breaking news
Corporate
-
రిలయన్స్ కన్జూమర్ చేతికి ‘ఉదయం’
రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడుకి చెందిన ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం కంపెనీలో ఆర్సీపీఎల్కి మెజారిటీ వాటాలు, సంస్థ గత ప్రమోటర్లు ఎస్. సుధాకర్, ఎస్. దినకర్లకు మైనారిటీ వాటాలు ఉంటాయి.ఈ డీల్తో ఆర్సీపీఎల్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఉదయం బ్రాండ్ కూడా చేరినట్లయింది. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను దశాబ్దాలుగా అందిస్తూ ఉదయం ఎంతో పేరొందిందని ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం బ్రాండ్ కింద బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్ పప్పు ధాన్యాలు మొదలైన అమ్ముడవుతున్నాయి. -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్లైన్ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.దీనికోసం భాగస్వామి షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్కి 30 శాతం, షాన్డాంగ్కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. -
సన్టెక్లో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజాన్ సోలార్ బ్రాండ్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు చారుగుండ్ల భవానీ సురేశ్ తెలిపారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్నామని, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో ఏర్పాటైన సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో అవసరాలకు కావాల్సిన సోలార్ ఉత్పత్తులను అందిస్తోంది. -
పసిడి సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి, వెండి రికార్డు ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం 10 గ్రాములకు రూ.2,650 పెరిగి రూ.1,40,850కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 78 శాతం పెరిగినట్టయింది. 2024 డిసెంబర్ 31న ఉన్న రూ.78,950 నుంచి నికరంగా రూ.61,900 వరకు 10 గ్రాములకు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలోకి మరో రూ.2,750 పెరగడంతో సరికొత్త రికార్డు రూ.2,17,250 నమోదైంది. వెండి ధర ఈ ఏడాది ఏకంగా 142 శాతం పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న కిలో ధర రూ.89,700 వద్ద ఉండగా, అక్కడి నుంచి నికరంగా రూ.1,27,550 లాభపడింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 1.4 శాతం పెరిగి 70 డాలర్ల మార్క్ను మొదటిసారి చేరుకుంది. బులియన్లో అసాధారణ ర్యాలీ కొనసాగుతోందని, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 4,500 మార్క్ను చేరుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ 2026లో ఒకటికి మించిన రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు తాజాగా మరో విడత పసిడి, వెండి ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నట్టు చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత సాధనంగా డిమాండ్ సైతం కొనసాగుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పసిడి స్పాట్ ధర ఔన్స్కు ఈ ఏడాది 18,92 డాలర్ల నుంచి 4,500 డాలర్లకు చేరుకోవడం గమనార్హం -
బిలియన్ డాలర్ల ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏటా సుమారు 30 శాతం వృద్ధితో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 2,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం దాదాపు రూ. 10,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ల విలువను రూ. 30,000 కోట్ల స్థాయికి పెంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు నాయర్ వివరించారు.నీరు–వ్యర్థ జలాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్లపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు నాయర్ తెలిపారు. ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్లకు సరిపడా ఆర్డర్ బుక్ ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా 1 బిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై కసరత్తు జరుగుతోందన్నారు. ఆదాయాల్లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) వాటా 45 శాతంగా, బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) వాటా 25 శాతంగా ఉందని నాయర్ చెప్పారు. కొత్త విభాగాలపై దృష్టి.. ప్రధాన వ్యాపారానికి అనుబంధంగా ఉండేలా డేటా సెంటర్లు, పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనంలాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నాయర్ తెలిపారు. మరోవైపు, డివిడెండు పాలసీ కూడా పరిశీలనలో ఉందని సంస్థ సీఎఫ్వో స్రవంత్ రాయపూడి చెప్పారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పూర్తి గా చెల్లించివేసి రుణరహిత సంస్థగా కంపెనీ మారిందని ఆయన వివరించారు. ప్రాజెక్టులు బట్టి స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కి సంబంధించి మాత్రమే రుణం తీసుకుంటున్నట్లు స్రవంత్ తెలిపారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ లో గోదావరి జలాలను నింపేందుకు ఉద్దేశించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ నుంచి దక్కించుకున్న రూ. 2,085 కోట్ల భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నాయర్ చెప్పారు. -
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
ఇండస్ట్రియల్ పార్కులు, వాటర్ & వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, అర్బన్ సొల్యూషన్స్లో.. ప్రత్యేక నైపుణ్యం కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. 2025లో కంపెనీ ఆపరేటింగ్ ఫండమెంటల్స్ను ఎలా బలోపేతం చేసింది, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కోసం వ్యూహలు ఏమిటనే విషయాలను వెల్లడించింది.కంపెనీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విధానం ద్వారా చిన్న ప్రాజెక్టులలో విభజనను తగ్గించడం, సంక్లిష్టమైన పనులపై కఠినమైన డెలివరీ నియంత్రణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు దగ్గరగా ఉన్న అంతర్జాతీయ పైప్లైన్తో పాటు సుమారు 1 బిలియన్ డాలర్ల దేశీయ పైప్లైన్ను కూడా సూచించింది.విదేశీ ఇండస్ట్రియల్ పార్కులు, నీటి ప్రాజెక్టులకు పరిమితం చేసిన కంపెనీ.. ఇంజనీరింగ్, నిర్మాణం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి వాటిపై దృష్టి సారించింది. నీరు, వ్యర్థ జలాల విభాగంలో.. కంపెనీ పరిధిలో డిజైన్ బిల్డ్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ పైప్లైన్లు, పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. -
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
ఇండియా & ఖతార్లలో.. మ్యూజియం ఇన్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్లను అభివృద్ధి చేయడానికి ఖతార్ మ్యూజియమ్స్ - ముంబై కేంద్రంగా ఉన్న నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మధ్య ఐదు సంవత్సరాలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం.. ఖతార్లలో మ్యూజియం ఇన్ రెసిడెన్స్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా పిల్లలకు ఉల్లాసభరితమైన, మ్యూజియం ఆధారిత అభ్యాస అనుభవాలను పరిచయం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం సృజనాత్మకతను ప్రేరేపించడం. మన దేశంలో ఈ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో.. NMACC అమలు చేస్తుంది. కాగా ఖతార్ మ్యూజియమ్స్ నిపుణులు.. మాస్టర్ క్లాసులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించనున్నారు.ఈ సందర్బంగా ఇషా అంబానీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు & విద్యాభివృద్ధి కోసం షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు ఖతార్ మ్యూజియంలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యంతో నిర్వహించనున్న కార్యక్రమాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలతో సహా పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాలలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు. -
బయోఫ్యాబ్రి.. భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం
జెండాల్ గ్రూప్లో భాగమైన గ్లోబల్ హ్యూమన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ.. బయోఫ్యాబ్రి వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించాయి.రెండు సంస్థల భాగస్వామ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాధాన్యతలకు అనుగుణంగా.. క్షయవ్యాధి వ్యాక్సిన్లకు అందించడానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.2020లో లైసెన్సింగ్ అగ్రిమెంట్ తరువాత జరిగిన ఈ కొత్త టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం రెండు కంపెనీలను మరింత బలపరుస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. ఆఫ్రికా, ఆగ్నేయాసియా అంతటా 70 కంటే ఎక్కువ దేశాలలో MTBVAC వ్యాక్సిన్ తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండేలా చూడడం. -
H-1B visa: ఆగిన వర్క్పర్మిట్ల పునరుద్ధరణ
భారత్కు వచ్చి హెచ్-1బీ వీసా స్టాంపింగ్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది భారతీయ హెచ్ -1బి వీసా హోల్డర్లు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడి యూఎస్ కాన్సులర్ కార్యాలయాలు హఠాత్తుగా వారి వీసా స్టాంపింగ్ అపాయింట్లను రీషెడ్యూల్ చేసింది. దీంతో వాళ్లు తిరిగి తమ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఈ వీసా రీషెడ్యూళ్లు ప్రధానంగా డిసెంబర్ 15 నుంచి 26వ తేదీల మధ్య స్లాట్ లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్రిస్మస్ సెలవు సీజన్ ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియా స్క్రీనింగ్ను కఠినంగా అమలు చేయడం వల్లే ఈ మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలు వీసా హోల్డర్లలో ఆందోళనను పెంచుతున్నాయి.ఇక ఈ పరిణామం వల్ల ప్రభావితులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ, హెల్త్కేర్, ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తున్న హెచ్-1బి ఉద్యోగులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉద్యోగులు పనిచేసే అమెరికాలోని కంపెనీలు కూడా ఉద్యోగుల గైర్హాజరీతో ప్రాజెక్ట్ డెడ్లైన్లు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘సిక్కిం సుందరి’పై ఆనంద్ మహీంద్ర ప్రేమ, వైరల్ వీడియో
ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ‘సిక్కిం సుందరి’ పై మనసు పారేసుకున్నారు. ప్రకృతి అసాధారణ సృష్టి, అద్భుతం అంటూ దీని గురించి ట్వీట్ చేశారు. ఇంతకీ ఏవరీ సిక్కిం సుందరి తెలుసుకుందాం.అరుదైన హిమాలయ పుష్పం అసాధారణ జీవిత చక్రాన్ని హైలైట్ చేస్తూ, ఆశ్చర్యాన్ని ప్రకటించారు. సహజ అద్భుతం అంటూ ప్రశంసించారు. దానిపేరే సిక్కిం సుందరి. ఇది హిమాలయ పర్వతశ్రేణుల్లో కనిపించే అరుదైన మొక్క. దీన్ని రూమ్ నొబైల్ (Rheum nobile) అని పిలుస్తారు. దీని ప్రత్యేక రూపం కారణంగా "గ్లాస్హౌస్ ప్లాంట్" అని. ఇది చాలా ఎత్తులో పెరుగుతుంది ఒకేసారి పెద్దగా పూసి చనిపోతుంది. 30 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ఈ మొక్కను సిక్కిం సుందరి అంటారు. ఆనంద్ మహీంద్రా ఆదివారం అరుదైన మొక్కపై తన అభిమానాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి లోని అపూర్వ అసాధారణ సృష్టిలలో ఒకటిగా ఉన్న దీని గరించి తన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన లేదన్నారు. కఠినమైన పరిస్థితులలో ఓర్పుతో వికసించే ఈ మొక్క సహనానికి ఒక మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు. ఇది దాదాపు 3 నుండి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎత్తైన, కోన్ ఆకారంల వికసిస్తుంది ఇది ఒకేసారి పుష్పిస్తుంది, దాని విత్తనాలను వెదజల్లడంతో దాని జీవిత చక్రాన్ని పూర్తి అవుతుందని మహీంద్రా చెప్పారు. ఇలాంటి వాటికి ఎందుకు గుర్తింపు లభించడం లేదని ప్రశ్నించారు. సిక్కిం వంటి ప్రాంతాలను అన్వేషించడానికి స్థానిక జీవవైవిధ్యంతో తిరిగి కనెక్ట్ అవాలని మహీంద్రా కోరారు. I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025చదవండి: కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత? సిక్కిం, తూర్పు నేపాల్ ,ఆగ్నేయ టిబెట్లో సముద్ర మట్టానికి 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో ఈ మొక్క కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం అపారదర్శక, గడ్డి-రంగు బ్రాక్ట్లలతో కోన్-ఆకారపు టవర్లా ఎదుగుతాయి. ఈ బ్రాక్ట్లు సహజ గ్రీన్హౌస్ లాగా పనిచేస్తాయి. సూర్యరశ్మి గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ, ఎండ, చల్లగాలులనుంచి సున్నితమైన పువ్వులను కాపాడుతుంది. ఇది లోపల వెచ్చని మైక్రోక్లైమేట్ను సృష్టిస్తుంది. అధిక ఎత్తులో మొక్క మనుగడకు సహాయపడుతుంది. అలాగే దాని ఎత్తు, లేత రంగు కారణంగా, మొక్క పర్వత లోయల మీదుగా అందంగా స్పష్టంగా కనిపిస్తుంది.సాంస్కృతిక, ఔషధ ప్రాముఖ్యతఅయితే దీని రూపం, ఆకర్షణతో పాటు సిక్కిం సుందరికి సాంస్కృతిక, ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్థానికంగా చుకా అని పిలుచుకునే దీని కాండాన్ని సాంప్రదాయ వంటలలో వండుకుని తింటారు. దీని ప్రకాశవంతమైన పసుపు వేర్లు సాంప్రదాయ టిబెటన్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా జూన్ , జూలై మధ్య పుష్పిస్తుంది, ఇది ఎత్తైన హిమాలయాలలో సీజనల్ హైలైట్గా నిలుస్తుంది.సింగిల్ బ్లూమ్ మొక్క చనిపోయి, దశాబ్దాల వరకు ఆ విత్తనం అలాగే పదిలంగా ఉంటూ, మళ్లీ మొలకెత్తడమే దీని ప్రత్యేకత. ఇదీ చదవండి: కులాంతర వివాహం : ఆరునెలల గర్భిణీని హత్య చేసిన తండ్రి -
ఐఫోన్ తయారీ ప్లాంట్లో 30,000 మంది నియామకం
భారతదేశ తయారీ రంగంలో నియామకాల పర్వం కొనసాగుతోంది. తైవాన్కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టింది. కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకోవడం ద్వారా తన కార్యకలాపాలను వేగవంతం చేసింది.మహిళలకు పెద్దపీట300 ఎకరాల ఈ భారీ సదుపాయంలో మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 19-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు, మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే కావడం గమనార్హం. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000కు పెరుగుతుందని అంచనా. తద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో అత్యధిక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్గా ఇది రికార్డు సృష్టించనుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ ఇక్కడే..ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్తో ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాపిల్ అత్యాధునిక మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.ప్లాంట్ విశేషాలుసుమారు రూ.20,000 కోట్లు పెట్టుబడి.2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం.సగటున వేతనం నెలకు రూ.18,000 (ఉచిత వసతి, సబ్సిడీ భోజనం).ఉద్యోగుల కోసం ఇప్పటికే 6 భారీ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి.‘మినీ టౌన్షిప్’గా దేవనహళ్లికేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్షిప్లా మారనుందని కంపెనీ చెప్పింది. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా కార్మికులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చలి చంపుతున్నా వ్యాపారం భళా -
జస్ట్ 99.. కానీ కాస్ట్లీ
ఓ 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో పెట్రోల్, డీజిల్పై లీటరుకు ఒకటి రెండు రూపాయలు పెరిగితే చాలు. దేశమంతా భగ్గుమనేది. ప్రతిపక్షాలు బంద్లకు పిలుపునిచ్చేవి. ధర్నాలు, రాస్తారోకోలు మామూలే. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పెంచినదాంట్లో కొంత తగ్గించేది. దాంతో పరిస్థితి సర్దుమణిగేది. కానీ 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం రోజువారీ ధరలు మారే విధానాన్ని అమల్లోకి తెచి్చంది. అంటే అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను సవరించటమన్న మాట. కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేనాటికి పెట్రోలు ధర లీటరుకు రూ.65. నాటి నుంచీ ధరలు రోజూ పైసా నుంచి 5 పైసల వరకు పెరగటం మొదలయ్యాయి. అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా... అది తాత్కాలికమే. మెల్లగా ఎనిమిదేళ్లు తిరిగేసరికి ప్రస్తుతం లీటరు ధర ఏకంగా రూ.105కు చేరింది. విచిత్రమేంటంటే ఇంతలా పెరిగినా బంద్లు, ధర్నాలు, రాస్తారోకోలు జరగలేదు. జనం కనీసం ఆగ్రహాన్ని కూడా వ్యక్తంచేయటం లేదు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది వారికి నొప్పి తెలియకుండా జరిగింది. ఇదంతా ఎందుకంటే... నెలవారీ సబ్ర్స్కిప్షన్లు కూడా ఇలా నొప్పి తెలియకుండా మన జేబుకు చిల్లు పెట్టేవే. కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే... వీటిద్వారా వృధా కాకుండా బాగానే ఆదా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...ఏడాదికి 30వేల నుంచి లక్ష వరకూ డిజిటలైజేషన్ పెరిగాక సబ్ర్స్కిప్షన్ల యుగం మొదలైంది. ఇపుడవి నగరవాసుల జీవితాల్లో భాగమైపోయాయి. ఓటీటీలు, మ్యూజిక్, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్లు, ఏఐ యాప్లు... ఇలా ఒకటేమిటి!. రకరకాల యాప్లు. వాటిలో నిజంగా ఏది అవసరం, ఏది అనవసరం అనేది కాస్త ఆగి, ఆలోచించకుండా, ఎడా పెడా సబ్్రస్కయిబ్ చేసేసే ధోరణి పెరుగుతోంది. పైపెచ్చు ఎదిగిన పిల్లలున్న ఇంట్లో అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే యాప్ను సబ్్రస్కయిబ్ చేస్తున్న సందర్భాలు అనేకం. తాజా సర్వేల ప్రకారం ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి యావరేజ్గా 5–12 సబ్స్క్రిప్షన్లు ఉంటున్నాయి. యాప్ని బట్టి ప్రతి నెలా సబ్స్క్రిప్షన్ ఖర్చు అత్యంత తక్కువగా తొంభై తొమ్మిది రూపాయలేగా అనే ధోరణితో లైట్గా తీసుకుంటున్నప్పటికీ, మొత్తం సబ్స్క్రిప్షన్లన్నీ కలిపితే ఈ ఖర్చు ఏడాదికి 30–40 వేలు దాటిపోతోంది. ఇక పిల్లలు కూడా సబ్ర్స్కయిబ్ చేస్తున్న కుటుంబాల్లో ఈ ఖర్చు లక్షకు దగ్గర్లోనే ఉంటోంది. అందుకోసమే వీటిని నియంత్రించుకోవటంపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతోంది. ఒకటీ రెండూ కాదు... ఓటీటీల్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లతో మొదలుపెడితే హాట్స్టార్, జీ5, సన్ టీవీ, ఎయిర్టెల్ ప్లే, ఆహా, ఎంఎక్స్ ప్లేయర్ సహా పదులకొద్దీ ఉన్నాయి. వీటిలో 99 శాతానికి సబ్్రస్కిప్షన్ తప్పనిసరి. కొన్నింటికి సబ్్రస్కిప్షన్ తీసుకున్నా కూడా... యాడ్లు లేకుండా చూడాలంటే మరింత ఎక్కువ పెట్టి సూపర్ సబ్్రస్కిప్షన్ తీసుకోవాలి. ఇక మ్యూజిక్ కోసం స్పాటిఫై, గానా వంటివి... క్లౌడ్ స్టోరేజీ కోసం గూగుల్ వన్, ఐక్లౌడ్ వంటివి... సోషల్ మీడియా, ఏఐ కోసం ట్విటర్, చాట్ జీపీటీ, గ్రోక్ వంటివి... ఇవన్నీ కాకుండా రకరకాల లెరి్నంగ్ యాప్లు, ఫిట్నెస్ యాప్లు, యాంటీ–వైరస్లు, ఈ–కామర్స్ మెంబర్íÙప్లు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ సబ్స్క్రిప్షన్లు రూ. 99, రూ. 149, రూ. 299..రూ.499 ఇలా ఉంటున్నాయి. విడివిడిగా యాప్లకు సబ్్రస్కయిబ్ చేస్తాం కనక అదేం పెద్ద మొత్తం కాదనిపిస్తుంది. కానీ ఇదో ఉచ్చులాంటిదని గ్రహించం. చాలా మటుకు సబ్్రస్కిప్షన్లను కావల్సినప్పుడు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు కదా అని ముందుగా తీసుకుంటాం. ప్రతి నెలా గుర్తుంచుకుని మరీ కట్టే బాదరబందీ ఎందుకు, ఆటోమేటిక్గా రెన్యూ చేసుకునే ఆప్షన్ని ఎంచుకోండి అని యాప్ సూచించగానే ఓకే కొట్టేస్తాం. ఆటో రెన్యువల్ మోడల్ పెట్టేస్తాం. కానీ ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోతాం. నెల తిరగ్గానే కొద్ది కొద్ది మొత్తం కట్ అయిపోతుంటుంది. ముందుగా మెసేజ్లు వస్తాయి గానీ... వంద, రెండొందలే కదా అని పెద్దగా పట్టించుకోం. కానీ అన్ని యాప్లూ కలిస్తే ఎంతవుతోంది? నెలకు మొత్తంగా ఎంత కడుతున్నాం? ఏడాదికి ఎంతవుతోంది? అనేది ఆలోచించం. అలా... వేల రూపాయల్ని చెల్లిస్తూనే ఉంటాం. సైకాలజీ ఏమంటుందంటే.. దీని వెనుక సైకాలజీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈఎంఐలను, సబ్స్క్రిప్షన్లను మెదడు వేర్వేరు రకాలుగా ప్రాసెస్ చేసుకుంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కింద కట్టాలంటే అదొక పెద్ద మొత్తంగా కనిపించి, భారంగా అనిపిస్తుంది. కానీ సబ్స్క్రిప్షన్ అంటే మరీ పెద్ద మొత్తం కాదు కదా.. ఫర్లేదులే అనే అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష టీవీకి ప్రతి నెలా ఈఎంఐ కట్టాలంటే, అబ్బో అంత కట్టాలా .. అని కాస్త భయం వేస్తుంది. కానీ ప్రతి నెలా ఓ సబ్్రస్కిప్షన్కి రూ. 199 కట్టాలంటే ఫర్లేదులే అనిపిస్తుంది. కానీ అలాంటివి రూ. 199 చొప్పున ఓ పన్నెండు సబ్ర్స్కిప్షన్లు ఉన్నాయంటే! నెలకు దాదాపు రూ. 2,400 అవుతుంది. అదే ఏడాదికి చూస్తే సుమారు రూ. 30,000 అవుతుంది. అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఒక్కో సబ్ర్స్కిప్షన్కి కట్టే మొత్తం తక్కువగా ఉండటం వల్ల, పెద్ద భారం కాదులే అని మెదడు లైట్గా తీసుకుంటుందట!. దీన్నుంచి ఎలా బయటపడాలంటే ఎంత పెద్ద పడవైనా, చిన్న రంధ్రం పడితే చాలు. నీరు మెల్లగా చేరి అంత పెద్ద పడవ కూడా మునిగిపోయే ముప్పుంటుంది. అలాగే చిన్న చిన్న మొత్తాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే బడ్జెట్ అదుపు తప్పేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు ఏం చేయాలంటే... → వన్–్రస్కీన్ విధానం: కుటుంబం ఉపయోగిస్తున్న ప్రతి సబ్్రస్కిప్షన్ వివరాలనూ పేపరు మీద రాయండి. ఒక్కొక్క దాని అవసరాన్ని బట్టి ‘తప్పనిసరి’, ‘ఉపయోగకరం’, ‘వ్యర్ధం’ అనే రేటింగ్ ఇచ్చుకోండి. → మూడు నెలల పాటు... అంటే 90 రోజులుగా ఉపయోగించుకుండా నిరుపయోగంగా ఉన్న సర్వీసులను తక్షణం క్యాన్సిల్ చేయండి. → అవసరం అనుకుంటే వార్షిక ప్లాన్లకు మారండి. నెలవారీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్ ప్లాన్లు సుమారు 15–40 శాతం వరకు చౌకగా ఉంటాయి. → ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్లను షేర్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ / స్పాటిఫై / గూగుల్ వన్ ఫ్యామిలీ ప్లాన్లతో 50–80 శాతం వరకు ఆదా అవుతుంది. → కొందరు టెలికామ్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్లు తమ సర్వీసులతో పాటు ఓటీటీలు కాంబోగా అందిస్తున్నారు. ఇలాంటివి చాలా తక్కువ ధరే ఉంటాయి. సరీ్వసు గనక మంచిదైతే... కాంబోలో ఇస్తున్న ఓటీటీలతో మనకు ఆదా అవుతుందనుకుంటే తీసుకోవచ్చు. చివరిగా చెప్పేదేమిటంటే.. సబ్ర్స్కిప్షన్లనేవి పూర్తిగా చెడ్డవేమీ కావు. కాకపోతే వాటి సరీ్వసులు, నాణ్యతకన్నా మన అవసరం ముఖ్యం. పెద్దగా అవసరం లేనపుడు ఎంత మంచి యాప్ను సబ్స్క్రయిబ్ చేస్తే మాత్రం ఏంటి లాభం? అందుకే వాడుకోలేకపోతే ఈ యాప్ల వల్ల ఏటా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చల్లగా వృధా అయిపోయే ప్రమాదముంది. మధ్య తరగతి వారికి ఈ మొత్తం ఒక నెల, లేదా ఏడాది సిప్కి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్), ఓ రెండు, మూడు గ్రాముల బంగారానికి, ఓ దేశీ విహారయాత్ర ఖర్చులకు సరిసమానం. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుంటే శ్రేయస్కరం. -
కొత్త టెక్నాలజీల పరిశీలనకు వర్కింగ్ గ్రూప్
స్టాక్ ఎక్స్చేంజీలనిర్వహణ సామర్థ్యాలను, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణను, మార్కెట్ పర్యవేక్షణనను మెరుగుపర్చేందుకు ఉపయోగపడే కొత్త సాంకేతికతలను పరిశీలించేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే 5–10 ఏళ్లలో ఎక్స్చేంజ్ టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందాలి, అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలను అందుకోవాలి, మార్కెట్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపొందించాలి తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు.కమోడిటీ, క్యాపిటల్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ 11వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు తుహిన్ కాంత పాండే. టెక్నాలజీపరంగా పటిష్టంగా ఉండటం ఎంతో ముఖ్యమని, ఎక్స్చేంజీల్లో చోటు చేసుకునే ప్రతి సాంకేతిక లోపాన్ని సెబీ చాలా సీరియస్గా తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అటు నాన్–అగ్రి కమోడిటీ డెరివేటివ్స్ను సమీక్షించేందుకు కూడా వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాండే చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు. -
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు: కొనియాడిన అంబానీ
శాస్త్రీయ రంగంలో ప్రతిభను మరియు "నవ భారత్" స్ఫూర్తిని కొనియాడుతూ జరిగిన ఒక ప్రత్యేక సాయంత్రం వేళ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్కు ఘన నివాళులర్పించారు. డాక్టర్ మషేల్కర్ రికార్డు స్థాయిలో 54 గౌరవ డాక్టరేట్లు పొందిన అసాధారణ విద్యా మైలురాయిని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ నిర్వహించారు.ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు వరకు..సభికులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ, ముంబై వీధి దీపాల కింద చదువుకున్న ఒక సామాన్య బాలుడు ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఐకాన్గా ఎదిగిన డాక్టర్ మషేల్కర్ ప్రయాణాన్ని వివరించారు."డాక్టర్ మషేల్కర్ జీవిత ప్రయాణంలో నేను ఆధునిక భారతదేశ ప్రయాణాన్ని చూస్తున్నాను," అని అంబానీ పేర్కొన్నారు. "అతను పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గౌరవం వరకు ఎదిగారు. దీనికి కారణం వారి తల్లి అంజనీ గారి ప్రేమ, ఆయన ఉక్కు సంకల్పమే."చాలామంది జీవితంలో ఒక డిగ్రీ పొందడానికే కష్టపడతారని, కానీ మషేల్కర్ గారు 54 డాక్టరేట్లు సాధించారని అంబానీ కొనియాడారు. అంత ఎదిగినా ఆయన ఎంతో వినయంగా ఉంటారని, "పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ కిందకే వంగి ఉంటుంది" అనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్పై డాక్టర్ మషేల్కర్ చూపిన ప్రభావం ఈ ప్రసంగంలో ప్రధానాంశంగా నిలిచింది. రిలయన్స్ను కేవలం ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ నుంచి సైన్స్ ఆధారిత ఆవిష్కరణల (Innovation) దిశగా మళ్లించడంలో మషేల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మల పాత్ర కీలకమని అంబానీ అంగీకరించారు.2000వ సంవత్సరంలో మషేల్కర్ సూచన మేరకు స్థాపించబడిన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కంపెనీ సంస్కృతినే మార్చివేసిందని ఆయన వెల్లడించారు. నేడు రిలయన్స్లో 1,00,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారని గర్వంగా చెప్పారు. "రిలయన్స్ను ఒక పారిశ్రామిక సంస్థగా కాకుండా, ఒక సైన్స్ కంపెనీగా చూడాలని ఆయన మాకు నేర్పారు," అని అంబానీ అన్నారు. ముఖ్యంగా జియో & గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మషేల్కర్ దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.'గాంధీ ఇంజనీరింగ్' మరియు కృత్రిమ మేధ (AI)ఈ సందర్భంగా డాక్టర్ మషేల్కర్ రాసిన తాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన ప్రసిద్ధ సిద్ధాంతమైన *"More from Less for More"* (తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం) గురించి వివరించారు. దీనినే ఆయన 'గాంధీ ఇంజనీరింగ్' అని పిలుస్తారు.ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుత కృత్రిమ మేధ (AI) యుగానికి అన్వయిస్తూ, అంబానీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: "AI రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలి, కానీ 'కరుణ లేని సాంకేతికత.. కేవలం యంత్రం మాత్రమే' అని మనం గుర్తుంచుకోవాలి." తెలివితేటలతో పాటు సానుభూతిని, సంపదతో పాటు లక్ష్యాన్ని జోడించడం ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాను చూపగలదని ఆయన ఆకాంక్షించారు.క్వాంటం కంప్యూటింగ్, సింథటిక్ బయాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ "డీప్-టెక్ సూపర్ పవర్"గా ఎదగాలంటే, పారిశ్రామిక రంగం & విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రసంగం ముగియగానే, అంబానీ "జ్ఞాన యోగి" అని పిలిచిన డాక్టర్ మషేల్కర్కు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం సమర్పించారు. -
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by DAIS Mumbai (@daismumbai) -
ఫుడ్ డెలివరీ యాప్లు వద్దు బాబోయ్..
