధికారుల పాత్ర.. నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సంస్థల మధ్య ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.నాలుగు వారాల గడువు.. దర్యాప్తు పురోగతిపై తదుపరి నాలుగు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని రెండు ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది.వాదోపవాదాలుప్రశాంత్ భూషణ్ (పిటిషనర్ తరఫు): రూ.పదివేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైందని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ముకుల్ రోహత్గీ (అనిల్ అంబానీ తరఫు): రిలయన్స్ గ్రూప్ బకాయిలను చెల్లించడానికి ప్రయత్నిస్తోందని, వ్యాపారంలో వచ్చే సాధారణ డిఫాల్ట్లను నేరపూరిత చర్యలుగా చూడకూడదని వాదించారు. నిందితులు విదేశాలకు పారిపోతారనే భయాల్లో నిజం లేదని ఆయన హామీ ఇచ్చారు.తుషార్ మెహతా (సొలిసిటర్ జనరల్): నకిలీ బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించిందని, యెస్ బ్యాంక్ పెట్టుబడులపై కూడా విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు.ఇప్పటివరకు చేపట్టిన చర్యలుఇటీవలే ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆర్సీఓఎం మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్ను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన తీరును బట్టి చూస్తే తక్షణమే కాలపరిమితితో కూడిన దర్యాప్తు అవసరమని భావించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. -
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్ 100 రిలయన్స్లు
ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. భారత్ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్రాక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు. ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్వర్క్ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్ శకం అని గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ చైర్మన్ ల్యారీ ఫింక్ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ కేవీ కామత్ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఇండియా టీచింగ్..వరల్డ్ లెర్నింగ్
దేశీ ఎడ్టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో విదేశాల బాట పడుతున్నాయి. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విద్యా వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తున్నాయి. అప్గ్రాడ్, సింప్లీలెర్న్, బ్రైట్చాన్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. మన ఎడ్టెక్ కంపెనీలు ప్రధానంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వియత్నాం, థాయ్ల్యాండ్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్లాంటి మార్కెట్లలో విస్తరిస్తున్నాయి. ఆయా మార్కెట్లలో వినియోగదారుల ప్రొఫైల్ దాదాపు మన దేశం తరహాలోనే ఉండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. థాయ్, వియత్నాంలో అప్గ్రాడ్: టీమ్లీజ్ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలపై మన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన అప్గ్రాడ్ సంస్థ థాయ్ల్యాండ్, వియత్నాంలో కార్యకలాపాలు విస్తరించింది. అలాగే యూఏఈ, మేనా ప్రాంతంలో (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) వర్క్ఫోర్స్ శిక్షణకు సంబంధించి వివిధ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే సింప్లీలెర్న్ కంపెనీ వివిధ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక కిడ్స్ లెర్నింగ్ ప్లాట్ఫాం అయిన బ్రైట్ఛాంప్స్ సంస్థ ఏకంగా 30 పైగా దేశాల్లో విస్తరించింది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆకర్షణీయంగా ఆగ్నేయాసియా: వియత్నాం, థాయ్ల్యాండ్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు వేగంగా డిజిటల్ ఎకానమీలుగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో కెరియర్ పురోగతికి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడంపై పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా మల్చుకోవడంపై ఎడ్టెక్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 2024–25లో అప్గ్రాడ్ ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20–25 శాతంగా నమోదైంది. అటు సింప్లీలెర్న్ అంతర్జాతీయ యూజర్లలో 11 శాతం మంది బ్రిటన్, పశ్చిమాసియాలో ఉన్నారు. ఇక తమ గ్లోబల్ యూజర్లలో 30 శాతం మంది ఆగ్నేయాసియా, దక్షిణాసియా వారు ఉన్నారని బ్రైట్ఛాంప్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా పోటీ: మన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నప్పటికీ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తోంది. యుడెమి, ఎరుడైటస్, యుడాసిటీ, కోర్సెరాలాంటి గ్లోబల్ సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి. తమకు విదేశీ మార్కెట్లలో కోర్సెరా, ఎరుడైటస్ నుంచి పోటీ ఉంటోందని అప్గ్రేడ్ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఎమెరిటస్, కోర్సెరా, యుడాసిటీలను సింప్లీలెర్న్ ఢీకొంటోంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యయాలతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశీ కంపెనీలు.. ఆయా మార్కెట్లలో పటిష్టపడేందుకు ప్రయతి్నస్తున్నాయి. లీడ్ గ్రూప్ ఈ ఏడాది 1,200 పాఠశాలలతో భాగస్వామ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.దీంతో పాస్పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణకొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. పాస్పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్వర్క్ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.పోలీస్ వెరిఫికేషన్లో కీలక మార్పులుపాస్పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.మరింత సులభమైన ఆన్లైన్ సేవలుప్రభుత్వ పాస్పోర్ట్ పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్మెంట్ స్లాట్లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలుదేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. -
కొత్త రుణాలపై ఎస్బీఐ ఫోకస్
దేశ ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించే కొత్త తరం రంగాలకి రుణ లభ్యతను పెంచే దిశగా చక్ర–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని (సీవోఈ) ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ–బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లులాంటి ఎనిమిది వర్ధమాన రంగాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.2030 నాటికి ఈ ఎనిమిది రంగాలు దాదాపు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్దాల్లో కొత్త ఆవిష్కరణలు, అధునాతన తయారీ సామర్థ్యాల దన్నుతో భారత్ వృద్ధి చెందుతుందని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.శ్వేతపత్రాలు, సెక్టార్ రిపోర్టులు, పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ మొదలైన మార్గాల్లో క్లయింట్లు, ఇన్వెస్టర్లు, విధాననిర్ణేతలు నిర్ణయాలు తీసుకునేందుకు చక్ర సెంటర్ తోడ్పడుతుందని వివరించారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, బహుళపక్ష ఏజెన్సీలు, పరిశ్రమ సమాఖ్యలు, స్టార్టప్ల మధ్య సంప్రదింపులకు ఇది సహాయకరంగా ఉంటుందన్నారు. -
వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సంపదలో 75 శాతాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అనిల్ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు. అనిల్ అగర్వాల్కు ఇద్దరు సంతానం కుమారుడు అగ్నివేష్ అగర్వాల్, కూతురు ప్రియా అగర్వాల్(2013లో ఆకాష్ హెబ్బర్ను వివాహం చేసుకున్నారు). అనిల్ మొత్తం నెట్వర్త్ సుమారు రూ.3.66 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో తన వ్యక్తిగత సంపదను దానం చేసేందుకు సిద్ధమయ్యారు.ప్రధానితో భేటీ.. ఒక భావోద్వేగ ప్రయాణంఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా జరిగిన ‘గ్లోబల్ ఎనర్జీ లీడర్స్’ రౌండ్ టేబుల్ సమావేశంలో అనిల్ అగర్వాల్ పాల్గొన్నారు. తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపిన చొరవను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ తన మనోభావాలను పంచుకున్నారు.‘మా కుటుంబంలో విషాదం తర్వాత నేను హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. వ్యక్తిగత నష్టంతో కుంగిపోయిన మాకు ప్రధానమంత్రి మోదీ అందించిన ఓదార్పు, సానుభూతి వెలకట్టలేనివి. ఆయన మాటలు నాకు, నా భార్యకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అని అగర్వాల్ పేర్కొన్నారు.కుమారుడి ఆశయ సాధనే లక్ష్యం..అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కేయింగ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమారుడి కోరికలకు అనుగుణంగానే ఈ దాతృత్వ నిర్ణయం తీసుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.ఇకపై తాను వ్యాపార ప్రమోటర్గా కాకుండా కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తానని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. వ్యాపార నియంత్రణ కంటే సామాజిక ప్రభావానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.ప్రధాని పరామర్శతీవ్ర దుఖంలో ఉన్న అగర్వాల్ దంపతులను ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరారు. ‘మీరు దృఢంగా ఉండాలి. మీ పనిని కొనసాగించాలి. అది దేశానికి చాలా ముఖ్యం’ అని ప్రధాని ఇచ్చిన సలహా తమకు ఎంతో ఊరటను ఇచ్చిందని అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల బాధలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునే నాయకుడు ఉండటం అదృష్టమని ఆయన ప్రశంసించారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
జీసీసీలకు హాట్స్పాట్గా భారత్
అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) ఆకర్షణీయ కేంద్రంగా భారత్ స్థానం మరింత బలపడనుంది. 2024 చివరికి దేశవ్యాప్తంగా 1,700 జీసీసీలు ఉంటే, 2030 నాటికి వీటి సంఖ్య2,400కు పెరుగుతుందని ఫిక్కీ, అనరాక్ సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతేకాదు వీటి మార్కెట్ పరిమాణం 64 బిలియన్ డాలర్ల నుంచి 110 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని తెలిపింది. 2024 నాటికి జీసీసీలు 19 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పించగా, 2030 నాటికి 28 లక్షల మంది నిపుణులకు పెరుగుతుందని అంచనా వ్యక్తం చేసింది. దేశంలో జీసీసీల మార్కెట్ గత కొన్నేళ్లలో ఎంతో వేగంగా పెరిగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు.‘కీలకమైన ఐటీ/ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ), ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ పరిశోధన, అభివృద్ధి (ఈఆర్అండ్డీ) రంగాల నుంచి డిమాండ్ పెరగడం జీసీసీల వృద్ధికి ఇంధనంగా నిలుస్తోంది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగొచ్చు. భారత జీసీసీ మార్కెట్ ఏటా 10 శాతం చొప్పున కాంపౌండెడ్గా పెరుగుతూ 2030 నాటికి 105–110 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు’ అని అనుజ్ పురి తెలిపారు. టైర్–2 నగరాలకూ విస్తరణదేశంలో జీసీసీల కార్యకలాపాలు టాప్–7కు వెలుపలి ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నట్టు ఫిక్కీ–అనరాక్ నివేదిక తెలిపింది. జైపూర్, ఇందోర్, సూరత్, కోచి, కోయింబత్తూర్ పట్టణాల్లోనూ జీసీసీలు ఏర్పాటువుతున్నట్టు పేర్కొంది. ‘‘మూడు దశాబ్దాలుగా భారత ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ నిర్వహణను ఖర్చుగానే చూసే వారు. కానీ, ఇప్పుడు ఇదొక కీలక చోదకం. అంతర్జాతీయ పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు కేంద్రాలుగా మారుతున్నాయి. భారత యువతకు ఎంపికలుగా మారుతున్నాయి’’అని ఫిక్కీలో పట్టణాభివృద్ధి, రియల్ ఎస్టేట్ కమిటీ చైర్మన్గా ఉన్న రాజ్ మెండ తెలిపారు. దేశంలోని టాప్–7 నగరాల్లో 800 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ ఆఫీస్ వసతులు ఉన్నాయని.. సగం మేర బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోనే ఏర్పాటైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2025లో నికర వినియోగం 58 మిలియన్ ఎస్ఎఫ్టీ కాగా, స్థూల లీజింగ్ 80 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్లో జీఐ ఔట్సోర్సింగ్ జీసీసీ అకౌంట్స్ ఔట్సోర్సింగ్, నాలెడ్జ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ జీఐ ఔట్సోర్సింగ్ తాజాగా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ప్రారంభించింది. కోవసెంట్లో భాగమైన ఎనేబ్లర్తో కలిసి దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 50 మంది సిబ్బంది ఉండగా వచ్చే 12 నెలల్లో ఇది 100కి పెరగనున్నట్లు గ్రూప్ సీఈవో తారిఖ్ హుసేన్ తెలిపారు. 2028 నాటికి మరో 100 మందిని తీసుకోనున్నట్లు వివరించారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లో ప్రస్తుతం తమకున్న కార్యకలాపాలకు ఈ సెంటర్ అనుబంధంగా ఉంటుందని హుసేన్ వివరించారు. గ్లోబల్ క్లయింట్లకు ప్రపంచ స్థాయి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించే క్రమంలో ఏఐ ఆధారిత జీసీసీని ఏర్పాటు చేయడంలో జీఐ ఔట్సోర్సింగ్కి తోడ్పాటు అందించినట్లు కోవసెంట్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
భారత్లో గూగుల్ భారీ విస్తరణ.. 20,000 మందికి ఉద్యోగాలు!
అమెరికాలో హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విదేశీ సిబ్బందిని అమెరికాకు పిలిపించుకునే బదులు ప్రతిభ ఉన్న చోటికే తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో గూగుల్ భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది.బెంగళూరులో భారీ క్యాంపస్బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న అలెంబిక్ సిటీలో భారీ కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు టవర్లలో సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉండబోతోందని ప్రాథమిక సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 20,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. భారత్లో ప్రస్తుతం గూగుల్కు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త క్యాంపస్తో గూగుల్ ఇండియా తన సిబ్బంది సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. 6.5 లక్షల చదరపు అడుగుల మొదటి టవర్ రాబోయే కొద్ది నెలల్లోనే ప్రారంభం కానుంది. మిగిలిన రెండు టవర్లు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతాయని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.వీసా ఆంక్షలే వరంగా..అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వస్తున్న మార్పులు భారతీయ ఇంజినీర్లకు వరంగా మారాయి. యూఎస్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు కంపెనీలు దాదాపు 1,00,000 డాలర్లు (సుమారు రూ.91 లక్షలు) వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీసా అనుమతుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే భారత్లోనే స్థానిక బృందాలను నిర్మించడం కంపెనీలకు లాభదాయకంగా మారుతుంది. మానవ వనరులను అమెరికాకు తరలించే ఖర్చు తగ్గడమే కాకుండా, భారతీయ నైపుణ్యాన్ని తక్కువ వ్యయంతోనే వినియోగించుకునే వీలు కలుగుతోంది.ఏఐ రేసులో భారతే కీలకంప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి క్లిష్టమైన విభాగాల్లో వందలాది పోస్టుల కోసం గూగుల్ నియామకాలు చేపడుతోంది. గూగుల్ మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి సంస్థలు కూడా భారత్లో తమ సిబ్బందిని పెంచుకుంటున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ దిగ్గజ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరగడం గమనార్హం. ఇది గత మూడేళ్లలో అత్యధిక వృద్ధి.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
తీవ్ర నేరారోపణలు.. సైబర్ క్రైమ్ యూనిట్ సోదాలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్ ఆధారిత కంటెంట్పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్ఫేక్(రియల్ ఇమేజ్లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
అదానీ పోర్ట్స్ లాభం జూమ్ క్యూ3లో రూ. 3,043 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్చేసి రూ. 3,043 కోట్లను తాకింది. కార్గో హ్యాండ్లింగ్ బిజినెస్లో వృద్ధి కారణంగా ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,518 కోట్లు మాత్రమే ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 7,964 కోట్ల నుంచి రూ. 9,705 కోట్లకు బలపడింది. ఇది 22 శాతం అధికంకాగా.. దేశీ పోర్టుల నుంచి రూ. 6,701 కోట్లు, అంతర్జాతీయ పోర్టుల నుంచి రూ. 1,067 కోట్లు చొప్పున టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో కార్గో హ్యాండ్లింగ్ 9 శాతం పుంజుకుని 123 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. పూర్తి ఏడాదికి రూ. 11,000– 12,000 కోట్ల పెట్టుబడి వ్యయాలపై దృష్టి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 9 %పైగా జంప్చేసి రూ. 1,531 వద్ద ముగిసింది.లియోనార్డోతో అదానీ గ్రూప్ భాగస్వామ్యం న్యూఢిల్లీ: భారత్లో సమగ్ర హెలికాప్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటాలియన్ దిగ్గజం లియోనార్డోతో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ చేతులు కలిపింది. భారత సాయుధ బలగాలకు అవసరమైన ఉత్పత్తులను, ముఖ్యంగా లియోనార్డోకి చెందిన ఏడబ్ల్యూ169ఎం, ఏడబ్ల్యూ109 ట్రెకర్ఎం హెలికాప్టర్లకి సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు, మెయింటెనెన్స్–రిపేర్–ఓవర్హాల్ (ఎంఆర్వో) సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు, పైలట్లకు శిక్షణనిచ్చేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్ తెలిపింది. -
గడ్డంలో ‘ఏడు’ గింజల రహస్యం.. ఇది చిన్నకథ కాదు..
పొద్దున్నే లేవగానే.. ఓ కప్పు కాఫీ తాగడం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే..! భారత్లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా..! అయితే.. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు లేదా కర్ణాటకలోని చిక్కమగళూరు తోటల పేరు చెప్పేస్తారు..! ఇప్పటికి అది నిజమే అయినా.. నిజానికి కాఫీ పుట్టింది భారత్లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ.. అసలు భారత్కు కాఫీ గింజలను తెచ్చిన ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డార్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?? అయితే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..! భారత్లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్తో మొదలవుతుంది. 1600లలో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్లోని అల్-మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే.. ఏడు కాఫీ గింజలను తన గడ్డంలో దాచి, తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో నిత్యం చలి, తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే.. ఆ ఏడు బీజాలే ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా భారతదేశమంతటా విస్తరించాయి. అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే.. బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా.. భారత్లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్నకుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే.. కన్నడంలో చిక్క మగళు అని అర్థం. అందుకే.. ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. ‘కర్ణాటక కాఫీ ల్యాండ్కు స్వాగతం’ అనే స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది.చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముల్లయనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్వుడ్, ప్లమ్, అత్తిచెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్స్టంట్ కాఫీకి రోబస్టాను వాడుతారు. అరేబికా కంటే రోబస్టా కొంత చవక. రోబస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. అరేబికా అలా కాదు.. ఏటవాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితోపాటు.. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వచాపల్యం కలగకమానదనడంలో అతిశయోక్తిలేదు. ఘాట్ రోడ్లలో.. ఇరువైపులా కాఫీ షాపులుంటాయి. అలా చిక్కమగళూరులో 1600లలో ప్రవేశించిన కాఫీ.. క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ.. ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీతోటలు ఉండేవి. 1825లో కేరళలోని వయనాడ్లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముర్డోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని ‘అంజరకాండి బ్రౌన్’ అని పిలిచేవారు. 1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లలో ఆర్నాల్డ్ నెల్లియంపతిలో పర్డేహ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1860లలో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్కు కూడా కాఫీతోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండంతొలిచే పురుగు బెడద ఉండడంతో.. రైతులు అప్పట్లో రోబస్టా వైపు మొగ్గుచూపారు. అప్పట్లో బ్రిటిషనర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు.. కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70శాతం కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుండగా.. అందులో సింహభాగం.. అంటే.. లక్షా ముప్ఫై వేల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజనెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది. కాఫీడే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. -
వచ్చే ఏడాది ఎల్ఐసీ ఎఫ్పీవో
బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో మరింత వాటా విక్రయానికి ప్రభుత్వం వచ్చే ఏడాది(2026–27) ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్పీవో) చేపట్టే వీలున్నట్లు నాగరాజు వెల్లడించారు. 2022 మే నెలలో ప్రభుత్వం పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎల్ఐసీలో 3.5 శాతం వాటా అమ్మిన సంగతి తెలిసిందే. షేరుకి రూ. 949 ధరలో వాటా విక్రయించడం ద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకుంది.ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా 96.5 శాతంగా ఉంది. దీంతో 2027 మే నెలకల్లా పబ్లిక్కు కనీసం 10 శాతం వాటా నిబంధన అమలు చేసేందుకు మరో 6.5 శాతం వాటా ఆఫర్ చేయవలసి ఉంది. వెరసి ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయించేందుకు వీలుగా ఎఫ్పీవోను పరిశీలించవలసిందిగా దీపమ్ను కోరినట్లు నాగరాజు తెలియజేశారు. అయితే అనుమతులు, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వచ్చే ఏడాది ఎల్ఐసీ ఎఫ్పీవోకు అవకాశమున్నట్లు వివరించారు. -
ఐఫోన్ క్రేజ్ అంతా ఇంతా కాదు!
దేశీయంగా ప్రీమియం ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ హవా కొనసాగుతోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2025లో అమ్మకాల విలువపరంగా యాపిల్ మార్కెట్ వాటా 28 శాతానికి పెరిగింది. 2024లో ఇది 23 శాతంగా నమోదైంది. అమ్మకాల పరిమాణంపరంగా వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు ఖరీదైన మోడల్స్ కోసం ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకునే ధోరణి పెరుగుతుండటంతో విలువపరంగా మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.ఐఫోన్ 16 సిరీస్ విజయవంతం కావడం, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ స్కీములు, ఎక్సే్చంజ్ ఆఫర్లు మొదలైన అంశాల కారణంగా 2025లో 28 శాతం వాటాతో మార్కెట్పై యాపిల్ ఆధిపత్యం దక్కించుకుంది. పండుగల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు, నెట్వర్క్ను భారీగా విస్తరించడం కూడా ఇందుకు దోహదపడ్డాయి. నివేదిక ప్రకారం 2025లో దేశీ స్మార్ట్ఫోన్ మార్కెట్ పరిమాణంపరంగా 1 శాతం, విలువపరంగా 8 శాతం వృద్ధి చెందింది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలుగతేడాది ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లో పరిమాణంపరంగా 40 శాతం స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఫైనాన్సింగ్ మార్గంలో జరిగాయి. రూ. 30,000కు పైన ఉండే ప్రీమియం సెగ్మెంట్లో మూడింట రెండొంతుల విక్రయాలు రుణాల రూపంలో నమోదయ్యాయి. కస్టమర్లు ఖరీదైన డివైజ్లకు అప్గ్రేడ్ కావడంలో ఈఎంఐ ఆప్షన్లు కీలక పాత్ర పోషిస్తుండటాన్ని ఇది సూచిస్తోంది. గతంలో దేశీ మార్కెట్ వృద్ధికి ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్ల ఫోన్లు ప్రధాన చోదకాలుగా ఉండేవి. కానీ ప్రీమియమైజేషన్ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో ప్రీమియం ఫోన్ల విభాగం ఈ రెండు సెగ్మెంట్లకు మించి వృద్ధి చెందుతోంది.గతేడాది రూ. 30,000 పైగా ఖరీదు చేసే ప్రీమియం సెగ్మెంట్ అత్యధికంగా వృద్ధి చెందింది. ఫోల్డబుల్ సెగ్మెంట్లో పరిమాణంపరంగా 88 శాతం మార్కెట్ వాటా, వార్షికంగా 28 శాతం వృద్ధితో శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది.వాల్యూమ్స్పరంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్గా మోటరోలా (54 శాతం వృద్ధి), సబ్–బ్రాండ్గా సీఎంఎఫ్ (83 శాతం వృద్ధి) నిల్చాయి.2026లో విలువపరంగా మార్కెట్ విస్తరణకు ప్రీమియం ఉత్పత్తులే దోహదపడనున్నాయి. ఎంట్రీ లెవెల్ విభాగంపై ఒత్తిడి కొనసాగనుంది.మెమొరీ, విడిభాగాల వ్యయాలు పెరిగి, డిమాండ్ తగ్గడం వల్ల 2026లో అమ్మకాల పరిమాణం నెమ్మదించనుంది. రూ. 15,000 లోపు సెగ్మెంట్లో ఇది ఎక్కువగా కనిపించవచ్చు. ధరలు సగటున 5–7 శాతం వృద్ధి చెందనున్నాయి.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
పీఎఫ్సీ, ఆర్ఈసీ విలీనం
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ఫైనాన్షియల్ నవరత్నాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), ఆర్ఈసీ(గతంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) మధ్య విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ రెండు పీఎస్యూలను విలీనం చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చడంలో రెండు సంస్థలు కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన తాజా(2026–27) బడ్జెట్లో ఈ రెండు ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించారు. తద్వారా వీటికి మరింత బలాన్ని చేకూర్చే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్ఈసీలో మెజారిటీ వాటాను 2019 మార్చిలో పీఎఫ్సీ కొనుగోలు చేసింది. దీంతో 2019–20లో వీటి మధ్య విలీనానికి తెరతీయనున్నట్లు అంచనాలు వెలువడినప్పటికీ ఆచరణలోకి రాకపోవడం గమనార్హం! -
ఫారిన్ నుంచి ఇక ఎక్కువ తెచ్చుకోవచ్చు..!
