Corporate
-
ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్లోకి ప్యూర్ ఈవీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ప్యూర్ తాజాగా ‘స్మార్ట్ ఇన్వర్టర్ల’ విభాగంలోకి ప్రవేశించింది. గృహ, వాణిజ్య అవసరాల కోసం ‘ప్యూర్పవర్’ పేరిట విద్యుత్ స్టోరేజీ సొల్యూషన్స్ను ఆవిష్కరించింది. ఇవి 3 కేవీఏ, 5 కేవీఏ, 15 కేవీఏ సామర్థ్యంతో లభిస్తాయి. ధర రూ. 74,999 నుంచి రూ. 1,74,999 వరకు ఉంటుంది. సాంప్రదాయ ఇన్వర్టర్ల కన్నా మెరుగ్గా ఏసీలు, ఇతరత్రా ఉపకరణాలను కూడా ఉపయోగించుకునేందుకు అవసరమైనంత విద్యుత్ను ఇవి బ్యాకప్గా అందించగలవు.వీటికి బుకింగ్స్ ఏప్రిల్ 1 నుంచి, డెలివరీలు ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ దొంగారి తెలిపారు. వీటిని పునరుత్పాదక విద్యుత్కు కూడా అనుసంధానించుకోవచ్చని పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం (4 ఎండబ్ల్యూహెచ్ సామర్థ్యంతో) ప్యూర్పవర్ గ్రిడ్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.దేశీయంగా పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, మొత్తం వాహనాల్లోఈవీల వాటాను 40 శాతానికి పెంచుకోవాలనేది లక్ష్యమని చెప్పారు. -
కారు చౌక ఈవీ బేరం!
ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ల ‘మార్చ్’ నడుస్తోంది. ఈవీలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిల్వలను తగ్గించుకోవడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల జోరు పెంచాయి. ఎలక్ట్రిక్తో పాటు హైబ్రిడ్ వాహనాలపై కూడా కనిష్టంగా రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఏప్రిల్ 1 నుంచి రేట్ల పెంపు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాహన కంపెనీలు ఈవీలపై భారీ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. గడిచిన కొన్ని వారాల్లో విడుదల చేసిన కొన్ని కొత్త మోడల్స్ మినహా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కార్లపై కనీసం రూ.1 లక్ష తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 2025 మోడల్స్తో పాటు 2024లో తయారైనవి కూడా ఉన్నాయి. కాగా, ఈ డిస్కౌంట్లలో క్యాష్ తగ్గింపు, స్క్రాపేజీ, ఎక్సే్ఛంజ్ బోనస్లు, ఉచిత యాక్సెసరీలు, అలాగే అదనపు వారంటీ వంటివన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా అమ్మకాలు మందకొడిగా ఉండే సంవత్సరాంతం (డిసెంబర్ నెల)లో వాహన సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ఈవీలపై ఇస్తున్న తగ్గింపు అప్పటితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. దీనికి ప్రధానంగా డిమాండ్ తగ్గడమే కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు. కియా.. బంపర్ ఆఫర్ దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా మోటార్స్ తన ఈవీ6 2025 వేరియంట్పై ఏకంగా రూ.15 లక్షల భారీ డిస్కౌంట్ను అందిస్తోంది. దీని రేంజ్ 650 కిలోమీటర్లు. అంతక్రితం రూ. 77 లక్షలుగా ఉన్న ఈవీ6 ఆన్రోడ్ ధర ఇప్పుడు రూ.62 లక్షలకు దిగొచి్చంది. ఇక హ్యుందాయ్ కూడా ఐయానిక్5 మోడల్పై రూ. 4 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తోంది. డిసెంబర్లో దీనిపై రూ.2 లక్షల డిస్కౌంట్ మాత్రమే కంపెనీ అందించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన క్రెటా ఈవీపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. ఈవీ మార్కెట్లో అత్యధిక వాటాతో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ పలు మోడల్స్పై రూ. 1.86 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల ప్రవేశపెట్టిన కర్వ్ ఈవీపై గరిష్టంగా రూ.1.71 లక్షల తగ్గింపు లభిస్తోంది. నెక్సాన్ ఈవీపై రూ.1.41 లక్షలు , టియాగో ఈవీపై రూ.1.31 లక్షలు చొప్పున డిస్కౌంట్ ఇస్తోంది. హైబ్రిడ్లపైనా... మహీంద్రాతో పాటు కొన్ని కంపెనీలు ఈ ఏడాది కొత్త ఈవీలను తీసుకురావడంతో పాత మోడల్స్ పట్ల ఆసక్తి తగ్గిందని.. దీనికి తోడు అధిక ధరల ప్రభావం వల్ల కూడా డిమాండ్ తగ్గుముఖం పట్టిందని ప్రముఖ కార్ల కంపెనీకి చెందిన ఓ డీలర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈవీలతో పాటు హైబ్రిడ్ మోడల్స్ కూడా కారు చౌకగా దొరుకుతున్నాయి. మారుతీ సుజుకీ హైబ్రిడ్ కార్లు గ్రాండ్ విటారాపై రూ.1.35 లక్షలు, ఇని్వక్టోపై రూ.1.4 లక్షల చొప్పున ఆఫర్ నడుస్తోంది. అలాగే హోండా సిటీ ఈ–హెచ్ఈవీ దాదాపు రూ.1 లక్ష తక్కువకే దొరుకుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్కొత్త మోడల్స్ దన్ను...ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఈవీ కార్ల సేల్స్ 20,234 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగినట్లు వాహన డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) పేర్కొంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలకు కొత్త మోడల్స్ దన్నుగా నిలుస్తున్నాయి. ఇందులో ఎంజీ విండ్సర్ వంటి మోడల్స్ అమ్మకాలు కీలకంగా నిలుస్తుండటమే కారణం. 2024లో 20 శాతం వృద్ధితో 99,165 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. కాగా, మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ (43 శాతం వాటా) ఈవీ సేల్స్ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 19 శాతం మేర పడిపోవడం గమనార్హం. -
విద్యుత్ వాడుతూ.. మిగిలింది అమ్ముతూ..
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ప్యూర్(Pure) సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఇళ్లతోపాటు, వాణిజ్య, గ్రిడ్స్థాయిలో ఉపయోగపడే ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ (విద్యుత్తును నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వాడుకునేందుకు వీలు కల్పించే) ఉత్పత్తులను ‘ప్యూర్-పవర్(Pure-Power)’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. ఇవి సాధారణ యూపీఎస్లలో మాదిరిగా వీటిల్లో లెడ్ ఆక్సైడ్ బ్యాటరీలు కాకుండా.. అత్యాధునిక లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండటం ఒక ప్రత్యేకతైతే.. సౌర విద్యుత్తు లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా ఎటువంటి అదనపు పరికరాల అవసరం లేకుండా నిల్వ చేసుకోగలగడం ఇంకో ప్రత్యేకత. కొంచెం సులువుగా చెప్పుకోవాలంటే.. మీ ఇంటిపైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ‘ప్యూర్-పవర్: హోం’ను వాడటం మొదలుపెట్టారనుకోండి.. మీ ఇంటికి కావాల్సిన విద్యుత్తును అక్కడికక్కడ ఉత్పత్తి చేసుకుని వాడుకోవడమే కాకుండా.. మిగిలిపోయిన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవచ్చునన్నమాట. నీతీఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె.సారస్వత్ మంగళవారం హైదరాబాద్లోని నోవోటెల్లో ప్యూర్-పవర్ ఉత్పత్తులను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ ‘‘దేశం మొత్తమ్మీద రానున్న 18 నెలల్లో 300 మంది డీలర్ల ద్వారా ‘ప్యూర్-పవర్’ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నాము’’ అని తెలిపారు. యూపీఎస్లతో పోలిస్తే ప్యూర్-పవర్ ఎన్నో విధాలుగా ప్రత్యేకమైనవని, నానో పీసీఎం మెటీరియల్ ద్వారా భద్రతకు పెద్దపీట వేశామని ఆయన తెలిపారు. ప్యూర్-పవర్లో ప్రస్తుతం రెండు రకాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని, గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’ను వచ్చే ఏడాది లాంచ్ చేస్తామన్నారు. ఇళ్లల్లో, అపార్ట్మెంట్లలో వాడుకోగలిగిన ‘ప్యూర్-పవర్:హోం’ 3 కిలోవోల్ట్ ఆంపియర్ (కేవీఏ), 5కేవీఏ, 15కేవీఏ సామర్థ్యాల్లో లభిస్తాయని ధర రూ.74,999తో ప్రారంభమవుతాయని చెప్పారు.దుకాణాలు, కార్యాలయాలు, టెలికాం టవర్స్ వంటి వాటి కోసం 25 కేవీఏ నుంచి 100 కేవీఏల సామర్థ్యం గల ‘ప్యూర్-పవర్’ కమర్షియల్ను అందుబాటులోకి తెస్తున్నామని నిశాంత్ వివరించారు. వీటి వాడకం ద్వారా డీజిల్ జనరేటర్ల అవసరాన్ని లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు. ప్యూర్-పవర్ మూడో ఉత్పత్తి గ్రిడ్ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకునేదని, 20 అడుగుల పొడవైన కంటెయినర్లోకి ఇమిడిపోయే ‘ప్యూర్-పవర్: గ్రిడ్’లో ఏకంగా నాలుగు మెగావాట్ల విద్యుత్తును నిల్వ చేసుకోవచ్చునని ఆయన వివరించారు. సోలార్ పార్కుల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటే.. విద్యుత్తు డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఎక్కువ ఉన్న సమయంలో సరఫరా చేసేందుకు వీలేర్పడుతుందన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ ఉత్పత్తులను బుక్ చేసకోవచ్చునని, నెలాఖరు నుంచి డెలివరీ మొదలవుతుందని తెలిపారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..దేశ అభివృద్ధికి కీలకం..2070 నాటికి కర్బన్ ఉద్గారాలను సున్నాస్థాయికి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో విద్యుత్తు వాహనాలతోపాటు ప్యూర్-పవర్ లాంటి ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయని నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్ స్పష్టం చేశారు. ప్యూర్-పవర్ ఉత్పత్తుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2030 నాటికి వాహనాల్లో 40 శాతం విద్యుత్తుతో నడిచేవిగా చేయాలని ప్రభుత్వం తీర్మానించిందని, కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంకల్పించిందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఉన్న విద్యుత్తు వాహనాల సంఖ్య (అన్ని రకాలు కలుపుకుని) ఇరవై లక్షలకు మించడం లేదని తెలిపారు. విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ కోసం గ్రిడ్ను వాడటం మొదలుపెడితే గ్రిడ్పై అధిక భారం పడుతుందని, ఈ నేపథ్యంలోనే ప్యూర్-పవర్ వంటి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఏర్పడుతోందని అన్నారు. బ్యాటరీల ధరలు తగ్గించేందుకు, మరింత సమర్థమైన వాటిని తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలితస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్యూర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ వడేరా తదితరులు పాల్గొన్నారు. -
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
ఆశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వ్యాపారాలను సృష్టిస్తోంది.. ఆయా సామ్రాజ్యాలను కుప్పకూలుస్తుంది. కడు పేదరికంలో ఉన్నవారిని కోటీశ్వరులను చేస్తుంది.. తేడా వస్తే అథపాతాళానికి తొక్కేస్తుంది. డబ్బు మీద ఉన్న అత్యాశే ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి తన రూ.1.24 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో.. అందుకుగల కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో మొదటి సంస్థగా..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాలు ఇవే..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.ఆరోపణలు.. ఆర్థిక పతనం2019లో ఎన్ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.1,24,000 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరందివాలా.. న్యాయ పోరాటాలుబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి. -
శామ్సంగ్ కో-సీఈఓ కన్నుమూత
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈఓ హాన్ జోంగ్ హీ (63) కన్నుమూశారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో శామ్సంగ్ గ్లోబల్ లీడర్గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన హాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణం ప్రపంచంలోని టెక్నాలజీ కంపెనీల్లో విషాధాన్ని నింపింది.1988లో ఇన్హా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత శామ్సంగ్తో హాన్ జోంగ్ హీ ప్రయాణం మొదలైంది. ఆయన సంస్థ విజయానికి గణనీయమైన సహకారం అందించారు. విజువల్ డిస్ప్లే బిజినెస్లో ప్రొడక్ట్ ఆర్ అండ్ డీ టీమ్కు నాయకత్వం వహించడం నుంచి 2017లో విభాగానికి నాయకత్వం వహించడం వరకు టెలివిజన్ మార్కెట్లో శామ్సంగ్ను లీడర్ తీర్చిదిద్దడంతో హాన్ కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరం2021లో హాన్ శామ్సంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ డివైజ్ విభాగాన్ని పర్యవేక్షిస్తూ వైస్ ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గృహోపకరణాలు, గెలాక్సీ పరికరాలతో సహా శామ్సంగ్ ప్రోడక్షన్ ఎకోసిస్టమ్లో కృత్రిమ మేధను ఏకీకృతం చేయడంలో అతని నాయకత్వం ప్రధానంగా నిలిచింది. -
మహిళలకు భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు
ముంబై: మహిళలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా కాంట్రాక్టు పనులు మెట్రోల్లో, పారిశ్రామిక కేంద్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయని.. భవిష్యత్తులో టైర్ 2, 3 పట్టణాల్లో విస్తరణకు అపార అవకాశాలున్నాయని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 28.7 శాతం వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు 14.2 శాతం, కర్ణాటక 14.1 శాతం మేర అవకాశాలను అందిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలో 7.8 శాతం, గుజరాత్లో 7.2 శాతం, యూపీలో 6.6 శాతం చొప్పున మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాలు లభిస్తున్నట్టు వెల్లడించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మరింత మందికి ఈ అవకాశాల కల్పనకు గణనీయమైన అవకాశాలున్నట్టు గుర్తు చేసింది. టీమ్లీజ్ సర్వీసెస్ తన అంతర్గత డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. రిటైల్లోనే ఎక్కువ మహిళలకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో 29.8 శాతం ఒక్క రిటైల్ రంగమే కల్పిస్తోందని టీమ్లీజ్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగంలో 20.7 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో 18.9 శాతం చొప్పున ఉద్యోగాలు లభిస్తున్నట్టు తెలిపింది. తయారీలో 10.8 శాతం, విద్యుత్, ఇంధన రంగంలో 5 శాతం, టెలికంలో 4 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఉన్నట్టు పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్తో కూడిన స్టెమ్ విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరడం అన్నది ఐటీ, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మరింత మందికి అవకాశాలను చేరువ చేస్తుందని తెలిపింది. కాంట్రాక్టు మహిళా ఉద్యోగుల్లో 62.2 శాతం మంది వయసు 18–27 ఏళ్ల మధ్యలో ఉంటే.. 29.4 శాతం మంది 28–37 ఏళ్ల వయసులో ఉండడం అన్నది యువ ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. 38–47 ఏళ్ల వయసులోని మహిళలు 6.6 శాతం, 48 ఏళ్లకుపైన వయసున్న మహిళలు 1.9 శాతం చొప్పున కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
నివా బూపా పాలసీ.. టాటా ఏఐఏ అప్డేట్స్
నివా బూపా ‘రైజ్’ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మధ్యతరగతి వర్గాల ఆదాయాలు, జీవన విధానాలకు అనుగుణంగా ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివా బూపా ‘రైజ్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారాలు చేసే వారు, స్థిరంగా నెలవారీ ఆదాయం ఉండని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా అందుబాటు ప్రీమియంలతో ఇది ఉంటుంది. ఫ్లెక్సీ–పే బెనిఫిట్ ఫీచరుతో కస్టమర్లు ముందుగా ప్రీమియంలో 20 శాతమే చెల్లించి పాలసీ తీసుకుని, మిగతా మొత్తాన్ని పాలసీ వ్యవధిలో చెల్లించవచ్చు. ఎంత త్వరగా చెల్లించేస్తే అంత ఎక్కువగా డిస్కౌంటు పొందవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందినా స్మార్ట్ క్యాష్ బెనిఫిట్తో, చికిత్సానంతర వ్యయాల కోసం నిర్దిష్ట మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో 50 శాతం మొత్తానికి సరిపడేంతగా సమ్ ఇన్సూ్జర్డ్ను పెంచే రిటర్న్ బెనిఫిట్, 16 ప్రాంతీయ భాషల్లో డాక్టర్లతో డిజిటల్ కన్సల్టేషన్లు తదితర ప్రయోజనాలను కూడా దీనితో పొందవచ్చు. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్సీక్’!టాటా ఏఐఏ ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా రెండు ఫండ్స్ను ఆవిష్కరించింది. ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ ఫండ్, ట్యాక్స్ బొనాంజా కన్జంప్షన్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇందులో మొదటిది సంపద సృష్టికి అలాగే ఆర్థిక భద్రతకు తోడ్పడుతుంది. రెండోది, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ రెండు న్యూ ఫండ్ ఆఫర్లు మార్చి 31తో ముగుస్తాయి. యూనిట్ ధర రూ.10గా ఉంటుంది. పెరుగుతున్న వినియోగం వల్ల లబ్ధి పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలను మదుపరులకు అందించే విధంగా ఈ ఫండ్స్ ఉంటాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రిటైల్..ఈ–కామర్స్, ఆటోమొబైల్స్.. ప్రీమియం ఉత్పత్తుల రంగాల సంస్థల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. -
రిలయన్స్ జ్యువెల్స్ పండుగ ఆఫర్లు
రిలయన్స్ జ్యువెల్స్ తన వినియోగదారులకు పండుగ ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడ్వా పర్వదినాన్ని పురస్కరించుకొని బంగారం, వజ్రాభరణాల కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఈ ఉత్సవాలను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రిలయన్స్ జ్యువెల్స్ మార్చి 31 వరకు ప్రత్యేక పండుగ సేల్ను అందిస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగా కొనుగోలుదారులు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50% వరకు, వజ్రాభరణాల విలువ, వాటి తయారీ ఛార్జీలపై 35% వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. నిర్దేశించిన తేదీలోపు దేశంలోని రిలయన్స్ జ్యువెల్స్ షోరూమ్ల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్సీక్’!మహారాష్ట్రలో గుడిపడ్వా అనేది పెద్ద పండుగ. ఈ సమయంలో చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని కంపెనీ తెలిపింది. వీరికోసం ప్రత్యేక డిజైన్లలో నాథ్ (ముక్కు ఉంగరం), చంద్రకోర్ బిందీ, తుషి నెక్లెస్లు.. వంటివి అందిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా తెలుగు వారి తొలి పండుగ ఉగాదిని పురస్కరించుకొని గుట్టపూసలు, నెక్లెస్లు, లక్ష్మీ నాణెం హరాలు, కాసు మాలలు..వంటివి ప్రత్యేక డిజైన్ల్లో రూపొందించినట్లు తెలిపింది. -
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు
రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) అనుబంధ సంస్థ అయిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు ఆదాయపు పన్ను శాఖ రూ.104.77 కోట్ల డిమాండ్ నోటీసులు పంపించింది. 2020-21, 2021-22 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నట్లు సోమవారం సంస్థ తెలిపింది. ముంబైలోని సెంట్రల్ సర్కిల్ 6(2)లోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ నోటీసు పంపినట్లు ఆర్ఈఎల్ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.ట్యాక్స్ కన్సల్టెంట్ల సలహా మేరకు కేర్ హెల్త్ నిర్ణీత గడువులోగా ఈ ఉత్తర్వులపై ఫోరమ్ ముందు అప్పీల్ దాఖలు చేస్తుందని ఆర్ఈఎల్ స్పష్టం చేసింది. ఈ డిమాండ్ నోటీసులకు దారితీసిన కచ్చితమైన లెక్కలు లేదా వివాదాల వెనుక ఉన్న వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఆర్డర్ను అంతిమంగా అంగీకరించే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. నిర్ణీత గడువులోగా ఈ నోటీసుపై అప్పీల్ దాఖలు చేస్తామని కంపెనీ ప్రకటించడంతో ఇది నిర్ధారణ అవుతుంది.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’హెల్త్ ఇన్సూరెన్స్ డొమైన్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రముఖంగా సేవలందిస్తోంది. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్కు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. పన్ను డిమాండ్ను సవాలు చేస్తూ తీసుకున్న నిర్ణయం దాని ఆర్థిక, చట్టపరమైన విధానాలపై విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ నోటీసుపై కంపెనీ ప్రతిస్పందనను పరిశ్రమ వాటాదారులు, రెగ్యులేటర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
ఏటీఎం ఛార్జీల పెంపు.. మే 1 నుంచి..
ఏటీఎం ఇంటర్ఛేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ .2, ఆర్థికేతర లావాదేవీలకు రూ .1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.పెంచిన ఇంటర్ఛేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ చివరికి భారాన్ని వినియోగదారులపైనే వేస్తారన్న చర్చ సాగుతోంది. గత పదేళ్లలో ఇంటర్ చేంజ్ ఫీజులను సవరించినప్పుడల్లా బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపైనే వేశాయి. ఈసారి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని, బ్యాంకులు కస్టమర్లకు ఫీజులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంటర్చేంజ్ ఫీజు అంటే..ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఆర్బీఐ గతంలో 2021 జూన్లో ఇంటర్ఛేంజ్ ఫీజును సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి, బ్యాలెన్స్ ఎంక్వైరీలు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.6 నుంచి రూ.7కు పెంచారు.ఇంటర్ఛేంజ్ ఫీజుల పెంపునకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసింది. ఇంటర్ చేంజ్ ఫీజుల పెంపును అమలు చేసేందుకు ఎన్పీసీఐ ఆర్బీఐ అనుమతి కోరింది.ప్రస్తుత ఫీజు విధానంలో కార్యకలాపాలు నడపడం ఆర్థికంగా కష్టంగా ఉన్న వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. -
ఫ్యామిలీ వెల్త్ ప్రణాళికల్లో మహిళలకు ప్రాధాన్యం
వెల్త్ మేనేజ్మెంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో మహిళలు కుటుంబ సంపదకు కేవలం లబ్ధిదారులుగానే ఉండిపోకుండా, సంపద సృష్టి, నిర్వహణ, బదలాయింపులోను కీలకంగా మారుతున్నారు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణి ప్రధానంగా ఫ్యామిలీ ఆఫీసులు, ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం, ప్రపంచ సంపదలో మూడో వంతు భాగాన్ని మహిళలు నిర్వహిస్తున్నారు. ఇవి అంకెలు మాత్రమే కావు. సాంస్కృతిక, ఆర్థిక అంశాల్లో చోటు చేసుకుంటున్న గణనీయమైన మార్పులను సూచిస్తున్నాయి. చాలా మంది మహిళలు సంపదను కేవలం వారసత్వంగా పొందడమే కాకుండా, దాన్ని జాగ్రత్తపర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్, పెట్టుబడులు లేదా ఫ్యామిలీ ఆఫీసులు.. ఇలా ఏ రూపంలోనైనా కావచ్చు భవిష్యత్తులో కుటుంబ సంపదపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైన స్థాయిల్లోకి వారు చేరుకుంటున్నారు. తరతరాలుగా సంపద నిర్వహణలో వస్తున్న ఫండమెంటల్ మార్పును ఇది సూచిస్తోంది.బార్క్లేస్ ప్రకారం సంపన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మంది మహిళల్లో ఎనిమిది మందికి, వచ్చే రెండు దశాబ్దాల్లో గణనీయమైన స్థాయిలో సంపద వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ విషయానికొస్తే వారిలో సగం మంది కూడా ఇందులో పాలుపంచుకోవడం లేదు. దీన్ని సత్వరం పరిష్కరించాల్సి ఉంది.చివరిగా.. వెల్త్ మేనేజ్మెంట్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆఫీస్లు, ప్రైవేట్ వెల్త్లో మహిళలు మరింతగా పాలుపంచుకోవడమనేది ట్రెండ్ మాత్రమే కాదు. కుటుంబ వారసత్వం, సంపద సృష్టి, సంపద బదలాయింపును మనం చూసే దృష్టి కోణంలో వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తోంది. ఫ్యామిలీ ఆఫీస్లలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న మహిళలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగం భవిష్యత్తును నిర్దేశించనున్నారు. సంపద సృష్టి, సంరక్షణ, దీర్ఘకాలిక పెట్టుబడులు లేదా భవిష్యత్ తరాలకు సంపద బదలాయింపులో మార్గదర్శకత్వం వహించడం.. ఇలా కుటుంబ సంపదకు సంబంధించిన ఏ అంశంలోనైనా మహిళలు మరింత కీలక పాత్ర పోషించనున్నారు.కుటుంబ సంపద నిర్వహణ విషయంలో మహిళలు మరిన్ని బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో, మారుతున్న క్లయింట్ల అవసరాలను పరిష్కరించేలా వెల్త్ మేనేజర్లు తమను తాము మార్చుకోవాలి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో చురుకైన పాత్ర పోషించేలా మహిళలకు సాధికారత కల్పించడమనేది ఒక వ్యూహాత్మక అవసరం కూడా.భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం..భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు కూడా పాలుపంచుకోవడం మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా సంపద బదలాయింపు, వారసత్వ ప్రణాళికల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. వారు ఆర్థిక భద్రత, భవిష్యత్ తరాలకు స్థిరత్వం కల్పించడానికి అధిక విలువనిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్లిష్టమైన ఆర్థిక కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో మహిళలకు సాధికారత కల్పించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం నుంచి మహిళల లక్ష్యాలు, విలువలకు అనుగుణమైన కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అందించే వరకు వారి ప్రాధాన్యతలకు అనుగుణమైన సర్వీసులను వెల్త్ మేనేజర్లు అందించాల్సి ఉంటుంది.ఫ్యామిలీ ఆఫీసుల విషయానికొస్తే, సంపద సృష్టి, నిర్వహణలో మారుతున్న మహిళల పాత్రలకు అనుగుణంగా తోడ్పాటు అందించేలా వెల్త్ మేనేజ్మెంట్ రంగం మారాలి. నిర్ణయాల్లోనూ వారికి చోటు లభించేలా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. పూర్తి సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడంలో మహిళలకు అవసరమైన పరిజ్ఞానం, సాధనాలు, ఆత్మవిశ్వాసం లభించే విధంగా ఆర్థిక అంశాలపై సంప్రదింపుల్లో ఫ్యామిలీ ఆఫీసులు తప్పనిసరిగా మహిళలను కూడా భాగం చేయాలి.- అరుణిమ నయన్ హెడ్ – ఫ్యామిలీ ఆఫీస్ – ప్రైవేట్ వెల్త్, యాక్సిస్ ఏఎంసీ -
IPL 2025: దూసుకెళ్తున్న కోహ్లీ.. ఈసారి ట్యాక్స్ ఎంత?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ టాప్ పెర్ఫార్మర్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్ బెంగళూరు కీలక ఆటగాడైన కోహ్లీ ఐపీఎల్లో టాప్ పెర్ఫార్మర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని ఆట, పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు కోహ్లీకి అత్యధిక ధర (కాంట్రాక్ట్ ఫీజు) చెల్లించి నిలుపుకొంది.ఈసారి రూ.21 కోట్లుఈ ఏడాది ఐపీఎల్ 18వ ఎడిషన్లో రాయల్ చాలెంజర్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఆన్టైన్ టాక్స్ అండ్ బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ టాక్సాలజీ ఇండియా డేటా ప్రకారం.. 2008 నుండి 2010 వరకు విరాట్ కోహ్లీ పలికిన ధర కేవలం రూ .12 లక్షలు మాత్రమే. తన ఆకట్టుకునే ఆట, ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ కారణంగా 2025లో రూ .21 కోట్లకు పెరిగింది.2010 తర్వాత 2011-13 మధ్య కాలంలో విరాట్ కోహ్లీ ధర రూ.8.28 కోట్లకు పెరిగింది. 2014 నుంచి 2017 వరకు రూ.12.5 కోట్లు, 2018 నుంచి 2021 వరకు రూ.17 కోట్లు. అయితే 2022 నుంచి 2024 వరకు ఆయన ధర రూ.15 కోట్లకు పడిపోగా, ఇప్పుడు 40 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరుకుందని టాక్సాలజీ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా విరాట్ కోహ్లీ రూ.179.70 కోట్లు అందుకున్నాడు.కట్టాల్సిన పన్ను ఎంత?2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కోసం విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ పేమెంట్ రూ .21 కోట్లకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కోహ్లీ ఆర్సీబీ ఉద్యోగి కాదు కానీ ఐపీఎల్ కాంట్రాక్ట్ ఫీజు అందుకుంటున్నాడు కాబట్టి, ఈ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28 కింద "వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం" గా వర్గీకరిస్తారు.పన్ను లెక్కింపురూ.5 కోట్లకు పైగా సంపాదిస్తున్న వ్యక్తిగా విరాట్ కోహ్లీ అత్యధిక ఆదాయపు పన్ను శ్లాబ్ పరిధిలోకి వస్తాడు. అతను కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నాడనుకుంటే (ఇది అధిక ఆదాయం సంపాదించేవారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది) సంపాదనపై 30% పన్ను వర్తిస్తుంది.సంపాదన రూ.21 కోట్లపై 30% పన్ను అంటే రూ.6.3 కోట్లు అవుతుంది. ఆదాయం రూ.5 కోట్లకు పైగా ఉంటే పన్ను మొత్తంపై 25 శాతం సర్ఛార్జ్ అదనంగా ఉంటుంది. అలా రూ.6.3 కోట్లపై ఇది రూ.1.575 కోట్లు అవుతుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ (ట్యాక్స్ + సర్ఛార్జ్పై 4%) రూ.0.315 కోట్లు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.19 కోట్లు అవుతుందన్న మాట. అంటే పన్ను కింద పోయేది తీసేయగా విరాట్ కోహ్లీ అందుకునేది రూ.12.81 కోట్లు.ఒకవేళ వ్యాపార ఖర్చులు (ఏజెంట్ ఫీజులు, ఫిట్ నెస్ ఖర్చులు, బ్రాండ్ మేనేజ్ మెంట్ వంటివి) ఉంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ముందు సెక్షన్ 37(1) కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇతర ఆదాయ మార్గాలు (ఎండార్స్ మెంట్లు, పెట్టుబడులు మొదలైనవి) కూడా విడిగా పన్ను విధించబడతాయి. -
ఒక్క బెంగళూరు సెంటర్లోనే 180 మంది తొలగింపు
ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను ఎదుర్కొంటోన్న అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ లేఆఫ్లను అమలు చేస్తోంది. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తగ్గింపులో భాగంగా బెంగళూరులోని ఇంజినీరింగ్ టెక్నాలజీ సెంటర్ నుంచి 180 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విమాన తయారీ సంస్థ భారత్ లో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.బోయింగ్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. భారత్లో ఇటీవల 2024 డిసెంబర్ త్రైమాసికంలో జరిగిన తొలగింపులు ఇందులో భాగంగానే జరిగాయి. కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, ఉద్యోగ కోతలు వ్యూహాత్మకంగా ఉన్నాయని, అయితే వీటి ప్రభావం కస్టమర్లు, కార్యకలాపాలపై పెద్దగా ఉండదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.కంపెనీలో కొన్ని ఉద్యోగాలు తగ్గినప్పటికీ అదే సమయంలో సర్వీస్, సేఫ్టీ, నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కొత్త ఉద్యోగాలను కూడా కంపెనీ సృష్టించింది. బెంగళూరు, చెన్నైలోని బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (బీఐఈటీసీ) అధునాతన ఏరోస్పేస్ పనులను నిర్వహిస్తోంది. కంపెనీ బెంగళూరు క్యాంపస్.. యూఎస్ వెలుపల అతిపెద్ద గ్లోబల్ పెట్టుబడులలో ఒకటి.ఇదిలావుండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి 2029 నాటికి జర్మనీలో 7,500 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 2024లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు 23,382 మంది ఉద్యోగులను తొలగించగా, 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023లో అత్యధికంగా 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను తొలగించాయి. -
రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్
ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్లో వైరల్ అయ్యాయి.పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తికార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.పూణేలోని 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు. -
నీటి సంరక్షణలో ప్రముఖ సిమెంట్ కంపెనీ
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తాము దృష్టి సారించిన నీటి నిర్వహణ పద్ధతులు, ప్రభావవంతమైన పాలనా వ్యవస్థల ద్వారా బాధ్యతాయుతమైన నీటి నిర్వహణ పట్ల తమ నిబద్ధతను అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వెల్లడించింది. అల్ట్రాటెక్ నీటి నిర్వహణ ప్రయత్నాలు.. యూనిట్ ప్రాంగణంలో, కంచెకు ఆవల ఉన్న ప్రాంతాలను.. అంటే కంపెనీ కార్యకలాపాలను నిర్వహించే ప్రాంతాలలోని కమ్యూనిటీలను సైతం చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో వున్న అల్ట్రాటెక్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిమెంట్ తయారీ యూనిట్, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్, నీటి సంరక్షణ పట్ల సమగ్ర విధానాన్ని కలిగి ఉంది. వారి నీటి సంరక్షణ కార్యక్రమాలలో ఒకటి వరుసగా నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లాలోని పెట్నికోట, అయ్యవారిపల్లి గ్రామాలపై దృష్టి పెడుతుంది. ఇక్కడ తక్కువ వర్షపాతం, భూమి క్షీణత, అతి తక్కవ పంట ఉత్పాదకత వంటివి గ్రామీణ జీవనోపాధికి చాలా కాలంగా అడ్డంకులుగా ఉన్నాయి. ఫలితంగా, ఈ ప్రాంతంలో సమగ్ర వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమాలను అమలు చేయడానికి యూనిట్ 2019-20లో ఐదు సంవత్సరాల కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ రోజు వరకు.. ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ ఈ గ్రామాల్లో ఏడు వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణాలను నిర్మించింది. ఇది భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఈ నిర్మాణాలు 35,000 క్యూబిక్ మీటర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాయి, జనవరి 2025 నాటికి 7 లక్షల క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని ఇవి సేకరించాయి. దీని వలన భూగర్భ జలాలు 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగాయి, దాదాపు 346 హెక్టార్ల సాగు భూమికి నీటిపారుదల లభించింది.గతంలో బంజరుగా ఉన్న 400 ఎకరాల భూమిని కూడా సాగులోకి తీసుకువచ్చారు, వ్యవసాయ ఉత్పాదకత, ఆదాయ భద్రతను పెంచారు. సమతుల్య పోషక వినియోగ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు ఈ గ్రామాల్లో నేల మరియు భూగర్భ జల కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడ్డాయి. ఈ ప్రాజెక్ట్ నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని ఈ రెండు గ్రామాల్లో నివసిస్తున్న 500 గృహాలలో 2,000 మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చింది.అల్ట్రాటెక్ సమగ్ర నీటి సంరక్షణ విధానంకమ్యూనిటీ నీటి సంరక్షణ కార్యక్రమాలతో పాటు, అల్ట్రాటెక్ దాని తయారీ కార్యకలాపాలలో నీటి సంరక్షణకు బహుముఖ విధానాన్ని కూడా తీసుకు వచ్చింది. ఈ విధానంలో అయిపోయిన గని గుంటలను జలాశయాలుగా మార్చడం, పైకప్పుపై వర్షపు నీటి సేకరణ నిర్మాణాలను నిర్మించడం, పునర్వినియోగించబడిన నీటి వినియోగం పెరగడంతో పాటు తయారీ కార్యకలాపాలలో నీటి సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలు ఉన్నాయి.అల్ట్రాటెక్ తమ అనేక తయారీ యూనిట్లలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) ప్లాంట్లను ఏర్పాటు చేసింది, దీని ద్వారా యూనిట్లలో 100 శాతం శుద్ధి చేసిన నీటిని తిరిగి ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా మంచినీటిపై ఆధారపడటం తగ్గుతుంది. నీటి సామర్థ్య మెరుగుదల అవకాశాలను గుర్తించడానికి, రోజుకు 100 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటి ఆధారపడటం ఉన్న దేశీయ ప్రదేశాలలో ఇది ద్వైవార్షిక నీటి ఆడిట్లను కూడా నిర్వహిస్తుంది.ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ తమ యూనిట్ ప్రాంగణంలో అనేక నీటి సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ప్రారంభం నుంచి ఈ యూనిట్ తమ ప్రాంగణంలో 1.9 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సేకరించి, రీఛార్జ్ చేసి.. తిరిగి ఉపయోగించుకుంది, ఒక్క FY24 లో మాత్రమే 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఆదా చేసింది. -
IPL 2025: జియోహాట్స్టార్కు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలైపోయింది. సుమారు రెండు నెలల పాటు సాగే ఈ సీజన్కు సంబంధించిన డిజిటల్, ఓటీటీ రైట్స్ అన్నింటినీ జియోహాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈసారి జియోహాట్స్టార్ ప్రకటనల ద్వారానే ఏకంగా రూ. 4,500 కోట్లు సంపాదించనుంది. దీనికోసం సంస్థ.. 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ 2025 ప్రకటన ధరలు➤టీవీ ప్రకటనలు: రూ.40 కోట్ల నుంచి రూ.240 కోట్లు➤ప్రాంతీయ టీవీ ప్రకటనలు: రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి➤కనెక్టెడ్ టీవీ (CTV): 10 సెకన్లకు రూ.8.5 లక్షలు➤మొబైల్ ప్రకటనలు: రూ.250 వరకుస్పాన్సర్లుజియోహాట్స్టార్ స్పాన్సర్ల జాబితాలో.. మై11సర్కిల్, ఫోన్పే, ఎస్బీఐ, బ్రిటానియా 50-50, అమెజాన్ ప్రైమ్, డ్రీమ్11, టీవీఎస్, మారుతి, అమెజాన్ ప్రైమ్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, జాగ్వార్, ఏషియన్ పెయింట్స్, అమూల్ మొదలైన 32 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్లో యాడ్స్ కోసం ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా?జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ఐపీఎల్ 2025 సమయంలో.. జియోహాట్స్టార్ 40 మిలియన్ల అదనపు చెల్లింపు సబ్స్క్రైబర్ల ప్రత్యేక ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్, జియో సినిమా విలీనం తర్వాత ఏర్పడిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్.. ప్రస్తుతం 62 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. 2025 ఫిబ్రవరి 14న ఈ సంఖ్య 50 మిలియన్లు. ఈ ఐపీఎల్ 2025 సీజన్కు 100 మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకోవడానికి సంస్థ కృషి చేస్తోంది. -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: నెలాఖరుకల్లా..