దేశంలో ఫుడ్ డెలివరి యాప్లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి యాప్లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్ డెలివరి యాప్లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్ డెలివరి యాప్లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్ డెలివరీ యాప్లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్లు, వెబ్సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది. -
కొటక్ బ్యాంక్పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది. -
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
న్యూఢిల్లీ: 2030 నాటికి దేశీయంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్వాంటమ్ మొదలైన సరికొత్త సాంకేతికతల్లో శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. ఇందుకోసం ఐబీఎం స్కిల్స్బిల్డ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు వివరించింది. అంతర్జాతీయంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి శిక్షణ కల్పించాలన్న మిషన్లో భాగంగా భారత్లో దీన్ని చేపట్టినట్లు ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్ కాలేజీలకు చేరువ కావడంతో పాటు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో కూడా జట్టు కట్టనున్నట్లు వివరించారు. సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలనేవి ఆర్థికంగా పోటీపడేందుకు, సాంకేతిక పురోగతికి, సమాజ పరివర్తనకు తోడ్పడతాయని కృష్ణ చెప్పారు. -
ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025 -
పొగమంచు గుప్పిట్లో విమానయానం
ఉత్తర భారత దేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. శీతాకాలం తీవ్రత పెరగడంతో విజబిలిటీ(Visibility-దృశ్యమానత) కనిష్ట స్థాయికి పడిపోయి, విమాన సర్వీసులు ఒక్కసారిగా రద్దయ్యాయి. ముఖ్యంగా ఇటీవల పెద్ద మొత్తంలో విమానాలు రద్దు చేసిన ఇండిగో ఈమేరకు మళ్లీ శనివారం (డిసెంబర్ 20) సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.80కి పైగా సర్వీసులు రద్దుప్రతికూల వాతావరణం కారణంగా శనివారం దేశవ్యాప్తంగా 80కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అంతకుముందు శుక్రవారం కూడా ఢిల్లీ విమానాశ్రయం నుంచి 73 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులతో కలిపి మొత్తం 79 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రాంచీ, జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అత్యధికంగా ఉంది. ‘వాతావరణ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాం. మీ ప్రయాణం సురక్షితంగా సాగేలా మా బృందాలు కృషి చేస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ విమాన స్థితిని (Flight Status) తనిఖీ చేసుకోవాలి’ అని ఇండిగో తన తాజా అడ్వైజరీలో పేర్కొంది.ఢిల్లీలో ‘లో విజిబిలిటీ’ అలర్ట్దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పొగమంచు ధాటికి విలవిలలాడుతోంది. విమానాశ్రయంలో ‘లో విజిబిలిటీ ప్రొసీజర్స్’ అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, దృశ్యమానత తగ్గితే మరిన్ని విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.గోవాలో ఊరటఉత్తరాది అంతా పొగమంచుతో ఇబ్బంది పడుతుంటే పర్యాటక రాష్ట్రం గోవాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డిసెంబర్ 20న గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవాల్సిన 38 ఇండిగో విమానాలు ఎటువంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుండటం ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది.pic.twitter.com/dymwYz9P3v— Goa International Airport, Dabolim (@aaigoaairport) December 20, 2025 -
భారతీయ కస్టమర్లు ‘స్ట్రిక్ట్ టీచర్లు’ లాంటివారు
సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా భారతీయ మార్కెట్ తీరుతెన్నులపై కీలక విశ్లేషణ చేశారు. భారతీయ వినియోగదారులు అంత సులభంగా సంతృప్తి చెందరని, వారు ఎప్పుడూ నాణ్యత, విలువల విషయంలో రాజీపడని ‘కఠినమైన ఉపాధ్యాయుల’ వంటి వారని ఆయన పేర్కొన్నారు.దేశీయ మార్కెట్లో రాణిస్తే అంతర్జాతీయంగా ఎగుమతుల్లో విజయం సాధించడం సులభమని ఒక వినియోగదారుడు చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్కు శ్రీధర్ వెంబు స్పందించారు. ‘భారతీయ కొనుగోలుదారుల అంచనాలను అందుకుని మీరు మనుగడ సాగించగలిగితే ప్రపంచ మార్కెట్ మీకు చాలా సులభం అవుతుంది. మీ ఉత్పత్తి బాగుంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రపంచ దేశాల్లోకి తీసుకెళ్లండి’ అని చెప్పారు.స్కూల్ టీచర్తో పోలికఈ సందర్భంగా తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న వెంబు తన స్కూల్ టీచర్ పరిమళ జీతో భారతీయ కస్టమర్లను పోల్చారు. ‘నా టీచర్ పరిమళ గారు చాలా కఠినంగా ఉండేవారు. ఒకవేళ నాకు పరీక్షలో 95 శాతం మార్కులు వచ్చినా నేను తక్కువ పనితీరు కనబరుస్తున్నానని, ఇంకా కష్టపడాలని ఆమె అనేవారు. భారతీయ కస్టమర్లు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. వారు 95 శాతంతో సంతృప్తి చెందరు. అత్యుత్తమమైన దాని కోసమే చూస్తారు’ అని ఆయన వివరించారు.కస్టమర్లు కఠినంగా ఉండటం కంపెనీలకు శాపమా అంటే.. కాదనే అంటున్నారు వెంబు. ‘మమ్మల్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నందుకు భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు. వారి కఠినమైన వైఖరి వల్లే మేము మరింత కష్టపడి, మెరుగైన ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల ఒత్తిడి కారణంగానే జోహో తన మెసేజింగ్ యాప్ ‘అరట్టయ్’(Arattai)లో గోప్యతకు పెద్దపీట వేస్తూ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను వేగంగా తీసుకువచ్చినట్లు ఆయన ఉదాహరణగా చెప్పారు.జపాన్ వర్సెస్ ఇండియాభారత మార్కెట్ కంటే జపాన్ మార్కెట్ కఠినంగా ఉంటుందనే వాదనను ఆయన ప్రస్తావిస్తూ.. జపనీస్ కంపెనీలు తమ దేశీయ కస్టమర్లు చాలా డిమాండింగ్ అని చెప్పుకుంటాయని, అయితే భారతీయ వినియోగదారులు కూడా ఏమాత్రం తక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు. నియంత్రణ అనుమతులు పొందడం లేదా వినియోగదారుల అవసరాలను తీర్చడం వంటి విషయాల్లో భారత మార్కెట్ సవాలుతో కూడుకున్నదైనా అది సంస్థలను ప్రపంచ స్థాయికి ఎదగడానికి సిద్ధం చేస్తుందని ఆయన విశ్లేషించారు.ఇదీ చదవండి: డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు -
‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..
భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పే, ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ‘గూగుల్ పే ఫ్లెక్స్’ (Google Pay Flex) క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. రూపే నెట్వర్క్తో పనిచేసే ఈ కార్డ్ వినియోగదారులకు నేరుగా యూపీఐ ఎకోసిస్టమ్ ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇండియాలో ఇలాంటి కార్డు అందులోబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.యూపీఐ సౌలభ్యం..ప్రస్తుతం భారత్లో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయ్యాయి. క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించి చెల్లింపులు చేసే వెసులుబాటును ఈ కొత్త కార్డ్ మరింత సులభతరం చేస్తోంది. ప్రజలు ప్రతిరోజూ చేసే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.ప్రత్యేకతలు ఇవే..ఈ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.ఇందులో ఒక పాయింట్ ఒక రూపాయి నిష్పత్తిలో ఉంటుంది.పాయింట్ల రెడీమ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా గూగుల్ పే ద్వారా తక్షణమే రీడీమ్ చేసుకోవచ్చు.ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా గూగుల్ పే యాప్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆమోదం పొందిన నిమిషాల్లోనే వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను వినియోగదారులు తమ గూగుల్ పే డాష్బోర్డ్ నుంచే నేరుగా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.కార్డును బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, పిన్ మార్చుకోవడం లేదా ఖర్చు పరిమితులను సెట్ చేసుకోవడం వంటివన్నీ గూగుల్ పే యాప్ నుంచే నిర్వహించవచ్చు.ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ‘మారుతున్న భారతీయుల డిజిటల్ ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించాం. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ నైపుణ్యం, గూగుల్ పే సాంకేతికత కలిసి వినియోగదారులకు భద్రతను, సౌకర్యాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.భద్రతకు పెద్ద పీటభౌతిక కార్డులు పోతాయనే భయం లేకుండా ఈ ‘డిజిటల్-ఫస్ట్’ డిజైన్ భద్రతను పెంచుతుంది. గూగుల్ పే లో ఉండే బహుళ స్థాయుల ఆథెంటికేషన్ కారణంగా లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రూపే నెట్వర్క్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు వ్యాపారుల వద్ద కూడా ఈ కార్డును స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఎక్కువగా వాడే తరాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ఈ ‘ఫ్లెక్స్’ కార్డ్ క్రెడిట్ కార్డుల వాడకాన్ని మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రారంభంలో ఆశావాహం.. సవాళ్ల సుడిగుండం! -
ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!
భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవంసంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.ఎయిరిండియా విషాదం..జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.ఆర్థిక, ఇండిగో సంక్షోభంవిమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒక్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తుపై ఆశలుఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సరి్టఫికేషన్ లభించింది. ఉద్యోగానికి అనువైన సంస్థగా 86 శాతం మంది ఉద్యోగులు ఎస్ఈఐఎల్ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తింపును పొందడం వరుసగా ఇది రెండోసారని వివరించింది. వ్యక్తిగత జీవితం–ఉద్యోగం మధ్య సమతుల్యత, ఉద్యోగుల ఎదుగుదలకు అవకాశాల కల్పన తదితర అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. -
తాజ్ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్సీఎల్) భాగస్వామ్య సంస్థ తాజ్ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్సీఎల్ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్ కుటుంబం తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్లో 74.99 శాతం వాటా పొందనుంది. కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్ 2030)లో భాగంగా అసెట్లైట్ క్యాపిటల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్సీఎ ల్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్మెంట్ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. కాగా.. భవిష్యత్ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్సీఎల్తో 2025 అక్టోబర్లో 256 గదుల తాజ్ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తాజ్ జీవీకే హోటల్స్ జేఎండీ కృష్ణ భూపాల్ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్తోపాటు.. తాజ్ జీవీకే పోర్ట్ఫోలియోలో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ క్లబ్హౌస్ (చెన్నై), తాజ్ చండీగఢ్, వివాంతా హైదరాబాద్(బేగంపేట) ఉన్నాయి. -
రిలయన్స్ కన్జూమర్ చేతికి ఉదయమ్స్
చెన్నై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా తమిళనాడు సంస్థ ఉదయమ్స్లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. అయితే వాటా కొనుగోలు విలువ వెల్లడికాలేదు. ఒప్పందం ప్రకారం ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెలో గత ప్రమోటర్లు ఎస్.సుధాకర్, ఎస్.దినకర్ మైనారిటీ వాటాతో కొనసాగనున్నారు. ఉదయమ్ బ్రాండుతో మూడు దశాబ్దాలుగా తమిళనాడు మార్కెట్లో కంపెనీ పటిష్ట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పంపిణీ నెట్వర్క్ ద్వారా బియ్యం, మసాలా దినుసులు, ఇడ్లీ నూక, స్నాక్స్ తదితర నిత్యావసరాలు విక్రయిస్తోంది. -
ఆకాశమే హద్దు
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ విమానాశ్రయాల బిజినెస్పై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న ఐదేళ్లలో ఇందుకు రూ. లక్ష కోట్లు వెచి్చంచనున్నట్లు అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్, బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పేర్కొన్నారు. ఈ నెల 25న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ విమానాశ్రయ పరిశ్రమపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. వెరసి తదుపరి 11 ఎయిర్పోర్టుల బిడ్డింగ్లో మరింత భారీగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా ఏవియేషన్ రంగం వార్షిక పద్ధతిలో 15–16 శాతం విస్తరించవచ్చునని అంచనా వేశారు. గ్రూప్ విమానాశ్రయ పోర్ట్ఫోలియోలో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎన్ఎంఏఐఎల్) తాజాగా చేరనుంది. తద్వారా దేశీ ఏవియేషన్ రంగంలో కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఎన్ఎంఏఐఎల్లో అదానీ గ్రూప్ వాటా 74% కాగా.. 2025 డిసెంబర్ 25న వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలకు తెరతీయనుంది. రూ. 19,650 కోట్లు అదానీ గ్రూప్ రూ. 19,650 కోట్ల తొలి దశ పెట్టుబడులతో ఎన్ఎంఏఐఎల్ను అభివృద్ధి చేసింది. వార్షికంగా 2 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటైంది. తదుపరి సామర్థ్యాన్ని 9 కోట్లమంది ప్రయాణికులకు అనువుగా విస్తరించనుంది. తద్వారా ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుర్కొంటున్న సామర్థ్య సవాళ్లకు చెక్ పెట్టనుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్)ను జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరులోనూ ఎయిర్పోర్టులను నిర్వహిస్తోంది. -
శ్రీరామ్ ఫైనాన్స్పై మిత్సుబిషి ఫోకస్
ఇటీవల దేశీ ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఆర్బీఎల్ బ్యాంక్లో ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోగా, యస్ బ్యాంక్లో జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ సైతం 25 శాతం వాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా ఎన్బీఎఫ్సీ.. శ్రీరామ్ ఫైనాన్స్లో జపనీస్ దిగ్గజం ఎంయూఎఫ్జీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. శ్రీరామ్ ఫైనాన్స్లో జపనీస్ దిగ్గజం మిత్సుబిషీ యూఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్(ఎంయూఎఫ్జీ) 20 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రెండు సంస్థలు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు అనుగుణంగా శ్రీరామ్ ఫైనాన్స్ 47.11 కోట్ల ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 840.93 ధరలో వీటిని ఎంయూఎఫ్జీ కొనుగోలు చేయనుంది. తద్వారా శ్రీరామ్ ఫైనాన్స్లో 4.4 బిలియన్ డాలర్లు(రూ. 39,618 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఇది నిలవనుంది. తాజా డీల్.. దేశీ ఫైనాన్షియల్ రంగ పటిష్టత, వృద్ధి అవకాశాలపట్ల విశ్వాసానికి ప్రతీకగా శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ ఉమేష్ రేవంకర్ పేర్కొన్నారు. వాటాదారుల అనుమతి, నియంత్రణ సంస్థల క్లియరెన్స్ల తదుపరి ఎంయూఎఫ్జీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వెల్లడించింది. తాజా నిధులు సంస్థ మూలధన పటిష్టతకు, దీర్ఘకాలిక వృద్ధికి సహకరిస్తాయని తెలియజేసింది. ఎంయూఎఫ్జీతో భాగస్వామ్యం చౌక నిధుల సమీకరణ, మెరుగైన క్రెడిట్ రేటింగ్స్కు వీలు కలి్పంచడంతోపాటు, పాలన, నిర్వహణలో ప్రపంచ ప్రమాణాల సరసన నిలుపుతుందని పేర్కొంది. శ్రీరామ్ ఫైనాన్స్ వృద్ధికి మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎంయూఎఫ్జీ గ్రూప్ సీఈవో హిరొనోరీ కమెజావా పేర్కొన్నారు. తద్వారా భారత్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. ఇద్దరు డైరెక్టర్లు శ్రీరామ్ ఫైనాన్స్లో 20 శాతం వాటా చేజిక్కించుకున్నాక బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను నియమించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎంయూఎఫ్జీ వెల్లడించింది. భారత్లో యొకొహామా స్పెసీ బ్యాంక్ ముంబై బ్రాంచ్తో 1,894లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ 1.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి కలి్పంచింది. గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ప్రారంభించిన తొలి జపనీస్ బ్యాంక్గా నిలుస్తోంది. 2023లో డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసులందిస్తున్న ఎన్బీఎఫ్సీ డీఎంఐ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యూఏఈలో రెండో పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్లో దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్లో 60 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచి్చంచింది. అంతకుముందే మరో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) 24 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 16,330 కోట్లకుపైగా వెచ్చించింది. -
ఇండస్ఇండ్లో వాటా పెంపు
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. మరో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు తాజాగా వీలు చిక్కింది. ఇందుకు ఆర్బీఐ అనుమతించింది. దీంతో ఇండస్ఇండ్లో వాటాను 9.5 శాతంవరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచుకోనుంది. వాటా పెంపునకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ తాజాగా ఆమోదించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ 9.5 శాతంవరకూ వాటా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలియజేసింది.వెరసి ఇండస్ఇండ్లో మొత్తం 9.5 శాతానికి మించకుండా చెల్లించిన మూలధనంలో వాటా లేదా వోటింగ్ హక్కులను హెచ్డీఎఫ్సీ సొంతం చేసుకోవచ్చునని పేర్కొంది. కాగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అనుమతి లభించిన ఏడాదిలోగా వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుందని, లేకుంటే అనుమతులు రద్దవుతాయని వివరించింది. తాజా అనుమతికి ముందు 5 శాతంకంటే తక్కువ వాటా కలిగి ఉంటే.. మరో 5 శాతం(9.5 శాతంవరకూ) వాటాను సొంతం చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డులో దరఖాస్తుదారు(హెచ్డీఎఫ్సీ బ్యాంక్) రిప్రజెంటేషన్కు అనుమతించరు. -
200 దేశాలకు భారత ఔషధాలు!
భారత్ అంతర్జాతీయంగా నాణ్యమైన ఔషధాలను చౌక ధరలకే అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 10 శాతం వృద్ధితో 30.47 బిలియన్ డాలర్లకు చేరినట్టు చెప్పారు.చండీగఢ్లో ఫార్మా ఎగుమతులపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా మాట్లడారు. ఔషధాల ఉత్పత్తిలో (పరిణామం పరంగా) భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని, విలువ పరంగా 14వ స్థానంలో ఉందన్నారు. భారత ఔషధాలు 200కు పైగా దేశాలకు వెళుతున్నట్టు తెలిపారు. ఇందులో అమెరికాకు 34 శాతం, యూరప్కు 19 శాతం ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ యూనిట్లతో కార్యకలాపాలు నిర్వరహిస్తున్నట్టు వెల్లడించారు.సుంకాలేతర అవరోధాల పరిష్కారం, నియంత్రణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, పటిష్టమైన లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల ఎకోసిస్టమ్ ఏర్పాటుపై దృష్టి సారించినట్టు చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2030 నాటికి రెట్టింపై 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. -
రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (కేఏఎల్) మాజీ ఉద్యోగులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.312 కోట్ల వేతన బకాయిలను కంపెనీ మాజీ ఉద్యోగులకు చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అధికారిక లిక్విడేటర్కు ఈడీ బదిలీ చేసింది.గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఈడీ అప్పగించిన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. సెక్యూర్డ్ క్రెడిటర్ల (బ్యాంకుల) క్లెయిమ్ల కంటే కార్మికుల బకాయిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎస్బీఐ అంగీకరించింది.మనీలాండరింగ్ కేసు నేపథ్యంవేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో 2016లో విజయ్ మాల్యా లండన్కు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ, మాల్యాను జనవరి 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఇప్పటివరకు మాల్యా, కింగ్ఫిషర్ సంస్థలకు చెందిన దాదాపు రూ.5,042 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అదనంగా రూ.1,695 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.రికవరీలో..ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో జప్తు చేసిన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియానికి అప్పగించింది. వీటి విక్రయం ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు దాదాపు రూ.14,132 కోట్లు వసూలు చేసుకున్నాయి. ‘దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల బకాయిలను పరిష్కరించడానికి మేము వాటాదారులతో సమన్వయం చేసుకున్నాం. ఎస్బీఐ అధికారులతో చర్చించి పునరుద్ధరించిన ఆస్తుల ద్వారా ఉద్యోగుల క్లెయిమ్లను చెల్లించేలా చొరవ తీసుకున్నాం’ అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడిన తర్వాత జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.ఇదీ చదవండి: సత్య సారథ్యంలో సమూల మార్పులు! -
సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.పాత పద్ధతులకు స్వస్తి‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు
ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బు కలిగి ఉన్న ఫ్యామిలీల జాబితా విడుదలైంది. అర ట్రిలియన్ డాలర్లతో వాల్టన్ కుటుంబం ఇందులో రికార్డు సృష్టిస్తే, టాప్-10లో పాగా వేసి అంబానీ ఫ్యామిలీ సత్తా చాటింది. 2025లో అధికంగా ప్రపంచ సంపద ఎవరి గుప్పిట్లో ఉందో తెలియజేస్తూ బ్లూమ్బెర్గ్ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని అంశాల ప్రకారం..ప్రపంచంలోని టాప్ 25 ధనిక కుటుంబాల సంపద 2.9 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.గత ఏడాది కంటే ఈసారి సంపదలో 358.7 బిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది.ఈ ఏడాది నాలుగు వేర్వేరు ఖండాల నుంచి కొత్త కుటుంబాలు ఈ జాబితాలో చేరాయి. మెక్సికోకు చెందిన లారియా మోటా వెలాస్కో, చిలీకి చెందిన లుక్సిక్స్, ఇటలీకి చెందిన డెల్ వెచియోస్, సౌదీకి చెందిన ఒలయాన్స్ కుటుంబాలు మొదటిసారి ఈ ఎలైట్ క్లబ్లో చోటు దక్కించుకున్నాయి.అగ్రస్థానంలో వాల్టన్ ఫ్యామిలీఅమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ వ్యవస్థాపక కుటుంబం(వాల్టన్ ఫ్యామిలీ) తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వీరి నికర విలువ అర ట్రిలియన్ డాలర్లకు పైగా ఉండటం విశేషం. దశాబ్దాలుగా రిటైల్ రంగంలో వీరు చూపుతున్న ప్రభావం తిరుగులేనిదిగా ఉంది.పుంజుకున్న రాజకుటుంబాలుఈ ఏడాది జాబితాలో మిడిల్ ఈస్ట్ దేశాల హవా స్పష్టంగా కనిపిస్తోంది1. అల్ నహ్యాన్ కుటుంబం (UAE): యూఏఈ పాలక కుటుంబం ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది.2. అల్ సౌద్ కుటుంబం (Saudi Arabia): సౌదీ రాజకుటుంబం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2024లో 6వ స్థానంలో ఉన్న వీరు 2025 నాటికి 3వ స్థానానికి ఎగబాకారు.3. అల్ థానీ కుటుంబం (Qatar): ఖతార్ రాజకుటుంబం జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతోంది.ఎనిమిదో స్థానంలో అంబానీ కుటుంబంభారతదేశానికి చెందిన అంబానీ కుటుంబం మరోసారి ప్రపంచ వేదికపై తన సత్తా చాటింది. 105.6 బిలియన్ డాలర్ల నికర విలువతో బ్లూమ్బెర్గ్ టాప్ 25 జాబితాలో అంబానీలు 8వ స్థానంలో నిలిచారు. 1950లలో ధీరూభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఈ గ్రూప్ పెట్రోకెమికల్స్ నుంచి టెలికాం, రిటైల్ వరకు దాదాపు అన్ని రంగాల్లో విస్తరించి భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: నిధుల నిర్వహణలో పారదర్శకతటాప్ 10 రిచ్ ఫ్యామిలీలు..రాంక్కుటుంబందేశం/ప్రాంతంఅంచనా సంపద(డాలర్లలో)కీలక వ్యాపార సామ్రాజ్యం1వాల్టన్యూఎస్ఏ513.4 బిలియన్లువాల్మార్ట్ (రిటైల్)2అల్ నహ్యాన్యుఎఐ (అబుదాబి)335.9 బిలియన్లుచమురు, AI, పెట్టుబడులు3అల్ సౌద్సౌదీ అరేబియా213.6 బిలియన్లుసౌదీ అరామ్కో4అల్ థానిఖతార్199.5 బిలియన్లునేచురల్ గ్యాస్, రియల్ ఎస్టేట్5హీర్మేస్ఫ్రాన్స్184.5 బిలియన్లుహెర్మేస్ (లగ్జరీ ఫ్యాషన్)6కోచ్యూఎస్ఏ150.5 బిలియన్లుకోచ్ ఇండస్ట్రీస్7మార్స్యూఎస్ఏ143.4 బిలియన్లుపెంపుడు జంతువుల సంరక్షణ8అంబానీభారతదేశం105.6 బిలియన్లురిలయన్స్ ఇండస్ట్రీస్9వెర్థీమర్ఫ్రాన్స్85.6 బిలియన్లుచానెల్ (లగ్జరీ బ్రాండ్)10థామ్సన్కెనడా82.1 బిలియన్లుథామ్సన్ రాయిటర్స్ (మీడియా/డేటా) -
కైనెటిక్ టెక్నాలజీస్లో సైయెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పవర్ మేనేజ్మెంట్ సంస్థ కైనెటిక్ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనున్నట్లు సైయెంట్ సెమీకండక్టర్స్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 93 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 840 కోట్లు). 40 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే పవర్ సెమీకండక్టర్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని సీఈవో సుమన్ నారాయణ్ తెలిపారు. అలాగే డేటా సెంటర్లు, ఎలక్ట్రిఫికేషన్, ఆటోమోటివ్, నెట్వర్కింగ్ తదితర విభాగాల్లో విస్తరించేందుకు తోడ్పడనుందన్నారు. -
స్లో అయినా తగ్గని ఫ్లో
దేశీయంగా వెల్లువెత్తుతున్న స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ముందున్నాయి! ఈ బాటలో మహిళలు తెరతీస్తున్న స్టార్టప్లు సైతం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: దేశీయంగా టెక్ స్టార్టప్లకు ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) 10.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. గతేడాది(2024) అందుకున్న 12.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17 శాతం తగ్గాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూఎస్, యూకే తదుపరి భారత్ మూడో ర్యాంకులో నిలవడం గమనార్హం! ఈ బాటలో చైనా, జర్మనీ కంటే ముందు నిలవడం విశేషం! మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ట్రాక్షన్ నివేదిక వివరాలివి. వీటి ప్రకారం స్టార్టప్ల ఫండింగ్లో దేశీయంగా బెంగళూరు, ముంబై టాప్ ర్యాంకును కొల్లగొట్టాయి. కాగా.. దేశీ టెక్ స్టార్టప్లు 2023లో 11 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే తాజాగా నిధుల సమీకరణ 4 శాతం క్షీణించింది. దశలవారీగా విభిన్నం టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు వివిధ దశలలో విభిన్నంగా నమోదయ్యాయి. ఈ ఏడాది సీడ్ దశలో 1.1 బిలియన్ డాలర్లు లభించగా.. 2024తో పోలిస్తే 30 శాతం నీరసించాయి. 2023తో చూసినా ఇది 25 శాతం క్షీణత. ఇక తొలి దశ ఫండింగ్ 7 శాతం పుంజుకుని 3.9 బిలియన్ డాలర్లను తాకింది. 2024లో ఇది 3.7 బిలియన్ డాలర్లుకాగా.. 2023లో సాధించిన 3.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 11 శాతం అధికం. వృద్ధికి సిద్ధంగా ఉన్న, బలపడే వీలున్న టెక్ స్టార్టప్లపట్ల గ్లోబల్ ఇన్వెస్టర్లలోగల విశ్వాసాన్ని తాజా ట్రెండ్ ప్రతిబింబిస్తోంది. అయితే చివరిదశ స్టార్టప్లు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో వెనకడుగు వేశాయి. 2024లో 7.5 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా.. ప్రస్తుత ఏడాది 26 శాతం తక్కువగా 5.5 బిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి. క్రమశిక్షణాయుతంగా దేశీ టెక్ స్టార్టప్లలో క్రమశిక్షణాయుత పెట్టు బడులు నమోదవుతున్నట్లు ట్రాక్షన్ సహవ్యవస్థా్థపకుడు నేహా సింగ్ పేర్కొన్నారు. తొలి దశ ఫండింగ్లో పెట్టుబడులు కొనసాగుతుండటం, ఐపీవో యాక్టివిటీ పుంజుకోవడం, యూనికార్న్ల ఆవిర్భావంలో నిలకడ వంటి అంశాలు బలపడిన ఎకోసిస్టమ్ను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వృద్ధికి వీలున్న, అత్యంత నాణ్యమైన బిజినెస్లకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, రిటైల్, ఫిన్టెక్ సంస్థల పట్ల ఆసక్తి కనిపిస్తున్నట్లు వివరించారు. భారీ డీల్స్.. ఈ ఏడాది దేశీయంగా 10 కోట్ల డాలర్లకుపైబడిన 14 పెట్టుబడి రౌండ్లు నమోదయ్యాయి. 2024లో ఇవి 19కాగా.. 2023లో ఈ తరహా 16 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ టెక్, ఎని్వ రాన్మెంట్ టెక్, ఆటో టెక్ రంగాలలో భారీ డీల్స్ నమోదవుతున్నాయి. వీటిలో బిలియన్ డాలర్ల ఎరిషా ఈ మొబిలిటీ డీ రౌండ్, 30 కోట్ల డాలర్ల జెప్టో సిరీస్ హెచ్ రౌండ్, 27.5 కోట్ల డాలర్ల గ్రీన్లైన్ సిరీస్ ఏ ఫండింగ్ను చెప్పుకోదగ్గ డీల్స్గా నివేదిక ప్రస్తావించింది. ఆయా సంస్థల మెచ్యూరిటీ, విలువ, భిన్న లక్ష్యాల ఆధారంగా స్టార్టప్ల ఫండింగ్లో ఏ, డీ, హెచ్ తదితర రౌండ్ల(సిరీస్లు)కు తెరతీసే సంగతి తెలిసిందే.మహిళా సంస్థలుదేశీయంగా మహిళలు సహవ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన టెక్ స్టార్టప్లు ఈ ఏడాది బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. వీటిలో 6.2 కోట్ల డాలర్ల జివా సిరీస్ సి, 5.2 కోట్ల డాలర్ల ఆమ్నెక్స్ సిరీస్ ఏలను నివేదిక పేర్కొంది. రిటైల్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అత్యధికంగా నిధులు అందుకున్న రంగాలుకాగా.. ఇందుకు బ్రాండ్ ఆధారిత ఎగ్జిక్యూషన్, పటిష్ట కన్జూమర్ డిమాండ్, ఎంటర్ప్రైజ్ నిర్వహణ ప్రభావం చూపాయి. మహిళలు తెరతీసిన స్టార్టప్లలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ ముందున్నాయి. -
భారతీ ఎయిర్టెల్కు నూతన సారథి
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మేనేజ్మెంట్ నిర్మాణంలో కీలక మార్పులను ప్రకటించింది. సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా శశ్వత్ శర్మ నియమితులయ్యారు. ఈ మార్పులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.ప్రస్తుతం ఎయిర్టెల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశ్వత్ శర్మ ఐదేళ్ల పాటు ఈ ఉన్నత పదవిని చేపట్టనున్నారు. హెచ్ఆర్, నామినేషన్ కమిటీ సిఫార్సుల మేరకు డిసెంబర్ 18న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శశ్వత్ శర్మ ఇకపై సంస్థ కీలక నిర్వాహక సిబ్బంది(KMP)గా కూడా వ్యవహరిస్తారు.గోపాల్ విట్టల్కు పదోన్నతిప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న గోపాల్ విట్టల్ ఇకపై ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జనవరి 1, 2026 నుంచి ఆయన ఐదేళ్ల పాటు పూర్తికాల డైరెక్టర్గా కొనసాగుతారు. సంస్థ వ్యూహాత్మక అభివృద్ధిలో ఆయన తన మార్గదర్శకత్వాన్ని కొనసాగించనున్నారు.ఇదీ చదవండి: పార్లమెంట్లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం! -
ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.ఎన్హెచ్ఏఐ ఏం చెబుతోంది?బెంగళూరులోని ఎన్హెచ్-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్హెచ్-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.పారదర్శకత ఎక్కడ?క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్హెచ్ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.To enhance transparency and improve ease of travel for National Highway users, NHAI is installing QR code-based information boards on key National Highway corridors in #Bengaluru. These QR boards are currently available on Bengaluru–Nelamangala section of NH-48 and… pic.twitter.com/jzgAfGQwnj— NHAI (@NHAI_Official) December 15, 2025ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలుక్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.‘ప్రాజెక్ట్ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం! -
స్టీల్కు పెరగనున్న డిమాండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో స్టీల్కు డిమాండ్ 8 శాతం పుంజుకోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా అంచనా వేసింది. అయితే పోటీధరల కారణంగా స్టీల్ తయారీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిళ్లకు అవకాశమున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. స్టీల్ పరిశ్రమ నిర్వహణలాభ మార్జిన్ నిలకడగా 12.5 శాతం స్థాయిలో నమోదుకావచ్చని అభిప్రాయపడింది. వెరసి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు గతంలో వేసిన అంచనాలను సవరించింది.కాగా.. ఈ ఏడాది స్టీల్ డిమాండ్ 8 శాతం స్థాయిలో పటిష్టంగా నమోదుకావచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా కార్పొరేట్ రంగ రేటింగ్స్ గ్రూప్ హెడ్ గిరీష్కుమార్ కడమ్ తెలియజేశారు. అయితే సరఫరాలు పెరగనుండటంతో తాత్కాలికంగా డిమాండును మించి సరఫరాకు వీలున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా స్టీల్ ధరలపై ఒత్తిళ్లు కొనసాగవచ్చని తెలియజేశారు. సేఫ్గార్డ్ డ్యూటీ రక్షణ ఇక్రా నివేదిక ప్రకారం దేశీయంగా హాట్రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ) ధరలు 2025 ఏప్రిల్లో టన్నుకి రూ. 52,850కు ఎగశాయి. సేఫ్గార్డ్ డ్యూటీ విధింపు ఇందుకు సహకరించింది. ఆపై నవంబర్కల్లా టన్ను ధర తిరిగి రూ. 46,000కు దిగివచ్చింది. దిగుమతి ధరలకంటే దిగువకు చేరింది. వ్యవస్థాగత అంశాల కారణంగా ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) తొలి 9 నెలల్లో చైనా స్టీల్ ఎగుమతులు 8.8 కోట్ల టన్నులను తాకాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. దీంతో ప్రపంచ స్టీల్ ధరలపై ప్రతికూల ప్రభావం పడింది.ఈ ఏప్రిల్–సెప్టెంబర్లో చైనా హెచ్ఆర్సీ ఎగుమతి ధరలు సగటున టన్నుకి 465 యూఎస్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం నమోదైన 496 డాలర్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా ఫినిష్డ్(తుది ఉత్పత్తి) స్టీల్ దిగుమతులు వార్షికంగా 33 శాతం క్షీణించాయి. దీంతో చౌక దిగుమతులను అడ్డుకునేందుకు సేఫ్గార్డ్ డ్యూటీ కొనసాగింపు కీలకమని ఇక్రా పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం దేశీ హెచ్ఆర్సీ ధరలు 2026 మార్చివరకూ సగటున టన్నుకి రూ. 50,500గా కొనసాగే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా టన్ను స్టీల్ ఉత్పత్తిపై నిర్వహణ లాభం గతేడాది(2024–25)లో నమోదైన 110 డాలర్ల నుంచి 108 డాలర్లకు నీరసించవచ్చని తెలియజేసింది. వెరసి స్టీల్ రంగానికి నిలకడతోకూడిన ఔట్లుక్ ప్రకటించింది.సామర్థ్య విస్తరణ ఎఫెక్ట్ దేశీయంగా స్టీల్ పరిశ్రమలో భారీ సామర్థ్య విస్తరణ ప్రణాళికలు అమలవుతున్న కారణంగా రిసు్కలు పెరగవచ్చని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం 2026–31 మధ్య కాలంలో దేశీ స్టీల్ పరిశ్రమలు 8–8.5 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని అదనంగా జత కలుపుకునే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇందుకు 4.5–5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 45,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచనున్నాయి. అయితే తగినస్థాయిలో విక్రయాలు, ఆర్జన మెరుగుపడకపోతే భారీ పెట్టుబడుల కారణంగా మధ్యకాలానికి స్టీల్ పరిశ్రమ రుణభారం పెరిగిపోయే అవకాశముంది.ఇక మరోపక్క దేశీయంగా మొత్తం డిమాండ్లో గ్రీన్ స్టీల్ వాటా 2029–30 కల్లా 2 శాతానికి(4 మిలియన్ టన్నులు) బలపడవచ్చని గ్రీన్ స్టీల్పై గిరీ‹Ùకుమార్ స్పందించారు. ఈ బాటలో 2049–50కల్లా దాదాపు 40 శాతానికి(150 ఎంటీ)కి చేరవచ్చని అంచనా వేశారు. గ్రీన్ హైడ్రోజన్ ధరలు కేజీకి 1.5–1.6 డాలర్లకు క్షీణిస్తేనే గ్రీన్ స్టీల్ తయారీ ఊపందుకుంటుందని తెలియజేశారు. అయితే సమీప భవిష్యత్లో గ్రీన్ హైడ్రోజన్ ధరలు దిగిరాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. -
డ్రైవర్ల పంట పండించే ‘భారత్ ట్యాక్సీ’
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1, 2026 నుంచి రవాణా విభాగంలో ఒక కొత్త విప్లవం రాబోతోంది. ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ దిగ్గజాల ఆధిపత్యంలో ఉన్న ఆన్లైన్ ట్యాక్సీ మార్కెట్లోకి ప్రభుత్వ మద్దతుతో ‘భారత్ ట్యాక్సీ’(Bharat Taxi) సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు, తక్కువ కమిషన్లతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది.భారత్ ట్యాక్సీప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ యాప్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తరహాలో పనిచేసే అవకాశం ఉంది. ఇది ఒక ప్రైవేట్ లాభాపేక్ష కలిగిన సంస్థలా కాకుండా డ్రైవర్లను, ప్రయాణికులను నేరుగా అనుసంధానించే వేదికగా పనిచేస్తుంది. ఇందులో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటోలు, బైక్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది కాబట్టి భద్రత, పారదర్శకత ఎక్కువగా ఉంటాయి.డ్రైవర్లకు చేకూరే ప్రయోజనాలుప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో 25% నుంచి 30% వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి. దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని అభిప్రాయాలున్నాయి. భారత్ ట్యాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయంలో 80% నేరుగా డ్రైవర్కే చెందుతుంది. మిగిలిన 20% నిర్వహణ ఖర్చులు, ఇతర పన్నులకు పోతుంది. తక్కువ కమిషన్ భారం వల్ల డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ అనుసంధానంతో ఉండటం వల్ల పేమెంట్స్ విషయంలో జాప్యం తగ్గుతుంది.ప్రయాణికులకు కలిగే లాభాలుప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో ఎక్కువ ధరలు), డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్లకు భారత్ ట్యాక్సీ చెక్ పెట్టనుంది. కంపెనీ తీసుకునే కమిషన్ తగ్గడం వల్ల సహజంగానే ప్రయాణికులపై పడే భారం తగ్గుతుంది. సాధారణ సమయాల్లోనూ, రద్దీ సమయాల్లోనూ స్థిరమైన ధరలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.భారత్ ట్యాక్సీ రాకతో రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం, ప్రయాణికులకు తక్కువ ధరలో సురక్షితమైన ప్రయాణం లభించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు -
రైల్వే వాలెట్ నుంచి నగదు విత్డ్రా కుదరదు
భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత వేగంగా టికెట్ బుకింగ్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఐఆర్సీటీసీ (IRCTC) ఈ-వాలెట్’ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవడం (Withdrawal) సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, దీనివల్ల రైల్వేకు చేకూరే ప్రయోజనాలను చూద్దాం.లోక్సభలో మంత్రి వివరణలోక్సభలో ఒక సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కింది అంశాలను వెల్లడించారు.ఐఆర్సీటీసీ వాలెట్లో ఉన్న డబ్బును కేవలం రైలు టికెట్ల బుకింగ్కు మాత్రమే ఉపయోగించుకోవాలి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్’ నిబంధనల ప్రకారం.. ఈ తరహా క్లోజ్డ్ వాలెట్ల నుంచి నగదును విత్డ్రా చేయడానికి వీల్లేదు.ఒకవేళ వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకుంటే మాత్రమే అందులోని నగదును వారి సోర్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.విత్డ్రాకు అనుమతించకపోవడానికి కారణాలుఐఆర్సీటీసీ వాలెట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్. అంటే ఏ సంస్థ అయితే వాలెట్ సేవలను అందిస్తుందో ఆ సంస్థ సర్వీసులను మాత్రమే ఆ నగదును వాడాలి. దీన్ని నగదుగా మారిస్తే అది బ్యాంకింగ్ కార్యకలాపాల కిందకు వస్తుంది. దానికి వేరే రకమైన నిబంధనలు ఉంటాయి.నగదు విత్డ్రా సౌకర్యం ఉంటే దీన్ని కొందరు నగదు బదిలీకి లేదా ఇతర మనీ లాండరింగ్ అవసరాలకు వాడే అవకాశం ఉంటుంది. కేవలం ప్రయాణికుల అవసరాల కోసమే పరిమితం చేశారు.నిత్యం వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఐఆర్సీటీసీలో ప్రతి చిన్న మొత్తాన్ని వెనక్కి పంపడం వల్ల అకౌంటింగ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది.రైల్వేకు కలిగే ప్రయోజనాలులక్షలాది మంది ప్రయాణికులు వాలెట్లో ఉంచే సొమ్ము రైల్వే వద్ద ముందే జమ అవుతుంది. ఈ ‘ఫ్లోట్ మనీ’ ద్వారా రైల్వేకు వడ్డీ రూపంలో లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.ప్రయాణికులు బ్యాంక్ కార్డులు లేదా యూపీఐ వాడితే రైల్వే కొంత సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాలెట్ వాడకం వల్ల ఈ లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి.తత్కాల్ సమయాల్లో పేమెంట్ గేట్వేలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాలెట్ లావాదేవీలు అంతర్గతంగా జరుగుతాయి కాబట్టి, సర్వర్పై భారం తగ్గి బుకింగ్ వేగం పెరుగుతుంది.ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలుఐఆర్సీటీసీ వాలెట్ వాడటం వల్ల ప్రయాణికులకు ప్రధానంగా సమయం ఆదా అవుతుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు పేమెంట్ గేట్వే రిడైరెక్షన్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వాలెట్ ద్వారా కేవలం సెకన్లలోనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎంతో కీలకం. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది. వీటన్నింటికీ మించి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా లేదా వెయిటింగ్ లిస్ట్ కారణంగా బుకింగ్ కాకపోయినా దానికి సంబంధించిన రీఫండ్ సొమ్ము వెంటనే వాలెట్కు చేరుతుంది. సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్లలా దీని కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.ప్రతికూలతలుమరోవైపు ఈ వాలెట్ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాలెట్లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి బ్యాంక్ ఖాతాకు విత్డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు లేనప్పుడు ఆ డబ్బు వ్యాలెట్లోనే నిలిచిపోతుంది. దీనివల్ల అవసరానికి ఆ నగదును వాడుకోలేరు. అలాగే ఈ డబ్బు వినియోగానికి పరిమితులు ఉంటాయి. దీన్ని కేవలం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో టికెట్లు కొనడానికి తప్ప ఇతర వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర వెబ్సైట్లలో వాడలేం. ఒకవేళ వాలెట్లోని డబ్బును తిరిగి పొందాలంటే వినియోగదారుడు తన ఐఆర్సీటీసీ వాలెట్ ఖాతాను శాశ్వతంగా మూసివేయాల్సి ఉంటుంది. నగదు కోసం ఖాతాను రద్దు చేసుకోవాల్సి రావడం ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే.. -
వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..
భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్వర్క్ దీపిందర్ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.తొలి ప్రయత్నంలోనే మూడో స్థానంప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.టాప్-10 సెల్ఫ్మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ 2025ర్యాంక్వ్యాపారవేత్తలుకంపెనీ పేరు1దీపిందర్ గోయల్ఎటర్నెల్ (జొమాటో)2రాధాకృష్ణ దమానీడీమార్ట్3రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ఇండిగో4అభయ్ సోయిమ్యాక్స్ హెల్త్ కేర్5శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డిస్విగ్గీ6దీప్ కర్లా, రాజేశ్ మాగౌమేక్ మై ట్రిప్7యాశిష్ దహియా, అలోక్ బన్సల్పాలసీ బజార్8విజయ్ శేఖర్ శర్మపేటీఎం9ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్నైకా10పీయూష్ బన్సల్ & టీమ్లెన్స్కార్ట్ -
ఇన్సూరెన్స్ మార్కెట్లో ఎందుకింత ఒత్తిడి?
డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.ఈ పరిణామాలపై స్పందించిన అయాన్ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు. -
ఇది సక్సెస్ కాదు.. గిగ్ కార్మికుల గొడ్డు చాకిరీ!
క్విక్ కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికుల శ్రమను దోచుకుంటున్న వైనంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. గిగ్ కార్మికుల ఇబ్బందులను ఇటీవల ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు. ఆ మధ్య వైరల్ అయిన ఒక వీడియోను ఉదహరిస్తూ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో తాజాగా పోస్ట్ చేశారు.ఇందులో బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ శ్రమ దోపిడీకి గురైన వైనాన్ని వివరించారు. రోజంతా దాదాపు 15 గంటలు గొడ్డులా కష్టపడి 28 ఆర్డర్లు డెలివరీలు చేస్తే అతనికి లభించింది కేవలం రూ .763 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్లమెంటులో ఈ సమస్యను లేవనెత్తిన చద్దా.. "అధిక పని", "తక్కువ వేతనం"తో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేదని స్పష్టం చేశారు.‘ఇది గిగ్ ఎకానమీ విజయ గాథ కాదు.. డెలివరీ యాప్లు, వాటి అల్గోరిథంల వెనుక దాగి ఉన్న వ్యవస్థీకృత దోపిడీ’ అని అభివర్ణించిన చద్దా.. ప్రతి రోజూ లక్షలాది మంది కార్మికులు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో ఈ ఒక్క బ్లింకిట్ ఉదంతం తెలియజేస్తోందంటూ ట్వీట్ చేశారు. డిజిటల్ ప్లాట్ ఫామ్లు వేగంగా విస్తరించినప్పటికీ, కార్మికుల రక్షణ మాత్రం విస్మరణకు గురవుతోందన్నారు.రాఘవ్ చద్దా పోస్ట్ ‘ఎక్స్’లో విస్తృత చర్చకు దారితీసింది. కార్మిక చట్టాలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గిగ్ కార్మికుల పట్ల "క్రూరత్వం" నివారించడానికి 10 నిమిషాల డెలివరీ సేవలను నిషేధించాలని ఆప్ ఎంపీ గతంలోనే కోరారు. కఠినమైన సమయపాలనను చేరుకోవడానికి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.28 deliveries.15 hours of relentless work.₹763 earned.This is not a “gig economy success story”.This is systemic exploitation hidden behind apps & algorithms.I raised this issue in Parliament recently. Low pay, crushing targets, no job security, no dignity for gig… pic.twitter.com/gLwQbcE1iQ— Raghav Chadha (@raghav_chadha) December 16, 2025 -
ఈ వింటర్ వెకేషన్కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. సెలవ రోజులు గడిపేందుకే కాకుండా కాస్త రిలాక్స్ అయ్యేందుకు కూడా శీతాకాలం ట్రిప్లను భారతీయులు ఎంచుకుంటున్నారు. టెక్ హాస్పిటాలిటీ కంపెనీ ఎయిర్బీఎన్బీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.‘ఎయిర్బీఎన్బీ అంతర్గత డేటా ప్రకారం ఈ శీతాకాలం సీజన్లో గోవా, కేరళ, రాజస్థాన్, హిమాలయ ప్రాంత రాష్ట్రాలపై ట్రావెలర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బీచ్లు, బ్యాక్వాటర్లు, సంస్కృతి, శీతాకాలపు వాతావరణం, ఔట్డోర్ అనుభూతులు మొదలైన అంశాలు ఇందుకు సానుకూలంగా ఉంటున్నాయి‘ అని ఎయిర్బీఎన్బీ కంట్రీ హెడ్ అమన్ప్రీత్ బజాజ్ తెలిపారు.సానుకూల చల్లని వాతావరణం, ఆకర్షణీయమైన ప్రాంతాల దన్నుతో ప్రస్తుతం ఫేవరెట్ ట్రావెల్ సీజన్లలో శీతాకాలం కూడా చేరిందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను ఎయిర్బీఎన్బీ రూపొందించింది. 2,155 మంది పర్యాటకులు ఇందులో పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..లక్షద్వీప్లోని అగట్టి, గౌహతితో పాటు పంజాబ్లోని చిన్న నగరాలు, కేరళలో పెద్దగా తెలియని తీర ప్రాంత, బ్యాక్వాటర్స్ పట్టణాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది.యువ ట్రావెలర్లు .. వారణాసి, బృందావన్లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో పర్యటిస్తున్నారు.శీతాకాలంలో పర్యటించే వారిలో దాదాపు సగం మంది జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ వారే ఉంటున్నారు. చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన, అందమైన లొకేషన్స్ను ఆస్వాదించేందుకు శీతాకాలంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.సీజనల్ సెలవలను గడిపేందుకు శీతాకాలంలో ప్రయాణిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 30 శాతం మంది తెలిపారు. సేద తీరేందుకు ట్రావెల్ చేస్తున్నట్లు 30 శాతం మంది, సరికొత్త సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఈ సీజన్ను ఎంచుకుంటున్నట్లు 20 శాతం మంది వివరించారు.పర్యటనల విషయంలో ఎక్కువ శాతం మంది తమకు అత్యంత సన్నిహితులతోనే కలిసి వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. 50 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కలిసి వెళ్తుండగా, మూడో వంతు మంది.. స్నేహితులతో కలిసి వెళ్తున్నారు. రెండు మూడు తరాల కుటుంబ సభ్యులతో కలిసి తాము ట్రిప్లను ప్లాన్ చేస్తామని 30 శాతం మంది వివరించారు. గోవా బీచ్లు, కేరళ బ్యాక్వాటర్స్ నుంచి మనాలీ, ముస్సోరీలో పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రాలుగా ఉండే ఉదయ్పూర్, జైపూర్లాంటి నగరాల వరకు దేశీయంగా కొత్త ప్రాంతాల్లో పర్యటించడంపై, వాటి గురించి తెలుసుకోవడంపై ఆసక్తి పెరుగుతోంది. -
వేదాంతా విడదీతకు ఓకే
ముంబై: ప్రైవేటు రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్ల విడదీత ప్రణాళికకు తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఓకే చెప్పింది. దీంతో వివిధ బిజినెస్ విభాగాలను రంగాలవారీగా ఐదు స్వతంత్ర కంపెనీలుగా విడదీసేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. కంపెనీ విడదీత పథకానికి ట్రిబ్యునల్ ముంబై బెంచ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, ఐరన్ అండ్ స్టీల్, విద్యుత్ తదితర బిజినెస్లను విడిగా లిస్ట్ చేయనుంది. కాగా.. నవంబర్లో విచారణ తదుపరి బెంచ్ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.ఎన్సీఎల్టీ అనుమతి వేదాంతా ట్రాన్స్ఫార్మేషన్లో కీలక మైలురాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తాజా అనుమతితో విడదీత పథక అమలుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2023లోనే వేదాంతా బిజినెస్ల విడదీత ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా వేదాంతా పేరుతో అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐరన్ అండ్ స్టీల్తోపాటు.. పునర్వ్యవస్థీకరించిన వేదాంతా లిమిటెడ్గా ఐదు కంపెనీలకు తెరతీయనుంది. వేదాంతా లిమిటెడ్లో జింక్, సిల్వర్ బిజినెస్లు కొనసాగనున్నాయి. తాజా అనుమతితో వేదాంతా షేరు ఎన్ఎస్ఈలో 4% జంప్చేసి రూ. 573 వద్ద ముగిసింది. -
వంతారాలో లియోనెల్ మెస్సీ
గ్లోబల్ ఫుట్బాల్ ఐకాన్.. లియోనెల్ మెస్సీ 'అనంత్ అంబానీ' స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & పరిరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. వంతారాలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, ప్రకృతి & సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.మెస్సీతో పాటు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్కు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆ తరువాత అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహా ఆరతిలో పాల్గొని, ప్రపంచ శాంతి & ఐక్యత కోసం ప్రార్థించారు.వంతారాలో మెస్సీ .. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలను చూశారు. జంతువులకు అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు, పోషణ, సంరక్షణ పద్ధతులు చూసి ఆయన ఎంతో సంతోషించారు. ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు ఆహారం కూడా పెట్టారు.అనాథ & బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్లో, వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ & రాధిక అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా “లియోనెల్” అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో అత్యంత గుర్తుండిపోయే సంఘటన ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరిగింది. అక్కడ ఏనుగు పిల్ల 'మణిక్లాల్'తో మెస్సీ సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఆట ద్వారా జంతువులతో అనుబంధాన్ని చూపిస్తూ, ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష అని నిరూపించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి మనసులను ఆకట్టుకుంది. -
ఐఐటీ చదివి.. మీషో: బిలినీయర్ జాబితాలోకి విదిత్ ఆత్రే
ఈ-కామర్స్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మీషో లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదిత్ ఆత్రే(34) నికర విలువ మంగళవారం ఒక బిలియన్ డాలర్ మార్కును అధిగమించి.. బిలియనీర్ల క్లబ్లో చేరారు. మీషో షేర్లు ఒక్కసారిగా 13% పెరగడంతో అతని నికర విలువ రూ.9,142.87 కోట్లకు చేరుకుంది. ఐఐటీ ఢిల్లీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఐటీసీ, ఇన్మోబీ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన విదిత్ ఆత్రే.. మీషోకు సారథ్యం వహిస్తూ భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్కు స్ఫూర్తినిస్తున్నారు.1991లో జన్మించిన విదిత్ ఆత్రే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో 2012లో బీటెక్ పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ఢిల్లీలో చదవడం ఆయనకు బలమైన సాంకేతిక పునాదిని అందించింది. గ్రాడ్యుయేషన్ తరువాత ఆత్రే తన కెరీర్ను ఐటీసీ లిమిటెడ్లో ప్రారంభించారు. ఆయన జూన్ 2012 నుంచి మే 2014 వరకు చెన్నైలో ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో పనిచేశారు. ఆ తరువాత మొబైల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇన్మోబీ(InMobi) సంస్థలో జూన్ 2014 నుంచి జూన్ 2015 మధ్య బెంగుళూరులో పనిచేశారు.మీషో స్థాపనవృత్తిపరమైన అనుభవాన్ని మూటగట్టుకున్న తర్వాత ఆత్రే పారిశ్రామికవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2015 నుంచి ఆయన మీషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) నాయకత్వం వహిస్తున్నారు. మీషోను స్థాపించడంలో, దానిని విజయవంతమైన ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన దూరదృష్టితో భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా జీరో-కమీషన్ మోడల్తో విక్రేతలకు, చిరు వ్యాపారులకు ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చారు. తన నాయకత్వంలో మీషో వేగంగా ఎదిగింది. దీని ఫలితంగా ఆత్రే ఫోర్బ్స్ 30 అండర్ 30 (ఆసియా & ఇండియా, 2018), ఫార్చ్యూన్ 40 అండర్ 40 (2021) వంటి ప్రతిష్టాత్మక యువ నాయకత్వ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు.మీషో డిసెంబర్ 10న స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసి తన ఇష్యూ ధరకు ప్రీమియం వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజున రూ.111 ఐపీఓ ధర కంటే 53% ఎక్కువగా ముగించింది. మంగళవారం, స్టాక్ అసాధారణ ర్యాలీని కొనసాగించి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.193.50 కి చేరుకుంది.విదిత్ ఆత్రే నికర విలువమీషోలో విదిత్ ఆత్రేకు 11.1 శాతం వాటా ఉంది. షేరు ధర రూ.193.50 ఇంట్రాడే గరిష్టానికి చేరుకోవడంతో ఆయన వాటా విలువ రూ.9,142.87 కోట్లుగా ఉంది. అంటే సుమారు 1.005 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ బర్న్వాల్ 31.6 కోట్ల షేర్లతో రూ.6,114.6 కోట్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు. మీషో మార్కెట్ క్యాపిటలైజేషన్ పూర్తి ప్రాతిపదికన రూ.85,207.91 కోట్లుగా ఉంది. -
భారీగా పెరిగిన సంపద: మస్క్ నెట్వర్త్ ఎంతంటే?
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో పబ్లిక్గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.స్పేస్ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్ఎక్స్లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.స్పేస్ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది. -
బీమాలో 100 శాతం విదేశీ పెట్టుబడులు
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐలు) వాటాను 100 శాతానికి పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 2047కల్లా అందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించే యోచనతో ఈ వారంలో బిల్లును ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. సబ్కి బీమా సబ్కి రక్ష(బీమా చట్టాల సవరణ) చట్టం 2025 పేరుతో 1938 బీమా చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనుంది.జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ది అథారిటీ చట్టం 1999లో సవరణలకు బిల్లు వీలు కలి్పంచనుంది. తాజా సవరణల ద్వారా బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని ప్రస్తుత 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. అయితే చైర్మన్, ఎండీ లేదా సీఈవో పదవికి తప్పనిసరిగా భారత పౌరుడిని నియమించుకోవలసి ఉంటుంది.ఇదీ చదవండి: ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే! -
గ్రామీణ ఉపాధి పథకం: కొత్త పేరు ఇదే..
ఢిల్లీ, సాక్షి: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్ భారత్ - జీ- రామ్- జీ (గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెడుతోంది.బిల్లులోని ముఖ్యాంశాలుఇక నుంచి గ్రామ పంచాయతీల ద్వారా పనులకు ప్రణాళికలుప్రస్తుత పని దినాలు 100 నుంచి 125కు పెంపువ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రాకుండా ఉపాధి పనులు 60 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటువికసిత భారత్ లక్ష్యాలకనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనుల ప్రణాళికలువారానికోసారి కూలి చెల్లింపు తప్పనిసరిఏబీసీ కేటగిరీలుగా గ్రామ పంచాయతీల విభజనకేంద్రం నిర్ధారించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ నిధులు కేటాయింపు కేటాయింపునకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే వాటిని భరించే బాధ్యత రాష్ట్రాలదే. -
కో–లివింగ్.. ఇన్వెస్ట్మెంటే!
ఒకప్పుడు సింగిల్గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
నిధుల సమీకరణలో పర్సెప్టైన్
ఏఐ రోబోటిక్స్ అంకుర సంస్థ పర్సెప్టైన్ వచ్చే ఏడాది మరింతగా నిధులను సమీకరించడంపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రూ. 30 కోట్లు సేకరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు జగ్గరాజు నడింపల్లి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా చెప్పారు. ఇంటెల్ సీఈవో తదితరులు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పారు. గణనీయంగా పెరుగుతున్న క్లయింట్లకు తగ్గట్లుగా ఉత్పత్తులను అందించే సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఆమ్ని, యునో, డ్యుయో అనే మూడు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆటోమోటివ్, ఎల్రక్టానిక్స్ తదితర విభాగాల్లో తమకు క్లయింట్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏటా తొమ్మిది వేల పైచిలుకు రోబోలు దిగుమతవుతున్నాయని చెప్పారు.అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున దేశీయ పరిజ్ఞానంతో ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబోల తయారీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పైలట్ దశలో వందల స్థాయిలో ఉన్న ఉత్పత్తిని త్వరలో వార్షికంగా వెయ్యి రోబోల స్థాయికి పెంచుకోనున్నట్లు నడింపల్లి వివరించారు. ప్రస్తుతం సంస్థలో నలభై మంది వరకు సిబ్బంది ఉన్నారని చెప్పారు. రోబోటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, టెక్నీíÙయన్స్ మొదలైన విభాగాలవ్యాప్తంగా మరింత మందిని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. -
వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..
భారతదేశంలో.. చాలా ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థలు వారానికి 5 రోజుల పని షెడ్యూల్ను పాటిస్తున్నాయి. కానీ ఇప్పుడు చాలామంది కార్మికులు వారానికి నాలుగు రోజులు పని చేసి మూడు రోజులు సెలవు తీసుకోవాలని కోరుకుంటారు. జపాన్, స్పెయిన్ & జర్మనీ వంటి దేశాలు వారానికి 4 రోజుల పని విధానాన్ని పాటిస్తున్నాయి. ఇది ఇండియాలో సాధ్యమవుతుందా? అని చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంపైనే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.మంత్రిత్వ శాఖ.. వారానికి నాలుగురోజుల పనికి సమ్మతించినట్లు పోస్టులో వెల్లడించింది. అయితే కొన్ని షరతులను కూడా వెల్లడించింది. సవరించిన కార్మిక నియమావళి ప్రకారం.. నాలుగు రోజులు, రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులుగా పొందవచ్చని స్పష్టం చేసింది.మంత్రిత్వ శాఖ ప్రకారం వారానికి 48 గంటలు (4 రోజులు, రోజుకు 12 గంటలు) పనిచేయాలన్న మాట. ఉద్యోగులు దీనికి సిద్ధంగా ఉంటే.. ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవు. ఈ సమయంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే.. ఓవర్ టైం కింద జీతం పెరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తింది. వారంలో 48 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ఓవర్ టైంకి అదనపు చెల్లింపులు ఉంటాయి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.The Labour Codes allow flexibility of 12 hours for 4 workdays only, with the remaining 3 days as paid holidays.Weekly work hours remain fixed at 48 hours and overtime beyond daily hours must be paid at double the wage rate.#ShramevJayate pic.twitter.com/5udPMqRXbg— Ministry of Labour & Employment, GoI (@LabourMinistry) December 12, 2025నాలుగు లేబర్ కోడ్లుభారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు.. వచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు. అవి ''వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)''.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న రాజకీయ నాయకులు -
వైల్డ్ వాటర్స్లో బంపర్ సేల్! టికెట్లు సగం ధరలోనే..