విదేశాల నుంచి వచ్చే వారు సాధారణంగా మిత్రులు, బంధువులకు బహుమతులు తీసుకువస్తుంటారు. అయితే ఇప్పటివరకు దిగుమతి సుంకాలు, పరిమితుల కారణంగా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకురావడం సాధ్యపడేది కాదు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది.అంతర్జాతీయ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఫ్రీగా భారత్కు తీసుకురాగల వస్తువుల విలువ పరిమితిని పెంచింది. ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.కొత్త బ్యాగేజీ నిబంధనలు ఏమిటంటే..వాయు లేదా సముద్ర మార్గంలో వచ్చే భారత సంతతికి చెందిన నివాసితులు, పర్యాటకులు రూ. 75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 50,000 మాత్రమే ఉండేది.అలాగే విమాన లేదా సముద్ర మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.అయితే కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవు. 50 యూనిట్లకు మించిన తుపాకీ గుళికలు, 100 కంటే ఎక్కువ సిగరెట్లు, 25 కంటే ఎక్కువ సిగార్లు, 125 గ్రాములకంటే ఎక్కువ పొగాకు, 2 లీటర్లకు మించిన మద్యం, ఆభరణాల రూపంలో కాకుండా బంగారం లేదా వెండి, టెలివిజన్లు వీటిలో ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులుకేంద్ర బడ్జెట్ 2026–27లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ నిర్ణయంతో భారత్లోకి దిగుమతి చేసుకునే వ్యక్తిగత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరింత అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ముందుగానే విడుదలైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. -
సెలవు అడిగితే.. పెళ్లి ఎమర్జెన్సీ కాదన్న బాస్
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో.. చాలా సందర్భాలలో తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వర్క్ కంటే పెళ్లి ముఖ్యం కాదని తమ బాస్ చెప్పినట్లు ఉద్యోగి వెల్లడించారు.నేను పనిచేస్తున్న కంపెనీలో.. నా నిశ్చితార్థం & వివాహం గురించి రెండు నెలల ముందే మేనేజర్లకు సమాచారం ఇచ్చాను. అయితే వాళ్లు దానిని సీరియస్గా తీసుకోలేదని.. పైగా పెళ్లి ఎమర్జెన్సీ కాదని చెప్పినట్లు ఉద్యోగి రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఉద్యోగం కంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని, అవసరమైతే కొంతకాలం ఉద్యోగం మానేయమని ఒకరు వెల్లడించగా.. చాలా కంపెనీలు ఇలాగే ఉన్నాయని, ఉద్యోగుల అవసరాలను సైతం గుర్తించడం లేదని మరొకరు వెల్లడించారు. జీవితంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యమని ఇంకొకరు అన్నారు.కొన్ని సంస్థలు ఇప్పటికి కూడా పనికి ఇచ్చిన ప్రాధాన్యత.. ఉద్యోగులకు ఇవ్వడం లేదు. ఈ విషయంపై గతంలో చాలా వార్తలు వెల్లడయ్యాయి. ''ఇంట్లో కూర్చుని ఎంతసేపని భార్యని చూస్తూ ఉంటారు?.. ఇంట్లో కంటే ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని మీ భార్యకు చెప్పండి. వారానికి 90 గంటలు పనిచేయండి. నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నా.. ఆరోజు మీతో పని చేయించలేక పోతున్నందుకు బాధపడుతున్నా'' అంటూ గతంలో లార్సెన్ & టూబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు. -
బడ్జెట్ 2026:: వరాలు లేవు.. శరాలు లేవు..
రెండో నెలలో నెల మొదటి రోజున మూడు ముఖ్యమైన కర్తవ్యాలతో కేవలం 4.3 శాతం ద్రవ్యలోటుతో 500 మంది పైగా పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఆర్థిక సుస్థిరతకు ఆరు సంస్కరణలతో 7 శాతం అభివృద్ధి ఉందంటూ 80 నిమిషాల్లో ఏకధాటిగా 9 వసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన పద్దు ఇది.దీని పేరు యువ శక్తి బడ్జెట్. పవిత్ర మాఘ పౌర్ణమినాడు ఆదివారం అయినా ఆపకుండా విదేశీ మార్కెట్లతో పోటీపడుతూ, వికసిత్ భారత్ వైపుగా వడివడిగా అడుగులు వేస్తూ, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ప్రజలను భాగస్వాములు చేస్తూ.. సబ్కా సాథ్ అంటూ, ఆత్మనిర్భర్ వైపుగా నిర్భయంగా అడుగులు వేస్తూ.. ఉత్పత్తి, సర్వీసులు, చిన్న తరహా పరిశ్రమలు, ఇన్ఫ్రా, ఫార్మా, జౌళి వివిధ రంగాలను ప్రస్తావిస్తూ, దివ్యాంగులను, యువతను మహిళలను, రైతులను, అన్ని రంగాలవారిని ఆకట్టుకుంటూ, టెక్నాలజీ ద్వారా కృత్రిమ మేధస్సు మిషన్, యోగా, ఆయుర్వేదం మొదలైన వాటికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, ఆటలను ప్రోత్సహిస్తూ, ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రస్తావిస్తూ సాగింది బడ్జెట్ ప్రసంగం.ఎన్నికల తాయిలం లేదు. ప్రత్యేకిస్తూ కొన్ని రాష్ట్రాలకు పెద్ద పీట.. ఇంకొన్నింటిపై చిన్న చూపు చూడటంలాంటివి లేదు.. అభివృద్ధి మాత్రమే స్మరించారు. షేరు మార్కెట్ నష్టపోయింది కానీ .. పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యతిరేకతలు, నిరసనలు లేవు. అయితే ఇన్కమ్ట్యాక్స్ అంశానికొస్తే.. సంచలనాలు లేవు. రేటు మార్పులు లేవు. శ్లాబుల్లో మార్పులు లేవు, వేతన జీవులకంటూ ప్రత్యేకం లేదు. సీనియర్ సిటిజన్ల ప్రస్తావన లేదు. మహిళల ఊసే లేదు. స్టాండర్డ్ డిడక్షన్ మారలేదు. 80సీ పరిమితిని పెంచలేదు. మరి ఏం ప్రపోజ్ చేశారు?‘ఐ ప్రపోజ్’ అని వందసార్లకు పైగా చెప్పిన ఆర్థిక మంత్రి ఏం అన్నారంటే..కొత్త చట్టం 01–04–2026 నుంచి అమల్లోకి వస్తోంది.చట్టానికి చేదోడువాదోడుగా ఉండే రూల్సు వస్తాయి.మీరు ప్రతి సంవత్సరం దాఖలు చేసే రిటర్నులు మారుతున్నాయి.ఫారం డిజైన్ స్నేహపూర్వకంగా ఉంటుంది.‘నేను సైతం’ నా రిటర్ను వేసుకోగలను అనుకునేంత సులభతరంగా ఉంటుంది.ఐటీఆర్ ఫారం 1,2లు వేయడానికి గడువు తేదీ జూలై 31.మిగతా, అంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వాటికి గడువు తేదీ ఆగస్టు 31.మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ మీద వడ్డీ ఆదాయం లేదు. టీడీఎస్ ఉండదు.టూర్ ప్రోగ్రామ్ల మీద, మ్యాన్పవర్ సర్వీస్ల మీద టీసీఎస్ రేటు తగ్గించారు (5 నుంచి 2 శాతానికి)విదేశాలకు పంపే మొత్తాల మీద, అంటే విద్య, వైద్యం కోసం పంపే మొత్తాల మీద టీసీఎస్ని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది.పన్ను తగ్గించి లేదా పూర్తిగా రద్దు చేయడానికి సంబంధించి టీడీఎస్ కోసం.. ఇక అధికారుల దగ్గరికి పరుగెత్తనక్కర్లేదు. అంతా ఆన్లైన్.రివైజ్డ్ రిటర్నులకు గడువు తేదీని డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచారు.విదేశాల్లో ఉన్నవారికి టీడీఎస్, క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఒకప్పుడు TAN అవసరం. ఇప్పుడు PANతో సరి.ఒక వర్గం వారు, విదేశీ ఆస్తుల డిక్లరేషన్ ఇవ్వాలి (వివరాలు రాయాలి).అసెస్మెంట్ ద్వారా రివైజ్ వేయకూడదు కానీ ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు.ఇక నుంచి అండర్ రిపోర్టింగ్కి, మిస్–రిపోర్టింగ్కి ఒకేలా ఫెనాల్టీలు ఉంటాయి.పెనాల్టీలను తక్కువ చేశారు (కొన్ని సందర్భాల్లో)జైలు శిక్షలను తగ్గించారు (కొన్ని సందర్భాల్లో)అకౌంట్ బుక్స్ ఇవ్వకపోయినా, టీడీఎస్కి సంబంధించిన కాగితాలు ఇవ్వకపోయినా ఏమీ అనరు.నిజాయితీపరులైన ట్యాక్స్ పేయర్స్ తప్పులు చేసినా, ఫైన్తో వదిలేస్తారు.పెద్దవి, పెను మార్పులు లేకపోయినా, కొన్ని మార్పులు మాత్రం వచ్చాయి. వాటిని స్వాగతిద్దాం.ట్యాక్సేషన్ నిపుణులు: కే.సీహెచ్.ఎస్.వి.ఎన్. మూర్తి & కే.వీ.ఎన్. లావణ్య -
ఇక ఇండియన్ ఐటీ పరిశ్రమదే కీలక పాత్ర
కేంద్ర బడ్జెట్ 2026లోని ప్రతిపాదనలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన–అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని వారు ప్రశంసించారు.సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా భారత్కేంద్ర బడ్జెట్ 2026 భారతదేశాన్ని విశ్వసనీయ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా నిలబెడుతుంది. సుపరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించడం ప్రోత్సాహకరం. ఇది ఆవిష్కరణ, సమర్థత, స్కేలబుల్ డిజిటల్ పరిష్కారాలను అందించడంలో భారతీయ ఐటీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేస్తుంది. ఇండియాఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫండ్, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సిద్ధమైన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.— అతుల్ సోనేజా, సీఓఓ, టెక్ మహీంద్రాక్రిప్టో రంగానికి దీర్ఘకాలిక లాభంభవిష్యత్తు సాంకేతికతల పట్ల కేంద్ర బడ్జెట్ స్పష్టమైన నిబద్ధతను చూపుతోంది. ఇండియాఏఐ మిషన్కు రూ.2,000 కోట్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు రూ.500 కోట్లు కేటాయించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. క్రిప్టో రంగానికి ఇది తక్షణ ధరల ప్రభావం కన్నా, బలమైన ఆర్ & డి, టాలెంట్ అభివృద్ధి, నియంత్రిత, ఇండియా-ఫస్ట్ వినియోగాల నిర్మాణానికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తుంది. బ్లాక్చెయిన్ ఎంటర్ప్రైజ్ స్వీకరణకు, సురక్షిత ఆర్థిక మౌలిక సదుపాయాలకు కీలకమవుతుంది.— విక్రమ్ సుబ్బూరాజ్, సీఈఓ, జియోటస్.కామ్తెలంగాణ లైఫ్ సైన్సెస్ వృద్ధికి ఊతంకేంద్ర బడ్జెట్ లైఫ్ సైన్సెస్ రంగంపై చూపుతున్న దృష్టి తెలంగాణలో వృద్ధికి మరింత ఊతమిస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30లో పేర్కొన్న అధునాతన తయారీ, ఆవిష్కరణలు, ఆర్ & డి లక్ష్యాలు ఈ బడ్జెట్తో మరింత వేగం పొందనున్నాయి. దీని ద్వారా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాలు సాధ్యమవుతాయని, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ స్థానం బలపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.— శక్తి ఎం. నాగప్పన్, సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ -
ఈవీలపై గుడ్ న్యూస్.. తగ్గనున్న ధరలు
ఈవీలు కొనుగోలు చేసేవారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వాహనాల ధరలు తగ్గే చర్యలు తీసుకుంది. కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ (Basic Customs Duty) సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించారు.ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా లిథియం-అయాన్ సెల్ తయారీకి మద్దతు ఇవ్వడానికి క్యాపిటల్ గూడ్స్, కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని సున్నాకి తేవడానికి లక్షణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి.ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ పరిస్థితిప్రస్తుతం 35 రకాల క్యాపిటల్ గూడ్స్ (ఈవీ బ్యాటరీ తయారీకి అవసరమైన మెషినరీ/భాగాలు) పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. గత బడ్జెట్లోనే (2025-26) ప్రభుత్వం దీన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు తాజా బడ్జెట్ 2026-27లో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించాలని ప్రతిపాదించారు.తగ్గనున్న ఈవీల ధరలుఈవీల ధరలో అధిక మొత్తం (సుమారు 40-50%) బ్యాటరీలకే ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ తగ్గితే, బ్యాటరీ తయారీకి ఉపయోగించే ముఖ్యమైన భాగాలు, మెషినరీ దిగుమతులు చౌకగా అవుతాయి. దీంతో దానికి సంబందించిన ఖర్చు నాటకంగా తగ్గి ఈవీలు, బ్యాటరీల ధరలో కూడా తగ్గుదలకు దారితీస్తుంది. అంతిమంగా ఈవీల ధరలు సుమారు 10-15% వరకు తగ్గొచ్చు. -
జియో-బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్
ఇంధన రిటైలింగ్, మొబిలిటీ సంస్థ జియో-బీపీ తాజాగా ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా వినూత్నమైన ’యాక్టివ్’ టెక్నాలజీ పెట్రోల్ని ఆవిష్కరించింది. కీలకమైన ఇంజిన్ విడిభాగాలను శుభ్రంగా ఉంచుతూ, పనితీరును మెరుగుపరుస్తూ, మెయింటెనెన్స్ వ్యయాలను తగ్గిస్తూ, అదనంగా ఖర్చులేమీ లేకుండా వాహనం ఏటా మరో 100 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడేలా ఈ ఇంధనం ఉంటుందని సంస్థ తెలిపింది.మోటర్సైకిల్లో నింపి, కోయంబత్తూరులోని టెస్ట్ ట్రాక్లో 4,000కు పైగా కి.మీ. మేర దీని సామర్థ్యాలను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. దేశీయంగా వాహనదారులు సాఫీగా నడిచే, విశ్వసనీయమైన, తక్కువ మెయింటెనెన్స్ ఉంటూ ఇంధనంపై అదనంగా వెచి్చంచకుండా ఎక్కువ మైలేజీ ఉండాలని కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే జియో–బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్ని రూపొందించినట్లు వివరించారు. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ దిగ్గజం బీపీ కలిసి జియో–బీపీని జాయింట్ వెంచరుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ఓవర్టైమ్ వర్క్.. మొబైల్ ఫోన్ చూస్తుండగా..
ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు అలాంటిదే.. మరొకటి ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.ఒక 21 ఏళ్ల యువకుడు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ.. తనను తానే సరదాగా 'కార్పొరేట్ మజ్దూర్' (లేబర్) అని చెప్పుకున్నాడు. అతడికి కేటాయించిన పనులన్నింటినీ ఒక గంట ముందే పూర్తి చేశాడు. మేనేజర్ సాయంత్రం 6 గంటలకే వెళ్లిపోయారని భావించి, ఓవర్టైమ్ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఉండిపోయాడు. పని లేకపోవడంతో అతడు తన మొబైల్లో రెడిట్ నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుండగా, రాత్రి 8 గంటల సమయంలో.. మేనేజర్ అతని డెస్క్ దగ్గర కనిపించాడు.మేనేజర్ అతన్ని చూసి ఎందుకు పని చేయడం లేదు? అని ప్రశ్నించాడు. తనకు అప్పగించిన పనులన్నీ పూర్తయ్యాయని చెప్పగానే.. అయితే ఇంకో పని అడుగు అని మేనేజర్ పేర్కొన్నారు. అక్కడితో ఆ విషయం ఆగలేదు. మేనేజర్.. సీనియర్ మేనేజ్మెంట్కి సమాచారం ఇచ్చి, ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అన్నది గమనించమని చెప్పాడట. ముఖ్యంగా తననే ఉదాహరణగా చూపిస్తూ, ఇలాగే ఖాళీగా ఉంటే ఓవర్టైమ్ జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.జరిగిన సంఘటన ద్వారా.. తాను టార్గెట్ అయ్యానని ఆ యువకుడు బాధపడ్డాడు. అదే సమయంలో ఇతర ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుండగా, వారు మాత్రం మేనేజర్ కంట పడలేదు. సహోద్యోగులు ఈ పరిస్థితిని ఆఫీస్ ఎంటర్టైన్మెంట్ మాదిరిగా తీసుకుని, కొత్తగా వచ్చిన ఉద్యోగిని క్లాస్లో పిల్లాడిని మందలించినట్లు మందలించడాన్ని చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా? -
మరో భారీ విలీనం.. ఏడాదికల్లా ఓ బ్యాంకు మాయం!
దేశంలో మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు బ్యాంకులు అంతర్గత అంచనాలు, కార్యాచరణ ఏకీకరణ, డ్యూ డిలిజెన్స్ వంటి ప్రక్రియలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ విలీనం క్యాలెండర్ సంవత్సరం ముగిసేలోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.నాలుగైదు బ్యాంకులు చాలుప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించి నాలుగు నుంచి ఐదు బ్యాంకులకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు ఒక సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయడం ద్వారా బలమైన రుణదాతలను సృష్టించడమే ఈ విలీనాల లక్ష్యమట.దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్!ఈ విలీనంతో విస్తృతమైన బ్యాలెన్స్ షీట్, పెద్ద బ్రాంచ్ నెట్వర్క్, విస్తారమైన కస్టమర్ బేస్తో దేశంలోని అగ్ర ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి అవతరించనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కలిపిన బ్యాంక్ ఆస్తులు సుమారు రూ.25.4 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీని ద్వారా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండవ అతిపెద్ద పీఎస్యూ బ్యాంక్గా, అలాగే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్గా నిలవనుంది.మార్కెట్ క్యాప్లో కీలక మార్పులుమార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, ఈ విలీన బ్యాంక్ సుమారు రూ.2.13 లక్షల కోట్ల విలువతో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లను అధిగమించి ఆరో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఐదవ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరో అతిపెద్ద పీఎస్యూ బ్యాంకులుగా ఉన్నాయి.గత విలీనాల నేపథ్యం2017–2020 మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెగా విలీనాల్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడంతో, పీఎస్యూ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గింది. దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్ను సమర్థవంతంగా తీర్చడం, భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమర్థంగా పోటీ పడగల శక్తివంతమైన రుణదాతలను రూపొందించడమే ఈ కొత్త విలీనాల వెనుక ప్రభుత్వ లక్ష్యమని విధాన రూపకర్తలు స్పష్టం చేస్తున్నారు. -
ఫిబ్రవరిలో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్..