న్యూఢిల్లీ: వెండార్లతో సంప్రదింపుల వల్ల తలెత్తిన వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు మధ్య వ్యత్యాసాల సమస్యను పరిష్కరించుకోవడంపై ఓలా ఎలక్ట్రిక్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 40 శాతం బ్యాక్లాగ్లను క్లియర్ చేశామని, మిగతా వాటిని నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది.ఓలా ఫిబ్రవరిలో 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు వెల్లడించినప్పటికీ ప్రభుత్వ వాహన్ పోర్టల్లో 8,651 స్కూటర్లు మాత్రమే రిజిస్టర్ అయినట్లు గత గణాంకాల్లో వెల్లడయ్యాయి. మార్చి 20 నాటికి కంపెనీ రిజి్రస్టేషన్లు 11,781 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల గణాంకాల్లో వ్యత్యాసాలను నియంత్రణ నిబంధనలపరమైన సమస్యగా కొన్ని స్వార్ధ శక్తులు దుష్ప్రచారం చేశాయని ఓలా వ్యాఖ్యానించింది.కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడం, లాభదాయకతను మెరుగుపర్చుకునే క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించే రెండు జాతీయ స్థాయి వెండార్లతో కాంట్రాక్టులను నిలిపివేసిన తర్వాత ఇది మరింత తీవ్రమైందని పేర్కొంది. అమ్మకాలు, రిజి్రస్టేషన్ల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలపై భారీ పరిశ్రమల శాఖ, రహదారి రవాణా.. హైవేస్ శాఖ కంపెనీని స్పష్టత కోరిన నేపథ్యంలో ఓలా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారంగా బంగారం లీజింగ్
సాక్షి, బిజినెస్ డెస్క్: జ్యుయలర్లకు బంగారం లీజింగ్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి నుంచి బంగారం ధర 14 శాతం పైగా పెరిగింది.దీంతో సంఘటిత రిటైల్ జ్యుయలరీ సంస్థలైన టైటాన్, సెంకోగోల్డ్, కల్యాణ్ జ్యుయలర్స్, పీఎన్ గాడ్గిల్ తదితర వాటి మార్జిన్లపై ప్రభావం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్లతో బంగారం లీజింగ్ రేట్లు మరింత పెరుగుతాయని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు.‘‘వాణిజ్య, టారిఫ్ యుద్ధాలతో బంగారం లీజింగ్ రేట్లు రెట్టింపయ్యాయి. ఇది మార్జిన్లపై ఒత్తిళ్లను పెంచుతోంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని పీఎన్జీ జ్యుయలర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ ఫిరోదియా తెలిపారు. జ్యుయలరీ సంస్థలు అరువుగా తీసుకునే బంగారంపై వసూలు చేసే రేట్లను గోల్డ్ లీజింగ్ రేట్లుగా చెబుతారు. జ్యుయలర్లు తమకు కావాల్సిన బంగారాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి బదులు బ్యాంక్లు, బులియన్ ట్రేడర్ల నుంచి పరిమిత కాలానికి అరువు కింద తెచ్చుకుంటాయి. స్థానిక బ్యాంక్లు విదేశీ బ్యాంకుల నుంచి బంగారాన్ని సమకూర్చుకుని.. జ్యుయలరీ వర్తకులకు అరువుగా ఇస్తుంటాయి. కొంత వేచి చూశాకే నిర్ణయం తాము మార్చి త్రైమాసికం ముగిసే వరకు వేచి చూసే ధోరణి అనుసరించనున్నట్టు, ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని దేశంలోనే అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్ టైటాన్ వెల్లడించింది. ‘‘బంగారం లీజింగ్ రేట్లు ఇంకా పెరుగుతాయని సంకేతాలు తెలియజేస్తున్నాయి. సరఫరా ఎలా ఉందన్న దాన్ని అర్థం చేసుకునేందుకు ఒకటి రెండు నెలలు పడుతుంది. అప్పుడే ధరల తీరు తెలుస్తుంది’’అని టైటాన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) విజయ్ గోవిందరాజన్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదా..?బాడుగ బంగారంపై రేట్లు పెరిగిన నేపథ్యంలో తమ మార్జిన్లను కాపాడుకోవాలంటే జ్యుయలర్లు ఆభరణాల రేట్లను పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు డిమాండ్ లేని సీజన్ కావడంతో రేట్ల పెంపు విషయంలో జ్యుయలర్లు సౌకర్యంగా లేని పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో పండుగలు, వివాహాల కారణంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం పెరగడానికి ఎలాంటి అనుకూలతలు లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.గోల్డ్ లీజింగ్ రేట్లు పెరగడం తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువాంకర్ సేన్ ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. లీజింగ్ రేట్లు పెరగడం వల్ల తమకు రుణ వ్యయాలు 0.5 శాతం మేర పెరగనున్నట్టు చెప్పారు. తద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 7–8 కోట్ల మేర తమపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎంసీఎక్స్లో బంగారం రేట్లు జనవరి నుంచి 14 శాతానికి పైగా పెరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్థిక అనిశ్చితులు బంగారం రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
టాటా పవర్ సోలార్ రూఫ్టాప్ కొత్త మైలురాయి
దేశంలోనే నంబర్ వన్ రూఫ్టాప్ సోలార్ ప్రొవైడర్గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ టాటా పవర్ దేశవ్యాప్తంగా 1,50,000 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మొత్తం సామర్థ్యం ఇప్పుడు సుమారు 3 గిగా వాట్లకు చేరింది. భారతదేశ పునరుత్పాదక విద్యుత్ పరివర్తనలో కంపెనీ పోషిస్తున్న కీలక పాత్రకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది.దేశంలోని 700 పైచిలుకు నగరాల్లో కార్యకలాపాలతో టాటా పవర్ రెన్యువబల్ ఎనర్జీ లిమిటెడ్లో (TPREL) భాగమైన టాటా పవర్ సోలార్ రూఫ్టాప్, సుస్థిరమైన, విద్యుత్తును ఆదా చేసే భవిష్యత్ దిశగా భారత్ సాగిస్తున్న ప్రస్థానంలో ముందువరుసలో ఉంటోంది.కంపెనీ తమ తమిళనాడు ఫ్యాక్టరీలో ఏఎల్ఎంఎం ఆమోదిత సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తోంది.ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సహా 20 పైగా ఆర్థిక భాగస్వాముల ద్వారా టాటా పవర్ సరళతరమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. తద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత చౌకగా, అందరికీ అందుబాటులోకి తెస్తోంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలు, తమ ఫ్లాగ్షిప్ ‘ఘర్ఘర్ సోలార్’ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమల్లో కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.టాటా పవర్ సోలార్ రూఫ్టాప్ కంపెనీకి దేశవ్యాప్తంగా 300 పైచిలుకు నగరాల్లో 575 పైగా చానల్ పార్ట్నర్లు, 400 పైగా నగరాల్లో 225 పైగా అధీకృత సర్వీస్ భాగస్వాములు ఉన్నారు. రెసిడెన్షియల్ రంగంలో 1,22,000 పైగా వినియోగదారులు సహా 1.5 లక్షలకు పైగా కస్టమర్ల బేస్తో కంపెనీ పటిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది. -
అమెజాన్లో షాపింగ్.. కొత్త చార్జీలు
వస్తువు ఏదైనాఇప్పుడు చాలా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. మంచి డిస్కౌంట్లు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. అయితే ఆ డిస్కౌంట్ల మీదనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కన్ను పడింది. ‘డిస్కౌంట్లు ఊరికే రావు’ అంటోంది.సాధారణంగా చాలా ఈ-కామర్స్ సైట్లలో వస్తువుల కొనుగోలుపై వివిధ బ్యాంకులు తమ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే తక్షణ తగ్గింపులు ఇస్తుంటాయి. అయితే అమెజాన్లో వీటిని వినియోగించుకోవాలంటే కొంత మొత్తం ఆ ఈ-కామర్స్ కంపెనీకీ ఇవ్వాలి. రూ .500 లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (ఐబీడీ) ఉపయోగించే కొనుగోళ్లకు అమెజాన్ రూ .49 ప్రాసెసింగ్ ఫీజును ప్రవేశపెట్టింది.డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు రుసుమా?అవును, మీరు విన్నది నిజమే. కొనుగోలుదారులు డిస్కౌంట్ ఉపయోగించుకునేందుకు అమెజాన్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇలాంటి రుసుమును మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇప్పటికే వసూలు చేస్తోంది. ఈ బ్యాంకు ఆఫర్ల నిర్వహణ, ప్రాసెసింగ్ ఖర్చును భరించడానికి ఈ రుసుము సహాయపడుతుందని అమెజాన్ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే, ఇది మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి చిన్న సర్వీస్ ఛార్జీ వంటిది.అమెజాన్లో ఏదైనా ఆర్డర్పై మీరు రూ .500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ను వర్తింపజేస్తే, అమెజాన్ మీ మొత్తం బిల్లుకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ .49 జత చేస్తుంది. ఉదాహరణకు మీరు రూ .5,000 విలువైన వస్తువును కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. మీ బ్యాంక్ మీకు రూ .500 తగ్గింపు ఇస్తుంది. అప్పుడు సాధారణంగా అయితే రూ.4,500 చెల్లించాలి. కానీ ఇప్పుడు, అమెజాన్ రుసుముగా రూ .49 వసూలు చేస్తోంది కాబట్టి మీరు చెల్లించాల్సిన తుది మొత్తం రూ .4,549 అవుతుంది.ఈ రుసుమును ఎవరు చెల్లించాలి?రూ.500 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ డిస్కౌంట్ వినియోగించుకునే వారు.ప్రైమ్ సభ్యులకు కూడా మినహాయింపు లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది.డిస్కౌంట్ రూ.500 లోపు ఉంటే ఈ ఫీజు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఒకవేళ మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసినా లేదా రిటర్న్ చేసినా కూడా రూ.49 ఫీజు రీఫండ్ కాదు. -
స్విస్ వాచీల స్టోర్స్ విస్తరణ.. కొత్తగా మరో ఆరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్విస్ లగ్జరీ వాచీల దిగ్గజం బ్రైట్లింగ్ వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా ఆరు బొటిక్ స్టోర్స్ను ఏర్పాటు చేయనుంది. దీంతో వీటి సంఖ్య 10కి చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు పుణె తదితర నగరాల్లో నాలుగు బొటిక్ స్టోర్స్ ఉన్నట్లు బ్రైట్లింగ్ ఇండియా ఎండీ ప్రదీప్ భానోత్ తెలిపారు.దేశీయంగా స్విస్ వాచీల మార్కెట్ సుమారు రూ. 2,500 కోట్లుగా ఉంటోందని ఆయన చెప్పారు. పరిశ్రమ ఏటా సుమారు 15 శాతం ఎదుగుతుండగా, తాము అంతకు మించి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రదీప్ చెప్పారు. స్మార్ట్ వాచీలు వచ్చినప్పటికీ .. హోదాకు నిదర్శనంగా ఉండే బ్రైట్లింగ్లాంటి లగ్జరీ వాచీల ప్రాధాన్యతను గుర్తించే వారు పెరుగుతున్నారని ఆయన తెలిపారు.అలాగే వాటిపై ఖర్చు చేసే సామర్థ్యాలు పెరుగుతుండటం కూడా వ్యాపార వృద్ధికి దోహదపడనుందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టోర్లో సుమారు రూ. 3.11 లక్షల నుంచి సుమారు రూ. 17 లక్షల పైచిలుకు విలువ చేసే వాచీలు అందుబాటులో ఉన్నాయి. 140 ఏళ్ల బ్రైట్లింగ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమున్న వాచీలను ఇందులో మార్చి 25 వరకు ప్రదర్శిస్తున్నారు. -
బ్యాంకుల బంద్పై అప్డేట్..
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. తమ డిమాండ్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి సంతృప్తికరమైన హామీలు రావడంతో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విరమించాలని బ్యాంకింగ్ యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) నిర్ణయించింది.యూఎఫ్బీయూ అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్లకు చెందిన బ్యాంకు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. యూఎఫ్బీయూ తొలుత మార్చి 24, 25 తేదీల్లో అంటే వచ్చే సోమ, మంగళ వారాలలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని పార్టీలను సంప్రదింపుల సమావేశానికి పిలిచిన తర్వాత సమ్మెను వాయిదా వేయాలని చీఫ్ లేబర్ కమిషనర్ నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.వార్తా ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐబీఏ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై చర్చిస్తామని యూనియన్కు హామీ ఇచ్చాయి. దీంతో వచ్చే వారం ప్రారంభంలో చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను యూనియన్ విరమించినట్లు తెలుస్తోంది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్బీయూ వ్యతిరేకిస్తోంది.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్బీయూలో ఉన్నాయి. -
‘ట్విటర్ పిట్ట’ వేలం.. భారీ ధర పలికిన లోగో
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్(ప్రస్తుతం ‘ఎక్స్’).. ఈ పేరు వినగానే మొదటి గుర్తుకొచ్చేంది దాని ఫేమస్ బర్డ్ లోగో. అదేనండి ‘ట్విటర్ పిట్ట’. ట్విటర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్’గా మార్చి శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత బర్డ్ లోగోను తొలగించారు. ఇప్పుడా బర్డ్ లోగోను వేలానికి ఉంచగా భారీ ధర పలికింది.ట్విటర్ బర్డ్ లోగోను ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 34,375 డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు) అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. 12 అడుగులు 9 అడుగులు (3.7 మీటర్లు 2.7 మీటర్లు) కొలతలు, 560 పౌండ్ల (254 కిలోలు) బరువు ఉన్న ఈ బర్డ్ లోగో 34,375 డాలర్లకు అమ్ముడుపోయిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే కొన్నదెవరనేది మాత్రం వెల్లడించలేదు.ట్విటర్ను 2022లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అయితే, కొనుగోలు తర్వాత ప్రకటనలను నిలుపుకోవడంలో ట్విటర్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఇందులో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్లతో సహా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కితీసుకున్నారు. ట్విటర్ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలన్న లక్ష్యంతో దీన్ని ఆయన ‘ఎక్స్’గా మార్చేశారు.ట్విటర్ను ‘ఎక్స్’గా మార్చేసిన తర్వాత పాత లోగోలు, జ్ఞాపికలు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్వేర్ వంటి పలు వస్తువులను మస్క్ ఇప్పటికే వేలంలో విక్రయించేశారు. ఇలా వేలంలో భారీ ధరలు పలికిన ఇతర టెక్ వస్తువులలో యాపిల్ కంప్యూటర్ సంస్థకు చెందిన పలు వస్తువులు ఉన్నాయి. వీటిలో యాక్సెసరీస్ తో కూడిన యాపిల్ -1 కంప్యూటర్ 3,75,000 డాలర్లు, 1976 లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్కు 1,12,054 డాలర్లు, మొదటి తరం 4 జీబీ ఐఫోన్ 87,514 డాలర్లు ధర పలికాయి. -
జొమాటో కొత్త పేరు: మార్చి 20 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవల సంస్థ జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆమోదముద్ర వేసింది. ఈ మార్పు మార్చి 20 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.తమ ఫుడ్ డెలివరీ వ్యాపార విభాగం పేరు జొమాటోగానే కొనసాగుతుందని, కార్పొరేట్ సంస్థ పేరు, స్టాక్ టికర్ మాత్రం మారతాయని పేర్కొంది. ఎటర్నల్లో నాలుగు ప్రధాన వ్యాపారాలు (జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ప్యూర్) ఉన్నాయి.జొమాటో పేరును ‘ఎటర్నల్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదికను.. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ 2025 ఫిబ్రవరిలోనే వెల్లడించారు. కాగా దానిని ఇప్పుడు ఆమోదం లభించింది. కొత్త పేరు త్వరలోకే అమలులోకి వస్తుంది. -
వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తి
వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాటలు ఎంత దుమారం రేకెత్తించాయో అందరికీ తెలుసు. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ 'సుధామూర్తి' ఇండియా త్రూ ది ఐస్ ఆఫ్ ఇట్స్ ఐకాన్స్ కార్యక్రమంలో మాట్లాడారు.ఏదైనా పనిని అంకిత భావంతో చేయాలని సంకల్పించినప్పుడు.. సమయంతో పని ఉండటం. నారాయణమూర్తి డబ్బు లేకుండా, అంకితభావంతో పనిచేసే సహోద్యోగులతో ఇన్ఫోసిస్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారందరూ వారానికి 70 గంటలు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ పనిచేసినప్పుడే అది సాధ్యమైంది. పని గంటలు చూసుకుని ఉంటే.. ఇన్ఫోసిస్ ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు.ఇన్ఫోసిస్ ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే.. దీని వెనుక మాయ, మంత్రమో ఏమీ లేదు. కేవలం పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేయడం వల్లనే అది సాధ్యమైంది. అదృష్టం కొంత, సరైన సమయం, సరైన స్థలం వంటివన్నీ ఇన్ఫోసిస్ ఎదగడానికి కారణమయ్యాయని సుధామూర్తి పేర్కొన్నారు.నా భర్త మాత్రమే కాదు..నా భర్త మాత్రమే కాదు.. కొందరు జర్నలిస్టులు, వైద్యులు, ఇతర రంగాలలోని వారు కూడా వారానికి 90 గంటలు కూడా పనిచేశారని సుధామూర్తి పేర్కొన్నారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్లో బిజీగా ఉన్నప్పుడు.. నేను ఇంటిని, నా పిల్లలను చూసుకోవడంలో సమయం కేటాయించాను, కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బోధించడం కూడా ప్రారంభించానని సుధామూర్తి అన్నారు.ఏదైనా పనిచేయాలనుకున్నప్పుడు.. నాకు సమయం లేదు అని అనుకోకూడదు. పని చేస్తూ.. ఆ పనిని ఆస్వాదించాలి. కాబట్టి నేను ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ బిజీగా ఉంటాను. నా పిల్లలు విదేశాలకు వెళ్ళినప్పుడు.. ఓవర్ టైమ్ కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం నా భర్త కంటే బిజీగా ఉంటాను. దీనిని నారాయణమూర్తి కూడా మద్దతు ఇస్తుంటారు.ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి బ్యాంకుల పనిదినాలు వారానికి ఐదు రోజులా?: ఇదిగో క్లారిటీప్రతి విజయవంతమైన మహిళ వెనుక, ఒక అవగాహన కలిగిన పురుషుడు ఉంటాడు. కాబట్టి.. మూర్తి పనిచేస్తున్నప్పుడు నేను ఆయనకు మద్దతు ఇచ్చాను. నేను పనిచేస్తున్నప్పుడు మూర్తి మద్దతు ఇస్తున్నారు. దీనినే నేను జీవితం అని పిలుస్తానని సుధామూర్తి పేర్కొంది. ధనవంతులకైనా, పేదవారికైనా, అందమైనవారికైనా, వికారమైనవారికైనా.. అందరికీ దేవుడు 24 గంటలు మాత్రమే ఇచ్చాడు అని ఆమె చెప్పింది. దానిని ఎలా ఖర్చు చేయాలనేది పూర్తిగా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. మీకు మీరు చేసే పనిమీద ఆసక్తి ఉంటే.. మీ భాగస్వామి కూడా దానికి తప్పకుండా మద్దతు ఇవ్వాలి అని సుధామూర్తి స్పష్టం చేసింది. -
IPL 2025: ఈ రీఛార్జ్ ప్లాన్లతో జియోహాట్స్టార్ ఫ్రీ..