హైదరాబాదీ మూవీ లవర్స్, ఫుడ్ లవర్స్, అడ్వెంచర్ లవర్స్ అందరికీ సూపర్ న్యూస్! శంఖర్పల్లిలోని వైల్డ్ వాటర్స్ లో సంవత్సరాంతం కోసం ప్రత్యేక ఆఫర్ వచ్చింది. డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో టికెట్ ధరలను దాదాపు సగానికి తగ్గిస్తున్నారు. సాధారణంగా రూ.1,590 ఉండే ఎంట్రీ టికెట్ ఇప్పుడు కేవలం రూ.849!అయితే అందులో బెస్ట్ పార్ట్ ఏమిటంటే- ఈ టికెట్ మార్చి 31, 2025 వరకు వాలిడ్గా ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా వీకెండ్ ప్లాన్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. మరింత ఎగ్జైటింగ్ వార్త ఏమిటంటే, "Book, Refer & Win" ప్రోగ్రామ్ కూడా కొనసాగుతోంది (డిసెంబర్ 11 నుండి 16 వరకు). మీరు మీ టికెట్ బుక్ చేసుకుని రిఫరల్ లింక్ షేర్ చేస్తే, బహుమతులు గెలిచే అవకాశం మీ సొంతం!వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ఈ సీజన్లో హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక గిఫ్ట్ కావాలని మేము అనుకున్నాం. ఇది మా కృతజ్ఞత సూచన మాత్రమే కాదు, కుటుంబాలందరికీ మరచిపోలేని అనుభవం అందించే అవకాశం కూడా,” అన్నారు.వైల్డ్ వాటర్స్లో ఉన్న 50కి పైగా రైడ్స్, పెద్ద ఎత్తున ఫుడ్ కోర్ట్స్, ప్రతిరోజు జరిగే సేఫ్ టీచెక్స్ వంటి ఫీచర్లు దీన్ని రాష్ట్రంలోని ప్రీమియం థీమ్ డెస్టినేషన్గా నిలిపాయి. మరి ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు! ఇప్పుడే బుక్ చేసుకుని, మీ ఫ్రెండ్స్ని కూడా ఆనందంలో భాగం చేయండి. -
కొత్త శకానికి భారత్ సారథ్యం: శాంసంగ్
భారత్ నుంచి 14,000 పేటెంట్లను దాఖలు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా అర్థవంతమైన నవకల్పనలను ఆవిష్కరించడంలో కొత్త శకానికి భారత్ సారథ్యం వహిస్తుందని ఆశిస్తున్నట్లు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తెలిపింది.‘భారత్ నుంచి 14,000 పైగా పేటెంట్లు దాఖలయ్యాయి. తద్వారా గ్లోబల్ ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ స్థానం మరింత పటిష్టం అయింది. రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచం కోసం భారత్లో డిజైన్ చేసిన, తయారు చేసిన మరిన్ని ఉత్పత్తులు రాబోతున్నాయి‘ అని శాంసంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ వివరించారు.వికసిత్ భారత్ లక్ష్యాల సాకారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. 1995లో టీవీలతో దేశీ మార్కెట్లోకి ప్రవేశించిన శాంసంగ్ క్రమంగా కార్యకలాపాలను విస్తరించింది. చెన్నై, నోయిడాలో రెండు ప్లాంట్లను, ఢిల్లీ, నోయిడా, బెంగళూరులో మూడు పరిశోధన.. అభివృద్ధి కేంద్రాలను, ఢిల్లీ–ఎన్సీఆర్లో డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. -
ఈవీ బ్యాటరీలకు భారీ డిమాండ్
భారత్లో ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్ 17.7 గిగావాట్ హవర్ (జీడబ్యూ్యహెచ్) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్ వృద్ధి (సీఏజీఆర్) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్ వివరించింది.‘‘భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్ఎఫ్పీ జెన్ 4, సోడియం అయాన్ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్ ఎండీ వినాయక్ వలింబే తెలిపారు. ఎల్ఎఫ్పీ జెన్4 సెల్స్ అన్నవి ఇప్పుడు 300 వాట్హవర్/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.సవాళ్లను అధిగమించాలి..భారత్ తన ఎలక్ట్రిఫికేషన్ (ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. -
తయారీ హబ్గా భారత్!
భారత్ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జెడ్47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్లో తయారీ, ఆత్మనిర్భర్భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్-ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్ 2022లో 33 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది. -
రిలయన్స్ రిటైల్ సీఈవోగా ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్
ఫ్లిప్కార్ట్లో చీఫ్ ప్రొడక్ట్, టెక్నాలజీ ఆఫీసర్గా లోగడ పనిచేసిన జేయంద్రన్ వేణుగోపాల్ను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ప్రెసిడెంట్, సీఈవోగా నియమించుకుంది. ఆర్ఆర్వీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ, రిలయన్స్ రిటైల్ నాయకత్వ బృందంతో కలసి.. ముకేశ్ అంబానీ, మనోజ్ మోదీ మార్గదర్శకం కింద వేణుగోపాల్ పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ, బిజినెన్ ట్రాన్స్ఫార్మేషన్లో 25 ఏళ్ల అనుభవం ఉన్న వేణుగోపాల్.. రిటైల్ పోర్ట్ఫోలియోని బలోపేతం చేస్తారని, ఓమ్ని ఛానల్ (ఆన్లైన్, ఆఫ్లైన్) వృద్ధిని వేగవంతం చేస్తారని, రిలయన్స్ రిటైల్ వ్యాల్యూ చైన్ వ్యాప్తంగా సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొంది. మింత్రాను దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దడంలో వేణుగోపాల్ ముఖ్యపాత్ర పోషించారు. అంతకుముందు యాహూ, అమెజాన్ వెబ్ సర్వీసెస్లోనూ పనిచేశారు. -
ప్రయాణాలకు శీతాకాలమే ఇష్టం: సర్వేలో వెల్లడైన విషయాలు
విహారయాత్రలంటే ఎవరికి మాత్రమే ఇష్టం ఉండదు చెప్పండి, ఏడాదిలో ఏదో ఒకసారైనా.. ఒంటరిగా లేదా కుటుంబంతో అయినా.. అలా కొత్త ప్రదేశాలను సందర్శించి సంతోషపడుతుంటారు. టూర్ వెళ్లడానికి కొందరు వేసవి కాలం ఎంచుకుంటే, మరికొందరు శీతాకాలం ఎంచుకుంటారు. అయితే.. చాలామంది శీతాకాల ప్రయాణమే ఎంచుకుంటారని ఎయిర్బీఎన్బీ (Airbnb) ఒక సర్వేలో వెల్లడించింది.భారతదేశంలో చాలామంది ప్రయాణికులు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి శీతాకాలాన్ని ఎంచుకుంటున్నారని ఎయిర్బీఎన్బీ 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ సర్వే ద్వారా స్పష్టం చేసింది. చల్లని వాతావరణం.. అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుందని.. ఈ కారణంగానే ఈ కాలంలో ప్రయాణాలకు షెడ్యూల్ చేసుకుంటున్నారని వెల్లడించింది.భారతీయులలో 30 శాతం మంది శీతాకాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి ఎంచుకుంటుంటే.. మరో 30 శాతం మంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నారు. 20 శాతం మంది కాలానుగుణ లేదా సాంస్కృతిక అనుభవాలను కనుగొనడానికి ప్రయాణం చేస్తున్నారని సర్వేలో ఎయిర్బీఎన్బీ చెప్పుకొచ్చింది.50 శాతం మంది ప్రజలు జీవిత భాగస్వామితో ప్రయాణించడానికి ఇష్టపడతారు. మూడవ వంతు స్నేహితులతో, 30 శాతం మంది ఉమ్మడి కుటుంబాలతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. ఇందులో కూడా చాలామంది ముందుగా గోవా, కేరళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరువాత జాబితాలో తిరువనంతపురం, కొచ్చి వంటి ప్రదేశాలలోని బీచ్లు, కేఫ్లు, తీరప్రాంతాలు ఉన్నాయి. 2025 అక్టోబర్ 13-20 మధ్య దేశవ్యాప్తంగా 2,155 మందితో సర్వే నిర్వహించి 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది. -
ప్రైవేటు, చిన్న బ్యాంకులపై ఫిర్యాదులు: ఆర్బీఐ
ఆర్బీఐ అంబుడ్స్మన్ వద్ద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లపై అధికంగా వచి్చనట్టు ఆర్బీఐ తాజా డేటా తెలియజేస్తోంది.➤2024–25లో మొత్తం 13,34,244 ఫిర్యాదులు ఆర్బీఐ ఇంటెగ్రేటెడ్ అంబుబ్స్మన్ వద్ద దాఖలయ్యాయి. 2023–24లో 11,75,075 ఫిర్యాదులు వచ్చాయి. కాకపోతే 2023–24లో 33 శాతం అధిక ఫిర్యాదులతో పోలి్చతే తర్వాతి సంవత్సరంలో తగ్గాయి.➤సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీఆర్పీసీ) 9,11,384 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో 1,08,331 ఫిర్యాదులను దేశవ్యాప్తంగా ఉన్న 24 అంబుడ్స్మన్ ఆఫీసులకు బదిలీ చేసింది. 10,589 ఫిర్యాదులను కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్స్ (సీఈపీసీ)కు బదిలీ చేసింది. మిగిలిన 7,76,336 ఫిర్యాదులు నిబంధల ప్రకారం లేనివిగా పరిగణిస్తూ కొట్టివేసింది.➤2025 మార్చి 31 నాటికి 16,128 ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి. ➤రుణాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత క్రెడిట్కార్డులపై ఎక్కువగా ఉన్నాయి. ➤మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్పై ఫిర్యాదులు 12.74 శాతం తగ్గాయి. ➤అత్యధికంగా 2,41,601 ఫిర్యాదులు (81.53 శాతం) బ్యాంకులకు సంబంధించి రాగా, 43,864 ఫిర్యాదులు ఎన్బీఎఫ్సీలకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. ➤ప్రవేటు బ్యాంకులకు వ్యతిరేకంగా వచి్చన ఫిర్యాదుల్లో 37.53 శాతం పెరుగుదల ఉంది.➤ప్రభుత్వరంగ బ్యాంకులపై 8.45 శాతం మేర ఫిర్యాదులు తగ్గాయి. -
ఆద్యం హ్యాండ్వోవెన్ బ్రాండ్ అంబాసిడర్గా శోభితా ధూళిపాళ
భారతదేశ చేనేత వారసత్వాలను కాపాడటానికి అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్వోవెన్, నేడు ప్రఖ్యాత నటి శోభితా ధూళిపాళను అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు వెల్లడించింది.ఈ భాగస్వామ్యం గురించి ఆద్యం హ్యాండ్వోవెన్ - బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ.. “ఆద్యం ఎల్లప్పుడూ మగ్గం వెనుక ఉన్న వ్యక్తులకు, మన చేతి వృత్తులను రూపొందించే సంస్కృతులకు & అభివృద్ధి చెందుతున్న సంప్రదాయాలకు అండగా నిలుస్తుంది. శోభిత నేటి కాలపు మహిళ, చేనేత వస్త్రాలతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతమైనది.. సహజమైనది. ఆమె మా ప్రచారకర్తగా నిలవటం కొత్త తరం కోసం భారతీయ పనితనంను ప్రతి ఒక్కరూ అభిమానించేలా చేయాలనే మా ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.శోభితా ధూళిపాల తన సంతోషాన్ని వెల్లడిస్తూ “కళ, భావోద్వేగాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా చేతితో తయారు చేసినప్పుడు, అది దానిని సృష్టించిన వ్యక్తి యొక్క ముద్రను కలిగి ఉంటుంది. నేత సంఘాలతో ఆద్యం చేస్తోన్న కృషి, అన్ని రూపాల్లో సంస్కృతిని వేడుక జరుపుకునే సిద్దాంతంతో కలిపి, ఈ అనుబంధాన్ని నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది..” అని అన్నారు. -
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఆన్లైన్ లీగల్ సమాచార పోర్టల్ బార్ & బెంచ్ కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.ఇండిగో వాదన ఇదీ..మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఈ ఎయిరలైన్స్ కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.ఇండిగో ఇప్పటికే పునర్-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.మరమ్మతు తర్వాత పునర్-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది. -
ఇండిగో సంక్షోభం.. నలుగురు అధికారుల సస్పెన్షన్
విమానయన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. గడిచిన పది రోజుల్లో ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి అంతటికీ బాధ్యులను చేస్తూ నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను (ఎఫ్ఐఓ) ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం సస్పెండ్ చేసింది.సస్పెండ్ అయిన ఈ నలుగురు అధికారులు విమానయాన భద్రత, పైలట్ శిక్షణ, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు ఏవియేషన్ రెగ్యులేటర్ ముందు హాజరవుతున్న తరుణంలోనే అధికారుల సస్పెన్షన్ జరగడం గమనార్హం.విమానాల అనూహ్య రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వేల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శుక్రవారం రోజున అత్యధికంగా 1,600కి పైగా విమానాలు రద్దు కావడం అత్యవసర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. -
మాకంటూ సొంత బాట
దేశంలో మెజారిటీ నిపుణులు తమ కోసం తాము కష్టపడాలన్న అభిలాషతో ఉన్నారు. కృత్రిమ మేథ (ఏఐ), కొత్త నైపుణ్యాల పట్ల ఆసక్తి, ప్రొఫెషనల్ నెట్వర్క్ల మద్దతుతో వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని విస్తరించుకోవడం సులభమన్న అభిప్రాయం లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి లింక్డ్ఇన్ ఒక నివేదికను విడుదల చేసింది. నిపుణుల లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో ‘ఫౌండర్’ (వ్యవస్థాపకుడు) అని జోడించినవి గత ఏడాది కాలంలో 104 శాతం పెరిగాయి. ప్రతి పది మందిలో ఏడుగురు నిపుణులు తమకోసం కష్టపడాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు పలు అంశాలు అనుకూలిస్తున్నట్టు లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది.చిన్న సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ ఒక భాగంగా మారిపోయింది. వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించడం సులభమని 82 శాతం మంది చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపార వృద్ధికి ఏఐని కీలకంగా 83 శాతం మంది పరిగణిస్తున్నారు. 11–200 మధ్య ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఏఐపై అవగాహన 52 శాతం పెరిగింది.81 శాతం చిన్న, మధ్యస్థ వ్యాపార సంస్థలు ఏఐ సామర్థ్యాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ స్థానం ప్రత్యేకం..‘‘భారత్లో చిన్న వ్యాపార సంస్థలు అసాధారణ వేగం, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నాయి. ఏఐని వేగంగా స్వీకరించడం, నైపుణ్యాలను పెంచుకోవాలన్న అభిలాష, విశ్వసనీయమైన నిపుణుల నెట్వర్క్ల కలయిక భారత్ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇవన్నీ కలసి వ్యాపారాన్ని ప్రారంభించడం, విస్తరించడం, విజయవంతం చేయడాన్ని పునర్నిర్మిస్తున్నాయి’’ అని లింక్డ్ఇన్ భారత్ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామ్ తెలిపారు.ఇదీ చదవండి: నైట్క్లబ్లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు -
టాటా ప్లాంట్లలో ఇంటెల్ చిప్ల తయారీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్ భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్లు) తయారీ, అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ‘‘స్థానిక మార్కెట్ల కోసం ఇంటెల్ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్ను త్వరలో ప్రారంభం కానున్న టాటా ఎల్రక్టానిక్స్ ఫ్యాబ్, అండ్ ఓఎస్ఏటీ కేంద్రాల్లో నిర్వహించేందుకు, అత్యాధునిక ప్యాకేజింగ్పై సహకారాన్ని కూడా ఇంటెల్–టాటా పరిశీలించనున్నాయి’’అని టాటాగ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే, కన్జ్యూమర్, ఎంటర్ప్రైజ్ మార్కెట్ కోసం ఉద్దేశించిన ఏఐ పీసీ పరిష్కారాల విస్తరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిపింది. టాటా గ్రూప్ రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్లోని దొలెరాలో చిప్ తయారీ యూనిట్ను, అలాగే అసోంలో ప్యాకేజింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంప్యూటర్ మార్కెట్, కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్న భారత మార్కెట్లో వేగంగా విస్తరించేందుకు టాటా గ్రూప్తో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో లిప్ బు టన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇంటెల్తో ఒప్పందం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి. ఇరు సంస్థలూ కలసి సెమీకండక్టర్లు, సిస్టమ్ సొల్యూషన్లను అందించడం ద్వారా.. భారీగా విస్తరించనున్న ఏఐ మార్కెట్లో గణనీయమైన వాటాను సొంతం చేసుకోగలవు’’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. -
జనవరి 21 నుంచి ఇమ్టెక్స్ ఫార్మింగ్ ఎక్స్పో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 25 వరకు బెంగళూరులో ఇమ్టెక్స్ ఫార్మింగ్ 2026 ఎక్స్పో నిర్వహించనున్నట్లు ఇండియన్ మెషిన్ టూల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహిని కేల్కర్ తెలిపారు. మెటల్ ఫారి్మంగ్, తయారీ సాంకేతికతలకు ఇది ఆసియాలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అని ఆమె చెప్పారు. 20 దేశాల నుంచి 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారన్నారు. దేశీయంగా మెషిన్ టూల్ మార్కెట్లో మెటల్ ఫార్మింగ్ వాటా 29 శాతమని తెలిపారు. -
రెండు లక్షలపైగా సంస్థలకు స్టార్టప్ గుర్తింపు
ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా సంస్థలు స్టార్టప్ గుర్తింపు పొందాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2,01,335 స్టార్టప్లను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం డీపీఐఐటీ గుర్తించినట్లు తెలిపింది. ఇవి దేశవ్యాప్తంగా 21 లక్షల పైచిలుకు ఉద్యోగాలను కల్పాయని పేర్కొంది. 2025 జూన్ వరకు 14 రంగాలవ్యాప్తంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రూ. 1.88 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని శాఖ వివరించింది. దీనితో అదనంగా రూ. 17 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తి/అమ్మకాలు జరిగాయని, 12.3 లక్షల మేర ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొంది.పీఎల్ఐ స్కీముతో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెలికం, నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల నుంచి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద స్టార్టప్గా గుర్తింపు పొందిన సంస్థలకు ఆదాయ పన్ను రాయితీ తదితర ప్రోత్సాహకాలు లభిస్తాయి. మరోవైపు, వ్యాకారాల నిర్వహణను సరళతరం చేసే క్రమంలో నిబంధనల భారాన్ని కూడా గణనీయంగా తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో (2014–25) భారత్లోకి 748.38 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని వివరించింది. అంతక్రితం 11 ఏళ్లలో (2003–14) వచ్చిన 308.38 బిలియన్ డాలర్లకు ఇది 143 శాతం అధికమని పేర్కొంది. -
500 సార్లు అప్లై చేసినా రాని ఉద్యోగం!: చివరికి ఏం చేసిందంటే?
చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్బుక్లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. -
పదేళ్లలో రూ.300 లక్షల కోట్లు!
రిటైల్ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.డిజిటల్ ప్లాట్ఫామ్ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు జెన్ జెడ్, మిలీనియల్స్ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.దీర్ఘకాల దృక్పథం..ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఫండ్స్-ఈక్విటీలకు ప్రాధాన్యం..సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్ పార్ట్నర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ తెలిపారు. -
బ్యాంకు పరీక్షల్లో భారీ మార్పులు!!
ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామక పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రిక్రూట్మెంట్ పరీక్షల కాలక్రమాన్ని క్రమబద్ధీకరించడం, వాటి ఫలితాల ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులను సూచించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) నియామకాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.తాము సూచించిన మార్పులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే పరీక్షలలో పారదర్శకతను పెంచడానికి దోహదపడతాయని పేర్కొంది. ఎస్బీఐలో ఉద్యోగాలకు నియామకాలకు తానే సొంతంగా రిక్రూట్మెంట్ చేపడుతుండగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆర్ఆర్బీలలో రిక్రూట్మెంట్ను ఆయా బ్యాంకుల ఆదేశాలకు అనుగుణంగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.సాధారణంగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఎస్బీఐలలో ఉద్యోగాల పరీక్షల కంటే ముందే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్ఆర్బీలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను కూడా ఇదే క్రమంలో ప్రకటిస్తున్నారు. "అయితే, కొత్తగా నియమితులైన అభ్యర్థులు తరచుగా ఆర్ఆర్బీల నుండి ఇతర ప్రభుత్వ బ్యాంకులకు, తరువాత ఎస్బీఐకి మారే ఒక ముఖ్యమైన ధోరణి ఉద్భవించింది. ఈ వలస బ్యాంకులలో గణనీయమైన అట్రిషన్ కు దారితీస్తూ కార్యాచరణ సవాళ్లను విసురుతోంది" అని ఆర్థిక సేవల విభాగం తెలిపింది.పై సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఆర్థిక సేవల విభాగం బ్యాంకుల రిక్రూట్మెంట్ పరీక్షల సమగ్ర ప్రక్రియ, ఫలితాల ప్రకటనల నమూనాను సమీక్షించింది. మూడు రకాల బ్యాంకులలో నియామక ఫలితాలను ప్రకటించడానికి ప్రామాణిక, తార్కిక క్రమాన్ని అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు సూచించింది.పర్యవసానంగా, సవరించిన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ప్రకారం.. మొదట ఎస్బీఐ, అనంతరం ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆ తరువాత చివరగా ఆర్ఆర్బీలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలి. ఈ కేటగిరీలలోని అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ప్రారంభంలో ప్రకటిస్తామని, క్లరికల్ స్థాయి పరీక్ష ఫలితాలను అదే క్రమంలో ప్రకటిస్తామని తెలిపింది. -
ఆఫీస్కు అర్లీగా వస్తోందని ఉద్యోగిని తొలగింపు
స్పెయిన్లో ఒక విచిత్రమైన ఉద్యోగ వివాదం వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా 40 నిమిషాల ముందుగానే ఆఫీస్కు వస్తోన్న ఒక ఉద్యోగినిని ఆ కంపెనీ తొలగించింది. ఆఫీస్కు అర్లీగా వస్తే తొలగిస్తారా? అంటూ కంపెనీని కోర్టుకు లాగింది ఆ 22 ఏళ్ల ఉద్యోగిని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...అసలేం జరిగిందంటే.. మెట్రో వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఆ ఉద్యోగిని షిఫ్ట్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఆమె ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్యే ఠంచనుగా ఆఫీస్కు వెళ్లిపోయేది. ఉద్యోగిని ముందుగా రావడం ప్రారంభంలో మంచి అలవాటుగా కనిపించినా, ఆ సమయంలో ఆమె చేయడానికి ఎలాంటి పని లేకపోవడం, అలాగే ముందుగా రాకూడదన్న సంస్థ ఆదేశాలను ఆమె పదేపదే లెక్కచేయకపోవడం కంపెనీ యాజమాన్యాన్ని అసహనానికి గురి చేసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.కంపెనీ ఏం చెబుతోందంటే.. సంస్థ మాటల్లో.. ఉద్యోగి ముందుగానే రావడం వల్ల ఎటువంటి ఉత్పాదకతా అందించకపోగా, నిర్ణయించిన సమయాలకు కట్టుబడే నిబంధనలను సదరు ఉద్యోగిని నిర్లక్ష్యం చేసింది. పలుమార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ ఆమె తన అలవాటు మార్చుకోలేదు. ఇక, ఆమె 19 సందర్భాల్లో ఆఫీస్ ప్రాంగణంలోకి రాక ముందే కంపెనీ యాప్లో లాగిన్ కావడానికి ప్రయత్నించినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇది మోసపూరిత చర్యగా కంపెనీ యాజమాన్యం పరిగణించింది.తొలగింపు అన్యాయమంటూ కోర్టుకు..తన తొలగిపింపును సవాలు చేస్తూ ఆ మహిళ అలికాంటే సోషల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదన ఏమిటంటే ముందుగా రావడం తప్పు కాదు. కంపెనీ యాజమాన్యం తనపట్ల అన్యాయం చేసింది.భిన్నంగా కోర్టు తీర్పుఅయితే, కోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. గైర్హాజరు లేదా ఆలస్యంగా రావడం కాకుండా అత్యధిక సమయపాలన కూడా నియమావళిని ఉల్లంఘించే పరిస్థితుల్లో సమస్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. సంస్థ నిబంధనలను పాటించడానికి ఉద్యోగి నిరాకరించిందని, ఇది స్పానిష్ వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54ను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొంది.అంతేకాకుండా ముందుగానే రావడం కారణంగా జట్టు సమన్వయానికి అంతరాయం ఏర్పడిందని మరో ఉద్యోగి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఉద్యోగిని తొలగించడం సముచితమేనని నిర్ణయిస్తూ కోర్టు యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. -
కస్టమర్లకు అలర్ట్: హెచ్డీఎఫ్సీ సేవలు రెండు రోజులు బంద్!
అప్పుడప్పుడు నిర్వహణ పనుల వల్ల బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలు (నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు) తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఈ విషయాన్ని బ్యాంకులు ముందుగానే తమ కస్టమర్లకు తెలియజేస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా ఇలాంటి ప్రకటనే వెల్లడించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పంపిన సందేశం ప్రకారం.. 2025 డిసెంబర్ 13 తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 6:30గంటల (నాలుగు గంటలు) వరకు, అలాగే 21వ తేదీన తెల్లవారు జాము 2.30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ సేవలు కూడా ఆ సమయంలో పనిచేయవని హెచ్డీఎఫ్సీ స్పష్టం చేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు పనిచేయని సమయంలో PayZapp ఉపయోగించుకోవచ్చని సిఫార్సు చేసింది. కేవలం రెండు రోజులు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే బ్యాంకింగ్ సేవలు పనిచేయవు. మిగిలిన సమయంలో అన్ని సేవలు యధావిధిగా పనిచేస్తాయి.ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.. -
పైలట్లకు ఎంత డిమాండో.. మరి జీతాలు?
విమాన పైలట్ అన్నది అత్యుత్తమ కెరియర్లలో ఒకటి. పైలట్ అవ్వాలని చాలా మంది చిన్నప్పటి నుంచే కల కంటుంటారు. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో (Indigo Crisis) పైలట్లకు, విమాన సిబ్బందికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం.. ఈ క్రమంలో వారికి జీత భత్యాలు ఎలా ఉంటాయన్న ఉత్సుకత చాలామందిలో ఉంటుంది.. ఇక్కడ తెలుసుకుందామా..భారతదేశ విమానయాన రంగం ఆకాశాన్నే తాకుతున్నట్టుగా వృద్ధి చెందుతోంది. టూరిజం బూమ్, ఇతర కారణాలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఎయిర్లైన్స్ ఎప్పటికప్పుడు కొత్త విమానాలు ఆర్డర్ చేస్తున్నాయి. దీంతో పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి అసాధారణ డిమాండ్ ఏర్పడింది.దేశంలో ప్రస్తుతం సుమారు 20 వేల మంది పైలట్లు, దాదాపు 35 వేల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. మరో 10 సంవత్సరాల్లో 30,000 మంది పైలట్లు, 6.78 లక్షల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది అవసరమవుతారని అంతర్జాతీయ అవియేషన్ అంచనాలు సూచిస్తున్నాయి.22,400 మంది అవసరంవిమానయాన శాఖ డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ వంటి పెద్ద ఎయిర్లైన్లు రోజువారీ 2,000కి పైగా ఫ్లైట్లు నడుపుతున్నాయి. "2026 నాటికి 7,000 మంది కొత్త పైలట్లు, 2028 నాటికి మొత్తం 22,400 మంది అవసరం" అని ఇండియన్ ఎయిర్లైన్స్ అసోసియేషన్ (IAA) ఓ నివేదికలో పేర్కొంది.ఆకర్షణీయ జీత భత్యాలుపైలట్ల జీతభత్యాలు ఎయిర్లైన్ ప్రాతిపదికన, అనుభవం, విమాన రకం (A320, A321, ATR) వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.ట్రైనీ పైలట్లు మొదటి సంవత్సరంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం పొందుతారు.ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్) పదవిలో ₹1.5 లక్షలు నుంచి ₹3 లక్షల వరకు, కెప్టెన్లకు ₹3 లక్షలు నుంచి ₹15 లక్షల వరకు (కొందరు ₹25 లక్షల వరకు) ఆదాయం ఉంటుంది.సీనియర్ పైలట్లు రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.జీతాలతో పాటు ఫ్లయింగ్ అలవెన్స్, నైట్ అలవెన్స్, స్టే అలవెన్స్, ఇన్స్యూరెన్స్, హోటల్ & ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.ఇక క్యాబిన్ క్రూ సిబ్బంది విషయానికి వస్తే ఫ్రెషర్లకు జీతం రూ.25,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ రూ.1 లక్షకుపైగా చేరుకుంటుంది.ఎయిర్ ఇండియాలో ఫ్రెషర్లు రూ.59,000 నుంచి రూ.61,000 వరకు పొందుతున్నారు. సీనియర్లు రూ.1.5 లక్షలు నుంచి రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారు.ఈ జీతాలతో పాటు, ఉచిత ఫ్లైట్ టికెట్లు, హౌసింగ్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటి భత్యాలు ఉన్నాయి. -
దక్షిణాది మార్కెట్పై జియోహాట్స్టార్ మెగా ప్లాన్
దక్షిణాది మీడియా, వినోద పరిశ్రమలో జియోహాట్స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. మాతృ సంస్థ జియోస్టార్ (JioStar) రాబోయే ఐదేళ్లలో రూ.4,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి దక్షిణాది క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చెన్నైలో ఇటీవల జరిగిన ‘సౌత్ అన్బౌండ్ (South Unbound)’ అనే ఈవెంట్లో వివిధ 25 కొత్త ప్రసార ప్రకటనలను ఆవిష్కరించారు.భారీ పెట్టుబడి లక్ష్యం ఏమిటి?జియోహాట్స్టార్కు దక్షిణాది ప్రాంతం ఒక కీలక వృద్ధి కేంద్రంగా మారిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల వినియోగదారులతో పోలిస్తే దక్షిణాది వీక్షకులు తమ ప్లాట్ఫామ్పై 70% ఎక్కువ సమయం గడుపుతున్నారని, 50% ఎక్కువ కంటెంట్ విభాగాలను చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ను మరింత బలోపేతం చేయడానికి దక్షిణాది ప్రేక్షకులకు మరింత వైవిధ్యభరితమైన, నాణ్యత కలిగిన కంటెంట్ను అందించాలనే లక్ష్యంతో రూ.4,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలిపారు.ఈ నిధులను రచయితలు, దర్శకులు, నూతన డిజిటల్ కథా రచయితల అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు, రైటింగ్ ల్యాబ్ల కోసం ఉపయోగించనున్నారు. కంటెంట్ నిర్మాణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక నిర్మాణ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిధులు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ చెప్పింది. దీని ద్వారా 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.ఐపీఎల్ హక్కుల నష్టాన్ని భర్తీ చేస్తుందా?జియోహాట్స్టార్ ఐపీఎల్ మీడియా హక్కులను కోల్పోవడం, ఆ తర్వాత దక్షిణాదిలో ఈ భారీ పెట్టుబడి ప్రకటనకు మధ్య ఉన్న సంబంధంపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జియోహాట్స్టార్ దక్షిణాది ప్రేక్షకులకు ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ కోసం ఉద్దేశించిన కంటెంట్ను అందించాలని నిర్ణయించింది. ఐపీఎల్ అనేది క్రీడా విభాగానికి చెందింది. దక్షిణాదిలో ఓటీటీ వీక్షణలు తగ్గి, నిలుపుదల రేటు (Retention Rate) ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున జియోహాట్స్టార్ ఈ పెట్టుబడిని కేవలం ఐపీఎల్ లోటును భర్తీ చేయడానికి కాకుండా ప్రాంతీయ మార్కెట్లో ప్రజలకు వినోదాన్ని పంచుతూ తాను ఆర్థికంగా వృద్ధి చెందే అంశంగా చూడాలని కొందరు చెబుతున్నారు. ప్రాంతీయ కంటెంట్ సృష్టికర్తలు, స్థానిక కథనాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్లాట్ఫామ్ సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచుకోవాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం -
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32, బయలుదేరాల్సినవి-28.ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0— IndiGo (@IndiGo6E) December 10, 2025ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్ షెడ్యూల్లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే! -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారతదేశంలో ‘ఫినో’ టెకిలా ఆవిష్కరణ
క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
65,000 మంది ఉద్యోగుల సహకారం!
దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలుఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్వర్క్లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్లో కోతలు పెట్టింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
భారత్ ఏఐ భవిష్యత్తుకు 360 డిగ్రీల భాగస్వామ్యం
మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 17.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించిన తరువాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్గా మారింది.ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఏఐ యుగంలో ఫిజికల్, డిజిటల్ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ‘సత్య నాదెళ్లను కలవడం, సాంకేతికత భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన భావాలను పొందడం ఎప్పుడూ ఆనందకరం. ఏఐ యుగంలో ఫిజికల్, డిజిటల్ ప్రపంచాలు కలుస్తున్నందున మైక్రోసాఫ్ట్తో మా 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని అదానీ పేర్కొన్నారు. నాదెళ్ల స్వయంగా నిర్మిస్తున్న ఏఐ యాప్ల డెమోను చూడటం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.భారత్ గ్లోబల్ టెక్ లీడర్గా..అదానీ గ్రూప్ ఎనర్జీ, పోర్ట్లు వంటి భౌతిక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మైక్రోసాఫ్ట్ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలతో జతకట్టడం భారతదేశం సాంకేతిక లక్ష్యాలకు కీలకమౌతుంది. అదానీ-నాదెళ్ల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వృద్ధికి (అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణలో సహకారం ఉంది) మరింత ఊతమిస్తుంది. భారత్లో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో దేశ డేటా సెంటర్ మార్కెట్ వేగంగా విస్తరించనుంది. ఈ పరిణామం మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.Always a pleasure to meet @satyanadella and gain his valuable insights into the future of technology. We are excited to continue building a 360° partnership as the physical and digital worlds converge in the age of AI. Getting a demo from him of the AI apps he is personally… pic.twitter.com/T70YTbjTbT— Gautam Adani (@gautam_adani) December 10, 2025ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) పోర్టల్ల్లో అత్యాధునిక ఏఐ చాట్బాట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్సీఎస్ పోర్టల్స్లో ఏఐ చాట్బాట్లుఇండియా ‘ఏఐ-ఫస్ట్ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్సీఎస్లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్బాట్లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్లేషన్ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు -
నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.డిజిటలైజేషన్, ఉద్యోగాలుకొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్వర్క్లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం -
వారం రోజులు.. ముంబై అష్టకష్టాలు
ముంబై.. దేశంలో అత్యంత కీలకమైన నగరం. దీన్ని దేశ ఆర్థిక రాజధానిగా కూడా పేర్కొంటుంటారు. దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థలు, కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఆర్థికపరమైన కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విదేశాలతోపాటు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ముంబై నగరాన్ని ప్రభావితం చేసింది.ఇండిగో విమాన అంతరాయాల ప్రభావం ముంబై విమానాశ్రయంలో వారం రోజులుగా ప్రయాణికులను సతాయించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి 8 వరకు 905 విమానాలు రద్దు అయ్యాయి. 1,475 విమానాలు 30 నిమిషాలకు పైగా ఆలస్యమయ్యాయి. ఈ అంతరాయాల వల్ల సుమారు 40,789 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే..ముంబై ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులలో 3,171 విమానాలు నడపాల్సి ఉండగా కేవలం 2,266 మాత్రమే నడిపగలిగింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. డిసెంబర్ 1న 14గా ఉన్న విమాన రద్దులు డిసెంబర్ 5న 295కి పెరిగాయి. ఆలస్యాలు కూడా ఎక్కువయ్యి, డిసెంబర్ 3న 281 విమానాలు గరిష్ట ఆలస్యాన్ నమోదు చేశాయి.స్తంభించిన ప్రయాణికుల బ్యాగేజీఅంతరాయాలు పెరుగుతూనే ఉండటంతో టెర్మినళ్లలో కార్యకలాపాలు క్రమంగా స్తంభించాయి. రద్దయిన విమానాల కారణంగా సుమారు 780 చెక్-ఇన్ బ్యాగులు ప్రయాణికులకు అందకుండా నిలిచిపోయాయి. వీటిలో 90% బ్యాగులను బుధవారం నాటికి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.ఎక్కువగా ప్రభావితమైన మార్గాలు ఇవే..ముంబై నుంచి బయలుదేరే అనేక దేశీయ మార్గాలు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, కొచ్చి, గోవా, లక్నో నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా ఆమ్స్టర్డామ్, ఇస్తాంబుల్ మార్గాలలో కూడా పెద్ద ఎత్తున ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి. -
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది. ఇండిగో నిర్వహణ, పైలట్ల లభ్యత సమస్యలు, టెక్నికల్ తనిఖీలు వంటి అంశాలను పరిశీలించేందుకు డీజీసీఏ ప్రత్యేక బృందాలను నియమించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా, సంస్థపై ఒత్తిడిని మరింత పెంచుతూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో మొత్తం ఆపరేషన్లలో 10 శాతాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇండిగో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సంస్థను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే యోచనలో కూడా డీజీసీఏ ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వీసుల నిరంతరత, భద్రతా ప్రమాణాలు, సిబ్బంది లభ్యత వంటి అంశాల ఆధారంగా రూట్లను పునర్వ్యవస్తీకరించనున్నట్లు సమాచారం.ఈ పరిణామాలతో ఇండిగో సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, విస్తృతంగా సేవలు అందించే సంస్థగా ఉన్నందున మరికొన్ని రోజులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రుణం పెరుగుతూ వస్తోంది. విస్తరణ, రీఫైనాన్స్ లేదా పెట్టుబడి అవసరాల కోసం కంపెనీలు రుణాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆదాయం తగ్గినప్పుడు ఈ రుణాలు భారీ భారంగా మారుతాయి. కొన్నిసార్లు సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆస్తుల అమ్మకం లేదా విభాగాల మూసివేతల వరకు వెళ్తాయి.ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రుణాన్ని పరిశీలిస్తే కళ్లు చెదిరే అంకెలు బయటపడుతున్నాయి. అత్యధిక రుణభారంతో ఉన్న టాప్ 10 కంపెనీలలో ఐదు చైనా, మూడు అమెరికా, ఒకటి ఫ్రాన్స్, ఒకటి కెనడా దేశాలకు చెందినవి. అమెరికా తన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజాలతో ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోనే అత్యంత రుణం ఈ కంపెనీదే..అమెరికన్ మార్టగేజ్ సంస్థ ‘ఫెన్నీ మే’ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణం ఉన్న కంపెనీగా నిలిచింది. దీని రుణ భారం 4.21 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశ జీడీపీ కంటే అధికం. అంతేకాదు.. యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడా వంటి దేశాల జీడీపీకన్నా కూడా ఎక్కువ.అప్పుల్లో టాప్ 10 కంపెనీలుర్యాంక్కంపనీదేశంమొత్తం రుణం1ఫెన్నీ మేఅమెరికా$4.21 ట్రిలియన్2ఫ్రెడ్డీ మాక్అమెరికా$3.349 ట్రిలియన్3జేపీ మోర్గాన్ చేజ్అమెరికా$496.55 బిలియన్4అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$494.86 బిలియన్5చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్చైనా$479.33 బిలియన్6బిఎన్పి పరిబాస్ఫ్రాన్స్$473.67 బిలియన్7ఐసిబిసిచైనా$445.05 బిలియన్8బ్యాంక్ ఆఫ్ చైనాచైనా$400.70 బిలియన్9సిటిక్ లిమిటెడ్చైనా$386.79 బిలియన్10రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాకెనడా$377.70 బిలియన్భారత్లో అంబానీ కంపెనీ టాప్భారతదేశంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక రుణభారం ఉన్న సంస్థ. దీని మొత్తం రుణం 43.24 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.3.8 లక్షల కోట్లు. ఇది భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ రుణం అవకాశమా.. సవాలా?కార్పొరేట్ రుణం విస్తరణకు ఉపయోగపడినా, సరైన నిర్వహణ లేకపోతే ఇది భారీ ఆర్థిక సవాలుగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత రుణపడి ఉన్న కంపెనీలు, అధిక రుణభారం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి. -
స్మార్ట్ ఫోన్ రేట్లకు రెక్కలు
సాక్షి, బిజినెస్ డెస్క్ : మెమరీ, స్టోరేజ్ చిప్లకు కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచేయగా మరికొన్ని అదే బాటలో ఉన్నాయి. డివైజ్లలో పర్మనెంట్ డేటాను నిల్వచేసే సెమీకండక్టర్ చిప్లను అమర్చే స్టోరేజ్ మాడ్యూల్స్ ధర నెలవారీగా, సామర్థ్యాన్ని బట్టి 20–60 శాతం మేర పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీల నుంచి భారీగా డిమాండ్ నెలకొనడంతో 1టీబీ (టెరాబైట్) మాడ్యూల్స్ కొరత తీవ్రంగా ఉంటోందని వివరించారు. అదే సమయంలో పాత టెక్నాలజీల నుంచి పరిశ్రమ దశలవారీగా నిష్క్రమిస్తున్న కొద్దీ 512 జీబీ మాడ్యూల్స్ రేట్లు సుమారు 65 శాతం పెరిగాయి. తీవ్ర కొరత కారణంగా 256 జీబీ మాడ్యూల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. స్టోరేజ్ మాడ్యూల్స్తో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ, తాత్కాలిక, హై–స్పీడ్ డేటాను స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, ఇతరత్రా డివైజ్లలో నిల్వ చేసేందుకు ఉపయోగించే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (డీఆర్ఏఎం) మాడ్యూల్స్పైనా ప్రభావం పడుతోంది. డీఆర్ఏఎం రేట్లు 18–25 శాతం పెరిగాయి. వేఫర్ల కొరతకు సంబంధించిన పరిస్థితులు ఇప్పుడప్పుడే మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో కాంట్రాక్ట్ ధరలు వచ్చే ఏడాది కూడా పెరిగే అవకాశమే ఉందని వివరించారు. బడ్జెట్ సెగ్మెంట్పై ప్రభావం.. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం, మెమరీ చిప్ల ధరలు ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం పెరిగాయి. 2025 నాలుగో త్రైమాసికంలో ఇవి మరో 30 శాతం జంప్ చేయొచ్చని, అలాగే 2026 తొలినాళ్లలో ఇంకో 20 శాతం పెరగొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రధాన స్రవంతిలో ఉపయోగించే ఉత్పత్తులకు మెమరీ మాడ్యూల్స్ సరఫరాను తగ్గించి ఏఐ అప్లికేషన్స్కి అధునాతన చిప్లను సరఫరా చేయడంపై సప్లయర్లు మరింతగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొన్నారు. మైక్రాన్లాంటి కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ కన్జూమర్ మెమరీ ప్రోడక్టుల తయారీని నిలిపివేయనున్నట్లు ఇటీవల ప్రకటించాయి.దీనితో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్పై అత్యధికంగా ప్రభావం పడుతోందని నిపుణులు వివరించారు. అయితే, మధ్య స్థాయి నుంచి హై–ఎండ్ డివైజ్లపైనా ధరలపరమైన ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. వివో, ఒప్పో, రియల్మీ, ట్రాన్షన్లాంటి స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఇప్పటికే తమ ప్రస్తుత మోడల్స్పై రేట్లను రూ. 500 నుంచి రూ. 2,000 వరకు పెంచాయి. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో, కొత్తగా లాంచ్ చేసే వాటి ధర గత రేటు కన్నా మరో 10 శాతం అధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2026 ప్రథమార్ధంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని రిటైలర్లు అంచనా వేస్తున్నారు.పీసీలకు కూడా సెగ..డెస్్క టాప్ పీసీలు, నోట్బుక్ల విడిభాగాలకు కూడా కొరత నెలకొంది. దీంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం చాలా మోడల్స్కి సంబంధించి మెటీరియల్స్ వ్యయం 15 శాతం పైగా పెరిగింది. దీంతో కంపెనీల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్, అసూస్, లెనొవొ, హెచ్పీ లాంటి కంపెనీలన్నీ మరింతగా రేట్లను పెంచే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు అసూస్, లెనొవొ తదితర సంస్థలు తమ మెమరీ చిప్ల నిల్వలను పెంచుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యయాలు మాత్రం తగ్గటం లేదు. దీంతో డెల్ లాంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు 15–20 శాతం మేర పెరగొచ్చని వెల్లడించాయి. ఇలా ధరల పెరుగుదల వల్ల డిమాండ్ నెమ్మదించి, అమ్మకాల వృద్ధిపైనా ప్రభావం పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్) బిల్లు’ ను 2024 నవంబర్లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించడానికి అనుమతి లేదు.ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్ఫామ్లు ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, రెడ్డిట్, థ్రెడ్స్, ట్విచ్, కిక్.ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.ప్లాట్ఫామ్లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.అనుసరించకపోతే జరిమానాలుఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలుఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్ల కోసం ఎదురుచూడటం, సైబర్బుల్లింగ్ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రమాదకరమైన కంటెంట్ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్’తో పోల్చారు.సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.కంపెనీలపై ప్రభావం ఇలా..ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.ప్రకటనల ఆదాయంపై ప్రభావంసోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.నియంత్రణ అమలు ఖర్చులువయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.సాంకేతిక సవాళ్లువయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్ఫామ్లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే.. -
క్రికెట్పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్.. ఎందుకంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.భౌగోళిక ఒత్తిడులు2025 ఐపీఎల్ సీజన్కు ముందు భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్లతో సహా అనేక మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్షిప్ డీల్స్లో 15-20% తగ్గుదల కనిపించింది.దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్కు దూరం చేసింది.రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లుఐపీఎల్ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్షిప్లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్షిప్లపై నిషేధం లీగ్కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్షిప్లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్లు (ఆటో, ఫిన్టెక్, హెల్త్కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.బ్రాడ్కాస్టింగ్ రైట్స్లో పోటీ లోపంకార్పొరేట్ ప్రభావం ఐపీఎల్ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్ మొత్తం విలువను దెబ్బతీసింది.ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు వ్యూయర్షిప్ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.పునరుద్ధరణకు మార్గాలురియల్-మనీ గేమింగ్పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్షిప్లను ఆకర్షించాలి.ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.భవిష్యత్ సీజన్ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
హైదరాబాద్లో లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ల విస్తరణ
గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్గ్రాడ్ (upGrad) హైదరాబాద్లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్వర్క్ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.అప్గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్వర్క్లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్మ్యాప్లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్వర్క్ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
42 మంది ఉద్యోగులు,40 కోట్ల యూజర్లు,700 కోట్ల డాలర్లు, రహస్యం ఇదే!
పెద్ద కార్పొరేట్ కంపెనీ, బిలియన్ల డాలర్ల ఆదాయం అంటే ఏం ఊహించుకుంటాం. ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. కానీ ఇక కంపెనీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే చాలా తక్కువ మంది ఉద్యోగులకు కంపెనీని నడిపిస్తోంది. కేవలం 42 మంది పూర్తి కాల ఉద్యోగులకు భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎలా? పదండి మరి ఆ కంపెనీ రహస్యం ఏంటో తెలుసుకుందాం.ఆ కంపెనీ పేరే ఓన్లీఫ్యాన్స్. ఇది అనేది లండన్, ఇంగ్లాండ్లో ఉన్న సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్ఫామ్. పోర్న్ రచనలకు ఎక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ, అథ్లెట్లు, సంగీతకారులు , హాస్యనటులతో సహా ఇతర కంటెంట్ సృష్టికర్తలను కూడా హోస్ట్ చేస్తుంది. 2016 దీన్ని స్థాపించారు. దీని సీఈవో కైలీ బ్లెయిర్.కంపెనీ కావాలనే తక్కువ మంది ఉద్యోగులకు నియమించుకుంది. ముఖ్యంగా నిపుణులైన సీనియర్లతో పాటు, ఉద్యోగం చేయాలని తపన ఉన్న జూనియర్లే ఈ కంపెనీకి ఆయువు పట్టు. మిడిల్మేనేజ్మెంట్ లేకుండా చేసి, ఉద్యోగులకు స్వేచ్ఛ నివ్వడమే తమ కంపెనీ విజయ రహస్యమంటారు. సీఈవో కైలీ బ్లెయిర్. నవంబర్లో లిస్బన్లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్లో మాస్టర్స్ ఆఫ్ స్కేల్ పాడ్కాస్ట్ హోస్ట్ జెఫ్ బెర్మాన్తో సంభాషణ సందర్భంగా బ్లెయిర్ ఈ విధానం గురించి చర్చించారు.ఘోమంచి మిడిల్ మేనేజర్ ఉండనే ఉండడుతమ కంపెనీ కేవలం 42 మంది పూర్తి-సమయ సిబ్బందితో మాత్రమే పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ టీంతోనే తమ కంపెనీ వార్షికంగా 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు చెప్పారు. చాలా పవర్ ఫుల్ టీం అని బెర్మాన్ ప్రశంసించగా, ఆ టీం సామర్థ్యాన్ని పర్యవేక్షించే మరో టీం లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది. నియామక తత్వంపై ఆమె ఇంకా ఇలా వివరించారు. నియామకంలో అనుభవం కంటే వైఖరి, ఆప్టిట్యూడ్ చూస్తాము. మనస్తత్వం , సామర్థ్యానికి ప్రాధాన్యత తప్ప ఓన్లీ ఫ్యాన్స్లో మిడిల్ మేనేజ్మెంట్ పొర ఉండదు. ఎందుకంటే తన అనుభవంలో ఎవరికీ నిజంగా మంచి మిడిల్ మేనేజర్ లేడు అని ఆమె స్పష్టం చేయడం విశేషం.ఎంత మంది వ్యక్తులను పర్యవేక్షిస్తారనే బట్టి లీడర్స్ను అంచనా వేసే సాధారణ కార్పొరేట్ పద్ధతికి తాను వ్యతిరేకినని బ్లెయిర్ చెప్పారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులుగతంలో న్యాయవాదిగా పనిచేసిన బ్లెయిర్ 2022 జనవరిలో లండన్కు చెందిన కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ , ఆపరేషన్స్ ఆఫీసర్గా చేరారు.తరువాత 2023లో కంపెనీకి సీఈఓగా మారింది. ఈప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. సుమారు 40 లక్షల కంటెంట్ క్రియేటర్లను హోస్ట్ చేసింది సృష్టికర్తలకు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రధాన సాంకేతిక సంస్థలలో కంపెనీ మిడిల్-మేనేజ్మెంట్ స్థానాలను తగ్గించిన నిర్మాణ విస్తృత ధోరణిని ఇది ప్రతిధ్వనిస్తుందని కూడా ఆమె చెప్పడం విశేషం. ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ -
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం (డిసెంబర్ 9, 2025) ఒక వీడియో సందేశం ద్వారా ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. విమానాల రద్దు, జాప్యం కారణంగా కస్టమర్లకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, ఇండిగో తన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించిందని చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికుల్లో విశ్వసనీయతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.వ్యక్తిగత క్షమాపణసీఈఓ తన సందేశంలో ‘ప్రియమైన కస్టమర్లు.. మేము మీకు అసౌకర్యాన్ని, నిరాశను కలిగించామని మాకు తెలుసు. మీలో చాలా మంది ముఖ్యమైన క్షణాలను కోల్పోయారని తెలుసు. కుటుంబ సభ్యులను కలుసుకునేవారు, వ్యాపార సమావేశాలు, సెలవులు.. ఇలా చాలా మందికి తమ ప్రయాణాల్లో అంతరాయం కలిగింది. మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అంగీకరిస్తున్నాం’ అని అన్నారు.కార్యకలాపాలు పునరుద్ధరణగత కొన్ని రోజుల పాటు కొనసాగిన గందరగోళం తర్వాత నెట్వర్క్ పునరుద్ధరణ కోసం ఇండిగో తీసుకున్న చర్యలను సీఈఓ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న అతిపెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.విమాన సర్వీసుల పునరుద్ధరణ క్రమండిసెంబర్ 5: 700 విమానాలుడిసెంబర్ 6: 1,500 విమానాలుడిసెంబర్ 7: 1,650 విమానాలుడిసెంబర్ 8: 1,800 విమానాలుడిసెంబర్ 9: 1,800 విమానాలు, పూర్తి నెట్వర్క్ పునరుద్ధరణ‘ఈ రోజు డిసెంబర్ 9 నాటికి మా కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని నేను నిర్ధారించగలను. మేము మా నెట్వర్క్లోని మొత్తం 138 గమ్యస్థానాలకు తిరిగి సేవలు అందిస్తున్నాం’ అని ఎల్బర్స్ ప్రకటించారు.ప్రయాణికులకు తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇండిగో తీసుకున్న చర్యలను కూడా ఎల్బర్స్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు లేదా ఇంటికి సురక్షితంగా చేర్చడం తొలి ప్రాధాన్యతగా తెలిపారు. లక్షల మంది కస్టమర్లకు ఇప్పటికే పూర్తి రిఫండ్లు జారీ అయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విమానాశ్రయాల్లో నిలిచిపోయిన చాలా బ్యాగ్లను ప్రయాణికుల ఇళ్లకు పంపినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తుపై భరోసాఈ సంక్షోభంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని సీఈఓ తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో ఎదురైన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు. ‘ఇటువంటి అంతరాయాలు మళ్లీ జరగకుండా చూసుకోవడానికి మేము కొత్త రక్షణలను అమలు చేస్తున్నాం. మాపై నమ్మకాన్ని ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.#WATCH | IndiGo CEO Pieter Elbers says," IndiGo is back on its feet, and our operations are stable...Lakhs of customers have received their full refunds, and we continue to do so on a daily basis. Most of the bags stuck at airports have been delivered to your homes...We also… pic.twitter.com/zhezNROtoh— ANI (@ANI) December 9, 2025ఇదీ చదవండి: అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు -
అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన రూ.228.06 కోట్ల బ్యాంకింగ్ మోసం కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఈ కేసులో ఆర్హెచ్ఎఫ్ఎల్, దాని మాజీ సీఈవో, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాల్కర్తో పాటు వివరాలు తెలియని కొందరు ప్రభుత్వోద్యోగుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన కారణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228.06 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జై అన్మోల్ అంబానీ, రవీంద్ర సుధాల్కర్ తదితరులు రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించడంలో అవకతవకలకు పాల్పడి ఆర్థిక నష్టాన్ని కలిగించే చర్యలకు పాల్పడ్డారని సీబీఐకి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశారు. మోసం, పదవి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కింద ఏజెన్సీ కేసు నమోదు చేసింది.మోసం జరిగిందిలా..యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అనూప్ వినాయక్ తరాలే దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆర్హెచ్ఎఫ్ఎల్ ఆర్థిక సహాయం కోరుతూ ముంబైలోని ఎస్సీఎఫ్ (SCF) శాఖను సంప్రదించింది. దాంతో 2015-2019 మధ్య యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ఎఫ్ఎల్కు రూ.450 కోట్ల టర్మ్ లోన్లను మంజూరు చేసింది. దీనితో పాటు కంపెనీ అందించే రూ.100 కోట్ల విలువైన ప్రైవేటుగా ఉంచిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు కూడా బ్యాంకు సబ్స్క్రైబ్ చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో తిరిగి చెల్లించడం, సెక్యూరిటీలు, ఫైనాన్షియల్స్ను సరిగ్గా బహిర్గతం చేయాల్సిన షరతులపై ఈ రుణాలు మంజూరు చేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా నమోదు చేయబడి, సెప్టెంబర్ 2017లో నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.రుణ నిధులను జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాల్కర్ సహా మాజీ డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాల్లోకి మళ్లించారని బ్యాంక్ ఆరోపించింది. 30 సెప్టెంబర్ 2019న డెట్ అకౌంట్ నిలిపేశారు. తదుపరి పరిశీలన తరువాత బ్యాంక్ 10 అక్టోబర్ 2024న ఖాతాను ‘ఫ్రాడ్’గా ప్రకటించింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది.ఆడిట్లో బట్టబయలుఏప్రిల్ 2016 నుంచి జూన్ 2019 వరకు గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో తీవ్ర ఒడిదొడుకులు బయటపడ్డాయి. రుణం తీసుకున్న నిధులు ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు ఆడిట్లో కనుగొన్నారు. కంపెనీ జనరల్ పర్పస్ కార్పొరేట్ రుణాల్లో దాదాపు 86 శాతం, అంటే రూ.12,573.06 కోట్లు పరోక్షంగా అనుసంధానించిన సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో సర్క్యులర్ లావాదేవీలను కూడా నివేదించారు.ఈ నేపథ్యంలో నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), 13(1)(డీ), సవరించిన పీసీ చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తును న్యూఢిల్లీలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రోషన్ లాల్కు అప్పగించారు.ఇదీ చదవండి: అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు -
అనంత్ అంబానీకి అరుదైన అవార్డ్
వ్యాపారవేత్త అనంత్ అంబానీ అరుదైన అవార్డు అందుకున్నారు. వన్య ప్రాణుల సంరక్షణలో అనూహ్య ప్రభావం చూపినందుకు అమెరికన్ హ్యూమేన్ సొసైటీ అంతర్జాతీయ విభాగమైన గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ.. అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి ఆసియా వ్యక్తిగా, అలాగే అతి పిన్న వయస్కుడిగా అంబానీ చరిత్ర సృష్టించారు.అంబానీ స్థాపించిన వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం‘వంతారా’ విజ్ఞాన ఆధారిత సంరక్షణా కార్యక్రమాలు, పెద్ద స్థాయిలో రక్షణ–పునరావాస చర్యలు, అలాగే జాతి సంరక్షణలో కొత్త దారులు చూపినందుకు విశేషంగా ప్రశంసలు అందుకుంది. గ్లోబల్ హ్యూమేన్ సొసైటీ అధ్యక్షురాలు, సీఈవో డాక్టర్ రాబిన్ గాంజర్ట్ మాట్లాడుతూ, “ప్రతి ప్రాణికి గౌరవం, ఆరోగ్యం, ఆశ ఇవ్వాలన్న అంకితభావాన్ని వంతారా ప్రతిబింబిస్తోంది. దీనికి దార్శనికుడు అనంత్ అంబానీ,” అని పేర్కొన్నారు. వంతారాను ఆమె “చికిత్స, పునరుజ్జీవనానికి నిలయంగా నిలిచిన విశిష్ట సంరక్షణ కేంద్రం”గా అభివర్ణించారు.ఈ గౌరవం అందుకున్న అనంత్ అంబానీ ‘సర్వభూతహిత’ భావాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి ప్రాణికి గౌరవం, శ్రద్ధ, భరోసా ఇవ్వడం మా ధర్మం. సంరక్షణ రేపటికి వాయిదా వేయదగినది కాదు” అని అన్నారు. గతంలో ఈ అవార్డును బెట్టి వైట్, షిర్లీ మెక్లేన్, జాన్ వేన్ వంటి ప్రముఖులు, అలాగే అమెరికా అధ్యక్షులు జాన్ ఎఫ్. కెన్నెడీ, బిల్ క్లింటన్ అందుకున్నారు.కఠినమైన గ్లోబల్ హ్యూమేన్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వంతారా, జంతు ఆహారం, ప్రవర్తనా సంరక్షణ, వైద్య సేవలు, సహజ ప్రవర్తనకు అవకాశాలు వంటి అనేక అంశాల్లో అత్యుత్తమ ప్రమాణాలు చూపింది. వంతారా ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న జాతుల పునరుద్ధరణ, శాస్త్రీయ సంరక్షణ పరిశోధనలు, ప్రకృతి వాతావరణాల్లో జంతువుల పునర్నివాసంపై దృష్టి సారిస్తున్నాయి. View this post on Instagram A post shared by Reliance Foundation (@reliancefoundation) -
ఐసీఐసీఐ ఏఎంసీ @ రూ. 2,0612,165
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రూ. 2,061–2,165 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 12న ప్రారంభమై 16న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 11న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) 4.89 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 10,602 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ నెల 19న లిస్టింగ్కానున్న కంపెనీ విలువ రూ. 1.07 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రస్తుతం ఏఎంసీలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన 49 శాతం భాగస్వామ్య కంపెనీ ప్రుడెన్షియల్ హోల్డింగ్స్ కలిగి ఉంది. కాగా.. ఇప్పటికే ఈ విభాగంలో నాలుగు సంస్థలు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ దేశీయంగా లిస్టయ్యాయి. ఈ బాటలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐదో కంపెనీగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో అడుగుపెట్టనుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ గ్రూప్ నుంచి ఐదో లిస్టెడ్ కంపెనీగా నమోదుకానుంది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఐపీవో ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ(జేవీ)లో భాగస్వామ్య సంస్థ వాటా విక్రయించినప్పటికీ తాము మెజారిటీ వాటాను కొనసాగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొన్న విషయం గమనార్హం! -
మీడియా ప్రచారంలో రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: మీడియా ప్రచారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రారాజుగా నిలుస్తోంది. దేశీ మీడియాలో ఎక్కువగా కనిపించే లిస్టెడ్ కంపెనీగా విజికీ న్యూస్మేకర్ ఇండెక్స్లో వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నట్టు విజికీ న్యూస్మేకర్ ర్యాంకింగ్స్ 2025 ప్రకటించింది. సూచీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్తల స్కోరు 2021లో 84.9గా ఉంటే, 2022లో 92.56, 2023లో 96.46, 2024లో 97.43, 2025లో 97.83కు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంటే మీడియా ప్రచారంలో రిలయన్స్ క్రమంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నట్టు ఈ డేటా తెలియజేస్తోంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, మీడియా అనలైటిక్స్ ద్వారా 4 లక్షలకు పైగా ప్రచురణల్లో బ్రాండ్కు ఉన్న ప్రచారం, గుర్తింపును విజికీ న్యూస్మేకర్ ర్యాంకింగ్స్ విశ్లేíÙస్తుంటుంది. ప్రభుత్వరంగ అగ్రగామి బ్యాంక్ ఎస్బీఐ 92.81 స్కోరుతో రెండో స్థానంలో ఉంటే, 88.41 స్కోరుతో హెచ్డీఎఫ్సీ మూడో స్థానంలో నిలిచింది. భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, ఐటీసీ టాప్–10లో ఉన్నాయి. జొమాటో 11, స్విగ్గీ 12, వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) 13వ ర్యాంక్ దక్కించుకున్నాయి. బ్రాండ్ వారీ వార్తల పరిమాణం, ప్రముఖ వార్తల్లో వాటికి దక్కిన స్థానం, ఆయా ప్రచురణలకు ఉన్న విస్తరణ, రీడర్లు ఆధారంగా 0 నుంచి 100 వరకు స్కోర్ను విజికీ న్యూస్మేకర్స్ ర్యాంకింగ్స్ కేటాయించింది. నాలుగు లక్షలకు పైగా ప్రచురణల్లో ఒక్కో బ్రాండ్కు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చాయి, ఏ బ్రాండ్కు తరచూ ప్రచారం లభిస్తోందన్న అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. -
ఇండిగో కొంప ముంచింది ఇదే..
దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సేర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిరిండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావండైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను, సిబ్బంది రోస్టర్ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.ఎయిరిండియా దూకుడుఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిరిండియా ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిరిండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని, తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా, తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది.పైలట్-టు-ఎయిర్క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణఎయిరిండియా (Air India) ఒక విమానానికి సగటున 5.4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది. ఇది బఫర్, భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నిబంధనల మార్పును ఎయిరిండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది.మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే ‘లీన్ మ్యాన్పవర్’(Lean Manpower) వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: చాట్జీపీటీలో ప్రకటనలు..? -
పనివేళల తర్వాత నో కాల్స్.. నో ఈమెయిల్స్
డిజిటల్ యుగంలో వర్క్-లైఫ్ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల తర్వాత పని సంబంధిత కాల్స్, ఈమెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్ల నుంచి దూరంగా ఉండే హక్కును కల్పించే ఒక ముఖ్యమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-శరద్చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు, 2025’ను లోక్సభలో ప్రవేశపెట్టారు. పని భారం పెరిగి, వ్యక్తిగత సమయం కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు, 2025పనివేళలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు (కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్లు) స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకుగాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై జరిమానా (ఉద్యోగుల మొత్తం వేతనంలో 1% వరకు) విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే..ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం భారతదేశంలో చాలా అరుదు. అయినప్పటికీ, ఇది ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ‘యూరప్ కంటే మనం చాలా నయం’ -
‘యూరప్ కంటే మనం చాలా నయం’
భారతీయ రైల్వేల సమయపాలన (పంచువాలిటీ) 80 శాతానికి పెరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు. ఇది అనేక యూరోపియన్ దేశాల కంటే మెరుగ్గా ఉందన్నారు. మెరుగైన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణ నవీకరణలే ఈ ప్రగతికి కారణమని చెప్పారు.ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని అనేక రైల్వే డివిజన్లు ఇప్పటికే 90 శాతం సమయపాలన మార్కును దాటాయని తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే శాఖ అమలు చేసిన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణల ప్రభావమే ఈ విజయానికి ప్రధాన కారణమని హైలైట్ చేశారు.‘రైల్వేల మొత్తం సమయపాలన 80 శాతానికి చేరుకుంది. ఇది ఒక ముఖ్యమైన విజయం. 70 రైల్వే డివిజన్లలో సమయపాలన 90 శాతానికి పైగా ఉంది. అనేక యూరోపియన్ దేశాల కంటే భారతీయ రైల్వేలు సమయపాలనలో మెరుగ్గా ఉన్నాయి’ అని మంత్రి సభకు తెలియజేశారు.మెరుగైన సమయపాలనకు కారణాలు..ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే ఆపరేషన్లను పర్యవేక్షించడం, మెరుగ్గా నిర్వహించడంలో కొత్త, మరింత కఠినమైన పద్ధతులు అమలు చేశారు. ఈ పద్ధతులు లోపాలను గుర్తించడం, సరిదిద్దడం, రైళ్ల కదలికలను మరింత సమర్థవంతంగా సమన్వయం చేయడంలో సహాయపడ్డాయి.రైల్వే మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో క్రమం తప్పకుండా చేసిన అప్గ్రేడ్లు రైళ్ల ఆలస్యాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. సిగ్నలింగ్ వ్యవస్థల మెరుగుదల, ట్రాక్ మెయింటెనెన్స్ అప్డేట్లు సమయపాలనను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.ఉత్తరప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులుఉత్తరప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రక చర్య అని వైష్ణవ్ అన్నారు. 2014కు ముందు కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని, అది నేడు అనేక రెట్లు పెరిగిందని నొక్కి చెప్పారు. చారిత్రక సాంస్కృతిక సంబంధాలు ఉన్న యూపీలోని బల్లియా స్టేషన్ నుంచి ప్రస్తుతం 82 రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సభకు తెలియజేశారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. భద్రత ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఈ నిర్మాణాలపై ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. అభివృద్ధికి వేగవంతమైన అనుమతులను నిర్ధారించడానికి ప్రత్యేకంగా ఓవర్ బ్రిడ్జిల కోసం 100 కి పైగా డిజైన్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.ఇదీ చదవండి: చాట్జీపీటీలో ప్రకటనలు..? -
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్, రతన్ టాటా, గూగుల్ పేర్లు
తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.గ్లోబల్గా గుర్తింపు కోసం..రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.గూగుల్ స్ట్రీట్హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్ -
తెలంగాణలో పెట్టుబడుల హోరు
ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వీడర్ ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు హాజరై కీలక పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, గతంలో హైదరాబాద్లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మించనున్నట్లు (ట్రంప్ ఆర్గనైజేషన్-ట్రైబెకా డెవలపర్స్ భాగస్వామ్యంతో) వార్తలు వచ్చాయి. ట్రంప్ గ్రూప్ తరఫున లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇది ట్రంప్ ఫ్యామిలీ గ్రూప్ కావడం విశేషం.తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు 8, 9 తేదీల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.భారీ పెట్టుబడుల్లో ముఖ్యాంశాలు:టీసీఎస్ - టీపీజీ భాగస్వామ్యం: ఐటీ దిగ్గజం టీసీఎస్, మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70 వేల కోట్లు (8 బిలియన్ డాలర్లు)** పెట్టుబడితో అత్యాధునిక హైపర్వాల్ట్ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇది అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.రంగాలు: ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, క్రీడలు, వినోదం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.ఏఐ సిటీ ఏర్పాటు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తూ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.అజయ్ దేవ్గణ్ ప్రతిపాదన: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్సిటీ ఏర్పాటుకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ ముందుకొచ్చారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్ -
ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఉద్యోగుల వసతి అవసరాలను తీర్చడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో భారీ బల్క్ హౌసింగ్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా బ్యాంక్ దాదాపు రూ.294 కోట్లు (పన్నులు మినహాయించి) వెచ్చించి, అపార్ట్మెంట్లలో మొత్తం 200 2 బీహెచ్కే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇటీవలి సంవత్సరాల్లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది అతిపెద్ద సంస్థాగత నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది.ఎస్బీఐ ఇటీవల జారీ చేసిన టెండర్ పత్రాల ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్లో ముంబయి ఒకటి. దాంతో అక్కడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఈ వ్యూహాత్మక బల్క్ కొనుగోలును నాలుగు క్లస్టర్లుగా విస్తరించింది.సెంట్రల్ శివారు ప్రాంతాలు (సియోన్ నుంచి ఘాట్కోపర్ వరకు). పశ్చిమ శివారు ప్రాంతాలు (అంధేరి నుంచి బోరివలి వరకు). థానే-కళ్యాణ్ బెల్ట్. నవీ ముంబై కారిడార్ (ఖర్ఘర్ నుంచి పన్వెల్ వరకు) విభజించింది. ప్రతి క్లస్టర్లో 50 యూనిట్ల చొప్పున మొత్తం 200 2-బీహెచ్కే అపార్ట్మెంట్లు కొనుగోలు చేయనుంది. ప్రతి అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా సుమారు 600 చదరపు అడుగులు (55.74 చదరపు మీటర్లు) ఉండాలని ఎస్బీఐ నిర్ణయించింది. కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రాజెక్ట్ 5 ఏళ్లలోపుదై ఉండాలి. మహారెరా కంప్లీషన్ సర్టిఫికేట్ (OC)తో మహారెరా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతి ఫ్లాట్కు ఒక కారు పార్కింగ్, ఒక ద్విచక్ర వాహనం పార్కింగ్ చొప్పున మొత్తం 400 పార్కింగ్ స్లాట్లు తప్పనిసరి ఉండాలని చెప్పింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోగా (180 రోజులు) లావాదేవీని పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.🚨 State Bank of India is planning to buy 200 ready-to-move 2BHK apartments across Mumbai for its staff. pic.twitter.com/LgLD0vfJpQ— Indian Tech & Infra (@IndianTechGuide) December 8, 2025ఈ బల్క్ కొనుగోలు ద్వారా ఉద్యోగులకు ముంబైలో పెరుగుతున్న ఆస్తి ధరలతో సంబంధం లేకుండా స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలు అందించాలని బ్యాంక్ చూస్తోంది. సిబ్బంది సంక్షేమం, గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం (ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్) రెంటల్ లేదా లీజు ఏర్పాట్ల కంటే నేరుగా రెడీ-టు-మూవ్ గృహాలను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతున్నట్లు ఈ చర్య స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
భారత్–ఇజ్రాయెల్ భాగస్వామ్యంలో కొత్త కంపెనీ
న్యూఢిల్లీ: భారతీయ సంస్థ ఏజీటీసీ బయోటెక్, ఇజ్రాయెల్కు చెందిన లగ్జంబర్గ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా సెమియోఫోర్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 50:50 వాటాలతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ద్వారా 18 అధునాతన ఫెరోమోన్, సెమియోకెమికల్ ఆధారిత పంట సంరక్షణ టెక్నాలజీలను ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యీకరించనున్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో అభివృద్ధి చెందిన సెమియోకెమికల్ టెక్నాలజీ తొలిసారిగా ఇజ్రాయెల్కు లైసెన్స్ అవుతున్నది. దీన్ని రెండు దేశాల మధ్య శాస్త్రీయ సహకారానికి మైలురాయిగా భావిస్తున్నారు. పంటలపై రసాయన అవశేషాలు లేకుండా, తేనెటీగలకు హానికరం కాని, వాతావరణానుకూల పద్దతిలో పురుగు నియంత్రణను సాధించడమే ఈ సాంకేతికాల ప్రధాన లక్ష్యం. దీంతో రసాయన పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సెమియోఫోర్ భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో నియంత్రణ అనుమతులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ కోసం 10 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ద్రాక్ష, యాపిల్, పత్తి, మొక్కజొన్న వంటి పలు పంటలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఉత్పత్తి 75–100 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం రాబట్టే అవకాశం ఉందని కంపెనీలు ప్రకటించాయి.ఈ జాయింట్ వెంచర్ ప్రకటన న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎస్&టీ క్లస్టర్స్ కాన్ఫరెన్స్ లో భారత, ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. 2026లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి, 2027 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని సెమియోఫోర్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇండిగో విమానం.. ఎగరక ముందే వణికించింది!
దేశవ్యాప్తంగా విమానాల జాప్యాలు, రద్దులతో విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ తరుణంలో ఇండిగో విమానంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటన ప్రయాణికులను వణికించింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బెంగళూరు–వడోదర మార్గంలో ఉన్న ఇండిగో విమానం టేకాఫ్కి సిద్ధమవుతున్న సమయంలో ఒక పావురం అకస్మాత్తుగా క్యాబిన్లోకి ప్రవేశించింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు.వైరల్ వీడియోలో, పావురం విమానం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ప్రయాణికుల తలల మీదుగా ఎగురుతూ కనిపిస్తుంది. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించినా పావురం విమానం లోపలే తిరుగుతూనే ఉంది. ఈ దృశ్యాన్ని ఒక డిజిటల్ క్రియేటర్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. “విమానంలో ఆశ్చర్యకర అతిథి… నవ్వుల నడుమ సరదా క్షణం. పూర్తిగా ఆనందించాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.వైరల్ అయిన ఈ ఘటన సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది. పలువరు తమ కామెంట్లతో స్పందించారు. “అది బర్డింగ్ పాస్ తీసుకుందేమో!” అని ఒకరు హాస్యభరితంగా వ్యాఖ్యానించగా “ప్రయాణంలో అదనపు తోడు” అని కామెంట్ చేశారు. “ఇండిగో టైమ్ ఇటీవల అస్సలు బాలేదు” అని మరొకరు ప్రతిస్పందించారు.ఇండిగో ఈ ఘటనపై అధికారికంగా స్పందించకపోయినా, వీడియో మాత్రం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Karn Parekh (@parekhkarn) -
ఫుడ్ ప్రాసెసింగ్లో భారీగా ఇన్వెస్ట్ చేయండి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్లాండ్కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు. -
పైలట్ల నియామక చర్యలు షురూ..
భారతదేశపు అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.పైలట్ల నియామకానికి ప్రణాళికలుకొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.విశ్లేషకుల హెచ్చరికఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్డీటీఎల్ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్లైన్స్లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్పై పూర్తి వేవర్లను ప్రకటించింది.డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశంనవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
ప్రముఖ బ్యాంక్లో 10,000 ఉద్యోగాల కోత
స్విట్జర్లాండ్లో అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్ రాబోయే మూడేళ్లలో సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను పరిశీలిస్తోందని స్విస్ వార్తాపత్రిక ‘సోన్టాగ్స్ బ్లిక్’(SonntagsBlick) తెలిపింది. 2023లో క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.బ్యాంకు వ్యవస్థలో పునరావృత కార్యకలాపాలను తగ్గించడానికి ఈ ఉద్యోగ కోతలు, విలీన ప్రక్రియ ఎంతో తోడ్పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే యూబిఎస్ ప్రతినిధులు ఈ 10,000 సంఖ్యను మాత్రం కచ్చితంగా ధ్రువీకరించలేదని గమనించాలి.క్రెడిట్ సూయిస్ కొనుగోలు (మార్చి 2023) తర్వాత యూబీఎస్ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా వీలైనంత తక్కువగా ఉద్యోగ కోతలు ఉండేటా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూబీఎస్ ప్రతినిధులు చెప్పారు. బ్యాంకులో ఏవైనా తగ్గింపులు ఉంటే దానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణ తొలగింపుల (లేఆఫ్స్) సంఖ్యను తగ్గించడానికి బ్యాంకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం2024 చివరి నాటికి యూబీఎస్లో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 10,000 కోతలు దాదాపు 9 శాతం తగ్గుదలకు సమానం. ఇప్పటికే బ్యాంక్ 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 1,04,427కి తగ్గించింది. అంటే, ఈ విలీనం ప్రభావంతో ఇదివరకే సుమారు 15,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నరాల సమస్య -
9 టూ 5 జాబ్ చేస్తూ రూ.65 లక్షల మినీ కూపర్
హైదరాబాద్కు చెందిన ఒక మహిళా టెక్కీ తను చేస్తున్న ఉద్యోగం ద్వారా ఆమె కలల కారు ‘మినీ కూపర్ ఎస్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిహారిక నాయక్ అనే మహిళ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో తాను ఐకానిక్ వాహనాన్ని డెలివరీ అందుకుంటున్న క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన 16 ఏళ్ల కెరియర్ ప్రయాణం, మంచి జీతంతో ఈ కారును కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు.39 ఏళ్ల నిహారిక నాయక్ ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక మిడ్ సైజ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థలో క్వాలిటీ అస్యూరెన్స్ హెడ్గా 9 టూ 5 జాబ్ పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమె 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ‘నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ ఉద్యోగాలపై స్పష్టత లేదు. ఐటీ రంగం అస్థిరంగా ఉంది’ అని నిహారిక గుర్తు చేసుకున్నారు. ‘కానీ నేను ఆ రంగాన్ని ఎంచుకున్నాను. 16 సంవత్సరాలుగా దానిలోనే ఉన్నాను’ అని చెప్పారు.కెరియర్లో వృత్తిపరమైన ఎదుగుదల కోసం ఉద్యోగాలు మారడం ఆమెకు లాభదాయకమైన నిర్ణయంగా అనిపించిందని చెప్పారు. మేనేజర్ స్థానంలో ఉన్న ఆమె ప్రస్తుతం అధిక జీతం పొందుతున్నట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా ఒకే టెక్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్న ఆమె తన జీతం ఎంతో సరిగ్గా చెప్పనప్పటికీ సంవత్సరానికి రూ.45 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు ధ్రువీకరించారు. అయితే మొదట్లో ఐటీ ఉద్యోగంలో చాలా తక్కువగా వేలల్లోనే జీతం ఉండేదన్నారు. ఒకే రంగాన్ని నమ్ముకొని అందుకు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే జీతం అదే పెరుగుతుందన్నారు. నిహారిక నాయక్ మినీ కూపర్ ఎస్ ఆన్ రోడ్ ధర హైదరాబాద్లో రూ.65 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నరాల సమస్య -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో నరాల సమస్య
భారతదేశంలో హైదరాబాద్ వంటి టెక్ హబ్ల్లో యువ ఐటీ నిపుణులు ఆరోగ్య స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబిస్తున్నప్పటికీ, వారిలో కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం కారణంగా నరాల సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ఈ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శాశ్వత నరాల సమస్య సంభవించవచ్చని కొందరు చెబుతున్నారు.ఇటీవల క్లినిక్కు వస్తున్న యువ ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందని, వీరంతా నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులుగా భావించే ఈ నిపుణులు రోజువారీ సాధారణంగా కనిపించే సమస్యలతో వస్తున్నారని అంటున్నారు.సాధారణంగా కనిపించే లక్షణాలుపాదాలలో తిమ్మిరి లేదా జలదరింపుఆకస్మిక ఎలక్ట్రిక్ షాక్ లాంటి అనుభూతులుఏకాగ్రతకు కష్టపడటంవిశ్రాంతితో మెరుగుపడని అలసటమతిమరుపుమెట్లు ఎక్కేటప్పుడు అప్పుడప్పుడు బలహీనతఈ తరహా సమస్యలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత స్పష్టంగా గమనిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారుB12 లోపానికి ప్రధాన కారణాలుటీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడండెస్క్ల వద్ద ఎక్కువ గంటలు కూర్చోవడం. కదలిక లేకపోవడం, భోజనం సరిగా చేయకపోవడం.చాలా మంది సరైన సప్లిమెంట్స్ లేకుండా ఆహారాన్ని తీసుకుంటారు.మెట్ఫార్మిన్ (డయాబెటిస్ కోసం) లేదా యాసిడ్-తగ్గించే మందులు (పీపీఐ) వంటి వాటిని దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బీ12 మరింత తగ్గుతుంది.క్రమరహిత నిద్ర, పని సంబంధిత ఒత్తిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది కూడా బీ12 తగ్గిస్తుంది.శాశ్వత నష్టాన్ని నివారించడం అత్యవసరంనరాల ఇన్సులేషన్ (మైలిన్), మెదడు పనితీరు, మానసిక స్థితి సమతుల్యత, ఆరోగ్యకరమైన రక్త కణాలకు విటమిన్ బీ12 కీలకమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువ కాలం లోపం కొనసాగితే నరాల నష్టం కోలుకోలేనిదిగా మారవచ్చు. చాలా మంది యువ నిపుణులు తమ లక్షణాలను కేవలం పని ఒత్తిడిగా లేదా అలసటగా భావించి విస్మరిస్తారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడేం చేయాలి?ప్రాథమిక రక్త పరీక్ష ద్వారా విటమిన్ బీ12 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రారంభ దశలో సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా సాధారణంగా పూర్తిగా కోలుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జలదరింపు, తిమ్మిరి, నిరంతర అలసట వంటి సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక నరాల సమస్యలను నివారించడానికి ఏటా విటమిన్ బీ12 స్థాయిలను తనిఖీ చేయాలని, ఏదైనా సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించాలని సిఫార్సు చేస్తున్నారు.ఇదీ చదవండి: మిడ్నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్ -
ఖరీదైన ఆ బ్రాండ్కు బాస్ ఇండియన్ లేడీ..
షెనల్.. ఖరీదైన ఫ్యాషన్ ఉత్పత్తులకు పేరుగాంచిన ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ గురించి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసేవారికి తెలిసే ఉంటుంది. ‘అమ్మో ఆ బ్యాగ్ అన్ని లక్షలా..??’ అని సామాన్యులు కూడా ఆ బ్రాండ్ ఉత్పత్తుల ధరలు విని విస్తుపోతుంటారు. దీనికి బాస్ మన భారతీయురాలే. మహారాష్ట్రకు చెందిన లీనా నాయర్.. షెనల్కు సీఈవోగా కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ లో ఆమె షెనల్కు సీఈవో అయ్యారు.కొల్హాపూర్ నుంచి గ్లోబల్ లీడర్ షిప్ వరకు..మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన లీనా నాయర్ మహిళలకు పరిమిత అవకాశాలు ఉన్న సంప్రదాయవాద వాతావరణంలో పెరిగారు. ఆమె వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలయ్యారు. తరువాత ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏ అభ్యసించారు. అక్కడ ఆమె బంగారు పతకం సాధించారు.యూనిలీవర్ లో మూడు దశాబ్దాలులీనా నాయర్ 1992లో యూనిలీవర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016లో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అయ్యారు. ఈ పాత్రను నిర్వహించిన అతి పిన్న వయస్కురాలే కాదు.. మొదటి మహిళ కూడా లీనా కావడం గమనార్హం. యూనిలీవర్ లో, ఆమె 190 కి పైగా దేశాలలో హెచ్ఆర్ కార్యకలాపాలను పర్యవేక్షించారు.షెనెల్కు సీఈవోగాషెనెల్ 2021 డిసెంబర్ 14న నాయర్ ను గ్లోబల్ సీఈవోగా నియమించింది. వేగవంతమైన మార్పు కాలంలో ప్రైవేటుగా నిర్వహించే లగ్జరీ హౌస్ కు మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఆమెకు అప్పగించింది. అప్పటి నుండి ఆమె స్థిరత్వం, వైవిధ్యం, హస్త కళా ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆ బ్రాండ్ను మరింత విస్తృతం చేశారు.ప్రత్యేక గుర్తింపులులీనా నాయర్ ప్రసిద్ధ ఫినాన్షియల్ టైమ్స్ హీరోస్ (FT HERoes) ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ బిజినెస్లో చోటు సంపాదించారు. ప్రభావవంతమైన నిర్వహణ ఆలోచనాపరుల థింకర్స్ 50 జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు. లింక్డ్ఇన్ టాప్ వాయిస్ గానూ గౌరవం పొందారు. వ్యాపారం, వైవిధ్యం కోసం ఆమె చేసిన కృషికి ఆమె కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)ను కూడా అందుకున్నారు. -
రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ టాప్ ఉద్యోగులకు గుర్తింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర భారతీయ కంపెనీల కమ్యూనికేషన్, మార్కెటింగ్ చీఫ్లు.. ప్రోవోక్ మీడియా ‘2025 ప్రపంచ టాప్ 100 ప్రభావవంతమైన నాయకుల జాబితా’లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాచార సంబంధాలను గొప్పగా నిర్వహించే వారికి ఇందులో స్థానం కల్పించినట్టు ప్రోవోక్ మీడియా తెలిపింది. కంపెనీ ప్రతిష్టతను పెంచడం, ప్రజలతో సంబంధాల విషయంలో వీరి నిర్ణయాలు ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ గ్రూప్ కమ్యూనికేషన్స్ హెడ్ రోహిత్ బన్సాల్ ఇన్ఫోసిస్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభినవ్ కుమార్ వేదాంత గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ రీతు జింగాన్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సుజిత్ పటేల్ జిందాల్ స్టీల్ కార్పొరేట్ బ్రాండ్, కమ్యూనికే షన్‹Ù్స హెడ్ అర్పణ కుమార్ అహుజా ‘‘రిలయన్స్ ఇండస్టీస్ భారత్లోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీ. దేశ ఆర్థిక వ్యవస్థ బూమింగ్కు ఓ సింబల్. ఇంధనం, రిటైల్, వినోదం, టెలికం, మాస్ మీడియా, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కమ్యూనికేషన్ హెడ్గా రోహిత్ బన్సాల్ పాత్ర ఎంతో కీలకమైనది. జియోజెన్నెక్ట్స్కు రోహిత్ మెంటార్ కూడా. భారత్లో ప్రముఖ 100 మంది ప్రజా సంబంధాల నిపుణుల్లో మొదటి ర్యాంక్లో నిలుస్తారు’’అని ప్రోవోక్ మీడియా తెలిపింది. -
విమానయానంలో ఇండిగో ఆధిపత్యం
భారతీయ విమానయాన మార్కెట్లో 64 శాతం పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల అమలులో జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు 1,200కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 5న ఒక్కరోజే 1,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ సవాలుగా నిలిచింది.ఎఫ్డీటీఎల్ నిబంధనల్లో ఏముంది?జనవరి 2024లో డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలను ప్రకటించింది. వీటిని నవంబర్ 1, 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు..డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను, సిబ్బంది రోస్టర్ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.తాత్కాలిక రిలాక్సేషన్పరిస్థితి చేయిదాటిపోవడంతో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకుని డిసెంబర్ 5న డీజీసీఏ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఇండిగో A320 ఫ్లీట్కు మాత్రమే వర్తించేలా ఫిబ్రవరి 10, 2026 వరకు రిలాక్సేషన్లు మంజూరు చేశారు.ఇండిగో ఆధిపత్యంమార్కెట్ షేర్: ఆగస్టు 2025 నాటికి 64.2 శాతం డొమెస్టిక్ మార్కెట్ వాటాతో దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికులలో 6 మంది ఇండిగోలో ప్రయాణిస్తున్నారు.అంతర్జాతీయంగా ఆసియాలో 2వ అతిపెద్ద ఎయిర్లైన్గా నిలిచింది. ప్రపంచంలో 9వ అతిపెద్ద ప్యాసింజర్ క్యారియర్గా ఉంది.నవంబర్ 2025 నాటికి రోజుకు 2,700కి పైగా సర్వీసులు నడుపుతోంది.ఇదీ చదవండి: విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ -
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది. -
‘లాక్మే’ సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూత
ప్రసిద్ధ వ్యాపారవేత్త, ప్రముఖ కాస్మొటిక్ బ్రాండ్ లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా కన్నుమూశారు. లాక్మేను భారతదేశపు అత్యంత గుర్తింపు పొందిన బ్యూటీ బ్రాండ్లలో ఒకటిగా మార్చిన ఆమె 95 ఏళ్ల వయస్సులో శుక్రవారం తుది శ్వాస విడిచారు.ముంబైలోని స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ తమ ఎక్స్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. లాక్మే బ్రాండ్ను భారతదేశంలో ప్రముఖ కాస్మెటిక్ కంపెనీగా అభివృద్ధి చేయడంలో సిమోన్ టాటా కృషిని గుర్తు చేసుకుంటూ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. సిమోన్ టాటా కన్నుమూతపై లాక్మే ఇండియా కూడా సంతాపం తెలియజేసింది. లాక్మే వెనుక దార్శనికురాలిని కోల్పోయామంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.టాటా కుటుంబంలో చేరి..సిమోన్ టాటా.. ప్రసిద్ధ టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాకు తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు సవతి తల్లి. 1930లో జన్మించిన సిమోన్ డునోయర్ జెనీవాలో పెరిగారు. 1953లో పర్యాటకురాలిగా భారత్ వచ్చిన ఆమె నావల్ హెచ్ టాటాను వివాహమాడి ఇక్కడే స్థిరపడ్డారు. 1962లో టాటా ఆయిల్ మిల్స్కు చిన్న అనుబంధ సంస్థగా ఉన్న లాక్మే బోర్డులో చేరారు. అందం లగ్జరీ కాకూడదని, ప్రతి భారతీయ మహిళకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లాక్మే ఉత్పత్తులను అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేశారు.We mourn the passing of Simone Tata, a truly accomplished woman whose achievements and grace touched so many. Her legacy will continue to inspire generations. May she rest in peace. Our thoughts & prayers are with the Tata family 🙏#SimoneTata pic.twitter.com/y3sHlL7ngJ— Swiss Consulate Mumbai (@SwissCGMumbai) December 5, 2025 -
పసిడి రూ. 1,300 అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 1,32,900కి చేరింది. అటు వెండి సైతం కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 1,83,500 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర ఒక దశలో సుమారు 15.10 డాలర్లు పెరిగి 4,223.76 డాలర్లకు చేరింది. -
ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన పలు వెబ్సైట్లు
అమెరికన్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సంస్థ క్లౌడ్ఫ్లేర్ సేవలకు అంతరాయం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా పలు వెబ్సైట్లు స్తంభించాయి. క్లౌడ్ఫ్లేర్ వినియోగదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. భారత దేశానికి చెందిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లైన జెరోధా, గ్రో వెబ్సైట్లు కూడా పనిచేయలేదు. వీటితో పాటు కాన్వా, జూమ్, షాపిఫై, వాలరెంట్, లింక్డ్ఇన్, డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి.క్లౌడ్ఫ్లేర్ సేవల్లో అంతరాయం కారణంగా తాము సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ గ్రో (Groww) సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించింది. “క్లౌడ్ఫ్లేర్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కారణంగా మేము ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ యాప్లు, సేవలను ప్రభావితం చేస్తోంది. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. సేవలు పునరుద్ధరించబడిన వెంటనే మీకు తెలియజేస్తాం. మీ సహనానికి ధన్యవాదాలు,” అని ట్వీట్ చేసింది. తర్వాత పది నిమిషాలకు తమ సేవలను పునరుద్ధరించినట్టు ఎక్స్లో మరో పోస్ట్ పెట్టింది.అసౌకర్యానికి చింతిస్తున్నాంక్లౌడ్ఫ్లేర్లో క్రాస్-ప్లాట్ఫారమ్ డౌన్టైమ్ కారణంగా కైట్ యాప్ సేవలు నిలిచిపోయాయని జెరోధా పేర్కొంది. ట్రేడింగ్ కోసం కైట్ వాట్సాప్ బ్యాకప్ను ఉపయోగించుకోవాలని తమ వినియోగదారులకు ఎక్స్ ద్వారా సూచించింది. సమస్య పరిష్కారమైందని, కైట్ యాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయని కొంత సేపటి తర్వాత ప్రకటించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. జెరోధా కైట్ అనేది ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, యాప్.క్లౌడ్ఫ్లేర్ ఏం చేస్తుంది?అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్ఫ్లేర్ అతిపెద్ద ఇంటర్నెట్ (Internet) నిర్వహణ కంపెనీల్లో ఒకటి. ఇంటర్నెట్కు సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తోంది. వెబ్సైట్లు, యాప్లు, నెట్వర్క్లను వేగంగా, సురక్షితంగా ఉంచడానికి అవసరమైన సర్వీసులు ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లౌడ్ఫ్లేర్కు 3 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఒక త్రైమాసికంలో దాదాపు $500 మిలియన్లను ఆర్జిస్తుందని ద గార్డియన్ వెల్లడించింది.చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..కారణాలు అన్వేషిస్తున్నాంసేవల్లో అంతరాయానికి గల కారణాలను క్లౌడ్ఫ్లేర్ (Cloudflare) వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల వెబ్సైట్లు స్తంభించడంతో సమస్యను వెంటనే పరిష్కరించామని ప్రకటించింది. సమస్య తలెత్తడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. నవంబర్ 18న కూడా క్లౌడ్ఫ్లేర్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో చాట్జీపీటీ, స్పాటిఫై, ఎక్స్ వెబ్సైట్లు స్తంభించాయి.తమ డేటాబేస్లో చేసిన మార్పు వల్ల ఇది సంభవించిందని సీఈవో మాథ్యూ ప్రిన్స్ తెలిపారు. -
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా.. -
ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్గా ఒరిజినల్ పేమెంట్ మోడ్కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను, సిబ్బంది రోస్టర్ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.సిబ్బంది కొరతకొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం -
లెన్స్కార్ట్ లాభం పెరిగింది..