2026 జనవరి నెల ముగిసింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా.. భారతదేశంలోని అన్ని బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.➤ఫిబ్రవరి 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 14 (శనివారం) - రెండవ శనివారం కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 18 (బుధవారం)- లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కింలోని గాంగ్టక్లోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 19 (గురువారం) - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 20 (శుక్రవారం) - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజ్వాల్ (మిజోరం), ఇంఫాల్ (మణిపూర్)లలోని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు➤ఫిబ్రవరి 28 (శనివారం) - నాల్గవ శనివారం కారణంగా భారతదేశం అంతటా సెలవుఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఎన్బీఎఫ్సీ బంగారం రుణాలు పెరుగుదల
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (గోల్డ్ లోన్ ఏయూఎం) 207 మార్చి నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకుంటాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య 40 శాతం వృద్ధి చెందనున్నట్టు పేర్కొంది. 2023 నుంచి 2025 మధ్య వార్షిక రుణ వృద్ధి 27 శాతం కంటే అధికమని తెలిపింది. బంగారం ధరలు గణనీయంగా పెరగడం వాటిపై రుణ వితరణను వృద్ధి చేయనున్నట్టు పేర్కొంది.‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో బంగారం ధరలు 68 శాతం పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో బంగారం తనఖా విలువ పెరిగింది. రుణదాతలు మరింత మొత్తంలో రుణ పంపిణీకి అవకాశం ఏర్పడింది. అన్సెక్యూర్డ్ తదితర విభాగాల్లో రుణ లభ్యతకు పరిమిత అవకాశాల నేపథ్యంలో రుణ గ్రహీతలు.. ఇతర మార్గాల్లో రుణాలపై దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో బంగారం రుణ సేవల్లోని ఎన్బీఎఫ్సీలు బ్యాంకుల నుంచి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ తమ మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది.బడా ఎన్బీఎఫ్సీల విస్తరణ..బంగారం రుణాల్లోని బడా ఎన్బీఎఫ్సీలకు బ్రాండ్ గుర్తింపు ఉందని.. ఇవి తమ శాఖల వారీ పోర్ట్ఫోలియోని పెంచుకుంటున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ డైర్టెర్ అపర్ణ కిరుబకరణ్ తెలిపారు. మధ్యస్థాయి ఎన్బీఎఫ్సీలు ఒకవైపు తమ శాఖలను విస్తరిస్తూనే.. మరోవైపు ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల తరఫున భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. తక్కువ స్థాయి బంగారం రుణాలకు అధిక రుణాన్నిచ్చే (ఎల్టీవీ) నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నందున.. రుణ వితరణకు ఎన్బీఎఫ్సీలకు మరింత వెసులుబాటు లభిస్తుందన్నారు. కాకపోతే ఎన్బీఎఫ్సీలు రిస్క్ మదింపు, నిర్వహణ ప్రక్రియలపై కఠిన నియంత్రణ కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా బంగారం స్వచ్ఛత, బరువు, కచ్చితమైన విలువ మదింపు అవసరమన్నారు. శాఖల స్థాయిలో నిర్ణీత కాలానికోసారి ఆడిట్ చేపట్టడమూ అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. -
యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్ జట్టు
రష్యాకి చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్ శుభకర్ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.వీటిని పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్ వివరించారు. -
రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి
ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫిబ్రవరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించనుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజుకు సుమారు 1,50,000 బ్యారెళ్ల వరకు రష్యన్ చమురును కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. గోవాలో జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్’ సందర్భంగా రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు.ఆంక్షలకు లోబడే కొనుగోళ్లుగతంలో రష్యా చమురు దిగ్గజాలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ గత డిసెంబర్ తర్వాత రష్యా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుతం అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని విక్రేతలు, వాణిజ్య మధ్యవర్తుల ద్వారా తిరిగి రష్యా నుంచి చమురును సేకరించాలని రిలయన్స్ భావిస్తోంది. ‘ఫిబ్రవరి, మార్చి నెలల్లో అంతర్జాతీయ నిబంధనలు, ఆంక్షలకు లోబడి ఉన్న రష్యన్ చమురును రిలయన్స్ కొనుగోలు చేయనుంది’ అని రాయిటర్స్ నివేదిక తెలిపింది.జామ్ నగర్ రిఫైనరీ సామర్థ్యంగుజరాత్లోని జామ్ నగర్లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో రోస్ నెఫ్ట్తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం రోజుకు 5,00,000 బ్యారెళ్ల వరకు రష్యా చమురును దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రిలయన్స్ తన సరఫరా వనరులను వైవిధ్యపరుచుకుంటోంది.టర్మ్ డీల్స్ ద్వారా నిరంతర సరఫరా కోసం సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కొంతభాగం ఉత్తర అమెరికా-కెనడా నుంచి చమురు సేకరిస్తోంది. వెనిజువెలా ముడి చమురును తిరిగి దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతి కోసం రిలయన్స్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. -
కమర్షియల్ విమానాలు మూడు రెట్లు వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ వృద్ధి చెందే క్రమంలో దేశీయంగా 100 సీట్ల పైగా సామర్థ్యం ఉండే కమర్షియల్ విమానాల సంఖ్య వచ్చే దశాబ్ద కాలంలో మూడు రెట్లు పెరుగుతుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ అంచనా వేస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం 850గా ఉన్న సంఖ్య 2035 నాటికి 2,250కి పెరగనుంది. దేశీయంగా ఏవియేషన్ మార్కెట్ వృద్ధి చెందుతుండటం, అంతర్జాతీయ రూట్లలో కూడా కార్యకలాపాలను విస్తరించడంపై దేశీ విమానయాన సంస్థలు గణనీయంగా దృష్టి పెడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా గురువారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ జర్జెన్ వెస్టర్మెయర్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం భారత ఎయిర్లైన్స్ నుంచి 1,250 విమానాలకు ఆర్డర్ల బ్యాక్లాగ్ ఉందని వివరించారు. ఏటా సగటున 120–150 వరకు విమానాలను అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే పదేళ్లలో భారత్లో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి వార్షికంగా 8.9 శాతంగా ఉండొచ్చని, విమానాశ్రయాల సంఖ్య మరో 50 మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు వెస్టర్మెయర్ తెలిపారు. కమర్షియల్ విమానాల సంఖ్య పెరగడంతో పాటు వార్షికంగా సరుకు రవాణా సామర్థ్యం పెరిగేందుకు కూడా అవకాశం ఉందని ఆయన చెప్పారు. భారతీయ విమానయాన సంస్థలు సుమారు 1,700 విమానాలకు ఆర్డర్లివ్వగా, ఎయిర్బస్ దగ్గర 72% బ్యాక్లాగ్ ఉందని వెస్టర్మెయర్ తెలిపారు. 35 వేల మంది పైలట్లు కావాలి.. విమానాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో 2035 నాటికి 35,000 మంది పైగా పైలట్లు అవసరమవుతారని, అలాగే సాంకేతిక సిబ్బంది సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగి 34,000 స్థాయిలో కావాల్సి ఉంటుందని వెస్టర్మెయర్ చెప్పారు. ప్రస్తుతం పైలట్ల సంఖ్య 12,000గా, సాంకేతిక సిబ్బంది సంఖ్య సుమారు 11,000గా ఉన్నట్లు ఆయన తెలిపారు. విమానాల సంఖ్య మూడు రెట్లు పెరిగే క్రమంలో భారత్ వేగంగా మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ కార్యకలాపాలకి హబ్గా ఎదుగుతుందని వెస్టర్మెయర్ చెప్పారు.ఎయిర్ఫ్రేమ్లు, ఇంజిన్లు, విడిభాగాల మార్కెట్ 2035 నాటికి మూడు రెట్లు పెరిగి 9.5 బిలియన్ డాలర్లకు చేరగలదని పేర్కొన్నారు. ఇక ఫ్లయిట్, గ్రౌండ్, సాంకేతిక కార్యకలాపాల డిజిటలైజేషన్తో పాటు సైబర్ సెక్యూరిటీ మొదలైన వాటిపై భారతీయ ఎయిర్లైన్స్ 1 బిలియన్ డాలర్ల వరకు వెచ్చించే అవకాశం ఉందన్నారు.భారత్లో తొలిసారిగా రూపొందించి, అసెంబుల్ చేసిన ఎయిర్బస్ సీ–295 ట్విన్ ఇంజిన్ మీడియం మిలటరీ రవాణా విమానాన్ని 2026 మూడో త్రైమాసికంలో డెలివర్ చేయనున్నట్లు వెస్టర్మెయర్ వివరించారు. ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి డెలివరీలు ప్రారంభం కాగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ నుంచి 1.5 బిలియన్ డాలర్ల మేర కొనుగోళ్లు చేస్తున్నామని పేర్కొన్నారు. -
30 బోయింగ్ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంధనం ఆదా చేసే 737 మ్యాక్స్ రకానికి చెందిన మరో 30 బోయింగ్ విమానాల కోసం ఎయిరిండియా ఆర్డరిచ్చింది. దీనితో బోయింగ్కి మొత్తం కలిపి దాదాపు 200 విమానాలకు ఆర్డరిచ్చినట్లవుతుంది. మరోవైపు, ఏ321 రకానికి చెందిన 200 విమానాల కోసం ఎయిర్బస్కి ఇచ్చిన ఆర్డర్లో ఎయిరిండియా స్వల్ప మార్పులు చేసింది.ఇందులో 15 ఎయిర్క్రాఫ్ట్లను అధునాతన ఎ 321ఎక్స్ఎల్ఆర్ (ఎక్స్ట్రా లాంగ్ రేంజ్) వేరియంట్కి మార్చుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇవి 2029–2030 మధ్యలో డెలివర్ అ య్యే అవకాశం ఉందని వివరించింది. ఇంధనం ఆదా చేసే ఎ321 ఎక్స్ఎల్ఆర్ విమానా లకు దాదాపు 8,700 కి.మీ. రేంజి ఉంటుంది. -
‘సెప్టెంబర్ నుంచి మేడిన్ ఇండియా సీ295ల డెలివరీ’
హైదరాబాద్: దేశీయంగా తయారు చేసిన సీ295 మిలిటరీ రవాణా విమానాల డెలివరీలను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అందించనున్నట్లు విమానయాన దిగ్గజం ఎయిర్బస్ హెడ్ (డిఫెన్స్, స్పేస్–భారత్, దక్షిణాసియా) వెంకట్ కె. తెలిపారు.ఇండియన్ ఎయిర్ఫోర్స్కి మొత్తం 56 విమానాలను అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు స్పెయిన్లో తయారు చేసిన 16 విమానాలను సరఫరా చేసినట్లు వివరించారు. 2031 నాటికి మరో 40 విమానాలను అందించాల్సి ఉందని చెప్పారు టాటా అడ్వాన్స్డ్ సిస్టం (టీఏఎస్ఎల్) భాగస్వామ్యంతో ఎయిర్బస్ వీటిని తయారు చేస్తోంది.తెలంగాణలోని ఆదిభట్లలో కొంత భాగాన్ని, వదోదరలో తుది అసెంబ్లింగ్ చేసి వీటిని అందించనుంది. విమానానికి సంబంధించి 14,500 పైచిలుకు విడిభాగాల్లో 13,500 పైగా విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నట్లు వెంకట్ చెప్పారు. -
సివిల్ ఏవియేషన్పై హెచ్ఏఎల్ మరింతగా ఫోకస్
పౌర విమానయాన విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ వెల్లడించారు. వ్యాపారంలో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5–6 శాతంగా ఉండగా 25 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో సూపర్జెట్ 100 (ఎస్జే100) ఎయిర్క్రాఫ్ట్లను ప్రస్తుత ప్లాంట్లలో వచ్చే మూడేళ్లలో సెమీ–నాక్డ్ డౌన్ విధానంలో రూపొందించనున్నట్లు చెప్పారు. రష్యాకి చెందిన పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్తో హెచ్ఏఎల్ ఇటీవలే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది.ఓవైపు వీటిని లీజు పద్ధతిలో అందిస్తూనే, దేశీయంగా ఈ విమానాల తయారీకి ఏర్పాట్లు చేసుకోనున్నట్లు సునీల్ చెప్పారు. దేశంలో ప్రాంతీయంగా కనెక్టివిటీపై దృష్టి పెడుతున్నందున 200 పైగా ఎస్జే100 విమానాలకు డిమాండ్ నెలకొనవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే మూడునాలుగేళ్లలో తమ కంపెనీ ఆదాయాల్లో ఈ విమానాలతో పాటు హెలికాప్టర్లకు కూడా గణనీయంగా వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ పవన్ హన్స్ సంస్థ దేశీయంగా తయారైన 10 ధృవ్ న్యూ జనరేషన్ హెలికాప్టర్లను కొనుగోలు చేసి, ఓఎన్జీసీ ఆఫ్షోర్ కార్యకలాపాల కోసం వినియోగించనున్నట్లు సునీల్ చెప్పారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి కూడా ఈ విమానాలకోసం ఆర్డర్లు ఉన్నట్లు తెలిపారు. కార్యకలాపాలపై ఏటా రూ. 2,500–3,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 31,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ ఆర్థిక సంవత్సరం సుమారు 7–8 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: లెక్కలు తప్పయితే.. చిక్కులు తప్పవు! -
కొత్తగా 7 రూట్లపై ఎతిహాద్ ఎయిర్వేస్ దృష్టి
సర్వీసుల విస్తరణకు అనుమతులు లభిస్తే భారత్లో మరిన్ని నగరాలకు ఫ్లయిట్స్ని నడిపే యోచనలో ఉన్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈవో ఆంటోనోల్డో నెవిస్ తెలిపారు. గోవాతో పాటు 5–7 నగరాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని వివరించారు. అలాగే హైదరాబాద్, అహ్మదాబాద్లాంటి నగరాలకు ఫ్లయిట్స్ని రెట్టింపు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం భారత్లో 11 నగరాలకు సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపారు.విదేశీ విమానయాన సంస్థలకు ట్రాఫిక్ హక్కులపై పరిమితులు విధించడం భారత్కే నష్టం కలిగిస్తుందని నెవిస్ చెప్పారు. ముందుగా మార్కెట్ని విస్తరించేందుకు విదేశీ ఎయిర్లైన్స్కి అవకాశం లభిస్తే, తర్వాత దాన్ని దేశీ విమానయాన సంస్థలు అందిపుచ్చుకోవచ్చని వివరించారు. 2025లో గ్లోబల్గా కంపెనీ 20 శాతం వృద్ధి సాధించగా, భారత మార్కెట్లో మాత్రం ఒక మోస్తరు స్థాయికే పరిమితమైనట్లు పేర్కొన్నారు. తమ విజన్ 2030లో భారత మార్కెట్ కీలకంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో భారత్లో 15–20 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామని, ఒకవేళ అది సాధ్యపడకపోతే ఇతర మార్కెట్లవైపు దృష్టి సారిస్తామని వివరించారు.ఇదీ చదవండి: ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్ -
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
దేశీయంగా ఏజెంటిక్ ఏఐ, స్పెషలైజ్డ్ జెన్ఏఐ నిపుణులకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్–సరఫరా మధ్య 50 శాతం పైగా వ్యత్యాసం ఉండగా, ఆయా ఉద్యోగాల పోస్టింగ్ల ఏటా 35–40 శాతం పెరుగుతోంది. 28,000 జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టు ప్రకారం కంపెనీలు ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐని ప్రయోగాత్మక పరీక్షలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వ్యాపార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి. దీనితో పూర్తి స్థాయి సామర్థ్యాలున్న నిపుణులను నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతీయ ఏజెంటిక్ ఏఐ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఇది 276 మిలియన్ డాలర్లుగా నమోదైంది. సిస్టంలు స్వయంగా నిర్ణయాలు, చర్యలు తీసుకోగలిగే మరింత అధునాతన కృత్రిమ మేథను ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తున్నారు.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..సీనియర్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ ఉద్యోగులకు జీతభత్యాలు సగటు స్థాయికంటే 20–28 శాతం అధికంగా ఉంటున్నాయి.70 –75 శాతం జీసీసీలు, భారీ కంపెనీలు అంతర్గతంగా నిర్మాణాత్మక ఏఐ శిక్షణ ప్రోగ్రాంల దన్నుతో 30–35 శాతం అడ్వాన్స్డ్ ఏఐ ఉద్యోగాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. మొత్తం అధునాతన ఏఐ నియామకాల్లో రిమోట్ ఉద్యోగుల వాటా 15–20 శాతం ఉండనుంది.మొత్తం ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వాటా 54 శాతం స్థాయిలో ఉండనుంది.టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్) సంస్థలు తమ ఉత్పత్తుల్లో 68 శాతం ఏజెంటిక్ ఏఐని పొందుపరుస్తున్నాయి.ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్ వాటా 70 శాతం పైగా ఉంటోంది. కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారి రిక్రూట్మెంట్ 20 శాతం మేర ఉంటోంది. గవర్నెన్స్, సేఫ్టీ, ప్రోడక్ట్ స్ట్రాటెజీ విభాగాల్లో లీడర్íÙప్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి.72 శాతం ఉద్యోగార్హతల్లో టూల్–కాలింగ్, ఆర్కె్రస్టేషన్ మొదలైన నైపుణ్యాలు ఉంటున్నాయి. 63 శాతం ఉద్యోగాలకు రిట్రీవల్–ఆగ్మెంటెండ్ జనరేషన్ టూల్ సామర్థ్యాలు ఉండాలని కంపెనీలు అడుగుతున్నాయి. లాంగ్గ్రాఫ్, ఆటోజెన్, క్రూఏఐ నైపుణ్యాలకు డిమాండ్ 43 శాతం మేర పెరిగింది.మూడేళ్ల క్రితం కనిపించని చాలా మటుకు ఉద్యోగాలకు ప్రస్తుతం డిమాండ్ నెలకొంది. ఏఐ ఆర్కెస్ట్రేషన్ ఇంజినీర్లు, ఏజెంట్ బిహేవియర్ అనలిస్టులు, ఏజెంట్ సేఫ్టీ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్టులు, వెక్టార్ డేటాబేస్ ఆర్కిటెక్టులు, ఏజెంట్ లైఫ్సైకిల్ మేనేజర్లు, ఏజెంటిక్ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి.భారత్లో టెక్నాలజీ నిపుణులకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ అనేది కొత్త నైపుణ్యం మాత్రమే కాదు, కెరియర్కి దిశా నిర్దేశం చేస్తోంది. ప్రాంతాలవారీగా చూస్తే ఏజెంటిక్ ఏఐ హైరింగ్లో బెంగళూరు, హైదరాబాద్ల వాటా దాదాపు 62 శాతంగా ఉంది. గవర్నెన్స్, వినియోగం, వర్క్ఫ్లో నిర్వహణలకు కేంద్రాలుగా ఎన్సీఆర్, పుణె, చెన్నై ఎదుగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం హైరింగ్లో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 10 శాతంగా ఉంది. -
గోల్డ్లోన్ సూపర్ రన్
ముంబై: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండడం.. వాటి తనఖా రుణాల మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తోంది. 2025 నవంబర్ నాటికి రెండేళ్లలో పసిడి రుణాలు రెట్టింపై రూ.15.6 లక్షల కోట్లకు చేరాయి. ధరల పెరుగుదలతో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు వాటిపై మరింత మొత్తంలో రుణాల మంజూరునకు వీలు కల్పిస్తోంది. 2025 నవంబర్ నాటికి ఏడాది కాలంలో బంగారం తనఖా రుణాలు 42 శాతం పెరిగాయి. 2024 నవంబర్ నాటికి ఏడాది కాలంలో పెరుగుదల 39 శాతంగా ఉంది. దీంతో 2023 నాటికి రుణాల మొత్తం రూ.7.9 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నవంబర్ చివరికి రూ.15.6 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం రిటైల్ రుణాల్లో పసిడి రుణాల వాటా 9.7 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది 8.1 శాతంగా ఉంది. ఈ వివరాలను క్రెడిట్ బ్యూరో సంస్థ క్రిఫ్ హైమార్క్ విడుదల చేసింది. పసిడి రుణాల్లో రూ.2.5 లక్షలకు మించినవి మొత్తం రుణాల్లో సగం మేర ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఇవి 36.4 శాతంగా ఉన్నాయి. 36 శాతం రుణాలు పురుషులు తీసుకున్నవే. మరింత వేగవంతం.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జారీ అయిన బంగారం రుణాలు, వాటి విలువ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లోనే అధిగమించడం గమనార్హం. బంగారం రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు 60% వాటాతో ఆధిపత్యం చలాయిస్తున్నా యి. బంగారం రుణ ఆధారిత ఎన్బీఎఫ్సీల వాటా 8.1%గా ఉంది. బంగారం రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడినట్లు క్రిఫ్ హైమార్క్ తెలిపింది.దక్షిణాదిలోనే అధికం.. బంగారం రుణాల మా ర్కెట్ దక్షిణాదిలోనే ఎక్కు వగా ఉంది. మూడింట రెండొంతుల బంగారం రుణా లు దక్షిణాది రాష్ట్రాలో ఉన్నాయి. ఇక పది రాష్ట్రా ల పరిధిలోనే 90% రుణాలు ఉండడం గమనార్హం. 2025 నవంబర్తో ముగిసిన ఏడాది కాలంలో బంగారం రుణాల్లో 67% వృద్ధి గుజరాత్లో నమోదైంది. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రలో 50% వృద్ధి కనిపించింది. బంగారం రుణాలు సకాలంలో చెల్లించని రాష్ట్రాల్లో ఎక్కువగా తమిళనాడు, యూపీ, మహారాష్ట్రలు ఉన్నాయి. -
దక్షిణాసియాకు 3,300 కొత్త విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్లైన్స్కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ తమ కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్ సదస్సు వింగ్స్ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్ ఎండీ (కమర్షియల్ మార్కెటింగ్, యురేషియా, ఇండియన్ సబ్కాంటినెంట్) అశ్విన్ నాయుడు ఈ విషయాలు తెలిపారు. 3,300 విమానాల డిమాండ్కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని వివరించారు. భారీగా సిబ్బంది .. వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్ సరీ్వసులపై 195 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్ తయారీ రంగం, ఈకామర్స్ తదితర రంగాల దన్నుతో ఎయిర్ కార్గో మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. -
బడ్జెట్ 2026పై పారిశ్రామిక వర్గాల అంచనాలు
కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ పారిశ్రామిక వర్గాల అంచనాలు, ఆశలపై కేపీఎంజీ ఇండియా సర్వే విడుదల చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో పన్ను విధానాల సరళీకరణ, ప్రోత్సాహకాలపై స్టేక్హోల్డర్లు ఏమనుకుంటున్నారో ఈ ప్రీ-బడ్జెట్ సర్వే స్పష్టం చేస్తోంది.జనవరి 2026లో నిర్వహించిన ఈ సర్వేలో ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఫార్మా, హెల్త్కేర్ వంటి కీలక రంగాలకు చెందిన 100 మందికి పైగా పాల్గొన్నారు. వీరి అభిప్రాయాల ప్రకారం బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధాన మార్పులు ఇవే..పన్ను ప్రోత్సాహకాల పునరుద్ధరణతయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు గతంలో ఉన్న తక్కువ పన్ను రేటు విధానాన్ని మళ్లీ తీసుకురావాలని 34 శాతం మంది కోరుతుండగా, దాదాపు 50 శాతం మంది నిర్దిష్ట రంగాల వారీగా ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు.కొత్త ఐటీ చట్టం - సరళీకరణకొత్త చట్టం దిశగా అడుగులు పడుతున్నా కొన్ని అంశాల్లో మరింత స్పష్టత, సరళీకరణ అవసరమని సర్వే నొక్కి చెప్పింది. అందులో..టీడీఎస్/టీసీఎస్ నిబంధనల అమలులో సరళత.క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధానంలో మార్పులు.లిటిగేషన్ (న్యాయపరమైన వివాదాలు), అసెస్మెంట్ ప్రక్రియలో వేగం అవసరమనే అభిప్రాయాలున్నాయి.స్టాండర్డ్ డిడక్షన్మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చేలా బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని గణనీయంగా పెంచాలని 73 శాతం మంది కోరుతున్నారు.జీఎస్టీ, ఇతర సంస్కరణలుజీఎస్టీ ‘ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్’లో ఉన్న లోపాల వల్ల క్రెడిట్ నోట్ల మిస్మ్యాచ్లు పెరుగుతున్నాయని, వీటిని సరిదిద్దాలని 82 శాతం మంది కోరుతున్నారు.ప్రస్తుత డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ (DRP) వివాదాలను వేగంగా పరిష్కరించడంలో విఫలమవుతోందని సగం మంది ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ల (IFSC) కోసం దీర్ఘకాలిక నిబంధనలు కావాలని 51 శాతం మంది కోరారు.‘పరిశ్రమ వర్గాలు కేవలం పన్ను తగ్గింపులనే కాకుండా పారదర్శక వివాద పరిష్కార వ్యవస్థను, పన్ను నిబంధనల పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి రానున్న కొత్త చట్టం ఈ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి’ అని కేపీఎంజీ ఇండియా, ట్యాక్స్ హెడ్ సునీల్ బడాలా అన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
హైదరాబాద్లోకి మరో అంతర్జాతీయ కంపెనీ
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది. ప్రముఖ రసాయన రంగ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన బీఏఎస్ఎఫ్ తన గ్లోబల్ డిజిటల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో కొత్త ‘గ్లోబల్ డిజిటల్ హబ్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈమేరకు కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఆధ్వర్యంలో అధికారులు వివరాలు వెల్లడించారు.గ్లోబల్ నెట్వర్క్లో కీలకం..ప్రస్తుతం జర్మనీలోని లుడ్విగ్హాఫెన్, స్పెయిన్లోని మాడ్రిడ్, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న బీఏఎస్ఎఫ్ డిజిటల్ హబ్ల్లో ఇప్పుడు హైదరాబాద్ చేరనుంది. ఈ కేంద్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ వ్యాపార విభాగాలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో కూడిన డిజిటల్ సేవలు అందనున్నాయి.ఈ ప్రాజెక్టు గురించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ డా.డిర్క్ ఎల్వెర్మాన్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో ఈ హబ్ ఏర్పాటు చేయడం సంస్థలో విలువ జోడింపు దిశగా ఒక కీలక అడుగు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునే విధంగా తక్కువ వ్యయంతో డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం. ఒక గ్లోబల్ డిజిటల్ హబ్కు కావాల్సిన అన్ని అనుకూలతలు హైదరాబాద్లో ఉన్నాయి’ అన్నారు. సంస్థ తన డిజిటల్ పోర్ట్ఫోలియోను సరళీకృతం చేస్తూ వ్యయాలను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన డిజిటల్ సేవల విభాగంలో కీలక మార్పులు చేయాలని, తద్వారా సామర్థ్యాన్ని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.నియామక ప్రక్రియ ప్రారంభంహైదరాబాద్ హబ్ నిర్వహణ కోసం ‘BASF Digital Solutions Private Limited’ అనే కొత్త భారతీయ చట్టపరమైన సంస్థను (Legal Entity) ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ, ఇతర సన్నాహక పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.కంపెనీ గ్లోబల్ డిజిటల్ సర్వీసెస్ అధ్యక్షుడు డీట్రిచ్ స్పాండౌ మాట్లాడుతూ.. ఈ కేంద్రం అత్యుత్తమ డిజిటల్ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఒక ఆకర్షణీయమైన వర్క్ప్లేస్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ఇప్పటికే ఉన్న తయారీ, ఆర్ అండ్ డీ కేంద్రాలకు ఈ డిజిటల్ హబ్ అదనపు మద్దతు ఇస్తుందని కంపెనీ ఇండియా గ్రూప్ కంపెనీల అధిపతి అలెగ్జాండర్ గెర్డింగ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్త వాహనం.. అయినా టైరు పేలొచ్చు! -