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జియో అన్లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా కొన్ని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా క్రికెట్ వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ కథనంలో జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేక డేటా ప్లాన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.జియోకేవలం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 90 రోజుల వ్యాలిడిటీతో, 5జీబీ డేటా, జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచితంగా ఐపీల్ వీక్షించవచ్చు. ఈ ఆఫర్ 2025 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.ఎయిర్టెల్ఎయిర్టెల్ కూడా తన యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. వినియోగదారులు 100 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 195 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీతో 15జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీవోడాఫోన్ ఐడియావోడాఫోన్ ఐడియా అందిస్తున్న రూ.101 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 90 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే 151 రూపాయల రీఛార్జ్ ద్వారా 4జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. 169 రూపాయల ప్లాన్ ద్వారా 8జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 30 రోజుల మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నుంచి మెలిందా గేట్స్(Melinda Gates) విడాకులు తీసుకున్న మూడేళ్ల తర్వాత తన మాజీ భర్త ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎల్లే మ్యాగజైన్తో మాట్లాడిన 60 ఏళ్ల మెలిందా గేట్స్ తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ‘విడాకులు బాధాకరమైనవి. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.మెలిందా, బిల్ గేట్స్ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021 మేలో విడాకులు తీసుకున్నారు. తర్వాత మూడు నెలలకు అధికారికంగా వీరు విడిపోయారు. ఇటీవల తమ బ్రేకప్పై బిల్గేట్స్ టైమ్స్ ఆఫ్ లండన్తో మాట్లాడుతూ.. విడాకుల వ్యవహారం తనకు, మెలిందాకు కనీసం రెండేళ్ల పాటు బాధను మిగిల్చిందని అన్నారు. తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని తమ విడాకులేనన్నారు. తాను ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నెలల తర్వాత మెలిందా తాజాగా స్పందించడం గమనార్హం. తాము విడిపోవడం వల్ల కలిగిన బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నట్లు మెలిందా తెలిపారు. విడాకులు బాధాకరమైనవని చెప్పారు. ఇవి ఏ కుటుంబంలో ఉండకూడదనే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం కష్టమైనప్పటికీ జీవితాన్ని స్వతంత్రంగా పునర్నిర్మించగల సామర్థ్యం తనకు ఉందని ఆమె అన్నారు.ఇదీ చదవండి: ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార2021లో బిల్గేట్స్..మిలిండా గేట్స్ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్బై చెప్పారు. అదే ఏడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వాషింగ్టన్లోని కింగ్ కౌంటీ కోర్టులో మిలిందా గేట్స్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1987లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పాటు సమయంలో ఇద్దరూ కలుసుకున్నారు. 1994లో వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం విడిపోయే అంశంలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఆధారంగా డైవర్స్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక, మిలిందా గేట్స్ నుంచి విడిపోయిన బిల్ గేట్స్ పౌలా హార్డ్తో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. -
ప్రముఖ బ్రాండ్ ప్రచారకర్తలుగా మహేష్, సితార
దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ ట్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కుమార్తె సితార ఘట్టమనేనిను బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులను వీరు ప్రమోట్ చేయనున్నారు. ‘న్యూ టైమ్స్, న్యూ ట్రెండ్స్’ పేరుతో బ్రాండ్ ప్రచారానికి వీరు ఎంతో తోడ్పడుతారని కంపెనీ తెలిపింది.ప్రమోషన్లో స్టార్లు అవసరమేనా..?సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్మెంట్లు కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసం సంస్థలు సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటున్నాయో తెలుసుకుందాం.నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడం: సెలబ్రిటీలను తరచుగా రోల్ మోడల్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్లుగా భావిస్తారు. కాబట్టి తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్ పట్ల వినియోగదారులకు సానుకూలత రావడానికి, దాన్ని వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.బ్రాండ్ విజిబిలిటీని పెంచడం: సెలబ్రిటీ ప్రమోషన్ల ద్వారా స్టార్ల ఫాలోయింగ్ను కంపెనీలు ఆసరాగా చేసుకుంటాయి. దాంతో బ్రాండ్ ఉత్పత్తుల విజిబిలిటీని పెంచాలని లక్ష్యంగా చేసుకుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రభావం చూపుతుంది.ఎమోషనల్గా కనెక్ట్ చేయడం: అభిమానులు తరచుగా తమ ఫెవరెట్ స్టార్లతో పరోక్షంగా భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. సెలబ్రిటీలు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తులపై వినియోగదారుల భావోద్వేగాలు తోడవుతాయి. దాంతో కంపెనీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వస్తు ఎగుమతులను సేవలు అధిగమించాలిసవాళ్లు లేవా..సెలబ్రిటీల బ్రాండ్ ప్రమోషన్లలో కంపెనీలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. స్టార్ల జీవన విధానం బ్రాండ్లపై ప్రభావం చూపుతుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే కంపెనీ ఉత్పత్తులపై దాని ప్రభావంపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఎంపిక కీలకంగా మారుతుంది. -
హెచ్సీఎల్ గ్రూప్తో ప్రుడెన్షియల్ జత
న్యూఢిల్లీ: దేశీయంగా ఆరోగ్య బీమా బిజినెస్ నిర్వహణకు వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ)తో యూకే సంస్థ ప్రుడెన్షియల్ పీఎల్సీ తాజాగా చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ గ్రూప్ ప్రమోటర్ సంస్థ వామ సుందరితో భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఏర్పాటుకు తెరతీసింది. తద్వారా దేశీయంగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ నిర్వహణను చేపట్టనుంది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జేవీలో యూకే అనుబంధ సంస్థ ప్రుడెన్షియల్ గ్రూప్ హోల్డింగ్స్ 70 శాతం వాటా పొందనుండగా.. మిగిలిన 30 శాతం వాటాను వామ తీసుకోనుంది.దేశీయంగా పెరుగుతున్న ఆరోగ్య బీమా అవసరాలకు అనుగుణంగా జేవీ సేవలు అందించనున్నట్లు ప్రుడెన్షియల్ పీఎల్సీ సీఈవో అనిల్ వాధ్వానీ పేర్కొన్నారు. వెరసి 2047కల్లా అందరికీ ఆరోగ్య బీమా ప్రభుత్వ విజన్కు మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. ప్రుడెన్షియల్ పీఎల్సీతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమాను మరింత విస్తరించడంతోపాటు.. నాణ్యమైన సేవలు అందించనున్నట్లు వామ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిఖర్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈ మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని ఆదేశాలుబ్యాక్గ్రౌండ్ ఇదీదేశీయంగా జీవిత బీమా వెంచర్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ 2016లో లిస్టయ్యింది. తద్వారా తొలిసారి ఇన్సూరెన్స్ రంగ కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. ఈ బాటలో పాక్షిక వాటా విక్రయం ద్వారా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సైతం లిస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు గత నెలలో ప్రుడెన్షియల్ ప్రకటించింది. ఇక 1976లో ఏర్పాటైన హెచ్సీఎల్ గ్రూప్ ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ, హెల్త్కేర్, టాలెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్లు సైతం గ్రూప్ అందిస్తోంది. -
మణప్పురంలో బెయిన్కు వాటా
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం బెయిన్ క్యాపిటల్ బంగారంపై రుణాలందించే మణప్పురం ఫైనాన్స్లో 18 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 4,385 కోట్లు వెచ్చించనుంది. తద్వారా గోల్డ్ లోన్ కంపెనీ ప్రమోటర్ సంస్థలలో ఒకటిగా అవతరించనుంది. దీంతో నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేరుకి రూ. 236 చొప్పున ధర నిర్ధారించింది. ఇందుకు మరో రూ. 5,764 కోట్లు కేటాయించనుంది. వెరసి విసర్తించిన తదుపరి మణప్పురం ఫైనాన్స్ చెల్లించిన మూలధనంలో 41.7 శాతానికి బెయిన్ వాటా బలపడనుంది.6 నెలల సగటు ధర ప్రిఫరెన్షియల్ పద్ధతిలో బెయిన్కు ఈక్విటీతోపాటు.. వారంట్లను మణప్పురం కేటాయించనుంది. గత ఆరు నెలల సగటు ధరకంటే 30% అధిక(ప్రీమియం) ధరతో వీటిని జారీ చేయనుంది. వీటితో విస్తరించనున్న కంపెనీ ఈక్విటీలో బెయిన్కు 18% వాటా లభించనుంది. తద్వారా మణప్పురం ఫైనాన్స్లో సహప్రమోటర్ కానుంది. దీంతో వారంట్లు మినహా మిగిలిన ఈక్విటీ నుంచి సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ పూర్తిగా విజయవంతమైతే బెయిన్ వాటా వారంట్ల మారి్పడి తదుపరి 41.7%కి బలపడనుంది. ఇదే సమయంలో ప్రస్తుత ప్రమోటర్ల వాటా 28.9 %కి చేరనుంది. అయితే ఈ లావాదేవీలకు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. 1949లో ఆవిర్భావం: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ 1949లో కేరళలో ఏర్పాటైంది. 5,357 బ్రాంచీలుసహా 50,795 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ మైక్రో, వాహన, గృహ, ఎస్ఎంఈ ఫైనాన్స్లోకి సైతం విస్తరించింది.షేరు 8 శాతం జూమ్...సాధారణ వాటాదారులకు బెయిన్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేరు 7.7 శాతం జంప్చేసి రూ. 234 వద్ద ముగిసింది. ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 248కు చేరింది. ఇది 52 వారాల గరిష్టం. -
సంక్షోభంలో ‘సూక్ష్మం’
ఆర్థిక సేవలు అంతగా అందని వర్గాలకు రుణాల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన సూక్ష్మ రుణాల రంగం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. పెరిగిపోతున్న మొండిబాకీలు, నియంత్రణ నిబంధనల్లో మార్పులు, నిధుల కొరత సమస్యలతో పరిశ్రమ కుదేలవుతోంది. క్రెడిట్ బ్యూరో క్రిఫ్ హై మార్క్ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీలు (ఎన్పీఏ) ఆల్టైం గరిష్ట స్థాయి రూ. 50,000 కోట్లకు ఎగబాకాయి. మొత్తం స్థూల రుణాల పోర్ల్ఫోలియోలో ఇది 13%. ఇక ఎన్పీఏగా మారే రిసు్కలున్న రుణాల పోర్ట్ఫోలియో దాదాపు 1% నుంచి 3.3 శాతానికి పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాలతో ఇప్పటికే కొన్ని సంస్థల రేటింగ్ పడిపోగా మరిన్ని సంస్థలకు కూడా డౌన్గ్రేడ్ ముప్పు నెలకొంది. ఎడాపెడా రుణాలు.. ఆర్థిక పరిస్థితులపై ఆశావహ భావంతో మైక్రోఫైనాన్స్ రంగం గత ఆర్థిక సంవత్సరం భారీగా రుణాలిచ్చేసింది. 2023–24 నాలుగో త్రైమాసికంలో అత్యధికంగా రూ. 48,322 కోట్ల మేర రుణాలిచ్చింది. ఇలాంటి దూకుడు ధోరణే ప్రస్తుత సమస్యకు కారణాల్లో ఒకటయ్యింది. రెండు మూడు సంస్థల దగ్గర అప్పులు తీసుకున్న వారు, సమయానికి వాటిని కట్టలేకపోతుండటంతో రుణాలిచ్చిన సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అవి రుణ కార్యకలాపాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎంఎఫ్ఐల స్థూల రుణాల పోర్ట్ఫోలియో 3.53 శాతం మేర క్షీణించి రూ. 3.85 లక్షల కోట్లకు పరిమితమైనట్లు మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నెట్వర్క్ ఓ నివేదికలో తెలిపింది. అసెట్ క్వాలిటీ కూడా బాగా దెబ్బతిందని వివరించింది. ఇక 91–180 రోజుల వ్యవధి గల మొండిబాకీలు 2023 డిసెంబర్ క్వార్టర్లో నమోదైన 0.9 శాతంతో పోలిస్తే 2024 డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 3.3%కి చేరాయి. 30 రోజులకు మించి బాకీపడిన రుణాల పరిమాణం 3.5% నుంచి 8.8%కి ఎగిసింది. మరోవైపు, క్యూ3లో రుణ వితరణ 35.8% క్షీణించి రూ. 22,091 కోట్లకు పరిమితమైంది. ఎంఎఫ్ఐలు తమ వ్యాపార కార్యకలాపాలకు కావల్సిన నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలపై (డీఎఫ్ఐ) ఆధారపడుతుంటాయి. కానీ, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాటికి నిధులు సమకూర్చే విషయంలో బ్యాంకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన రుణాలను కొంత పునర్వ్యవస్థీకరించినా, కొత్త రుణాలివ్వడం కాస్త కష్టతరమే కావొచ్చని ఇండియా రేటింగ్స్ వర్గాలు వెల్లడించాయి. ఇలా తామిచ్చిన రుణాలు సకాలంలో వసూలు కాక, అటు వ్యాపారాన్ని విస్తరించేందుకు రుణాలు రాక ఎంఎఫ్ఐలకు క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంఎఫ్ఐలు, వడ్డీవ్యాపారులు బలవంతపు రికవరీ పద్ధతులకు పాల్పడకుండా కర్ణాటక అమల్లోకి తెచ్చిన కఠినతర ఆర్డినెన్స్ నిబంధనల వల్ల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డౌన్గ్రేడ్ల పరంపర..: ఆర్థిక పనితీరు అంతంత మాత్రంగానే ఉండటంతో పలు మైక్రో ఫైనాన్స్ సంస్థల రేటింగ్స్ పడిపోతున్నాయి. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ను (ఎస్ఎఫ్ఎల్) ఇక్రా, కేర్ రేటింగ్స్ డౌన్గ్రేడ్ చేశాయి. డిసెంబర్ క్వార్టర్లో ఎస్ఎఫ్ఎల్ రూ. 601 కోట్ల నష్టం ప్రకటించగా, రూ. 700 కోట్లు రైటాఫ్ చేసింది. అటు ఊహించిన దానికన్నా అసెట్ క్వాలిటీ, లాభదాయకత గణనీయంగా తగ్గిపోవడంతో ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ రేటింగ్ను గతేడాది నవంబర్లోనే ఏజెన్సీలు డౌన్గ్రేడ్ చేశాయి. క్రెడిట్యాక్సెస్ గ్రామీణ్ సైతం క్యూ3లో లాభాల నుంచి నష్టాల్లోకి జారిపోయింది.– సాక్షి, బిజినెస్ డెస్క్మార్చి క్వార్టర్పై ఆశలు .. మొండి బాకీల సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి ఇది క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని ఎంఎఫ్ఐఎన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. మార్చి త్రైమాసికం నాటికి లిక్విడిటీతో పాటు రుణ నాణ్యత కూడా మెరుగుపడొచ్చని పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రుణలివ్వాల్సిన నిబంధనను పాటించాల్సినందున బ్యాంకుల నుంచి నిధులు లభించి, నాలుగో త్రైమాసికంలో పరిస్థితులు బాగుండవచ్చని భావిస్తున్నారు. అయితే, బ్యాంకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితులు పరిశ్రమలో కన్సాలిడేషన్కి దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హావెల్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా నయనతార దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ఉపకరణాల సంస్థ ‘హావెల్స్’ దక్షిణాది మార్కెట్కు బ్రాండ్ అబాసిడర్లుగా సినీతారలు నయనతార, విఘ్నేష్ శివన్లను ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దక్షిణాదిలో హావెల్స్ పట్టును మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు బుధవారం హావెల్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.నయనతార, విఘ్నేష్ శివన్ లు జంటగా తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం ఇది తొలి సారి అని వెల్లడించింది. దక్షిణాదిలో సంస్థ ఉనికిని మరింత బలోపేతం చేయడమేకాకుండా అభివృద్ధికి కొత్త మార్గాలను అందిపుచ్చుకోవడానికి ఊతమిస్తుందని హావెల్స్ ఇండియా సేల్స్ విభాగం ప్రెసిడెంట్ పేర్కొన్నారు.నయనతార, విఘ్నేష్ శివన్ లను హావెల్స్ కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని హావెల్స్ ఇండియా ఈవీపీ బ్రాండ్ అండ్ మార్కామ్ రోహిత్ కపూర్ పేర్కొన్నారు. సంస్థ బ్రాండ్ విలువలను వాస్తవికంగా ప్రతిబింబించే వ్యక్తులతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. కాగా.. హావెల్స్కు బ్రాండ్ అంబాసిడర్లు ఎంపిక కావడం పట్ల నయతార, విఘ్నేష్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మకత, నాణ్యత, విశ్వాసానికి పేరున్న హావెల్స్తో అనుబంధం చాలా సంతోషకరమన్నారు. దక్షిణాది మార్కెట్లలో బ్రాండ్ స్థానాన్ని బలోపేతం చేయడానికి తాము హావెల్స్కు పూర్తిగా మద్దతు ఇస్తామన్నారు. -
జియో కొత్త ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం 11 నెలల ప్లాన్ వెల్లడించింది. కేవలం 895 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 330 రోజుల కంటే ఎక్కువ అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఎస్ఎమ్ఎస్ & డేటా వంటి వాటిని పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒకసారి రూ. 895తో రీఛార్జ్ చేస్తే.. రోజుకు దాదాపు మూడు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసినట్లు అవుతుంది. 11 నెలలు (336 రోజులు) అపరిమిత కాల్స్ కాకుండా.. 600 ఎస్ఎమ్ఎస్లు, 24 జీబీ డేటా లభిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ ఉన్నవారికి మాత్రమే. స్మార్ట్ఫోన్ యూజర్లు ఈ ప్లాన్ను ఉపయోగించుకోలేరు.ఎస్ఎమ్ఎస్లు & డేటా వివరాలుఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు 50 ఉచిత ఎస్ఎమ్ఎస్లను అందిస్తుంది. అంటే నెలకు 50 ఎస్ఎమ్ఎస్లు మాత్రమే లభిస్తాయి. ఆలా 12 సార్లు 50 ఉచిత ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మొత్తానికి 24 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఎక్కువ డేటా అవసరం లేదు అనుకున్నవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సాధారణ స్మార్ట్ఫోన్ వినియోగదారులు 336 రోజులు యాక్టివ్గా ఉంచడానికి రూ.1748 ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.1748 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.1748 ప్లాన్లో.. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. ఈ ప్లాన్లో జియోటీవీ, జియోక్లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్లో కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటివాటితో పాటు డేటా కూడా లభిస్తుంది. -
వాణిజ్య అవరోధాలపై ప్రధాన దృష్టి: సునీల్ బరత్వాల్
న్యూఢిల్లీ: ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్టీఏ) దిగుమతి సుంకాలు, టారిఫ్యేతర అంశాల్లాంటి ప్రధాన వాణిజ్య అవరోధాలపై ముందుగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు.సాధారణంగా ఇవి ఓ కొలిక్కి వచ్చేసరికే ఎక్కువ సమయం పట్టేస్తుందని, అప్పటికల్లా అందరికీ ఎఫ్టీఏలపై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే టారిఫ్లు, టారిఫ్యేతర అడ్డంకులు, నియంత్రణ సంస్థలపరమైన సమస్యలు మొదలైన వాటిని ముందుగా పరిష్కరించుకునే విధానం పాటించడం శ్రేయస్కరమని చెప్పారు.సీఐఐ నిర్వహించిన ఇండియా–ఎల్ఏసీ (లాటిన్ అమెరికా–కరీబియన్) బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సునీల్ ఈ విషయాలు వివరించారు. భారత్ ఇప్పటికే బ్రెజిల్, పరాగ్వే తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని, ఎల్ఏసీ ప్రాంత దేశాలతో కూడా అవరోధాలను అధిగమించే అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు.ప్రపంచ దేశాలు రక్షణాత్మక ధోరణులను తగ్గించుకుని వాణిజ్య వృద్ధికి ఊతమివ్వాలని సూచించారు. ఆటోమొబైల్, మెడికల్ డివైజ్లు, ఫార్మా తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని సునీల్ చెప్పారు. -
బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..
భారత బీమా ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన ఐదుగురు కీలక వ్యక్తులను బీమా సలహా కమిటీ (ఐఏసీ)లో భారత బీమా నియంత్రణ సంస్థ నియమించింది. ఇన్సూరెన్స్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలను పరిష్కరించే బాధ్యతను కొత్తగా ఏర్పాటైన కమిటీకి అప్పగించారు. దేశంలో బీమా నియంత్రణ భవిష్యత్తును రూపొందించడానికి కార్యాచరణ సిఫార్సులను వివరిస్తూ మూడు నెలల్లో ఈ కమిటీ సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యుల్లో ఎల్ఐసీ మాజీ ఛైర్మన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎంఆర్ కుమార్, ఎస్బీఐ మాజీ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈవో విశాఖ ములే, కోటక్ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్ షా, జీఐసీ రే మాజీ సీఎండీ, ఎయిరిండియా, టాటా ఏఐఏ లైఫ్ స్వతంత్ర డైరెక్టర్ ఆలిస్ జి వైద్యన్లు ఉన్నారు.ఇదీ చదవండి: రూ.10కే కోకాకోలా, పెప్సికో షుగర్ ఫ్రీ డ్రింక్స్పాలసీలకు సంబంధించిన నిర్ణయాల్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు సలహాలు ఇచ్చే ఐఏసీ మూడు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎఫ్డీఐల వాటాను 100 శాతానికి పెంచుకునేలా ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దీనిపై ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కొత్త బిల్లును రూపొందించాలని భావిస్తుంది. కొత్త ముసాయిదా బిల్లులో ఐఏసీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. -
రూ.10కే కోకాకోలా, పెప్సికో షుగర్ ఫ్రీ డ్రింక్స్
సాఫ్ట్డ్రింక్స్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ల మధ్య పోటీ నెలకొంది. రిలయన్స్ కన్స్యూమర్ ఈ విభాగంలో ఇప్పటికే రూ.10కే కాంపా కోలా డ్రింక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరుణంలో రిలయన్స్కు పోటీగా వినియోగదారులను నిలుపుకునేందుకు కోకాకోలా, పెప్సికో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రూ.10కే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్ల్లో నో షుగర్ వేరియంట్ డ్రింక్స్ను ప్రవేశపెడుతున్నాయి.కోకాకోలా కోక్ జీరో, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్ ఫోర్స్ పేరుతో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. పెప్సికో తన పెప్సీ నో-షుగర్ వేరియంట్ను ప్రమోట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను రూ.10గా నిర్ణయించడం ద్వారా కోకాకోలా, పెప్సికో తన వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు రిలయన్స్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏకీకృత పెన్షన్ విధానంలో కొత్త నిబంధనలుభారత సాఫ్ట్డ్రింక్స్ మార్కెట్ విలువ 2023లో 19.7 బిలియన్ డాలర్లు కాగా, 2032 నాటికి 4.8 శాతం సీఏజీఆర్తో పెరిగి 30.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కోకాకోలా ఇండియా, పెప్సికో ఇండియా, రిలయన్స్ కన్జూమర్, పార్లే ఆగ్రో, డాబర్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్.. వంటి ప్రధాన సంస్థలు విభిన్న ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇందులో కార్బోనేటేడ్ పానీయాలు (కోలా, సోడాలు వంటివి), కార్బోనేటేడ్ కాని పానీయాలు (పండ్ల రసాలు), స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్లున్నాయి. -
14,000 లేఆఫ్స్!.. ప్రముఖ కంపెనీ ఫౌండర్ ఏమన్నారంటే?
దిగ్గజ కంపెనీలు భారీ లేఆఫ్స్ ప్రకటించిన తరువాత.. థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. సంవత్సరానికి 3.5 బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేయడానికి అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ట్వీట్ చేశారు.అమెజాన్, మెటా, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించడానికి చాలా కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తరువాత సంబరపడతారు. ''ఇలాంటి బ్రాండ్లతో క్యాంపస్ ప్లేస్మెంట్ పొందినందుకు ఎంతమంది సంబరాలు చేసుకున్నారో ఊహించుకోండి. ఇప్పుడు ఎంతమంది నిరాశకు గురవుతారో..! కేవలం 10, 20 మంది కాదు.. ఏకంగా 14,000 మంది ఈ ప్రభావానికి గురవుతున్నారు. కెరీర్ లేదా బిజినెస్ అనేది మారథాన్ రేస్'' అని థైరోకేర్ ఫౌండర్ అన్నారు.వేలుమణి ట్వీట్ మీద పలువురు స్పందించారు. 'కలామ్ సర్ చెప్పినట్లుగా కంపెనీకి విధేయంగా ఉండాల్సిన అవసరం లేదు, మీ పనికి విధేయంగా ఉండండి" అని ఒకరు అన్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు, కాబట్టి ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి అని మరొకరు అన్నారు.అమెజాన్ లేఆఫ్స్ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. దీని ద్వారా సంస్థ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.Imagine how many might have celebrated for getting a campus placement with such brands. Now how many might feel depressed!It is not 10 or 20. 100 or 2001000 or 200014000!!!!Donot celebrate too early. Career or business - It’s Marathon Race. pic.twitter.com/rrcQujB7hN— Dr. A. Velumani.PhD. (@velumania) March 19, 2025 -
భవిష్యత్తులో ఉచిత వైద్య కార్యక్రమాలు
ప్రముఖ భారతీయ కళలలను సేకరించే వ్యక్తిగా, దాతగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ శివ్నాడార్ సతీమణి కిరణ్ నాడార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆమె ఎంఎఫ్ హుస్సేన్ ఐకానిక్ పెయింటింగ్ ‘అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’ను 13.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)కు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇది ఆధునిక భారతీయ కళ కొనుగోలులో కొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సమకాలీన కళకు పెరుగుతున్న విలువను, గుర్తింపును నొక్కి చెబుతుంది. భారతదేశ కళాత్మక వారసత్వాన్ని పరిరక్షించడంపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధునిక చిత్రకారుల్లో ఎంఎఫ్ హుస్సేన్కు అరుదైన గౌరవం ఉంది. ఆయన గ్రామీణ భారతదేశం సారాన్ని ‘అన్టైటిల్డ్ (గ్రామ్ యాత్ర)’లో చిత్రీకరించారు. ఈ పెయింటింగ్లో ఉపయోగించిన రంగులు, బోల్డ్ స్ట్రోక్స్, సంక్లిష్టమైన కథా దృశ్యాలు ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయని కొందరు తెలియజేస్తున్నారు. కిరణ్ నాడార్ ఈ కళాఖండాన్ని తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (కేఎన్ఎంఏ)లో ఉంచనున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో దాదాపు 7,000 కళాకృతులను భద్రపరిచారు. భవిష్యత్తులో దీని అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉచితంగా వైద్య శిక్షణ కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని కిరణ్ తెలిపారు. కళల సంరక్షణకు కిరణ్ నాడార్ చేస్తున్న కృషిని చాలామంది అభినందిస్తున్నారు.ఇదీ చదవండి: వంటలో రారాజులు.. సంపదలో కింగ్లుబ్రిడ్జ్ ప్లేయర్గా గుర్తింపు..కిరణ్ నాడార్ దాతగానే కాకుండా బ్రిడ్జ్ ప్లేయర్గా గుర్తింపు పొందారు. ఈ విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సహా వివిధ పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలోని శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
2026లో నిధుల సమీకరణకు జోష్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రభుత్వం చేపట్టనున్న వాటా విక్రయ ప్రణాళికలు నిధుల సమీకరణకు జోష్నిచ్చే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఇటీవల మార్కెట్ దిద్దుబాటు కారణంగా డీల్ యాక్టివిటీ మందగించినట్లు తెలియజేసింది. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంశాలపై ఏర్పాటైన వెబినార్లో ప్రసంగిస్తూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సీఈవో యతిన్ సింగ్ ఈ అంశాలను పేర్కొన్నారు.వచ్చే ఏడాదికి వాటా విక్రయాల ద్వారా రూ. 47,000 కోట్ల లక్ష్యాన్ని ‘దీపమ్’ నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. దీంతో దేశీయంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు ప్రభుత్వం మెటీరియల్ క్లయింట్గా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి వచ్చే ఏడాదితోపాటు ఆపై కాలంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు ఇది భారీ అవకాశంగా నిలవనున్నట్లు అంచనా వేశారు. గత మూడేళ్లుగా పీఎస్యూ దిగ్గజాలు ఎల్ఐసీ, ఇరెడా ఐపీవోలతోపాటు.. ఓఎన్జీసీ, ఐఆర్సీటీసీ, హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్), కోల్ ఇండియా, ఆర్వీఎన్ఎల్, ఎన్హెచ్పీసీ, హడ్కో, ఇర్కాన్, కొచిన్ షిప్యార్డ్ తదితర ఓఎఫ్ఎస్ల కారణంగా డీల్ స్ట్రీట్ యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: రూ.21.57 లక్షల కోట్లకు ఐటీ సర్వీసులుభవిష్యత్లోనూ భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ), మహారాష్ట్ర నేచురల్ గ్యాస్(ఎంఎన్జీఎల్) పబ్లిక్ ఇష్యూలుసహా.. ఇరెడా, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, వీడల్, సెంట్రల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐవోబీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ క్విప్, ఓఎఫ్ఎస్ తదితరాలు భారీ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. -
రూ.21.57 లక్షల కోట్లకు ఐటీ సర్వీసులు
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కేవలం 20 మిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఆదాయం ప్రస్తుతం 250 బిలియన్ డాలర్ల(రూ.21.57 లక్షల కోట్లు) స్థాయిని అధిగమించినట్లు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ తెలిపారు. ఇందులో 200 బిలియన్ డాలర్ల ఆదాయం ఎగుమతుల నుంచే వచ్చిందని పేర్కొన్నారు. 1992–93లో ఐటీ–ఐటీఈఎస్ రెవెన్యూ కేవలం 20 మిలియన్ డాలర్లని ఇండియాసాఫ్ట్ 2025, ఇండియా ఎల్రక్టానిక్స్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వివరించారు.ఇదీ చదవండి: చమురుపై ఇక విండ్ఫాల్ ట్యాక్స్లు ఉండవుఎగుమతులను ప్రోత్సహించడంలో ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కీలకంగా వ్యవహరిస్తోందని అరవింద్ కుమార్ వివరించారు. దేశీయంగా టెక్నాలజీ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. 1,58,000 స్టార్టప్లు నమోదు చేసుకోగా, వీటిలో 78,000 అంకురాలు టెక్నాలజీ రంగానికి చెందినవేనని అరవింద్ కుమార్ వివరించారు. ఎస్టీపీఐతో పాటు వివిధ శాఖలు.. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నాయన్నారు. 50 శాతం పైగా స్టార్టప్లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉంటున్నాయని, అంకుర సంస్థల వ్యవస్థాపకు లు లేదా డైరెక్టర్లలో సగం మంది పైగా మహిళలు ఉంటున్నారని అరవింద్ వివరించారు. -
రష్యా క్రూడ్తో అమెరికాకు ఇంధనం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడాది కాలంలో 724 మిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును ఇంధనంగా మార్చి అమెరికాకు ఎగుమతి చేసింది. ‘‘2024 జనవరి నుంచి 2025 జనవరి మధ్యకాలంలో 2.8 బిలియన్ యూరోల శుద్ధి చేసిన ఇంధనాన్ని భారత్, టర్కిలోని ఆరు రిఫైనరీల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. ఇందులో 1.3 బిలియన్ యూరోల విలువ చేసే ఇంధనం రష్యా చమురుతో తయారైనది’’అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) ఒక నివేదికలో వెల్లడించింది.గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ యూనిట్ల నుంచి అమెరికా రెండు బిలియన్ యూరోల పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకోగా.. ఇందులో 724 మిలియన్ యూరోల (రూ.6,733 కోట్లు సుమారు) విలువైన ఇంధనం రష్యా ముడి చమురు ఆధారితమేనని తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడికి నిరసనగా రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం తెలిసిందే. దీంతో రష్యా నేరుగా ఎగుమతి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. గుజరాత్లోని వాదినార్లో రష్యా రోజ్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీకి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ ఉంది. ఈ సంస్థ సైతం గతేడాది కాలంలో అమెరికాకు 184 మిలియన్ యూరోల ఇంధనాన్ని ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులోనూ 124 మిలియన్ యూరోల విలువ మేర రష్యా ముడి చమురు ఆధారితమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ ఎంఆర్పీఎల్ సైతం అమెరికాకు 42 మిలియన్ యూరోల విలువైన ఇంధనాన్ని ఎగుమతి చేయగా, ఇందులో 22 మిలియన్ యూరోల మేర రష్యా ముడి చమురుతో చేసిందేనని ఈ నివేదిక తెలిపింది. -
5జీ యూజర్లు ఎందరంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) 2.65 రెట్లు పెరగనుంది. 77 కోట్లకు చేరనుంది. అలాగే, నెలవారీ డేటా వినియోగం యూజర్కు సగటున 40 జీబీ స్థాయికి చేరుతుందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా ఓ నివేదికలో అంచనా వేసింది. గత అయిదేళ్లలో 2024 నాటికి 4జీ, 5జీ డేటా వినియోగం వార్షికంగా 19.5% పెరిగి 27.5 జీబీకి చేరిందని పేర్కొంది.గతేడాది 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ లభ్యత (ఎఫ్డబ్ల్యూఏ) పెరుగుతుండటంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని నోకియా ఇండియా టెక్నాలజీ, సొల్యూషన్స్ హెడ్ సందీప్ సక్సేనా తెలిపారు. యాక్టివ్ 5జీ డివైజ్ల సంఖ్య వార్షికంగా రెట్టింపై 2024లో 27.1 కోట్లకు చేరినట్లు తెలిపారు. -
అదానీ చేతికి ఎమార్ ఇండియా!