ఐవేర్ కంపెనీ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 103.4 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 86.3 కోట్లతో పోలిస్తే ఇది 19.8 శాతం అధికం. ఉత్పత్తులపై మార్జిన్ 68.1 శాతం నుంచి 69.2 శాతానికి పెరిగింది. అటు ఆదాయం రూ. 1,736 కోట్ల నుంచి రూ. 2,096 కోట్లకు (21 శాతం వృద్ధి) చేరింది.రెండు కీలక విభాగాలు – కంటి పరీక్షలు, కళ్లద్దాల అమ్మకాలు – వరుసగా 44.3 శాతం, 20.2 శాతం మేర పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో తాము 1.3 కోట్ల కంటి పరీక్షలు చేసినట్లు సంస్థ సీఈవో పీయుష్ బన్సల్ తెలిపారు. అంతకు రెండేళ్ల క్రితం చేసిన 50 లక్షలతో పోలిస్తే ఇది వార్షికంగా 63 శాతం వృద్ధి అని పేర్కొన్నారు.సంస్థ డిజిటల్ విస్తరణపైనా దృష్టి సారించింది. కస్టమర్లకు వ్యక్తిగతీకరించిన ఫ్రేమ్ సూచనలు అందించేందుకు ఏఐ ఆధారిత రికమెండేషన్ సిస్టమ్ను మరింత మెరుగుపరుస్తున్నట్లు కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో టయర్–2, టయర్–3 నగరాల్లో కొత్త స్టోర్లను ప్రారంభించి భౌతిక రిటైల్ నెట్వర్క్ను వేగంగా విస్తరించాలనే వ్యూహాన్ని లెన్స్కార్ట్ అమలు చేస్తోంది. -
రూ .1,120 కోట్ల ఆస్తులు జప్తు.. అనిల్ అంబానీకి ఈడీ షాక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్ మోసం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రూ .1,120 కోట్ల విలువైన 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది.ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందినవి 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్కు చెందినవి 2 ప్రాపర్టీలు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. అలాగేరిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.వీటితో పాటు గమేషా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్తోపాటు రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రకటిత పెట్టుబడులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. The Enforcement Directorate has attached over 18 properties, Fixed Deposits, Bank Balance, and Shareholding in Unquoted Investments of the Reliance Anil Ambani Group worth ₹1,120 Crore in the Reliance Home Finance Limited/Reliance Commercial Finance Limited/Yes Bank Fraud Case.… pic.twitter.com/556XsF7VvB— ANI (@ANI) December 5, 2025 -
ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!
దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్ ఛార్టర్ ఆఫ్ రైట్స్ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.విమానయాన సంస్థల బాధ్యతలుసమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్ అయితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి. ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్ ధర రిఫండ్ చేయాలి. భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్మెంట్ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.ప్రయాణికుల హక్కులు ఇవే..విమానం క్యాన్సిల్ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓవర్బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్ పూర్తి రిఫండ్తోపాటు పరిహారం పొందవచ్చు.లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్ బుక్ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు. విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్మెంట్ సౌకర్యం కల్పించాల్సిందే.24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.విమానాల క్యాన్సిలేషన్ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి. అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు. -
సంక్షోభంలో విమానయానం: ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?
తక్కువ సమయంలో సుదూర గమ్యాలకు చేరుకొనే వీలు, ప్రయాణ సౌకర్యం ఉంటుందనే భావనతో విమానయానానికి మొగ్గుచూపడం సర్వసాధారణం. కానీ, కొద్దికాలంగా విమాన యానమంటే ఎన్నడూ లేనంత అనిశ్చితి నెలకొనడం విడ్డూరం. విమాన సర్వీసుల్లో విపరీతమైన జాప్యాలు, ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సర్వీసు రద్దవడాలు, ఎప్పుడు ఎలా చేరతామో తెలియని దుఃస్థితి వగైరా దేశీయంగా ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి. తాజాగా ‘ఇండిగో’ విమానసేవల్లో నెలకొన్న సంక్షోభం దేశీయ విమానయాన రంగంలోని అనేక లోపాలకు అద్దం పడుతోంది. తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.ఇప్పుడేం జరిగింది?కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిర్వహణపరమైన సంక్షోభంలో చిక్కు కున్నాయి. ఒక్క డిసెంబర్ తొలి వారంలోనే కనీసం మూడు రోజులుగా కొన్ని వందల సంఖ్యలో ఫ్లైట్లు ఆఖరి నిమిషంలో రద్దయ్యాయి. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో గంటలు, పూటలకొద్దీ జాప్యాలతో లక్షలాది ప్రయా ణికులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. అత్యవ సర పనుల మీదున్న జనం ఈ అంతులేని ప్రయాణ కష్టాలతో ఆగ్రహించారు. చివరకు కనివిని ఎరుగని ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవి యేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేప ట్టింది. సంక్షోభ కారణాలను వివరించాలనీ, విమాన సర్వీసులను చక్కదిద్దేందుకు అత్యవసర ప్రణాళికను అందజేయా లనీ ఇండిగోను గురువారం ఆదేశించింది.ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?అధికారిక గణాంకాల ప్రకారం ఇండిగో దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45కి పైగా గమ్యస్థానా లకు ప్రయాణికులను చేరుస్తోంది. దాదాపు 400 పైచిలుకు విమానాలు దానికున్నాయి. రోజూ 2300కి పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 11.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 2024లో కొత్తగా 58 విమానాల్ని కూడా సమకూర్చుకుంది. అయితే, విమానయానం పెరుగుతున్న సమయంలో ఇది ఏ మాత్రం సరి పోదు. పైగా పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా తగినంతమంది పైలట్లూ లేరు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ మాటల్లో చెప్పాలంటే, సిబ్బంది కొరత వల్లే ఈ జాప్యాలు, సర్వీసుల రద్దు లాంటి వన్నీ! ఎమిరేట్స్ ఈ వారంలోనే పెద్దయెత్తున నియా మకాలు చేపట్టడంతో ఇండిగోకు కాక్పిట్, క్యాబిన్ సిబ్బంది కూడా తీవ్రంగా కొరవడినట్టు భోగట్టా.కొత్త షరతులతో తలనొప్పి?లోతుకు వెళితే, వైమానిక డ్యూటీ సమయ పరిమితి (ఎఫ్డీటీఎల్)కి సంబంధించిన నిబంధనలు మారాయి. వాటిలో తొలి విడత జూలై 1 నుంచి, రెండో విడతవి నవంబర్1 నుంచి అమలయ్యాయి. పైలట్ల విశ్రాంతి, నైట్డ్యూటీ రూల్స్ కట్టుదిట్టమయ్యాయి. పైలట్లకు ఏకబిగిన 48 గంటల విరామమివ్వాలి, వరుసగా 2 నైట్ డ్యూటీలు మించకూడదు. వీటి వల్ల, అడిగిన వెంటనే సిబ్బంది అందుబాటులో ఉండే పాత రోజులు పోయాయి. అలాగే, చలికాలంలో సాంకేతి కంగా ఉండే చిన్న చిన్న చిక్కులు, ప్రతికూల వాతా వరణాలు, ప్రయాణాల సీజన్ కావడంతో ఉండే రద్దీ లాంటివన్నీ కలసి తలకు మించిన భారమయ్యాయి. ఒక్క నవంబర్లోనే ఇండిగో 1232 సర్వీసులు రద్దు చేసింది. ఇందులో 62 శాతం దాకా చిక్కులకు సిబ్బంది కొరత, ఎఫ్డీటీఎల్ షరతులే కారణం. వంద లాది సర్వీసులు రద్దవడంతో ఆ సంస్థ షేర్లు కూడా 3 శాతం పైగా పడిపోవడం గమనార్హం. మన దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం వాటా ఇండిగోదే కావడంతో సర్వీసులో రద్దుతో ఒక్క సారిగా టికెట్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి.ఇకపై ఏం చేయాలి?ఇటీవల సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యలతో ఎయిర్ బస్లు స్తంభించాయి. ఇప్పుడీ ఇండిగో సమస్య. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగున్న విమాన యాన మార్కెట్ మనది. పెరుగుతున్న ఆ డిమాండ్కు తగ్గట్టు పైలట్లు లేరు. వచ్చే దశాబ్ద కాలంలో మనకు 30 వేల మంది కొత్త పైలట్లు కావాలి. కానీ, అందుకు తగ్గ ప్రాథమిక వసతులు, శిక్షణ సౌకర్యం, నిధులు కరవే. ఇకనైనా మరోసారి ఇలాంటి సంక్షో భాలు తలెత్తకూడదంటే, అదనపు సిబ్బంది అందు బాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం. తక్కువ సిబ్బంది, తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చి ఆలోచనతో పెనాల్టీల పాలై, పేరు పోగొట్టుకునే కన్నా అది మేలు. ఖర్చు గిట్టు బాటయ్యేలా చూసుకుంటూనే నిర్వహణ సామర్థ్యం బలోపేతం చేసుకొని, సమతూకం పాటించడం అత్యవసరమన్నది తాజా ఉదంతం అన్ని ఎయిర్ లైన్స్కూ నేర్పుతున్న పాఠం. నేర్చుకోకపోతే ఈ కష్టాల సీరియల్ కొనసాగక మానదు. -
టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ
టెక్ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధ(ఏఐ) కాదని, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించుకోవడమేనని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగ కోతలను సహజ దిద్దుబాటు(Natural Correction)గా అభివర్ణించారు.అతిగా నియామకాలు..1990 నుంచి ఐబీఎంలో వివిధ విభాగాలకు నాయకత్వ పాత్రలు నిర్వహిస్తున్న కృష్ణ 2020 నుంచి 2023 మధ్య చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 30% నుంచి 100% వరకు వేగంగా పెంచాయని వివరించారు. దాంతో కొంత సహజ దిద్దుబాటు జరగబోతోందని చెప్పారు.ఈ ఏడాది ఐబీఎం తన ప్రపంచ శ్రామిక శక్తిలో వేలాది ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తొలగింపులు ఏఐ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబీఎం 2,70,000 ప్రపంచ శ్రామిక శక్తిలో సింగిల్ డిజిట్ శాతంగా ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ వంటి అధిక లాభదాయకత గల వ్యాపారాలపై పెట్టుబడులను పెంచుతోంది.ఉద్యోగాలపై ఏఐ ప్రభావంఉద్యోగాలపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావం గురించి అడిగినప్పుడు, కొంతమేర ఉద్యోగ స్థానభ్రంశం (Job Displacement) ఉంటుందని కృష్ణ అంగీకరించారు. అయితే అది తీవ్రంగా ఉండదని అన్నారు. ‘రాబోయే రెండేళ్లలో మొత్తం యూఎస్ ఉపాధి పూల్లో 10 శాతం వరకు ఉద్యోగ స్థానభ్రంశం ఉండవచ్చు’ అని అంచనా వేశారు. ఈ ప్రభావం కొన్ని విభాగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.కృత్రిమ మేధ కేవలం ఎంట్రీ లెవల్ శ్రమను తగ్గించడానికి మాత్రమే అనుసరించే విధానం అన్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్నందున కంపెనీలు కొత్త రకాల పాత్రల్లో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయని కృష్ణ తెలిపారు.ఇదీ చదవండి: యూఎస్లో చదువుకు రూ.10 కోట్లు! -
యూఎస్లో చదువుకు రూ.10 కోట్లు!
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనం (డెప్రిసియేషన్) తీవ్ర రూపం దాల్చింది. నేడు మార్కెట్లో ఒక డాలర్ విలువ సుమారు రూ.90.3గా నమోదైంది. దాంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 4.83% మేర క్షీణించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా అంతర్జాతీయ విద్యా ఖర్చులపై దీర్ఘకాలిక ప్రణాళిక గురించి భారతీయ కుటుంబాలను హెచ్చరించారు.రూపాయి విలువ 90 మార్కును దాటిన తర్వాత తన ఎక్స్ ఖాతాలో కరెన్సీ పతనం ప్రభావాన్ని వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో తమ పిల్లల చదువుల కోసం చూస్తున్న లక్షలాది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు.యూఎస్ డిగ్రీకి రూ.10 కోట్ల కార్పస్ ఎందుకు?మే నెలలో తాను పోస్ట్ చేసిన ఒక విశ్లేషణను గుప్తా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ‘గతంలో యూఎస్ ఎడ్యుకేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పినప్పుడు ఈ సంఖ్యపై చాలా సందేశాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు రూపాయి 90కి చేరుకున్న తర్వాత ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఆ పాత పోస్ట్లో ఆమె తన చిన్న కుమారుడు యూఎస్లోని డిగ్రీ చేయడం కోసం రూ.8-10 కోట్ల కార్పస్ (పెట్టుబడి నిధి) లక్ష్యంగా పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు.‘ఈరోజు సుమారు రూ.2.5 కోట్లు ఖర్చవుతున్న యూఎస్ డిగ్రీ 16 సంవత్సరాల్లో దాదాపు రూ.10 కోట్లకు పెరుగుతుంది’ అని ఆమె లెక్కలను పంచుకున్నారు. ఇక్కడ కేవలం దేశీయ ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ఏటా 2-4% చొప్పున జరిగే కరెన్సీ డెప్రిసియేషన్ను కూడా లెక్కించాలని ఆమె సూచించారు. దేశీయ ఎగుమతులకు మద్దతు ఇవ్వడానికి పోటీ అవసరం కాబట్టి దీర్ఘకాలంలో కరెన్సీ తగ్గుదలను పరిగణించడం సురక్షితమైన ప్రణాళిక అని ఆమె చెప్పారు.విదేశీ ఆస్తుల్లో డైవర్సిఫికేషన్అంతర్జాతీయ ఆస్తుల్లో వైవిధ్యీకరణ ఉండాలని రాధికా గుప్తా సిఫారసు చేశారు. విదేశీ కరెన్సీలో ఖర్చు చేయబోయే కుటుంబాలకు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆ కరెన్సీకి లింక్ అయిన ఆస్తుల్లో ఉంచడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవచ్చని తెలిపారు. అయితే, ఈ వైవిధ్యీకరణకు అడ్డంకిగా ఉన్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితుల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ పరిమితులు చాలా మంది భారతీయులకు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను కష్టతరం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.గిఫ్ట్ సిటీ ద్వారా కొత్త మార్గాలుఈ పరిమితులకు త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశం ఉందని గుప్తా సూచించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. గుజరాత్లోని గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిటీ (గిఫ్ట్ సిటీ) అనేది ఎల్ఆర్ఎస్ పరిమితులకు లోబడకుండా మ్యూచువల్ ఫండ్ల ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: 20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్! -
నాలుగేళ్లు కష్టపడి రూ.9 వేలు సంపాదన
ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి అపురూప క్షణమే ఢిల్లీకి చెందిన ఓపెన్సాక్స్.ఏఐ (Opensox.ai) వ్యవస్థాపకుడు అజిత్ జీవితంలో చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు నాలుగేళ్ల శ్రమ తర్వాత యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన అందుకున్నాడు. దీని వివరాలు అజిత్ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.అనుమానించినా నమ్మకం కోల్పోలేదుఅజిత్ తన తమ్ముడి విజయాన్ని ఆన్లైన్లో పంచుకున్నప్పుడు ఆ పోస్ట్ తక్షణమే వేలమంది దృష్టిని ఆకర్షించింది. ‘నా తమ్ముడు ఈ రోజు కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు’ అని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారంతా తమ్ముడిని అనుమానించినా అజిత్ మాత్రం నిరంతరం అతనికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘అతను తన కలలను పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను’ అని అజిత్ రాశారు. ‘ప్రతి ఒక్కరూ అతనిని చూసి నవ్వినప్పుడు తనకు అండగా నేను మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. యూట్యూబ్ ద్వారా తన తమ్ముడు నాలుగేళ్లు కష్టపడి రూ.9000 సంపాదించినట్లు ఉన్న స్క్రీన్షాట్ను పంచుకున్నారు. ఎంత డబ్బు అకౌంట్లో క్రెడిట్ అయిందనే విషయాన్ని పక్కనుంచితే ఈ పోస్ట్ భావోద్వేగ సంతృప్తిని కలిగించినట్లు చెప్పుకొచ్చారు.my younger brother has been working hard for the last 4 years to see this day.first income from youtube. ❤️still remember when everyone used to laugh at him and i was the only one he had to share things about his dreams.day is made. ❤️ pic.twitter.com/t4TYoiJGAk— Ajeet ( opensox.ai ) (@ajeetunc) December 1, 2025కష్టానికి దక్కిన ప్రతిఫలంతమ్ముడి విజయాన్ని ప్రకటించిన అజిత్ పోస్ట్పై నెటిజన్లు స్పందించారు. ఒక వినియోగదారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ‘ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేస్తే ప్రజలు ఎలాంటి పాయింట్ లేకుండా విమర్శిస్తారు. కానీ చాలా కష్టపడి పనిచేసిన తర్వాత బహుమతి పొందడం చాలా తృప్తిని ఇస్తుంది’ అన్నారు. మరొక వినియోగదారు ‘గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన కృషికి ఇది ప్రతిఫలం. అతనికి ఆల్ ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
జోహో సీఈఓ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు ఏటా జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ఎదుర్కొని ఐఐటీల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, సాంప్రదాయ విద్యా విధానంపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించాలని, ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదని జోహో సీఈఓ, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.శ్రీధర్ వెంబు తమ కంపెనీ జోహోలో ఏ ఉద్యోగానికీ కాలేజీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి తేవడం మానుకోవాలని కూడా కోరారు.కాలేజీ డిగ్రీ ఎందుకు..?యూఎస్ ఆధారిత సంస్థ పాలంటిర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్లను నేరుగా కీలకమైన సాంకేతిక, జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతిచ్చింది. ఈ కొత్త నియామక విధానంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ విధానంలో దాదాపు 500 మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకోగా 22 మంది ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు డిగ్రీతో పనిలేకుండా నిజాయతీగా పని చేయాలని కోరుకునే యువతలో వస్తున్న సాంస్కృతిక మార్పును హైలైట్ చేశారు.‘స్మార్ట్ అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేస్తున్నారు. ముందుచూపుతో ఆలోచించే కంపెనీల యజమానులు వారికి అవకాశం ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ధోరణి వల్ల పేరెంట్స్ భారీ అప్పులు చేయకుండానే యువత తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని, చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక సానుకూల పరిణామమని చెప్పారు.తల్లిదండ్రులకు విజ్ఞప్తిఈ పరిణామాలను గమనించాలని వెంబు ప్రత్యేకంగా భారతీయ తల్లిదండ్రులను, కంపెనీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ‘విద్యావంతులైన భారతీయ తల్లిదండ్రులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రముఖ కంపెనీలు శ్రద్ధ వహించాలని నేను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు. భారతదేశంలో తరతరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీ డిగ్రీలకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.జోహో నియామక విధానంజోహో నియామక విధానాన్ని వివరిస్తూ వెంబు ‘జోహోలో ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదు. కొంతమంది మేనేజర్లు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే మీ వద్ద ఉన్న నైపుణ్యాలను క్లుప్తంగా వివరిస్తూ డిగ్రీ అవసరాన్ని తొలగించడానికి మర్యాదపూర్వకమైన సందేశాన్ని పంపండి’ అని తెలిపారు. తమిళనాడులోని కంపెనీ యూనిట్లో తాను సగటున 19 ఏళ్ల వయసు కలిగిన బృందంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘వారితో కలిసి పనిచేయడానికి నేను చాలా కష్టపడాలి’ అని వెంబు ఆ యువత సామర్థ్యాన్ని కొనియాడారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కార్యాచరణ, సాంకేతిక సంబంధిత సమస్యల కారణంగా అనేక సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయి ప్రయాణ ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి.భోపాల్కు రూ.1.3 లక్షలుఇండిగో కొన్ని విమానాలను రద్దు చేసుకున్న కారణంగా ఎయిర్ ఇండియా అనేక మార్గాల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెంచేసినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్-భోపాల్ మార్గంలో ఎయిర్ ఇండియా ఛార్జీలు దాదాపు రూ.1.3 లక్షలకు చేరుకోవడం ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని సంస్థలు వెల్లడించించిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి భోపాల్ వెళ్లే కనెక్టెడ్ ఫ్లైట్స్లో రాత్రిపూట టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.ఎకానమీ: రూ. 1.03 లక్షలుబిజినెస్ క్లాస్: రూ. 1.3 లక్షలుఎయిరిండియా పోర్టల్లో ఈ అత్యధిక ధరలున్నా కేవలం ఒక సీటు మాత్రమే మిగిలి ఉన్నట్లు చూపించింది.#WATCH | Telangana: Chaos at Rajiv Gandhi International Airport in Hyderabad amid delay in IndiGo flights' movement. pic.twitter.com/U46cyOmJxZ— ANI (@ANI) December 4, 2025ఇండిగో విమానాల రద్దు ప్రభావంహైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఇండిగో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీనితో మిగిలిన విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా నెట్వర్క్లో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. విమానాశ్రయ అథారిటీ సైతం ఈ అంతరాయాలను ధ్రువీకరిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. అనేక ఇండిగో విమానాలు ‘విమానయాన సంబంధిత సాంకేతికత, కార్యాచరణ సమస్యల వల్ల రద్దు అయ్యాయి’ అని పేర్కొంది.ఇండిగో ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలను పర్యవేక్షించి ప్రయాణీకుల ఫిర్యాదులను సమీక్షించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే.. -
రష్యా అధ్యక్షుడి పర్యటన.. మామూలు ఖర్చు కాదు..!!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై అడుగు పెడుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 4న మన దేశానికి వస్తున్నారు. ఇందు కోసం భారత్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.పుతిన్ భారత్ పర్యటనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మోదీ-పుతిన్ ముఖాముఖి సంభాషణ జరుగుతోంది. దీంతో ఉత్సుకత మరింత పెరిగింది. దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు ఎంత ఖర్చు అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం..రూ.150 కోట్లు!భద్రతాపరమైన కారణాలతో సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయదు. అయినప్పటికీ మీడియా అంచనాలు, గత పర్యటనల వ్యయ నమూనాల ప్రకారం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నిమిత్తం ప్రభుత్వానికి రూ.50 కోట్ల నుండి రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అధికారిక గణాంకాలు విడుదల కానప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది మరింత ఖరీదైన దౌత్య పర్యటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఢిల్లీ స్టార్ హోటళ్ల ధరలకు రెక్కలుపుతిన్ పర్యటన కారణంగా న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. దీంతో ఆయా హోటళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చెందిన 4,700 చదరపు అడుగుల 'గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్'లో పుతిన్ ఉంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక తెలిపింది. ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయనకు ముందు అధ్యక్షులు జో బైడెన్, బిల్ క్లింటన్ వంటి అగ్రశ్రేణి ప్రముఖులు కూడా గతంలో ఇదే సూట్లో బస చేశారు.హై ప్రొఫైల్ ప్రతినిధుల రాక, పెరిగిన భద్రతా అవసరాలు కూడా హోటల్ సుంకాలను గణనీయంగా పెంచాయి. రష్యన్ బృందం, ఇతర దౌత్య మిషన్ల డిమాండ్ కారణంగా ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లు రేట్లను ఒక్క రాత్రి బసకు రూ.85వేల నుంచి రూ.1.3 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది. -
ఆగ్రో కెమికల్స్కు డిమాండ్
ఆగ్రో కెమికల్స్కు (వ్యవసాయ సంబంధిత రసాయనాలు) డిమాండ్ అంతర్జాతీయంగా కోలుకుంటుండడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆదాయం 6–7 శాతం పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా సాగుకు సంబంధించి నెలకొన్న సానుకూల సెంటిమెంట్తో ఎగుమతుల ఆదాయం 8–9 శాతం పెరుగుతుందని పేర్కొంది. అధిక వర్షాలతో పంటలు దెబ్బతినడం, ఉత్పత్తులు వెనక్కి రావడం, సాగు సన్నద్ధత వంటి అంశాలు దేశీయ డిమాండ్కు సమస్యలుగా ఉన్నట్టు తెలిపింది.‘‘రెండు సంవత్సరాల స్థిరీకరణ తర్వాత ఆగ్రో కెమికల్స్ రంగంలో ఆదాయం 2025–26లో 6–7 శాతం పెరగొచ్చు. ఇది కూడా ధరల పెంపు ద్వారా కాకుండా అధిక అమ్మకాల రూపంలో రానుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ఇన్వెంటరీలు (స్టాక్ నిల్వలు) కూడా సాధారణ స్థాయికి చేరడం ఆదాయం వృద్ధికి అనుకూలిస్తుందని చెప్పారు.ఇక ఆగ్రోకెమికల్స్ పరిశ్రమ తన దీర్ఘకాల వృద్ధి అయిన 8–10 శాతానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. అయితే, ఎగుమతులు స్థిరంగా కొనసాగడం, దేశీ డిమాండ్ పుంజుకోవడంపై ఈ వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. పరిశ్రమ ఆదాయంలో దేశీ, విదేశీ మార్కెట్లో చెరో సగం వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. ముడి సరుకుల ధరలు స్థిరంగా ఉండడం, అమెరికా టారిఫ్ల ప్రభావంతో నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక శ్రేణి పరిధిలోనే ఉంటాయని అంచనా వేసింది.రుణ భారం నియంత్రణలోనే.. తక్కువ మూలధన వ్యయాలు, స్థిరమన మూలధన నిధులతో ఆగ్రో కెమికల్ కంపెనీల రుణభారం నియంత్రణల్లోనే ఉంటుందని, దీంతో రుణ పరపతిని మెరుగ్గా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. లాక్డౌన్ అనంతరం పేరుకున్న నిల్వలు తగ్గిపోవడంతో దేశీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు స్థిరపడినట్టు తెలిపింది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆగ్రో కెమికల్Šస్పై కిలోకి 5 డాలర్ల ప్రయోజనం ఒనగూరుతోందని, గతేడాది స్థాయిలోనే ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇదే కొనసాగొచ్చని అంచనా అంచనా వ్యక్తం చేసింది. నిల్వలు తగ్గడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో సరఫరాలు స్థిరపడతాయని పేర్కొంది.‘‘ఆగ్రో కెమికల్స్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 12.5–13 శాతంగా ఉండొచ్చు. అయినప్పటికీ కరోనా ముందున్న 15 శాతం కంటే తక్కువే. 2024లో ప్రతికూలతల అనంతరం ఈ స్థిరత్వం నెలకొంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, వ్యయ నియంత్రణలు ఇందుకు అనుకూలిస్తున్నాయి. దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ఏటా రూ.5,500 కోట్ల పెట్టుబుడులు పెడుతుండడం, కొత్త ఉత్పత్తుల రిజి్రస్టేషన్లు, క్రమశిక్షణతో కూడిన మూలధన నిధుల నిర్వహణ వంటివి.. రుణ అవసరాలను తక్కువకు పరిమితం చేస్తాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ వివరించారు.అయినప్పటికీ ఈ రంగం పనితీరుపై వాతావరణ మార్పులు, నియంత్రణలను కఠినతరం చేయడం, రూపాయి మారకం విలువల ప్రభావాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే, తెర వెనుక ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. తాజా అంచనాల ప్రకారం, క్రీడా ఫ్రాంఛైజీల యాజమాన్యం నుంచి గ్లోబల్ బ్రాండ్ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల వరకు విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం నికర విలువ సుమారు రూ.280 కోట్లుగా ఉంది. హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అమితాబ్ బచ్చన్ నేతృత్వంలోని బచ్చన్ కుటుంబం మొత్తం విలువ రూ.1,630 కోట్లుగా ఉంది.జైపూర్ పింక్ పాంథర్స్ (JPP)అభిషేక్ బచ్చన్ 2014లో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్ పాంథర్స్ (జేపీపీ) జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 100 రెట్లు పెరిగిందని తానే స్వయంగా వెల్లడించారు. పీకేఎల్ ప్రారంభ సంవత్సరం (2014)లోనే ఛాంపియన్షిప్ను గెలుచుకున్న ఈ జట్టు రెండో సీజన్ నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారింది. పీకేఎల్ సీజన్-12 ఆక్షన్లో జేపీపీ రైడర్ నితిన్ కుమార్ ధంఖర్ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది.ఫుట్బాల్.. చెన్నైయిన్ ఎఫ్సీ (CFC)కబడ్డీతో పాటు అభిషేక్కు ఫుట్బాల్ పట్ల ఉన్న ఆసక్తితో 2014లో ఎంఎస్ ధోనీతో కలిసి చెన్నైయిన్ ఎఫ్సీ (ఐఎస్ఎల్) సహ-యాజమానిగా మారారు. 2025-26 సీజన్లో కూడా జట్టు పోటీ పడుతోంది. ఇటీవల అక్టోబరు 2025లో జరిగిన ఏఐఎఫ్ఎఫ్ సూపర్ కప్లో క్లిఫర్డ్ మిరాండా నేతృత్వంలో పాల్గొంది.రియల్ ఎస్టేట్, స్టార్టప్ పెట్టుబడులుఅభిషేక్ బచ్చన్ తన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆహార బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టారు. 2020 నుంచి 2024 మధ్య బచ్చన్ కుటుంబం భారతదేశవ్యాప్తంగా రూ.220 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసింది. 2024లో ముంబైలోని ఒబెరాయ్ రియల్టీస్ ఎటర్నియాలో రూ.24.95 కోట్లకు 10 అపార్ట్మెంట్లను (అభిషేక్ 6, అమితాబ్ 4), బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రూ.15.42 కోట్లకు 6 అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు.2015లో సింగపూర్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్ ‘జిడ్డు’లో చేసిన రూ.2 కోట్ల పెట్టుబడి 2017లో లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు సమయంలో బిట్కాయిన్ పెరుగుదల వల్ల రూ.112 కోట్ల భారీ లాభాన్ని ఇచ్చింది. ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు ఆమోదించిన వహ్దామ్ టీ లేబుల్లో ఏంజెల్ ఇన్వెస్టర్గా ఉన్నారు. జెప్టో, జీక్యూఐ వంటి స్టార్టప్లలో కూడా పెట్టుబడి పెట్టారు.నిర్మాతగా..అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని ఏబీ కార్ప్ (AB Corp)లో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పా (2009), షమితాబ్ (2015), ఘూమర్ (2023) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. పా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది. -
ఏఐ యుగంలో కావాల్సింది అదే..
కృత్రిమ మేధ(ఏఐ) చాలా సాంకేతిక పనులను నిర్వహిస్తున్నందున ఉద్యోగ ప్రపంచంలో భావోద్వేగ మేధ(EQ), ట్రేడిషనల్ ఇంటెలిజెన్స్(సాంప్రదాయ మేధ IQ) కీలకమవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అదే సమయంలో భావోద్వేగ మేధ లేకుండా సాంప్రదాయ మేధపై మాత్రమే ఆధారపడలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవల యాక్సెల్ స్ప్రింగర్ సీఈఓ మాథియాస్ డాఫ్నర్తో జరిగిన ‘ఎండీ మీట్స్’ పోడ్కాస్ట్లో నాదెళ్ల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.‘నాయకులకు కేవలం ఈక్యూ లేకుండా ఐక్యూ ఉంటే సరిపోదు. సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ కావాల్సిందే. ఏఐ సాంకేతిక పనులను ఎక్కువగా నిర్వహిస్తున్న తరుణంలో సాఫ్ట్ స్కిల్స్ కీలకంగా మారాయి. ఇది వ్యాపారంలో ముఖ్యమైన నైపుణ్యంగా, ఒక సూపర్ పవర్గా మారుతోంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి’ అని చెప్పారు.ఏఐ రేసులో మెరుగైన పోటీ కోసం నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఇటీవల అనేక కీలక మార్పులు చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్లో విజయం సాధించడానికి ఇటీవల క్లౌడ్ ఎక్స్పర్ట్ రోల్ఫ్ హార్మ్స్ను ఏఐ ఎకనామిక్స్ అడ్వైజర్గా నియమించారు. అక్టోబర్ 2025లో మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిజినెస్ సీఈఓని నియమించి తాను పూర్తిగా ఏఐ టెక్నికల్ అంశాలపై దృష్టి పెడుతున్నారు. కంపెనీ తమ కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్తో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI) వైపు పయనిస్తోంది.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే! -
‘ఫ్రాడ్’ ట్యాగ్.. హైకోర్టు తీర్పుపై సవాల్
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) ఛైర్మన్ అనిల్ అంబానీ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వ్యక్తిగత ఖాతాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ వర్గీకరించిన నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అప్పీల్ గత వారం చివరిలో దాఖలు చేయబడినప్పటికీ కేసు ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్పై బ్యాంకులు, దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.కేసు వివరాలుఎస్బీఐ ఈ ఏడాది జూన్లో ఆర్కామ్ లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్’ గుర్తించింది. రుణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అయితే దీనిపై అనిల్ అంబానీ స్పందిస్తూ, ఎస్బీఐ సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, విచారణ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషన్లో తెలిపారు.బాంబే హైకోర్టు తీర్పుఅక్టోబర్ 3, 2025న బాంబే హైకోర్టులోని జస్టిస్ రేవతీ మోహిటే డేరే, నీలా గోఖలేల డివిజన్ బెంచ్ అంబానీ పిటిషన్ను తిరస్కరించింది. ఎస్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ డైరెక్షన్స్ను పాటించిందని, అంబానీ కంపెనీ ప్రమోటర్గా, కంట్రోలింగ్ పర్సన్గా ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఇతర బ్యాంకులుఎస్బీఐతో పాటు ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఆర్కామ్ ఖాతాలను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025లో రూ.400 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.దర్యాప్తు సంస్థల దూకుడుఎస్బీఐ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 21, 2025న కేసు నమోదు చేసి రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆర్కామ్, అంబానీ నివాసం సహా పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 2025లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. నవంబర్ 2025లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) కూడా నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాలపై విచారణ ప్రారంభించింది.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే! -
‘నా కూతురు ఎప్పుడైనా అనుమతి లేకుండా రావొచ్చు’
టాప్ టెక్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పని చేస్తున్న వ్యక్తి నిత్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మరెన్నో సమావేశాల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. చాలా మంది ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితానికి చాలా తక్కువ సమయం గడుపుతూ, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కానీ టెక్ దిగ్గజం సిస్కో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ జీవితం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు.పనిలో విశ్రాంతి లేకపోయినా తన కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పారు. తన సమావేశంలో ఎప్పుడైనా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. అందరూ కుటుంబ బంధానికి అత్యంత విలువ ఇవ్వాలని పేర్కొన్నారు.ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం, పటేల్ రోజువారీ కార్యకలాపాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉంటాయి. ఈ కఠినమైన పని విధానంలో ఆయన ఒక స్మార్ట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు ముందు సీఈఓ లేదా బోర్డు సమావేశాలు తప్పా మరే ఇతర మీటింగ్లకు అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆయన పనిలో విభిన్నంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఆలోచిస్తానని, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఉపయోగిస్తానని చెప్పారు. తర్వాత క్షణం తీరిక లేకుండా రోజువారీ కార్యకలాపాలుంటాయని చెప్పారు.ఈ బిజీ షెడ్యూల్లో మొదటి నియమం.. తన కూతురికి సంబంధించింది. అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా సరే ‘నా కుమార్తె ఏ సమావేశానికైనా వచ్చి నన్ను ఏదైనా అడగవచ్చు. తలుపు తట్టాల్సిన అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. ఇది ఒక వ్యక్తిగత అనుభవం నుంచి పుట్టింది. 2023లో తన తల్లి చివరి రోజుల్లో పటేల్ కార్పొరేట్ బాధ్యతల నుంచి ఎనిమిది వారాల పాటు దాదాపు పూర్తిగా దూరంగా ఉండి ఆసుపత్రిలో ఆమెతో గడిపారు. ఈ క్షణాలు ఆయనకు ఒక చేదు సత్యాన్ని నేర్పాయని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ సమతుల్యంగా ఉండదు. చాలాసార్లు కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది. మీ కోసం పనిచేసే వ్యవస్థను మీరే రూపొందించుకోవాలి, మరెవరూ ఈ పని చేయరు’ అని చెప్పారు.ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే! -
లిస్టెడ్ కంపెనీల్లో అంతా మిస్టర్లేనా!
కంపెనీల సిబ్బందిలో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా లిస్టెడ్ సంస్థల్లో వారి వాటా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన దాదాపు సగం కంపెనీల్లో (52 శాతం) ఉద్యోగినుల సంఖ్య 10 శాతం లోపే ఉంది. స్వచ్ఛంద సంస్థ ఉదైతీ విడుదల చేసిన ’సీజీజీ డ్యాష్బోర్డ్ 2024–25’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,386 కంపెనీల బాధ్యతాయుత వ్యాపారం, పర్యావరణహిత కార్యకలాపాల నివేదికలు (బీఆర్ఎస్ఆర్), సంస్థల వార్షిక నివేదికల ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. వివిధ రంగాలవ్యాప్తంగా మహిళలు .. పురుషుల ప్రాతినిధ్యం, జీతాల్లో అంతరాలు, నాయకత్వ స్థానాల్లో సమ్మిళితత్వం, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తదితర అంశాలను ఇందులో పరిశీలించారు.‘సిబ్బందిలో మహిళల ప్రాతినిధ్యం గత అయిదేళ్లుగా స్థిరంగా పెరుగుతోంది. అయినప్పటికీ ఈ ఏడాది గణాంకాలు చూస్తుంటే అది అంత వేగంగా పెరగడం లేదని తెలుస్తంది. ఎన్ఎస్ఈలో లిస్టయిన 2,615 సంస్థల్లో కేవలం సగం మాత్రమే లింగ ప్రాతినిధ్య డేటాను ఇస్తున్నాయి కాబట్టి మన ముందు ప్రస్తుతం ఉన్నది పాక్షిక ముఖ చిత్రమే‘ అని ఉదైతీ వ్యవస్థాపక సీఈవో పూజా శర్మ గోయల్ తెలిపారు. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు.. మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 శాతం పెరగ్గా, మహిళా ఉద్యోగుల సంఖ్య 7 శాతం పెరిగింది. మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నప్పటికీ నిర్దేశిత లక్ష్యాల స్థాయిలో వారి వాటా పెరగడం లేదు. ఆసుపత్రులు, ప్రయోగశాలల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం నుంచి 48 శాతానికి, వినియోగదారుల సర్వీసుల్లో 30 % నుంచి 34 శాతానికి పెరగ్గా, ఐటీ (34 శాతం), బ్యాంకింగ్ (26 శాతం)లో పెద్దగా మార్పు నమోదు కాలేదు. మహిళలు, పురషుల జీతాల మధ్య వ్యత్యాసం 2024, 2025 ఆర్థిక సంవత్సరాల్లో 6.7 శాతం నుంచి 3.3 శాతానికి తగ్గింది. అయితే, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువే ఉన్నప్పటికీ టెక్స్టైల్స్ (30.4 శాతం), డైవర్సిఫైడ్ (28.5 శాతం), మెటల్స్ .. మైనింగ్ (17 శాతం)లో మాత్రం వ్యత్యాసరం ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు పురుషాధిక్యం ఎక్కువగా ఉండే కొన్ని రంగాల్లో జీతాల మధ్య వ్యత్యాసం రివర్స్లో ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఆర్జిస్తున్న రంగాల్లో ఫార్మా (8 శాతం), కన్జూమర్ డ్యూరబుల్స్ (7 శాతం) ఉన్నాయి. లైంగిక వేధింపుల నివారణ నిబంధనలు (పీవోఎస్హెచ్) గురించి అవగాహన పెరుగుతోంది. పని ప్రదేశాల్లో సహోద్యోగుల తప్పుడు ప్రవర్తనపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నారు. లైంగిక వేధింపు ఫిర్యాదులు 16 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. అయితే, ఫిర్యాదుల స్థాయిలో పరిష్కారాల వేగం ఉండటం లేదు. పెండింగ్ కేసులు 28 శాతం దీన్ని సూచిస్తంది. ఈ నేపథ్యంలో భద్రత, సమాన అవకాశాలు, వర్క్ప్లేస్ డిజైన్ విషయాల్లో వ్యవస్థాగతంగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా ఇటీవలి లేబర్ కోడ్ ముందడుగులాంటిది. వీటిని మార్చుకోగలిగి, స్మార్ట్ విధానాలను అమలు చేస్తే, ప్రభుత్వం..కంపెనీలు చొరవ చూపితే మరింత మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో పాలుపంచుకునే ప్రక్రియ వేగవంతం అవుతుంది. -
ప్రభుత్వ బ్యాంకులో వాటా విక్రయం
పీఎస్యూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)లో ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించనుంది. మంగళవారం(2న) ప్రారంభమైన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు భారీ డిమాండ్ కనిపించిన నేపథ్యంలో గ్రీన్ షూ ఆప్షన్కింద ప్రభుత్వం 6 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకు ఫ్లోర్ ధర షేరుకి రూ. 54కాగా.. సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైన ఆఫర్ డిసెంబర్ 3న రిటైలర్లకు అందుబాటులోకి రానుంది.ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రభుత్వం బ్యాంక్లో తొలుత 5 % వాటాకు సమానమైన 38,454,77,748 షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే ఆఫర్ తొలి రోజునే 400 శాతం సబ్స్క్రిప్షన్ను సాధించింది. దీంతో మరో 7,69,15,549 షేర్లను(1 శాతం వాటా) సైతం అమ్మివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్స్లో పోస్ట్ ద్వారా దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా వెల్లడించారు. వెరసి ప్రభుత్వం 6 శాతం వాటాకు సమానమైన 46.14 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. రూ. 2,492 కోట్లు ఫ్లోర్ ధర ప్రకారం బీవోఎంలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 2,492 కోట్లు అందనుంది. సోమవారం ముగింపు ధర రూ. 57.66తో పోలిస్తే 6.3% డిస్కౌంట్లో ఫ్లోర్ ధరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంక్లో ప్రభుత్వానికి 79.6% వాటా ఉంది. తాజా వాటా విక్రయం ద్వారా బ్యాంక్లో ప్రభుత్వ వాటా 75% దిగువకు దిగిరావడంతోపాటు.. పబ్లిక్కు కనీసం 25% వాటా నిబంధన అమలుకు వీలు చిక్కనుంది. కాగా.. మరో 4 పీఎస్యూ బ్యాంకులలో సైతం ప్రభుత్వం గడువులోగా మైనారిటీ వాటాను పబ్లిక్కు ఆఫర్ చేయవలసి ఉంది. ఈ జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్( ప్రభుత్వ వాటా 94.6 శాతం), పంజాబ్– సింద్ బ్యాంక్(93.9 శాతం), యుకో బ్యాంక్(91 శాతం), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(89.3 శాతం) చేరాయి. -
ఇండిగో సంస్థకు భారీ జరిమానా
విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్ క్రెడిట్ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు. -
రిలయన్స్లో కీలక విలీనం పూర్తి
జియోస్టార్తో అనుబంధ సంస్థ స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్(ఎస్టీపీఎల్) విలీనాన్ని పూర్తిచేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. స్టార్ బ్రాండ్తోపాటు.. గ్రూప్ కంపెనీలకు లైసెన్సులను ఎస్టీపీఎల్ కలిగి ఉంది. స్టార్ ఇండియాతో ఎస్టీపీఎల్ విలీనం(ప్రస్తుతం జియోస్టార్ ఇండియా)పై 2024 నవంబర్ 14న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.జియోస్టార్ సైతం రిలయన్స్కు అనుబంధ కంపెనీకాగా.. 2025 నవంబర్ 30 నుంచి జియోస్టార్లో ఎస్టీపీఎల్ విలీనం అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. నిజానికి రిలయన్స్ మీడియా బిజినెస్, గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్ మధ్య భాగస్వామ్య కంపెనీగా 2024 నవంబర్లో జియోస్టార్ అవతరించింది. వెరసి సంయుక్త సంస్థ విలువ 8.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది.దీంతో దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ ప్లాట్ఫామ్గా నిలుస్తున్న కంపెనీ జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో రూ. 7,232 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 1,322 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ జియోసినిమా, డిస్నీప్లస్ హాట్స్టార్ కలయికతో జియో హాట్స్టార్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. -
విప్రో చేతికి హర్మన్ డిజిటల్
న్యూఢిల్లీ: ఐటీ సర్విసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ కొనుగోలుని పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 3,270 కోట్లు వెచ్చించింది. 2025 ఆగస్ట్ 21న డీటీఎస్ను సొంతం చేసుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. డీల్ను విజయవంతంగా ముగించడంతో తమ ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్లో విభాగంగా డీటీఎస్ పనిచేయనున్నట్లు విప్రో తెలియజేసింది.డీటీఎస్ కొనుగోలు ద్వారా అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాలు, ఇంజినీరింగ్ ఇన్నోవేషన్, ఆర్అండ్డీ నైపుణ్యాల పెంపుపై కంపెనీ కట్టుబాటులో మరో మైలురాయిని చేరుకున్నట్లు పేర్కొంది. డీటీఎస్లో 100 % వాటా కొనుగోలుకి విప్రో.. దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్కు చెందిన హర్మన్తో ఆగస్ట్లో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఎగుమతులకు టారిఫ్ల సెగ
అగ్రరాజ్యం అమెరికా విధించిన భారీ టారిఫ్ల దెబ్బతో ఆ దేశానికి భారత్ ఎగుమతులు గత 5 నెలల్లో గణనీయంగా క్షీణించాయి. అతి పెద్ద మార్కెట్కి ఎక్స్పోర్ట్స్ 28.5 శాతం తగ్గిపోయాయి. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం గతేడాది మే–అక్టోబర్ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఎగుమతులు 8.83 బిలియన్ డాలర్ల నుంచి 6.31 బిలియన్ డాలర్లకు తగ్గాయి.భారత్ ఎగుమతులపై అమెరికా టారిఫ్లు ఏప్రిల్ 2న 10 శాతంతో మొదలుపెట్టి ఆగస్టు నాటికి 50 శాతానికి చేరాయి. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో అత్యధిక టారిఫ్లు వర్తిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. మరోవైపు పొరుగు దేశం చైనాపై టారిఫ్లు 30 శాతంగానే ఉండగా జపాన్పై కేవలం 15 శాతంగా ఉన్నాయి.తాజా గణాంకాలు పరిశీలిస్తే టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్న స్మార్ట్ఫోన్లు, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తుల వాటా అక్టోబర్ ఎగుమతుల్లో 40.3 శాతం స్థాయిలో ఉన్నప్పటికి విలువపరంగా మే నెల నాటి 3.42 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2.54 బిలియన్ డాలర్లకు (25.8 శాతం) పడిపోయింది. -
పేటీఎం సీఈఓ కొత్త కారు: ధర ఎంతో తెలుసా?
పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ & క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్షిప్ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్లో మరొకటి ప్లాన్ చేసింది.టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు!
కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.రిలయన్స్ ఆదాయం ఇలా..1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు. -
యాపిల్ కొత్త వైస్ ప్రెసిడెంట్: ఎవరీ అమర్ సుబ్రమణ్య?
యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.ఎవరీ అమర్ సుబ్రమణ్య?ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ పనిచేశారు.పీహెచ్డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా మైక్రోసాఫ్ట్కు మారాడు. గూగుల్లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్లో సీపీవీగా చేరారు. -
గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ..
భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.వైరల్ వీడియోలో..‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు? -
భారత్లోని విమానాశ్రయాలపై సైబర్ దాడి
భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇది దేశ విమానయాన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలను పెంచుతూ, డిజిటల్ భద్రతా లోపాలను మరోసారి హైలైట్ చేసింది.ఏడు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు రాజ్యసభలో ఇచ్చిన వివరణ ప్రకారం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, అమృత్సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పూఫింగ్ జరిగినట్లు చెప్పారు. దాంతో జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్) ప్రభావితం అయినట్లు తెలిపారు. ఈ దాడుల కారణంగా నావిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక అవరోధాలు తలెత్తినప్పటికీ, విమాన కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్పార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.జీపీఎస్ స్పూఫింగ్ అంటే ఏమిటి?తప్పుడు సిగ్నల్స్ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను ప్రభావితం చేసే ఒక సైబర్ దాడి. ఇది వాస్తవ స్థానం, ఎత్తు వంటి ముఖ్య సమాచారాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది భద్రతా ప్రమాదాలకు దారితీయవచ్చు. 2023 నవంబర్లో డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) జీఎన్ఎస్ఎస్ వ్యవస్థ ప్రభావితం చెందడంపై అడ్వైజరీ జారీ చేసినప్పటికీ, ఈ తరహా ఘటనలు 2025లో కూడా కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే దాడుల మూలాలను గుర్తించేందుకు ప్రభుత్వం వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ (WMO) సహాయంతో పరిశోధన ప్రారంభించింది. ప్రభావిత విమానాశ్రయాలు ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలు నిరంతర భద్రతా ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ..‘ఈ దాడుల వల్ల విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు. అయినా ఆకస్మిక చర్యలు, మెరుగైన సైబర్ ప్రతిచర్యలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్ -
ఎల్ఐసీ స్టాక్స్ కొనుగోళ్లపై సలహాలివ్వం
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై తమ శాఖ ఎలాంటి సలహాలివ్వదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో మార్గనిర్దేశం సైతం చేయదని తెలియజేశారు. అదానీ గ్రూప్ కంపెనీలలో ప్రామాణిక నిర్వహణా సంబంధ నిబంధనల (ఎస్వోపీ)మేరకే ఎల్ఐసీ వాటాల కొనుగోళ్లు చేపట్టినట్లు ఒక ప్రశ్నకు గాను లోక్సభకి ఇచి్చన రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. టాప్ ర్యాంక్ బీమా దిగ్గజం అనేక సంవత్సరాలుగా ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు (ఫండమెంటల్స్) ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కంపెనీలపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టాక మాత్రమే స్టాక్స్ కొనుగోళ్లు చేపడుతుందని వివరించారు. వెరసి ఎస్వోపీల ప్రకారం తగిన పరిశీలనతోపాటు.. రిసు్కలపై అధ్యయనం చేశాక అదానీ గ్రూప్లోని ఆరు కంపెనీలలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్ కంపెనీల పుస్తక విలువ రూ. 38,659 కోట్లుకాగా.. సంబంధిత కంపెనీల రుణ పత్రాలలోనూ మరో రూ. 9,626 కోట్లవరకూ పెట్టుబడులు చేపట్టినట్లు తెలియజేశారు. ఎల్ఐసీ ఫండ్ చేపట్టే పెట్టుబడి నిర్ణయాలపై ఆర్థిక శాఖ ఎలాంటి సూచనలు లేదా సలహాలు ఇవ్వబోదని, స్టాక్ కొనుగోళ్లలో ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. చట్టాల ప్రకారమే ... ఎల్ఐసీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు 1938 బీమా చట్టం, ఐఆర్డీఏఐ నియంత్రణలు, ఆర్బీఐసహా.. సెబీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు వీలుగా ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించినట్లు అక్టోబర్లో వాషింగ్టన్ పోస్ట్లోని ఒక నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో రుణభారంతోపాటు.. యూఎస్లో నిశిత పరిశీలనను ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడులకు ఆర్థిక శాఖ అధికారులు ఒక ప్రణాళికను అమలు చేసినట్లు నివేదిక ఆరోపించింది. 2025 మే నెలలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో ఎల్ఐసీ 57 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్వోపీలు, బోర్డు అనుమతులతో 2025 మేలో ఎల్ఐసీ.. అదానీ పోర్ట్స్ జారీ చేసిన ఎన్సీడీలలో రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన టాప్–500 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడులు చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం పెట్టుబడుల్లో ప్రధాన వాటా భారీ కంపెనీలలోనే ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల పుస్తక విలువ 2025 సెపె్టంబర్ 30 కల్లా రూ. 4,30,777 కోట్లుగా పేర్కొన్నారు. -
ట్రైన్ ఆలస్యమైందా?: ఇలా చేస్తే డబ్బు మొత్తం రీఫండ్..
కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్గా..టీడీఆర్ గురించినిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్ను తప్పనిసరిగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.Received Message from IRCTC that Train was 7 hours late. Booked a Bus Ticket to the Destination.Instead of Cancelling Train Ticket, Filed TDR on Nov 30th 2025.Refund initiated on Dec 1st 2025.Super Fast. Credit where due for timely communication from Railways 👍… pic.twitter.com/weZiQNuenT— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) December 1, 2025 -
వద్దు పొమ్మన్నారు.. ఇప్పుడు తానే కింగ్ మేకర్
సైబర్ దాడి జరగకుండా, ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా 132 బిలియన్ డాలర్ల విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్ నాటికి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ (PANW) మార్కెట్ క్యాప్ రికార్డును చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ ప్లాట్ఫామ్ల్లో ప్రపంచ లీడర్గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలోని ప్రముఖులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో పుట్టి పాలోఆల్టో నెట్వర్క్స్ ఛైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందాం.నికేష్ అరోరా తండ్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసేవారు. నికేష్ క్రమశిక్షణతో కూడిన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1968లో జన్మించిన ఆయన 1990లో వారణాసిలోని ఐఐటీ బీహెచ్యూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి బోస్టన్ కాలేజీ నుంచి ఫైనాన్స్లో మాస్టర్స్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కెరియర్ ప్రారంభంలో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్, పుట్నమ్ ఇన్వెస్ట్మెంట్స్లో పనిచేసి ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై అనుభవాన్ని సంపాదించారు. ఆరంభంలో దాదాపు 400 సార్లు తన జాబ్ అప్లికేషన్ను కంపెనీలు తిరస్కరించాయి. అయినా ఆయన పట్టుదలతో కృషి చేశారు.గూగుల్, సాఫ్ట్బ్యాంక్లో..నికేష్ అరోరా 2004లో గూగుల్లో చేరడం తనకు టర్నింగ్ పాయింటని చెప్పారు. పదేళ్లలో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా ఎదిగారు. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని 2 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పెంచడంలో కీలకపాత్ర పోషించారు. యూరప్ కార్యకలాపాల నుంచి ప్రపంచ వ్యాపార వ్యూహం వరకు అన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి.2014లో సాఫ్ట్బ్యాంక్కు ప్రెసిడెంట్, సీఓఓగా వెళ్లి 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్కు బీజం వేశారు. ఈ సమయంలోనే ఓలా, ఒయో, స్నాప్డీల్ వంటి భారతీయ స్టార్టప్లతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భారీ పెట్టుబడులు పెట్టడంలో కీలకంగా మారారు.2018 నుంచి పాలో ఆల్టోలో..జూన్ 2018లో నికేష్ పాలో ఆల్టో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్ ఆధారిత సైబర్ సర్వీసులను బలోపేతం చేయడానికి 15కి పైగా కంపెనీలను విజయవంతంగా కొనుగోలు చేశారు. Prisma Cloud, Cortex XDR, Cortex XSIAM వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించారు. సైబర్ థ్రెట్లను రియల్ టైమ్లోనే ఆపే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించారు.2018లో 180 డాలర్లు ఉన్న కంపెనీ స్టాక్ ధర 2025 నాటికి 400 డాలర్లు పైనే ట్రేడవుతోంది. నికేష్ అరోరా నాయకత్వంలో కంపెనీ కేవలం ఐదేళ్లలోనే దాదాపు 120%కు పైగా రిటర్న్లను అందించింది.రికార్డు పరిహారంనికేష్ అరోరా సంపాదన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో ఆయన అందుకున్న పరిహారం 151.43 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,260 కోట్లు). ఇది అమెరికాలో ఆ సంవత్సరానికి రెండవ అత్యధిక వేతనం పొందిన సీఈఓగా నిలిపింది. 2025 జులై నాటికి ఆయన వ్యక్తిగత నికర విలువ 1.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.12,500 కోట్లకు) చేరింది. ఇందులో ఎక్కువ భాగం పాలో ఆల్టో నెట్వర్క్స్ స్టాక్స్ రూపంలోనే ఉంది.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం -
విమానాల్లో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్.. అసలు సమస్యేంటి?
తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్బస్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్బస్ ఏ320 విమానాల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.అప్గ్రేడ్ వివరాలుఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్గ్రేడ్ పూర్తి చేసింది.ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: 25 విమానాల్లో 23 అప్గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్ చేయనున్నారు.సమస్య ఏమిటి?ఎయిర్బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్లైన్స్కు తక్షణ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా? -
యాప్లా.. మార్కెటింగ్ యంత్రాలా?
భారత్లో చాలా మొబైల్ యాప్లు అవి అందిస్తున్న సర్వీసుల కంటే కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మార్కెటింగ్ యంత్రాలుగా మారాయనే వాదనలున్నాయి. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సందర్భంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు అందులోని యాడ్లు చూసి ఆశ్చర్యపోయారు. అందులో త్రివర్ణ పతాకంతో ఉన్న క్రికెట్ బ్యాట్ కింద బ్యానర్లో ‘ఈ మ్యాచ్ వీక్లో భారీ స్కోర్ చేయండి. బిర్యానీపై 20% తగ్గింపు!’ అని ఉంది. అసలు ఆ యాప్కు బిర్యానీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇలా ప్రకటనలు వచ్చాయి.గత దశాబ్దంలో భారతీయ యాప్స్ యుటిలిటీ టూల్స్ నుంచి పూర్తిస్థాయి మార్కెటింగ్ కాన్వాస్లుగా మారాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఓలా, పేటీఎం, డంజో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్, బుక్మైషో, ఓయో.. ఇవి కేవలం సర్వీసులకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ బ్రాండ్ ఎకోసిస్టమ్లో భాగమయ్యాయి.తమదైన శైలిలో లేబులింగ్..ఒకప్పుడు యాప్ అంటే సెర్చ్ బార్, మెనూ, చెకౌట్ పేజీ.. ఉండేది. ఇప్పుడు యాప్లో ప్రతి విభాగం కమర్షియల్గా మారింది. హోమ్పేజీలో బ్యానర్లు, స్పాన్సర్డ్ రెస్టారెంట్ వివరాలు, సజెషన్స్, కిరాణా యాప్స్లో స్పాన్సర్డ్ ఉల్లిపాయలు, బిస్కెట్లు.. ఇలా ప్రతి లేబుల్లో యాడ్ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇవి ప్రకటనలని తెలియకుండా కంపెనీలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవి ప్రకటనలుగా లేబుల్ చేయాలి. అయితే అందుకు చాలా కంపెనీలు తమదైన శైలిలో లేబుల్ను చాలా చిన్నదిగా చేసి సాధారణ ఉత్పత్తుల్లో భాగంగానే చూపిస్తున్నాయి. దీనినే ‘నేటివ్ అడ్వర్టైజింగ్’ అని పిలుస్తున్నారు.ఈ యాప్స్ కేవలం స్టాటిక్ బ్యానర్లను మాత్రమే ప్రమోట్ చేయడం లేదనే వాదనలున్నాయి. ఇవి వినియోగదారుల సందర్భాన్ని, భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నాయి.స్విగ్గీ 2025 ఐపీఎల్ (IPL) సమయంలో ‘స్విగ్గీ సిక్సెస్’ ప్రవేశపెట్టింది. ప్రతి సిక్సర్కు డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పింది.జెప్టో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రమోషన్ కోసం ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకుంది.వాహనాల ఆఫర్లను కంపెనీలు పండగలతో లింక్ చేస్తున్నాయి.గూగుల్ పే స్క్రాచ్ కార్డులతో చెల్లింపులు పెంచుకుంటోంది.ఇన్స్టామార్ట్ దీపావళి సమయంలో వర్చువల్ బాణసంచా ఆఫర్లు అందించింది.ఇలా చాలా కంపెనీలు సందర్భోచితంగా, భావోద్వేగపూరిత యాడ్లను అందిస్తున్నాయి.భారతీయులు రోజుకు సగటున 5-6 గంటలు మొబైల్తో గడుపుతున్నారు. అందులోనూ ఎక్కువ భాగం 8-10 యాప్స్నే వాడుతున్నారు. ఇది బ్రాండ్లకు అపార అవకాశం కల్పిస్తుంది. ఇందుకు కంపెనీలు విభిన్నం పంథాలను ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థల యాప్స్ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు కదా?’ అనే ప్రకటనలు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా యాప్స్లో ఆర్డర్ హిస్టరీ, చెల్లింపులు వంటి విస్తృతమైన డేటా ద్వారా వినియోగదారుల మనస్తత్వానికి అనుగుణంగా ప్రకటనలు అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి పర్సనలైజేషన్ ప్రకటనల వెనుక డేటా ఎంతగా సేకరిస్తున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు.. అనేది పారదర్శకంగా లేదు.కొన్నింటికి ప్రకటనలే దిక్కు..2030 నాటికి భారతదేశంలో యాప్ అడ్వర్టైజింగ్ మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తక్కువ మార్జిన్లతో నడిచే డెలివరీ, రైడ్ హెయిలింగ్ కంపెనీలకు ఈ ఆదాయం ఆప్షనల్గా ఉండడంలేదు. అవి మనుగడ సాధించాలంటే తప్పకుండా ప్రకటనల ఆదాయం కావాల్సిందే. అయితే, చైనాలో వీచాట్ ఒకప్పుడు ప్రమోషనల్ ఇంటర్ఫేస్గా ఉండేది. యూజర్లు క్రమంగా తగ్గిపోతుండడంతో తిరిగి తన అసలు బిజినెస్పై దృష్టి సారించింది. బ్రాండింగ్ ప్రమోషన్లో తప్పేంలేదు. కానీ యాప్ ఇంటర్ఫేస్లో ప్రధానంగా బ్రాండ్లనే ప్రమోట్ చేస్తే అసలు సర్వీసులు మరుగునపడుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం -
వంట గ్యాస్ ధరల తగ్గింపు
వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లోని తాజా సమాచారం ప్రకారం.. 19 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ .10 తగ్గింది. కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలుదేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర గత నెలలోని రూ.1,590.50 నుంచి రూ.1,580.50కు తగ్గింది.కోల్కతాలో కొత్త ధర రూ.1,694 నుంచి రూ.1,684కు తగ్గింది.ముంబయిలో గత నెలలో రూ.1,542గా ఉన్న ధర రూ.1,531.50కి దిగొచ్చింది.చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,750 నుంచి రూ.1,739.50కు తగ్గింది.హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,746 నుంచి రూ.1,736కు తగ్గింది.విశాఖపట్నంలో కొత్త ధర రూ.1,722. ఇది గత నెలలో రూ.1,732 ఉండేది.ఇంధన రిటైలర్లు కమర్షియల్ ఎల్పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సర్దుబాటు చేస్తాయి. అయితే గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ల (14.2 కిలోలు) ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