షాకింగ్ న్యూస్ : అమెజాన్లో వేలాది మంది ఉద్యోగులపై వేటు
టెక్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలక నుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెలల నోటీసు పీరియడ్తో ఉద్యోగులను లేఆఫ్ చేయనుంది.ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ జనవరి 28న ప్రకటించింది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఏఐకి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతపై నిర్ణయం తీసుకుంది. ఈ కోతలకు ప్రభావితమైన ప్రతీ ఒక్కరికి సహకారం అందించేందుకు కృషి చేస్తామని Amazon పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి తెలిపారు. లేయర్లను తగ్గించడం, యాజమాన్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తొలగించడం ద్వారా తమ సంస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో భారీగా కోతలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇది కొత్త పద్ధతా అని అడగవచ్చు.. కానీ మా ప్లాన్ అదికాదు గాలెట్టి పేర్కొనడం విశేషం.సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ మొత్తం 1.57 మిలియన్ల మందిని నియమించినప్పటికీ, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులలో పని చేస్తున్నారు. కార్పొరేట్ వర్క్ఫోర్స్లో దాదాపు 3 లక్షల 50వేల మంది సిబ్బంది ఉన్నారు, అంటే తాజా కోతల్లోవారిలో దాదాపు 4.6 శాతం మందిపై వేటుపడనుంది.ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్ పవార్ మృతిపై రాజ్ థాకరే వ్యాఖ్యలు -
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు ఊరట
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సేవలు అందించే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విదేశీ విశ్వవిద్యాలయాలకు అందించే కన్సల్టెన్సీ సేవలను ‘సేవల ఎగుమతి’(Export of Services) గానే పరిగణించాలని, వాటికి జీఎస్టీ రీఫండ్ పొందే హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో జీఎస్టీ చట్టంలోని ‘ఇంటర్మీడియరీ’ (మధ్యవర్తిత్వ) సేవలపై చాలా కాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు తెరపడింది.హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టుజస్టిస్ జేబీ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. గ్లోబల్ అపర్చునిటీస్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థకు జీఎస్టీ రీఫండ్ మంజూరు చేయాలని గత ఏడాది సెప్టెంబర్లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం తోసిపుచ్చింది.కోర్టు తీర్పులో అంశాలు..‘విదేశీ వర్సిటీలకు అందించే సేవలు స్వతంత్రమైనవి. వీటిని కేవలం మధ్యవర్తిత్వ సేవలుగా చూడలేం. విద్యార్థులు భారత్లో ఉన్నారనో లేదా పారితోషికం విదేశీ కరెన్సీలో వస్తుందనే కారణాలతో ఈ సేవలను 'ఇంటర్మీడియరీ సేవలు'గా పరిగణించడం సాధ్యం కాదు. విద్యార్థులు వర్సిటీల్లో చేరిన తర్వాతే కమిషన్ అందవచ్చు, కానీ అది సంస్థ అందించే సేవల ఎగుమతి స్వభావాన్ని మార్చదు’ అని న్యాయస్థానం పేర్కొంది.ఐజీఎస్టీ చట్టంపై స్పష్టతఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST) చట్టంలోని సెక్షన్ 2(13) ప్రకారం 'ఇంటర్మీడియరీ' నిర్వచనాన్ని ఈ కేసులో లోతుగా విశ్లేషించారు. సదరు కన్సల్టెన్సీ కేవలం విద్యార్థులకు, వర్సిటీలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించడం లేదని, అది ఒక స్వతంత్ర సేవగా పరిగణించబడుతుందని దిల్లీ హైకోర్టు ఇదివరకే తేల్చింది. ప్రభుత్వం దీన్ని ఏజెంట్ సేవగా అభివర్ణించినప్పటికీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఈ తీర్పు ప్రభావం కేవలం ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలకే పరిమితం కాకుండా విదేశాలకు సేవలు ఎగుమతి చేసే ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. కొన్ని సంస్థలకు నిలిచిపోయిన కోట్లాది రూపాయల జీఎస్టీ రీఫండ్లు విడుదల కావడానికి ఇది మార్గం సుగమం చేసింది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు -
అదానీ గ్రూప్-ఎంబ్రేయర్ మధ్య ఒప్పందం
భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్, బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రేయర్ (Embraer SA) మధ్య కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. తాజాగా జరిగిన ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో ప్రాంతీయ వాణిజ్య విమానాల (Regional Transport Aircraft) తయారీ, అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.సాధారణంగా ఎయిర్బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ నుంచి విమాన విడిభాగాలను మాత్రమే సేకరిస్తుంటాయి. కానీ, పూర్తిస్థాయి అసెంబ్లీ లైన్లను ఏర్పాటు చేసేందుకు అవి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో అదానీ-ఎంబ్రేయర్ భాగస్వామ్యం భారత విమానయాన రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపనుంది.ఒప్పందంలోని ప్రధానాంశాలుఈ భాగస్వామ్యం ద్వారా భారత్లోనే ఎంబ్రేయర్ విమానాల అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నారు. విమానాల విక్రయాలకు సంబంధించి తగినంత స్థాయిలో ఆర్డర్లు లభించిన వెంటనే అసెంబ్లీ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ (Technology Transfer), శిక్షణ, పటిష్టమైన సప్లై చైన్ వ్యవస్థ ఏర్పడుతుంది.ప్రభుత్వ మద్దతుభారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘ఆత్మనిర్భర్ భారత్’, దేశంలోని చిన్న పట్టణాలను విమాన మార్గాలతో అనుసంధానించే ‘ఉడాన్’ (UDAN) పథకాలకు ఈ ఒప్పందం ఊతం ఇస్తుంది. దీనివల్ల భారత్-బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడి వివరాలు, ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. పనుల ప్రారంభ గడువు (Timeline) వంటి అంశాలు చర్చల దశలోనే ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ భాగస్వామ్యం విజయవంతం అయితే భారత్ కేవలం విమానాల వినియోగదారు దేశంగానే కాకుండా ప్రపంచ స్థాయి విమానాల తయారీ కేంద్రంగా కూడా అవతరిస్తుంది.ఇదీ చదవండి: వ్యవసాయ సంక్షోభానికి విరుగుడు -
సిల్వర్ సునామీ
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరల్లో రికార్డులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ రెండూ మరో కొత్త జీవిత కాల గరిష్టానికి దూసుకెళ్లాయి. బంగారం 10 గ్రాములకు రూ.7,300 లాభపడి రూ.1,66,000కు చేరుకుంది. గణతంత్రదినోత్స వం సందర్భంగా సోమవారం బులియన్ మార్కె ట్లు పనిచేయలేదు. వెండి కిలోకి రూ. 40,500 ఎగసి (12.3 శాతం) రూ.3,70,000 మార్క్ను తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు 8.55 డాలర్లు పెరిగి (8.24%) 112.41 డాలర్లకు చేరింది. బంగారం 79 డాలర్లు ఎగసి (1.58%) 5,087.48 డాలర్ల మార్క్ను తాకింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా నెలకొన్న డిమాండ్తో వెండి దేశీ మార్కెట్లో మరో కొత్త రికార్డు 3,70,000కు చేరినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పెట్టుబడులకు తోడు పారిశ్రామిక డిమాండ్ సైతం వెండి ధరలకు తో డైనట్టు చెప్పారు. ‘‘సమీ ప కాలంలో లాభాల స్వీకర ణ, స్థిరీకరణకు అవకాశం ఉంది. కానీ, అంతర్జాతీయంగా రిస్క్ సా మర్థ్యం బలహీనంగా ఉన్నంత కాల ం, డాలర్ ఒత్తిళ్లు ఎదుర్కొన్నంత కా లం మొత్తం మీద వెండి ధరలకు సానుకూలమే’’అని లెమన్ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ తెలిపారు. -
షార్ట్కట్స్ లేవు, అదృష్టం కాదు.. గూగుల్లో జాబ్!
గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని కొందరు అనుకుంటారు. కానీ.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెబుతున్నారు గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఆర్చీ గుప్తా. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గూగుల్ సంస్థలో జాబ్ ఎలా తెచ్చుకున్నారు?, అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?, అనే ఆసక్తికరమైన ఈ కథనంలో తెలుసుకుందాం.ఒక సాధారణ కాలేజీలో చదువుకుని.. గూగుల్లో ఉద్యోగం సాధించిన టెక్ ప్రొఫెషనల్ ఆర్చీ గుప్తా ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ప్రతిభకు, కష్టపడే తత్వానికి.. కాలేజీ పేరు లేదా ప్రతిష్ట అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు, అంకితభావం & నిరంతర ప్రయత్నం ఉంటే ఎవరైనా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చని వెల్లడించారు.తాను షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులో.. ఆర్చీ గుప్తా కెరీర్లోని ముఖ్యమైన దశలను ఫోటోల రూపంలో చూపించారు. మొదటి ఇంటర్న్షిప్ నుంచి మొదటి ఉద్యోగం వరకు.. ఎదురైన తిరస్కారాలు, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వెల్లడించారు. ప్రారంభంలో ఆమెను గూగుల్ తిరస్కరించింది. అదే తిరస్కారం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చిందని, ముందుకు వెళ్లడానికి ప్రేరణగా మారిందని చెప్పారు. పట్టుదలతో శ్రమించి చివరికి గూగుల్లో జాబ్ తెచ్చుకుంది.సాధారణ కాలేజీ నుంచి గూగుల్ వరకు ఎదగడానికి ఎలాంటి షార్ట్కట్స్ లేవు. అదృష్టం మీద ఆధారపడలేదు. సంవత్సరాల పాటు కృషి చేసాను. ప్రతిరోజూ ప్రయత్నించడం చేయడం మానుకోలేదని ఆర్చీ గుప్తా చెప్పారు. ఒక్కసారికే విజయం లభించదు. గొప్ప క్షణాలు వెంటనే కనిపించవు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని ఆమె వివరించారు. View this post on Instagram A post shared by Archy Gupta | Tech, Career, AI (@archy.gupta) -
భారత్-ఈయూ డీల్: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?
భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్ను విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా & సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం మాత్రమే. ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పదం ఈ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు.భారత్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి గట్టి విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఇండియా కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు.. సంస్కరణలు & భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న విధానాలతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని హర్దీప్ సింగ్ తెలిపారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ మార్పిడి మరింత బలపడుతుందని వివరించారు.ప్రస్తుతం భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వచ్చే కార్లపై భారీగా కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయి. ఇవి తగ్గితే.. వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని బ్రార్ అన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ విక్రయాల్లో దిగుమతి వాటా ఐదు శాతం మాత్రమే ఉంది. ట్యాక్స్ తగ్గేదే ఈ వాటా పెరుగుతుందని అన్నారు.ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు..దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువైన అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.ట్యాక్స్ తగ్గిస్తే.. ఫోక్స్వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది. -
ఇకపై సిల్వర్ రీసైక్లింగ్
ఎంఎంటీసీ–పీఏఎంపీ వెండి రీసైక్లింగ్ (పునర్వినియోగానికి అనుకూలంగా మార్చే) వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్ సరఫరాపరంగా తీవ్ర కొరతకు దారితీసే పరిస్థితులు ఉన్నందున వచ్చే మూడు నెలల్లో తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా వెండి రీసైక్లింగ్ను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సమిత్ గుహ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్ పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సరఫరా పెరిగే పరిస్థితుల్లేవని, ఈ క్రమంలో రీసైక్లింగ్ వ్యాపారం అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే డిమాండ్ ఇక ముందూ కొనసాగితే అప్పుడు శుద్ధి చేసిన వెండి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, ఇంతకు పది రెట్లు వెండి ఉన్నందున రీసైక్లింగ్ను ప్రభుత్వం ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారం రీసైక్లింగ్కు 20 స్టోర్లను నిర్వహిస్తోందని, వీటిని వెండి రీసైక్లింగ్కు వీలుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందన్నారు.వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపారు. రీసైక్లింగ్కు అదనంగా.. దక్షిణ, తూర్పు భారత్లో మింటింగ్ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమిత్ గుహ చెప్పారు. మింటింగ్ సామర్థ్యాన్ని 2.4 మిలియన్ కాయిన్ల నుంచి 3.6 మిలియన్ల కాయిన్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు. తన పోర్టల్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ప్లాట్ఫామ్లపై బంగారం, వెండి కాయిన్ల విక్రయాలను పెంచుకోనున్నట్టు తెలిపారు.ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా? -
ఐసీఐసీఐ ప్రు నుంచి ఐసిఫ్ పథకాలు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యుచువల్ ఫండ్ సంస్థ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) విభాగంలో రెండు కొత్త ఫండ్స్ని ప్రవేశపెట్టింది. ఐసిఫ్ ఈక్విటీ ఎక్స్-టాప్ 100 లాంగ్-షార్ట్ ఫండ్, ఐసిఫ్ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు జనవరి 30 వరకు అందుబాటులో ఉంటాయి.మొదటిది ఎక్స్-టాప్ 100 స్టాక్స్, వాటి సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్ వ్యూహాలతో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక రెండోది ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈక్విటీ పొజిషన్లలో లాంగ్-షార్ట్ పొజిషన్లు, ఫిక్సిడ్ ఇన్కం సాధనాలు, డెరివేటివ్ వ్యూహాలతో మార్కెట్ దిశతో సంబంధం లేకుండా మెరుగైన రాబడులు అందించేందుకు ప్రయత్నిస్తుంది.మ్యుచువల్ ఫండ్స్, పీఎంఎస్/ఏఐఎఫ్ సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసే దిశగా సెబీ ఈ సిఫ్ సెగ్మెంట్ని ప్రవేశపెట్టింది. దీనికి కనీస పెట్టుబడి రూ. 10 లక్షలుగా ఉంటుంది. వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనపర్చే వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహాలను ఇన్వెస్టర్లకు అందించే లక్ష్యంతో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు. -
చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు..
చైనాలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లకుపైన ట్రేడ్ అవుతుండగా, ఒక్కరోజులోనే 3 శాతం పెరిగింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250 శాతాన్ని దాటింది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ వెండి ప్రీమియం కారణంగా స్థానిక ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి.భారత్–చైనా వెండి ధరల తేడావెండి ధరలు ఆల్టైమ్ హై వద్ద ఉన్నాయి. భారత్లో వెండి ధర గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. చైనాతో పోలిస్తే ఇది సుమారు 17% తక్కువ. వివరంగా చూస్తే.. 1 ఔన్సు అంటే సుమారు 28.3 గ్రాములు. భారత్లో 1 ఔన్సు వెండి ధర సుమార రూ.9,984. అదే చైనాలో 1 ఔన్సు వెండి ధర 125 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.11,450. అంటే భారత్–చైనా మధ్య ఒక్క ఔన్సుపై సుమారు రూ.1,969 (17%) ధర వ్యత్యాసం ఉంది.ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?చైనాలో వెండికి భారీ డిమాండ్ ఉండటంతో పాటు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఈ ధర వ్యత్యాసాన్ని మరింత పెంచుతున్నాయి. వెండి బుల్ రన్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ సరఫరా పరిమితులు. దీనికి తోడు, చైనా 2026 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇకపై వెండి ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు అవసరం. ఈ విధానం 2027 వరకు అమల్లో ఉండనుంది.ఈ ఆంక్షలు ప్రకటించిన సమయంలో, ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యవసరం” అని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఇప్పటికే సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చైనా ఎగుమతులను పరిమితం చేయడంతో, ధరల అస్థిరత మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రపంచ వెండి మార్కెట్లో చైనా పాత్రప్రపంచ వెండి సరఫరాలో చైనా వాటా సుమారు 65%. సిల్వర్ ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పేపర్ ట్రేడింగ్లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద వెండి ఫ్యాబ్రికేటర్ కూడా చైనానే. చైనా ఎగుమతి పరిమితులు కొనసాగితే, ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోంది. అంటే డిమాండ్ ఎప్పటికప్పుడు సరఫరాను మించిపోతూనే ఉంది.ఘఇది చదివారా? రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?చైనాలో కొత్త నిబంధనలుజనవరి 1, 2026 నుంచి వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాలి. కఠినమైన ఉత్పత్తి, ఆర్థిక ప్రమాణాలు పాటించే పెద్ద, ప్రభుత్వ-ఆమోదిత సంస్థలకే లైసెన్సులు ఇస్తున్నారు. చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చైనా వెండి లభ్యత మరింత తగ్గే అవకాశముంది. -
కోటక్ బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్కు పద్మభూషణ్
భారత ప్రభుత్వం పద్మ పురస్కాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, వైద్యం, విద్య, ప్రజాసేవ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో విశిష్ట, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఈ అవార్డులతో సత్కరిస్తారు.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు అవార్డులు పొందినవారి పేర్లను ప్రకటించారు. పద్మ అవార్డులు భారత రత్న తర్వాత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. వీటిని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ఇస్తారు. 2026 సంవత్సరానికి 131 పద్మ అవార్డులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.ఉదయ్ కోటక్కు పద్మభూషణ్పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్కు దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ దాస్ ఆఫ్షోర్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ అశోక్ ఖాడే, టీటీకే గ్రూప్ చైర్మన్ (ఎమెరిటస్) టీటీ జగన్నాథన్లకు పద్మశ్రీ పురస్కారాల జాబితాలో చోటు దక్కింది. దేశీయ ప్రఖ్యాత వంటసామాను బ్రాండ్లలో ఒకటిగా ప్రెస్టీజ్ను తీర్చిదిద్దిన టీటీ జగన్నాథన్ గతేడాది అక్టోబర్లో మరణించారు. -
కోటక్ బ్యాంక్ కళకళ.. పెరిగిన లాభం
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 3,446 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ3లో నమోదైన రూ. 3,305 కోట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ. 16,050 కోట్ల నుంచి రూ. 16,741 కోట్లకు చేరింది. బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 13,428 కోట్ల నుంచి రూ. 13,903 కోట్లకు పెరిగింది.నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ. 7,196 కోట్ల నుంచి రూ. 7,565 కోట్లకు చేరినప్పటికీ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.93 శాతం నుంచి 4.54 శాతానికి నెమ్మదించింది. అసెట్ క్వాలిటీకి సంబంధించి స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 1.50 శాతం నుంచి 1.30 శాతానికి, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.41 శాతం నుంచి 0.31 శాతానికి దిగివచ్చాయి. అయితే, మొండిబాకీలకు కేటాయింపులు మాత్రం రూ. 794 కోట్ల నుంచి రూ. 810 కోట్లకు ఎగిశాయి. కన్సాలిడేటెడ్ ఫలితాలు.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు లాభం రూ. 4,701 కోట్ల నుంచి 5 శాతం వృద్ధి చెంది రూ. 4,924 కోట్లకు చేరింది. కొత్త లేబర్ కోడ్కి సంబంధించి రూ. 98 కోట్ల వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో లాభంపై ప్రభావం పడినట్లు బ్యాంకు తెలిపింది. డిసెంబర్ 31 నాటికి నిర్వహణలోని మొత్తం కస్టమర్ అసెట్స్ పరిమాణం రూ. 6,85,134 కోట్ల నుంచి రూ. 7,87,950 కోట్లకు చేరింది. క్రెడిట్ కార్డ్ విభాగంలో క్షీణత.. వార్షిక ప్రాతిపదికన క్రెడిట్ కార్డ్ విభాగం క్షీణించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ అశోక్ వాస్వాని తెలిపారు. కొత్త ప్రోడక్టులను ప్రవేశపెట్టడం ద్వారా వ్యాపారాన్ని మెరుగుపర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. అటు నిర్మాణ పరికరాల రంగం కూడా నెమ్మదించినట్లు చెప్పారు. స్టాండర్డ్ చార్టర్డ్ నుంచి కొనుగోలు చేసిన పర్సనల్ లోన్ పోర్ట్ఫోలియో ఊహించిన దానికన్నా మెరుగ్గా రాణిస్తున్నట్లు వివరించారు.నాలుగో త్రైమాసికంలో మార్జిన్లు ఒక మోస్తరుగానే వృద్ధి చెందే అవకాశం ఉందని బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) దేవాంగ్ ఘీవాలా తెలిపారు. క్రెడిట్ కార్డులు, మైక్రోఫైనాన్స్, వ్యక్తిగత రుణాల విభాగాల్లో స్లిపేజీలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. అయితే, స్లిపేజీలు అధికంగా ఉన్న రిటైల్ కమర్షియల్ వెహికల్ విభాగంపై అప్రమత్తంగా ఉన్నట్లు వివరించారు. -
అంబానీ ఫ్యామిలీతో కొరియన్ బిజినెస్మెన్.. గర్వంగా ఉందంటూ పోస్ట్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైనప్పటికీ.. చాలా వినమ్రంగా ఉంటారు. చాలా సందర్భాల్లో వ్యక్తులను గౌరవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కొరియన్ - అమెరికన్ వ్యాపారవేత్త 'వారెన్ చాంగ్' ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన తరువాత అనుభవాన్ని పంచుకున్నారు.ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను వారెన్ చాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులు & కుటుంబం. నాకు చాలా గౌరవంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అంబానీ ఫ్యామిలీని ప్రశంసించారు.ఎవరీ వారెన్ చాంగ్?కొరియన్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన వారెన్ చాంగ్ దుబాయ్లో నివసిస్తున్నారు. ఈయన కంపెనీ నిర్వహించడంతో పాటు.. లెగో మినీఫిగర్లను (చిన్న బొమ్మలు) సేకరిస్తూ ఉంటారు. అంతే కాకుండా.. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వంటి ప్రముఖులను, క్రీడా ప్రముఖులను, రాజకీయ నాయకులు & రాజకుటుంబ సభ్యులను కలిసిన చిత్రాలు చూడవచ్చు. View this post on Instagram A post shared by Warren Chang (@warrenchang) -
బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ దాకా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఇండో–ఏషియన్ న్యూస్ సర్విస్(ఐఏఎన్ఎస్)ను పూర్తిగా స్వాదీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటికే న్యూస్ ఏజెన్సీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ మిగిలిన 24 శాతం వాటాను సైతం చేజిక్కించుకుంది. డీల్ విలువను వెల్లడించనప్పటికీ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఐఏఎన్ఎస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్లో మిగిలిన వాటా ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. కాగా.. 2023 డిసెంబర్లో అదానీ గ్రూప్ ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో 50.5 శాతం వాటా కొనుగోలు చేసింది. తద్వారా న్యూస్వైర్ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకుంది. తిరిగి 2024 జనవరిలో ఐఏఎన్ఎస్లో వాటా పెంచుకోవడం ద్వారా ఏఎంజీ మీడియా 76 శాతం వోటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ బాటలో మిగిలిన 24 శాతాన్ని సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐఏఎన్ఎస్ను పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసుకోనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. దేశీయంగా వివిధ భాషల న్యూస్ ఏజెన్సీలలో ఒకటైన ఐఏఎన్ఎస్ ప్రింట్, డిజిటల్, బ్రాడ్క్యాస్ట్ ప్లాట్ఫామ్స్కు వార్తలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్డీటీవీ, బీక్యూ ప్రైమ్లలో వాటాలు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ ఇకపై మీడియా, కంటెంట్ ఎకోసిస్టమ్లో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. -
ఐబీఎంలో మైండ్ బ్లాక్ అయ్యే ఈ విచిత్ర కేసు గురించి విన్నారా?