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ(Gautam Adani) గ్రూప్ తాజాగా రియల్టీ రంగ సంస్థ ఎమార్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 13,000 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా. అయితే ఈ అంశంపై స్పందించేందుకు రెండు గ్రూప్లు నిరాకరించడం గమనార్హం! కాగా.. దుబాయ్ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ 2005లో ఎంజీఎఫ్ డెవలప్మెంట్తో భాగస్వామ్యం ద్వారా దేశీ రియల్టీ మార్కెట్లో ప్రవేశించింది. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఎమార్ ఎంజీఎఫ్ ద్వారా రూ. 8,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 2016 ఏప్రిల్లో విడదీత ప్రణాళిక ద్వారా జేవీకి ముగింపు పలికేందుకు ఎమార్ ప్రాపర్టీస్ నిర్ణయించుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, మొహాలీ, లక్నో, ఇండోర్, జైపూర్లలో రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాలలో భారీ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. జనవరిలోనే.. ఎమార్ ఇండియా(Emaar India)లో వాటా విక్రయానికి దేశీయంగా అదానీసహా వివిధ గ్రూప్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఎమార్ ప్రాపర్టీస్ ఈ ఏడాది జనవరిలోనే వెల్లడించింది. అయితే విలువ, లావాదేవీపై ఎలాంటి నిర్ణయానికీ రాలేదని స్పష్టం చేసింది. కాగా.. అన్లిస్టెడ్ సంస్థలు అదానీ రియల్టి, అదానీ ప్రాపర్టీస్ ద్వారా అదానీ గ్రూప్ దేశీ రియల్టీ మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తోంది. అదానీ రియల్టీ దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా నిలుస్తున్న ముంబైలోని ధారావి సహా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులనూ చేపడుతోంది. ఈ బాటలో ముంబైలోని మోతీలాల్ నగర్ ప్రాజెక్టులను అదానీ ప్రాపరీ్టస్ తిరిగి అభివృద్ధి చేయనుంది. -
చిన్న బ్రాండ్స్కు యువత జై
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కొనుగోళ్లలో సాధారణంగా పెద్ద బ్రాండ్స్నే ఎక్కువగా ఎంచుకునే వినియోగదారుల ధోరణి క్రమంగా మారుతోంది. కొత్త తరం కన్జూమర్లు, ముఖ్యంగా మిలీనియల్స్, జెన్ జెడ్ వర్గాలు.. పేరొందిన పెద్ద కంపెనీల కన్నా కొన్నాళ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చిన చిన్న బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం 2019–2024 మధ్య కాలంలో పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు కేవలం 8 శాతంగానే ఉండగా, వర్ధమాన ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల బ్రాండ్లు మాత్రం ఏకంగా 13% వృద్ధి రేటు నమోదు చేశాయి.5 శాతం కన్నా తక్కువ మార్కెట్ వాటా గల సంస్థలను వర్ధమాన బ్రాండ్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్గా, 1997–2012 మధ్య జన్మించిన వారిని జెనరేషన్ జెడ్గా వ్యవహరిస్తారు. చిన్న గృహోపకరణాల విభాగంలో వర్ధమాన బ్రాండ్ల మార్కెట్ వాటా గత అయిదేళ్లలో 55% నుంచి 59%కి పెరిగింది. టీవీల్లో 23% నుంచి 26%కి చేరింది. ఇక ఈ–కామర్స్లో కొత్త బ్రాండ్లు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. అటు కౌంటర్పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం గత అయిదేళ్లలో ఆరు టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్స్ వార్షిక వృద్ధి 1.2 శాతానికి నెమ్మదించగా, చిన్న బ్రాండ్లు మాత్రం 2.65% వృద్ధి చెందాయి. తీవ్రమైన పోటీ.. బ్రాండ్లు చిన్నవే అయినప్పటికే అవి అనుసరిస్తున్న వ్యూహాలే వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రధానంగా వినూత్నత, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంలాంటి అంశాలు వాటికి ప్లస్ పాయింటుగా ఉంటోంది. ఇక ఈ–కామర్స్ విషయానికొస్తే.. కొనుగోళ్లు సులభతరంగా ఉండటం కూడా కలిసి వస్తోంది. ప్రీమియం ఫీచర్లను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా వివిధ కేటగిరీల్లో వర్ధమాన బ్రాండ్లు తీవ్రమైన పోటీకి తెరతీశాయని నీల్సన్ఐక్యూ ఇండియా పేర్కొంది. టీవీలు, ఎయిర్ కండీషనర్లు, వేరబుల్స్ విభాగాల్లో దాదాపు 45–50 బ్రాండ్స్ పోటీపడుతున్నాయి.సాధారణంగా ఎల్రక్టానిక్స్ కేటగిరీలో 3–4 పెద్ద బ్రాండ్స్ మాత్రమే మార్కెట్పై ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు.. వాషింగ్ మెషీన్లు వంటి కేటగిరీల్లో ఎల్జీ, శాంసంగ్, వర్ల్పూల్, గోద్రెజ్ మొదలైనవి అగ్రస్థానంలో ఉండగా .. ఏసీల్లో వోల్టాస్, డైకిన్, ఎల్జీ లాంటి సంస్థలు టాప్ బ్రాండ్లుగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) విభాగంలోని ధోరణులే ఎల్రక్టానిక్స్లోనూ కనిపిస్తున్నాయని నీల్సన్ఐక్యూ వివరించింది.డిసెంబర్ క్వార్టర్లో దిగ్గజ సంస్థల కన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో చిన్న, మధ్య తరహా సంస్థల అమ్మకాలు 13–14% స్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్లో ప్రీమియం ఉత్పత్తుల విభాగం వేగవంతంగా వృద్ధి చెందుతోందని నీల్సన్ఐక్యూ డేటా సూచిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో ఈ–కామర్స్ మాధ్యమాన్ని తీసుకుంటే మొత్తం మార్కెట్ 6 శాతమే పెరగ్గా ఈ–కామర్స్ అమ్మకాలు ఏకంగా 19–20 శాతం వృద్ధి చెందాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్స్మార్ట్ ఫోన్స్లో జోరు..ఇక, స్మార్ట్ఫోన్స్ విభాగంలో వర్ధమాన బ్రాండ్లు మరింత జోరుగా దూసుకెళ్తున్నాయని ఐడీసీ ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ డేటా ప్రకారం 2022లో టాప్ అయిదు బ్రాండ్ల మార్కెట్ వాటా 76 శాతంగా ఉండగా 2024లో 65 శాతానికి తగ్గింది. అలాగే, 2023తో పోలిస్తే స్మార్ట్వాచ్, వేరబుల్స్ విభాగాల్లోనూ చిన్న బ్రాండ్లు గణనీయంగా వృద్ధి చెందాయి.తక్కువ రేటులో ఎక్కువ ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ నెలకొనడం ఈ బ్రాండ్లకు ఉపయోగపడుతోంది. మోటరోలా వంటి వర్ధమాన బ్రాండ్ల అమ్మకాలు 136% ఎగి యగా, ఐక్యూ 51%, పోకో సేల్స్ 19%పెరిగాయి. శాంసంగ్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2023తో పోలిస్తే 2024లో 19.4% క్షీణించాయి. రియల్మి 8.5%పడిపోగా, షావోమీ అమ్మకాలు 0.2 శాతమే పెరిగాయి. 34% వృద్ధితో బడా బ్రాండ్లలో యాపిల్ మాత్రమే ఇందుకు మినహాయింపు. -
బార్క్లేస్ బ్యాంక్ పెట్టుబడులు.. రూ. 2,300 కోట్లకు రెడీ
ముంబై: దేశీ అనుబంధ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ పీఎల్సీ ఇండియాకు బ్రిటిష్ మాతృ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ రూ. 2,300 కోట్ల మూలధనం సమకూర్చనుంది. తద్వారా బ్యాంక్ బ్యాలన్స్షీట్ పటిష్టంకావడంతోపాటు ఇన్వెస్ట్మెంట్, ప్రయివేట్ బ్యాంకింగ్లో బిజినెస్ విస్తరించేందుకు సహాయపడనుంది.దీంతో మరింతమంది క్లయింట్లకు బ్యాంక్ చేరువకానుంది. ప్రధానంగా కార్పొరేట్, ఫైనాన్షియల్ పెట్టుబడులున్న క్లయింట్లు, అత్యంత సంపన్న వర్గాలలో మరింత విస్తరించనున్నట్లు బార్క్లేస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న ఆర్ధిక వ్యవస్థపట్ల దీర్ఘకాలిక కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు తెలియజేసింది.బార్క్లేస్ ఇండియా ఆర్థిక పరిస్థితిఇండియా రేటింగ్స్ ప్రకారం.. బార్క్లేస్ ఇండియా క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్) 2024 మార్చి చివరి నాటికి 15.93 శాతంగా ఉంది. బాసెల్-3 మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు కనీసం టైర్-1 మూలధన నిష్పత్తిని 11 శాతంగా నిర్వహించాలి.2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి భారత్లో కంపెనీ ఆస్తులు రూ.53,910 కోట్లుగా ఉన్నాయి. బార్క్లేస్ ఇండియా రుణాల్లో ఎక్కువ భాగం టర్మ్ లోన్స్ (2024 ఆర్థిక సంవత్సరంలో 49.2 శాతం), బిల్ డిస్కౌంటింగ్ (35.0 శాతం), వర్కింగ్ క్యాపిటల్ రుణాలు (15.8 శాతం) ఉన్నాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. -
జొమాటోపై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోపై గతంలో దాఖలు చేసిన దివాలా పిటిషన్ను పునరుద్ధరించమంటూ జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ని తాజాగా నోనా లైఫ్స్టైల్ ప్రయివేట్ లిమిటెడ్ అభ్యర్ధించింది.జొమాటోకు ఆపరేషనల్ క్రెడిటర్ అయిన నోనా లైఫ్స్టైల్ 2024లో దివాలా చర్యలకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ఎన్సీఎల్టీ అనుమతించలేదు.ఈ నేపథ్యంలో జోమాటోపై పిటిషన్ను పునరుద్ధరించవలసిందిగా దుస్తుల సరఫరాదారు నోనా లైఫ్స్టైల్ మరోసారి ఢిల్లీ ఎన్సీఎల్టీ బెంచ్ను ఆశ్రయించింది. జొమాటోపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశించవలసిందిగా అభ్యరి్థంచింది. అయితే ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది. -
ఆకాసా ఎయిర్కు బోయింగ్ దెబ్బ
బోయింగ్ కష్టాలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. భారత విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్కు డెలివరీ ఇవ్వాల్సిన బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్లు ఆలస్యం అవుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనిలేకుండా ఖాళీగా ఉన్న వందలాది మంది పైలట్లను శాంతింపజేయడానికి బోయింగ్ ప్రయత్నిస్తోందని ఆకాసా ఎయిర్ తీవ్రంగా విమర్శిస్తోంది.ముంబైకి చెందిన ఆకాసా ఎయిర్ సుమారు మూడు సంవత్సరాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పటివరకు 27 విమానాల ఫ్లీట్ను కలిగి ఉంది. వీటి సంఖ్యను క్రమంగా పెంచుకోవాలని కంపెనీ యోచించింది. భవిష్యత్తులో వీటి సంఖ్యను 226ను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అందుకోసం బోయింగ్ 737 మ్యాక్స్లను ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో గత ఏడాది మిడ్ ఎయిర్ క్యాబిన్ ప్యానెల్లో సమస్యలు వచ్చిన నేపథ్యంలో బోయింగ్పై కొన్ని సంస్థలు కేసు నమోదు చేశాయి. తర్వాత బోయింగ్ 737 ప్రోగ్రామ్ కొన్ని సంస్థల పరిశీలనలోకి వెళ్లింది. దానికితోడు బోయింగ్ కార్మికులు సమ్మె చేయడంతో తయారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిన కంపెనీల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.ఇదీ చదవండి: వంటలో రారాజులు.. సంపదలో కింగ్లుఆకాసా వ్యూహాత్మక కొనుగోళ్ల కార్యకలాపాలు సమీక్షిస్తున్న ప్రియా మెహ్రా బోయింగ్ను ఉద్దేశించి ‘గదిలో ఏనుగు’గా అభివర్ణించారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య ఘోష్ ‘బ్లడీ బోయింగ్.. మా వేగాన్ని తగ్గిస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. కంపెనీ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ..‘మా సర్వీసులకు డిమాండ్ ఉన్నప్పటికీ తగినన్ని విమానాలు లేవు. డెలివరీలు త్వరగా చేయాలని బోయింగ్తో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. నాణ్యతను పెంచడానికి, వనరులను క్రమబద్ధీకరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు. -
వంటలో రారాజులు.. సంపదలో కింగ్లు
భారతదేశం ప్రత్యేక వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక వంటల రుచులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు చాలామంది కృషి చేస్తున్నారు. ఈక్రమంలో తాము తయారు చేస్తున్న వంటకాలకు కొత్త రుచులను జోడిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి భారతీయ సెలబ్రిటీ చెఫ్లు ప్రముఖ వ్యాపారులకు ధీటుగా రెస్టారెంట్లు, పుస్తకాలు రాస్తూ, టీవీ షోలు, వివిధ వ్యాపార వెంచర్లను ఏర్పాటు చేస్తూ ఆర్థికంగా దూసుకుపోతున్నారు. దేశంలోని టాప్ 10 సంపన్న సెలబ్రిటీ చెఫ్ల జాబితా, వారి సంపద నికర విలువ(సుమారుగా) కింద తెలియజేశాం.సంజీవ్ కపూర్-రూ.1165 కోట్లు: సంజీవ్ కపూర్ రూ.1165 కోట్ల నికర విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక చెఫ్గా నిలిచారు. ఆయనకు అనేక రెస్టారెంట్లు, ఫుడ్ఫుడ్ అనే ప్రముఖ ఫుడ్ ఛానల్ ఉన్నాయి. ఆయన వార్షికాదాయం సుమారు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా.వికాస్ ఖన్నా-రూ.80 కోట్లు నుంచి రూ.120 కోట్లు: వికాస్ ఖన్నా పలు టెలివిజన్ షోల్లో కనిపిస్తుంటారు. ఆయన ప్రస్తుతం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ సీజన్ 1లో పాల్గొంటున్నారు. వంటలపై పుస్తకాలు కూడా రాశారు. న్యూయార్క్ నగరంలోని ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు.రణ్ వీర్ బ్రార్-రూ.41 కోట్లు: టాలెంటెడ్ సెలబ్రిటీ చెఫ్ రణ్ వీర్ బ్రార్ కూడా రెస్టారెంట్ యజమానిగా, ప్రసిద్ధ టెలివిజన్ పర్సనాలిటీగా నిలిచారు. పలు ఫుడ్ షోల్లో నటించిన ఆయన ప్రస్తుతం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్లో నిర్ణేతగా ఉన్నారు.కునాల్ కపూర్-రూ.8.715 కోట్లు నుంచి రూ.43.575 కోట్లు: కునాల్ కపూర్ విస్తృతంగా చెఫ్, టెలివిజన్ షోల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రధానంగా తాను చేసే బ్రాండ్ ఎండార్స్మెంట్లు, యూట్యూబ్ నుంచి డబ్బు సమకూరుతుంది.గరిమా అరోరా-రూ.40 కోట్లు: గరిమా అరోరా భారతీయ మాస్టర్ చెఫ్, చెఫ్ టీవీ షోలకు నిర్ణేతగా వ్యవహరిస్తుంటారు. ఈమె పలు రెస్టారెంట్లను స్థాపించారు.హర్పాల్ సింగ్ సోఖీ-రూ.35 కోట్లు: ఈయన ఇటీవల లాఫ్టర్ చెఫ్ ఇండియా షోలో కనిపించి ఇంటర్నెట్లో సంచలనం సృష్టించారు. బెంగళూరులోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ కరిగారి, కుకరీ షోల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు.అతుల్ కొచ్చర్-రూ.34.86 కోట్లు: అతుల్ కొచ్చర్ చెఫ్తో పాటు రచయితగా ప్రసిద్ధి. అతను బెస్ట్ సెల్లింగ్ కుకింక్ బుక్స్ రాశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. తన లండన్ రెస్టారెంట్ కోసం మిచెలిన్ స్టార్ రేటింగ్ పొందారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీపికబురు!వినీత్ భాటియా-రూ.18 కోట్లు నుంచి రూ.25 కోట్లు: ఈయనకు ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లోని ది ఫైనల్ టేబుల్షోలో నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.పంకజ్ భదౌరియా రూ.7 కోట్లు నుంచి రూ.35 కోట్లు: పంకజ్ భదౌరియా తొలి మాస్టర్ చెఫ్ ఇండియా విజేతగా నిలిచారు. ఆమె వంట పుస్తకాలను రచించారు. వంట ప్రదర్శనలను ఇస్తుంటారు.అజయ్ చోప్రా-రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లు: అజయ్ చోప్రా సృజనాత్మక వంటకాలకు ప్రసిద్ధి. -
రూ.25 వేల కోట్ల రాజభవనంలో మహారాణి.. అయినా..!
రాధికరాజే గైక్వాడ్.. ఈ పేరు భారతీయులకు సుపరిచయమే. ఎందుకంటే.. రాజ వంశంలో పుట్టినప్పటికీ, సాధారణ ప్రజలలో కలిసిపోయే గుణం ఉన్న ఈమె ఎంతోమందికి ఆదర్శప్రాయం. తండ్రి మార్గాన్ని అనుసరించి, చదువుకునే రోజుల్లోనే ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది.ఎవరీ రాధికరాజే గైక్వాడ్?గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన∙రాధికా రాజే.. కొన్నాళ్లు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్కు దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యను అభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సునే స్కూలుకు వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసి మెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్కు వెళ్లేవారు.డిగ్రీ పూర్తయ్యాక.. ఇరవై ఏళ్ళ వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒకవైపు పత్రికలో పనిచేస్తూనే.. మరోవైపు పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్ళకే పెళ్లిచేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. రాధికరాజే చదువు పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు.. ఆమెకు బరోడా యువరాజు 'సమర్జిత్ సిన్హ్ గైక్వాడ్'తో వివాహం చేశారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువుని కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమేగాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తరవాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది.లక్ష్మీ విలాస్ ప్యాలెస్సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ లక్ష్మీ విలాస్ ప్యాలెస్.. బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉందని నివేదిలకు చెబుతున్నాయి. దీని నిర్మాణకి ఏకంగా 12 సంవత్సరాల సమయం పట్టినట్లు సమాచారం. 1890లో మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ నిర్మాణానికి అయిన ఖర్చు అప్పట్లో రూ. 27,00,000 అని చెబుతున్నారు. ఈ మహల్ విలువ ఇప్పుడు రూ. 25,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.హోసింగ్.కామ్ ప్రకారం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ విస్తీర్ణం 3,04,92,000 చదరపు అడుగులు, బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులు అని తెలుస్తోంది. ఇక ముఖేష్ అంబానీ యాంటిలియా విస్తీర్ణం 48,780 చదరపు అడుగులు కావడం విశేషం.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పటికి కూడా అతి పెద్ద ప్రైవేట్ ప్యాలెస్గా కీర్తి పొందింది. దీని నిర్మాణ సమయంలో ఎలివేటర్లు వంటి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కట్టుదిట్టం చేశారు. అత్యంత అందమైన ఈ భవనం మేజర్ చార్లెస్ మాంట్ అనే వాస్తు శిల్పి సారథ్యంలో పురుడు పోసుకుంది. దీని లోపల భాగం ఒక పెద్ద యూరోపియన్ కంట్రీ హౌస్ను గుర్తు చేస్తుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీపికబురు!
టెక్ నిపుణులకు ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్(Infosys) తీపికబురు చెప్పింది. 40కి పైగా స్కిల్ సెట్లలో పని చేసేందుకు టెక్ వర్కర్ల కోసం చూస్తున్నట్లు పేర్కొంది. లేటరల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా, పైథాన్, డాట్నెట్, ఆండ్రాయిడ్/ఐఓఎస్ డెవలప్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ వంటి వివిధ రంగాల్లో నైపుణ్యాలున్న నిపుణుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పిస్తుంది.గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కంపెనీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోని డెవలప్మెంట్ సెంటర్లలో వాక్ఇన్ రిక్రూట్మెంట్ల ద్వారా నిపుణులను భర్తీ చేసింది. గత తొమ్మిది నెలలుగా ఇన్ఫోసిస్ భారీగా నియామకాలు చేపట్టలేదు. దాంతో కొన్ని విభాగాల్లో ఖాళీలు మిగిపోయాయి. తాజా నియామక ప్రక్రియ ఈ సమస్యను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది. నియామకాలకు సంబంధించి కంపెనీ అంతర్గతంగా ఉద్యోగులకు వివరాలు వెల్లడించింది.వచ్చే ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్కు..కంపెనీ ఏటా నిర్వహించే లేటరల్ హైరింగ్ ప్రోగ్రామ్లో భాగంగానే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్రెషర్స్, లేటరల్ నియామకాల మధ్య వ్యత్యాసాలు తలెత్తకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ఇదివరకే ప్రకటించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సాఫ్ట్వేర్ సంస్థలో మొత్తంగా 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: నటి మెడికల్ వేవర్ అభ్యర్థన తిరస్కరణచిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఉద్యోగుల అవసరంఅట్రిషన్ల(కంపెనీ మారడం వల్ల ఏర్పడే ఖాళీలు) వల్ల ఏర్పడిన పోస్టులతో పాటు కొనసాగుతున్న కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగులను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. సంస్థ కొన్ని చిన్న ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోందని, వీటికి మానవ వనరులు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
నటి మెడికల్ వేవర్ అభ్యర్థన తిరస్కరణ
మెడికల్ వేవర్ అభ్యర్థనను తిరస్కరించిన తర్వాత ఎయిరిండియా కనీస సానుభూతి చూపడం లేదని నటి లీసా రే సోషల్ మీడియాలో ఆరోపించారు. డాక్టర్ లేఖను సమర్పించినప్పటికీ, సరైన వివరణ ఇవ్వకుండా మెడికల్ వేవర్ను తిరస్కరించారని పేర్కొంటూ ఆమె తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి(92) అత్యవసర పరిస్థితుల్లో విమాన ప్రయాణాన్ని రద్దు చేశాక ఈ పరిణామం చోటు చేసుకుందని లీసా తెలిపారు.‘మా నాన్నకు 92 ఏళ్లు. తన అనారోగ్యం కారణంగా అత్యవసరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తండ్రి అనారోగ్యానికి సంబంధించి డాక్టర్ల రిపోర్ట్ను కూడా సమర్పించాను. అయినా మెడికల్ వేవర్ను నిరాకరిస్తారా? అది ఎలా సాధ్యం? ప్రయాణికుల గురించి పట్టించుకుంటామని చెప్పుకునే విమానయాన సంస్థ నుంచి కనీస సానుభూతి ఎక్కడుంది?’ అని రే ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సానుభూతి వ్యక్తం చేస్తూ మెడికల్ వేవర్కు సంబంధించిన మరిన్ని వివరాలను డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేయాలని కోరింది.Here we go again @airindia My father is 92, unwell and I have to cancel travel due to his ailing condition. Submitted doctors letter and the waiver was denied? How is that possible? Where is the empathy from an airline that is claiming to care about passengers???— Lisa Ray (@Lisaraniray) March 19, 2025‘డియర్ మిసెస్ రే, మీ పరిస్థితికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం. మీ తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాకు రాసిన ఈమెయిల్ చిరునామా లేదా డీఎం ద్వారా కేస్ ఐడీ (ఏవైనా ఉంటే)ను షేర్ చేయండి. మేము దాన్ని పరిశీలిస్తాం’ అని ఎయిరిండియా బదులిచ్చింది. బుకింగ్ ట్రావెల్ ఏజెన్సీతో ఆమె జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్ను కూడా రే పోస్ట్ చేశారు. ఆమె తండ్రి ఆసుపత్రిలో చేరినప్పటికీ, ఆమె విషయంలో వైద్య మాఫీకి అవకాశం లేదని ఏజెన్సీ నుంచి స్పందన వచ్చినట్లు తెలిపారు.ఆమె పోస్ట్పై ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమె దుస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. మరికొందరు నాన్ ఫ్లెక్సిబుల్ టికెట్లకు వైద్య మినహాయింపులు వర్తించవని సూచించారు. ‘మీ టికెట్పై ఫ్లెక్సిబుల్ ఆప్షన్ లేకపోతే ఏ విమానయాన సంస్థ కూడా మీకు ఏ కారణం చేతా మినహాయింపు ఇవ్వదు’ అని ఒక యూజర్ తెలిపారు. భవిష్యత్తు పరిస్థితుల కోసం సౌకర్యవంతమైన టికెట్లు లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలని ఇంకొందరు సూచించారు.ఇదీ చదవండి: ‘ఇండస్ఇండ్లో వాటా పెంపునకు అనుకూల సమయం’మెడికల్ వేవర్ప్రయాణీకులు తరచుగా వైద్యుడి నుంచి ‘ఫిట్-టు-ఫ్లై’ సర్టిఫికేట్ను అందించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ప్రయాణికుడు విమాన ప్రయాణానికి వైద్యపరంగా స్థిరంగా ఉన్నాడని, సాధారణంగా విమానానికి ముందు ఒక నిర్దిష్ట కాలవ్యవధి (ఉదా. 72 గంటలు) అవసరమని ధ్రువీకరించాలి.ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్న ప్రయాణికులు ముందుగానే మెడికల్ ఇన్ఫర్మేషన్ ఫారం (ఎంఈడీఐఎఫ్) నింపాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ లేదా మొబిలిటీ ఎయిడ్స్ వంటి ప్యాసింజర్ అవసరాలను అంచనా వేయడానికి ఈ ఫారం విమానయాన సంస్థకు సహాయపడుతుంది.మాఫీకు షరతులు: తీవ్రమైన లేదా అత్యవసర వైద్య పరిస్థితుల నేపథ్యంలో ఫీజుల రద్దు లేదా రీషెడ్యూల్ కోసం వైద్య మినహాయింపులు మంజూరు చేస్తారు. అయితే కొన్ని విమానయాన సంస్థలు నాన్-ఫ్లెక్సిబుల్ టికెట్లకు మినహాయింపులు ఇవ్వకపోవచ్చు. విమానయాన వైద్య మినహాయింపు పరిస్థితులు విమానయాన సంస్థను బట్టి మారవచ్చు. -
భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది
సాధారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది జాయిన్ అయిపోతారు. కొందరు అమ్మానాన్నలను అడగాలని, పెళ్ళైన మహిళలైతే తమ భర్తలకు చెప్పాలని అనుకుంటారు. ఇటీవల ఓ మహిళ ఉద్యోగానికి ఎంపికైన తరువాత.. తన భర్త ఆమోదం కావాలని అడిగిన వెంటనే జాబ్ పోగొట్టుకుంది.ముంబైకి చెందిన ఒక సీఈఓ తన కంపెనీలో సీనియర్ పదవికి ఎంపికైన ఒక మహిళను ఉద్యోగంలో చేరడానికి ముంచే తొలగించారు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఆఫర్ను అంగీకరించే ముందు తన భర్త ఆమోదం పొందాలని అడిగింది. దీంతో తక్షణమే ఆమెను ఆ ఉద్యోగానికి రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.Spoke to a candidate tdy, who wanted us to meet her husband after we had selected her.Instant reject.P.s: This was for a senior level hire.— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికైన మహిళ.. ఉద్యోగంలో చేరడానికే సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికే తన భర్త ఆమోదం కావాలని చెబుతోంది. రేపు కంపెనీ కోసం పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది. ఆమె పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉందని.. కంపెనీ సీఈఓ భావించి రిజెక్ట్ చేశారు.ఇదీ చదవండి: 'పెట్రోల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్లు'.. నితిన్ గడ్కరీప్రస్తుతం కంపెనీ సీఈఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు సీఈఓ చేసిన పనిని సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మహిళలు తరచుగా ఎదుర్కొనే సామాజిక అడ్డంకులను ఎత్తి చూపారు.Bcas she wants her husband to say yes for her to join us. Why would an independent woman want that. Basically she wants her husband to interview us to see if its ok for her to join. Shows she is totally dependent on him. How will she ever take any decisions, if she cannot take a…— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025 -
‘ఇండస్ఇండ్లో వాటా పెంపునకు అనుకూల సమయం’
ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ధర ఇటీవల భారీగా పతనం కావడంతో ప్రమోటర్లు వాటాలు పెంచుకునేందుకు ఇది అనుకూల తరుణమని ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ఛైర్మన్ అశోక్ హిందుజా అన్నారు. హిందుజా గ్రూప్ పెట్టుబడుల సంస్థ ‘ఐఐహెచ్ఎల్’ ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్లో 16 శాతం వాటాతో ప్రమోటింగ్ సంస్థగా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలపడం గమనార్హం.బ్యాంక్ ఖాతాల్లో రూ.2,100 కోట్ల విలువ మేర వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇటీవలే వెలుగు చూడడం, అనంతరం సంస్థ నికర విలువ (నెట్వర్త్) తగ్గిపోవడం తెలిసిందే. అయినప్పటికీ ప్రమోటర్ల నుంచి బ్యాంక్ నిధుల సాయం కోరలేదని అశోక్ హిందుజా తెలిపారు. అవసరమైతే బ్యాంక్కు నిధులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ 15 శాతానికి పైన సౌకర్యంగానే ఉందన్నారు. ఈ ధరలో తాను మాత్రమే కాదని, ఏ వాటాదారుడు అయినా వాటా పెంచుకోవాలనే అనుకుంటారని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తాజా ఆటోమొబైల్ అప్డేట్స్బ్యాంక్ ఖాతాల్లో వ్యత్యాసంపై వాస్తవాలను తేల్చేందుకు ఆడిటింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, మార్చి నెలాఖరుకు అది రానున్నది. పీడబ్ల్యూసీ ఆడిటింగ్ నివేదికతో ఖాతాల్లో వ్యత్యాసానికి ఎవరు బాధ్యులన్నది తేలుతుందని అశోక్ హిందుజా అన్నారు. సీఎఫ్వో పదవి నుంచి గోదింద్జైన్ తప్పుకోవడం వెనుక కారణాలపై మీడియా ప్రశ్నించగా, వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
ఎన్విడియాతో ఐటీ దిగ్గజాల జత
గ్లోబల్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియాతో దేశీ ఐటీ దిగ్గజాలు విప్రో, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ చేతులు కలిపాయి. వివిధ పరిశ్రమలకు ఏఐ ఆధారిత విభిన్న సొల్యూషన్లు అందించే బాటలో ఎన్విడియాతో విడిగా భాగస్వామ్యాలకు తెరతీస్తున్నాయి. చిప్ తయారీ దిగ్గజం ప్రస్తుతం కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న జీపీయూ టెక్నాలజీ వార్షిక సదస్సు(జీటీసీ)లో భాగంగా దేశీ ఐటీ కంపెనీలు ఎన్విడియా టెక్నాలజీల ఆధారంగా అందిస్తున్న సేవలను ప్రదర్శిస్తున్నాయి.ఈ సందర్భంగా ఎన్విడియా ఏఐ సాఫ్ట్వేర్ ఆధారిత అటానమస్ ఫార్మాకోవిజిలెన్స్(పీవీ) సొల్యూషన్లు టెక్ మహీంద్రా విడుదల చేసింది. వీటిని ఔషధ భద్రత నిర్వహణలో వినియోగిస్తారు. తద్వారా వేగవంత, కచ్చితమైన పీవీ ప్రాసెస్కు వీలుంటుంది. ఎన్విడియా ఏఐ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సహాయంతో విప్రో కొత్తతరహా ఏజెంటిక్ ఏఐ సర్వీసులను ప్రవేశపెట్టింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రత్యేక ఇన్ఫ్రా, డేటా, వర్క్ఫోర్స్, బిజినెస్ నెట్వర్క్స్ను పటిష్టపరచుకోవడంతోపాటు ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి, అమలు చేసేందుకు వీలుంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్కేర్, ఎడ్యుకేషన్ తదితర రంగాలలో పౌర సేవలను భారీగా మెరుగుపరచేందుకు విప్రో ఎకోసిస్టమ్ వినియోగపడనుంది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంఎన్విడియా జెట్సన్ ప్లాట్ఫామ్ను వినియోగించుకోవడం ద్వారా ఏఐ ఆధారిత రైల్వే ట్రాక్ తనిఖీ సొల్యూషన్ ట్రాక్ఈఐను ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ విడుదల చేసింది. తద్వారా రియల్ టైమ్ లోపాల గుర్తింపు, నిర్వహణలో మద్దతు తదితర ప్రపంచవ్యాప్త రైల్వే నెట్వర్క్ల భద్రతను పెంచేందుకు సహాయపడనుంది. ఎన్విడియా జీటీసీ 2025ను ఈ నెల 17–21 మధ్య కాలిఫోర్నియాలోని శాన్జోస్లో నిర్వహిస్తోంది. ఏఐలో తాజా ఆధునికతలను ప్రదర్శించేందుకు సదస్సు ఉపపయోగపడుతోంది. -
‘ఇండస్ఇండ్’ ఆధీనంలోకి అంబానీ కంపెనీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు.అంతకుముందు రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) చైర్మన్ అశోక్ హిందుజా వెల్లడించారు. బిడ్ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.ఆర్క్యాప్ వ్యాపారాన్ని సమీక్షించి, అవసరమైతే నిధులను సమకూర్చడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. చిన్నా చితకా అనుబంధ సంస్థలు 39–40 వరకు ఉన్నాయని, వాటిల్లో చాలా మటుకు సంస్థలను కొత్త మేనేజ్మెంట్ విక్రయించవచ్చని హిందుజా చెప్పారు. బ్రోకింగ్, అసెట్ రీకన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటుందని వివరించారు.నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాల ప్రకారం మూడేళ్ల పాటు అదే పేరుతో వ్యాపారాలను కొనసాగించవచ్చని, కానీ తమ సొంత ఇండస్ఇండ్ బ్రాండ్తో అనుసంధానించడంపై కసరత్తు చేస్తున్నామని హిందుజా చెప్పారు. అనుసంధానానికి 6–9 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ కావడం, గవర్నెన్స్లో లోపాలు తదితర అంశాల కారణంగా రిలయన్స్ క్యాపిటల్ను 2021లో రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) కింద 2023 ఏప్రిల్లో రూ. 9,650 కోట్లు ఆఫర్ చేసి ఐఐహెచ్ఎల్ విజయవంతమైన బిడ్డరుగా నిల్చింది. -
మరిన్ని శాఖల్లో బంగారం రుణాలు
ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ బంగారం రుణాల్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. మరిన్ని శాఖల్లో బంగారం రుణాలను ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ అన్బుసెల్వన్ తెలిపారు.‘2024–25 మూడో త్రైమాసికంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (ఏయూఎం) గణనీయంగా పెరిగాయి. మరింత స్థిరీకరణతో రానున్న త్రైమాసికాల్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా మరిన్ని శాఖలకు బంగారం రుణాల వ్యాపారాన్ని విస్తరించనున్నాం’అని అన్బుసెల్వన్ వివరించారు. బంగారం రుణాలకు డిమాండ్ పెరిగిందని.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు వేగంగా నిధులు కోరుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారంసంఘటిత రంగంలో బంగారం రుణ వ్యాపారం మరింత విస్తరించనున్నట్టు అన్బుసెల్వన్ తెలిపారు. తమ బంగారం రుణ కస్టమర్లలో ఎక్కువ మంది మధ్యతరగతి వారేనని, వేతన జీవులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వర్తకులు ఇందులో ఉన్నట్టు చెప్పారు. ఏక మొత్తంలో రుణ చెల్లింపులు, మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించడం, నెలవారీ ఈఎంఐ ఇలా పలు రూపాల్లో బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా రుణాలు జారీ చేసేందుకు వీలుగా ప్రక్రియలను ఆటోమేట్ చేసినట్టు పేర్కొన్నారు. -
విమాన ప్రయాణాలు మరింత భారం
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ముంబై విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజును (యూడీఎఫ్) భారీగా పెంచేలా ఎయిర్పోర్ట్ ఆపరేటరు ఎంఐఏఎల్ ప్రతిపాదనలు చేయడమే ఇందుకు కారణం. వీటి ప్రకారం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు యూడీఎఫ్ రూ.187 నుంచి ఏకంగా రూ.650కి పెరగనుంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్లకు యూడీఎఫ్ లేకపోయినప్పటికీ ఇకపై వారిపై కూడా రూ.325 మేర యూడీఎఫ్ వడ్డించనున్నారు.ప్రతిపాదిత టారిఫ్ కార్డును ఎయిర్పోర్ట్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతుల కోసం సంస్థ సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించాయి. వీటిపై తుది నిర్ణయానికి ముందు ఎయిర్పోర్ట్ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఏఈఆర్ఏ మార్చి 25న సమావేశం కానుంది. మరోవైపు, ఎయిర్లైన్స్కి భారీగా ఊరటనిచ్చే దిశగా ఏఈఆర్ఏ వెబ్సైట్ ప్రకారం 2024–2029 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికి ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను 35 శాతం తగ్గించేలా ఎంఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో రెండో స్థానంలో ఉండే ముంబై విమానాశ్రయాన్ని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్) నిర్వహిస్తోంది. ఇందులో అదానీ గ్రూప్నకు 74 శాతం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో ఏటా 5.5 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు టెర్మినల్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: బెంజ్, కియా కార్ల ధరలు పెంపువిమానాశ్రయ మౌలిక సదుపాయాలను, సాంకేతికతను మెరుగుపర్చుకునేందుకు ప్రతిపాదిత ఫీజులు ఉపయోగపడతాయని ఎంఐఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడిపై రాబడి రూ.285గా ఉండగా సుమారు రూ.332కి (18 శాతం) పెరగనుంది. వచ్చే అయిదేళ్లలో విమానాశ్రయంపై ఎంఐఏఎల్ రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..