ఐటీ ఉద్యోగం, అదీ ఎంఎన్సీ ఉంటే ఐదెంకల్లో జీతం, చక్కని జీవితం. అవసరానికి తగ్గట్లు సెలవులు. వీటితోపాటు ఇంకా ఎన్నో మెరుగైనా అవకాశాలు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు జీతంతోకూడిన లాంగ్ సిక్ లీవ్ కూడా ఇస్తాయి. అలాంటి ఐటీ కంపెనీలో సిక్లీవ్కు సంబంధించి ఒక విచిత్రకరమైన ఉదంతం హాట్ టాపిక్గా నిలిచింది. ఈ కథా కమామిష్షు ఏంటో తెలిస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.సిక్ లీవ్ మూడో, ఆరో నెలలు, మహా అయితే సంవత్సరం. అలాంటిది 15 ఏళ్లంటే ఊహించుకోండి. ఒక ఐటీ ఉద్యోగికి ఇది కూడా సరిపోలేదు ఊహించగలరా? ఈ పదిహేనేళ్లూ కంపెనీ అతనికి జీతం ఇస్తూనే ఉంది. 15 ఏళ్ల కాలంలో తనకు జీతం పెరగలేదంటూ కోర్టు కెక్కాడు. టెక్ దిగ్గజం ఐబీఎంకు అసాధారణమైన రియల్ స్టోరీ. ఇంతకీ ఏమైందీ మరి.యూకేకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్, మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెప్టెంబర్ 2008లో ఐబీఎం నుండి అనారోగ్య సెలవు తీసుకున్నారు. అతనికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్ఐదేళ్ల పాటు పనికి దూరంగా క్లిఫోర్డ్ 2013లో ఐబీ ఎంపై అధికారిక ఫిర్యాదు చేశాడు. ఈ కాలంలో తనకు ఒక్క ఇంక్రిమెంట్ లేదా జీతం పెంపు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. అయితే అతను కోర్టులో కేసు వేసినా కూడా కంపెనీ అతని జీతాన్ని ఆప లేదు. ప్రతీ ఏడాది దాదాపు 55.34 లక్షల రూపాయలు పొందుతూనే వచ్చాడు. దీని ప్రకారం గత 15 ఏళ్లలో అతను అందుకున్న జీతం విలువ మొత్తం. 8 కోట్ల రూపాయలు. దీనికి తోడు కంపెనీ హెల్త్ అండ్ ప్రమాద బీమా పథకంలో కూడా చేర్చారు. ఈ పథకం ప్రకారం, అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం అతను చివరిగా తీసుకున్న జీతంలో 75 శాతం లభిస్తుంది.2022లో మళ్లీ కోర్టుకుదాదాపు పదేళ్ల తర్వాత, 2022లో, క్లిఫోర్డ్ మళ్ళీ ఐబీఎంపై దావా వేశాడు. ఈసారి తనపై వైకల్య వివక్ష చూపారని ఆరోపిస్తూ ఉపాధి ట్రిబ్యునల్ను ఆశ్రయించాడు. ఈ 15 ఏళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని, అయినా తన జీతం మాత్రం కొంచెం కూడా పెరగలేదని ఆరోపించాడు. కనుక తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కోర్టులో వాదించాడు.కోర్టు తీర్పు ఎలా ఉంది? ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, క్లిఫోర్డ్ వాదనను,డిమాండ్ను తిరస్కరించింది. మీ కోసం కల్పించిన ప్రత్యేక ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలను పొందనందుకు , వివక్ష జరిగిందని ఆరోపించరేని కొట్టిపారేసింది. కాబట్టి, క్లిఫోర్డ్ డిమాండ్లో న్యాయం లేదని తీర్పు చెప్పింది. -
వరుసగా 4 రోజులు సెలవులు.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
జనవరి నెలాఖరులో బ్యాంకు పనులుండే కస్టమర్లకు అలర్ట్.. వరుస సెలవులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు రోజుల బ్యాంక్ సెలవులు ఖరారవ్వగా, నాలుగో రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది.జనవరి 24 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే ఉంటుంది. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు.ఇదిలా ఉండగా, వారానికి ఐదు పని దినాలు అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్తో జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె జరిగితే, నాలుగు రోజుల పాటు బ్యాంక్ శాఖలు పూర్తిగా మూసి ఉండే అవకాశం ఉంది.ఆన్లైన్ సేవలు యథావిధిగా..సెలవుల నేపథ్యంలో బ్యాంక్ బ్రాంచ్లలో చేయాల్సిన అత్యవసర పనులను కస్టమర్లు ముందుగానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివున్నా, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వీటి ద్వారా చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేయవచ్చు. -
అమెజాన్ ఉద్యోగులకు అమావాస్యే! కత్తులు సిద్ధం!!
అమెజాన్లో వేలాది ఉద్యోగులు ఉద్వాసనకు దగ్గరయ్యారు. రాయిటర్స్, బ్లూమ్బర్గ్ ఉటంకించిన వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్ వచ్చే వారం ప్రారంభంలో మరోసారి కార్పొరేట్ ఉద్యోగ కోతలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించడం, నిర్వహణలో అధిక పొరలను తొలగించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.గతేడాది అక్టోబర్లో సుమారు 14 వేల ఉద్యోగాలను తొలగించిన తర్వాత ఇప్పుడు కూడా మరో 14 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపు అమెజాన్ సిద్ధమైంది. ఈ రెండు రౌండ్లలో మొత్తంగా 30 వేల మందిని తొలగించాలన్నది అమెజాన్ టార్గట్ అని రాయిటర్స్ ఇప్పటికే నివేదించింది. తాజా రౌండ్ లేఆఫ్ల ప్రక్రియ మంగళవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.ప్రభావితమయ్యే విభాగాలురాయిటర్స్ సమాచారం ప్రకారం.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో, మానవ వనరులు (People Experience and Technology) విభాగాలలో ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశముంది. అయితే ఉద్యోగ కోతల ఖచ్చితమైన సంఖ్య మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్లో కోతలను అమలు చేయాలా లేదా 2026 ప్రారంభానికి వాయిదా వేయాలా అనే స్వేచ్ఛను అమెజాన్ మేనేజర్లకు ముందుగానే ఇచ్చింది. దీని ద్వారా భవిష్యత్తులో మరిన్ని కోతలకు అవకాశం ఉందని సంకేతాలు కనిపిస్తున్నాయి.పూర్తిగా అమలైతే, ఈ తొలగింపులు అమెజాన్ కార్పొరేట్ వర్క్ఫోర్స్లో దాదాపు 10% వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం అమెజాన్కు సుమారు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో మొత్తం 15.7–15.8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో ఎక్కువ మంది గిడ్డంగులు, ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల్లో ఉన్నారు.గతంలోనూ భారీ కోతలు2022 చివరి భాగం నుంచి 2023 ప్రారంభం వరకు అమెజాన్ సుమారు 27,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా నిలిచింది. గతేడాది అక్టోబర్లో తొలగింపులకు గురైన ఉద్యోగులకు ఇతర అంతర్గత పాత్రలు లేదా కొత్త అవకాశాలు వెతుక్కునేందుకు 90 రోజుల పేరోల్ గ్యారెంటీ ఇచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది. -
దుబాయ్ బ్యాంకు చేతికి ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్(ఈఎన్బీడీ)కు అనుమతి లభించింది. ఎమిరేట్స్ ఎన్బీడీ చేసిన ఈ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్లో 3 బిలియన్ డాలర్లు(రూ. 26,850 కోట్లు) వెచ్చించి మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ఈఎన్బీడీ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఇందుకు ఈఎన్బీడీతోపాటు ఆర్బీఎల్ బ్యాంక్ బోర్డులు ఆమోదముద్ర వేసినట్లు 2025 అక్టోబర్లో ఈఎన్బీడీ వెల్లడించింది. నియంత్రిత సంస్థల అనుమతుల తదుపరి ఫ్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఆర్బీఎల్లో 60 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఈఎన్బీడీ అక్టోబర్లో వెల్లడించింది. తద్వారా ప్రతిపాదిత పెట్టుబడులను వెచ్చించనుంది.అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం ఆర్బీఎల్ బ్యాంక్ సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ సైతం ప్రకటించవలసి ఉంది. వెరసి పబ్లిక్ నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరిగా ఓపెన్ ఆఫర్ ఇవ్వవలసి ఉంది.కాగా.. అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్లో నిర్దారిత వాటా కొనుగోలుకి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్కు కూడా సీసీఐ అనుమతి మంజూరు చేసింది. దీంతో అపోలో హెల్త్లో అపోలో హాస్పిటల్స్ 30.58 శాతం వాటా సొంతం చేసుకోనుంది. తద్వారా అపోలో హెల్త్లో వాటాను ప్రస్తుత 68.84 శాతం నుంచి 99.42 శాతానికి అపోలో హాస్పిటల్స్ పెంచుకోనుంది. అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ ప్రైమరీ, సెకండరీ హెల్త్కేర్ సర్వీసులకు వీలు కల్పించడంతోపాటు, డయాగ్నోస్టిక్, టెలిమెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తున్న విషయం విదితమే. -
యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త..
గూగుల్ పే గురించి వినుంటారు, ఫోన్పే ఉపయోగించుంటారు. యాపిల్ పే గురించి ఎప్పుడైనా విన్నారా?, అయితే ఈ వార్త మీ కోసమే. త్వరలోనే భారత్లో యాపిల్ పే సేవలు ప్రారంభం కానున్నాయి.యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఎందుకంటే.. భారత్లో యాపిల్ పే సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూజర్లు కార్డులను స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసుకునేలా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కంపెనీ ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సంస్థలతో చర్చలను ప్రారంభించింది.భారతదేశంలో కూడా.. యాపిల్ సంస్థ అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆర్బీఐ తరఫున అనుమతులు పొందేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సేవలు తొలుత యూపీఐ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. యూపీఐ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అవసరం. కాబట్టి తొలుత కార్డు ఆధారంగా కాంటాక్ట్లెస్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.యాపిల్ వ్యాలెట్లో కార్డుల వివరాలను భద్రపరుచుకుంటే.. అవసరమైనప్పుడు యాపిల్ పే యాప్తో చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారంగా ట్యాప్-టు పే టెక్నాలజీతో పనిచేస్తాయి. భద్రత ప్రమాణాల రీత్యా ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీల ధ్రువీకరణలను తప్పనిసరి చేస్తారు. ఏది ఏమైనా.. యాపిల్ గనక రంగంలోకి దిగితే.. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలకు గట్టిపోటీ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాపిల్ పే సేవలు 89 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. -
రూ.623 కోట్ల పెట్టుబడి.. స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లలో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) - 2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు.విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రీయల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు.ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని మంత్రులు తెలిపారు. -
దేశీ ఎంట్రప్రెన్యూర్ల హవా.. చైనాను వెనక్కి నెట్టిన భారత్!
విలువైన సంస్థలకు సారథ్యం వహిస్తున్న యువ ఎంట్రప్రెన్యూర్స్ సంఖ్యపరంగా చైనాను భారత్ వెనక్కి నెట్టింది. ఆ కోవకి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు భారత్లో 166 మంది ఉండగా చైనాలో 140 మంది ఉన్నట్లు అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూత్ సిరీస్ 2025 ఒక నివేదికలో తెలిపింది.100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే అంకురాలను స్థాపించిన 40 ఏళ్ల లోపు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య చైనాలో 54గా ఉండగా, భారత్లో 35గా ఉంది. ఇక 100 మిలియన్ డాలర్ల సంస్థలను స్థాపించిన లేదా 200 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలను నడిపిస్తున్న, 40 ఏళ్ల లోపు కొత్త తరం వ్యాపారవేత్తల సంఖ్య భారత్లో 201గా ఉండగా, చైనాలో 194గా ఉంది. ఈ జాబితాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ అగ్రస్థానంలో ఉండగా, అల్కెమీకి చెందిన నిఖిల్ విశ్వనాథన్ రెండో స్థానంలో, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ హర్షద్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.ఈ ఎంట్రప్రెన్యూర్లు సారథ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ రూ. 31 లక్షల కోట్లుగా (357 బిలియన్ డాలర్లు) ఉందని హురున్ పేర్కొంది. ఇది భారతదేశపు జీడీపీలో 11వ వంతు అని తెలిపింది. ఈ ఎంట్రప్రెన్యూర్ల నేతృత్వంలోని కంపెనీలలో మొత్తం 4.43 లక్షల మంది పని చేస్తున్నట్లు వివరించింది. అపోలో హాస్పిటల్స్లో అత్యధికంగా 42,497 మంది ఉద్యోగులు ఉన్నారు. ముప్ఫైల మధ్యలో ఉన్న చాలా మంది ఫిన్టెక్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సరీ్వస్), హెల్త్కేర్, క్లీన్ ఎనర్జీ తదితర విభాగాల్లో తమ సంస్థలను అగ్రగాములుగా తీర్చిదిద్దుతున్నట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. -
అనంత్ అంబానీ మరో లగ్జరీ వాచ్, అదిరిపోయే డిజైన్, ధర ఎంత?
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అటు వ్యాపారంతోపాటు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతార’ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అనంత్ అంబానీ, వంతారాకు సంబంధించి మరో అంశం విశేషంగా నిలుస్తోంది.న్యూయార్క్కు చెందిన లగ్జరీ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం కస్టమ్ 'వంతారా' గడియారాన్ని రూపొందించింది. ఈ హోరోలాజికల్ మాస్టర్పీస్ 'ఒపెరా వంటారా గ్రీన్ కామో' ను జనవరి 21న ఆవిష్కరించింది. అనంత్ అంబానీకి ఇష్టమైన వంతారాకు నివాళిగా ఈవాచ్ను తయారు చేసింది. డెమాంటాయిడ్ గోమేదికాలు, సావోరైట్లు, ఆకుపచ్చ నీలమణి , తెల్ల వజ్రాలు ఇందులో ఉన్నాయి. 21.98 క్యారెట్లతో దాదాపు 400 విలువైన రాళ్ల సంక్లిష్టమైన అమరిక అని, జాకబ్ అండ్ కో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ టైమ్పీస్ విలువ దాదాపు ‘1.5 మిలియన్లు’ (సుమారు రూ.12.5 కోట్లు). ప్రస్తుతం ఇది హోరాలజీ ప్రియులతోపాటు, ఫ్యాషన్ ప్రియుల ప్రశంసలందుకుంటోంది. (నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు) View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco)'ది వంతారా'లో 397 రత్నాలుఈ వాచ్ డిజైన్ మరింత స్పెషల్గా నిలుస్తోంది. డయల్లో మధ్యలో చేతితో తయారుచేసిన అనంత్ అంబానీ బొమ్మ అమర్చారు. అలాగే చుట్టూ బెంగాల్ టైగర్, సింహాన్నిఅమర్చారు. అలాగే బంగారం రూపొందించిన వంతారా, ఎనుగు ఈ డయల్లో మరో ఆకర్షణ. అనంత్ అంబానీ లగ్జరీ వాచెస్ అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించినాయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే ఉత్తమమైన జాకబ్ బ్రాండ్ది కూడా చేరింది. అనంత్ అంబానీ గడియారాల్లో పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ నుండి చాలా అందమైన విలాసవంతైన టైమ్పీస్లు చోటు దక్కించుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా. View this post on Instagram A post shared by JACOB & CO. (@jacobandco) -
రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ఐఐటీ కాన్పూర్లో చదువు, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేతికి కాగానే భారీ ఆఫర్తో ఉద్యోగం ఖాయం. బీటెక్ ఆఖరి సంవత్సరంలోతన బ్యాచ్మేట్స్ అందరికి గ్లోబల్ దిగ్గజ సంస్థలనుంచి భారీ వేతనంతో ఉద్యోగ ఆఫర్లు అందుకున్నారు. కానీ ఒక యువకుడి ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. తన కలను సాకారం చేసుకునే ప్రయోగాల్లో బిజీగా ఉన్నాడు. ఎందరు నవ్వినా, హేళన చేసినా పట్టించుకోలేదు. ఆయనే బిలియన్ల డాలర్ల విలువైన కంపెనీకి వ్యవస్థాపకుడిగానిలిచిన అంకుష్ సచ్దేవా కథ సాధారణ IIT మేధావి కథ కాదు. దానికంటే కఠినమైనది, మరింత మానవీయమైనది. ఎంతో ఇష్టంగా కష్టపడిన నిలిచి గెలిచినప్రయోగశీలి కథ. పదండి కథేంటో తెలుసుకుందాం.అంకుష్ సచ్దేవా కాన్పూర్ నుంచి పట్టభద్రుడయ్యాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్గా తన వృత్తిని ప్రారంభించాడు. కార్పొరేట్ ప్రపంచం అతని అభిరుచిని మరిపించలేకపోయింది. వ్యవస్థాపకత మార్గంలో నడిచేలా చేసింది. సచ్దేవా తన కెరీర్ ప్రారంభ దశలో 17 విభిన్న స్టార్టప్ ప్రయత్నాల్లో వైఫల్యం చెందాడు. అవును..అతని గుండె గదుల్లోంచి ఉద్భవించిన ప్రతీ ఆలోచన ఇ-కామర్స్ నుండి యుటిలిటీస్ వరకు దాదాపు అన్నీ క్రాష్. కానీ వైఫల్యాలనే తన విజయానికి మెట్లుగా వాడుకున్నాడు. ఓటమి నుంచే నేర్చుకున్నాడు. ప్రతి వైఫల్యం ఒక ముఖ్యమైన డేటాపాయింట్. కట్ చేస్తే.. 18వ ప్రయత్నంలో ఇద్దరు సహచరులతో కలిసి అతను అసాధారణమైన దాన్ని సాధించాడు.2015లో తన IIT కాన్పూర్ స్నేహితులు ఫరీద్ అహ్సాన్ , భాను సింగ్ లతో జతకట్టాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగి తేలుతున్న సమయంలో ఇదొక విప్లవాత్మక ఆలోచన, స్థానికమైన భాషను మాట్లాడే సోషేల్ స్లేస్ షేర్చాట్ను నిర్మించారు. తొలుత హిందీతో ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత 15 భారతీయ భాషలలోకి వికసించింది. ఫేస్ బుక్, వాట్సాప్ కంటే కొత్త అనుభవాలను కోరుకునే వినియోగదారులకు వరంలా మారింది.ప్రాంతీయ భాషలే బలంఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి ఇంగ్లీష్పై దృష్టి పెడితే, షేర్చాట్ మాత్రం భారతదేశంలోని ప్రాంతీయ భాషల (తెలుగు, హిందీ, తమిళం మొదలైన 15 భాషలు) వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. "మన భాషలో మన సోషల్ మీడియా" అనే నినాదమే విజయానికి పునాది వేసింది. షేర్చాట్ కంటే ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ ముగ్గురు స్నేహితులు యూజర్లు ప్రాంతీయభాషల్లో కంటెంట్ను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారని గ్రహించారు. ఫలితంగా గ్లోబల్ కంపెనీలకు ధీటుగా సొంత ప్లాట్ఫారమ్ను నిర్మించుకోవచ్చని నిరూపించేలా షేర్చాట్ను తీసు కొచ్చారు. ప్రపంచ ఇంటర్నెట్కు కనిపించకుండా ఉన్న లక్షలాది మందిని, మూల మూలన ఉన్న వారిని ఏకం చేసింది. పంజాబ్లోని ఒక రైతును అస్సాంలోని ఒక కవితో కలిపింది. మధ్యప్రదేశ్లోని ఒక గృహిణి వంటకాల ఛానెల్ వైరల్ అయింది. కేవలం ఆరేళ్ళకు 2021 నాటికి, దీనికి 160 మిలియన్లకు పైగా యూజర్లు వచ్చి చేరారు. భారీ ఆదరణతో పాటు కంపెనీ విలువ కూడా పెరిగింది. షేర్చాట్ 2021లోనే 'యూనికార్న్' (1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీ) క్లబ్లో చేరింది. 2022 నాటికి ఇది అక్షరాలా రూ. 40,000 కోట్లకు (సుమారు 5 బిలియన్లు డాలర్లకు) చేరింది.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు k రూ.723 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇది ఏడాదికి₹1,000 కోట్ల ఆదాయ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.కేవలం సోషల్ మీడియాగానే కాకుండా, ఇప్పుడు మైక్రో డ్రామా (Micro-dramas) ,లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటూ లాభాల దిశగా ప్రయాణిస్తోంది.అంకుష్ సచ్దేవా పేరు స్టార్టప్ పరిశ్రమలో అత్యంత స్ఫూర్తిదాయకమై పేరు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే తపనతో ఉన్న ఈ ప్రపంచంలో, ప్రతీ ప్రతికూలతనుంచి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న వైభవం. దాని గొప్పతనానికి నిదర్శనమైన స్ఫూర్తి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,210 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ నికర లాభం రూ. 1,210 కోట్లకు పరిమితమైంది. గత క్యూ3లో నమోదైన రూ. 1,413 కోట్లతో పోలిస్తే 14 శాతం తగ్గింది. ఆదాయం రూ. 8,357 కోట్ల నుంచి రూ. 8,727 కోట్లకు చేరింది. కీలకమైన అమెరికా మార్కెట్లో లెనాలిడోమైడ్ విక్రయాలు నెమ్మదించడం, నిర్దిష్ట ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, కొత్త లేబర్ కోడ్ల అమలుకు సంబంధించి వన్–టైమ్ ప్రొవిజన్ చేయాల్సి రావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు బుధవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ తెలిపింది. బ్రాండెడ్ వ్యాపారాలు మెరుగ్గా రాణించడం, ఫారెక్స్పరమైన సానుకూల ప్రయోజనాల వల్ల ఆ లోటు భర్తీ అయినట్లు కంపెనీ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ప్రధాన వ్యాపార వృద్ధి, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యాపార భాగస్వాములకు దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. మరిన్ని ముఖ్యాంశాలు.. → గ్లోబల్ జనరిక్స్ విభాగం నుంచి ఆదాయం 7 శాతం పెరిగి సుమారు రూ. 7,375 కోట్ల నుంచి రూ. 7,911 కోట్లకు పెరిగింది. కీలకమైన ఉత్తర అమెరికాలో ఆదాయం రూ. 3,383 కోట్ల నుంచి రూ. 2,964 కోట్లకు తగ్గింది. యూరప్ విక్రయాలు 1,209 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ. 1,447 కోట్లకు పెరిగాయి. ఇక భారత మార్కెట్లో అమ్మకాలు 19 శాతం వృద్ధితో రూ. 1,346 కోట్ల నుంచి రూ. 1,603 కోట్లకు చేరాయి. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం సుమారు రూ. 1,436 కోట్ల నుంచి రూ. 1,896 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో 6, యూరప్లో 10, భారత్లో రెండు, వర్ధమాన మార్కెట్లలో 30 కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో కొత్త బ్రాండ్లను ఆవిష్కరించడం, ధరల పెరుగుదల, అధిక అమ్మకాలు మొదలైన అంశాలు మెరుగైన ఫలితాలకు దోహదపడ్డాయి. → ఫార్మా సరీ్వసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్ఏఐ) విభాగం ఆదాయం రూ. 822 కోట్ల నుంచి 2% క్షీణించి రూ. 802 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు ఒక్క శాతం క్షీణించి రూ. 1,155.50 వద్ద క్లోజయ్యింది. -
దావోస్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ ఆవిష్కరణ
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వేదికగా తెలంగాణ ప్రభుత్వం తన నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ను ఆవిష్కరించింది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే టాప్ ఐదు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.ఈ విధానం ద్వారా 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడుల ఆకర్షణ, 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి, అలాగే అధునాతన థెరప్యూటిక్స్, సస్టెయినబుల్ బయో-మాన్యుఫాక్చరింగ్, ఫ్రంటియర్ ఆర్ అండ్ డీ రంగాల్లో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.దావోస్లో పాలసీని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ “ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, మార్పు తీసుకువచ్చే బయోసైన్సెస్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తోంది” అని పేర్కొన్నారు. గ్లోబల్ భాగస్వామ్యాలు, వినూత్న ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపడమే రాష్ట్ర సంకల్పమని తెలిపారు.రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని, రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.పాలసీ ముఖ్యాంశాలుప్రపంచ స్థాయి లక్ష్యం: 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలుగ్రీన్ ఫార్మా సిటీ: జీరో లిక్విడ్ డిశ్చార్జ్, నెట్-జీరో ప్రమాణాలతో పర్యావరణహిత పారిశ్రామిక క్లస్టర్ఫార్మా విలేజ్లు: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి 1,000–3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ప్రత్యేక హబ్లుజీనోమ్ వ్యాలీ విస్తరణ: షేర్డ్ ల్యాబ్స్తో కూడిన కొత్త బయో-ఇన్నోవేషన్, బయోమాన్యుఫాక్చరింగ్ క్లస్టర్వన్బయో: దేశంలోనే తొలి గ్రోత్-ఫేజ్ బయోఫార్మా స్కేల్-అప్ కేంద్రంలైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్: రూ.1,000 కోట్ల (111 మిలియన్ డాలర్లు) వరకు విస్తరించగల ప్రత్యేక నిధిటాలెంట్ అభివృద్ధి: గ్లోబల్ ప్రమాణాల విద్య కోసం తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ -
జొమాటో: సీఈవోగా దిగిపోయిన దీపిందర్ గోయిల్
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ ఎటర్నల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 1న అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. “ఇటీవల నేను అధిక రిస్క్, ప్రయోగాత్మకత కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడనయ్యాను. ఇవి పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్ పరిధి వెలుపల మరింత సమర్థంగా అమలయ్యే ఆలోచనలు” అని వాటాదారులకు రాసిన లేఖలో గోయిల్ పేర్కొన్నారు.అలాగే, “ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపార నమూనాకు అనుబంధంగా కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలంటే పూర్తి దృష్టి, క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం లేదని నేను భావిస్తున్నాను. భారతదేశంలోని పబ్లిక్ కంపెనీ సీఈవో బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయి” అని తెలిపారు.బోర్డులో కొనసాగనున్న గోయిల్సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దీపిందర్ గోయిల్ ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్గా కొనసాగుతారు. “నా జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఈ సంస్థ నిర్మాణానికి అంకితం చేశాను. ఇకపై కూడా అదే నిబద్ధతతో పనిచేస్తాను. మా భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం యథాతథంగా కొనసాగుతుంది. అన్ని వ్యాపార విభాగాల సీఈవోలు ఇప్పటివరకు ఉన్న స్వతంత్రతతోనే పని చేస్తారు” అని గోయిల్ స్పష్టం చేశారు.కొత్త సీఈవోగా అల్బిందర్ ధిండ్సాఎటర్నల్ గ్రూప్ నూతన సీఈవోగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సా బాధ్యతలు స్వీకరించనున్నారు. రోజువారీ కార్యకలాపాలు, ఆపరేటింగ్ ప్రాధాన్యతలు మరియు కీలక వ్యాపార నిర్ణయాల అమలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.బ్లింకిట్ను స్థాపించడానికి ముందు, ధిండ్సా జొమాటోలో అంతర్జాతీయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేశారు. సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఆయన కీలక పాత్ర పోషించారు.2013లో బ్లింకిట్ను సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ధిండ్సా, ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్, న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు. -
‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి
దేశీయ విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు, పునరావృతమవుతున్న భద్రతా పరమైన ఇబ్బందులను అరికట్టేందుకు అన్ని ఎయిర్లైన్ ఆపరేటర్లు ఇకపై తప్పనిసరిగా ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ని నియమించాలని ఆదేశించింది.ప్రత్యేక భద్రతా విభాగం ఏర్పాటుప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం (రియాక్టివ్) కంటే, అవి జరగకముందే నివారించే (ప్రోఆక్టివ్) వ్యూహాన్ని అనుసరించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా నిపుణులైన సిబ్బందితో కూడిన ప్రత్యేక ‘విమాన భద్రతా విభాగం’ను ప్రతి ఆపరేటర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ప్రమాదాల నివారణ కార్యక్రమాలను ఈ విభాగం నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.కీలక బాధ్యతల్లో నిపుణులుభద్రతా పర్యవేక్షణ కోసం డీజీసీఏ ఒక నిబంధనను విధించింది. దీని ప్రకారం ‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం కూడా తప్పనిసరి చేసింది. ఒకవేళ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి పైలట్ అయితే డిప్యూటీ చీఫ్ హోదాలో తప్పనిసరిగా ఇంజినీర్ ఉండాలని తెలిపింది. ఒకవేళ చీఫ్ స్థానంలో ఇంజినీర్ ఉంటే, డిప్యూటీ చీఫ్ హోదాలో పైలట్ ఉండాలని పేర్కొంది. ఈ విధానం వల్ల విమాన నిర్వహణ (Maintenance), ఆపరేషన్స్ (Operations) మధ్య సమన్వయం పెరుగుతుందని డీజీసీఏ భావిస్తోంది.లోపాలపై ఆందోళనవిమాన ప్రమాదాలపై జరుగుతున్న పరిశోధనల్లో ప్రతిసారీ కొన్ని లోపాలు (Systemic flaws) బయటపడుతున్నాయని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం లభించదని, సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ (SMS)ను పటిష్టం చేయడం ద్వారానే అత్యున్నత భద్రత సాధ్యమని పేర్కొంది. ఈ కొత్త ఆదేశాలు కేవలం ప్యాసింజర్ విమానాలకే పరిమితం కాకుండా కింది విభాగాలన్నింటికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.1. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు.2. కార్గో (సరుకు రవాణా) సర్వీసులు.3. నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు.సిబ్బంది సంక్షేమం - భద్రతా ఆడిట్లువిమానయానంలో మానవ తప్పిదాలను తగ్గించేందుకు సిబ్బంది అలసట (Fatigue)పై దృష్టి సారించాలని డీజీసీఏ ఆదేశించింది. పైలట్లు, ఇతర సిబ్బంది విమాన ప్రయాణ సమయాలు మించకుండా చూడాలని స్పష్టం చేసింది. గ్రౌండ్ సపోర్ట్, నిర్వహణ విభాగాల్లో ఎప్పటికప్పుడు అంతర్గత భద్రతా ఆడిట్లు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించింది.ఇదీ చదవండి: ఒకేరోజు ఊహించనంత పెరిగిన ధరలు -
ఐపీవోకు ఫోన్పే రెడీ
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్పే త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా సెబీకి నవీకరించిన మలి ప్రాస్పెక్టస్ దాఖలు చేయనుంది. 2025 సెపె్టంబర్లోనే గోప్యతా విధాన సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. తాజాగా అనుమతి లభించినట్లు తెలుస్తోంది.కాగా.. ఐపీవోలో భాగంగా కంపెనీలో ప్రస్తుత వాటాదారులు రూ. 12,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సమాచారం. -
వింగ్స్ ఇండియా 2026లో ఎయిర్బస్
జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2026లో 'ఎయిర్బస్' తన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు & వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ను ప్రదర్శించనుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్-ఐల్ విమానం A321neo, దేశీయ & అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్చేంజర్గా నిలిచిన A220 విమానాలతో పాటు H160, H125 హెలికాప్టర్లు స్టాటిక్ డిస్ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి.ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. H125 హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెమగల్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద అసెంబ్లీ కానుంది. కాగా హాల్ Aలోని స్టాండ్ 11 వద్ద A321XLR, H145 మోడళ్లను ఎయిర్బస్ పరిచయం చేయనుంది.పబ్లిక్ డేస్లో ఎయిర్బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక ‘మీట్-అండ్-గ్రీట్’ రిక్రూట్మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది. డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు. ముఖ్యంగా బిగ్ డేటా, ఐఓటీ, అవియానిక్స్ సాఫ్ట్వేర్, ఎయిర్ఫ్రేమ్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్బస్ కోరుకుంటోంది. -
ఏఎం గ్రూప్ కొత్త ప్రాజెక్ట్.. వేలాదిమందికి ఉద్యోగాలు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.ఈ ఏఐ హబ్లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు
వజ్రాల కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొంటున్న గందరగోళానికి తెరదించుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘డైమండ్’ అనే పదాన్ని కేవలం సహజ సిద్ధంగా లభించే వజ్రాలకే ఉపయోగించాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మార్కెట్లో పారదర్శకతను పెంచేందుకు బీఐఎస్ తాజాగా IS 19469:2025 అనే కొత్త ప్రమాణాన్ని ఆమోదించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణమైన ISO 18323:2015 (జ్యువెల్లరీ: డైమండ్ పరిశ్రమలో వినియోగదారుల విశ్వాసం)కు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది.కొత్త మార్గదర్శకాల్లోని అంశాలుభూగర్భంలో సహజంగా ఏర్పడిన వజ్రాలను మాత్రమే ‘డైమండ్’గా పరిగణిస్తారు. విక్రేతలు వీటిని మరింత స్పష్టంగా చెప్పాలనుకుంటే ‘నేచురల్’, ‘రియల్’, ‘జెన్యూన్’ లేదా ‘ప్రీషస్’ వంటి విశేషణాలను జోడించవచ్చు. ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారుచేసే వజ్రాల విషయంలో విక్రేతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని విక్రయించేటప్పుడు కచ్చితంగా ‘laboratory-grown diamond’ లేదా ‘laboratory-created diamond’ అనే పూర్తి పదాలను వాడాలి. ఇకపై ల్యాబ్ వజ్రాల కోసం LGD, lab-grown, lab-diamond వంటి షార్ట్ కట్ పేర్లను వాడటం నిషిద్ధం.ల్యాబ్ వజ్రాలను విక్రయించేటప్పుడు ‘నేచర్స్’, ‘ప్యూర్’, ‘ఎర్త్-ఫ్రెండ్లీ’ లేదా ‘కల్చర్డ్’ వంటి పదాలను ఉపయోగించకూడదని బీఐఎస్ ఆదేశించింది. కేవలం బ్రాండ్ పేరుతో వీటిని విక్రయించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.పరిశ్రమ వర్గాల స్పందనబీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాచురల్ డైమండ్ కౌన్సిల్ (NDC) స్వాగతించింది. ఎన్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ రిచా సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ కొత్త ప్రమాణాలు వినియోగదారులకు ఎంతో కాలంగా అవసరమైన స్పష్టతను ఇస్తాయి. సహజ వజ్రాల విశిష్టతను ఇవి కాపాడతాయి’ అని పేర్కొన్నారు. అటు జ్యువెల్లరీ వ్యాపారులు కూడా ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైమండ్ పదజాలంలో అయోమయం తొలగించడం వల్ల పరిశ్రమ మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే.. -
భార్య మారథాన్ రన్, ప్రముఖ వ్యాపారవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్
జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు. అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్ను పంచుకున్నారు.ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.దీంతో తాను షాక్కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియోమాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ. -
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు!
భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను చేరువ చేస్తూ తీసుకువచ్చిన ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ సేవల్లో కీలక మార్పులు చేసింది. అమృత్ భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల నిర్మాణం, రిజర్వేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి తీసుకొచ్చింది.ఆర్ఏసీ విధానానికి స్వస్తిఅమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రైళ్లలో ఆర్ఏసీ విధానం ఉండదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. దీనివల్ల సీటు షేర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణం మరింత సుఖమయంగా ఉంటుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే అవకాశం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.ఛార్జీలు ఇవే..రైల్వే ఆదాయం, సర్వీసుల నాణ్యతను సమతుల్యం చేస్తూ కనీస ఛార్జీలను నిర్ణయించింది. కనీసం 200 కిలోమీటర్ల దూరానికి టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. దీని బేసిక్ ఛార్జీ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ క్లాస్ (అన్రిజర్వ్డ్) కేటగిరీలో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ వసూలు చేస్తారు. దీని ప్రారంభ ధర రూ.36. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.అమృత్ భారత్ vs వందే భారత్.. ప్రధాన వ్యత్యాసాలుఅమృత్ భారత్ ఎక్స్ప్రెస్వందే భారత్ ఎక్స్ప్రెస్సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణంప్రీమియం, వేగవంతమైన ప్రయాణంనాన్-ఏసీ(స్లీపర్, సెకండ్ క్లాస్)పూర్తిగా ఏసీ (చైర్ కార్, స్లీపర్)ఆర్ఏసీ లేదు (కన్ఫర్మ్ లేదా వెయిటింగ్)కేవలం కన్ఫర్మ్ టికెట్లుమెరుగైన బెర్త్లుఆటోమేటిక్ డోర్లు, వై-ఫై, క్యాటరింగ్ దేశవ్యాప్తంగా కొత్త మార్గాలుకనెక్టివిటీని పెంచే లక్ష్యంతో రైల్వే శాఖ మరో 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.కామాఖ్య - రోహ్తక్: అస్సాం నుంచి హర్యానా వరకు.దిబ్రూగఢ్ - లఖ్నవూ: యూపీ, అస్సాం మధ్య.సంత్రాగాచి - తాంబరం: కోల్కతా, చెన్నై మధ్య.హౌరా - ఆనంద్ విహార్ (ఢిల్లీ): కోల్కతా నుంచి ఢిల్లీ. ఇవేకాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే.. -
కొన్ని కంపెనీలు డీలా.. ఇంకొన్ని భళా
సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 11 శాతం క్షీణించి రూ. 971 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలుకు రూ. 590 కోట్లమేర చేపట్టిన వన్టైమ్ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,085 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం ఎగసి రూ. 10,781 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 9,661 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ2(జూలై–సెపె్టంబర్)తో పోలిస్తే నికర లాభం 31 శాతం క్షీణించగా.. ఆదాయం 4 శాతం పుంజుకుంది. కాగా.. 1,511 మంది ఉద్యో గులు కొత్తగా జత కలవడంతో 2025 డిసెంబర్31కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 87,958కు చేరింది.పీఎన్బీ లాభం పటిష్టంప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం ఎగసి రూ. 5,100 కోట్లను తాకింది. ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. ఇకపై ప్రతి క్వార్టర్లోనూ ఇదేస్థాయిలో లాభాలు ఆర్జించడంపై దృష్టి పెట్టనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ చంద్ర పేర్కొన్నారు. కాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,508 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,752 కోట్ల నుంచి రూ. 37,253 కోట్లకు బలపడింది. అయితే నికర వడ్డీ ఆదాయం రూ. 11,032 కోట్ల నుంచి రూ. 10,503 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.09 శాతం నుంచి 3.19 శాతానికి, నికర ఎన్పీఏలు 0.41 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 318 కోట్ల నుంచి రూ. 1,341 కోట్లకు భారీగా పెరిగాయి. ఈసీఎల్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ. 955 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టినట్లు చంద్ర వెల్లడించారు. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.77 శాతంగా నమోదైంది. ఒక భారీ మొండి రుణ ఖాతా నుంచి రికవరీ కారణంగా రికవరీలు రూ. 823 కోట్ల నుంచి రూ. 1,956 కోట్లకు ఎగశాయి.టాటా క్యాపిటల్ లాభం జూమ్ప్రయివేట్ రంగ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 39 శాతం జంప్చేసి రూ. 1,285 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 922 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 33 శాతం ఎగసి రూ. 3,594 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 2,711 కోట్ల టర్నోవర్ సాధించింది. నికర వడ్డీ ఆదాయం 26 శాతం మెరుగుపడి రూ. 2,936 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,323 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 26 శాతం వృద్ధితో రూ. 2,34,114 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఏయూఎం రూ. 1,86,404 కోట్లుగా నమోదైంది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.6 శాతానికి, నికర ఎన్పీఏలు 0.6 శాతానికి చేరాయి. కంపెనీ 2025 అక్టోబర్లో లిస్టయ్యాక రెండోసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది.బీహెచ్ఈఎల్ లాభం దూకుడువిద్యుత్ పరికరాల ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం మూడు రెట్లు దూసుకెళ్లి రూ. 390 కోట్లను అధిగమించింది. కీలక విభాగాల నుంచి ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 135 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం వృద్ధితో రూ. 8,692 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 7,385 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రధానంగా విద్యుత్ విభాగం ఆదాయం రూ. 5,585 కోట్ల నుంచి రూ. 6,322 కోట్లకు ఎగసింది. ఇండస్ట్రీ విభాగం ఆదాయం రూ. 1,689 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు జంప్చేసింది.హావెల్స్ లాభం ప్లస్కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ దిగ్గజం హావెల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 300 కోట్లను అధిగమించింది. ఇందుకు కేబుళ్లు, వైర్ల బిజినెస్ పురోభివృద్ధి దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 278 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 14 శాతం ఎగసి రూ. 5,588 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 4,889 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 13 శాతం పెరిగి రూ. 5,189 కోట్లను దాటాయి. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్ 13 శాతం ఎగసి రూ. 5,631 కోట్లకు చేరింది. కాగా.. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 45 కోట్లు అనూహ్య కేటాయింపులుగా నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. విభాగాలవారీగా స్విచ్గేర్ల ఆదాయం 8 శాతం వృద్ధితో 624 కోట్లను తాకగా.. కేబుళ్ల బిజినెస్ 33 శాతం జంప్చేసి రూ. 2,241 కోట్లకు చేరింది. లైటింగ్ తదితరాల నుంచి 4 శాతం తక్కువగా రూ. 423 కోట్లు సాధించింది. ఎలక్ట్రికల్ కన్జూమర్ ఉత్పత్తుల బిజినెస్ 4 శాతం పుంజుకుని రూ. 1,151 కోట్లయ్యింది. లాయిడ్ కన్జూమర్ ఆదాయం 7 శాతం నీరసించి రూ. 694 కోట్లకు పరిమితంకాగా.. ఇతర ఆదాయం 22 శాతం ఎగసి రూ. 310 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
భారత్లో బీమా వృద్ధికి భరోసా
భారత్ మార్కెట్లో బీమా ప్రీమియం వృద్ధి 2026–2030 మధ్యకాలలో 6.9 శాతానికి (ఏటా) పెరుగుతుందని అంతర్జాతీయ రీఇన్సూరెన్స్ సంస్థ స్విస్ ఆర్ఈ తెలిపింది. చైనా (4 శాతం), యూఎస్ (2 శాతం), పశ్చిమ యూరప్ దేశాల వృద్ధిని భారత బీమా మార్కెట్ అధిగమిస్తుందని.. బలమైన ఆర్థిక మూలాలు, డిమాండ్ పెరుగుతుండడం, నియంత్రణల్లో మార్పులను సానుకూలంగా ప్రస్తావించింది. 2025లో 3.1 శాతం వృద్ధికి ఇది రెట్టింపు అవుతుందని పేర్కొంది.భారత బీమా రంగం బలమైన మధ్యస్థ వృద్ధి పథంలోకి అడుగు పెట్టిందని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. జీఎస్టీ సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయపన్నులో మినహాయింపులు మధ్యాదాయ కుటుంబాల్లో బీమాకు డిమాండ్ను పెంచుతాయని విశ్లేషించింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన మార్పులు మరింత పారదర్శకతను తీసుకొస్తాయని.. పరిశ్రమ మరింత వృద్ధిని సాధించే దిశగా అనుకూలిస్తాయని వివరించింది. బీమా రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడాన్ని ప్రస్తావించింది. దీంతో కొత్త మూలధన నిధులకు మార్గం సుగమం అవుతుందని, బీమా విస్తరణ పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గతేడాది సెపె్టంబర్ 22 నుంచి జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని తొలగించడం తెలిసిందే.జీవిత బీమా జోరు..జీవిత బీమా పరంగా భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉన్నట్టు స్విస్ ఆర్ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఏటా 6.8 శాతం వృద్ధి సాధ్యమేనని పేర్కొంది. రిటైర్మెంట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడం, పంపిణీ నెట్వర్క్ విస్తరణ ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. నియంత్రణపరమైన మార్పులు, వైద్య ద్రవ్యోల్బణం కారణంగా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ సమీప కాలంలో సవాళ్లను ఎదుర్కోనున్నట్టు అంచనా వేసింది. మధ్య కాలానికి మాత్రం మెరుగైన వృద్ధిరేటును చూస్తుందని తెలిపింది. 2026–2030 మధ్యకాలంలో ఏటా 7.2 శాతం చొప్పున ప్రీమియం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఈ కాలంలో మోటారు బీమాలో 7.5 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై ఫోకస్
ఎల్రక్టానిక్స్, డిఫెన్స్, రెన్యువబుల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఇతరత్రా విలువైన ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ) విభాగాల్లోకి కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్ఈఈలు, మెగ్నీషియం, క్రోమైట్ బ్లాక్ల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తోంది.గనుల లాభదాయకత, వేలంలో పాల్గొనడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను బిడ్ అడ్వైజర్ మదింపు చేస్తారని కంపెనీ సీఎండీ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. అలాగే, జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా ద్వారా ఆ్రస్టేలియాలో లిథియం గనిలో వాటా కొనుగోలుపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన వివరించారు. దీనితో లిథియం దిగుమతులకు సంబంధించి హామీ లభిస్తుందని, అంతర్జాతీయంగా కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా ఈవీ బ్యాటరీలు, రెన్యువబుల్స్కి సరఫరాను పెంచేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం -
ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు
అబుదాబి: రోగుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లకు 15 మిలియన్ దిర్హామ్స్ (సుమారు రూ.37 కోట్లు) ఆర్థిక సహాయం అందించనున్నట్లు మిడిల్ ఈస్ట్లోని ప్రముఖ హెల్త్కేర్ ప్రొవైడర్ బుర్జీల్ హోల్డింగ్స్ ప్రకటించింది. బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో డాక్టర్ షంషీర్ వయాలిల్ అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో నిర్వహించిన గ్రూప్ వార్షిక టౌన్హాల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన చేశారు.ఈ కార్యక్రమంలో 8,500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. బుర్జీల్ హోల్డింగ్స్ ‘బుర్జీల్ 2.0’ పేరుతో వృద్ధి తదుపరి దశలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, ఈ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ‘బుర్జీల్ ప్రైడ్’ ఇనిషియేటివ్లో భాగంగా ప్రకటించారు. గ్రూప్కు చెందిన నర్సింగ్, పేషెంట్ కేర్, ఆపరేషన్స్, అనుబంధ సేవల విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 10,000 మంది ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగులకు వారి సర్వీస్ కాలాన్ని బట్టి ఒక నెల లేదా అర నెల ప్రాథమిక వేతనానికి సమానమైన మొత్తాన్ని అందించనున్నారు.డాక్టర్ షంషీర్ ప్రసంగం ఇంకా కొనసాగుతుండగానే ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు వచ్చిన అనూహ్య ఎస్ఎంఎస్ ద్వారా ఈ ఆర్థిక సాయం విషయం వెల్లడైంది. ఈ ప్రకటనకు ఉద్యోగుల నుంచి భారీ చప్పట్లు, భావోద్వేగ స్పందనలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి.“ఇది ఎలాంటి షరతులు లేకుండా అందించే గుర్తింపు. ఆరోగ్య సేవలకు వెన్నెముకగా నిలిచే ఫ్రంట్లైన్ బృందాల సమిష్టి కృషికి ఇది మా కృతజ్ఞత. వారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ రోగులతో నేరుగా పనిచేస్తూ, రియల్టైమ్లో సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ సహాయం వారి పట్ల మా నమ్మకం, గౌరవానికి నిదర్శనం” అని డాక్టర్ షంషీర్ తెలిపారు.బుర్జీల్ హోల్డింగ్స్ ఎదుగుదలకు యూఏఈ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహం అమూల్యమని ఆయన పేర్కొన్నారు. దేశ నాయకత్వం చూపిన దిశే ఈ పురోగతికి పునాదిగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం యూఏఈలో అతిపెద్ద హెల్త్కేర్ ప్లాట్ఫార్మ్లలో ఒకటైన బుర్జీల్ హోల్డింగ్స్లో 14,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్లో డబ్బు!
చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వడ్డీ వస్తుందా?స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లపై వడ్డీ లభిస్తుంది.నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.స్విస్ బ్యాంక్లో ఖాతా సులభమేనా?స్విస్ బ్యాంక్లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.కీలకమైన మార్పులు!ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి! -
రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ
నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ. కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్పాత్పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం. సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే చదువుక పుల్స్టాప్ పెట్టేసి 17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు. ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా అనేక కష్టాలు పడ్డాడు.ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి దారి చూపించింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్పాత్పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో రూ.50 లకు అమ్మేవాడు. నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు. అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ప్రేరణ నిచ్చిన సినిమా ముంబైలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్పాత్పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది. అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్వేర్ బిజినెస్ ప్రారంభించాడు. బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్తో రాజా నాయక్ వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్, వాటర్ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే. అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్ వీడియో భార్య అనిత తోడుగారాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్. చదువు మానేసి, 16 ఏళ్లవయసులో ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100 కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు. -
ప్రముఖ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు
ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 19,807 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయంలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 17,657 కోట్లు ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 11 శాతం బలపడి రూ. 18,654 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 32,600 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 13,250 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.35 శాతంగా నమోదయ్యాయి.కొత్త కార్మిక చట్టాల అమలు కారణంగా రూ. 800 కోట్ల వ్యయాలు నమోదైనట్లు బ్యాంక్ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,154 కోట్ల నుంచి రూ. 2,838 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.24 శాతానికి నీరసించగా.. గత 12 నెలల కాలంలో 500 బ్రాంచీలను కొత్తగా జత కలుపుకుంది. దీంతో వీటి సంఖ్య 9,616ను తాకింది. ఈ కాలంలో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య దాదాపు 5,000 తగ్గి 2.15 లక్షలకు పరిమితమైంది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.9 శాతంగా నమోదైంది.ఐసీఐసీఐ బ్యాంక్.. డౌన్ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 12,538 కోట్లకు పరిమితమైంది. ప్రాధాన్యతా రంగ అడ్వాన్సులంటూ తప్పుగా నమోదుచేయడంతో ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రుణాలకు రూ. 1,283 కోట్ల ప్రొవిజన్ చేపట్టింది. దీంతో లాభాలు దెబ్బతిన్నట్లు బ్యాంక్ వెల్లడించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 4 శాతం బలహీనపడి రూ. 12,883 కోట్లకు చేరింది. కాగా.. ఎండీ, సీఈవో సందీప్ బక్షి పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించేందుకు బోర్డు నిర్ణయించినట్లు బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 21,932 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.3 శాతంగా నమోదయ్యాయి.ట్రెజరీ కార్యకలాపాలు మినహాయించి, వడ్డీయేతర ఆదాయం 12 శాతం ఎగసి రూ. 7,525 కోట్లకు చేరింది. కొత్త కారి్మక చట్టాల అమలులో భాగంగా రూ. 145 కోట్ల వ్యయాలు నమోదు చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. మొత్తం ప్రొవిజన్లు రెట్టింపై రూ. 2,556 కోట్లకు చేరాయి. తాజా స్లిప్పేజీలు రూ. 5,356 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 1.58 శాతం నుంచి 1.53 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.34 శాతంగా నమోదైంది. ఐసీఐసీఐ అనుబంధ సంస్థలలో ప్రుడెన్షియల్ లైఫ్ నికర లాభం రూ. 390 కోట్లకు, లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ లాభం రూ. 659 కోట్లకు, ఏఎంసీ లాభం రూ. 917 కోట్లకు చేరాయి.యస్ బ్యాంక్.. హైజంప్ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 55 శాతం జంప్చేసి రూ. 952 కోట్లను తాకింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 259 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 22 కోట్లకు పరిమితంకావడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 612 కోట్ల లాభం ఆర్జించింది.కొత్త కార్మిక చట్టాల అమలుకు రూ. 155 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 2,466 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,633 కోట్లకు చేరింది. స్థూల స్లిప్పేజీలు రూ. 1,248 కోట్ల నుంచి రూ. 1,050 కోట్లకు క్షీణించగా.. స్థూల మొండిబకాయిలు 0.1 శాతం మెరుగుపడి 1.5 శాతాన్ని తాకాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.5 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
బ్యాంకులకు వరుస సెలవులు!
2026 జనవరి నెలలో సగం రోజులు పూర్తైపోయాయి. కాగా వచ్చే వారంలో (జనవరి 19 నుంచి 24 వరకు) బ్యాంకు ఎన్ని రోజులు పని చేస్తాయి, సెలవు రోజులు ఎన్ని ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.23 జనవరి (శుక్రవారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు / సరస్వతీ పూజ (శ్రీ పంచమి) / వీర్ సురేంద్రసాయి జయంతి / బసంత పంచమి కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా & త్రిపురలలో బ్యాంకులకు సెలవు.జనవరి 24 (శనివారం): నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.జనవరి 25 (ఆదివారం): ఆదివారం కారణంగా బ్యాంకు సెలవు.జనవరి 2026లో వారాంతాలతో సహా మొత్తం 16 బ్యాంకు సెలవులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ & ప్రైవేట్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. అంతే కాకుండా నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు. కాగా ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారే అవకాశం ఉంది.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
10 ని.డెలివరీ నిలిపివేత.. పర్యవేక్షణ కఠినతరం
క్విక్ కామర్స్ రంగంలో డెలివరీ సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను మరింత కఠినతరం చేసింది. 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారాన్ని ప్లాట్ఫారమ్లు విరమించుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గిగ్ వర్కర్ల పరిస్థితిపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిరంతరం నిఘా ఉంచింది.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే లేదా గిగ్ వర్కర్ల శ్రమను దోపిడీ చేసే అగ్రిగేటర్లపై కఠిన చర్యలు తప్పవని ఉన్నత స్థాయి వర్గాలు హెచ్చరించాయి. బ్రాండింగ్ మార్చినప్పటికీ డెలివరీ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గకపోవడం, ఐడీల బ్లాకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.ముఖ్యమైన అంశాలుగిగ్ వర్కర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో జరిగిన సమావేశం అనంతరం బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలు 10 నిమిషాల డెలివరీ ప్రకటనలను ఉపసంహరించుకున్నాయి. కేవలం ప్రకటనల మార్పుతోనే పని ఒత్తిడి తగ్గదని, వ్యాపార నమూనాల్లో మార్పులు రాకపోతే కార్మికులకు ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈఎస్ఐసీ ‘స్ప్రీ’ (SPREE) పథకంగిగ్ వర్కర్లతో సహా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ‘స్కీమ్ టు ప్రొమోట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ (స్ప్రీ)’ పథకం మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారు 1.17 లక్షల మంది కొత్త యజమానులు (Employers) తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీనివల్ల సంస్థల స్థాయిలోనే కార్మిక సంక్షేమానికి మార్గం సుగమమైంది. కేవలం యజమానులే కాకుండా, భారీ సంఖ్యలో ఉద్యోగులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1.03 కోట్ల మంది కొత్త ఉద్యోగులు ఈఎస్ఐ పరిధిలోకి చేరడం విశేషం.ప్రస్తుతం ఈ పథకం గడువు 2026 జనవరి చివరి వరకు అందుబాటులో ఉంది. గతంలో నమోదు కాని యజమానులు, ఉద్యోగులు ఎలాంటి జరిమానాలు లేదా శిక్షలు లేకుండా ఒకేసారి రిజిస్టర్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరిశ్రమ వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ పథకం గడువును పొడిగించడం ద్వారా లక్షలాది మంది కార్మికులకు వైద్య, ఆర్థిక భద్రత చేకూరింది. గిగ్ ఎకానమీలో పారదర్శకత, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! -
సైలెంట్గా సర్దుకుంటున్న టెక్ బిలియనీర్లు!
దశాబ్దాలుగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థలకు కీలకంగా ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఆ సంస్థల సృష్టకర్తలే తమ వ్యాపార సామ్రాజ్యాలను తరలిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జి బ్రిన్ తమ వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాలను కాలిఫోర్నియా నుంచి ఇతర ప్రాంత్రాలకు మారుస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. వీరితో సంబంధం ఉన్న పలు సంస్థలు మూతపడగా, అవి ఇప్పుడు నెవాడా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి తక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో తిరిగి రిజిస్టర్ అవుతున్నాయి.పన్నుల భయం.. బిలియనీర్ల పయనంఈ నిష్క్రమణకు ప్రధాన కారణం కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘వెల్త్ ట్యాక్స్’ (సంపద పన్ను). బిలియన్ డాలర్లకు మించి సంపద ఉన్న నివాసితులపై ఒకేసారి భారీ పన్ను విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు, ఈ పన్ను గత కాలానికి కూడా వర్తించేలా (Retroactive) ఉండవచ్చనే చర్చలు సాగుతుండటం టెక్ కుబేరులను అప్రమత్తం చేసింది.ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియా తీసుకోబోతున్న నిర్ణయంవల్ల భారీగా పెట్టుబడులు తరలిపోతాయని, ఇది ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని వెంచర్ క్యాపిటలిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే, కుప్పకూలుతున్న ప్రజా వ్యవస్థలను ఆదుకోవడానికి అత్యధిక సంపద కలిగిన వారు బాధ్యత తీసుకోవాలని సామాజిక వాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి వారు ప్రభుత్వం విధించే పన్నులను స్వీకరిస్తామని చెబుతుండగా, మరికొందరు మాత్రం సైలెంట్గా సర్దుకుంటున్నారు.మారిన కాలం.. మారుతున్న బంధంఒకప్పుడు కంపెనీలు అంటే ఫ్యాక్టరీలు, పోర్టులు, కార్మికులతో ముడిపడి ఉండేవి. కానీ నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సంపదకు సరిహద్దులు లేవు. కేవలం కాగితాలపై సంతకాలతో ప్రపంచంలో ఎక్కడికైనా మేధోసంపత్తిని సులువుగా తరలించవచ్చు. ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలతో ముందుకుసాగుతుంటే టెక్ బిలియనీర్లు మాత్రం అందుకు అనుగుణంగా తమ స్థావరాలను మార్చుకుంటున్న తీరు కొంత ఆందోళన కలిగిస్తుంది.బాధ్యత ఎవరిది?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్న తరుణంలో ఈ సంక్షోభం ఒక్క కాలిఫోర్నియాకే పరిమితం కాదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వీరు వలస వెళ్లిన చోటల్లా ఇలాగే కొత్త పన్ను విధానాలు తీసుకొస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్థిరమైన ప్రాంతంలో ప్రజా వనరుల ద్వారా ఎదిగి, ఇప్పుడు ఆ వ్యవస్థతో బంధం తెంచుకుంటున్న ఈ డిజిటల్ వలసలు అనేక ప్రశ్నలను మిగుల్చుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
అంబానీ నెల కరెంట్ బిల్లు.. లగ్జరీ కారే కొనేయొచ్చు!
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం అంటిలియా (Antilia) గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయితే.. సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ భవనానికి నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.2010లో అంబానీ.. ముంబయిలోని ‘అంటిలియా’కు మారిన తరువాత, మొదటి నెలలో 637240 యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్లు, దీనికోసం కరెంట్ బిల్ ఏకంగా రూ.70,69,488గా చెల్లించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల.. అంబానీకి రూ.48,354 డిస్కౌంట్ కూడా లభించిందని సమాచారం. అంటిలియా భవనం ఉపయోగించే కరెంట్ దాదాపు 7000 సగటు ముంబై గృహాల నెలవారీ విద్యుత్ వినియోగానికి సమానం.అంటిలియా ప్రత్యేకతలుముంబై నగరంలో నిర్మించిన.. ముఖేష్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.ఔట్ డోర్ ఏసీ లేదు!ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు. -
ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓలో పెట్టుబడుల పేరుతో అమాయకులను నమ్మించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు సుమారు రూ.2.54 కోట్లు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు.రిటైర్డ్ బ్యాంకర్కు రూ.1.25 కోట్ల నష్టంసికింద్రాబాద్కు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ మోసానికి ప్రధాన బాధితురాలుగా ఉన్నారు. నేరగాళ్లు ముందుగా బాధితురాలిని ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అందులో సంస్థాగత ఐపీఓల ద్వారా వచ్చే భారీ లాభాల స్క్రీన్షాట్లను చూపి నమ్మించారు. ఒక యూఎస్ నంబర్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో బోగస్ ట్రేడింగ్ యాప్ను ఆమె డౌన్లోడ్ చేసుకునేలా చేశారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్య ఆమె తన మూడు వ్యక్తిగత ఖాతాల నుంచి 11 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు 15 దఫాలుగా రూ.1.25 కోట్లు బదిలీ చేశారు. యాప్లో ఆమె బ్యాలెన్స్ రూ.1.9 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యం కాలేదు. పైగా ‘క్లియరింగ్ ఛార్జీల’ పేరుతో మరో రూ.58.58 లక్షలు కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.మరో మూడు కేసులుజనవరి 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇలాంటివే మరికొన్ని ఫిర్యాదులు అందాయి.మణికొండకు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగిని స్టాక్ బ్రోకరేజ్ విశ్లేషకులుగా నటించిన స్కామర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రలోభపెట్టారు. గత ఏడాది మార్చి-మే మధ్య ఆయన రూ.50.8 లక్షలు పోగొట్టుకున్నారు.76 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ఐపీఓ ట్రేడింగ్ సలహాలను నమ్మి డిసెంబర్ 30 నుంచి జనవరి 5 మధ్య రూ.46.25 లక్షలు నష్టపోయారు.మియాపూర్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి యూఎస్ స్టాక్స్లో పెట్టుబడుల పేరుతో నకిలీ యాప్ ద్వారా రూ.32.1 లక్షలు కోల్పోయారు.పోలీసుల హెచ్చరికలుఈ నాలుగు ఘటనలపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపరిచిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి సమాచారం తెలియాజేయాలని సూచించారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
‘ఇష్టానుసారంగా పసిడి ధరలు పెంపు’
బంగారం ధరల నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంటూ, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అశాస్త్రీయ ధోరణులపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధర ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.అంతర్జాతీయ మార్కెట్ ధరలు బంగారం ట్రేడింగ్ రేట్లను ప్రభావితం చేస్తాయి.అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం రేటు కూడా బంగారం ధరను నిర్ణయిస్తుంది. రూపాయి విలువ పడితే పసిడి ధర కూడా అందుకు అనుగుణంగా మారుతుంది.ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ కూడా కనకం ధర పెరిగేందుకు కారణమవుతుంది.ప్రస్తుత సమస్య ఏమిటంటే..కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు బంగారం మార్కెట్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఇది దీర్ఘకాలంలో పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. సాధారణంగా వాణిజ్య సంఘాలు ఉదయం 9:30 గంటలకే ధరలను నిర్ణయిస్తాయని, కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆకస్మిక మార్పులు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయని తెలిపారు.వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్వినియోగదారుల ప్రయోజనాల కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని అమలు చేస్తోందని అహ్మద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పన్నులు ఒకేలా ఉన్నప్పుడు, బంగారం ధర కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలన్నారు. ధరల అసమానతలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకతను పాటించాలని చెప్పారు.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
ఇండిగో బాధితులకు రిఫండ్ పూర్తి
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ 3-5 మధ్య విమాన రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణికులందరికీ రిఫండ్ ప్రాసెస్ చేసిందని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా తెలిపింది.‘డిసెంబర్ 3-5 వరకు కార్యకలాపాల అంతరాయాల కారణంగా బాధిత ప్రయాణీకులకు అందించే రిఫండ్లు, పరిహారాలకు సంబంధించి దేశీయ క్యారియర్ ఇండిగోతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది’ అని డీజీసీఏ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఇండిగో విమానాల రద్దుకు సంబంధింంచి అన్ని రిఫండ్లను పూర్తిగా ప్రాసెస్ చేసి, చెల్లింపులు క్లియర్ చేసినట్లు ఇండిగో తెలియజేసిందని వివరించింది.అంతేకాకుండా ఎక్కువ అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఊరట కల్పించడానికి అదనపు చర్యగా విమానయాన సంస్థ "గెస్చర్ ఆఫ్ కేర్’ పేరుతో ఒక్కొక్కరికీ రెండు రూ.5,000 ట్రావెల్ వోచర్లను అందించినట్లుగా తెలిపింది. వీటికి 12 నెలల చెల్లుబాటు ఉంటుందని, ఆయా తేదీల్లో ఫ్లైట్లు రద్దవడం లేదా మూడు గంటల కంటే ఆలస్యంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీటిని అందించినట్లుగా పేర్కొంది.బాధిత ప్రయాణికులకు రిఫండ్ పూర్తయినట్లు ఇండిగో, డీజీసీఏ చెబుతుంటే మరో వైపు తమకు రిఫండ్ అందలేదని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇండిగోను, డీజీసీఏ ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.Press note on refunds, compensation to passengers affected by operational disruptions of Indigo between 3rd - 5th Dec 25 Imp Links:Eligibility for Compensation https://t.co/FVXEWXoQotSubmission of Details https://t.co/FdGdQmsLAYList of Flights Covered https://t.co/ks5u0wBVaO pic.twitter.com/adjmIb1nth— DGCA (@DGCAIndia) January 16, 2026 -
పన్ను మినహాయింపు పిటిషన్ తిరస్కరణ
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో తన వాటాల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ లావాదేవీపై పన్ను మినహాయింపు కోరుతూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ ‘టైగర్ గ్లోబల్’ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పన్ను ఎగవేత ఉద్దేశంతో చేసే లావాదేవీలకు చట్టపరమైన రక్షణ ఉండదని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చిచెప్పింది.తీర్పు నేపథ్యంజస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 245ఆర్(2)ను ప్రస్తావిస్తూ.. ఒక లావాదేవీ కేవలం పన్ను ఎగవేత కోసమే రూపొందించబడిందని ప్రాథమికంగా తేలితే ఆ విచారణను అక్కడితోనే నిలిపివేసే అధికారం అధికారులకు ఉంటుందని కోర్టు పేర్కొంది.వివాదం ఏమిటి?ఈ వివాదం 2018 నాటి వాల్మార్ట్-ఫ్లిప్కార్ట్ ఒప్పందంతో ముడిపడి ఉంది. వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సమయంలో టైగర్ గ్లోబల్ తన వాటాను సుమారు రూ.14,440 కోట్లకు (1.6 బిలియన్ డాలర్లు)విక్రయించింది. కంపెనీకి వచ్చిన లాభాలపై భారత్–మారిషస్ మధ్య ఉన్న ‘డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్’ (DTAA) ప్రకారం తమకు పన్ను మినహాయింపు ఉంటుందని టైగర్ గ్లోబల్ వాదించింది. ఈ కంపెనీ పన్ను తప్పించుకోవడానికి సృష్టించిన మధ్యవర్తి సంస్థేనని, దీని అసలు నియంత్రణ అమెరికాలోని మాతృ సంస్థ చేతిలోనే ఉందని భారత పన్ను అధికారులు వాదించారు.ఢిల్లీ హైకోర్టు తీర్పుగతంలో (ఆగస్టు 2024లో) ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు టైగర్ గ్లోబల్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మారిషస్ జారీ చేసిన ‘ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC)’ ఉంటే పన్ను మినహాయింపునకు అది సరిపోతుందని పేర్కొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. కేవలం టీఆర్సీ ఉంటే సరిపోదని, సదరు సంస్థలకు స్వతంత్ర వాణిజ్య అస్తిత్వం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘విక్రయించిన షేర్ల ద్వారా భారతదేశంలోని ఆస్తుల నుంచి లబ్ధి పొందినప్పుడు అవి భారతీయ కంపెనీకి చెందినవి కావు అనే సాకుతో పన్ను నుంచి తప్పించుకోలేరు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇన్వెస్టర్లపై ప్రభావంఈ తీర్పు విదేశీ పెట్టుబడిదారులకు ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పన్ను ఒప్పందాలపై పెట్టుకున్న నమ్మకం సడలుతుందని అభిప్రాయపడుతున్నారు. దాంతో ఇకపై పెట్టుబడిదారులు తమ లాభాల్లో పన్ను ఖర్చులను కూడా ముందుగానే లెక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం కాగితాలపై కంపెనీలను చూపడం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆ కంపెనీల కార్యకలాపాలు ఎలా ఉన్నాయనేది ఇకపై కీలకం కానుంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
గంటలోనే రిప్లై ఇస్తారని ఊహించలేదు!