కోల్కతా: సామాజిక బాధ్యత, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దేశీ కంపెనీలు దివ్యాంగులకు (పీడబ్ల్యూడీ) ఉద్యోగావకాశాలు కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దీంతో ఉక్కు, మైనింగ్ రంగాల నుంచి బీమా రంగం వరకు వివిధ సెగ్మెంట్లలో ఈ విషయంలో సానుకూల ధోరణులు నెలకొన్నాయని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఈ తరహా ఉద్యోగాలకు చెందిన పోస్టింగ్స్ 30–40 శాతం పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం ఒక్క శాతం స్థాయిలోనైనా పీడబ్ల్యూడీలను నియమించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించినట్లు ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ రావు తెలిపారు. పాలసీని ఏదో నామమాత్రంగా కాకుండా అర్థవంతంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. గత ఏడాది కాలంగా కంపెనీ పీడబ్ల్యూడీ సిబ్బంది సంఖ్య 16 ప్రాంతీయ శాఖల్లో 16 నుంచి 41కి పెరిగింది.ఇందులో 22 శాతం మంది మహిళలు ఉన్నట్లు రావు చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 కంపెనీల్లో కేవలం ఏడు సంస్థల్లో మాత్రమే ఒక్క శాతం మేర పీడబ్ల్యూడీ ఉద్యోగులున్నారని గణాంకాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు కంపెనీలలోనూ నాలుగు సంస్థలు ప్రభుత్వ రంగానికే చెందినవై ఉండటాన్ని చూస్తే సమ్మిళితత్వ లక్ష్య సాధనలో కార్పొరేట్లు మరింతగా పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని రావు చెప్పారు. మరోవైపు, తమ సంస్థలో 50 మంది పైగా పీడబ్ల్యూడీ సిబ్బంది ఫ్రంట్ ఎండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వేదాంత చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మధు శ్రీవాస్తవ చెప్పారు. పలువురు దివ్యాంగ ఇంటర్న్లకు కూడా అవకాశాలు క ల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే, దివ్యాంగులకు అనువైన పరిస్థితులను కూడా క ల్పిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో భాగంగా వారి కోసం ర్యాంప్లు, ప్రత్యేకంగా దారులు, బ్రెయిలీ ఆధారిత ఎలివేటర్లు, టెక్ట్స్–టు–స్పీచ్ సాఫ్ట్వేర్ మొదలైనవి అందుబాటులో ఉంచుతున్నామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.ప్రధానంగా మైనింగ్, స్పెల్లింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించే తమ సంస్థలో పీడబ్ల్యూడీలను టెక్నికల్ విధుల్లోకి తీసుకోవడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారికి కూడా వీలైన విభాగాల్లో చోటు క ల్పించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఇక, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్లో 100 మంది పైగా దివ్యాంగ ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత 2–3 సంవత్సరాలుగా వీరి సంఖ్య క్రమంగా పెరిగిందని వివరించారు.మరింత సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించే దిశగా తమ హైరింగ్ విధానాల్లో గణనీయంగా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలకు పెద్ద పీట వేస్తూ వ్యాపారాలను పటిష్టం చేసుకునేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు దోహదపడగలవని ప్రతినిధి వివరించారు.జూనియర్, మధ్య స్థాయికే పరిమితం..దివ్యాంగుల నియామకాలు పెరుగుతున్నప్పటికీ వారి హైరింగ్ ప్రధానంగా జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లోనే ఉంటోందని మానవ వనరుల సర్వీసుల సంస్థ ర్యాండ్స్టాడ్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. సీనియర్, మేనేజ్మెంట్ బాధ్యతల్లో వారికి ప్రాతినిధ్యం తక్కువగానే లభిస్తోందని వివరించింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో పీడబ్ల్యూడీల వాటా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా కంపెనీల ప్రాధాన్యతలు మారే కొద్దీ భవిష్యత్తులో దివ్యాంగులకు అవకాశాలు మరింతగా లభించగలవని సంస్థ ఎండీ పి.ఎస్. విశ్వనాథ్ తెలిపారు. డీఈఐ విధానాల అమలు పెరుగుతుండటంతో ప్రతిభావంతులైన పీడబ్ల్యూడీలను నియమించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు.డీఈఐ విధానాల దన్ను ..పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) అంశాల ఆధారిత హైరింగ్ పెరుగుతుండటం, పీడబ్ల్యూడీ ఉద్యోగాలు క ల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పన్నుపరమైన ప్రయోజనాల్లాంటి ప్రోత్సాహకాలు లభిస్తుండటం తదితర పరిణామాలతో 2030 నాటికి ఉద్యోగుల్లో దివ్యాంగుల వాటా మరింతగా పెరగనుందని మానవ వనరుల సంస్థ ఫస్ట్ మెరీడియన్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో మన్మీత్ సింగ్ తెలిపారు. బడా కార్పొరేషన్లు మొదలుకుని స్టార్టప్ల వరకు అన్ని సంస్థలూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు.ఐటీ, రిటైల్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల్లో రిమోట్, హైబ్రీడ్ వర్క్ విధానాలకు ఆస్కారం ఉండటంతో ఆయా సెగ్మెంట్లలో పీడబ్ల్యూడీలకు మరిన్ని అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. దేశీయంగా 7 కోట్ల మంది పైగా దివ్యాంగులు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నప్పటికీ వారి ఉద్యోగిత రేటు కేవలం 0.4 శాతంగానే ఉంటోందని సింగ్ చెప్పారు.నియంత్రణ సంస్థల నిబంధనలతో పాటు వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (డీఈఐ) విధానాలను కార్పొరేట్లు అమలు చేస్తుండటంతో పీడబ్ల్యూడీల నియామకాలు పెరుగుతాయని వివరించారు. కంపెనీలు పాటించే సంస్కృతే .. భాగస్వాములు, కస్టమర్లు, ఉద్యోగులు, మొత్తం వ్యాపార వర్గాల్లో వాటికి గుర్తింపుగా ఉంటోందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆరోగ్య బీమాలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. చర్చలు తుది దశకు చేరడంతో మార్చి 31కల్లా వివరాలు వెల్లడికానున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ ప్రవేశించడం సాధారణ అంశమేనని ఇక్కడ జరిగిన జీసీఏ25 వేడుక సందర్భంగా పేర్కొన్నారు. అయితే లక్షిత కంపెనీలో నియంత్రిత లేదా 51 శాతం లేదా అంతకుమించిన వాటా కొనుగోలు చేయబోమన్నారు.ఎంత వాటా సొంతం చేసుకునేదీ టార్గెట్ కంపెనీ విలువ, ఎల్ఐసీ బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు అనుమతించని కారణంగా ఎల్ఐసీ వాటా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్ను జారీ చేయాలన్న ప్రతిపాదనలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాని సంగతి తెలిసిందే. మణిపాల్సిగ్నా కొనుగోలు?హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్సిగ్నాలో వాటా కొనుగోలుకి ఎల్ఐసీ చర్చలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 4,000 కోట్ల విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ స్టాండెలోన్ ఆరోగ్య బీమా కంపెనీలో ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చలు చేపట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకు బోర్డు నిర్ణయాలుసహా వివిధ అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. 100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు కావాలి..దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల(జీసెక్లు) జారీకి అనుమతించమంటూ జీవిత బీమా పీఎస్యూ ఎల్ఐసీ ఆర్బీఐని కోరింది. 100 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల జారీకి విజ్ఞప్తి చేసింది. తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి అవకాశాలకు వీలుంటుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. 20–30 ఏళ్ల బాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్బీఐ 40 ఏళ్ల కాలపరిమితికీ అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 50 ఏళ్లు, 100 ఏళ్ల బాండ్లనూ అంచనా వేస్తున్నట్లు చెప్పారు.ఈ అంశంపై ఆర్బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లలో పలు దేశాలు 100 ఏళ్ల గడువుతో బాండ్ల జారీని చేపడుతున్నట్లు ప్రస్తావించారు. సెకండరీ మార్కెట్లో పరిమిత డిమాండ్, తక్కువ లిక్విడిటీ కారణంగా భారత్సైతం ఈ తరహా బాండ్లకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జీసెక్లలో ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
గ్రేట్ లెర్నింగ్ కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్: ప్రతి ముగ్గురిలో..
ఉన్నత విద్య, వృత్తిపరమైన శిక్షణ అందించడంలో ప్రపంచ అగ్రగామి అయిన 'గ్రేట్ లెర్నింగ్' (Great Learning) తన కెరీర్ ప్రోగ్రెషన్ నివేదిక 2024-25ను విడుదల చేసింది. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ల నుంచి ఎంపిక చేసిన 1000 మంది పూర్వ విద్యార్థుల సమగ్ర సర్వే నుంచి ఈ నివేదికను సిద్ధం చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సీనియర్ నాయకులు ఇందులో ఉంటారు.నిరంతరం కృషి చేయడం ద్వారా.. కెరీర్ ఎలా పురోగతి చెందిందో.. నిపుణులు నాయకత్వ పాత్రలు, జీతం పెరుగుదల, ఉద్యోగావకాలను సాధించడం ఎలా అనే విషయాలు కూడా గ్రేట్ లెర్నింగ్ ఇందులో వెల్లడించింది. ప్రొఫెషనల్స్ కెరీర్ విషయంలో అప్స్కిల్లింగ్ పరివర్తనాత్మక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు విజయవంతంగా సక్సెస్ వైపు వెళ్తున్నారు.అప్స్కిల్లింగ్ ప్రభావంతో.. 80 శాతం మంది ప్రమోషన్లు, జీతం పెరుగుదల విషయంలో ప్రగతి సాధించారు. 74 శాతం మంది పదోన్నతి పొందారు. 69 శాతం మంది ఉన్న సంస్థలలోని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. లీడర్షిప్ పాత్రలలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో నైపుణ్యాలను సంపాదించడం వల్ల నిపుణులు నిర్వాహక, వ్యూహాత్మక నాయకత్వ పాత్రలలోకి ఎలా మారడానికి వీలు కల్పిస్తుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్స్ అప్స్కిల్లింగ్ తర్వాత జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంది. అయితే సుమారు 87 శాతం మంది తక్షణ జీతాల పెంపు కంటే.. కెరీర్ వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. -
దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్!.. వేలాదిమందిపై ప్రభావం?
2025లోనూ లేఆప్స్ ప్రభావం తగ్గడం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కంపెనీ 13 శాతం శ్రామిక శక్తిని తగ్గించనుంది. దీని ద్వారా సంస్థ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.2025 మొదటి త్రైమాసికంలో.. మేనేజర్లకు వ్యక్తిగత సహకారాన్ని 15 శాతం పెంచనున్నట్లు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండీ జాస్సీ పేర్కొన్నారు. కంపెనీ లేఆప్స్ అనేవి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని సీఈఓ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్అమెజాన్ ఉద్యోగుల తొలగింపును నిందిస్తూ.. కంప్లీట్ సర్కిల్ మేనేజింగ్ పార్టనర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) గుర్మీత్ చద్దా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నవంబర్లో 18 వేల మందిని తొలగించిన తర్వాత అమెజాన్ మరో 10000 మందిని తొలగించనుంది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని.. ప్రజలకు కష్టాలను తెచ్చే ఏఐ లేదా మరే ఇతర సాంకేతికత పనికిరానిదని ఆయన స్పష్టం చేశారు.Amazon is laying off 10000 more people after laying off 18k in NovemberThey call their HR heads as People experience head, chief people officer and fancy names.. employees r called families.Sab drama!! AI or any disruption which brings misery to ur own people is useless.…— Gurmeet Chadha (@connectgurmeet) March 17, 2025 -
మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు: ప్యూర్ ఎనర్జీ ప్రకటన
భారతదేశంలోని ఫ్యూయెల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఎనర్జీ (Pure Energy).. మార్చి 25న హైదరాబాద్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టోరేజ్ విభాగంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తుల ఆవిషకరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకురానున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలుస్తోంది.స్టోరేజ్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని ప్యూర్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ 'నిశాంత్ డోంగారి' అన్నారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో మా ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కే సరస్వత్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్. (CSI) అండ్ టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ యూజీన్ హువాంగ్ పాల్గొని.. కంపెనీ ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ ఆవిష్కరించనున్న ఉత్పత్తులకు సంబంధించిన డెమోలను చూపించడం, వాటి సామర్థ్యాలను వెల్లడించడం, పంపిణీకి సంబంధించిన విషయాలను.. మార్చి 25న వెల్లడించనున్నారు. -
మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్
ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. కొంతమంది ఉద్యోగులు కొన్ని రోజులు జాబ్ చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దీన్నే 'మైక్రో రిటైర్మెంట్' (Micro Retirement) అంటున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. కొంత ఓపిక ఉన్నవాళ్లయితే.. ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. మరికొందరు.. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ పార్ట్ టైమ్ ఉద్యోగమైనా చేస్తుంటారు. అయితే ఈ విధానానికి జెన్ జెడ్ లేదా జనరేషన్ జెడ్ ఉద్యోగులు మంగళం పాడేస్తున్నారు.కెరీర్లో కొంత బ్రేక్ తీసుకుని.. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. ఈ విధానంలో ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఒక ఉద్యోగి చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కొంత విరామం కావాలనుకుంటే.. ఒక నెల లేదా ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. దీనిని కంపెనీలు కూడా అంగీకరిస్తాయి. కానీ ఈ మైక్రో రిటైర్మెంట్ అనేది మాత్రం భిన్నం.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్! మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగిస్తే.. మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరుగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ జెడ్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటర్మెంట్ తీసుకుంటున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి కూడా కొందరు ఈ విధానం అవలంబిస్తున్నట్లు సమాచారం. -
గ్రోక్ vs చాట్జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న సమయంలో గూగుల్, మెటా, ఓపెన్ఏఐ వంటివి సొంత చాట్బాట్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) గ్రోక్ ప్రవేశపుట్టింది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇతర ఏఐ చాట్బాట్ల కంటే భిన్నమైన సమాధానాలు ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.గ్రోక్ ఏఐ కొంత దురుసుగా ప్రవర్తించడం చేత.. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రోక్ vs చాట్జీపీటీలను పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హాస్యాస్పద చిత్రాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.చాట్జీపీటీ ప్రతి అంశానికి.. సామరస్యమైన సమాధానాలు ఇస్తుంటే, గ్రోక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు బూతులు తిడుతోంది. ఆ బూతులు కాస్త నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎక్కువమంది గ్రోక్ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/LmuyqO0gsV— Dr Gill (@ikpsgill1) March 15, 2025ChatGPT Grok pic.twitter.com/CcqPZA2PDt— rozgar_CA (@Memeswalaladka) March 15, 2025చాట్జీపీటీ (ChatGPT)చాట్జీపీటీ అనేది ఓపెన్ఏఐ రూపొందించిన.. చాట్బాట్. ఇది ప్రాంప్ట్ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, కవిత్వం రాయడం, రెజ్యూమె రూపొందించడం, కొన్ని ఆరోగ్య సలహాలను ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్దతి ప్రకారం సమాధానాలు ఇస్తూ.. ఉపయోగకరంగా ఉంది.గ్రోక్ (Grok)ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) అభివృద్ధి చేస్తున్న చాట్బాట్ 'గ్రోక్'. ఇది కూడా అంశం ఏదైనా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంది. ఎవరైనా తిడితే.. గ్రోక్ సైతం వెనకాడకుండా తిడుతుంది. దీంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్శిస్తులవుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/yVZeBCafBd— Narundar (@NarundarM) March 15, 2025Grok to Indian people pic.twitter.com/AIfrdngY2x— Sajcasm (@sajcasm_) March 15, 2025 -
ఎల్పీయూ బీటెక్ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ప్లేస్మెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)కు ఈ ఏడాది చాలా ఉత్సాహంతో మొదలైంది. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఇద్దరు ప్రతిష్ఠాత్మకంగా కోట్ల రూపాయాల వేతన మార్కును అధిగమించి ఉద్యోగాలు సాధించారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.2.5 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుని రికార్డులను బద్దలు కొట్టారు. ఈ విజయం భారతదేశంలో గ్రాడ్యుయేట్ విద్యార్థికి అత్యధిక ప్యాకేజీని సూచిస్తుంది. ఇది భారత్లోని ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీల్లో ఉన్న రికార్డులను అధిగమించింది. దాంతో టాప్ టైర్ రిక్రూట్మెంట్లో లీడర్గా ఎల్పీయూ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో రూ.1.03 కోట్లు (1,18,000 డాలర్లు) ప్యాకేజీ పొందిన ఈసీఈ ఫైనల్ ఇయర్ విద్యార్థి బేతిరెడ్డి నాగవంశీరెడ్డి మరో ఘనత సాధించారు. మొత్తంగా 1,700 మందికి పైగా ఎల్పీయూ విద్యార్థులకు టాప్ ఎంఎన్సీల నుంచి ఆఫర్లు వచ్చాయి. విదార్థులకు రూ .10 ఎల్పీఏ నుంచి రూ.2.5 కోట్ల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. వందలాది మంది ఎల్పీయూ విద్యార్థులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లోని ప్రఖ్యాత సంస్థల్లో పనిచేస్తూ రూ.కోటికి పైగా ప్యాకేజీలు పొందుతున్నారు. మరో ఎల్పీయూ గ్రాడ్యుయేట్కు ఐటీ కంపెనీలో రూ.3 కోట్ల ప్యాకేజీ లభించింది. అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసే ఎల్పీయూ సామర్థ్యం యొక్క బలం, ప్రపంచవ్యాప్త పరిధికి ఇది ఉదాహరణ. పాలో ఆల్టో నెట్వర్క్స్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల్లో ప్లేస్మెంట్లు పొందిన వివిధ బీటెక్ విద్యార్థులకు మొత్తం 7,361 ఆఫర్లు అందాయి. వీటిలో టాప్ ఎంఎన్సీలు అందించే సగటు ప్యాకేజీ ఏటా రూ.16 లక్షలుగా నమోదైంది. ఇది జాబ్ మార్కెట్లో ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ను నొక్కిచెబుతోంది.గతంలోని ప్లేస్మెంట్ సీజన్ కూడా అంతే ఆకట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు ఆకర్షణీయమైన పరిహార ప్యాకేజీలను అందిస్తున్నాయి. అత్యధిక వేతనం చెల్లించే కంపెనీల్లో పాలోఆల్టో నెట్వర్క్స్ రూ.54.75 ఎల్పీఏతో అగ్రస్థానంలో నిలవగా, న్యూటానిక్స్ రూ.53 ఎల్పీఏ, మైక్రోసాఫ్ట్ రూ.52.20 ఎల్పీఏతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 1,912 మల్టిపుల్ జాబ్ ఆఫర్లను అందిచగా, 377 మందికి మూడు ఆఫర్లు, 97 మందికి నాలుగు, 18 మందికి ఐదుగురికి, ఏడుగురు విద్యార్థులకు ఆరు జాబ్ ఆఫర్లు లభించాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో బీటెక్ విద్యార్థి ఆదిరెడ్డి వాసు అద్భుతమైన ఏడు జాబ్ ఆఫర్లను సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.పైన పేర్కొన్న కంపెనీలతో పాటు అమెజాన్ (రూ.48.64 ఎల్పీఏ), ఇన్ట్యూట్ లిమిటెడ్ (రూ.44.92 ఎల్పీఏ), సర్వీస్ నౌ (రూ.42.86 ఎల్పీఏ), సిస్కో (రూ.40.13 ఎల్పీఏ), పేపాల్ (రూ.34.4 ఎల్పీఏ), ఏపీఎన్ఏ (రూ.34 ఎల్పీఏ), కామ్వాల్ట్ (రూ.33.42 ఎల్పీఏ), స్కేలర్ (రూ.33.42 ఎల్పీఏ) వంటి టాప్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, అధునాతన సాంకేతితక నిపుణులకు ప్రాధాన్యమిచ్చారు.యాక్సెంచర్, క్యాప్ జెమినీ, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు అతిపెద్ద రిక్రూటర్లలో ఉండటంతో ఎల్పీయూ గ్రాడ్యుయేట్ల సాంకేతిక పరంగా అధిక డిమాండ్ ఏర్పడింది. క్యాప్ జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ పోస్టులకు 736 మంది విద్యార్థులను, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు మైండ్ ట్రీ 467 మంది విద్యార్థులను నియమించుకుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 418 మంది విద్యార్థులను జెన్సీ ఉద్యోగాలకు రిక్రూట్ చేసుకుంది. యాక్సెంచర్ (279 నియామకాలు), టీసీఎస్ (260 నియామకాలు), కేపీఐటీ టెక్నాలజీస్ (229 నియామకాలు), డీఎక్స్సీ టెక్నాలజీ (203 నియామకాలు), ఎంఫసిస్ (94 నియామకాలు)తోపాటు తదితర కంపెనీలు ఎల్పీయూ విదార్థులకు 279 కొలువులు అందించాయి.రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధిక ప్లేస్మెంట్ దక్కింది. పాలోఆల్టో నెట్వర్క్స్, సిలికాన్ ల్యాబ్స్, ట్రైడెంట్ గ్రూప్, న్యూటానిక్స్, ఆటోడెస్క్, అమెజాన్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఈ విభాగాల నుండి భారీగా నియామకాలు చేస్తున్నాయి.పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ మాట్లాడుతూ..‘వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడానికి ఎల్పీయూ కట్టుబడి ఉంది. యూనివర్సిటీ ఆకట్టుకునే ప్లేస్మెంట్ విజయాలు దీన్ని ప్రతిబింబిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధిస్తున్నారు. స్థిరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఎల్పీయూ విద్యాభ్యాసం వాస్తవ-ప్రపంచ పరిశ్రమ విధానాలతో మిళితం చేయడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. వృత్తి విజయాలకు విద్యార్థులను సిద్ధం చేయడమే కాకుండా పరిశ్రమకు విలువను జోడించేందుకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను అందించేలా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో వచ్చే రివల్యూషన్ విద్యార్థుల భవిష్యత్తును రూపొందిస్తోంది. వారు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో అగ్రగామిగా నిలిచి మెరుగైన ప్లేస్మెంట్లు సాధించేందుకు ఎల్పీయూ అవకాశాలను సృష్టిస్తోంది’ అని తెలిపారు.2025 బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ దగ్గరపడింది. ఎల్పీయూలో అడ్మిషన్లకు పోటీ ఎక్కువ. యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అలాగే ‘ఎల్పీయూ నెస్ట్ 2025’, ఇంటర్వ్యూలలోనూ పాసైన వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోకి ప్రవేశం లభిస్తుంది. పరీక్ష, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తిగల విద్యార్థులు https://bit.ly/43340ai ను సందర్శించగలరు. -
మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.ఇదీ చదవండి: భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందనకొత్తగా 100 స్క్రీన్లు..పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది. -
'అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో నకిలీ ఉత్పత్తులు'
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిడ్డంగులలో.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విస్తృతంగా సోదాలు నిర్వహించింది. నిబంధనలను అనుగుణంగా లేని ఉత్పత్తుల పంపిణీని అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.బీఐఎస్ లక్నో, గురుగ్రామ్లోని అమెజాన్ గిడ్డంగులపై దాడి జరిపి.. అక్కడ నిబంధనలను అనుగుణంగా లేని బొమ్మలు, హ్యాండ్ బ్లెండర్లు, అల్యూమినియం ఫాయిల్స్, మెటాలిక్ వాటర్ బాటిళ్లు, పీవీసీ కేబుల్స్, ఫుడ్ మిక్సర్లు, స్పీకర్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది. గురుగ్రామ్లోని ఇన్స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్కార్ట్ గిడ్డంగిలో వందలాది ధృవీకరించని స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లు, బొమ్మలు, స్పీకర్లు ఉన్నట్లు గుర్తించింది.ఈ నాన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవిగా బీఐఎస్ గుర్తించింది. ఈ కారణంగానే ఢిల్లీలోని వారి రెండు సౌకర్యాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్లు బయటపడ్డాయి. వీటన్నింటికీ.. బీఐఎస్ సర్టిఫికేషన్ లేదు.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులలో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్ఫ్లై వంటి బ్రాండ్స్ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రమే కాకుండా.. మీషో, మింత్రా, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా నాన్-సర్టిఫైడ్ ఉత్పత్తులు ఉన్నట్లు బీఐఎస్ గుర్తించింది. -
భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.సర్టిఫికేషన్ కోసం దరఖాస్తుటెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది. -
అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్..
ప్రతి తల్లీ తన పిల్లల విజయాన్నే కాంక్షిస్తుంది. వారి విజయానికి మించిన గొప్ప బహుమతి మరేది ఉండదామెకు. కానీ రేవతి కామత్కు ఆమె కుమారులు జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్లు అమితమైన ఆనందాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.ఖరీదైన సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును గిఫ్ట్ ఇచ్చి తల్లికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. సంప్రదాయ స్పర్శను జోడించి ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేశారు. గర్వంతో ఉప్పొంగిన తల్లి రేవతి కామత్ తన ఆనందాన్ని ఫేస్బుక్లో పంచుకున్నారు. "నా కొడుకులు ఈరోజు నాకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. తలపాగ, శాలువాతో ఇలా.. కారు తాళాలు అందుకున్నాను" అంటూ ఫొటోలను షేర్ చేశారు.పేటా (సంప్రదాయ తలపాగా), షాల్ (ఉత్సవ శాలువా)తో సత్కరిస్తుండగా ఆమె కారు తాళాలు అందుకున్న క్షణాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఫోటోలలో కన్పిస్తున్న లగ్జరీ వాహనం మెర్సిడెస్ జీఎల్ఎస్. దీని ధర రూ .1.5 కోట్లకు పైగా ఉంటుంది. జీఎల్ఎస్ కారులో విశాలమైన అల్ట్రా-లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్, శక్తివంతమైన ఇంజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.వ్యాపార చతురతకు, దాతృత్వానికి పేరుగాంచిన నిఖిల్ కామత్, అలాగే ఆయన సోదరుడు జెరోధా సీఈఓ నితిన్ కామత్లు తమకు విలువలు, నైతికతను తీర్చిదిద్దిన ఘనత తమ తల్లిదేనని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఇదిలా ఉండగా నితిన్ కామత్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈఓవై) 2024 అవార్డును అందుకున్నారు. ఆయన వినూత్న, తక్కువ-మార్జిన్, అధిక-వాల్యూమ్ బ్రోకరేజీ మోడల్ భారతదేశ స్టాక్ ట్రేడింగ్ పరిశ్రమను మార్చివేసింది. స్వయంకృషితో జెరోధాను బాహ్య నిధులు లేకుండానే బిలియన్ డాలర్ల సంస్థగా ఆయన నిర్మించారు. -
ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్నగర్లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Deliciae by Bunty Mahajan (@delcakes.in) -
ఐపీఎల్కు ముందే అన్లిమిటెడ్ ఆఫర్: జియో యూజర్లకు పండగే!
దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉప్పొంగుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జియో (Jio) తన కస్టమర్ల కోసం స్పెషల్ అన్లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 90 రోజులపాటు జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కోసం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలు జియోహాట్స్టార్ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 17 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. మొబైల్, టీవీలలో 4కే స్ట్రీమింగ్ సర్వీస్ కూడా పొందవచ్చు. అంతే కాకుండా 50 రోజులపాటు జియో ఫైబర్ సేవలు కూడా ఉచితంగా అందుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ వైఫై, 800 కంటే ఎక్కువ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..జియో ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్తో రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్ను ఎంచుకోవడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. -
భారత్కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్లో ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) ప్రకటించారు. దీనిని ఏప్రిల్ 17న ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO) భాగస్వామ్యంతో జరుగుతోంది. 2018 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 16,700 కోట్లు అవుతుందని అంచనా.ఇప్పటికే ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విమానాశ్రయాన్ని సందర్శించిన సందర్భంగా.. ఈరోజు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని సందర్శించాను. ప్రపంచ స్థాయి విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఇది జూన్లో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశానికి నిజమైన బహుమతి!. అని అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!రెండు రన్వేలు, నాలుగు టెర్మినల్స్తో రూపొందించబడిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఐదు దశల్లో పూర్తయిన తర్వాత ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీ తగ్గుతుంది.A glimpse into India’s aviation future! ✈️Visited the Navi Mumbai International Airport site today—a world-class airport taking shape. Set for inauguration this June, it will redefine connectivity & growth. A true gift to India!Kudos to the Adani Airports team & partners for… pic.twitter.com/2TCWcSnr6c— Gautam Adani (@gautam_adani) March 16, 2025 -
పెరగనున్న కార్ల ధరలు: ఎప్పటి నుంచి అంటే?
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.మోడల్ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
అమెరికాలో టాటా టెక్నాలజీస్ పెట్టుబడులు.. అందుకే ఆలస్యం
న్యూఢిల్లీ: టారిఫ్ విధానాలపై అస్పష్టత నెలకొనడం వల్ల అమెరికాలో పెట్టుబడుల ప్రతిపాదనలను అమలు చేయడంలో జాప్యం జరగొచ్చని టాటా టెక్నాలజీస్ సీఈవో వారెన్ హారిస్ తెలిపారు. అయితే, వచ్చే నెలా, రెణ్నెల్లలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తర అమెరికా మార్కెట్పై మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా తాము చాలా బులిష్గా ఉన్నట్లు వివరించారు.టారిఫ్లు నచ్చడం, నచ్చకపోవడాన్ని పక్కన పెడితే స్పష్టతనేది కీలకంగా ఉంటుందని హారిస్ చెప్పారు. తమ కస్టమర్లకు ఒక అవగాహన వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తమ సంస్థ స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలికినప్పటికీ, వివిధ మార్కెట్లలో పరిస్థితులు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి తదనుగుణంగా వ్యాపారాలను నిర్వహించాల్సి ఉంటుందని హారిస్ తెలిపారు.‘ఉత్తర అమెరికాకు యూరప్ చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే, భారత్కి భిన్నంగా చైనా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడాన్ని మేము అలవర్చుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. -
ఏప్రిల్ నుంచి హైదరాబాద్లో యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తైవాన్ దిగ్గజం ఫాక్స్కాన్కి చెందిన హైదరాబాద్ ప్లాంటులో ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఎగుమతుల కోసమే వీటిని తయారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ ఐఫోన్లను భారత్లో తయారు చేస్తుండగా, ఎయిర్పాడ్స్ రెండో కేటగిరీగా ఉంటుందని వివరించాయి. దాదాపు రూ. 3,500 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు 2023 ఆగస్టులో ఫాక్స్కాన్ ప్రకటించింది.భారత్పైనా ప్రతీకార టారిఫ్లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యాపిల్ ఇక్కడ ఉత్పత్తిని తగ్గించుకుని, అమెరికాలో పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో, ఎయిర్పాడ్స్ తయారీని ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకారం హియరబుల్స్, వేరబుల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు భారత్లో 20 శాతంగా ఉండగా, అమెరికాలో అసలు లేనే లేవు. అమెరికా నుంచి స్మార్ట్ఫోన్లు, హియరబుల్స్, వేరబుల్స్పై దిగుమతులపై సుంకాలను తొలగిస్తే భారత్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఈఏ పేర్కొంది. -
హోలీకి లీవ్ ఇవ్వని బాస్.. పైగా రూల్స్
భారతదేశంలో హోలీని ఎంతబాగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికి తెలుసు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు కూడా మంజూరు చేస్తాయి. అయితే ఓ కంపెనీ బాస్ మాత్రం హోలీకి ఉద్యోగులకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పాస్ చేశారు.ఒక ఉద్యోగి తన బాస్ పంపిన సందేశాన్ని రెడ్డిట్లో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయింది. లీవ్ ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా.. ఆఫీసుకు కూడా రంగులు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, కంపెనీ పేరు ఏమిటనేది వెల్లడికాలేదు.హోలీ రోజు చెప్పకుండా సెలవు తీసుకుంటే లేదా అనుమతి లేకుండా సెలవు తీసుకుంటే.. అనుమతించనని, జీతం కూడా కట్ చేస్తామని బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగులందరూ రాజీనామా చేయండి అని ఒకరు చెబితే.. కంపెనీ పేరు చెప్పి, బాస్ సిగ్గుపడేలా చేయాలసింది అని మరొకరు అన్నారు. భారత ప్రభుత్వం తన శ్రామిక శక్తిని రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఇంకొకరు అన్నారు. -
భారత్లో విలువైన టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.భారతదేశంలో కూడా బిలినీయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న.. విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ గ్రూప్ వంటివి ఉన్నాయి.లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక.. 2025లో టాప్ 10 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను వెల్లడించింది.➤టాటా గ్రూప్: 31.6 బిలియన్ డాలర్లు➤ఇన్ఫోసిస్: 16.3 బిలియన్ డాలర్లు➤హెచ్డీఎఫ్సీ గ్రూప్: 14.2 బిలియన్ డాలర్లు➤ఎల్ఐసీ: 13.3 బిలియన్ డాలర్లు➤రిలయన్స్ గ్రూప్: 9.8 బిలియన్ డాలర్లు➤ఎస్బీఐ గ్రూప్: 9.6 బిలియన్ డాలర్లు➤హెచ్సీఎల్టెక్: 8.9 బిలియన్ డాలర్లు➤ఎయిర్టెల్: 7.7 బిలియన్ డాలర్లు➤లార్సెన్ & టూబ్రో: 7.4 బిలియన్ డాలర్లు➤మహీంద్రా గ్రూప్: 7.2 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటో
సోషల్ యాక్టివిస్ట్.. ఇన్ఫ్లుయెన్సర్ 'కిరణ్ వర్మ' అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో.. కస్టమర్కు డెలివరీ చేయాల్సిన ఫుడ్ను, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తినడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఈ విషయాన్ని జొమాటో పార్ట్నర్తో మాట్లాడాలనుకున్నారు. కానీ నిజం తెలుసుకుని.. 'దీపిందర్ గోయల్'కు థాంక్స్ చెప్పారు.వర్మ తన కారును పార్కింగ్ చేస్తుండగా, జొమాటో రైడర్ ఒకరు తన బైకుపై కూర్చుని భోజనం చేస్తున్నట్లు గమనించారు. ఆ రైడర్ కస్టమర్ ఆర్డర్ తింటున్నాడని మొదట అనుమానించి, ఒక ఫోటో తీశాడు. అయితే అతని దగ్గరకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎందుకు ఇంత ఆలస్యంగా భోజనం చేస్తున్నారని అడిగినప్పుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ తీసుకున్నారని, కానీ ఎంతసేపటికీ డెలివరీ తీసుకోవడానికి ఎవరూ రాలేదని పేర్కొన్నాడు.ఎంతసేపు వెయిట్ చేసినా.. ఎవరూ రాకపోవడంతో, ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లుగా మార్క్ చేయాలని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ను కోరానని డెలివరీ బాయ్ తెలిపాడు. ఆలా చేస్తే.. జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఆర్డర్ను ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఈ ఫుడ్ నేను తింటున్నాను అని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!సాయంత్రం వరకు ఎందుకు భోజనం చేయలేదు అనే ప్రశ్నకు.. హోలీ పండుగ సందర్భంగా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ డెలివరీ చేస్తే.. ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయని డెలివరీ బాయ్ చెప్పారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఆర్డర్కు రూ. 10 నుంచి రూ. 25 వరకు లభిస్తుంది. ఇలా వారు నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు సంపాదిస్తారు.చూడగానే.. డెలివరీ చేయాల్సిన ఫుడ్ తింటున్నాడని అనుకున్నాను. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా.. ఎవరినీ నిందించడం కరెక్ట్ కాదు. ఇది వర్మ గిగ్ కార్మికుల కష్టాలను ప్రతిబింబించేలా చేసిందని కిరణ్ వర్మ అన్నారు. -
15 నిమిషాల్లో పని మనిషి..
ఆన్లైన్ డెలివరీ అన్నది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనిషి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. ఫుడ్ డెలివరీతో మొదలైన ఆన్లైన్ డెలివరీ సేవలు క్రమంగా కిరాణాతో పాటు అనేక రకాల వస్తువులు, సర్వీసులు నిమిషాల వ్యవధిలో ఇంటి ముంగిటకు చేర్చే వరకూ వచ్చేశాయి. ఈ సేవలు ఇక్కడితో ఆగేలా లేవు.తాజాగా ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ ‘ఇన్స్టా మెయిడ్స్ / ఇన్స్టా హెల్ప్’ అనే సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వరా 15 నిమిషాల పనిమనిషి మీ ఇంటి ముంగిటకు వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభంతో అర్బన్ కంపెనీ ఆన్లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.ప్రస్తుతానికి ముంబైలో ఈ సేవను ప్రవేశపెట్టామని, ఇది 'పైలట్ దశలో' ఉందని అర్బన్ కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ సేవలో భాగస్వాములకు అంటే పని మనుషులకు 'గంటకు రూ .150 నుండి 180' లభిస్తుందని, అయితే ప్రస్తుతానికి ఈ సేవను గంటకు రూ .49 లకే అందిస్తున్నట్లు వివరించింది."అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది" అని రాసుకొచ్చింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వచ్చాయి. ఆన్లైన్ సర్వీస్కి ఇది పరాకాష్ట అని పలువురు కామెంట్లు చేశారు. -
రేసింగ్కు టీవీఎస్, పెట్రోనాస్ జట్టు
చెన్నై: ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకుంటోంది. తద్వారా దేశీయంగా మోటార్ స్పోర్ట్స్ను ప్రోత్సహించడంలో పరస్పరం కట్టుబడి ఉన్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.భాగస్వామ్యంలో భాగంగా రానున్న మూడేళ్ల కాలానికి టీవీఎస్ రేసింగ్ టీమ్ టైటిల్ స్పాన్సర్గా టీవీఎస్ మోటార్, పెట్రోనాస్ లూబ్రికెంట్స్ వ్యవహరించనున్నాయి. 2022–23 సీజన్లో టీవీఎస్ రేసింగ్కు టైటిల్ స్పాన్సర్గా పెట్రోనాస్ లూ బ్రికెంట్స్ ఇండియా వ్యవహరించింది.ఇండియన్ నేషనల్ సూపర్క్రాస్ చాంపియన్షిప్, ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్షిప్, ఇండియన్ నేషనల్ మోటార్సైకిల్ రేసింగ్ చాంపియన్షిప్లలో రేసింగ్ టీమ్ పాల్గొనేందుకు మద్దతివ్వనున్నాయి. -
వ్యూయర్షిప్లో జియోహాట్స్టార్ కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్స్టార్లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్లో డిజిటల్ స్ట్రీమింగ్కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు. -
రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి?
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.భయపడాల్సిన పని లేదుఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదంఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా. -
ఫ్లైట్ మిస్ అయితే రూ.7500 పరిహారం!: ఉబర్ కీలక ప్రకటన
క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తువిమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. -
జీసీసీలు అంటే ఏమిటి? అవి ఎందుకు?
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో జీసీసీల ఏర్పాటు అధికమవుతోంది. అసలు ఈ జీసీసీలు ఏమిటనే అనుమానం కొంతమందిలో ఉంది. జీసీసీలు ఏమిటి.. ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లుగా పిలువబడే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీలు) బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో స్థాపించే ప్రత్యేక వ్యాపార యూనిట్లు. ఈ కేంద్రాలు గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంపెనీకి విలువను జోడించడానికి స్థానిక ప్రతిభను, నైపుణ్యాలను, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. జీసీసీలు ఏర్పడకముందు కూడా ఇలాంటి విధానం అమల్లో ఉండేది. గతంలో ఔట్ సోర్సింగ్ కోసం బ్యాక్ ఆఫీసులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమల్లో ఇన్నోవేషన్ హబ్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లుగా కార్యకాలాపాలు సాగించేవి. క్రమంగా అవి జీసీసీలుగా మారాయి.ఎందుకోసం అంటే..సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ) విభాగంలో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి కీలకమైన బిజినెస్ విధులను నిర్వహిస్తాయి. గ్లోబల్ క్లయింట్లకు అధిక క్వాలిటీ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ను అందిస్తాయి. కొన్ని జీసీసీలు వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో సహా స్థిర ఇంధన పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి.ఈ నగరాలు ముందంజలో..నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహాయక విధానాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాలు ముందంజలో ఉండటంతో జీసీసీలకు గ్లోబల్ హబ్గా మారుతున్నాయి. వివిధ విభాగాల్లో సృజనాత్మకతను జోడించడంలో, ప్రపంచ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో జీసీసీల సాంకేతిక అభివృద్ధి పాత్ర కీలకంగా మారుతుంది.సాప్ట్వేర్ డెవలప్మెంట్వివిధ పరిశ్రమల కోసం ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేంద్రాలు తరచుగా నిర్దిష్ట వ్యాపార అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను సృష్టించడంలో తోడ్పడుతాయి.ఏఐ, మెషిన్ లెర్నింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఆవిష్కరణల్లో జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, అటానమస్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తారు. ఉదాహరణకు, జీసీసీలు సంభాషణాత్మక ఏఐ టూల్స్, కస్టమర్ సర్వీస్ చాట్ బాట్లను అభివృద్ధి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీకొన్ని జీసీసీలు క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సంస్థల డేటాను సమర్థవంతంగా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి డేటాను, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడటంపై దృష్టి సారిస్తాయి.ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)ఈ కేంద్రాలు తరచుగా ఐఓటీ సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తాయి. డేటాను సేకరించి ప్రాసెస్ చేయగల స్మార్ట్ పరికరాలను, అందుకు అవసరమయ్యే వ్యవస్థలను సృష్టిస్తాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీల నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ సొల్యూషన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో డిజిటల్ అప్లికేషన్లను తయారు చేస్తాయి.రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్/ వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో పరిష్కారాలను అన్వేషించడానికి టెక్నాలజీ ఆధారిత జీసీసీలు ఆర్ అండ్ డీలో భారీగా పెట్టుబడులు పెడుతాయి. భవిష్యత్తు వ్యాపారాలపై ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేందుకు తోడ్పడుతాయి.ఖర్చు నిర్వహణభారతదేశంలో చౌకగా మానవవనరుల లభ్యత ఉంటుందనే అభిప్రాయలున్నాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవడానికి జీసీసీలు వీలు కల్పిస్తాయి. ఇది కంపెనీలు పరిశోధన, అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?టాలెంట్ డెవలప్మెంట్శ్రామిక శక్తిని పెంచడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను తిరిగి నేర్పించడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతాయి. ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను సరఫరా చేస్తాయి. -
ఇండస్ఇండ్లో అవకతవకలపై ఐసీఏఐ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆర్థిక అవకతవకలపై ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమీక్షించే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ చరణ్జ్యోత్ సింగ్ నందా తెలిపారు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) దీన్ని చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో రూ.2,100 కోట్ల మేర వ్యత్యాసాన్ని గుర్తించినట్లు బ్యాంక్ ఇటీవల ప్రకటించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇండస్ఇండ్ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. -
డిజిటల్ జోరు..!
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్లో దాదాపు సగభాగాన్ని డిజిటల్కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్కి కేటాయిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్లు మొదలైనవి ఎక్కువగా ఆన్లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా హవా...డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్డెస్క్ -
ఇదీ హోలీ గిఫ్ట్ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..
హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
టాటా గ్రూప్ కంపెనీకి చైర్మన్గా గణపతి సుబ్రమణ్యం
టాటా గ్రూప్నకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా గణపతి సుబ్రమణ్యం నియామకానికి టాటా కమ్యూనికేషన్స్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఎన్జీఎస్గా ప్రసిద్ధి చెందిన గణపతి సుబ్రమణ్యం 2021 డిసెంబర్లో టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్)తోపాటు భారత ఐటీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లుగా ఉన్నారు. 2024 మేలో టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు.నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 14 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా నియమించిందని టాటా కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, టెలికాం, పబ్లిక్ సర్వీసెస్లో టీసీఎస్ చేపట్టిన పలు మైలురాయి కార్యక్రమాల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేనేజ్మెంట్పై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని పేర్కొంది.ప్రస్తుతం గణపతి సుబ్రమణ్యం టాటా ఎలెక్సీ లిమిటెడ్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ లో బోర్డు చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే భారత్ 6జీ అలయన్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యుడిగా, ముంబైలోని దివ్యాంగ పిల్లల పునరావాస సొసైటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
రెండు రోజులు బ్యాంకులు బంద్..
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) తెలిపింది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్బీయూ వ్యతిరేకిస్తోంది. ఇటువంటి జోక్యం బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్బీయూలో ఉన్నాయి.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. -
ఫ్రీగా ఓయో రూమ్స్లో బస
భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్ను ప్రకటించింది. ఇండియా క్రికెట్ టీమ్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.Some wins are bigger than just a trophy. India’s ICC Champions Trophy victory isn’t just about cricket—it’s about the unshakable spirit of a billion people, the collective cheers, the nail-biting finishes, and that electrifying moment when the whole country erupts in joy.And… pic.twitter.com/M0m6KAdHds— Ritesh Agarwal (@riteshagar) March 13, 2025ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు. -
రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?
కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.ట్రాక్ రద్దీ తగ్గుదలపగటిపూట రైల్వే ట్రాక్లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.తక్కువ స్టాప్లుపగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.డ్రైవర్ విజిబిలిటీనైట్ డ్రైవింగ్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్, ట్రాక్పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపుషెడ్యుల్లో మార్పులురైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. -
జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
భారత బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.జియోస్టార్ ఇకపై ప్రీమియం కంటెంట్ను సబ్స్రిప్షన్ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్స్రైబ్లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్స్టార్ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్లు, లైవ్ స్పోర్ట్స్తో సహా విభిన్న కంటెంట్ను అందిస్తోంది.బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావంయూట్యూబ్ నుంచి కంటెంట్ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్కాస్టింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్ఫామ్లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..సవాళ్లు ఇవే..సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్స్క్రైబ్ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది. -
భారత్లో పెట్టుబడులు రెట్టింపు
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్స్టోన్ దేశీయంగా ఇన్వెస్ట్మెంట్ను రెట్టింపు చేయబోతున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం, క్రెడిట్ బిజినెస్ల్లో తాజాగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశీయంగా బ్లాక్స్టోన్ 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ బాటలో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.7 లక్షల కోట్లు)కు చేర్చనున్నట్లు బ్లాక్స్టోన్ తెలియజేసింది. కాగా.. యూఎస్ టారిఫ్లను ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని సంస్థ ఛైర్మన్ స్టీఫెన్ ఏ ష్వార్జ్మ్యాన్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణరెండు దశాబ్దాల పెట్టుబడి ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే అధిక రిటర్నులు అందుకున్నట్లు ష్వార్జ్మ్యాన్ వెల్లడించారు. దేశీయంగా పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారి ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ష్వార్జ్మ్యాన్ గతంలో ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్నకు సలహాదారుడిగా వ్యవహరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య అర్ధవంతమైన సమావేశం జరిగిందని, వాణిజ్య ఒప్పందంపై ఇరు నేతలు అంగీకారానికి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే భారత్ అధిక టారిఫ్ల అంశంపై కొన్ని సవరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, 6 శాతానికంటే తక్కువ వృద్ధి నమోదయ్యే అవకాశంలేదని అభిప్రాయ పడ్డారు. -
ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 2019 నుంచి ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దాదాపు రూ.12,985 కోట్లు సమకూర్చుకున్నాయి. ఆస్తుల జాబితాలో భూములు, భవంతులు, టవర్లు, ఫైబర్ తదితరాలున్నట్లు కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్లో వెల్లడించారు.లోక్సభకు మంత్రి నివేదించిన వివరాల ప్రకారం 2025 జనవరి వరకూ భూములు, భవంతుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.2,388 కోట్లు సమీకరించగా.. ఎంటీఎన్ఎల్ రూ.2,135 కోట్లు అందుకుంది. సమీప భవిష్యత్లో సొంత అవసరాలకు వినియోగించని, యాజమాన్య బదిలీ హక్కులు కలిగిన భూములు, భవంతులను మాత్రమే మానిటైజ్ చేసినట్లు రాతపూర్వక సమాధానంలో చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇక టవర్లు, ఫైబర్ ఆస్తుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.8,204 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.258 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు.దీర్ఘకాలిక ప్రభావాలు ఇలా..టెలికాం పీఎస్యూల ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ ఆస్తుల మానిటైజేషన్ రుణాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి కంపెనీలకు లిక్విడిటీని అందిస్తుంది. నాన్ కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా ప్రాథమిక టెలికాం సేవలపై దృష్టి పెట్టవచ్చు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో పెట్టుబడి పెట్టవచ్చు. అదనపు నిధులతో సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ ఉనికిని విస్తరించడం ద్వారా పీఎస్యూలు ప్రైవేట్ సంస్థలతో పోటీపడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోసవాళ్లు ఇలా..ఆస్తుల మానిటైజేషన్ స్వల్పకాలిక ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ చందాదారులు పెంపును, అధిక నిర్వహణ ఖర్చులు వంటి అంతర్లీన సమస్యలను ఇది పరిష్కరించకపోవచ్చు. అసెట్ మానిటైజేషన్ చేస్తున్నా ప్రైవేట్ టెలికాం దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ కారణంగా పీఎస్యూలు తమ మార్కెట్ వాటాను తిరిగి పొందడానికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ టెలికాం ఆదాయం క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. -
ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షో
ఈ ఏడాది(2025) చివరి నాటికి ఎయిరిండియా మాజీ అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వీలుగా మే నెలలో రోడ్ షోలు చేపట్టాలని యోచిస్తోంది. భారత్సహా సింగపూర్, యూరప్లో వీటిని నిర్వహించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్లోగా ఆయా కంపెనీలపట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశాయి.కేంద్రం విక్రయించాలని నిర్ణయించిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్ట్రాన్స్పోర్ట్ సర్వీసస్ (ఏఐఏటీఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏఎస్ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్సీఐ), ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్(ఏఏఎస్) ఉన్నాయి. వెరసి డిసెంబర్లోగా వాటాల విక్రయాన్ని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 2021వరకూ ప్రభుత్వ అజమాయిషిలోని ఎయిరిండియాకు అనుబంధ సంస్థలుగా వ్యవహరించాయి. కాగా.. 2022 జనవరిలో ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.స్పైస్జెట్లో 1% వాటా అమ్మకం1.15 కోట్ల షేర్లు విక్రయించిన ప్రమోటర్బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్లో ప్రమోటర్ అజయ్ సింగ్ 0.9 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.45.34 సగటు ధరలో 1.15 కోట్ల షేర్లు అమ్మివేశారు. వెరసి రూ.52.3 కోట్లు అందుకున్నారు. ఈ లావాదేవీ తదుపరి స్పైస్జెట్లో అజయ్ సింగ్ వాటా 22 శాతానికి పరిమితమైంది. మొత్తం ప్రమోటర్ గ్రూప్ వాటా 29.13 శాతం నుంచి 28.23 శాతానికి తగ్గింది. వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.ఇదీ చదవండి: జనరల్ ఇన్సూరెన్స్లోకి పతంజలి -
జనరల్ ఇన్సూరెన్స్లోకి పతంజలి
ఎఫ్ఎంసీజీ, హెర్బల్ ప్రొడక్టుల దిగ్గజం పతంజలి ఆయుర్వేద్ సాధారణ బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేయనుంది. మ్యాగ్మా కొనుగోలుకి అదార్ పూనావాలా సంస్థ సనోటీ ప్రాపర్టీస్తో షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకుంది. రైజింగ్ సన్ హోల్డింగ్స్తో ఏర్పాటైన భాగస్వామ్య కంపెనీ(జేవీ) మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్లో సనోటీకి మెజారిటీ వాటా ఉంది. వెరసి మ్యాగ్మా కొనుగోలుకి ధరమ్పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్తో కలసి పతంజలి రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. సెలికా డెవలపర్స్, జాగ్వార్ అడ్వయిజరీ సర్వీసెస్తో కలసి డీల్కు సనోటీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సాధారణ బీమా రంగంలో 70 ప్రొడక్టులతో కార్యకలాపాలు విస్తరించిన మ్యాగ్మా 2023–24లో రూ.3,295 కోట్ల స్థూల ప్రీమియం(జీడబ్ల్యూపీ)ను అందుకుంది. ఈ ఏడాది(2024–25) రూ.3,700 కోట్ల జీడబ్ల్యూపీ సాధించగలమని భావిస్తోంది.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..వస్తువులు సాధారణరంగా జరిగే ప్రమాదాలవల్ల పాడైనప్పుడు లేదా దొంగతనం అయినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ దన్నుగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్థికంగా నష్టాన్ని భర్తీ చేస్తుంది. వివిధ కంపెనీలు సాధారణ బీమాను కింది రూపాల్లో అందిస్తున్నారు.ఆరోగ్య బీమా: అనారోగ్యంతో కారణంగా వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.మోటార్ ఇన్సూరెన్స్: వాహనానికి జరిగే ప్రమాదాలు లేదా వాహనం వల్ల ఇతరులకు జరిగే ప్రమాదాలను కవర్ చేస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్: అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రమాదాల నుంచి ఇంటిని అందులోని వస్తువులకు రక్షణగా నిలుస్తుంది.ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రయాణ సమయంలో ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజీ పోయినా లేదా విదేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీ వంటి అనుకోని సంఘటనలకు కవరేజీని అందిస్తుంది.వాణిజ్య బీమా: ఆస్తి నష్టం, ఉద్యోగి సంబంధిత సమస్యలు వంటి ప్రమాదాల నుంచి వ్యాపారాలకు రక్షణ కల్పిస్తుంది. -
ఐటీ పరిశ్రమలో ఉపాధి కల్పనపై అంచనాలు ఇలా..
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) స్వల్ప వృద్ధికే పరిమితంకానున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. వెరసి ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్ల రూపేణా 4–6 శాతం బలపడనున్నట్లు తాజాగా అంచనా వేసింది. వృద్ధి పుంజుకునేటంతవరకూ ఉద్యోగ కల్పన సైతం మందగించవచ్చని తెలియజేసింది. సమీప కాలంలో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12–13 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయంలో 60 శాతం ఆక్రమిస్తున్న దిగ్గజాలను పరిగణనలోకి తీసుకుని ఇక్రా తాజా అంచనాలకు తెరతీసింది. వచ్చే ఏడాది చివర్లో వృద్ధి ఊపందుకునేటంతవరకూ ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే నమోదుకావచ్చని పేర్కొంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో డాలర్ల రూపేణా దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం 3.6 శాతం వృద్ధిని అందుకున్నట్లు ఇక్రా వెల్లడించింది. గత మూడు క్వార్టర్లుగా నెమ్మదిగా ప్రారంభమైన రికవరీ ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. 2023–24లో నమోదైన తక్కువ వృద్ధి(లోబేస్) సైతం ఇందుకు కారణమని తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని మార్కెట్లలో బీఎఫ్ఎస్ఐ, రిటైల్ రంగాలలో కస్టమర్ల విచక్షణాధారిత వ్యయాలు స్వల్పంగా పెరగడం మద్దతిచి్చనట్లు పేర్కొంది. జనరేటివ్ ఏఐపై పెట్టుబడులు కొత్త ఆర్డర్లకు దారి చూపినట్లు వివరించింది. తాజా నివేదికకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోఫోర్జ్, సైయెంట్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, బిర్లాసాఫ్ట్, మాస్టెక్, ఎంఫసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జెన్సార్ టెక్నాలజీస్ను పరిగణనలోకి తీసుకుంది. -
హల్దీరామ్స్లో టెమాసెక్కు వాటా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్లో సింగపూర్ సావరిన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం టెమాసెక్ 10 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85,000 కోట్లు)గా మదింపు చేసి వాటాను సొంతం చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ వారం మొదట్లో ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. అంటే 10 శాతం వాటాకు సుమారు బిలియన్ డాలర్లు(రూ. 8,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు అంచనా. దేశీయంగా ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ తయారీలో దిగ్గజంగా నిలుస్తున్న హల్దీరామ్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో రూ. 12,500 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీలో మరింత వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం మరో ఇన్వెస్టర్కు సైతం చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా పీఈ దిగ్గజాలు బ్లాక్స్టోన్, అల్ఫావేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం తదితరాలతో వాటా విక్రయానికి హల్దీరామ్స్ చర్చలు నిర్వహించింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే అవకాశముంది. తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికే ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
TCS చేతికి హ్యాపీ హోమ్స్.. రూ. 2,250 కోట్ల డీల్
దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్.. కమర్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది. -
ధీరూభాయ్ అంబానీ సంతకం వృథా కాబోతోంది..
చండీగఢ్కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares. The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years. I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025 -
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.టై కాన్ ముంబై 2025లో టై ముంబై మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్ మెహతాతో మాట్లాడిన మూర్తి, ప్రస్తుత సోషలిస్టు మనస్తత్వంలో దేశం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. "పెట్టుబడిదారీ విధానం అంటే సంపదను సృష్టించడానికి ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా అవకాశం కల్పించడం. ప్రజలకు ఉద్యోగాలు కల్పించి తద్వారా పేదరికాన్ని తగ్గించడం. పన్నుల ద్వారా దేశ అభివృద్ధికి దోహదం చేయడం" అని మూర్తి వివరించారు. -
ఇన్ఫీలో శ్రుతి శిబూలాల్ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం! -
ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్లీజ్ సర్వేలో వెల్లడైంది. -
హైదరాబాద్లో రూ.50 కోట్లతో ఏఐ జీసీసీ ప్రారంభం
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ ఇన్నోవేషన్లో సేవలందిస్తోన్న సినెరిక్ గ్లోబల్ హైదరాబాద్లో అత్యాధునిక ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఏఐ ఉత్పత్తులు, సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో కంపెనీ 150 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. జీసీసీ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు హాజరై మాట్లాడారు.‘ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా హైదరాబాద్కు ప్రాముఖ్యత పెరుగుతోంది. కోడింగ్ హబ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతి చేసే కేంద్రంగా నగరం పరివర్తన చెందింది. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏర్పాటు చేసి, స్థానికంగా ఏఐ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ కంపెనీలరాక ప్రోత్సాహకరంగా మారింది’ అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.సినెరిక్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుధాకర్ పెన్నం మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా సినెరిక్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిబద్ధతను తెలియజేస్తూ, హైదరాబాద్ ప్రగతిశీల ఏఐ విధానాలను నొక్కి చెప్పారు. ‘కంపెనీ 150 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి హైదరాబాద్లోని కొత్త జీసీసీ కీలకం కానుంది. స్థానికంగా బలమైన టాలెంట్ పూల్ను నిర్మిస్తూనే, తదుపరి తరం ఏఐ టెక్నాలజీలను ఆవిష్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ప్రైజెస్ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. జీసీసీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మెర్జెన్ గ్లోబల్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ.. సినెరిక్ గ్లోబల్ జీసీసీ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ అవసరాలను తీర్చే అత్యాధునిక ఆవిష్కరణలను అందించడంలో కీలకంగా మరనుందని చెప్పారు.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..గ్లోబల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మార్కెట్ 2028 నాటికి 10% సీఏజీర్తో పెరిగి 65.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, సేల్స్ఫోర్స్ ఆటోమేషన్ 2027 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత వర్క్ ఫ్లో ఆటోమేషన్ సొల్యూషన్స్కు పెరుగుతున్న డిమాండ్తో సర్వీస్ నౌ మార్కెట్ 22.5 శాతం సీఏజీఆర్తో వృద్ధి చెందుతుందని అంచనా. 2025 చివరి నాటికి 23.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి చెందుతున్న విభాగాలకు అనుగుణంగా వ్యాపారాలకు సృజనాత్మక, ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడానికి సినెరిక్ గ్లోబల్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
ఫోన్పే ఎంతమంది వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: నమోదిత వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తెలిపింది. 4 కోట్ల మందికిపైగా వర్తకులు ఫోన్పే వేదికగా కస్టమర్ల నుంచి డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.10 సంవత్సరాల ప్రయాణంలో కంపెనీ తన కార్యకలాపాలను వెల్త్ మేనేజ్మెంట్, పిన్కోడ్ ద్వారా ఈ–కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 2023లో జరిగిన చివరి నిధుల సమీకరణ రౌండ్లో కంపెనీని 12 బిలియన్ డాలర్లుగా విలువ కట్టారు.ఫోన్పే డిజిటల్ చెల్లింపుల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. 2024 మార్చి నాటికి సంస్థ ఖాతాలో నమోదిత వినియోగదారులు దాదాపు 53 కోట్ల మంది ఉన్నారు. ఫోన్పే రోజుకు 33 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. వార్షికంగా వీటి మొత్తం చెల్లింపుల విలువ రూ.150 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు
దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్షిప్, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ప్రస్తుతం భారత్లో 1,50,000 స్టార్టప్లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్కార్ట్ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలుఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభంఅత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా భారత్2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్గా భారత్ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఆసియా అంతటా విభిన్న కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకోవడానికి, బ్రాండ్లను విస్తరించడానికి సహాయపడేలా ‘ఆప్ట్రా’ అనే కొత్త కంపెనీని ప్రారంభించారు. టెక్నాలజీ, సప్లై చైన్ నైపుణ్యం, ఫ్రాంఛైజింగ్ భాగస్వామ్యాలను ఉపయోగించుకొని కొత్త మార్కెట్లోకి ప్రవేశించేటప్పుడు బ్రాండ్లు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేలా ఈ స్టార్టప్ ఆయా కంపెనీలను సర్వీసు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.వాల్మార్ట్ కొనుగోలుకు ముందు ఫ్లిప్కార్ట్ను ప్రపంచంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో ఒకటిగా మార్చడంలో బన్సాల్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక, నియంత్రణ, మౌలిక సదుపాయాల అవరోధాలతో పోరాడుతున్న బ్రాండ్లకు ప్రస్తుతం బిన్నీ ఆప్ట్రాను ఒక పరిష్కారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ సాధనాలు, మాస్టర్ ఫ్రాంచైజ్ అవకాశాలను ఏకకాలంలో అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశాన్ని సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఏఐ ఆధారిత సాంకేతికత అభివృద్ధిమొత్తం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఆప్ట్రా ఏఐ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, సమర్థవంతమైన వ్యూహాలను సమీకృతం చేయడం ద్వారా కంపెనీ అంతరాయంలేని మార్కెట్ను సృష్టించాలని భావిస్తుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలను విస్తరించడంలో బన్సాల్ అనుభవం కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి రోబోటిక్స్, ఆటోమేషన్తో కూడిన గ్లోబల్ సప్లై చైన్ను నిర్మించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.నిపుణులతో నాయకత్వ బృందంఈ-కామర్స్, రిటైల్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో ఆప్ట్రా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేసింది. నోకియా, యాపిల్ అమెజాన్ ఇండియాలో మాజీ ఎగ్జిక్యూటివ్గా పని చేసిన రంజిత్ బాబును ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ మర్కండైజ్ సీఈఓగా నియమించారు. గతంలో లెండింగ్ కార్ట్, ఫ్లిప్కార్ట్లో పనిచేసిన గిరిధర్ యాసను కంపెనీ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సప్లై చైన్ కార్యకలాపాలను ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో అనుభవం ఉన్న ఆనంద్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఎక్స్పోరియో, టెర్రాస్పాన్ బ్రాండ్లలో కీలక స్థానాల్లో పని చేసిన పునీత్ ఖన్నా, రాహుల్ గుప్తాలు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలుఆసియా మార్కెట్ కీలకంప్రపంచంలోని మొత్తం వినియోగదారుల వృద్ధిలో ఆసియా సుమారు 70% వాటాను కలిగి ఉంది. ఇది ఈ-కామర్స్, మారుతున్న వినియోగదారుల అలవాట్లకు కీలక మార్కెట్గా అవతరిస్తోందని కంపెనీ నమ్ముతుంది. భారత్, ఆగ్నేయాసియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) రీజియన్ మార్కెట్లపై ఆప్ట్రా దృష్టి సారించింది. ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, బేబీ కేర్, జనరల్ మర్కండైజ్ వంటి విభాగాల్లోకి విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజుల వ్యాలిడిటీ: BSNL కొత్త ప్లాన్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లుబాటుతో అపరిమిత కాల్లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్లకు గట్టి పోటీని ఇస్తుంది.హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 2399. ఇది 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేరుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు చేసుకోవచ్చు. కొంత తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజుల ప్లాన్ కోసం వేచి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్స్➤రూ. 1999 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1499 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా మరియు, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1198 ప్లాన్: 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3 జీబీ డేటా మరియు నెలకు 30 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.997 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 160 రోజులు. ➤రూ. 897 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 90 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 180 రోజులు. -
మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎక్కడంటే..
దేశీ అంకురాలు గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యవస్థలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. వచ్చే మూడేళ్లలో 600 బిలియన్ డాలర్ల(సుమారు రూ.52 లక్షల కోట్లు) మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్లాంటి (పీఈ/వీసీ) ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలను, ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి, కొత్త వెంచర్లు మనుగడ సాగించేలా అనువైన పరిస్థితులు కల్పించడానికి ఇవి తోడ్పడనున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధించాలంటే కావాల్సిన పెట్టుబడుల్లో (ప్రభుత్వ పెట్టుబడులు, కార్పొరేట్ డెట్, పీఈ/వీసీ ఫండింగ్ మొదలైనవి) ఇది 13 శాతమని ఐఎంటీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (సీఎఫ్ఎం) ప్రారంభ కార్యక్రమంలో నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్భారత అంకుర సంస్థల సామర్థ్యాలను ఇన్వెస్టర్లు గుర్తిస్తున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యాపారం తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు రాగలవని ఐఎంటీ ఘాజియాబాద్ డైరెక్టర్ ఆతిష్ చటోపాధ్యాయ పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటంతో సీఎఫ్ఎంలో కోర్సులకు మంచి ఆదరణ ఉంటుందని వివరించారు. పరిశ్రమ అవసరాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ రూపొందించిన సర్టిఫికేషన్లు, అనుభవపూర్వకమైన విధంగా ఉండే బోధన మొదలైన అంశాలు, విద్యార్థులు వివిధ నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడగలవని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవనీత్ మునోట్ తెలిపారు. -
నిరుద్యోగులకు తీపి కబురు..
రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నియామకాలు బలంగా ఉండనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, భారత కంపెనీలు ఈ ఏడాది క్యూ2లో అధిక నియామకాలను చేపట్టే ఉద్దేశంతో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే’లో తెలిసింది. నికర నియామక ఉద్దేశం (ఎన్ఈవో) 43 శాతానికి చేరింది. అంతర్జాతీయంగా చూస్తే వచ్చే త్రైమాసికానికి ఇది సగటున 18 శాతమే ఉంది. 42 దేశాలకు చెందిన 40,413 కంపెనీల అభిప్రాయాలను ఈ సర్వే కోసం మ్యాన్పవర్ గ్రూప్ పరిగణనలోకి తీసుకుంది. జనవరి 2 నుంచి 31 వరకు సర్వే జరిగింది.సర్వే ఫలితాలు.. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్త నియామకాలు చేపడతామని 55 శాతం కంపెనీలు తెలిపాయి. జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే నియామకాలు తగ్గుతాయని 12 శాతం కంపెనీలు చెప్పగా, తమ సిబ్బందిలో ఎలాంటి మార్పులు ఉండవని 29 శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి. మరో 4 శాతం కంపెనీలు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాయి.ఐటీ రంగంలో 55 శాతం, ఇండ్రస్టియల్ అండ్ మెటీరియల్స్ రంగంలో 48 శాతం, హెల్త్కేర్ అండ్ లైఫ్ సైన్సెస్లో 42 శాతం, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్లో 40 శాతం, కమ్యూనికేషన్ సర్వీసెస్లో 38 శాతం చొప్పున నియామకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంతో పోల్చి చూస్తే పెరగనున్నట్టు సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది.ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో 43 శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. కానీ, జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం తక్కువ. ఎనర్జీ అండ్ యుటిలిటీస్లో 32 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో 32 శాతం, చొప్పున నియామకాల ఉద్దేశ్యం కనిపించింది. క్యూ1 కంటే 6 పాయింట్లు, 8 పాయింట్ల మేర తగ్గడం గమనార్హం. దక్షిణాదిన 39 శాతం, ఉత్తరం, తూర్పు భారత్లో 47 శాతం, పశ్చిమాదిలో 47 శాతం మేర అధిక నియామకాలు వచ్చే క్వార్టర్లో చోటుచేసుకోనున్నాయి. సిబ్బందిని పెంచుకోవడానికి కార్యకలాపాల విస్తరణ ప్రధాన కారణంగా ఉంది.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్వ్యాపార సంస్థల్లో విశ్వాసం..నియామకాల ఉద్దేశ్యం జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్కు బలపడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనటంలో భారత వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీ, ఇండ్రస్టియల్, ఫైనాన్షియల్ రంగంలో బలమైన నియామకాల ధోరణి కొనసాగుతుంది. – సందీప్ గులాటి, మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ -
వచ్చే ఏడాదిలో 5.5 లక్షలకు కొలువులు
ముంబై: వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్విక్–కామర్స్ రంగం త్వరలో 5 బిలియన్ డాలర్లకు చేరనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదిలో ఈ విభాగంలో సిబ్బంది సంఖ్య 5 – 5.5 లక్షల మందికి చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం క్యూ–కామర్స్ రంగంలో 2.5 – 3 లక్షల మంది ఔట్డోర్ డెలివరీ పార్ట్నర్స్, 70,000–75,000 మంది ఉద్యోగులు (క్లరికల్, ఆఫీస్ వర్కర్లు మొదలైనవారు) ఉన్నారు. టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారతీయ క్యూ–కామర్స్ మార్కెట్ అసాధారణమైన వేగంతో వృద్ధి చెందుతోంది. వార్షికంగా 10–15 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరనుంది. వివిధ రకాల ఉత్పత్తులు, నగరాల సంఖ్యతో పాటు అమ్మకాల పరిమాణం పెరుగుతుండటంతో లాస్ట్ మైల్ డెలివరీ, డార్క్ స్టోర్స్, వేర్హౌస్ మేనేజ్మెంట్ మొదలైన విభాగాల సిబ్బందికి డిమాండ్ నెలకొంది’ అని టీమ్లీజ్ సర్విసెస్ సీనియర్ వీపీ బాలసుబ్రమణియన్ తెలిపారు. అట్రిషన్ అధికం.. అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు చాలా అధికంగా ఉన్నందున, సిబ్బందికి నైపుణ్యాలు కల్పించడంపైన, ఉద్యోగులను అట్టేపెట్టుకోవడానికి తగిన వ్యూహాలపైన, ఏఐ ఆధారిత సిబ్బంది నిర్వహణ మొదలైన వాటికి వ్యాపార సంస్థలు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. 2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 19,000 మంది పైచిలుకు టీమ్లీజ్ అసోసియేట్స్ సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం క్యూ–కామర్స్ ఉద్యోగాలకు కర్ణాటక (20 శాతం), మహారాష్ట్ర (19 శాతం), తెలంగాణ (13 శాతం) పెద్ద హబ్లుగా ఉంటున్నాయి. పరిశ్రమలో ఎంట్రీ లెవెల్ సిబ్బంది ఎక్కువగా ఉండగా, వీరిలో 71 శాతం మందికి 10 లేదా 12వ గ్రేడ్ విద్యార్హతలు ఉంటున్నాయి. తీవ్రమైన పోటీ, తరచుగా ఉద్యోగాలు మారిపోవడం వంటి అంశాల కారణంగా అట్రిషన్ రేటు అత్యధికంగా ఉండటం వల్ల పరిశ్రమ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోందని నివేదిక వివరించింది. దీన్ని అధిగమించడానికి పరిశ్రమ తమ సిబ్బందికి శిక్షణనివ్వడంపై, ఉద్యోగులు వెళ్లిపోకుండా అట్టేపెట్టుకునే వ్యూహాలపై కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. -
ఉచితాలతో పేదరికం పోదు
ముంబై: ఉచిత పథకాలతో కాకుండా ఉద్యోగాల కల్పనతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వినూత్న వ్యాపారాలను సృష్టించి, ఉద్యోగాలు కల్పిస్తే పేదరికం ఇట్టే మాయమైపోగలదని ఆయన చెప్పారు. టైకాన్ ముంబై 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మూర్తి ఈ విషయాలు తెలిపారు. ఎంట్రప్రెన్యూర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మీలో ప్రతి ఒక్కరు వందలు, వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలరనడంలో నాకెలాంటి సందేహం లేదు. పేదరిక సమస్యను ఆ విధంగానే పరిష్కరించగలం. ప్రపంచంలో ఏ దేశమూ ఉచితాలివ్వడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించిన దాఖలాల్లేవు’ అని తెలిపారు. కొన్ని ఉచితాలు ఇచ్చినా వాటికి బదులుగా నిర్దిష్ట ప్రయోజనాలను రాబట్టే విధంగా అవి ఉండాలని పేర్కొన్నారు. ఉదాహరణకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తే, ఓ ఆరు నెలలు పోయాక ఆ ఇళ్లలోని పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటున్నారా, పిల్లలపై తల్లిదండ్రుల ఆసక్తి మరింత పెరిగిందాలాంటి అంశాలపై ప్రభుత్వం ఓ సర్వేలాంటిది చేయడం ద్వారా సదరు పథకం ప్రయోజనాలను మదింపు చేయొచ్చని మూర్తి చెప్పారు. మరోవైపు, రాజకీయాలు లేదా గవర్నెన్స్ గురించి తనకు పెద్దగా తెలియదని, కేవలం విధానాలపరంగా తీసుకోతగిన చర్యలను మాత్రమే సూచించానని ఆయన వివరణ ఇచ్చారు. -
షుగర్ పేషెంట్ల కోసం గ్లెన్మార్క్ కొత్త మెడిసిన్
ప్రముఖ ఔషధ సంస్థ గ్లెన్మార్క్ మధుమేహ రోగుల కోసం కొత్త మెడిషన్ విడుదల చేసింది. గ్లైసెమిక్ నియంత్రణ, బరువు తగ్గించే ఔషధాన్ని ప్రారంభించినట్లు గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ముంబైకి చెందిన ఈ ఔషధ సంస్థ గ్లెంపా (ఎంపాగ్లిఫ్లోజిన్ 10/25 ఎంజీ) బ్రాండ్ పేరుతో విస్తృతంగా గుర్తింపు పొందిన ఎస్జీఎల్టీ2 ఇన్హిబిటర్ ఎంపాగ్లిఫ్లోజిన్ను తన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ)'తో కలిపి విడుదల చేసింది.టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ఈ మందులను రూపొందించారు. అదే సమయంలో కార్డియోవ్యాస్కులర్ ముప్పు ఉన్న రోగులకు కూడా మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్ మెలిటస్ (టీ2డీఎం) పేషంట్లలో గ్లైసెమిక్ నియంత్రణని మెరుగుపర్చడం, బరువు తగ్గడానికి మద్దతునివ్వడం, కార్డియోవాస్కులర్-రీనల్ రిస్కులను తగ్గించడంతో పాటు ఎంపాగ్లిఫ్లోజిన్ పలు ప్రయోజనాలు చేకూరుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది.“భారత్లో కార్డియోమెటబోలిక్ సంరక్షణకు సంబంధించి వినూత్నమైన చికిత్సలను అందుబాటు స్థాయిలో ఆవిష్కరించడంలో గ్లెన్మార్క్కు ఘన చరిత్ర ఉంది. సీవీడీతో పాటు టీ2డీఎంను సమర్ధంగా ఎదుర్కొనడంలో పేషంట్లకు, హెల్త్కేర్ నిపుణులకు సాధికారత కల్పించేందుకు సమగ్రమైన, చౌకైన సొల్యూషన్ను అందించాలన్న మా నిబద్ధతకు గ్లెంపా శ్రేణి ఆవిష్కరణ నిదర్శనంగా నిలుస్తుంది” అని గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ ఇండియా ఫార్ములేషన్స్ బిజినెస్ అలోక్ మాలిక్ తెలిపారు. -
కొత్త కుబేరులు.. ఆసియా బిలియనీర్స్ లేటెస్ట్ లిస్ట్
ఆసియాలో కొత్త కుబేరులు అవతరించారు. ఫోర్బ్స్ ఏషియన్ బిలియనీర్స్ 2025 తాజా ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. 2024లో విడుదల చేసిన ర్యాంకింగ్స్తో పోలిస్తే 2025లో (మార్చి నాటికి) ఆసియా బిలియనీర్లు అపూర్వ సంపదను ఆర్జించగా, ఈ ఏడాది టాప్ 10 ఆసియా బిలియనీర్ల జాబితాలో ఇండోనేషియాకు చెందిన ప్రజోగో పంగేస్తు, భారత్కు చెందిన సావిత్రి జిందాల్ వంటి ప్రముఖులు చోటు కోల్పోయారు. 2025 ఆసియా బిలియనీర్ ర్యాంకింగ్స్లో అగ్రగామిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) నిలిచారు. ఆయన తరువాత ప్రసిద్ధ బాటిల్ వాటర్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్ యజమాని జోంగ్ షాన్షాన్ ఆసియాలో రెండవ ధనవంతుడిగా, చైనాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరరీ ఆంపరెక్స్ టెక్నాలజీని (సీఏటీఎల్) నడిపించే రాబిన్ జెంగ్, చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ 2025 ఆసియా రిచెస్ట్ లిస్ట్లో కొత్తగా చేరారు.యునిక్లో, థియరీ, జె బ్రాండ్ వంటి పోర్ట్ఫోలియో బ్రాండ్లతో 25 దేశాలలో 2,400 పైగా స్టోర్లతో బలమైన ఉనికిని కలిగి ఉన్న ప్రముఖ జపనీస్ రిటైల్ కంపెనీ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తడాషి యానాయ్ ఒక్కరే జపాన్ నుండి జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక బిలియనీర్.ఆసియాలో టాప్ 10 ధనవంతులు (2025 మార్చి నాటికి )1 ముఖేష్ అంబానీ - 86.9 బి.డాలర్లు - భారత్2 జోంగ్ షాన్షాన్ - 56.0 బి.డాలర్లు - చైనా3 గౌతమ్ అదానీ 54.7 బి.డాలర్లు - భారత్4 మా హుటెంగ్ 53.3బి.డాలర్లు - చైనా5 జాంగ్ యిమింగ్ 45.6 బి.డాలర్లు - చైనా 6 తడాషి యానై & ఫ్యామిలీ 45.1 బి.డాలర్లు - జపాన్ 7 లీ జున్ 42.6 బి.డాలర్లు - చైనా 8 కొలిన్ హువాంగ్ 40.0 బి.డాలర్లు - చైనా 9 లీ కా-షింగ్ 38.3 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ 10 రాబిన్ జెంగ్ 37.6 బి.డాలర్లు - హాంగ్ కాంగ్ -
‘మహీంద్రా’ ఇండియన్ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులకు 20 ఏళ్లు
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (MASL) భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2005లో మహీంద్రా తొలిసారి ద్రాక్ష పండ్ల షిప్మెంట్ను యూరప్కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది.సబోరో, ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. దాంతో ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను మూడు రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందిస్తోంది. సంస్థకు నాసిక్లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా నాసిక్, బారామతి, సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత‘గత 20 ఏళ్లలో ద్రాక్ష వ్యాపారంలో సాధించిన వృద్ధి ఎంఏఎస్ఎల్కు గర్వకారణం. వ్యవసాయ వేల్యూ చెయిన్లో భాగంగా ద్రాక్ష సాగులో పరివర్తన తేవడంపై నిబద్ధతతో పని చేస్తున్నాం. మా కృషి ఫలితంగా ఇతర దేశాలకు భారతీయ టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. అలాగే ప్రాంతీయంగా వందల కొద్దీ రైతుల జీవితాలపై సానుకూలంగా ప్రభావం చూపగలిగాం’ అని ఎంఏఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో రమేష్ రామచంద్రన్ తెలిపారు. 6.5 ఎకరాల్లో, 75,000 చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన మహీంద్రా గ్రేప్ ప్యాక్ హౌస్లో నిత్యం 80 మెట్రిక్ టన్నుల ద్రాక్షలు ప్యాక్ చేస్తారు. ఇందులో 12 ప్రీకూలింగ్ చాంబర్లు, 170 ఎంటీ సామర్థ్యంతో రెండు కోల్డ్ స్టోరేజీ ఫెసిలిటీలు ఉన్నాయి. ఒక్కో షిఫ్టులో 500 మంది పైచిలుకు ఉద్యోగులు ఉంటారు. సుస్థిర సాగు విధానాలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నాసిక్లో ఎంఏఎస్ఎల్కు 15 ఎకరాల్లో డెమో ఫార్మ్ ఉంది. -
ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టం
ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్ ధర వరుసగా రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతోంది. దాంతో కంపెనీ షేర్ హోల్డర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందులో మేజర్ వాటాదారులుగా ఉన్న కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులకు గణనీయంగా నష్టాలు నమోదయ్యాయి. బుధవారం ఇన్ఫోసిస్ 5.49 శాతం క్షీణించి 1,569.35 వద్ద కనిష్టాన్ని తాకింది. 2024 డిసెంబర్లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,006.80తో పోలిస్తే ఈ షేరు దాదాపు 22 శాతం క్షీణించింది. దాంతో మూర్తి కుబుంబానికి ఏకంగా రెండు రోజుల్లో రూ.6,875 కోట్లు నష్టం వాటిల్లింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్ స్టాక్ను డౌన్గ్రేడ్ చేయడంతో తాజా పతనం సంభవించిందని చెబుతున్నారు. కేవలం ఐటీ స్టాక్లే కాకుండా దాదాపు చాలా స్టాక్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!ఎవరి వాటా ఎంత..కార్పొరేట్ డేటాబేస్ ఏసీఈక్విటీతో సేకరించిన డేటా ప్రకారం ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇన్ఫోసిస్లో రూ.26,287.19 కోట్ల విలువైన 4.02 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2024 డిసెంబర్ 13న రూ.33,162.89 కోట్లతో పోలిస్తే ఇది ఇటీవల రూ.6,875.70 కోట్లు తగ్గింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ మూర్తి ఇన్ఫోసిస్లో 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన భార్య సుధా మూర్తి డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 0.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్గా పేరున్న ఇన్ఫోసిస్లో వారి కుమారుడు రోహన్ మూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భార్య, నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తికి వరుసగా 1.62 శాతం, 1.04 శాతం వాటాలు ఉన్నాయి. మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్లో స్వల్పంగా 0.04 శాతం వాటా ఉంది. -
ఎదిగే కంపెనీల ఫండింగ్కు కేంద్రంగా భారత్
వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థల పెట్టుబడులకు భారత్ ప్రముఖ కేంద్రంగా అవతరిస్తోంది. 2024లో వీసీ పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోల్చి చూసినప్పుడు 43 శాతం పెరిగి 13.7 బిలియన్ డాలర్లకు (రూ.1.19 లక్షల కోట్లు) వృద్ధి చెందాయి. మొత్తం 1,270 లావాదేవీలు చోటుచేసుకున్నాయి. 45 శాతం పెరుగుదల నమోదైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వీసీ పెట్టుబడులు, గ్రోత్ ఫండింగ్కు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉన్నట్టు బెయిన్ అండ్ కంపెనీ, ఐవీసీఏ సంయుక్త నివేదిక వెల్లడించింది.50 మిలియన్ డాలర్ల(రూ.400 కోట్లు)లోపు విలువైన చిన్న, మధ్య స్థాయి డీల్స్ గతేడాది మొత్తం వీసీ లావాదేవీల్లో 95 శాతంగా ఉన్నాయి. గతంలో కంటే ఇవి 1.4 రెట్లు పెరిగాయి. ఇక 50 మిలియన్ డాలర్లకుపైన విలువైన లావాదేవీలు కూడా రెట్టింపయ్యాయి. కరోనా ముందస్తు గరిష్ట స్థాయిలకు చేరాయి. 100 మిలియన్ డాలర్ల(రూ.800 కోట్లు)కు పైన విలువైన భారీ ఒప్పందాలు 1.6 రెట్లు అధికమయ్యాయి. గతేడాది మొత్తం వీసీ ఫండింగ్లో 60 శాతం మేర కన్జ్యూమర్ టెక్నాలజీ, సాస్ (జనరేటివ్ ఏఐ సహా), ఫిన్టెక్ రంగాలు ఆకర్షించాయి. అన్నింటిలోకి కన్జ్యూమర్ టెక్నాలజీ రంగం 5.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. 2023తో పోల్చితే రెట్టింపైంది. క్విక్కామర్స్, ఎడ్టెక్ హవా..‘క్విక్కామర్స్, ఎడ్టెక్, బీటుసీ కామర్స్లో వీసీ ఫండింగ్ పరంగా అధిక వృద్ధి నమోదైంది. జెప్టో 1.4 బిలియన్ డాలర్లు, మీషో 275 మిలియన్ డాలర్లు, లెన్స్కార్ట్ 200 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి’ అని ఈ నివేదిక వెల్లడించింది. సాఫ్ట్వేర్, సాస్ ఫండింగ్ 1.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏంజెల్ ట్యాక్స్ను ఎత్తివేయడం, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును (ఎల్టీసీజీ) తగ్గించడం, విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లను సులభతరం చేయడం, ఎన్సీఎల్టీ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వడం వంటివి స్టార్టప్లు, ఇన్వెస్టర్లలో సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లు ఈ నివేదిక వివరించింది.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!‘2024లో అమలు చేసిన విధానపరమైన చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. ఇది 2025కు సానుకూల వాతావరణానికి వీలు కల్పిస్తుంది. పెట్టుబడుల లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’ అని ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) పేర్కొంది. 2024లో వీసీ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ సైతం పెరగడం గమనార్హం. ఈ మొత్తం 6.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీసీ ఫండింగ్ మద్దతు పొందిన కొన్ని కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవోలు) వెళ్లినట్టు తెలిపింది. ఐపీవోలు ఏడు రెట్లు పెరిగినట్టు గుర్తు చేసింది. ప్రగతిశీల నియంత్రణలు, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ సదుపాయాల మద్దతుతో భారత వీసీ ఎకోసిస్టమ్ స్థిరమైన వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది. -
మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్ ఇండియా హబ్
న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో మంగళవారం షీట్రేడ్స్ ఇండియా హబ్ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్ కామన్వెల్త్ప్లస్ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.ఇదీ చదవండి: ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్నుఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిస్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్రోల్ చేయడంపై ఎఫ్ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్ ఇండియా హబ్ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్షాప్లు, మెంటారింగ్ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు. -
ఫ్రెంచ్ కంపెనీపై జైడస్ లైఫ్ కన్ను
న్యూఢిల్లీ: మెడ్టెక్ ఫ్రెంచ్ కంపెనీ యాంప్లిట్యూడ్ సర్జికల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నట్లు దేశీ హెల్త్కేర్ సంస్థ జైడస్ లైఫ్సైన్సెస్ పేర్కొంది. మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు కంపెనీ యాజమాన్యం పీఏఐ పార్ట్నర్స్సహా రెండు మైనారిటీ వాటాదారు సంస్థలతో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వోటింగ్ హక్కులతో 85.6% వాటా కొనుగోలుకి 25.68 కోట్ల యూరోలు (రూ.2,444 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అత్యంత నాణ్యమైన లోయర్లింబ్ ఆర్థోపెడిక్ టెక్నాలజీలలో యాంప్లిట్యూడ్కు పట్టున్నట్లు పేర్కొంది. వీటిలో సమస్యాత్మకంగా మారిన జాయింట్ల రీప్లేస్మెంట్లో విని యోగించే మెడికల్ ప్రొడక్టుల డిజైన్, డెవలప్మెంట్ తదితర కార్యకలాపాలున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ అప్డేట్.. ఆర్బీఐ ఆరు నిబంధనలునిఫ్టీ కెమికల్ ఇండెక్స్ షురూకెమికల్ రంగానికీ ఎన్ఎస్ఈ ప్రాధాన్యతన్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛ్సేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది. తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్ఛ్సేంజీ వెల్లడించింది. -
పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. -
పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
భారత్కు దాయాది దేశంగా ఉన్న పాకిస్థాన్లో బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు తాజాగా తీవ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్థాన్కు చెందిన పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 100కి పైగా ప్రయాణికులను బంధించారు. ఈ చర్యలను ప్రతిఘటించిన ఆరుగురు పాకిస్థాన్ జవాన్లను హతమార్చారు. పాకిస్తాన్ రైల్వే దేశవ్యాప్తంగా ముఖ్యమైన రవాణా సాధనంగా పనిచేస్తోంది. దీని విస్తృతమైన నెట్వర్క్ మారుమూల ప్రాంతాలను అనుసంధానించడంలో, వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, పర్యాటకానికి మద్దతుగా నిలవడంతో తోడ్పడుతుంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఎకనామీకి ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భారత్తో పోలిస్తే చాలా తక్కువ..పాకిస్థాన్లో 1861లో కరాచీ నుంచి కోత్రి మధ్య మొదటి రైల్వే లైన్ ప్రారంభమైంది. బ్రిటిష్ వలసరాజ్య కాలంలో నార్త్ వెస్ట్రన్ స్టేట్ రైల్వేగా స్థాపించిన ఈ రైల్వే 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాకిస్థాన్ రైల్వేగా మారింది. కాలక్రమేణా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాలను కలుపుతూ నెట్వర్క్ను విస్తరించింది. ప్రస్తుతం పాకిస్థాన్ రైల్వే సుమారు 7,789 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఇది భారతరైల్వే విస్తరించిన సుమారు 68,000 కిలోమీటర్ల ట్రాక్తో పోలిస్తే చాలా తక్కువ. పాక్ రైల్వే కేవలం 479 స్టేషన్లను కవర్ చేస్తుంది. ఈ నెట్వర్క్ ప్యాసింజర్, సరుకు రవాణా సేవలకు కీలకంగా మారింది.చైనా-పాక్ మధ్య ఎంఎల్-1 ప్రాజెక్ట్ఇటీవలి కాలంలో పాకిస్థాన్ రైల్వే సేవలను పెంచడానికి ఆధునీకరణ కార్యక్రమాలను ప్రారంభించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మెయిన్ లైన్ 1 (ఎంఎల్-1) వంటి ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. ఇది కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ఎంఎల్-1 అప్గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా కరాచీ నుంచి చైనాలోని పెషావర్ వరకు 1,726 కిలోమీటర్ల రైల్వే లైన్ను ఏర్పాటు చేయనున్నారు. క్రమంగా భవిష్యత్తులో ట్రాక్ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్ట్ లక్ష్యాల్లో కీలకంగా ఉన్నాయి.ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం అంటే..సరుకులు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ వాణిజ్యాన్ని పెంచుతుందని నమ్ముతున్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో, తర్వాత కాలంలో కూడా వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి ఆపరేషనల్ భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రమాదాలను తగ్గిస్తాయని అంచనా వేస్తున్నారు. రోడ్డు రవాణా కంటే రైలు మార్గాలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తూ, కర్బన ఉద్గారాలను నియంత్రిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘పెట్టుబడుల కంటే ప్రధానమైనవి ఇవే..’సవాళ్లు ఇవే..ఈ ప్రాజెక్ట్కు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పాకిస్థాన్ రైల్వే కాలం చెల్లిన మౌలిక సదుపాయాలతో నెట్టుకొస్తోంది. దేశంలో సరైన భద్రత లేకపోవడంతో తాజాగా జరిగిన ట్రెయిన్ హైజాక్ వంటి ఘటనలు పునరావృత్తమైతే ఆర్థిక వ్యవస్థపై, దేశ సమగ్రతపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే బెలుచిస్థాన్లో వేర్పాటు వాదులు పాకిస్థాన్కు పక్కలో బళ్లెంలాగా పరిణమిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తీవ్రరూపం దాల్చినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. చైనా-భారత్ మధ్య చెలరేగుతున్న భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో భారత్కు శత్రు దేశమైన పాకిస్థాన్తో చెలిమి చేస్తే భవిష్యత్తులో ఆసరాగా ఉంటుందని చైనా నమ్ముతుంది. దాంతో పాక్ ప్రాజెక్ట్ల్లో చైనా పెట్టుబడి పెడుతోంది. పాక్ పెద్దలు ఈ విషయాన్ని గ్రహించినా అక్కడి ఆర్థిక పరిమితులకు లోబడి చైనాతో చెలిమి చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.‘కేసీఆర్’ ప్రాజెక్టుభారత్లో ఐఆర్సీటీసీ మాదిరిగానే పాకిస్థాన్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అందించే ‘రబితా అప్లికేషన్’ను అక్కడి రైల్వే ప్రవేశపెట్టింది. కరాచీలోని పట్టణ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఆధునీకరించడానికి కరాచీ సర్క్యులర్ రైల్వే (కేసీఆర్) ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, నగరవాసులకు రైలు సేవలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. -
భారత్లో స్టార్లింక్.. ఎలాన్ మస్క్తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్నోట్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
15 నిమిషాల్లో అంబులెన్స్: జెంజో సంస్థ కీలక నిర్ణయం
ముంబై: ఎమర్జెన్సీ సేవల సంస్థ జెంజో దేశవ్యాప్తంగా 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్లను ప్రవేశపెట్టింది. 15 నిమిషాల్లోపే స్పందించే విధంగా ఈ నెట్వర్క్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రథమ చికిత్స, సీపీఆర్ ట్రైనింగ్ మొదలైన వాటిపై అవగాహన పెంచేందుకు జొమాటోతో పాటు ఇతరత్రా డెలివరీ ప్లాట్ఫాంలు, ఈకామర్స్ సంస్థలతో చేతులు కలిపినట్లు వివరించింది.దీని టోల్ ఫ్రీ నంబరు 1800 102 1298గా ఉంటుంది. 5 కి.మీ. పరిధికి బేసిక్ అంబులెన్స్ చార్జీలు రూ. 1,500గా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు అదనంగా రూ. 50 చెల్లించాలి. కార్డియాక్ అంబులెన్స్కైతే 5 కి.మీ.కు రూ. 2,500, ఆ తర్వాత నుంచి ప్రతి కిలోమీటరుకు రూ. 100 చార్జీలు వర్తిస్తాయి. రాబోయే రోజుల్లో డిమాండ్ను బట్టి మరిన్ని నగరాల్లో మరిన్ని అంబులెన్స్లను జోడిస్తామని సంస్థ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా మంగళ్ తెలిపారు. -
పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి మొమెంటం ఇన్వెస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్స్కి సంబంధించి నిర్దిష్ట లక్షణాల ప్రాతిపదికన పెట్టుబడులు పెట్టే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో భాగంగా ముమెంటం ఇన్వెస్టింగ్కి గణనీయంగా ప్రాచుర్యం పెరుగుతోందని టాటా అసెట్ మేనేజ్మెంట్ హెడ్ (ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్) ఆనంద్ వరదరాజన్ తెలిపారు.డిమాండ్ దృష్ట్యా ఎన్ఎస్ఈ ప్రస్తుతం దాదాపు 31 ఫ్యాక్టర్ ఆధారిత సూచీలను అందిస్తోందని వివరించారు. ధరపరంగా బలమైన ట్రెండ్ను ప్రదర్శిస్తున్న స్టాక్స్ను గుర్తించి, క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులను అందించడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులను అందుకునేందుకు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించేందుకు ఇన్వెస్టర్లు కొంత భాగాన్ని ఈ వ్యూహానికి కేటాయించే అవకాశాన్ని పరిశీలించవచ్చని వరదరాజన్ చెప్పారు. గత కొన్నాళ్లుగా మార్కెట్లు కరెక్షన్కు లోను కావడంతో పాటు ఒడిదుడుకులమయంగా ఉంటున్నప్పటికీ నిఫ్టీ మిడ్క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ను ట్రాక్ చేసే ఇండెక్స్ ఫండ్స్ మాత్రం మెరుగ్గా రాణిస్తున్నాయని పేర్కొన్నారు. తమ టాటా నిఫ్టీ మిడ్క్యాప్ 150 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్లోకి గతేడాది పెట్టుబడులు మూడింతలై సుమారు రూ. 500 కోట్లకు చేరడం వీటిపై పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనమని వరదరాజన్ తెలిపారు. -
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్లో పొందవచ్చు. -
జీవ్ మే శివ్ హై.. వంతారా కృషిపై ఆధ్యాత్మిక గురువు స్పందన
వన్యప్రాణుల సంరక్షణలో అనంత్ అంబానీ చేస్తున్న విశేష కృషిని బాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ప్రశంసించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ నేతృత్వంలోని ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారా ‘జీవ్ మే శివ్ హై’ అనే దృక్పథంతో పని చేస్తుందని చెప్పారు. ధీరేంద్ర శాస్త్రి వంతారా చేస్తున్న కృషిని కొనియాడుతూ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.వీడియోలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం..‘జీవ్ మే హి శివ్ హై.. ప్రతి జీవంలో శివుడు ఉంటాడు. ఇది అన్ని జీవుల్లో దైవిక ఉనికిని గుర్తించే తత్వం. ఎన్నో కారణాలవల్ల సంరక్షణకు నోచుకోని జంతువులకు కొత్త జీవితాన్ని అందించే కేంద్రం వంతారా ఎంతో కృషి చేస్తోంది. వంతారా అంటే ‘అటవీ నక్షత్రం’. దీని పేరుకు తగినట్లుగానే ఎన్నో వన్యప్రాణులను రక్షిస్తోంది. ఇందుకు అనంత్ అంబానీ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసణీయం. వంతారా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వణ్యప్రాణుల సంరక్షణ చర్యలకు ప్రేరణ ఇస్తోంది. మానవాళికి సమస్త జీవరాశుల సంరక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తోంది’ అని తెలిపారు. View this post on Instagram A post shared by Peepingmoon (@peepingmoonofficial)వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ కేర్ సెంటర్లో 240కి పైగా ఏనుగులను రక్షించారు. అల్లోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంక్చర్(చైనాలో మాదిరి సుదులతో గుచ్చి రోగాన్ని నయం చేయడం) వైద్యాన్ని సమ్మిళితం చేసే అధునాతన పశువైద్య చికిత్సలను వంతారాలో అందిస్తున్నారు. ఆర్థరైటిస్ చికిత్స కోసం హైడ్రోథెరపీ, గాయం నయం చేయడానికి హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్ వంటి ప్రత్యేక సదుపాయాలున్నాయి.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!‘ప్రాణి మిత్ర’గా గుర్తింపుఅనంత్ అంబానీకి జంతు సంరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఇటీవల భారతదేశపు అత్యున్నత గౌరవమైన ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ జాతీయ పురస్కారం లభించింది. ప్రాణి మిత్ర జాతీయ పురస్కారం జంతు సంరక్షణ విభాగంలో అందించే అత్యున్నత పురస్కారం. జంతువుల శ్రేయస్సుకు అవార్డు గ్రహీతలు చేసిన అసాధారణ కృషిని ఇది గుర్తిస్తుంది. గత ఐదేళ్లలో జంతు సంక్షేమానికి విశేష కృషి చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాల కృషిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది. -
హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారులకు హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హోలీ గెట్వే సేల్’ పేరుతో ఆకర్షణీయ ఆఫర్లను అందించింది. ఇది ప్రయాణికులు తక్కువ ధరలతే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.విమాన ఛార్జీలు ఇలా..ఈ హోలీ గెట్వే సేల్లో భాగంగా ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ సెలక్షన్లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?అదనంగా ఐదు శాతం తగ్గింపు..ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. సంస్థ విమానాల నెట్వర్క్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ సేల్లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది. -
ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?
ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మ్యాచ్లు, సంబంధిత కార్యక్రమాలు, జాతీయ టెలివిజన్ ప్రసారాల సమయంలో అన్ని రకాల పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించాలని కోరింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) వ్యాప్తిని నియంత్రించడంలో క్రీడల పాత్ర కీలకమని ఎత్తిచూపుతూ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐకి లేఖ రాసింది.దేశంలో ఏటా సంభవించే మరణాల్లో 70 శాతం ఎన్సీడీల వల్ల జరుగుతున్నవేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో హైలైట్ చేసింది. పొగాకు, మద్యపానం హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో సహా అనేక ఇతర రోగాలకు దోహదం చేసే ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయని తెలిపింది. పొగాకు సంబంధిత మరణాల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి దాదాపు 14 లక్షల మరణాలతో రెండో స్థానంలో ఉందని గణాంకాలను తెలియజేసింది.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..క్రికెట్కు భారత్లో ఆదరణ పెరుగుతోందని తెలియజేస్తూ, క్రీడలు ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పింది. పొగాకు లేదా ఆల్కహాల్ బ్రాండ్లను ప్రోత్సహించే ప్రకటనలను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు అనుసరించాలని ఐపీఎల్, బీసీసీఐను మంత్రిత్వ శాఖ కోరింది. అంతేకాకుండా క్రీడాకారులు, కామెంటేటర్లు, ఇతర భాగస్వాములు పొగాకు, ఆల్కహాల్తో ముడిపడి ఉన్న ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఐపీఎల్కు ఉన్న అపారమైన ప్రజాదరణ, రోల్ మోడల్స్గా క్రికెటర్ల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. -
రూ.550 కోట్లతో కూతురి పెళ్లి.. దివాలా తీసిన వ్యాపారవేత్త
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. అలాంటి ఘటన ఒకటి బడా పారిశ్రామికవేత్త విషయంలో నిజమయ్యింది. ఒకప్పుడు ఉక్కు పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ప్రమోద్ మిట్టల్కు గొప్పపేరుండేది. విలాసవంతమైన జీవనశైలికి బ్రాండ్అంబాసిడర్గా ఉండే మిట్టల్ సుమారు రూ.24,000 కోట్ల అప్పు తీర్చలేక దివాలా తేశారు. ఒక్కప్పుడు తన కూతురి పెళ్లికి ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసి వార్తల్లో నిలిచిన ఆ వ్యక్తి ఎందుకు ఇంతలా దిగజారిపోయారు. అందుకుగల కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతీయ ఉక్కు దిగ్గజం, ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు మైనింగ్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, దేశంలోని స్టీల్ పరిశ్రమలో ఎన్నో విజయాలు సాధించి ‘స్టీల్ మాగ్నెట్’గా పేరు తెచ్చుకున్న లక్ష్మీ మిట్టల్ సోదరుడే ఈ ప్రమోద్ మిట్టల్. మైనింగ్, మెటల్స్ రంగంలో లక్ష్మీ మిట్టల్ అత్యంత సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతుండగా, ప్రమోద్ అదృష్టం మరో మలుపు తిరిగింది. బిలియనీర్గా, ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్గా ప్రమోద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగించారు. 2013లో తన కుమార్తె సృష్టి మిట్టల్ పెళ్లి కోసం రూ.550 కోట్లు వెచ్చించి వార్తల్లో నిలిచారు. స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో రుచికరమైన వంటకాలు, విస్తారమైన అలంకరణలు, హైప్రొఫైల్ అతిథులు పాల్గొన్నారు.బోస్నియా కోక్ ఉత్పత్తిదారు గ్లోబల్ ఇస్పాత్ కోక్స్నా ఇండస్ట్రీస్ లుకావాక్ (జీఐకేఐఎల్) చేసిన అప్పులకు హామీదారుగా ప్రమోద్ మిట్టల్ పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఇది దాని ఆర్థిక బాధ్యతలను తీర్చడంలో విఫలమైంది. దాంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ప్రమోద్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. మోసం ఆరోపణలపై 2019లో బోస్నియాలో తనను అరెస్టు చేశారు. రూ.24,000 కోట్లకు పైగా అప్పులతో ప్రమోద్ దివాలా తీసినట్లు 2020లో లండన్ కోర్టు ప్రకటించింది. తుజ్లాలోని కంటోనల్ కోర్టు జీఐకేఐఎల్ నష్టపరిహారంగా దాదాపు 11 మిలియన్ యూరోలను డిపాజిట్ చేయాలని ప్రమోద్ను ఆదేశించింది. దాంతో అతని ఆర్థిక కష్టాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: 100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..ప్రమోద్ మిట్టల్ వ్యవహారం నేర్పే ఆర్థిక పాఠాలు..మితిమీరిన అప్పులు: మిట్టల్ ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణం మితిమీరిన అప్పులు చేయడం. తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించి రుణాలు తీసుకోవడం వ్యక్తులకు, వ్యాపారాలకు దివాలాకు దారితీస్తుంది.వివేకవంతమైన ఖర్చు: తన కుమార్తె వివాహానికి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సంపదను ప్రదర్శించడం, అదుపులేని దుబారా వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వడం కీలకం.రిస్క్ మేనేజ్మెంట్: జీఐకేఐఎల్ కేసులో మిట్టల్ చేసినట్లుగా రుణాలకు హామీదారుగా వ్యవహరించడం సరికాదు. అవతలి పక్షం అప్పులు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హామీలకు కట్టుబడి ఉండేముందు ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.ఫైనాన్షియల్ ప్లానింగ్: అపారమైన సంపద ఉన్నప్పటికీ పేలవమైన ఆర్థిక ప్రణాళిక, ఆకస్మిక నిల్వలు లేకపోవడం దివాలాకు దారితీస్తుంది. అత్యవసర నిధిని నిర్వహించేటప్పుడు ఆస్తులను వైవిధ్యపరచడం చాలా ముఖ్యం. -
100 మంది ఐటీ ఉద్యోగులు ర్యాలీ.. కారణం..
ఐటీ రంగంలో ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్(Work Life Balance) విధానానికి ఉద్యోగులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వర్క్-లైఫ్ సమతుల్యత కోసం కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద 100 మందికి పైగా ఐటీ నిపుణులు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అధిక పని గంటలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పని విధానాలపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇటీవల ర్యాలీ నిర్వహించారు.ఐటీ రంగంలో ఉత్పాదకతను పెంచేందుకు పరిష్కారంగా పనివేళలను పొడిగించాలని సూచించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సహా కొందరు పరిశ్రమ ప్రముఖులు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిరసన నిర్వహించారు. పని వేళలపై కంపెనీ ప్రముఖులు చేసిన ప్రకటనలు విస్తృత విమర్శలకు దారితీశాయి. చాలా మంది ఉద్యోగులు శారీరక, మానసిక ఆరోగ్యంపై అధిక పనివేళలు వంటి పద్ధతుల ప్రతికూల ప్రభావాన్ని ర్యాలీలో ఎత్తిచూపారు.అధిక పని ఒత్తిడితో సమస్యలుచాలా కాలంగా పని సంస్కృతితో ఐటీ రంగం విమర్శల పాలవుతోంది. ఇందులో వెంటనే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కేఐటీయూ సభ్యులు నొక్కిచెప్పారు. కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగ మాట్లాడుతూ..‘దేశంలో ఐటీ కంపెనీలు అనుసరిస్తున్న సుదీర్ఘ పని గంటల వల్ల ఉద్యోగులపై హానికరమైన ప్రభావాలు ఉంటున్నాయి. ఈ మేరకు అనేక అధ్యయనాలు, సర్వేలు వెల్లడవుతున్నాయి. ఈ రంగంలో 70 శాతానికి పైగా ఉద్యోగులు అధిక పని ఒత్తిడి కారణంగా మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రస్తుతం పని విధానంలో సంస్కరణలు తీసుకురావాలి’ అని డిమాండ్ చేశారు.రైట్ టు డిస్కనెక్ట్ విధానం..రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం, కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవలంబిస్తున్నట్లు ‘రైట్ టు డిస్కనెక్ట్’(అధికారిక పని వేళలు పూర్తయితే ఈమెయిల్స్, కాల్స్ లేదా సందేశాలు వంటి కమ్యూనికేషన్లకు స్పందిచకూడదనే నిబంధన) విధానాన్ని అమలు చేయాలని యూనియన్ డిమాండ్ చేస్తుంది. పనిగంటలను క్రమబద్ధీకరించడంలో, కార్మిక చట్టాలను పాటించేలా చూడటంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఉద్యోగులు విమర్శించారు. ఓవర్ టైమ్ అలవెన్స్లు, చట్టబద్ధమైన పనిగంటల పరిమితులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గత ఏడాది కార్మిక మంత్రికి వినతిపత్రం సమర్పించినప్పటికీ ఈ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదని యూనియన్ పేర్కొంది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారండిమాండ్లు తెలిపేందుకే ర్యాలీఉద్యోగులు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, పాలసీ విధానకర్తలకు తమ డిమాండ్లు తెలియజేయడానికి ఈ ర్యాలీ ఒక వేదికగా నిలిచిందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ ర్యాలీలోని ఒక ఐటీ ఉద్యోగి స్పందిస్తూ..‘మేము మా ఉద్యోగాలను ప్రేమిస్తాం. పరిశ్రమకు సహకారం కొనసాగించాలనుకుంటున్నాం. కానీ అదే సమయంలో మా ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టం’ అని అన్నారు. ప్రస్తుత పని విధానాలకు వ్యతిరేకంగా ఐటీ నిపుణుల్లో పెరుగుతున్న అవగాహన, వ్యతిరేకతను ఈ కార్యక్రమం హైలైట్ చేసింది. దేశంలోని అత్యంత ప్రముఖ పరిశ్రమల్లో ఐటీ ఒకటి. ఈ విభాగంలో ఉద్యోగుల్లో స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించడానికి సమష్టి కృషి అవసరం. -
ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మరో 500 నగరాల్లో సర్వీసులను విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు రైడ్ సేవల సంస్థ ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో 50 పైచిలుకు నగరాల్లో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తదుపరి తమిళనాడు, కర్ణాటకలో, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లోను విస్తరించనున్నట్లు పవన్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 33 లక్షల రైడ్లు నమోదవుతున్నాయన్నారు. ఇందులో 15 లక్షలు టూ–వీలర్ల విభాగంలో, 13 లక్షలు త్రీ–వీలర్ సెగ్మెంట్లో, 5 లక్షల రైడ్స్ కార్ల విభాగంలో ఉంటున్నాయని పవన్ చెప్పారు. గతేడాదే తాము ఫోర్ వీలర్ల విభాగంలోకి ప్రవేశించినా, గణనీయంగా వృద్ధి నమోదు చేశామని తెలిపారు. తాము కమీషన్ ప్రాతిపదికన కాకుండా ప్లాట్ఫాం యాక్సెస్ ఫీజు విధానాన్ని అమలు చేయడం వల్ల కెప్టెన్లకు (డ్రైవర్లు) ఆదాయ అవకాశాలు మరింతగా ఉంటాయని పవన్ చెప్పారు. కంపెనీ వద్ద గణనీయంగా నిధులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనేదీ లేదన్నారు. ప్రస్తానికి కార్యకలాపాల విస్తరణపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. -
గ్రాన్యూల్స్ ఇండియాకు ఎఫ్డీఏ అక్షింతలు
ముంబై: ఫార్ములేషన్స్ ప్లాంటులో నిర్వహణ లోపాలకు గాను గ్రాన్యూల్స్ ఇండియాను అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ తీవ్రంగా ఆక్షేపించింది. ఔషధాలను నిల్వ చేయడంలో, యంత్ర పరికరాల పరిశుభ్రత, నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిరూపించడంలో విఫలమైనట్లు వ్యాఖ్యానించింది. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి తయారీ ప్లాంటులో గతేడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించిన తనిఖీలకు గాను కంపెనీ సీఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటికి ఎఫ్డీఏ ఈ మేరకు హెచ్చరిక లేఖ పంపింది. ఔషధాలు కలుషితం కాకుండా నివారించే ఫిల్టర్లు ఉన్నప్పటికీ, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయని తనిఖీల్లో తేలినట్లు పేర్కొంది. తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వకు ఉపయోగించే బిల్డింగ్ల నిర్వహణ సరిగ్గా లేదని వ్యాఖ్యానించింది. ఎయిర్ ప్యూరిఫికేషన్ యూనిట్లు, డక్ట్లు, ఫ్లోర్ల్లాంటి నిర్దిష్ట ప్రదేశాల్లో పక్షుల రెట్టలు, ఈకలు కనిపించినట్లు పేర్కొంది. దిద్దుబాటు చర్యలపై సంతృప్తి కలిగేంత వరకు కంపెనీ సమర్పించే కొత్త ఔషధాల దరఖాస్తులకు అనుమతులను నిలిపివేయొచ్చని పేర్కొంది. -
దేశీ ఎయిర్లైన్స్లో అవకాశాలపై ఐబీఎస్ ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్విస్ (సాస్) సేవలు అందించే ఐబీఎస్ సాఫ్ట్వేర్ .. భారత ఎయిర్లైన్స్ రంగంలో, లాయల్టీ ప్రోగ్రామ్స్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. తాము ప్రస్తుతం భారత్లో ఎయిర్ కార్గో నిర్వహణ విభాగంలో, అలాగే ఎయిరిండియాకి స్టాఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే తమ ఉత్పత్తులు కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి కాబట్టి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధరకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో ఐటీని విలువను చేకూర్చేదిగా కాకుండా ఖర్చుగానే పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం ఆ ధోరణి క్రమంగా మారుతోందని మాథ్యూస్ చెప్పారు. ఇప్పుడు ధరే ప్రాతిపదికగా ఉంటున్నప్పటికీ ఎకానమీ పురోగమించే కొద్దీ విలువకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మిగతా మార్కెట్లలోలాగా భారత్, చైనా మార్కెట్లలో తాము అంత విజయం సాధించలేకపోయామని అంగీకరించిన మాథ్యూస్ భారత మార్కెట్కి గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు వృద్ధి బాటలో కొనసాగుతుందన్నారు. కస్టమర్లతో మెరుగైన సంబంధాలు, అత్యుత్తమ టెక్నాలజీ సిస్టంలు, ట్రావెల్ కామర్స్ మొదలైనవి పరిశ్రమలో కీలక ట్రెండ్స్గా ఉంటున్నాయన్నారు. -
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
ఎలాంటి ప్రశ్నలు లేకుండా మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్
న్యూఢిల్లీ: సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2030 నాటికి మహిళల సంఖ్య 30 శాతం సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వేదాంత తెలిపింది. మహిళా సిబ్బందిలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లో 28% మంది ఉన్నారని, ఇది దేశంలో మెటల్స్, మైనింగ్ కంపెనీల్లోనే అత్యధికమని పేర్కొంది.అర్హత కలిగిన మహిళలకు తగిన స్థానం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది. అనువైన పని గంటలు, ఎటువంటి ప్రశ్నలు వేయకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం, పిల్లల సంరక్షణ కోసం ఏడాదంతా సెలవులు, జీవిత భాగస్వామి నియామకం తదితర స్నేహపూర్వక విధానాల అమలు ద్వారా ప్రతి దశలోనూ మహిళల ప్రగతికి తోడ్పాటు అందిస్తున్నామని వివరించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్నకు చెందిన హిందుస్థాన్ జింక్ ఉమెన్ ఆఫ్ జింక్ క్యాంపేయిన్ ప్రారంభించింది. మెటల్ రంగం పట్ల మహిళల్లో మరింత ఆసక్తిని పెంచడం ఈ ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
స్పైస్జెట్కు కొత్త చిక్కులు
చవక విమానయాన సేవలు అందిస్తున్న స్పైస్జెట్కు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. విమానాల లీజు రంగంలో ఉన్న ఐర్లాండ్కు చెందిన మూడు సంస్థలు, ఒక మాజీ పైలట్ స్పైస్జెట్పై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్లు దాఖలు చేయడం ఇందుకు కారణం. స్పైస్జెట్ సుమారు రూ.110 కోట్లు బకాయి పడిందని, ఐబీసీ సెక్షన్ 9 కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఎన్జీఎఫ్ ఆల్ఫా, ఎన్జీఎఫ్ జెనెసిస్, ఎన్జీఎఫ్ చార్లీ పిటిషన్లు దాఖలు చేశాయి.ఈ వారం ప్రారంభంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా పరిష్కార చర్చలు జరుగుతున్నందున ఈ విషయాన్ని పరిష్కరించడానికి స్పైస్జెట్ కొంత సమయం కోరింది. తదుపరి విచారణ కోసం 2025 ఏప్రిల్ 7న మూడు పిటిషన్లను లిస్ట్ చేయాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. లీజుదారులు గతంలో స్పైస్జెట్కు ఐదు బోయింగ్ 737 విమానాలను లీజుకు ఇచ్చాయి.ఇంజిన్లతో సహా విమానంలోని భాగాలను దొంగిలించి ఇతర విమానాలలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఈ కంపెనీలు స్పైస్జెట్కు లీగల్ నోటీసును పంపించాయి. 19 సంవత్సరాలుగా విమానయాన రంగంలో ఉన్న స్పైస్జెట్.. ఎన్సీఎల్టీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ వద్ద విల్లిస్ లీజ్, ఎయిర్కాజిల్ ఐర్లాండ్, విల్మింగ్టన్, సెలెస్టియల్ ఏవియేషన్ వంటి రుణదాతల నుండి దివాలా పిటిషన్లను ఎదుర్కొంటోంది. -
అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.శివ్జీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్కేర్, గేమ్ రూమ్లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shivangi Gupta | Content creator 🌶️ (@shivjeee) -
'అప్పుడే అలా ప్రతిజ్ఞ చేశాను': గౌతమ్ అదానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) లింగ సమానత్వం, అన్ని రంగాలలో మహిళల సాధికారత పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తన ప్రయాణాన్ని రూపొందించిన బలమైన మహిళల గురించి మాట్లాడుతూ.. ''బనస్కాంత నుండి బోర్డ్రూమ్ల వరకు: నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన మహిళలు" అనే పేరుతో ఓ పోస్ట్ చేశారు.లింగ సమానత్వం అంటే..తన మనవరాళ్లు.. తమ కలలను సాధించడంలో మహిళలు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోని ప్రపంచాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని ఆదానీ వివరించారు. నన్ను, నా ప్రయాణాన్ని దృఢంగా రూపందించుకోవడంలో.. నా తల్లి, భార్య సహాయం చేశారని చెప్పారు. లింగ సమానత్వం అంటే.. ''కేవలం మహిళలకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, ఇది మానవ మనుగడకు ఎంతో అవసరం'' అని నొక్కి చెప్పారు.అవధులు లేని ప్రపంచాన్నిదశాబ్దం క్రితం, నా మొదటి మనవరాలి సున్నితమైన వేళ్లను నేను పట్టుకున్నప్పుడు, నేను నిశ్శబ్దంగా ఒక ప్రతిజ్ఞ చేసాను. ఆమె ఆకాంక్షలకు అవధులు లేని ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయం చేయాలని అనుకున్నాను. ఇప్పుడు అందమైన ముగ్గురు మానవరాళ్లను చూస్తుంటే.. నా వాగ్దానం మరింత గుర్తుకొస్తోందని అదానీ చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?క్యాలెండర్లో ఒక తేదీఅంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, మనం సాధించిన పురోగతిని.. ముందుకు సాగుతున్న ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది. వ్యక్తిగతంగా.. తల్లి నుంచి ప్రేరణ పొందిన చిన్న పిల్లవాడిగా, నాయకత్వంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చూస్తున్న వ్యాపారవేత్తగా, నా భార్య ప్రీతి అదానీ ఫౌండేషన్ పట్ల అచంచలమైన అంకితభావంతో ప్రేరణ పొందిన భర్తగా.. నన్ను దాదూ అని ఆప్యాయంగా పిలిచే అమ్మాయిల కోసం పరిమితులు లేని ప్రపంచం గురించి కలలు కంటున్న తాతగా నన్ను నేను చూసుకుంటున్నాను.ప్రతిభకు హద్దులు లేవుగౌతమ్ అదానీ.. తన కంపెనీ ఓడరేవులలో ఒకదానిని సందర్శించినప్పుడు తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని గమనించారు. ఇదే ఆయనలో మార్పు తీసుకురావడానికి దోహదపడింది. నాయకత్వ పాత్రల్లో మహిళలు లేకపోవడానికి కారణం.. సామర్థ్యం లేకపోవడం కాదు, పురుషాధిక్యంతో వివిధ రంగాలలో మార్గాలు లేకపోవడం అని తెలుసుకున్నారు. మహిళల ప్రతిభకు హద్దులు లేవు, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించాలి. కాబట్టి అన్ని రంగాల్లోనూ మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించాలని మహిళా దినోత్సవం సందర్భంగా అదానీ సంకల్పించారు. -
అప్పుల్లోనూ ఆమెదే పైచేయి
ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ‘క్రిఫ్ హైమార్క్’ తెలిపింది.రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. -
హైదరాబాద్లో సీఐఐ తెలంగాణ సమావేశం
భారత పరిశ్రమల సమాఖ్య (CII) తెలంగాణ, తన యాన్యువల్ సెషన్ & కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే ప్రధాన ఉద్దేశ్యంగా.. హైదరాబాద్లో నిర్వహించింది. ఈ సందర్భంగా, పరిశ్రమ నాయకులు గ్రీన్ ఛాంపియన్లకు వనమహోత్సవ్ అవార్డులను అందజేశారు. అంతే కాకుండా సీఐఐ తెలంగాణ.. సీఐఐ ఆదిలాబాద్ జిల్లా జోన్ను ప్రారంభించింది.పరిశ్రమలు 4.0 నుంచి 5.0కు సాగాలని, దీనికోసం తెలంగాణ పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడంపై సీఐఐ తెలంగాణ నివేదికను విడుదల చేసింది. అంతే కాకుండా.. 2025-26 సంవత్సరానికి సీఐఐ తెలంగాణ చైర్మన్గా ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, వైస్ చైర్మన్గా గౌతమ్ రెడ్డి మెరెడ్డి ఎన్నికయ్యారు.సీఐఐ సమావేశంలో ఈవై ఇండియా మేనేజింగ్ పార్టనర్ రోహన్ సచ్దేవ్ మాట్లాడుతూ.. జీసీసీలు ఆవిష్కరణ కేంద్రాలుగా ఆవిర్భవించాయని అన్నారు. హైదరాబాద్లో దాదాపు 7000 స్టార్టప్లు, 51 ఇంక్యుబేషన్ సెంటర్లు, దాదాపు 300 మంది పెట్టుబడిదారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రం ఆవిష్కరణ కేంద్రంగా అవతరించిందని అన్నారు. స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో.. సీఐఐ సదరన్ రీజియన్ & సైయెంట్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, చంద్ర టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్పర్సన్ డాక్టర్ ఆర్ నందిని, సీఐఐ తెలంగాణ చైర్మన్ & భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డీ ప్రసాద్, సీఐఐ తెలంగాణ మాజీ ఛైర్మన్ & ఎలికో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వనితా దట్ల మొదలైనవారు పాల్గొన్నారు. -
2030 నాటికి రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
దేశీయ కార్పొరేట్ కంపెనీల మూలధన వ్యయం పెరుగుతోంది. దాంతో 2030 నాటికి సుమారు రూ.115-125 లక్షల కోట్లు రుణాన్ని సమీకరించనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ భారీ నిధులు ఆయా కంపెనీలకు మూలధన వ్యయం (CAPEX), వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFC) ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించబోతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో భవిష్యత్తులో మౌలిక సదుపాయాల రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ పెట్టుబడుల్లో సింహభాగం అందుకే ఖర్చు చేస్తాయని భావిస్తున్నారు.రుణ కేటాయింపులు ఇలా..మూలధన వ్యయం: మొత్తం రుణంలో సుమారు రూ.45-50 లక్షల కోట్లు కాపెక్స్కు కేటాయిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేయడానికి, వివిధ పరిశ్రమల్లో కొత్త సౌకర్యాలను సిద్ధం చేయాడానికి ఈ పెట్టుబడి కీలకం.వర్కింగ్ క్యాపిటల్, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్: మిగిలిన రూ.70-75 లక్షల కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఎన్బీఎఫ్సీ ఫైనాన్సింగ్ అవసరాలను తీరుస్తాయి. కార్పొరేట్ ఎకోసిస్టమ్లో కార్యకలాపాలు సజావుగా, లిక్విడిటీ ఉండేలా ఈ ఫండ్స్ దోహదపడతాయి.మౌలిక సదుపాయాలు: కార్పొరేట్ కంపెనీ అభివృద్ధిలో భాగంగా మొత్తం పెట్టుబడుల్లో దాదాపు మూడొంతుల వాటాను మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. ఇందులోనూ ప్రధానంగా కింది విభాగాల్లో ఖర్చులు పెరగన్నాయని చెబుతున్నారు.రవాణా: కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల్లో పెట్టుబడులు పెడుతారు.ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల విస్తరణ, పవర్ గ్రిడ్ల ఆధునీకరణకు ఇన్వెస్ట్ చేస్తారు.పట్టణాభివృద్ధి: పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణం, నీటి సరఫరా, పారిశుద్ధాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతారు.ఇదీ చదవండి: 2025 ఆర్థిక సంవత్సరంలో గోధుమల దిగుమతి ఎంతంటే..సవాళ్లు, అవకాశాలురుణ ఆధారిత కార్పొరేట్ కంపెనీల విస్తరణ అపారమైన అవకాశాలను అందిస్తున్నప్పటికీ ఈ విధానంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకులు, కార్పొరేట్ బాండ్లు, బాహ్య వాణిజ్య రుణాలు(ఈసీబీ) సహా ఫైనాన్సింగ్ ఎకోసిస్టమ్ వార్షికంగా 10 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న రుణ అవసరాలను తీర్చడానికి ఈ వృద్ధి సరిపోకపోవచ్చు. ఇది రూ.10-20 లక్షల కోట్ల నిధుల అంతరానికి దారితీస్తుంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ కీలకపాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా
ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా గుజరాత్లోని ఓ చిన్న పట్టణానికి చెందిన వీడియో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మహీంద్రా & మహీంద్రా చైర్మన్ షేర్ చేసిన వీడియోలో.. గుజరాత్లోని మోర్బి, సిరామిక్ పరిశ్రమలో దాని ఆధిపత్యాన్ని వెల్లడించడం చూడవచ్చు. కేవలం 9 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న మోర్బి పట్టణం భారతదేశ సిరామిక్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి.. ప్రపంచ సిరామిక్ హబ్గా ఎలా అభివృద్ధి చెందిందో ఈ వీడియోలో చూడవచ్చు. 1930 నుంచి దాదాపు 1,000 కుటుంబాల యాజమాన్యంలో ఈ పరిశ్రమ వృద్ధి చెందింది.నాణ్యతలో ఏ మాత్రం తీసిపోకుండా.. తక్కువ ధరలోన సిరామిక్ వస్తువులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం సిరామిక్ ఉత్పత్తిలో మోర్బి గణనీయమైన వాటాను కలిగి ఉంది. మోర్బి వ్యవస్థాపకులను ప్రశంసిస్తూ.. భారతీయ వ్యాపారాలు చైనాతో పోటీ పడగలవా? బహుశా మనం విజయగాథల కోసం సరైన ప్రదేశాల కోసం వెతకడం లేదు. 'మోర్బి' ప్రభావానికి సంబంధించిన ఈ వీడియో చూసి నేను సంతోషించాను. ఇది చిన్న పట్టణమే అయినప్పటికీ.. భారతదేశ 'బాహుబలి' అని ఆనంద్ మహీంద్రా అన్నారు.మోర్బి సిరామిక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ.. మోర్బి సిరామిక్ పరిశ్రమ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్ తగ్గడంతో ఇబ్బంది పడుతోంది. గ్యాస్ వినియోగంపై పన్నులను తగ్గించాలని, వ్యాట్ నుంచి GSTకి మారాలని.. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనాల వంటివి కావాలని ప్రభుత్వాన్ని తయారీదారులు కోరుతున్నారు. ఈ పరిశ్రమ రోజుకు దాదాపు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ను వినియోగిస్తుంది. తయారీదారులు దీనికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది.ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం: కుమార్తెకు భారీ గిఫ్ట్సౌదీ అరేబియా, ఖతార్, తైవాన్ వంటి దేశాలు 50% నుంచి 106% వరకు యాంటీ డంపింగ్ సుంకాలు విధించడం వల్ల ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. అంతే కాకుండా.. ఇరాన్పై వాణిజ్య ఆంక్షలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్లకు ఎగుమతి మార్గాలను దెబ్బతీశాయి. దీని వలన తయారీదారులు ఖరీదైన ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఎంచుకోవలసి వచ్చింది. ఇన్ని సవాళ్ళను ఎదుర్కొంటూనే.. మోర్బి ప్రపంచ సిరామిక్ నాయకుడిగా భారతదేశం ఖ్యాతిని నలుదిశల వ్యాపింపజేస్తోంది.Can Indian businesses compete with China?Maybe we’re not looking in the right places for success stories.I was delighted to see this video on the ‘Morbi’ effect.Agile, small-town entrepreneurs—The ‘bahubalis’ of India.👏🏽👏🏽👏🏽 pic.twitter.com/L4PiMVzYZl— anand mahindra (@anandmahindra) March 7, 2025 -
కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం
వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్లను అమలు చేశారు.ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)టెక్ దిగ్గజం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు 'శివ్ నాడార్'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ, కెలాగ్స్ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్లో న్యూస్ ప్రొడ్యూసర్గా కెరీర్ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్సీఎల్లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం -
61 ఏళ్ల వయసులో నీతా అంబానీ ఫిటెనెస్ సీక్రెట్ ఇదే..
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ(61) ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన రోజువారీ ఫిట్నెస్ షెడ్యూల్ను పంచుకున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈమేరకు ఒక వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది.వీడియోలో నీతా అంబానీ తెలిపిన వివరాల ప్రకారం..‘రోజూ 5,000 నుంచి 7,000 అడుగులు నడుస్తాను. నేను చురుకుగా ఉండటానికి సరళమైన ప్రభావవంతమైన మార్గం ఇది. దినచర్యలో భాగంగా నిత్యం జిమ్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, ఆక్వా వ్యాయామాలు ఉంటాయి. అదనంగా డ్యాన్స్ చేస్తాను. ఇది నన్ను శారీరకంగా ఫిట్గా ఉంచడంతోపాటు మానసిక స్థితికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. ప్రతిరోజూ #StrongHERMovement(ట్విటర్-ఎక్స్లో ట్యాగ్)లో చేరి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మరింత దృఢంగా మారి ఎన్నో విజయాలు సాధించాలి’ అన్నారు.‘షుగర్-ఫ్రీ’ లైఫ్స్టైల్నీతా అంబానీ ఫిట్నెస్ జర్నీలో ఆహారం కీలక అంశమని తెలిపారు. ఆర్గానిక్, ప్రకృతి ఆధారిత ఆహార పదార్థాలపై దృష్టి సారించాలని సూచించారు. తాను ఎప్పుడూ శాకాహారం తీసుకుంటానని పేర్కొన్నారు. ఆమె షుగర్(చక్కెర ఉండే పదార్థాలు) అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. సమతుల భోజనం, ప్రోటీన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు.ఆరోగ్యానికి 30 నిమిషాలుUnstoppable at 61! This International Women’s Day, Mrs. Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, she shows us that age is just a number. Join the #StrongHERMovement… pic.twitter.com/CyhfT1zm9r— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2025మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలపాటు వారి ఆరోగ్యానికి సమయం కేటాయించాలని నీతా అంబానీ సూచించారు. ఫిట్నెస్ అంటే వయసుతో పోరాడటం కాదని, దాన్ని పాజిటివిటీతో స్వీకరించడం అని నొక్కి చెప్పారు. నీతా ఫిట్నెస్ సందేశం అన్ని వయసుల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. అతివల స్వీయ సంరక్షణ, శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుంది. ఫిట్గా, యాక్టివ్గా ఉండాలనుకునేవారికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. -
రైల్వే కీలక నిర్ణయం.. ఇక కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే..
మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ దిశగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దేశవ్యాప్తంగా 60 కీలక రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫామ్ మీదకు అనుమతించనుంది. రద్దీని నియంత్రించడానికి, సురక్షితమైన ప్రయాణ పరిస్థితులను నిర్ధారించడానికి ఈ స్టేషన్లలో శాశ్వత ప్రయాణికుల హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి.రద్దీ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకల క్రమబద్ధీకరణపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారులతో విస్తృతంగా చర్చించి రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఎంపిక చేసిన స్టేషన్లలో అమలు చేసిన విజయవంతమైన రద్దీ నియంత్రణ చర్యలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నవారు అక్కడే.. ఇందులో భాగంగా ఈ 60 స్టేషన్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను స్టేషన్ ఆవరణ వెలుపల నిర్దేశిత వెయిటింగ్ ప్రాంతాలకు పంపనున్నారు. ఇటీవలి మహాకుంభమేళా సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించడానికి ప్రయాగ్రాజ్తోపాటు సమీప తొమ్మిది స్టేషన్లలో బాహ్య వెయిటింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ రద్దీ ఉండే మరిన్ని స్టేషన్లలో శాశ్వత వెయిటింగ్ ఏరియాలను అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.‘వార్ రూమ్’ల ఏర్పాటుఇప్పటికే న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా వంటి స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్టేషన్లలో అనధికారిక ప్రవేశాన్ని నివారించడానికి నియంత్రిత యాక్సెస్ గేట్లను ఏర్పాటు చేశారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో రద్దీ మరీ ఎక్కువగా ఉన్న సమయాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చర్చించుకునేందుకు ‘వార్ రూమ్’లను సైతం ఏర్పాటు కానున్నాయి.కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి, ప్రయాణికుల భారీ రద్దీని నిర్వహించే స్టేషన్లలో వాకీ-టాకీలు, అధునాతన అనౌన్స్మెంట్ వ్యవస్థలు, మెరుగైన కాలింగ్ వ్యవస్థలతో సహా కొత్త డిజిటల్ పరికరాలు ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో సులభంగా గుర్తించేందుకు వీలుగా సిబ్బందికి రీడిజైన్ చేసిన ఐడీ కార్డులు, కొత్త యూనిఫామ్ అందించనున్నారు. అలాగే అన్ని ప్రధాన స్టేషన్లలో సీనియర్ అధికారులను స్టేషన్ డైరెక్టర్లుగా నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితోపాటు స్టేషన్ కెపాసిటీ ఆధారంగా టికెట్ల అమ్మకాలను నియంత్రించడం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించనున్నారు.