స్టార్టప్ ప్రపంచంలో అడుగుపెట్టే ఏ వ్యవస్థాపకుడికైనా నిధుల సేకరణ (Fundraising) అనేది ఒక పెద్ద సవాలు. అటువంటి తరుణంలో దేశంలోని అగ్రశ్రేణి కంపెనీల సీఈఓల నుంచి స్పందన లభిస్తే ఆ ఉత్సాహమే వేరు. సరిగ్గా ఇలాంటి అనుభవమే సింగపూర్కు చెందిన భారతీయ పారిశ్రామికవేత్త మనోజ్ అహిర్వార్కు ఎదురైంది. జెరోధా సీఈఓ నితిన్ కామత్కు ఆయన పంపిన ఒక ఈమెయిల్ తన జీవితాన్నే మార్చేసినట్లు ఇటీవల గుర్తుచేసుకున్నారు.ఆ ఒక్క ఈమెయిల్ ఇచ్చిన ధైర్యం2022లో మనోజ్ అహిర్వార్ తన స్టార్టప్ ఆలోచనను వివరిస్తూ నితిన్ కామత్కు మెయిల్ పంపారు. సాధారణంగా బిజీగా ఉండే దిగ్గజ సీఈఓల నుంచి స్పందన రావడం కష్టమని భావించిన అహిర్వార్కు కేవలం ఒక్క గంటలోనే కామత్ నుంచి రిప్లై రావడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఆ వ్యవహారం పెట్టుబడికి సంబంధించింది కాకపోయినప్పటికీ, నితిన్ చూపిన చొరవ అహిర్వార్పై ఎంతో ప్రోత్సాహంగా మారింది.I reached out to Nithin Kamath back in 2020 when I launched my startup MoneyFit.I didn't expect a reply, but he responded within an hour.While I didn't end up getting investment from Zerodha, it was incredible to see how accessible he was. You could just reach out directly to… pic.twitter.com/0js1ncnK8w— Manoj Ahirwar (@manoj_ahi) January 15, 2026ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘నేను 2020లో నా స్టార్టప్ కంపెనీ మనీఫిట్ను ప్రారంభించినప్పుడు నితిన్ కామత్ను సంప్రదించాను. సమాధానం వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఆయన గంటలోపే స్పందించారు. అప్పట్లో నాకు పెట్టుబడి సమకూరలేదు. అయితే ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు ఇంత సులభంగా అందుబాటులో ఉండటం నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’ అని అహిర్వార్ పేర్కొన్నారు.రూ.1.8 కోట్ల ఆదాయం వైపు..మనోజ్ అహిర్వార్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అంతకుముందు రెండు స్టార్టప్లను ప్రారంభించి మూసివేశారు. 2022 బెంగళూరులో ‘మనీఫిట్’ను ప్రారంభించారు. కానీ అది కూడా అదే ఏడాది నిలిచిపోయింది. ప్రస్తుతం తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త వెంచర్తో దూసుకుపోతున్నారు. ఓ స్టార్టప్ కంపెనీని స్థాపింది సుమారు 2,00,000 డాలర్లు (సుమారు రూ.1.8 కోట్లు) వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ‘జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో నా స్టార్టప్ కంపెనీ పెట్టుబడికి సిద్ధంగా లేదని అర్థమైంది. కానీ ప్రయత్నించినందుకు సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు.సోషల్ మీడియాలో రిప్లైఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అహిర్వార్ పట్టుదలను, నితిన్ కామత్ చొరవను ప్రశంసిస్తున్నారు. ‘నితిన్ కామత్ వంటి సీఈఓలు సులభంగా అందుబాటులో ఉండటం స్టార్టప్ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. ‘చాలా మంది విఫలమైతే వదిలేస్తారు, కానీ మీరు పట్టుదలతో కొనసాగడం స్ఫూర్తిదాయకం’ అని మరొకరు అభినందించారు.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
యూబీఐలో ఎన్పీఏలు తగ్గుముఖం
ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి.డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
10 ని.డెలివరీకి స్వస్తి.. బిజినెస్పై ప్రభావమెంత?
ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క్విక్ కామర్స్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ (Swiggy) వంటి ప్రముఖ ప్లాట్ఫామ్స్ తమ బ్రాండింగ్ నుంచి ‘10 నిమిషాల డెలివరీ’ అనే విధానాన్ని తొలగించాయి. అయితే, ఈ మార్పు కేవలం బ్రాండింగ్కు మాత్రమే పరిమితమని, వారి వ్యాపార విధానంలో ఎలాంటి మార్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇటీవలి మార్పులు ఇవేబ్లింకిట్ తన యాప్లో ‘10-నిమిషాల’ టైమ్లైన్ను తొలగించి ‘30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే’ అనే కొత్త ట్యాగ్లైన్ను ప్రవేశపెట్టింది. అలాగే, వినియోగదారులకు తమ దగ్గరలోని డార్క్ స్టోర్(ఆన్లైన్ ఆర్డర్లను ప్యాక్ చేసి డెలివరీ చేసే కేంద్రాలు) దూరాన్ని చూపుతూ, తక్కువ దూరం వల్ల వేగంగా డెలివరీ సాధ్యమవుతుందని వివరిస్తోంది.జెప్టో తమ సైట్, యాప్లో ‘నిమిషాల్లో అన్నీ’ అని ట్యాగ్లైన్లో మార్పులు చేసింది.స్విగ్గీ కూడా తన క్విక్ కామర్స్ విభాగం నుంచి 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్ను తొలగించింది.ప్రభుత్వ జోక్యం..ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డెలివరీ భాగస్వాముల భద్రత, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ బ్రాండింగ్ మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డెలివరీ రైడర్లు నిర్ణీత సమయానికి చేరుకోవాలనే ఒత్తిడికి గురికాకుండా చూడటమే ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంబిజినెస్ మోడల్లో మార్పు లేదు: నిపుణులుబ్రాండింగ్లో మార్పులు వచ్చినప్పటికీ, వినియోగదారులకు అందే సర్వీసుల్లో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి వివరాల ప్రకారం.. క్విక్ కామర్స్ సంస్థల డార్క్ స్టోర్లు ఇప్పటికే గిరాకీ ఉన్న ప్రాంతాలకు 10-15 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి డెలివరీ వేగంపై దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. డెలివరీ సమయం అనేది స్టోర్ దూరం, ట్రాఫిక్, వాతావరణం, రైడర్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ‘10 నిమిషాల్లో డెలివరీ’ అనేది ఒక మార్కెటింగ్ నినాదం మాత్రమే తప్ప, అది హామీ కాదు. ఈ విధానాన్ని తొలగించడం ద్వారా కంపెనీల బిజినెస్పై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
ఒక్క రోజులో.. రైల్వే సరికొత్త రికార్డు!
సరుకు రవాణా రంగంలో భారతీయ రైల్వే మరో కీలక మైలురాయిని అధిగమించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) నెట్వర్క్లో ఒకే రోజులో రికార్డు స్థాయిలో 892 రైళ్లను ఇంటర్చేంజ్ చేయడం ద్వారా కార్యాచరణ సామర్థ్యంలో కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పింది.డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 5న డీఎఫ్సీ నెట్వర్క్, భారతీయ రైల్వేకు చెందిన ఐదు జోన్ల మధ్య మొత్తం 892 సరుకు రైళ్ల మార్పిడి జరిగింది. అంతకుముందు జనవరి 4న నమోదైన 865 రైళ్ల ఇంటర్చేంజ్ రికార్డును ఇది అధిగమించింది. ఈ ఘనతతో సంప్రదాయ రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు, ప్రయాణికుల రైళ్ల నిర్వహణ మరింత సమయపాలనతో, సౌకర్యవంతంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు.అదే సమయంలో, నిత్యావసర వస్తువుల వేగవంతమైన రవాణా, లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గుదల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన ప్రయోజనం లభించింది. ఈ ఘనత డీఎఫ్సీసీఐఎల్ మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, దృఢమైన ప్రణాళిక, సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్మెంట్కు నిదర్శనంగా నిలుస్తోంది.రైళ్ల వేగ నియంత్రణ, సురక్షిత హెడ్వేలు, పొరుగు స్టేషన్ల మధ్య సమన్వయం వంటి చర్యలతో భారీ లోడుతో కూడిన విభాగాల్లోనూ సురక్షితమైన, ఇంధన సామర్థ్యంతో కూడిన, అంతరాయం లేని రవాణా సాధ్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్కూ తప్పలేదు
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 2 శాతం క్షీణించి రూ. 6,654 కోట్లకు పరిమితమైంది. కొత్త కార్మిక చట్టాల అమలు నేపథ్యంలో రూ. 1,289 కోట్లమేర వన్టైమ్ కేటాయింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,806 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం ఎగసి రూ. 45,479 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 41,764 కోట్ల టర్నోవ ర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)తో పోలిస్తే నికర లాభం 9.6 శాతం క్షీణించగా.. ఆదాయం 2.2 శాతం పుంజుకుంది. ఏఐలో ముందంజ ఎంటర్ప్రైజ్ ఏఐలో ప్రత్యేకత కలిగిన విలువ ఆధారిత సరీ్వసులను టోపజ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీకున్న నైపుణ్యం, కొత్త ఆవిష్కరణలు, పటిష్ట డెలివరీ సామర్థ్యాలు క్లయింట్లను ఆకట్టుకుంటున్నట్లు వివరించారు. దీంతో ఇన్ఫోసిస్ను తమ భాగస్వామిగా ఎంచుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించి షేర్ల బైబ్యాక్తో పాటు వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ను సైతం చెల్లించింది. గతంలో ప్రకటించిన విధంగా ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు సీఎఫ్వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే 18,000 మందికి ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు. ఇతర విశేషాలు → తాజా సమీక్షా కాలంలో ఇన్ఫోసిస్ 4.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. వీటిలో 57 శాతం కొత్తగా సాధించిన ఆర్డర్లు కావడం గమనార్హం! → యూకే నేషనల్ హెల్త్ సరీ్వస్తో 1.6 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్ట్ అందుకుంది. → మార్చితో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను 3–3.5 శాతానికి మెరుగుపరచింది. ఇంతక్రితం 2–3 శాతం ఆదాయ వృద్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే. → 2025 డిసెంబర్ 31కల్లా 5,043 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,37,034కు చేరింది. → కంపెనీ సీఈవో పరేఖ్కు రూ. 3 కోట్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాల(ఆర్ఎస్యూలు) కేటాయిం చేందుకు బోర్డు అనుమతించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. → కొత్త కారి్మక చట్టాల ప్రభావంతో ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్ రూ. 2,128 కోట్లు, హెచ్సీ ఎల్ టెక్నాలజీస్ రూ. 719 కోట్లు చొప్పున క్యూ3 లో కేటాయింపులు చేపట్టిన విషయం విదితమే. ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 1,599 వద్ద ముగిసింది.Infosys (755691)third quarter (774541)consolidated (755785)net profit (75578 -
ఎయిర్ ఇండియా కొత్త డ్రీమ్లైనర్
టాటా గ్రూప్ ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఇండియా, ఫిబ్రవరి నుంచి కొత్త బోయింగ్ 787–9 డ్రీమ్లైనర్ విమానాన్ని అంతర్జాతీయ వాణిజ్య సేవలకు ఉపయోగించనుంది. ప్రైవేటీకరణ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లీట్లో చేరిన తొలి డ్రీమ్లైనర్ ఇదే. ఈనెల 7న అమెరికాలోని సియాటిల్లో ఉన్న బోయింగ్ ఎవెరెట్ ఫ్యాక్టరీలో ఈ విమానం టైటిల్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం జనవరి 11న ఇది ఢిల్లీకి చేరింది.ఎయిర్ ఇండియా చివరిసారిగా లైన్ ఫిట్ డ్రీమ్లైనర్ను 2017 అక్టోబర్లో, ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో కొనుగోలు చేసింది. విస్తరణ దిశగా సాగుతున్న ఎయిర్ ఇండియా ఈ ఏడాది మరో ఐదు వైడ్–బాడీ విమానాలను (ఏ350–1000, బీ787–9లు) ఫ్లీట్లో చేర్చాలని భావిస్తోంది. ఎయిర్ ఇండియా మొత్తం 350 ఎయిర్బస్ విమానాలు, 220 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. ఇప్పటికే ఆరు ఏ350 వైడ్–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్లో చేరాయి. అలాగే 51 బీ 737–8 న్యారో–బాడీ విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు అందాయి.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే.. -
వారెవ్వా ఏమి జోరు..
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు నెల కొల్పుతున్న వెండి, బంగారం మరోసారి దూకుడు ప్రదర్శించాయి. కేజీ వెండి ధర రూ. 6,000 జంప్చేసి రూ. 2,71,000ను తాకింది. ఈ బాటలో స్థానిక(ఢిల్లీ) మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వివరాల ప్రకారం వెండి అన్ని పన్నులు కలుపుకుని, పూర్తి స్వచ్చత కలిగిన బంగారం ధరలివి. వెరసి మరోసారి పసిడి, వెండి చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అస్థిరతలు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు మరోసారి తెలియజేశాయి.అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులకోసం ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలవైపు చూసే సంగతి తెలిసిందే. సాధారణ ప్రజలతోపాటు.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్లు, అసెట్ మేనేజర్స్ పసిడిలో ఇన్వెస్ట్ చేస్తుంటే.. వెండికి సోలార్, ఈవీ, ఎల్రక్టానిక్స్ తదితర ఇండ్రస్టియల్ డి మాండ్ సైతం జత కలుస్తోంది. 2 రోజుల్లో రూ. 21,000 గత వారాంతాన వెండి కేజీ రూ. 2,50,000 వద్ద స్థిరపడగా.. సోమవారం రూ. 15,000 జంప్చేసి రూ. 2,65,000ను తాకిన విషయం విదితమే. తాజాగా మరో రూ. 6,000 బలపడటంతో రెండు రోజుల్లో 21,000 దూసుకెళ్లింది. 2026లో ఇప్పటివరకూ రూ. 32,000(13.4 శాతం) లాభపడింది. 2025 డిసెంబర్ 31న కేజీ వెండి రూ. 2,39,000 వద్ద ముగిసింది.అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత పసిడి 10 గ్రాములు సోమవారం రూ. 2,900 ఎగసి రూ. 1,44,600కు చేరగా.. తాజాగా మరో రూ. 400 లాభపడి రూ. 1,45,000ను తాకింది. మరోపక్క గ్లోబల్ మార్కెట్లలోనూ పసిడి ఔన్స్(31.1 గ్రాములు) సోమవారం 4,630 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి ఔన్స్ 86.26 డాలర్ల వద్ద సరికొత్త గరిష్ట రికార్డ్ సాధించింది. మంగళవారం సైతం న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్లో తొలుత బంగారం(ఫిబ్రవరి కాంట్రాక్ట్) 4,632 డాలర్లకు, వెండి(మార్చి) 88.56 డాలర్లకు చేరడం గమనార్హం! -
10 నిమిషాల డెలివరీ ఎత్తివేత!
జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు. -
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఖరారు
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.జనవరి 17న ప్రారంభంరైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.టికెట్ ధరలు, కనీస ఛార్జీరైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.రిజర్వేషన్ కోటాలుఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.1. మహిళలు2. దివ్యాంగులు3. సీనియర్ సిటిజన్లు4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.ఈ రైలు ప్రత్యేకతలుమొత్తం 16 కోచ్లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు -
లాభాల్లోనే లాస్.. బలంగానే బిజినెస్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 10,657 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కొత్త కారి్మక చట్ట నిబంధనల అమలు ప్రభావం చూపినట్లు టీసీఎస్ పేర్కొంది. ఇందుకు రూ. 2,128 కోట్లు(వన్టైమ్) కేటాయించింది. లేదంటే నికర లాభం 8.5 శాతం ఎగసి రూ. 13,438 కోట్లకు చేరేదని తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2లో రూ. 12,075 కోట్లు ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 67,087 కోట్లకు చేరింది. క్యూ2లో రూ. 63,973 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆర్డర్లు గుడ్ తాజా సమీక్షా కాలంలో టీసీఎస్ 9.3 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటాదారులకు రూ. 11 మధ్యంతర డివిడెండ్తోపాటు షేరుకి రూ. 46 చొప్పున ప్రత్యేక డివిడెండ్ను సైతం బోర్డు సిఫారసు చేసింది. వెరసి ఒక్కో షేరుకీ రూ. 57 చొప్పున చెల్లించనుంది. మార్జిన్లు ఓకే తాజా త్రైమాసికంలో టీసీఎస్ నిర్వహణ మార్జిన్లు క్యూ2తో పోలిస్తే నిలకడగా 25.2 శాతంగా నమోదయ్యాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో 24.5 శాతం మార్జిన్లు సాధించింది. క్యూ2 బాటలో రానున్న త్రైమాసికంలోనూ ఆదాయం వృద్ధి కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలియజేశారు. ఏఐ ఆదాయం 17 శాతం జంప్చేసినట్లు వెల్లడించారు. ఆదాయంలో ఉత్తర అమెరికా వాటా 1.3 శాతం పుంజుకోగా.. యూకే 3.2 శాతం నీరసించింది. దేశీ ఆదాయం 34 శాతం క్షీణించింది. క్యూ3లో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 11,151 తగ్గి 2025 డిసెంబర్ 31 కల్లా 5,82,163కు పరిమితమైంది. ఇందులో, పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా 1,800 మంది ని్రష్కమించినట్లు సంస్థ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 3,236 వద్ద ముగిసింది. -
ఏటా 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఎగుమతి
భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్ (Uniper)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈమేరకు యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్, ఏఎం గ్రీన్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ కుమార్ చలమలశెట్టి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.ఒప్పందంలోని అంశాలు..ఏడాదికి గరిష్టంగా 5,00,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను యూనిపర్ కొనుగోలు చేయనుంది. ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1 ఎంటీపీఏ (ఏటా మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం) ప్లాంట్ నుంచి 2028 నాటికి మొదటి విడత ఎగుమతి ప్రారంభం కానుంది. ఈ అమ్మోనియా యూరోపియన్ RFNBO (Renewable Fuel of Non-Biological Origin) సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ చలమలశెట్టి మాట్లాడుతూ.. ‘గ్లోబల్గా ఎనర్జీ పరంగా వస్తున్న మార్పులో భారత్ పాత్రకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుంది. మా ప్రత్యేకమైన క్లీన్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా.. కెమికల్స్, అల్యూమినియం వంటి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే పరిశ్రమలు తమ ఉద్గారాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్ స్పందిస్తూ.. ‘భారత్, యూరప్ మధ్య మొట్టమొదటి భారీ స్థాయి సరఫరా కేరిడార్ను ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ద్వారా ఎరువులు, రిఫైనింగ్ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఏఎం గ్రీన్ కో-ఫౌండర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, తమ పెట్టుబడిదారులు (Gentari, GIC, ADIA) సహకారంతో ప్రపంచ స్థాయి నాణ్యతతో సరైన ధరలో గ్రీన్ అమ్మోనియాను అందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించామని తెలిపారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత -
రూ.2.7 కోట్ల జీతం.. జాబ్ వదిలేసిన 22 ఏళ్ల యువకుడు.. ఎందుకంటే..
ప్రస్తుతం ఉన్న జాబ్ మార్కెట్లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.చిన్న వయస్సులోనే..ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.రాజీనామా అనంతరం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.సీఈఓ ముందే..కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.సోషల్ మీడియా స్పందనడబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై మరోసారి చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం


